Vizianagaram
-
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
● 10న ఉపాధి హామీ సిబ్బందితో రాష్ట్రస్థాయి కార్యక్రమం ● కొనసాగుతున్న యోగా శిక్షణవిజయనగరం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి, వారి చేత యోగాసనాలను అభ్యసింపజేసే ప్రక్రియకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన వందమంది మాస్టర్ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ రెండో రోజు ఆదివారం రాజీవ్ఇండోర్ స్టేడియంలో కొనసాగింది. జిల్లా కేంద్రంలో ప్రత్యక్షంగా, హాజరుకాని వారికి ఆన్లైన్ ద్వారా శిక్షణ నిర్వహించారు. యోగా గురువులు, టీవోటీలు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొన్నారు. నాలుగు ప్రాంతాల్లో ప్రదర్శనలు జిల్లాలోని నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 30న రామనారాయణం, జూన్ 6న చింతపల్లి బీచ్ వద్ద, 12న రామతీర్థం వద్ద, 19న శ్రీ గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ వద్ద యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్కర్లతో జూన్ 10న యోగా ప్రదర్శన నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలో 10 ప్రాంతాల్లో.. జిల్లా కేంద్రం విజయనగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పది యోగా వీధులను ఎంపిక చేశారు. రెండు రోజులకు ఒకసారి పట్టణంలోని ఏదో ఒక ప్రధాన మార్గంలో ఉదయాన్నే యోగాసన ప్రదర్శన నిర్వహిస్తారు. శిక్షణ పొందినవారితో పాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్కు వచ్చి ఆసనాలను అభ్యాసం చేయవచ్చు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. -
అక్రమ రవాణాకు మార్గం!
అక్రమ రవాణాపై మరింత నిఘా..మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై మరింత నిఘా మండల బోర్డర్లో ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ రాష్ట్రాలు ఉడడం వల్ల మండలం మీదుగా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. కొట్టక్కి పోలీస్ చెక్పోస్టు, స్థానిక బైపాస్ రోడ్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశాం. ఏ విధమైన అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం. వి ప్రసాదరావు, ఎస్సై, రామభద్రపురంరామభద్రపురం: మండలకేంద్రంలోని జాతీయ రహదారి మీదుగా నిషేధిత వస్తువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా రూ.96 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లను రామభద్రపురం పంచాయతీ కార్యాయం వద్ద స్థానిక పోలీసులతో పాటు విజిలెన్స్, వాణిజ్యపనుల శాఖాధికారులు శనివారం పట్టుకున్న విషయం విదితమే. రామభద్రపురం మండల కేంద్రం అంతరరాష్ట్ర కూడలి కావడంతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్టాలకు బోర్డర్లో ఉన్నందున ఈ మండల కేంద్రం మీదుగా గంజాయి, ఖైనీ గుట్కా, నల్లమందు వంటి మాదక ద్రవ్యాలతో నిషేధిత వస్తువులు అక్రమ రవాణా సులభతరమవుతోంది. పదినెలల్లో అక్రమ రవాణా జరిగిన కొన్ని సంఘటనలు.. గతేడాది జూన్ 16వ తేదీన స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఒడిశా రాష్ట్రం కొరాపుట్ పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసి విజయవాడకు అక్రమ రవాణా చేస్తున్న కిలోన్నర గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ● గతేడాది ఆగస్టు 16వ తేదీన కొట్టక్కి చెక్ పోస్టు వద్ద అక్రమంగా ఒడిశా నుంచి తరలిస్తున్న రెండున్న కిలోల గంజాయి పట్టుకున్నారు. ● గతేడాది అక్టోబరు 7న మండలంలోని ముచ్చర్లవలస పరిధిలో గల పెట్రోల్ బంకు సమీపంలో గల రాజస్థాన్ డాబా వద్ద ఎస్సై వి. ప్రసాదరావు సిబ్బందితో కలిసి నల్లమందు పట్టుకున్నారు ● గతేడాది డిసెంబర్ 12న కొట్టక్కి చెక్ పోస్టు వద్ద ఒడిశా నుంచి సాలూరు, రామభద్రపురం మీదుగా అక్రమంగా రవాణా అవుతున్న 800 కిలోల గంజాయి పట్టుకున్నారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 10న 150 కిలోల గంజాయి కొట్టక్కి పోలీస్ చెక్పోస్టు వద్ద పట్టుబడింది. కూటమి ప్రభుత్వం వచ్చాకే అధికంగా అక్రమ రవాణా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాదక ద్రవ్యాలతో పాటు పలు నాసిక రకం వస్తువుల అక్రమ రవాణాకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రామభద్రపురం మీదుగా నిషేధిత వస్తువుల రవాణా -
హత్యా..?ఆత్మహత్యా?
● కోనాడలో అనుమానాస్పదంగా యువకుడి మృతి ● కుమారుడి మృతిపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు ● శవాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం చేసిన వైద్యులుపూసపాటిరేగ: మండలంలోని కోనాడ గ్రామంలో యువకుడి మృతిపై పలుఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు, గ్రామస్తులు ధ్రువీకరిస్తుండగా తమ కుమారుడిని హత్య చేశారంటూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి, పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికతో యువకుడిది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది తేలనుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. కోనాడ గ్రామానికి చెందిన బొడ్డు భూలోక (35), గ్రామానికి చెందిన బడి సూరిబాబుల మధ్య చిన్నపాటి విషయమై వాగ్వాదం జరిగింది. భూలోక తన కుమార్తె హాసినిని దుర్భాష లాడడంతో వరుసకు మేనమామ అయిన సూరిబాబు పిల్లలను ఎందుకు దుర్భాషలాడుతున్నావంటూ భూలోకను మందలించడంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. జరిగిన విషయాన్ని సూరిబాబు సమీపంలోని బంధువులకు చెబుతుండగా, మద్యం మత్తులో ఉన్న భూలోక వెనక నుంచి మంచం కోడుతో సూరిబాబు తలపై బలంగా మోదడంతో తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే హుటాహుటిన చికిత్స నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సూరిబాబు బంధువులు బొడ్డు అశోక్, బొడ్డు చినభూలోక, బొడ్డు అప్పలస్వామిలు కోపోద్రిక్తులై రాత్రి 10 గంటల సమయంలో భూలోక ఇంటికి వెళ్లి చేయిచేసుకున్నారు. అకారణంగా సూరిబాబును ఎందుకు కొట్టావంటూ కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన భూలోక నిమిషాల వ్యవధిలో రెండుసార్లు ఉరివేసుకోవడానికి ప్రయత్నించడంతో గ్రామస్తులు వారించి అడ్డుకున్నారు. అ తరువాత అర్ధరాత్రి 2 గంటల సయంలో భూలోక, తండ్రి అప్పన్నతో కలిసి మద్యం తాగాడు. సీతంపేటలో రంపం పనికోసం ఆదివారం తెల్లవారు జామున నూకరాజు అనే కాంట్రాక్టర్ ఇంటికి వచ్చి భూలోకను పిలుస్తుండగా తలుపులు తీయకపోవడంతో గదిలో చూడగా ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో భూలోక మృతదేహాన్ని సంప్రదాయం ప్రకారం శ్మశానంలో పూడ్చిపెట్టారు. అంత్యక్రియల అనంతరం ఇంటికి వెళ్లిన మృతుడి తండ్రి అప్పన్న తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని, హత్య చేశారని పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్లు కోనాడ శ్మశానానికి వెళ్లి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని గ్రామస్తుల సహకారంతో బయటకు తీయించి వైద్యులతో మ్మశానంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికతో బొడ్డు భూలోకది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయం తేలనుంది.అనాథలైన పిల్లలు మృతుడు భూలోక భార్య భూలోకమ్మ రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తాజాగా భూలోక మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. వారికి హాసిని, రజిని అనేకుమార్తెలు, అక్షియవర్ధన్ అనే కుమారుడు ఉన్నారు. అనుకోని ప్రమాదంలో తల్లి భూలోకమ్మ, తండ్రి భూలోకలు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. సంఘటనా స్థలానికి వచ్చిన వారంతా దేవుడా ముగ్గురు పిల్లలకు దిక్కెవరంటూ కన్నీరు పెట్టుకున్నారు. బొడ్డు భూలోక మృతిపై ఫిర్యాదు మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బురదలో కూరుకుని బాలుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని లుంబేసు పంచాయతీ మూలజమ్ము గ్రామంలో బురదలో కూరుకుపోయి ఓ బాలుడు మృతిచెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బిడ్డిక చిరంజీవి, నీరజల కుమారుడు అశోక్ (7) స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని చెరువులో ఆడుకునేందుకు శుక్రవారం వెళ్లాడు. కాసేపు చెరువులో ఉన్న నీటిలో ఆడుకున్నారు. అంతలో ఇంకొంచెం చెరువు మధ్యలోకి వెళ్లిన అశోక్ బురదలో కూరుకుపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్నేహితులు హుటాహుటిన గ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో అంతా వచ్చి చెరువులో వెదికారు. చాలా సేపటి తర్వాత బురదలో కూరుకుపోయిన అశోక్ శవమై కనిపించాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రెండు లారీలు ఢీ కొని బిహార్ వాసి మృతి
రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై రెండు లారీలు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో బిహార్ వాసి ఒకరు ఆదివారం మృతిచెందారు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్లోని పాట్నా జిల్లాకు చెందిన సైలేస్ సాహు(40) జీవనోపాధి నిమిత్తం గడిచిన మూడేళ్లుగా హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీలోని కొండకెంగువ వద్ద ఏర్పాటు చేసిన క్యాంపు–1లో పనిచేస్తున్నాడు. అయితే పనినిమిత్తం పాచిపెంట వద్ద ఏర్పాటు చేసిన క్యాంపు–2కు వెళ్లి పని ముగించుకుని తిరిగి క్యాంప్–1కు లారీలో వస్తుండగా హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీ నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆ హైవేకు సంబంధించిన మరో లారీ ఎదురుగా వస్తూ ఢీ కొంది. దీంతో సాహు ప్రయాణిస్తున్న లారీ తలుపు తెరుచుకుని కిందపడడంతో లారీ చక్రాలు, రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ మధ్య నలిగి ముద్దయ్యాడు. అదే లారీలో ఉన్న డ్రైవర్ శివ ఠాకూర్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు వీలు లేనంతగా ముద్దవడంతో బాడంగి సీహెచ్సీ వైద్యాధికారి ఆధ్వర్యంలో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.డ్రైవర్ శివ ఠాకూర్ ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుడు సాహుకు భార్య, పాప, బాబు ఉన్నారు.రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు గజపతినగరం: మండల కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో ట్రైన్లో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి జారిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. గజపతినగరం రైల్వే స్టేషన్ మీదుగా విశాఖ వెళ్తున్న పాసింజర్ ట్రైన్లో నుంచి విజయవర్మ అనే వ్యక్తి జారి పడి తీవ్రగాయాల పాలు కావడంతో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. -
గోపాలకృష్ణ మాస్టారుకు అవార్డు ఆనందదాయకం
రేగిడి: మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు పుర్లి గోపాల కృష్ణంనాయుడికి తెలుగు వెలుగు సాహితీవేదిక నంది అవార్డు రావడం ఆనందదాయకమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్లు అన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని అంబకండి గ్రామంలో గోపాలకృష్ణంనాయుడు మాస్టారును దుశ్శాలువాలు, బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్ల ఉపాధ్యాయుడు అయినప్పటికీ తెలుగుభాషపై ఉన్న మక్కువతో విద్య, సాంస్కృతిక సేవా రంగంలో విశిష్టమైన కృషిచేసి అవార్డు పొందడంతో ఈ ప్రాంతానికే మంచి పేరు వచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, ఎంపీటీసీ పుర్లి సత్యవతి, లావేటి గణపతిరావునాయుడు, లావేటి శ్రీహరిరావు, లావేటి వెంకట వేణుగోపాలనాయుడు, ఎస్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
కమ్మవీధిలో అగ్నిప్రమాదం
● రూ. 5.50 లక్షల ఆస్తినష్టం విజయనగరం క్రైమ్: నగరంలోని కమ్మవీధిలో ఆదివారం మధ్యాహ్న 1 గంట ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వీధిలోని ఒక గృహిణి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెడుతుండగా ఒక్కసారిగా అగ్గిపుల్ల పక్కకు ఒరిగి ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ అధికారులు సంతోష్, మహేష్ బృందం ఫైర్ ఇంజిన్తో కమ్మవీధిలో అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సూబట్ల సూర్యారావు ఇంట్లో ఈ ప్రమాదం సంభవించగా రూ.లక్ష నగదు, బంగారం, ఇంట్లో ఉన్న టీవీ, బీరువా దగ్ధమయ్యాయి. అలాగే ఆ ఇంటిని ఆనుకుని ఉన్న సూబట్ల రాజు, సూబట్ల లక్ష్మణరావుల ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పిడుగుపాటుకు రెండు ఆవుల మృతిబలిజిపేట: మండలంలోని పెద్దింపేటలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతిచెందాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పెద్దింపేటలో మధ్యాహ్నం వర్షం కురిసి ఆగిపోయిన తరువాత రైతులు ఆవులను మేతకు విప్పి గ్రామం శివారుకు వెళ్తున్న సమయంలో పిడుగులు పడడంతో ఆవులు మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మజ్జి కృష్ణమూర్తి, టి.సూర్యనారాయణలకు చెందిన రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. కృష్ణమూర్తి ఆవు రూ.30వేలు, సూర్యనారాయణ ఆవు రూ.40వేలు ఖరీదు ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. కుక్క కాటుతో మరో రెండు ఆవులు పాలకొండ రూరల్: మండలంలోని అట్టలి గ్రామంలో నివసిస్తున్న శిర్లి తౌడమ్మ చెందిన రెండు పాడి ఆవులు పిచ్చికుక్క కాటుకు గురై ఆదివారం మృతి చెందాయి. దీంతో బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తమ కుటుంబ పోషణలో భాగమైన ఆవులను కుక్క కరిచేయడంతో అవి మృతి చెందినట్లు బాధితురాలు భోరుమంది. ఇటీవల మండలంలోని రుద్రిపేట గ్రామంలో కుక్కకాటుకు గురై ఓ లేగ దూడ మరణించిన ఘటన మరువక ముందే మరో ఆవులు చనిపోయాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలపై దృష్టి పెట్టాలని అయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు. 31న జిల్లా స్థాయి తైక్వాండో పోటీలుబొబ్బిలి: ఈనెల 31న పట్టణంలో 18వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు బొబ్బిలి తైక్వాండో క్లబ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం దీనికి సంబంధించిన బ్యానర్ను ఆవిష్కరించారు. క్టబ్ కార్యదర్శి చెలికాని వేణుగోపాల రావు ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు జిల్లావ్యాప్తంగా 200 మంది హాజరై జూనియర్,సబ్ జూనియర్, జూనియన్ క్యాడెట్, సీనియర్ విభాగాల్లో జరిగే పోటీల్లో తలపడతారన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు వచ్చే నెల 9 నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. -
వైభవంగా ఆదిత్యహృదయ హోమం
నెల్లిమర్ల రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం, గాయత్రి రామాయణం, ఆదిత్య హృదయ హోమాలను వైభవంగా జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు నరసింహాచార్యులు, కిరణ్, వరప్రసాద్, రామగోపాల్ పాల్గొన్నారు. -
డిజిటల్ దెబ్బ..దొంగల అబ్బా..!
చీపురుపల్లి: ఎంత నైపుణ్యం కలిగిన దొంగలైనా ప్రస్తుత రోజుల్లో డిజిటలైజేషన్ ముందు తలొగ్గాల్సిందే. విరివిగా దొంగతనాలు జరుగుతు న్నప్పటికీ పోలీస్శాఖలో పెరిగిన డిజిటలైజేషన్ కారణంగా ఆ చోరీలను ఛేదించడం సునాయాసమైంది. అందులో భాగంగానే చీపురుపల్లి పట్టణంలోని మెయిన్రోడ్లో శుక్రవారం అర్థరాత్రి జరిగిన చోరీతో పాటు వృద్ధులను గాయపరిచిన దుండగులు డిజిటలైజేషన్ పుణ్యమాని అతికొద్ది గంటల్లోనే పట్టుబడ్డారు. శుక్రవారం అర్థరాత్రి పట్టణంలోని మెయిన్రోడ్లో వారణాశి సురేష్ నివాసంలో 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులను తీవ్రంగా గాయపరిచిన సంఘటన తెలిసిందే. శనివారం ఉదయానికి ఈ సంఘటన పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన డీఎస్పీ ఎస్.రాఘవులు నేతృత్వంలోని పోలీస్ అధికారులు డిజిటలైజేషన్ సహకారంతో దుండగులను పట్టుకున్నట్లు సమాచారం. చీపురుపల్లిలో చోరీకి పాల్పడిన దొంగలను తెనాలిలో పట్టుకుని జిల్లాకు తీసుకుంచ్చినట్లు తెలిసింది. డిజిటలైజేషన్దే కీలకపాత్ర దొంగలను పట్టించడంలో డిజిటలైజేషన్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చోరీ జరిగిన ఇంటికి సమీపంలోని సెల్టవర్ పరిధిలో సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలిసింది. చోరీ జరిగిన సమయంలో ఆన్లో ఉన్న ఫోన్ నంబర్లను సేకరించారు. దీంతో పాటు క్లూస్ బృందాలు సేకరించిన ఫింగర్ ప్రింట్స్తో మేచ్ అవడంతో తెనాలికి చెందిన ముఠాగా దుండగులను గుర్తించారు. వెంటనే గుంటూరు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో తెనాలి పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే చీపురుపల్లిలో చోరీకి పాల్పడిన దుండగులు విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి జన్మభూమి రైలులో తెనాలి వెళ్లినట్లు తెలిసింది. రెక్కీ చేసిన మహిళ కోసం.. ఇదిలా ఉండగా చీపురుపల్లిలో జరిగిన ఉదంతానికి ప్రధాన సూత్రధారిగా ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. చోరీ జరగడానికి మూడు రోజుల ముందే ఆ మహిళ చీపురుపల్లి చేరుకుని రెక్కీ నిర్వహించి ఇక్కడి ఇల్లు, పరిసరాల ఫొటోలు దుండగులకు పంపించినట్లు తెలిసింది. ఆ మహిళ వేసిన స్కెచ్ ప్రకారమే చోరీ అమలు చేసినట్లు సమాచారం. అయితే తెనాలిలో ఇద్దరు దుండగులు మాత్రమే పట్టుబడిన నేపథ్యంలో ఆ మహిళతో పాటు మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. సెల్టవర్ లొకేషన్, ఫింగర్ ప్రింట్స్ ద్వారా నిందితుల గుర్తింపు వైజాగ్ నుంచి జన్మభూమి రైలులో ప్రయాణించిన దుండగులు రెక్కీ నిర్వహించిన మహిళ కోసం గాలింపు తెనాలిలో ఇద్దరు దొంగలను పట్టుకున్న పోలీసులు వారితో పాటు మరికొంత మంది ఉన్నట్లు సమాచారం -
‘ఉగ్ర’ విచారణలో విస్తుపోయే నిజాలు!
● మూడో రోజూ కొనసాగిన విచారణ విజయనగరం క్రైమ్: బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం పోలీసుల కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్లను మూడో రోజు ఆదివారం కూడా విచారించారు. ఇందులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్టు భోగట్టా. కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ అధికారుల నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న విజయనగరం పోలీసులు స్థానిక పీటీసీలో మూడో రోజు కూడా విచారణ కొనసాగించారు. రెండో రోజు శనివారం రాత్రి సిరాజ్ కాస్త అస్వస్తతకు గురవడంతో సర్వజన ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రత్యేక వైద్యాధికారులను రప్పించి పీటీసీలోనే చికిత్స చేయించినట్టు సమాచారం. తొలి రెండు రోజులు కాస్త నెమ్మదిగా దర్యాప్తు సాగించిన దర్యాప్తు బృందం అధికారులు మూడో రోజు తమదైన కోణంలో విచారణ సాగించినట్టు తెలిసింది. ముఖ్యంగా గడిచిన ఆరు నెలలుగా హైదరాబాద్లోనే సమీర్తో ఉన్న విజయనగరం వాసి సిరాజ్ అక్కడే బాంబు పేలుళ్లకు పన్నాగం పన్నినట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. మానవ బాంబుగా సిద్ధమైన సిరాజ్, సమీర్లు ముస్లిమేతరులే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా పేలుళ్లకు పథక రచన చేసినట్టు తెలిసింది. వరంగల్ ఫర్హాన్, ఢిల్లీ బాదర్ నుంచి వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నట్టు సమాచారం. మూడో రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ సాగినట్టు భోగట్టా. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి వరకు కొనసాగినట్టు తెలిసింది. -
రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్గా సేతుమాధవన్
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ ఇండోర్ స్టేడి యంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 160 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నువ్వా..నేనా అనే విధంగా ఏడు రౌండ్లలో క్రీడాకారులు పోటీపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో శ్రీకాకుళంకు చెందిన ఫిడే మాష్టర్ వేలుమహంతి సేతుమాధవన్ ఆరున్నర పాయింట్లు సాధించి రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్గా నిలిచాడు. అలాగే విశాఖపట్నంకు చెందిన అభిరామ్ ఆరు పాయింట్లతో ద్వితీయ, విజయవాడకు చెందిన సీనియర్ క్రీడాకారుడు మల్లేశ్వరరావు తృతీయ స్థానంలో నిలిచారు. ఎస్.కోటకు చెందిన వినీల్కార్తీక్ నాలుగో స్థానం, విశాఖపట్నంకు చెంది న జయనాగరాజు ఐదవ స్థానంలో నిలిచారు. ఓపెన్లో పది మందికి, అండర్–17 విభాగంలో పది మందికి, వివిధ కేటగిరీల్లో మొత్తం 30 మంది క్రీడాకారులకు రూ.1.30 లక్షలు నగదు బహుమతి తో పాటు మెమోంటోలు, ప్రశంసా పత్రాలు జీఎంఆర్ ఐటీ తరఫున అందించారు. ఈ టోర్నమెంట్కు చీఫ్ ఆర్బిటార్గా కేవీ జ్వాలాముఖి వ్యవహరించగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.అరుణ్కుమార్ వ్యవహ రించారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్య అతిథిగా హాజరైన జీఎంఆర్ ఐటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జె.గిరీష్, ప్రిన్సిపాల్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేశారు. -
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం
● అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ విజయనగరం అర్బన్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మే 27వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల యాజమాన్య సంస్థ తెలియజేసిందని ఈ నేపథ్యంలో అన్ని మండలాల తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. అల్పపీడన ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని, పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అన్ని మండలాలు డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాగునీటి వనరులపై ప్రభుత్వ నిర్లక్ష్యం రేగిడి: సాగునీటి వనరులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ అన్నారు. ఈ ఏడా ది ఖరీఫ్ దగ్గరపడుతున్నప్పటికీ ఇంతవరకు తోటపల్లి, మడ్డువలస ప్రధాన పిల్ల కాలువల పనులు ఆధునికీకరణ చేపట్టకపోవడం దారుణమన్నారు. ఆదివారం రేగిడి వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. మడ్డువలస ప్రధా న కాలువకు లైనింగ్ పనులు పూర్తి చేయకపోవడం, పిల్ల కాలువలకు ఏర్పాటు చేసిన తూము లు, షట్టర్లు ఎక్కడికక్కడ పాడైనా.. వాటిని బాగు చేయడం లేదని, దీంతో ఈ ఏడాది ఖరీఫ్లో పొలాలకు సాగునీరు అందడం కష్టమేనని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదు సరికదా కనీసం వ్యవసాయ రంగంపై అయినా దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సమయానికే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమై న విత్తనాలను సిద్ధంగా ఉంచేదని, ఈ ఏడాది ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలకు విత్తనాలను అందించకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించ డం దారుణమని పేర్కొన్నారు. వారి వెంట పా ర్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయు డు, మండల పార్టీ కన్వీనర్ వావిలపల్లి జగన్మో హనరావు ఉన్నారు. ప్రజా చైతన్యమే జేవీవీ లక్ష్యం ● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు విజయనగరం అర్బన్: సామాజిక రుగ్మతల నుంచి ప్రజలను చైతన్య పరిచే దిశగా జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన జనవిజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో పనిచేసే జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు ఈ దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన ఫలాలు ప్రజలకు అందించాలని ఉద్దేశంతో ఈ సంస్థ పని చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ డీడీ అన్నపూర్ణ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థ సమాజానికి అవసరం ఎంతో ఉందన్నారు. జేవీవీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్టాజీ మాట్లాడుతూ 30 ఏళ్ల జనవిజ్ఞాన వేదిక ప్రస్థానంలో ఎన్నో సైన్స్ ఉద్యమాలను చేపట్టి విజయాలను సా ధించిందని అన్నారు. సామాజిక కార్యకర్తలు బొడ్డేపల్లి రామకృష్ణారావు, మమ్ముల తిరుపతిరావులను ఈ సందర్భంగా సత్కరించారు. జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యు.శాంతికుమారి, జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, సాహితీ స్రవంతి అధ్యక్షుడు చీకటి దివాకర్, యూటీఎఫ్ నాయకులు నిర్మల, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
బయట చేయించుకోవాల్సిందే..!
థైరాయిడ్ పరీక్ష..● సర్వజన ఆసుపత్రిలో పనిచేయని థైరాయిడ్ టెస్టింగ్ మిషన్ ● ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్న రోగులు ●ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పి.ఆదినారాయణ. ఇతనిది పూసపాటి రేగ మండలం. ఇతను చర్మ సంబంధిత సమస్యతో సర్వజన ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగానికి వెళ్లగా అక్కడ వైద్యులు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని చీటీ రాసి ఇచ్చారు. అది పట్టుకుని ల్యాబ్ దగ్గరకు వెళ్లగా అతనికి కూడా థైరాయిడ్ పరీక్ష బయట ప్రైవేటు ల్యాబ్లో చేయించుకోవాలని సిబ్బంది సూచించారు. ●ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడు పేరు పి.ఉమామహేశ్వరరావు. ఇతనిది పూసపాటి రేగ మండలం వెంపడాం గ్రామం. చర్మ సంబంధిత సమస్యతో సర్వజన ఆసుపత్రిలోని డెర్మటాలజీ విభాగానికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఇతనికి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని ఓపీపై రాసి ఇచ్చారు. అది పట్టుకుని ల్యాబ్ దగ్గరకు వెళ్తే.. థైరాయిడ్ టెస్టు ఇక్కడ కావడం లేదు.. బయట చేయించుకోవాలని అక్కడ సిబ్బంది చెప్పారు. దీంతో ప్రైవేటు ల్యాబ్కు వెళ్లాడు. విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో థైరాయిడ్ పరీక్షలు చేసే యంత్రం పనిచేయకపోవడంతో సంబంధిత రోగులకు అవస్థలు తప్ప డం లేదు. థైరాయిడ్ పరీక్ష బయట చేయించుకోవా లని సంబంధిత విభాగంలోని సిబ్బంది చెబుతుండడంతో రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా రు. ఈ పరీక్ష కోసం ప్రైవేటు ల్యాబ్లో 500 నుంచి 800వరకు ఫీజులు తీసుకుంటున్నారు. దీంతో రోగులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ సర్వజ న ఆసుపత్రిలో ప్రతిరోజూ 15 నుంచి 20 మంది వరకు థైరాయిడ్ పరీక్ష కోసం వస్తారు. జనరల్ మెడిసిన్, డెంటల్, డెర్మటాలజీ, పలమనాలజీ, జనరల్ సర్జరీ, ఎముకల విభాగం, న్యూరో మెడిస న్, న్యూరోసర్జరీ, ఈఎన్టీ, యురాలజీ తదితర విభాగాలు ఉన్నాయి. ఓపీ విభాగాల్లో రోగులను పరీక్షించిన వైద్యులు థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని చీటీలు రాసి సర్వజన ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్కు వెళ్లాలని చెబుతారు. ఇలా రోజుకు 15 నుంచి 20 మంది వరకు ఈ పరీక్ష అవసరం పడుతుంది. ప్రస్తు తం ఆసుపత్రిలో ఈ పరీక్ష చేయకపోవడం వల్ల వారంతా ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. తరచూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమామహేశ్వరావుకు థైరాయిడ్ పరీక్ష కోసం రాసి ఇచ్చిన ఓపీ చీటీ సాంకేతిక సమస్యతో.. సర్వజన ఆసుపత్రిలో థైరాయిడ్ మిషన్ సాంకేతిక సమస్య వల్ల పని చేయడం లేదని తెలిసింది. త్వరలోనే బాగు చేయిస్తాం. రోగులకు అందుబాటులోకి తీసుకువస్తాం. – డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి -
లక్షా 40 వేలకోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు?: బొత్స
విజయనగరం, సాక్షి: ప్రజల అవసరాలను తీర్చడంలో, హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై ఫైర్ అయ్యారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?. అసలు ప్రజల కోసం కూటమి నేతలు ఆలోచిస్తున్నారా?. మా అధినేత వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానాలు చెప్పాలి.వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో ప్రజల అవసరాలన్నీ సమయానికి తీర్చాం. కానీ, ఏడాది పాలనలో రూ.లక్షా 40 వేలకోట్ల అప్పు తెచ్చారు. అన్ని కోట్లు అప్పు తీసుకొచ్చి ప్రజలకు ఏం చేశారు?. ప్రజల అవసరాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధరలు కల్పించకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది?. గత ప్రభుత్వాల మాదిరిగా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు?. ప్రజలు, రైతులను విస్మరించడం కూటమి ప్రభుత్వానికి భావ్యం కాదు అని బొత్స అన్నారు. ఇదీ చదవండి: వంశీని బలిగొనేందుకు బాబు సర్కార్ యత్నమా? -
చిట్టిబాబుకు జాతీయ అవార్డు
విజయనగరం టౌన్: భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వ్యవస్థాపకుడు, భారతరత్న సి.సుబ్రహ్మణ్యం జాతీయ అవార్డును జిల్లాకు చెందిన దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు శుక్రవారం న్యూఢిల్లీలోని ఇండియన్ హేబిటేట్సెంటర్లో అందుకున్నారు. ఛీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సత్యానంద మిశ్రా, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా డైరెక్టర్ బిరాజ్ పట్నాయక్, ఎన్సీడీహెచ్ఆర్ నేషనల్ జనరల్ సెక్రటరీ బీనాపలికల్ తదితరుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సమాజ మార్పునకు కృషిచేసే 14 మందిని గుర్తించి జాతీయ అవార్డు అందించారని, అందులో తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. -
ప్రజాగ్రహానికి రాజకీయ రంగు!
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230సాలూరు: సాలూరులో శ్యామలాంబ పండగ అంగరంగ వైభవంగా చేసేందుకు పట్టణ ప్రజలతో పాటు లక్షలాది మంది భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు స్నేహితులు, బంధువులను పిలిచి మూడు రోజుల పాటు పండగ వైభవంగా చేసేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నట్టు అంతా జరిగింది..వైఫల్యమంతా విద్యుత్ అంతరాయంలోనే కనిపించింది. మరోవైపు అంజలి రథ చక్రం విరిగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పట్టణ వాసులతో పాటు వచ్చిన భక్తులకు విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం చుక్కలు చూపించింది. మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతోనే సరిపోయింది. ఒకనొక సమయంలో స్థానికులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పండగ పూర్తయిన తరువాత కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో పాలకులు, అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. దీంతో రోడ్లపైనే ప్రజలు విద్యుత్ సమస్యపై అర్ధరాత్రి వరకు బైఠాయించారు. అయినా అధికార పార్టీ నేతలు, అధికారుల్లో వీసమంతా చలనం లేకపోయింది. తీరా చూస్తే ఇప్పుడు దీనికి కూడా టీడీపీ శ్రేణులు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా అధికారులపై అధికార పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ప్రజా సమస్యలకు రాజకీయ రంగు పట్టణ ప్రజలు నాలుగు రోజుల పాటు కరెంట్ లేక ఇబ్బందులు పడి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడితే దీన్ని ఓ పార్టీకి ఆపాదించే కుట్రలు పన్నుతున్నారు అధికార పార్టీ నేతలు. పండగ నేపథ్యంలో ప్రజలు రూ.కోట్లు ఖర్చు చేసి పండగను చేసుకున్నారు. కానీ విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యలతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడ్డారు. సమస్య ఆందోళనకు దారితీసే పరిస్థితులు వచ్చిన ఇటు పాలకులు కనీసం దాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు సరికదా.. ఇదంతా రాజకీయమంటూ చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రాన్స్ఫార్మర్ల నాణ్యతపై అనుమానాలు పండగ కోసం సుమారు కోటి 24 లక్షల రూపాయిలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అధికారుల మాటలను నమ్మి ఓ అడుగు ముందుకు వేసిన మంత్రి సంధ్యారాణి ఈ విషయమై ఉత్సాహంతో పండగ ఏర్పాట్లు చేసుకోండని పిలుపునిచ్చారు. తీరా చూస్తే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ కాలిపోయాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సరఫరా అయిన ప్రాంతాల్లో లో, హై ఓల్టేజీలు తరచూ రావడంతో ఇళ్లల్లో గృహోపకరణాలు పాడయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పండగ నేపథ్యంలో విద్యుద్దీకరణ పనుల్లో కొందరికి ముడుపులు అందాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే పండగ సమయంలో ఇంతగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పండగ సమయంలో మూడు రోజుల పాటు తలెత్తిన విద్యుత్ సమస్య నేటికీ చర్చనీయాంశంగానే ఉంది. పండగ ఏర్పాట్లలో వైఫల్యం రాజకీయాలు చేస్తున్న టీడీపీ శ్రేణులు -
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుంటే స్థలాల స్వాధీనం
విజయనగరం అర్బన్: గృహ నిర్మాణ పథకాల కింద గతంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరైన ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి చేయని లబ్ధిదారులంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వెంకటరమణ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు సహాయాన్ని వినియోగించుకొని ఆయా లబ్ధిదారులంతా తమకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని లేని పక్షంలో ఆ ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకొని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించే నిమిత్తం గృహ నిర్మాణ సంస్థ జీఎం శుక్రవారం పలు మండలాల్లో పర్యటించారు. నెలిమర్ల మండలం సీతారాంపేట, బొంపల్లి మండలం గొట్లాం, బొబ్బిలి మండలం పారాదిలో ఇళ్ల కాలనీలను సందర్శించి ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఈఈ, డీఈలతో గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని నిర్మాణాలకు ఈ సీజన్ అనుకూలంగా ఉన్నందున లబ్ధిదారులతో అధికారులు నేరుగా మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించాలని సూచించారు. జిల్లాలో 11,648 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 4,649 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన 6,999 ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట గృహనిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి.మురళీమోహన్ తదితర అధికారులు ఉన్నారు. గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక అధికారి వెంకటరమణ -
కోవిడ్పై తస్మాత్..
విజయనగరం ఫోర్ట్: యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. కోవిడ్ పేరు చెబితే ఇప్పటికీ జనం హడలిపోతున్నారు. మొదటి, రెండు కోవిడ్ల్లో కోవిడ్ బారిన ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది సకాలంలో చికిత్స చేయించుకుని ప్రాణాలతో భయపడ్డారు. రెండేళ్లు పాటు ప్రజలు కోవిడ్ కారణంగా బిక్కుబిక్కుమంటూ జీవించారు. గత కొన్నేళ్లుగా వ్యాప్తి లేకపోవడంతో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. తాజాగా ప్రపంచలోని పలు దేశాలతో పాటు మన దేశంలో కూడా కోవిడ్ కేసులు మళ్లీ నమోదు అవుతున్నాయి. పొరుగున ఉన్న విశాఖలో కూడా కోవిడ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్ బారిన పడకుండా జనం అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి సూచించారు. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్క కారడం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరేచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సామూహిక ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్లు వాడాలన్నారు. భౌతిక దూరం పాటించాలని, హ్యాండ్ వాష్ తదితర వాటితో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆందోళన అవసరం లేదు.. డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి -
స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్సెంటర్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. విజయనగరం నుంచి బొబ్బిలి వస్తున్న పెళ్లి కారు రాయగడ రోడ్డులోని గ్రోత్ సెంటర్లో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. వేగానికి పక్కనే ఉన్న కాలువలోకి పక్కకి ఒరిగి పోయింది. ఈ సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు కారులోని పెళ్లి బృందాన్ని బయటకు తీశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం, కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర నాయకులు బలగ సాయికృష్ణ కుమార్తె పెళ్లి అనంతరం జరిగిన ఈ ఘటనలో కారులో సాయికృష్ణతో పాటు నలుగురు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. ఘటన సంగతి తెలుసుకున్న బొబ్బిలి సీఐ కె.సతీష్కుమార్ తన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి ప్రయాణికుల క్షేమ సమాచారాలను కనుగొన్నారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బాలల ప్రతిభకు వేదిక బాలభవన్
● వేసవిలో ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన ● పలు కళల్లో తర్ఫీదు పొందుతున్న 550 మందికి పైగా చిన్నారులు ● 32 సంవత్సరాలుగా సేవలు ● వేసవి శిక్షణకూ ఇతర జిల్లాల విద్యార్థుల హాజరురాజాం : రాజాంలోని మెంతిపేటలో ఉన్న బాలభవన్ బాలల ప్రతిభను వెలికితీసే వేదికగా మారింది. పలు కళా రంగాల్లో మక్కువ ఉన్న చిన్నారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా పేరు తెచ్చుకుంటుంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ జవహర్ బాలభవన్ను ఇక్కడ 1993 జూన్ 4న ప్రారంభించారు. అప్పట్లో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించిన ఈ కేంద్రం ఇప్పుడు సొంత భవనాలతో పాటు ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. మ్యూజిక్, డ్యాన్స్ రంగాల్లో కేంద్రం ప్రారంభంలో ఇక్కడ శిక్షణ ఉండేది. ఇప్పుడు 16కి పైగా కళా రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పాటు వేసవిలో రాజాం వచ్చే ఇతర ప్రాంతాల విద్యార్థులకు మంచి వేదికగా ఇక్కడ బాలభవన్ వేసవి శిక్షణా తరగతులు నిలుస్తున్నాయి. ఏమి నేర్పుతున్నారంటే.. గత నెల 24న బాలభవన్లో వేసవి శిక్షణా శిబిరాన్ని రాజాంకు చెందిన పలువురు ప్రముఖుల చేతులు మీదుగా డైరెక్టర్ సుంకరి రమేష్ ప్రారంభించారు. ఈ వేసవిలో ఉచితంగా చిన్నారులకు మ్యూజిక్, డ్యాన్స్, తబలా, నాట్యం, సంగీతం, ఆర్ట్స్, టైలరింగ్ వంటి విద్యలలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. శిక్షణ నిమిత్తం 550 మంది విద్యార్థులు ఈ ఏడాది ఇక్కడ చేరారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు నృత్యం, సంగీతం శిక్షణలో ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 200లకు పైగా బాలభవన్లు, 47 బాల కేంద్రాలు పని చేస్తుండగా, రాజాం బాలభవన్కు ప్రత్యేకత ఉంటుంది. మొత్తం 16 మంది ఉపాధ్యాయులు ఈ వేసవిలో ఇక్కడ చిన్నారులకు తర్పీదునిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.. రాజాంతో పాటు చీపురుపల్లిలో జవహర్ బాలభవన్ కేంద్రాలు ఉన్నాయి. ఎంతో కష్టపడి ఈ కేంద్రాలను నిలబెట్టాం. రాజాం బాలభవన్కు మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన చిన్నారులు టీవీ షోల్లో సంగీతం, నృత్యం వంటి రంగాల్లో పాల్గొనే అవకాశం పొందారు. కొంతమంది ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ రాణిస్తున్నారు. వేసవిలో చిన్నారులు సమయాన్ని వృథా చేసుకోకుండా కాలాన్ని ఆహ్లాదకరంగా సద్వినియోగం చేసుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. – డాక్టర్ సుంకరి రమేష్, డైరెక్టర్, బాలభవన్ 550 మందికి పైగా విద్యార్థులు రాజాం బాలభవన్ వేసవి శిక్షణలో అనూహ్య స్పందన కనిపిస్తుంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు రకాల వినోద ప్రదర్శనల్లో తన సత్తాను చాటుతున్నారు. బాలభవన్ జాతీయ వేడుకల్లో ఇక్కడ బాలభవన్ గత 2018 నుంచి మూడు పర్యాయాలు ప్రథమ స్ధానాన్ని సాంస్కృతిక కళా రంగాల ప్రదర్శనలో నిలిచింది. దీంతో వేసవి శిక్షణ కార్యక్రమాల్లో ఇక్కడకు ఎక్కువగా విద్యార్థులు వస్తుంటారు. రాజాంలో ఉన్నవారే కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న చిన్నారులు సెలవులు కారణంగా రాజాం రావడంతో వారంతా ఈ శిక్షణలో పాల్గొని పలు కళారంగాల్లో తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. -
కొత్తపేటలో రెచ్చిపొయిన మట్టి మాఫియా
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఏకంగా గ్రామ ప్రథమ పౌరుడిపైనే విచిక్షణారహితంగా దాడి చేసి రక్తాన్ని కళ్ల చూశారు. తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో విజయనగరం కేంద్రాస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కొత్తపేటలోని చిన్న జగ్గయ్య చెరువు వేదికగా శుక్రవారం పక్కాపథకంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులో మట్టి తవ్వకాల విషయంలో సర్పంచ్ అట్టాడ శ్రీనివాసరావు, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. స్థానిక అవసరాల నిమిత్తం సర్పంచ్ మట్టిని తోలేందుకు ప్రయత్నించగా.. తాము మాత్రమే మట్టిని తరలించాలని, ఇతరులు తరలించడానికి వీలు లేదంటూ జనసేన కార్యకర్తలు తనపై దాడికి దిగారని, సువ్వాని రమణ అనే వ్యక్తి రాయితో బలంగా తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి జనసేన కార్యకర్తలు సువ్వానిపేట, కొత్తపేట చెరువుల్లో మట్టిని తరలించుకుపోతున్నారని, రోజూ వేలాది టన్నుల మట్టి తరలిపోతోందని సర్పంచ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా తమకి కూడా గాయాలయ్యాయని జనసేన కార్యకర్తలు సువ్వాని రమణ, గురాన గోవింద, కల్యాణం లోకేష్, పంచాది రమణ, తదితరులు మిమ్స్లో చేరడం విశేషం. సర్పంచ్పై రక్తం వచ్చినట్లు దాడి చేసి తిరిగి వాళ్లే ఆస్పత్రిలో చేరడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ గణేష్ తెలిపారు. సర్పంచ్పై దాడి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే కొత్తపేట గ్రామ సర్పంచ్పై జనసేన కార్యకర్తలు దాడి చేసి గాయపర్చడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. విజయనగరం కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ అట్టాడ శ్రీనివాసరావును ఆయన పరామర్శించారు. దశాబ్దాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నామని, కొట్లాడుకునే సంస్కృతికి ఎప్పుడు తావునివ్వలేదని, ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఈ సంస్కృతి ప్రారంభమైందన్నారు. మట్టి తరలింపు విషయంలో సర్పంచ్ను రక్తం వచ్చినట్లు కొట్టడం సరికాదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్పై జనసేన కార్యకర్తల దాడి, తీవ్ర రక్తస్రావం మట్టి తవ్వకాల విషయంలో చెలరేగిన ఘర్షణ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ -
వెబ్సైట్లో జీడీఏ ప్రొవిజినల్ మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి సంబంధించి జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుల ప్రొవిజినల్ మెరిట్ జాబితా విజయనగరం.ఎన్ఐసి.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 31వ తేదీలోగా తెలియజేయాలన్నారు. ‘కంచరగెడ్డ’ ఆక్రమణల తొలగింపు ● హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన రెవెన్యూ అధికారులు బొబ్బిలి రూరల్: మండలంలోని కాశిందొరవలస గ్రామ రెవెన్యూ పరిధి కంచరగెడ్డ జలాశయ భూముల ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. టీడీపీ నాయకుడు దురాక్రమణకు పాల్పడిన భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. జలాశయం భూముల ఆక్రమణపై ఈ నెల 20న ‘కంచరగెడ్డ దురాక్రమణ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు తహసీల్దార్ ఎం.శ్రీను స్పందించారు. ఆక్రమణలను శుక్రవారం పరిశీలించారు. జలాశయంలోని భూములు ప్రభుత్వానికి చెందినవని, వీటిని ఆక్రమించేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమిత భూమిలో సాగుకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఈ మేరకు సిబ్బందితో హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేయించారు. కోటిపాం వంతెనపై వినూత్న నిరసన కొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారి పూర్తిగా గోతులు మయం అయింది. వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలు తరచూ మరమ్మతుల కు గురై రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. 1933లో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనికి నిరసనగా సీపీఎం నాయకు డు కొల్లు సాంభమూర్తి వంతెనపై గోతుల్లో చేరిన వర్షపునీటిలో శుక్రవారం స్నానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మూడు రాష్ట్రాల ప్రజ లు, వాహనాల రాకపోకలకు ఆధారమైన కోటి పాం వంతెన కూలేపోయే దశలో ఉన్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. పాలకులు, అధికా రులు కళ్లుతెరిచి చూడాలని కోరారు. కనీసం గోతులను పూడ్చే ఏర్పాట్లైనా చేయాలని డిమాండ్ చేశారు. -
జీకేఆర్ పురం నుంచి జపాన్కు..
బాడంగి: మండలంలోని జీకేఆర్ పురం గ్రామానికి చెందిన ఉత్తరాంధ్ర తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృందానికి జపాన్ నుంచి పిలుపు అందింది. జపాన్లో తప్పెటగుళ్ల ప్రదర్శన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక్కడ నుంచి ఆయనతో పాటు ఆరుగురు కళాకారులు శనివారం జపాన్ చేరుకుంటారు. అక్కడ మన దేశం తరఫున ప్రదర్శన ఇవ్వనున్నారు. జపాన్లో ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనల్లో తప్పెటగుళ్ల కళను ప్రదర్శిస్తామని సత్యం తెలిపారు. ఇతర దేశాలకు తమ కళను పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు. -
అధికం..!
బదిలీలకు పాయింట్ల కేటాయింపు ఇలా... తప్పనిసరి బదిలీలేపాఠశాలలున్న ప్రాంతాల సౌకర్యాలను బట్టి జిల్లాలో విభజించిన నాలుగు కేటగిరీలకు బదిలీ చట్టం ప్రకారం పాయింట్లను కేటాయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఆ పాఠశాల కేటగిరీ ఆధారంగా ఉపాధ్యాయులకు బదిలీలో పాయింట్లు కేటాయించారు. కేటగిరీ–1 స్కూళ్లలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఏడాదికి ఒక పాయింట్, కేటగిరీ–2 స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ఏడాదికి రెండు పాయింట్లు కేటాయించారు. అలాగే, కేటగిరీ–3 స్కూల్కి 3, కేటగిరీ–4 స్కూల్కి మాత్రం 5 పాయింట్లు ఇస్తారు. ఇలా.. కేటగిరీ–4లో ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి అత్యధికంగా 40 పాయింట్లు లభిస్తాయి. వీరికి బదిలీల్లో తొలిప్రాధాన్యం ఉంటుంది. పారదర్శకంగా నిర్వహిస్తాం ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎక్కడా తప్పులు జరగకుండా పకడ్బందీగా చేపడతాం. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తాం. – యు.మాణిక్యంనాయుడు, డీఈఓ ●విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి, బదిలీల ప్రక్రియను విద్యాశాఖ ఇప్పటికే ప్రారంభించింది. బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కేటగిరీ వారీగా జరుగుతోంది. ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉపాధ్యాయులకు మాత్రమే తప్పనిసరి బదిలీ వర్తించినప్పటికీ, రేషనలైజేషన్ జీఓ అమలు నేపథ్యంలో స్థానచలనం జరిగే ఉపాధ్యాయుల సంఖ్య పెరగనుంది. విద్యార్థుల సంఖ్య తగ్గడం, గడిచిన విద్యాసంవత్సర చివరి నెల విద్యార్థుల నమోదు ఆధారంగా ఉపాధ్యాయుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటున్న కారణంగా మిగులు ఉపాధ్యాయుల సంఖ్య పెరగనుంది. మారిన విధానాలతో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఉపాధ్యాయుల్లో 70 శాతం మందికి స్థానచలనం ఉంటుందని అంచనా. ముందుగా ప్రధానోపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 100 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ ప్రక్రియను వినియోగించుకున్నారు. ఇందులో 26 మంది ఐదేళ్ల సర్వీసు పూర్తికావడంతో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శనివారంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఎస్జీటీలకు ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ.. వంద శాతం దృష్టి లోపం, 80 శాతానికి పైగా శారీరక వైకల్యం ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యం, 75 శాతం దృష్టిలోపం, 70–79 శాతం శారీరక వైకల్యం, 70 శాతానికి పైగా వినికిడి లోపం ఉన్న వారికి ద్వితీయ ప్రాధాన్యం, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బొనెటీసీ, కిడ్నీ మార్పిడి, వితంతువులు, డయాలసిస్, స్పైనల్ సర్జరీ చేసుకన్న వారు, జీవిత భాగస్వామి, పిల్లలు జువనైల్ డయబెటిస్, తలసీమియా, హీమోఫిలియో, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారు, వైద్య చికిత్స పొందుతున్న వారు ఈ కేటగిరీలోకి వస్తారు. 70 శాతానికి మించి ఉపాధ్యాయులకు స్థానచలనం పరిగణనలోకి విద్యార్థుల హాజరు సంఖ్య బదిలీలకు కేటగిరీ వారీగా పాయింట్ల కేటాయింపులు బదిలీలకు కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ -
7 రైతు బజార్లు.. రెండే కూలర్లు..!
విజయనగరం ఫోర్ట్: రైతు బజార్లను అభివృద్ధి చేస్తాం... కూరగాయాలు, ఆకు కూరలు విక్రయించుకునే రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు గొప్పలు చెప్పారు. తీరా ఆచరణలో తుస్సుమనిపిస్తున్నారు. జిల్లాలో విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ, దాసన్నపేట, పాత ఎంఆర్ ఆస్పత్రి వద్ద, రాజాం, ఎస్.కోట, చీపురుపల్లి, కొఠారుబిల్లి వద్ద కలిపి మొత్తంగా ఏడు రైతు బజార్లు ఉన్నాయి. వీటిలో 300 మంది వరకు రైతులు కూరగాయలు క్రయవిక్రయాలు జరుపుతూ జీవనం సాగిస్తున్నారు. మిగులు కూరగాయలు నిల్వ ఉంచేందుకు అవసరమైన కుబ్జి కూలర్లు మంజూరు చేయాలని పాలకులు, అధికారులకు పలు మార్లు విన్నవించారు. ఒక్కో రైతు బజారుకు రెండు నుంచి మూడు కూలర్లు అందజేయాలని కోరారు. అయితే, కూటమి ప్రభుత్వం కేవలం విజయనగరంలోని ఆర్అండ్బీ రైతు బజార్, దాసన్నపేట రైతు బజార్కు మాత్రమే ఒక్కొక్కటి చొప్పున కుబ్జికూలర్లు మంజూరు చేసింది. మిగిలిన ఐదు రైతు బజార్లకు మొండిచేయి చూపింది. కూలర్లు మంజూరు చేయాలని ఏడు రైతుబజార్ల రైతులు విన్నవిస్తే కేవలం రెండింటికి ఒక్కో కూలర్నే మంజూరు చేయడం తగదంటున్నారు. రైతుల అవసరం మేరకు కూలర్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయంపై మార్కెటింగ్ శాఖ ఎ.డి. బి.రవికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండు కుబ్జికూలర్లనే ఇచ్చిందన్నారు. వీటిని విజయనగరంలోని ఆర్అండ్బీ, దాసన్న పేట రైతు బజార్లలో ఏర్పాటుచేశామని చెప్పారు. ఇదీ కూటమి ప్రభుత్వ నిర్వాకం ఆవేదనలో రైతన్నలు -
మతోన్మాద శక్తులతో చేతులు కలిపి...
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆబాద్ వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను అందరిలాంటి విద్యా ర్థిగానే ఆ వీధివాసులు భావించారు. పోటీ పరీక్షలకు చదువుతుంటే మంచి విద్యార్థిగానే నమ్మారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ నెల 16న అరెస్టు చేశాక ఆయనలోని ఉగ్రవాద భావజాలం తెలిసి నిశ్చేష్టులయ్యారు. జన్మనిచ్చిన స్థలం, ప్రశాంతతకు నిలయం.. అన్నిమతాల వారు ఆనందంగా జీవించేందుకు అనువైన.. కళలకు కాణాచిగా ఉన్న విజయనగరాన్ని ధ్వంసం చేసేందుకు పథక రచన చేశాడన్న వార్తతో ఉలిక్కిపడ్డారు. పోలీసుల రిమాండ్ నివేదికలో ఆయన అంగీకరించిన అంశాలను తెలుసుకుని అమ్మో అంటున్నారు. మతోన్మాద శక్తులతో కలిసి సిరాజ్, సమీర్ల ఉగ్రకోణంపై ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు కూపీలాగుతున్నారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్ నుంచి శుక్రవారం కస్టడీకి తీసుకుని సౌదీతో ఉన్న సంబంధాలు, ప్రత్యేక యాప్లో చేసిన చాటింగ్లపై ఆరా తీసున్నారు. ఆరేళ్లుగా దేశంలోని ముంబయి, ఉత్తరప్రదేశ్ తదితర చోట్ల జరిగిన మత సమ్మేళనాలకు వీరిద్దరూ హాజరై అక్కడ కలిసిన వ్యక్తుల వివరాలను రాబడుతున్నారు. ఇప్పటికే సిరాజ్ నుంచి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆయా దుకాణాలకు వెళ్లి వివరాలు సేకరించారు. మతోన్నాదం ఉచ్చులోకి యువతను లాగి.. సిరాజ్, సమీర్లు దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచేందుకు పూనుకున్నారు. దీనికోసం ముస్లిం యువతతో ప్రత్యేక బృందాలను నియమించారు. విదేశాల్లోని ఉగ్రమూకల నుంచి వచ్చిన సూచనలు ఆధారంగా మజ్వా–ఇ–హింద్ స్థాపించాలని నిర్ణయించారు. దేశం మొత్తం అలజడులు సృష్టించేందుకు పథకరచన చేశారు. పేలుళ్లతో మారణహోమాన్ని సృష్టించడం, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైనట్టు రిమాండ్ నివేదికలో వెల్లడించారు. ముందుగా విజయనగరంలోని జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో బాంబులు పేల్చాలని నిర్ణయించారు. ఇద్దరి ఉగ్రవాద భావాలు, వారి కుట్రకోణాలను వారం రోజుల్లో సేకరించే దిశగా పోలీసులు విచారణ సాగిస్తున్నట్టు సమాచారం. విజయనగరం విధ్వంసానికి పథక రచన తవ్వేకొద్దీ బయటకొస్తున్న సిరాజ్, సమీర్ల ఉగ్ర కుట్రకోణం ప్రత్యేక యాప్లో సంభాషణలు పేలుళ్లకు పథకం కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్ల నుంచి వివరాలు రాబడుతున్న పోలీసులు -
● కదలని బండి... తోయాల్సిందేనండి..
రాజాం–శ్రీకాకుళం ప్రాంతాల మధ్య తిరిగే బస్సు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మొరాయించింది. స్టార్ట్ కాకపోవడంతో దాదాపు గంటకాలం పాటు కాంప్లెక్స్లో నిలిచిపోయింది. చేసేదిలేక ప్రయాణికులు బస్సు దిగి ఇదిగో ఇలా ముందుకు నెట్టారు. అయినా స్టార్ట్ కాకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు. ఇటీవల రాజాం– శ్రీకాకుళం, బొబ్బిలి, చీపురుపల్లి, పాలకొండ ప్రాంతాల మధ్య తిరిగే బస్సులు అధికంగా మొరాయిస్తున్నాయి. మరమ్మతులకు గురైన బస్సులను ఇటు వైపు నడపడంతో ఈ పరిస్థితి వస్తుందని, పట్టించుకునే నాయకులు లేక ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని ప్రయాణికులు వాపోయారు. – రాజాం -
● ఆస్పత్రిలో విద్యుత్ ఇక్కట్లు
చీకటిలో వైద్యసేవలందిస్తున్న సిబ్బంది... విసన కర్రలతో రోగులకు విసురుతున్న మహిళలను చూశారా.. ఇది బాడంగి సామాజిక వైద్య కేంద్రంలో తీసిన చిత్రం. శుక్రవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల వల్ల ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓ వైపు ఉక్కపోతతో రోగులు అవస్థలు పడగా, మరోవైపు ఎక్స్రే, ల్యాబ్ సేవలు, శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఓపీలో రోగులను పరీక్షించేందుకు వైద్యులు ఆపసోపాలు పడ్డారు. ఆస్పత్రి మొత్తం చీకటిగా మారడంతో సెల్ఫోన్ లైట్ల వెలుతురులో వైద్యసిబ్బంది సేవలందించారు. ఏడున్నర గంటల పాటు అటు వైద్యులు, సిబ్బంది, ఇటు రోగులు నరకయాతన అనుభవించారు. ఆస్పత్రి ఇన్వెర్టర్ చార్జింగ్ అయిపోవడం, జనరేటర్ సదుపాయం లేకపోవడంతో కష్టాలు తప్పలేదు. తక్షణమే ఆస్పత్రికి జనరేటర్ సదుపాయం కల్పించాలని రోగులు, వారి బంధువులు డిమాండ్ చేశారు. – బాడంగి -
గిట్టుబాటు ధర కల్పిస్తాం
రామభద్రపురం: రైతులు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరల కల్పనకు చర్యలు తీసుకుంటామని మండల ఉద్యానశాఖాధికారి పి.మోహనకృష్ణ, ఏఎంసీ సెక్రటరీ ఈశ్వరరావు అన్నారు. రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో బెండకాయల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 15 కిలోల బరువున్న క్రేట్ బెండకాయల ధర గరిష్టంగా రూ.30లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కిలో ధర రూ.2 పలకడంతో రైతన్న నష్టపోతున్నారు. కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ఇదే విషయంపై ‘కిలో బెండకాయలు రూ.2లు’ అనే శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ స్పందించారు. రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకోవాలని మార్కెటింగ్ ఏడీ కిరణ్కుమార్ను ఆదేశించారు. ఆయన సూచనల మేరకు బొబ్బిలి ఏఎంసీ కార్యదర్శి ఈశ్వరరావు, మండల ఉద్యానశాఖాధికారి పి.మోహనకృష్ణ రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో బెండకాయల సాగు రైతులతో మాట్లాడారు. ఎస్.చింతలవలసలోని ఎస్.సత్యం సాగుచేస్తున్న బెండ పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యలను రైతును అడిగి తెలుసుకున్నారు. బెండపంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నామని రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. పంటలను రైతు బజారులో గిట్టుబాటు ధరకు విక్రయించేకునే సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. డిమాండ్ ఉన్న మిశ్రమ పంటలు వేసుకోవాలని సూచించారు. ఽఅధిక దిగుబడి వచ్చే 6 నెలల పంట కాలం ఉన్న గ్రాఫ్టెడ్ టమాటా, వంగ పంటలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ సూపర్వైజర్ చింతల తిరుపతిరావు, వీహెచ్ఏలు పాల్గొన్నారు. బెండసాగు రైతులతో మాట్లాడిన ఉద్యానశాఖాధికారి -
2
కిలో బెండకాయలు రూ.ధరల కల్పనకు చర్యలు తీసుకుంటాం రైతులతో మాట్లాడి కూరగాయలకు గిట్టుబాటు ధరల కల్పనకు చర్యలు తీసుకుంటాం. రైతులతో మాట్లాడి ఉద్యానశాఖాధికారులతో అనుసంధానం చేసుకుని రైతు బజారులో గిట్టుబాటు ధరకు విక్రయించేకునేలా సౌకర్యాలు కల్పిస్తాం. – కిరణ్కుమార్, మార్కెటింగ్శాఖ ఎ.డి., బొబ్బిలి కష్టానికి తగ్గ ఫలితం లేదు.. బెండకాయలకు కనీస ధరలేదు. చీడపీడల నివారణ, పంట కోత, రవాణా ఖర్చులు కూడా రావడంలేదు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కె సత్యం, బెండ రైతు, చింతలవలస రామభద్రపురం: బెండ రైతుకు క(న)ష్టకాలం వచ్చింది. రామభద్రపురం అంతర్ రాష్ట్ర మార్కెట్లో కిలో బెండకాయల ధర రూ.2 పలుకుతోంది. 15 కిలోల బరువున్న క్రేట్ బెండకాయలను గరిష్టంగా రూ.30కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధరలు లేక కోత, రవాణా ఖర్చులకు తిరిగి అప్పు చేయాల్సి వస్తోందంటూ రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసిన రైతుకు కష్టాలే ఎదురవుతున్నాయని, పది నెలలుగా పంటను కొనుగోలుచేసేవారి కోసం ఎదురు చూడాల్సిన గడ్డు పరిస్థితులు నెలకొ న్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి పైసా పెట్టుబడి సాయం అందక, పంటకు గిట్టుబాటు ధరలేక అప్పుల్లో కూరుకుపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. ధాన్యం నుంచి కూరగాయల వరకు ఏ పంటకూ మార్కెట్లో మద్దతు ధర లేదని చెబుతున్నారు. రైతులంటే కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఓటు వేసి అధికారం కట్టబెట్టిన రైతన్నకే వెన్నుపోటు పొడవడం, నష్టాల్లో ముంచడంపై గగ్గోలు పెడుతున్నారు. కోత ఖర్చులకు అప్పుచేయాల్సిందే.. నేను 20 సెంట్ల విస్తీర్ణంలో బెండ పంట సాగుచేశాను. కాపుకొచ్చిన పంటను చూసి ఆనందించాలో, గిట్టుబాటు ధర లేక బాధపడాలో తెలియడం లేదు. పంటను మార్కెట్కు తెస్తే కోత, రవాణా ఖర్చులు రావడం లేదు. 10 క్రేట్లను ఆటోపై రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్కు తెస్తే రూ.300కు వచ్చాయి. అందులో ఆశీలు రూ.100, ట్రాన్స్పోర్ట్ చార్జీలు రూ.100 పోగా రూ.100లు మిగిలింది. కూలీలకు, పురుగు మందులు, ఎరువులకు అప్పు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – కటికి గంగమ్మ, బెండ రైతు, రామభద్రపురం సాగులో ఉన్న బెండ పంట 15 కిలోల బరువున్న క్రేట్ బెండకాయల ధర గరిష్టంగా రూ.30 నష్టాల్లో బెండ రైతులు కోత ఖర్చులు సైతం దక్కని దైన్యం -
భూ సమస్యలు తలెత్తకూడదు..: జేసీ
గజపతినగరం : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతన్నలకు భూ సమస్యలు వస్తే తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లి సమస్యలను పరిష్కారం చేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. గజపతినగరం మండల కేంద్రం పురిటిపెంట పాల్తేరు వారి కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన ఐదు మండలాల రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రైతులు సమస్యలతో కార్యాలయాలకు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి వారి సమస్యలను సంపూర్ణంగా అడిగి తెలుసుకొని పరిష్కరించేలా ఉండాలని సిబ్బందికి సూచించారు. భూ సమస్యల పరిష్కారం విషయంలో రీసర్వే అయిన తరువాత వచ్చిన ఎల్పీఎం నంబర్లు, సర్వే నంబర్లు టాలీ చేసుకొని తప్పులు దొర్లకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. బొబ్బిలి ఆర్డీవో జెవిఎస్ఎస్.రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీలాగాంధీ, ఈడీ ఎస్సీ సొసైటి ఇంచార్జ్ ఆర్డీవో వెంకటేశ్వరరావు, స్థానిక తహసీల్ధార్ బి.రత్నకుమార్తో పాటు ఐదు మండలాల తహసీల్లార్లు, సర్వేయర్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరెస్టు ఎక్కినా ఉపాధి కరువే..!
జియ్యమ్మవలస రూరల్: రాత్రింబవళ్లు శ్రమించి.. కఠోర సాధన చేసి.. చివరకు ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మన్యం బిడ్డ.. ఉపాధిలేక దిక్కులు చూస్తున్నాడు. తండ్రితో కలిసి కూలి పనులకు వెళ్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం అంటే ప్రాణాన్ని పణంగా పెట్టడమే. ఎన్నో ఆశలు ఆశయాలు ఆలోచనల నడుమ ఎవరెస్టు శిఖరాన్ని జియ్యమ్మవలస మండలం పరజపాడు పంచాయతీ గదబవలస గ్రామానికి చెందిన బొడ్ల చిన్న నారాయణరావు తవిటమ్మల కుమారుడు బొడ్ల సాగర్ అధిరోహించాడు. యువకుడి సాహసాన్ని మే 7వ తేదీ 2017 సంవత్సరంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని పత్రికలు ప్రచురించి ప్రశంసలతో ముంచెత్తాయి. అప్పటి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు జిల్లా అధికారులు సైతం సాగర్ సాహసంపై ప్రశంసలు కురిపించారు. సన్మానాలు చేశారు. విద్యార్హతను బట్టి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అంతే.. ఆ తరువాత 8 సంవత్సరాలు గడిచిపోయినా.. ఈ ఎవరెస్టు వీరుడు ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు భద్రగిరి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తూ సుమారు 6 నెలల పాటు కఠోరమైన శిక్షణ పొంది 120 మందిలో కేవలం ఆరుగురు మాత్రమే ఎవరెస్టు శిఖరం ఎక్కగలిగారు. వారిలో సాగర్ ఒకడు. ఆ ప్రయాణంలో తన కుడిచేతి రెండు వేళ్లను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత ఏళ్లు గడిచినా సాగర్కు ఎలాంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం తండ్రితో కూలి పనులకు, బోర్లు వేసేందుకు వెళ్తున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని కూలి డబ్బులతో నెట్టుకొస్తున్నాడు. సాగర్ను ఉద్యోగిగా చూడాలన్న కన్నవారి కలలు కలగానే మిగిలాయి. పర్వతారోహణకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.25లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినా.. విజయాన్ని, పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిన ఆ యువకుడిన ఆదుకోవడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పత్రికల్లో వచ్చిన కథనాలను చూపిస్తున్న సాగర్ -
ఆరోగ్యశ్రీ రోగులకు.. సాధారణ భోజనం..!
విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్నే కాదు.. ఆరోగ్య సేవలపైనా కినుక వహిస్తోంది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం కింద వైద్యసేవలు పొందుతున్న రోగులకు సరైన భోజనం అందకపోయినా పట్టించుకోవడం లేదు. రోగులు, వారి బంధువుల గోడు వినిపించుకోవడం లేదు. వాస్తవంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందేవారికి రుచికరమైన పౌష్టికాహారం అందించాలి. దీనికోసం రోజుకు రూ.100లు ఖర్చుచేయాలి. అయితే, కొన్ని ఆస్పత్రుల్లో సాధారణ రోగులకిచ్చే భోజనమే ఆరోగ్యశ్రీ రోగులకూ అందిస్తున్నారు. దీనిపై రోగుల బంధువులు నిలదీస్తున్నా స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సైతం ఆరోగ్యశ్రీ రోగులకు సాధారణ రోగులకు అందించిన భోజనం( డైట్) అందిస్తున్నారు. ఇక్కడ 450 నుంచి 500 మంది వరకు ఇన్పేషేంట్లుగా చికిత్స పొందుతారు. ఇందులో 300 నుంచి 350 మంది వరకు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స పొందినవారే ఉంటారు. వీరికి ప్రత్యేకమైన భోజనం అందించాలి. ఆస్పత్రిలో మాత్రం ఇది అమలుకావడం లేదు. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలను 25 ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు, 55 ప్రభుత్వాస్పత్రులు అందిస్తున్నాయి. చాలా చోట్ల భోజనం అందించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదేశాలు వచ్చాయి.. ఆరోగ్యశ్రీ రోగులకు, సాధారణ రోగులకు ఒకే విధమైన డైట్ పెట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఆరోగ్యశ్రీ రోగులకు రోజుకి రూ.100 చొప్పున 10 రోజులకి మించకుండా డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు వచ్చినా అమలు చేయలేదు. – డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి భోజనానికి రూ.100 ఖర్చుచేయాలి ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్వైద్యసేవ) పథకం కింద చికిత్స పొందిన రోగులకు భోజనం కోసం రోజుకు రూ.100 వెచ్చించాల్సిందే. రోగులకు రుచికరమైన భోజనం వడ్డించాలి. ఇందులో నిర్లక్ష్యం పనికిరాదు. – డాక్టర్ సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ రోగులకు అందించే భోజనం అందించాల్సిన మెనూ ఇదీ.. సాధారణ రోగులకు ఇస్తున్న భోజనమే ఆరోగ్యశ్రీ రోగులకు ఇస్తున్న వైనం ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు పొందే వారికి భోజనం నిమత్తం రోజుకి రూ.100 చొప్పున వెచ్చించాలి అమలు కావడం లేదంటూ ఆరోపణ ఆవేదనలో రోగులు, వారి బంధువులు ఆరోగ్యశ్రీ పథక నిబంధనల ప్రకారం రోగులకు ఉదయం 150 గ్రాముల బరువు ఉన్న మూడు ఇడ్లీలు, 100 గ్రాముల సెట్నీ... మిల్క్ బ్రెడ్ ఏడు సైల్స్ ఉన్నవి (140 గ్రాములు)... బన్సీ రవ్వ ఉప్మా 300 గ్రాములు వీటిల్లో ఏదో ఒకటి పెట్టాలి. అలాగే, 150 ఎంఎల్ పాలు ఇవ్వాలి. మధ్యాహ్నం మూడు పుల్కాలు (ఒక్కొక్కటి 30 గ్రాముల బరువు ఉండాలి)గాని, 450 గ్రాముల సోనామసూరి రైస్తో వండిన అన్నం, వెజిటిబుల్ కర్రీ ఒక కప్పు, సాంబారు (30 గ్రాములు కందిపప్పు ఉండాలి), 50 గ్రాముల గల ఉడికించిన గుడ్డు, 100 గ్రాముల పెరుగు, అరటి పండు ఒకటి, లేదంటే సీజనల్గా దొరికే పండు ఇవ్వాలి. రాత్రికి 3 పుల్కాలు (30 గ్రాములు బరువు ఉండేవి) గాని, సోనామసూరి రైస్తో వండిన 450 గ్రాముల అన్నం, మిక్స్ డ్ వెజిటిబుల్ కర్రీ ఒక కప్పు, సాంబారు (కంది పప్పు 30 గ్రాములు ఉండాలి), 50 గ్రాముల ఉడికించిన గుడ్డు ఒకటి, 150 గ్రాముల పాలు రెండు టీ స్పూన్ల పంచదారతో కలిపి ఇవ్వాలి. అయితే, చాలా చోట్ల మెనూ అమలుకావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వివాహ వేడుకకు వచ్చి.. మృత్యు ఒడిలోకి...
తెర్లాం: వివాహ వేడుకలకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న తల్లి, తమ్ముడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలుగు రోజుల కిందట తెర్లాం మండలంలోని రాజయ్యపేట గ్రామానికి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ యువకుడు బుధవారం రాత్రి జరిగిన ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్ఐ సాగర్బాబు, కుటుంబ సభ్యులు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన గెడ్డ రామకృష్ణ(24) తెర్లాంలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల వద్ద బుధవారం రాత్రి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మరణించాడు. తెర్లాం మండలం రాజయ్యపేట గ్రామంలో జరగనున్న వివాహ వేడుకలో పాల్గొనేందుకు తన మేనమామ ఇంటికి నాలుగు రోజుల క్రితం రామకృష్ణ వచ్చాడు. అక్కడ జరిగిన వివాహ వేడుకలో పాల్గొని అందరితో సరదాగా గడిపాడు. బుధవారం రాత్రి తెర్లాం మండలం ఎం.ఆర్ అగ్రహారంలో జరుగుతున్న స్నేహితుని వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రామకృష్ణ తన చినమేనమామతో కలిసి ఆటోలో వెళ్లాడు. వివాహ వేడుకలో పాల్గొని అక్కడ భోజనం చేసి తిరిగి రాజయ్యపేట గ్రామానికి ఆటోలో వెళ్తున్నాడు. ఆటోను తన చినమేనమామ నడుపుతుండగా అతని పక్కన రామకృష్ణ కూర్చొన్నాడు. తెర్లాం వెంకటేశ్వర కళాశాల వద్దకు వచ్చే సరికి ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. దీంతో రామకృష్ణ కింద పడిపోగా, ఆటో అతనిపై పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు రామకృష్ణను బయటకు తీశారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స చేసేటప్పటికే రామకృష్ణ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారని ఎస్ఐ చెప్పారు. మృతుని సోదరుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించినట్టు ఎస్ఐ సాగర్బాబు తెలిపారు. బైక్ మెకానిక్గా పనిచేస్తూ.. రామకృష్ణ బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. రామకృష్ణ తండ్రి వెంకటరమణ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి రామకృష్ణ బైక్ మెకానిక్గా పని చేస్తూ తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో తల్లి, తమ్ముడిని పోషిస్తున్నాడు. వివాహ వేడుకకు మేనమామ ఊరు వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న రామకృష్ణ తల్లి, తమ్ముడు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
యోగాంధ్ర విజయవంతానికి ప్రణాళిక
● 100 మంది టీఓటీల ఎంపిక ● గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కార్యకర్తలు ● జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం ● జేసీ సేతుమాధవన్ విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచనల మేరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించినట్టు జేసీ సేతు మాధవన్ గురువారం తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేశామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు... ఇలా అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వా ములను చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఉపాధి వేతనదారులు సుమారు 5 వేల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో యోగా స్ట్రీట్ను ఏర్పాటు చేసి, ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రోజుకో మండలం చొప్పున ఎంపిక చేసి ర్యాలీలు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. యోగా మంత్ కార్యక్రమం విజయవంతానికి 100 మంది టీఓటీలను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. రీ సర్వే వినతులు పరిష్కరించాలి ● రెవెన్యూ అధికారులను ఆదేశించిన కలెక్టర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: రెవెన్యూ, రీ సర్వే వినతులన్నీ వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే వినతుల్లో 90శాతం రెవెన్యూకు సంబంధించినవేనని, రెవెన్యూ అధికారుల అలక్ష్యమే దీనికి కారణమన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం, నెల్లిమర్ల నియోజక వర్గాల రెవెన్యూ అధికారులతో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, అందరికీ గృహాలు, ఇళ్ల స్థలాల రీ వెరిఫికేషన్, వాటర్ ట్యాక్స్, ఆన్లైన్ సర్వీసెస్ పెండింగ్, రీ సర్వే, పిజీఆర్ఎస్ వినతులపై జేసీతో కలిసి గురువారం సమీక్షించారు. అన్ని గ్రామాల్లో ఆక్రమిత భూముల వివరాలను నమోదు చేయాలన్నారు. వచ్చే సోమవారం నుంచి ఈ విషయంపై వినతులు అందితే సంబంధిత వీఆర్వోపై చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ గృహాలు పథకం కింద జిల్లాలో 6 వేల దరఖాస్తులు అందాయని, వీటిని వెరిఫైచేసి శనివారం నాటికి ఆన్లైన్ చేయాలని తెలిపారు. రీ సర్వేలో జరిగిన తప్పిదాలను సవరించాలన్నారు. వాటర్ టాక్స్ జిల్లాలో సుమారుగా రూ.10 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉండగా కేవలం రూ.53వేలు వసూలు చేయడంపై అసహనం వ్యక్తంచేశారు. బదిలీలు పారదర్శకంగా సాగుతాయని, సిఫార్సులను అనుమతించబోమని స్పష్టంచేశారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో మురళీ, ఇన్చార్జి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి.రమణమూర్తి, తహసీల్దార్లు, డీటీలు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై.. టీడీపీ వర్గీయుల దాడి
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230బాడంగి: మండలంలోని పినపెంకి గ్రామంలో అమ్మవారి పండగ ముగింపు రోజు బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రజకుల ఇళ్లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులైన బెవర కులస్తులు దాడికి తెగబడ్డారు. పిడిగుద్దులతో పాటు కర్రలతో దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. ఈ దాడిలో గాయపడిన వాడాడ పోలమ్మ, వెంపడాపు రమేష్, నందిగాం సీత, చోడవరపు అరుణలను గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కుప్ప సింహాచలం స్థానిక సీహెచ్సీకి ఆటోపై తరలించారు. వీరిలో పోలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో అరుణ బాలింత కావడంతో ప్రధమ చికిత్స చేసి ఇంటికి పంపినట్టు వైద్యులు తెలిపారు. ఇదే విషయమై రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన యువకుల మధ్య మంగళవారం నాడే తగాదా జరిగింది. టీడీపీ వర్గీయులు ఎప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడతారోనని రజకులు ఆందోళన చెందుతున్నారు. తమకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందినా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు సింహాచలం ఆరోపించారు. -
ఎండీయూ ఆపరేటర్ల ఆందోళన
విజయనగరం ఫోర్ట్: ఎండీయూ వ్యవస్థను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర సమైఖ్య ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఎండీయూ వాహనాలతో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో 27 వేల మంది కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. రేషన్కు బదులు నగదు బదిలీ అమలు కోసం కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థపై దాడి చేస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చు వేతనాలతో వాహన సర్వీసు, పెట్రోల్, రేషన్ తరలింపు ఖర్చు భరించి ప్రజలకు ఇంటింటికి సకాలంలో పంపిణీ చేస్తున్న వ్యవస్థను రద్దు చేయటం ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురిచేయడమే అన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు సిహెచ్.వెంకటరావు, పవన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాడ లేని సంక్షేమం..!
ఆదుకునే పథకాలేవీ? రోజూ ఉదయాన్నే విజయనగరం గణేష్ గుడి మీదకు పని కోసం వస్తాను. వారంలో మూడు రోజులు పని దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. గతంలో ఈ పరిస్థితులు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో జీవనం సాగిస్తున్నాం. ముఖ్యంగా పిల్లల చదువులు భారంగా మారాయి. గతంలో అమ్మ ఒడి, వసతి దీవెన కింద సాయం అందేది. ఇప్పుడు ఆదుకునే ఆ పథకాలు కూడా లేకుండా పోయాయి. – సత్యం, తాపీ మేసీ్త్ర, విజయనగరం ఆగిన ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వం మా ఊర్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లేఅవుట్లు ఏర్పాటు చేసింది. వాటిలో వేలల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఊర్లోనే పనులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. పెయింటింగ్, ఉడ్వర్క్స్, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై ఈ ప్రభావం పడుతోంది. వారాలు, నెలల తరబడి ఇంటి పట్టునే ఉంటే మా కుటుంబాలు ఎలా గడుస్తాయి? –కృష్ణ అప్పారావు, పెయింటర్, విజయనగరం కార్మికుల పొట్ట కొట్టారు.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న పైసా కూడా ఇవ్వలేదు. కార్మికులకు తీరని అన్యాయం చేసింది. విజయనగరం జిల్లా పరిధిలో చాలా మంది కార్మికులకు గుర్తింపు ఇవ్వలేదు. ఈ ఏడాదిలో ఒక్క క్లెయిమ్ చెల్లించలేదు. ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయడం లేదు. భవన నిర్మాణ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. –బి.రమణ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి కార్మిక బోర్డును తక్షణమే పునరుద్ధరించాలి ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇసుకఽ కొరత లేకపోయినా పనుల్లేకుండా పోయాయి. భవన కార్మికుల సంక్షేమ బోర్డును రద్దును పునరుద్ధిరస్తానన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే లేదు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. –మజ్జి ఆదినారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ● అర్థాకలితో నిర్మాణ రంగ కార్మికులు ● ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన 1590 క్లెయిమ్స్ ● కార్మికుల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం ● ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయి? విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్టకొట్టింది. కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను దారి మళ్లించారు. కనీసం మరణ క్లెయిమ్స్, ప్రసూతి క్లెయిమ్స్, స్కాలర్షిప్ క్లెయిమ్స్, అనారోగ్య క్లెయిమ్స్ కూడా అందకుండా చేశారు. ఫలితంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సుమారు 1590 క్లెయిమ్స్ ఇప్పుడు వరకు అపరిష్కృతంగానే ఉన్నాయి. భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, కూలీల జీవితాలు కొద్ది నెలలుగా దుర్భరంగా మారాయి. అరకొర పనులు, అప్పుల బాధలు, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సైతం డబ్బు పుట్టక బతుకు భారంగా ఈడుస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ అలవిగాని హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలకు సైతం గండి కొట్టింది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 2లక్షల పైగా మంది అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. లెక్కల్లోకి రాని వారు మరికొన్ని వేలల్లో ఉంటారు. ఇప్పుడు వరకు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులు 91,528 మంది. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేసీ్త్రలు, కూలీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు ఉన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలప్పుడు భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. సాధికార సంస్ధ ఏర్పాటు చేస్తామని, అన్ని వర్గాల కార్మికులకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. పేరు మార్పు తప్ప సాయం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ ఉత్తివిగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం కింద విజయనగరం జిల్లాలో దాదాపు 11వేల కుటుంబాలకు రూ.118 కోట్ల మేర సాయం అందింది. ఈ ప్రభుత్వంలో అది పూర్తిగా నిలిచిపోయింది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సాయం ఇలా.. వైఎస్సార్ కల్యాణమస్తు కింద భవన, ఇతర నిర్మాణ కార్మికులకు రూ.20వేలు చొప్పున అందించారు. వైఎస్సార్ బీమా పథకం కింద ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, సహజ మరణాలకు రూ.లక్ష, వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. రిజిస్టర్ కాని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు. అసంఘటిత రంగ కా ర్మిక కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీల చర్చ
విజయనగరం అర్బన్: బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. జూన్ రెండో తేదీకల్లా ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. దీంతో ఇప్పుడు ఉద్యోగుల్లో ఎక్కడ చూసినా బదిలీలపై చర్చే నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక గతేడాది సెప్టెంబర్లో బదిలీలు చేసింది. పిల్లల చదువులు, వ్యక్తిగత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కీలకమైన 15 శాఖల్లోనే అప్పట్లో సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టింది. తాజాగా అన్ని ప్రభుత్వ శాఖల్లో అనుమతివ్వడంతో ఈ సారి భారీ సంఖ్యలోనే ఉద్యోగులకు స్థానచలనం కలగనుంది. సిఫార్సు లేఖలకు ప్రదక్షిణలు కొన్నేళ్లుగా కలెక్టరేట్ ప్రాంగణంలోని 34 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గుబులు ప్రారంభమయింది. ఒకే ప్రాంతంలో ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి కావడంతో వాళ్లంతా సిఫార్సుల లేఖల కోసం నేతలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాధాన్య పోస్టింగ్లకు అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం కొందరు పైరవీలు మొదలయ్యాయి. తమను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తారేమోనన్న ఆందోళన వారిలో నెలకొంది. అటువంటి పలువురు ఉద్యోగులు కూటమి నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెవెన్యూ, పీఆర్లో భారీ పోటీ ప్రధానంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, జిల్లా ప్రజా పరిషత్, ఇంజినీరింగ్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖలకు సంబంధించి విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్లతోపాటు ఆయా పట్టణాలకు చుట్టుపక్కల మండలాల్లో అనుకూలమైన పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. పెద్ద మండలాలకు వెళ్లేందుకు డీప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు అదేవిధంగా మేజర్ పంచాయతీల్లో పోస్టింగ్ల నిమిత్తం గ్రామ కార్యదర్శులు ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్లు దాటిన వారికి తప్పనిసరి ప్రాధాన్యం ఉన్న పోస్టులపై పలువురి దృష్టి సిఫార్సు లేఖలకు ప్రదక్షిణలు సచివాలయాల్లో భారీ కదలికలు తప్పవు సచివాలయ నిర్వహణ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పోస్టుల కుదింపు చర్యలు ఒకవైపు ఉంటే మరోవైపు బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో సచివాలయ ఉద్యోగుల స్థానచలనం భారీగానే ఉంటుంది. జిల్లాలోని 563 గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ కేడర్ సిబ్బంది 5,320 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది ఈ శాఖలో చేపట్టిన బదిలీ ప్రక్రియలో బదిలీ కోరిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది బదిలీల పరిధిలోకి రాని ఉద్యోగులందరికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. దీంతో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులకు స్థానచలనం కలగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ దృష్ట్యా ఉద్యోగుల సంఖ్యకూడా కుదించనున్నారు. ఈ పరిస్థితుల కారణంగా భారీ సంఖ్యలో స్థానచలనం ఉంటుంది. -
నరవ మేట్లపై విచారణ
విజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు పేరిట బినామీ మస్తర్లు వేస్తున్నారనే అంశంపై సాక్షిలో గురువారం ఉపాధిలో బినామీ మస్తర్లు అనే శీర్షికన ప్రచురించిన కథనానికి గంట్యాడ ఎంపీడీవో ఆర్.వి.రమణమూర్తి స్పందించారు. బినామీ మస్తర్లు వేసారన్న అభియోగాలు ఉన్న నరవ మేట్లను గంట్యాడ ఎంపీడీవో కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. బినామీ మస్తర్లు వేసిన మేట్లను తొలగిస్తామని ఆయన తెలిపారు. శ్యామలాంబ హుండీ ఆదాయం రూ.8.19 లక్షలు సాలూరు: సాలూరు శ్యామలాంబ అమ్మవారి హుండీ ఆదాయం 8,19,900 రుపాయిలు వచ్చినట్లు ఎండోమెంట్ అధికారి రమేష్ గురువారం తెలిపారు. శ్యామలాంబ పండగ నేపథ్యంలో అమ్మవారి గుడికి భక్తులు పోటెత్తారు. హుండీ ఆదాయాన్ని ఆలయంలోనే లెక్కింపు చేపట్టారు. ప్రీ ఎక్లాంప్సియాపై అవగాహన పార్వతీపురం టౌన్: గర్భిణుల్లో ప్రీ ఎక్లాంప్సియా ఒక ప్రమాదకర సూచికని, సకాలంలో లక్షాణాలు గుర్తించాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.భాస్కరరావు సూచించారు. ప్రపంచ ప్రీ ఎక్లాంప్సియా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు హైరిస్క్ సమస్యలు ముందస్తుగా గుర్తించాలన్నారు. బీపీ అధికంగా ఉండడం, తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్య, ముఖం,చేతులు, కాళ్లు ఉబ్బడం, మూత్ర విసర్జన తగ్గడం తదితర లక్షణాల ద్వారా దీన్ని గుర్తించాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, పీఎల్ రఘుకుమార్, డీపీహెచ్ఎన్వో ఉషారాణి, డీపీవో లీలారాణి, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, డీసీఎం విజయలత, సీసీ శ్రీనివాసరావు, వైద్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మాణాలు వేగవంతం చేయాలి : కలెక్టర్ పార్వతీపురం రూరల్: మన్యం జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం పార్వతీపురం మండలంలోని చప్పవానివలస గ్రామంలో కలెక్టర్ పర్యటించి వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను ఆయన నేరుగా స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. గృహ నిర్మాణాలు జాప్యానికి గల కారణాలను అధికారులను, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన రెండవ విడత బిల్లులు మరి కొద్ది రోజుల్లో మంజూరు కానున్నాయని, తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ ఎంతమేరకు అందుబాటులో ఉందో అధికారులను ఆరా తీశారు. గృహ నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా అవసరమైన మెటీరియల్ను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ పరిశీలన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారి జి.సోమేశ్వరరావు, చిరంజీవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పీఎస్ నాయుడు పాల్గొన్నారు. -
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
గుర్ల: మండలంలోని కెల్లకు చెందిన సువ్వాడ గాంధీ (32) అప్పులు బాధ భరించలేక పురుగులు మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కెల్లకు చెందిన సువ్వాడ గాంధీ తన అవసరాల నిమిత్తం అప్పులు ఎక్కువగా తీసుకున్నాడు. అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి రావడంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అందుతుండగా గురువారం ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతునికి భార్య మంగ, కుమారుడు రుషివర్ధన్, కుమార్తె లహరి ఉన్నారు. గుర్ల ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి వేతనదారు మృతి బాడంగి: మండలంలోని కోటిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు చెలపురెడ్డి తవుడమ్మ(68) పని చేస్తున్న ప్రదేశంలో గురువారం మృతి చెందినట్టు ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు మరియదాస్ తెలిపారు. గ్రామంలో జగ్గన్న చెరువు పూడిక పనులు చేస్తుండగా చద్దన్నం తిని చేతులు కడుగుతుండగా తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఏపీవో సాయిరాం, టీఏ శ్రీనివాసరావు ఎంపీడీవో ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంపీడీవో వేతనదారు మృతి పట్ల సంతాపం తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి నెల్లిమర్ల రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మండలంలోని సారిపల్లి గ్రామానికి చెందిన యువకుడు నడిపేన పురుషోత్తం(27) గురువారం మృతి చెందాడు. యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బద్రీనాధ్ యాత్ర నిమిత్తం యాత్రికులను తీసుకువెళ్లేందుకు బస్సు డ్రైవర్లుగా సారిపల్లికి చెందిన పురుషోత్తం, శ్రీనివాసరావు ఈ నెల 15న వెళ్లారు. 17వ తేదీ అర్ధరాత్రి జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్గడ ప్రాంతంలో బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో క్యాబిన్లో కూర్చున్న పురుషోత్తంకు తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు చికిత్స నిమిత్తం ప్రైవేటు అంబులెన్సులో విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు వైద్యులు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ పురుషోత్తం ప్రాణాలు విడిచాడు. మృతుడికి తల్లిదండ్రులు, అన్నయ్య ఉన్నారు. పురుషోత్తం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ప్రమాదంలో మానవ మనుగడ.!
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రకృతి సిద్ధమైన వాతావరణానికి, కృత్రిమ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ప్రస్తుతం ప్రకృతి వైద్యంలో కూడా మన పాత ఆచారాలే ఉంటున్నాయి. ప్రకృతి, తోటి జీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆర్వీజే నాయుడు, పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్, రాజాంమనిషి ప్రతి అవసరానికి ప్రకృతిపై ఆధారపడి జీవించాల్సి ఉంది. ప్రకృతి లేనిదే మనిషి లేడు. వ్యవసాయ పద్ధతులైనా, ఆహారపు అలవాట్లయినా, మానవ ధర్మాలైనా, జీవన విధానమైన సృష్టి చక్రానికి లోబడి ఉండాలి. – భారతీయ మహర్షులు రాజాం సిటీ: భూమిపై జీవాల మధ్య భేదమే జీవవైవిధ్యం. ప్రపంచంలో మిలియన్ జాతుల జీవాలు ఉన్నాయి. నేడు భూమి వేడెక్కిపోతోంది. కాలుష్యం అధికమవుతోంది. అడవులు, వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ మిత్ర జాతులు అంతరించిపోయి ప్రమాదకర కీటకజాతులు పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీని రుచిమరిగిన మానవ మనుగడ ఈ టెక్నాలజీ కారణంగా నష్టపోతున్న ఇతర జాతుల గురించి పట్టించుకోవడం లేదు. అంతరిస్తున్న జీవజాతులు ప్రపంచంలో పలు జీవజాతులు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడాలనే ఉద్దేశంతో పర్యావరణ ప్రేమికులు విస్తృత ప్రచారాలు, పోరాటాలు చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జీవజాతుల పరిరక్షణ నిమిత్తం మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహిస్తోంది. 1992 మే 22 నుంచి ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్షణగా.. మన దేశంలో ఆదివాసీలు ఉన్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం రక్షణగా ఉన్నట్లు ఒక అధ్యయనం తెలుపుతోంది. ప్రధానంగా మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో 80 శాతానికి పైగా గిరిజనులు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో జీవవైవిధ్యం, ప్రకృతి సంపద పుష్కలంగా ఉంది. మన రాష్ట్రంలో గిరిజన తెగలు జీవిస్తున్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం ఉన్నప్పటికీ పాలకుల్లో సమన్వయం లేకపోవడంతో అక్కడ కూడా యాంత్రీకరణ పెరిగి జీవవైవిధ్యం కనుమరుగవుతోంది. జన్యుమార్పిడితో ఇబ్బందులు.. జన్యుమార్పిడి విధానం ఇటీవల అధికమైంది. ఫలితంగా ఎక్కడికక్కడే సంకరజాతి ఉత్పత్తులు ఎక్కువవుతున్నాయి. వాటి కారణంగా కొత్త విత్తనాలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. జన్యుమార్పిడి వల్ల ఇతర జాతులకు నష్టం వాటిల్లితే భవిష్యత్లో మానవ మనుగడకు తీవ్రనష్టం కలిగే ప్రమాదం ఉంది. పెరిగిపోతున్న కాలుష్యం.. ప్రస్తుతం వాతావరణంలో కాలుష్యం పెరగిపోతోంది. పర్యావరణ పరిరక్ష ణకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం సైతం తూతూ మంత్రంగానే వ్యవహరిస్తోంది. వాల్టా చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఎక్కడికక్కడే ఇసుక తవ్వకాలు, చెట్ల నరికివేత, కాలుష్యాన్ని వెదజల్లే మందుసామగ్రి వినియోగించి కొండలు బద్దలుచేయడం, చెరువుల ఆక్రమణ, జనావాసాల మధ్య సెల్ఫోన్ టవర్లు నిర్మించడం సాధారణమైపోయింది. వీటికి తోడు కాలం చెల్లిన కాలుష్య వాహనాల వినియోగం, రణగొణ ధ్వనులు, అనుమతులుకు మించి నిర్మాణాలు చేయడం, ప్లాస్టిక్ వినియోగించడం వంటివి జీవావరణానికి నష్టం కలిగిస్తున్నాయి. ఫలితంగా పలు జాతుల పక్షులు అంతరించిపోతున్నాయి. రసాయన వ్యవసాయం..ప్రస్తుతం వ్యవసాయం కూడా రసాయన ఎరువుల మయంగా మారిపోయింది. గతంలో కృత్రిమ విత్తనోత్పత్తితో పాటు కృత్రిమ వ్యవసాయం ఉండేది. ప్రస్తుతం రసాయన ఎరువుల వినియోగం అధికం కావడం కారణంగా ఉత్పత్తిచేసే ఆహారపు పంటల్లో కూడా నాణ్యత ఉండడం లేదు. వీటికి తోడు రసాయన ఎరువుల కారణంగా పర్యావరణానికి మేలు చేసే కీటకాలు మృతిచెంది, విషజ్వరాలు, రోగాలను వ్యాప్తిచేసే కీటకాలు అధికమవుతున్నాయి. ఇప్పటికై నా పాలకులు, ప్రజలు మేల్కొనకుంటే మున్ముందు భవిష్యత్ అంధకారమే. అంతరించిపోతున్న జీవజాతులు ప్రమాదంలో జీవసంపద మేల్కొనకుంటే ముందుతరాలకు ముప్పు నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం -
సూర్యప్రకాష్కు విజనరీ ఇండియన్స్ అవార్డు
గరుగుబిల్లి: విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని కేంద్ర ప్రసార భారతి మంత్రిత్వశాఖ గుర్తించి విజనరీ ఇండియన్స్ అవార్డులను అందజేసింది. ఇందులో భాగంగా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన డా.గుల్ల సూర్యప్రకాష్ హైదరాబాద్లోని కేర్ హస్పిటల్లో కార్డియాలజిస్టుగా విధులను నిర్వహిస్తున్న ఆయన విజనరీ ఇండియన్స్ అవార్డుకు ఎంపిక కాగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి పూనమ్ ధిల్లాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన కేర్ ఆస్పత్రిలో సేవలను అందిస్తూనే ఈ ప్రాంతీయులకు సేవలను అందించాలనే ఉద్దేశంతో మండలంలోని రావుపల్లి, కొత్తూరు తదితర గ్రామాలలో ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించి వందలాదిమందికి సేవలను అందిస్తున్నారు. చిరకాలంగా వైద్యసేవలను అందిస్తూ ఈ ప్రాంతీయుల మన్ననలను పొందుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణ రాష్ట్రంలో సేవలను అందిస్తున్నారు. ఆయన సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రప్రసారభారతి మంత్రిత్వశాఖ ఈనెల 18న న్యూ ఢిల్లీలోని ఆకాశవాణి భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డా.సూర్యప్రకాష్కు విజనరీ ఇండియన్స్ అవార్డును బహుకరించింది. ఆయన ప్రత్యేక అవార్డును అందుకోవడంపట్ల గ్రామసర్పంచ్ బొంతాడ మహేశ్వరరావు, మాజీ సర్పంచ్ గుల్ల కాశినాయుడు, అన్నపూర్ణమ్మ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
అంకితభావంతో పని చేయాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాల్సిన బాధ్యత ఉద్యోగుల పట్ల ఉందని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ కార్యాలయంలో సహాయకులుగా పని చేస్తున్న 6గురు సిబ్బందికి రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఆయన ఉత్తర్వులు అందజేశారు. ఈ క్రమంలో సీహెచ్.సీతమ్మ, టి.రాములు, డి.రామస్వామి, ఆర్.సింహాచలం, జి.వెంకటరత్నం, ఎం.వెంకటరమణలకు జామి, మెట్టపల్లి, నాగూరు, బలిజిపేట, చింతాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు విజయనగరం జిల్లా పరిషత్లో మరొకరిని రికార్డ్ అసిస్టెంట్గా నియమించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీవీ. సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు. సారాతో నలుగురి అరెస్టుపాలకొండ: సారా తరలిస్తున్న కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని ఎకై ్సజ్ సీఐ సూర్యకుమారి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె బుధవారం స్థానిక విలేకరులకు వివరించారు. వీరఘట్టం మండలం మోకాసరాజపురం గ్రామ సమీపంలో జలుమూరు ప్రశాంత్కుమార్, వడ్డి సునీల్లు 160లీటర్లు సారాను కారులో తరలిస్తున్నట్లు గుర్తించి అదపులోకి తీసుకున్నామన్నారు. అలాగే వీరఘట్టం ఎస్సీ కాలనీలో దాడులు చేయగా బండి కస్తూరి ఐదు లీటర్ల సారాతోను, సిరిపురం ఉష మరో ఐదు లీటర్ల సారాతోను పట్టుబడినట్లు తెలిపారు. సారాతో పాటు కారును సీజ్ చేశామని, నలుగురు నిందితులను రిమాండ్కు తరలించామని వివరించారు. ఈ దాడుల్లో పాలకొండ ఎకై ్సజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కొండ దిగిన ఏనుగుల గుంపు● మొదలైన ఘనసర రైతుల కష్టాలు భామిని: మండలంలోని ఘనసర రైతులకు ఏనుగుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కొంతకాలంగా తివ్వాకొండల్లోకి ఏనుగులు వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న రైతులకు మళ్లీ కష్టం వచ్చిపడింది, బుధవారం భామిని మండలం ఘనసర గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఐలమ్మ తోటలో నాలుగు ఏనుగుల గుంపు ప్రత్యక్షమైంది.తివ్వాకొండల్లో తాగునీటికి విలవిలలాడి కొండ దిగి వచ్చినట్లు ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు.తిరిగి ఎలిఫెంట్ ట్రాకర్స్, ఫారెస్టు సిబ్బందికి ఏనుగుల రక్షణ బాధ్యతలు ఆరంభమయ్యాయి. గంజాయి పట్టివేతవిజయనగరం క్రైమ్: పశ్చిమ గోదావరి జిల్లానుంచి సుమారు 4.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా విజయనగరం జీఆర్పీ సిబ్బంది బుధవారం స్టేషన్లో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కోపల్లెకు చెందిన లెంక కరుణానిధి విజయనగరం రైల్వే ప్లాట్ ఫాంపై అనుమానంతో రెండు బ్యాగులతో సంచరిస్తుండగా పట్టుకున్నామన్నారు. నిందితుడి దగ్గర నుంచి రూ.22,500 విలువ గల 4.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం విశాఖ రైల్వే కోర్టుకు తరలించినట్లు చెప్పారు. -
ఎంఆర్పీ ఉల్లంఘన జరగలేదు
నెల్లిమర్ల రూరల్: మద్యం అమ్మకాల్లో ఎలాంటి ఎంఆర్పీ ఉల్లంఘన జరగలేదని ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు స్పష్టం చేశారు. నెల్లిమర్ల మండలంలోని సతివాడ మద్యం దుకాణంలో ఎంఆర్పీకి అదనంగా మద్యం అమ్ముతున్నారని పలువురు మద్యం ప్రియులు ఇచ్చిన ఫిర్యాదుపై బుధవారం ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంత మంది వ్యక్తుల ఫిర్యాదుతో సతివాడలో మద్యం దుకాణాన్ని పరిశీలించి విక్రయాలపై ఆరా తీశామన్నారు. కొత్త ధరలపై పాత స్టిక్కర్లు ఉండడమే ఈ విధమైన ఆరోపణలకు ప్రధాన కారణంగా గుర్తించామని చెప్పారు. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మద్యం డిపోను కూడా సందర్శించి ధరలను సరిచూశామని తెలిపారు. సిగ్నేచర్ విస్కీ క్వార్టర్ బాటిల్ పాత ధర రూ.330గా ఉండేదని, ప్రస్తుతం పెంచిన ధరతో రూ.350గా అమ్మకాలు సాగుతున్నాయన్నారు. పాత స్టిక్కర్ రూ.330 బాటిల్పై ఉండడంతో మద్యం తాగేందుకు వచ్చిన వారు ఫిర్యాదు చేశారని, ప్రస్తుత ధరతోనే షాపులో అమ్మకాలు జరిగాయని స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా ఏ మద్యం షాపులోనూ పైసా కూడా అదనంగా తీసుకోవడం లేదని చెప్పారు. నిత్యం షాపులపై తనిఖీలు జరుపుతున్నామని, ఎంఆర్పీని ఉల్లంఘిస్తే షాపులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు -
మామిడి కాయలు నిల్వ చేసిన ఇళ్లపై విజిలెన్స్ తనిఖీలు
గంట్యాడ: మండలంలోని రామవరం గ్రామంలో కాకర్లపూడి రామకృష్ణరాజు, సిరపురపు శివ అనే వ్యక్తుల ఇళ్లలో నిల్వ చేసిన మామిడి కాయలపై విజిలెన్స్, ఆహార తనిఖీ అధికారులు సంయుక్తంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు. రామకృష్ణ రాజు, శివలు పండించిన మామిడి కాయలకు మంచి రంగు వచ్చి ఆకర్షణీయంగా కనబడడానికి, తద్వారా పళ్లను ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి మామిడి కాయలకు ఈపి–50, రిఫాన్ అనే కెమికల్ ద్రావణం ఉపయోగించి రంగు వచ్చిన తర్వాత మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ ఈ విధంగా కృత్రిమంగా కెమికల్స్ వాడి మామిడి కాయలు పండించరా దన్నారు. ఇలా పండించడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. కృత్రిమంగా కెమికల్స్ వాడి మామిడి కాయలు పండించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఆహార భద్రత అధికారులు కెమికల్ స్ప్రే చేసిన మామిడి కాయల నమూనాను సేకరించి వాటిని రసాయన పరీక్ష నిమిత్తం నాచారాం, హైదరాబాద్కు పంపి దాని రిపోర్ట్ అధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ తనిఖీలో విజిలెన్స్ అధికారులు సీఐ సింహాచలం, హెచ్సీ కామేశ్వరావు, పురుషోత్తం పాల్గొన్నారు. -
ఉపాధిలో బినామీ మస్తర్లు..!
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పేరిట మస్తర్లు ఉపాధి హామీ పథకంలో డబ్బులు దోచేందుకు అడ్డదారులను వెతుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారి పేరిట బినామీ మస్తర్లు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది మేట్లైతే తమ భార్య/భర్తల పేరిట బినామీ మస్తర్లు వేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.● మేట్ల అండతో కూటమి నేతల దోపిడీ ● ప్రభుత్వ ఉద్యోగులు సైతం పనికి వస్తున్నట్లు మస్తర్లు ● లక్షలాది రుపాయలు స్వాహా విజయనగరం ఫోర్ట్: ● గంట్యాడ మండలం నరవ గ్రామంలో ఎస్.సత్యనారాయణ అనే వ్యక్తి ఉపాధి హామీ పనికి వెళ్లకపోయినా వెళ్లినట్లు మస్తరు వేశారు. ఆయన విజయనగరం కలెక్టరేట్లోని సర్వశిక్ష అభియాన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మే నెలలో ఆయన పనికి వెళ్లినట్లు మస్తర్ వేయగా ఆయనకు రూ.1260 వేతనం జనరేట్ అయింది. ● ఇదే గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే మరో వ్యక్తి విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో ఉన్న ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈయన ఏప్రిల్, మే నెలల్లో పనికి వెళ్లినట్లు మస్తర్ వేశారు. దీంతో ఈ అధ్యాపకుడికి మూడు వారాలకు గాను రూ.3356 వేతనం జనరేట్ అయింది. వీరితో పాటు మరి కొంతమందికి కూడా బినామీ మస్తర్లు వేశారని గ్రామ సర్పంచ్ పతివాడ భాస్కరరావు ఎంపీడీఓ ఆర్వీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ ఒక్కగ్రామంలోనే కాదు. జిల్లాలోని అనేక చోట్ల బినామీ మస్తర్లు వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల బయటపడుతున్నాయి. మరి కొన్ని చోట్ల గుట్టుగా సాగి పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బినామీ మస్తర్ల పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోకుండా అధికారులు చోద్యం చూడడం వల్లే ఉపాధి హామీలో అక్రమాలు పెరిగిపోతున్నాయనే వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి సర్కార్ వచ్చాక పెరిగిన అవినీతి కూటమి సర్కార్ రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత ఉపాధి హామీ పథకంలో అవినీతి పెచ్చు మీరుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పనిచేసిన మేట్లను తొలగించి కూటమికి చెందిన సానుభూతిపరులను మేట్లుగా నియమించుకున్నారు. అధికారులు కూడా కూటమి నేతల ఆదేశాలకు వంత పాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు నియమించుకున్న మేట్ల ద్వారా బినామీ మస్తర్లు వేసుకుని కాసులు దండుకుంటున్నట్లు విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అక్రమాలు జరుగుతున్నా అధికార పార్టీ వారు కావడంతో అధికారులు ఏమీ అనకుండా చూసీచూడనట్లు ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బినామీ మస్తర్ల ద్వారా లక్షలాది రుపాయలు దండుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో 3.53 లక్షల జాబ్ కార్డులు ఉండగా అన్నీ యాక్టివ్లో ఉన్నాయి. జిల్లాలో 6.08 లక్షల వేతనదారులు ఉన్నారు. వారిలో 5.95 లక్షల మంది వేతనదారులు ఉపాధి పనులకు వెళ్తారు. బినామీ మస్తర్లపై విచారణ చేపట్టి చర్యలు ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. ఎస్.శారదా దేవి, పీడీ, డ్వామా -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన యువకుడు జి.రాకేష్(20) వ్యసనాలకు బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొద్దాం గ్రామానికి చెందిన జి.రాకేష్ తండ్రి వెంకటసత్యం ఎస్.కోట సర్కిల్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ పదినెలల క్రితం విద్యుత్ఘాతంతో మరణించారు. అప్పటినుంచి రాకేష్ వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నెల 11న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబసభ్యులు ఎస్.కోట సామాజిక ఆసుత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరంలోని మహారాజా ఆస్పత్రిలో చేర్చారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖలోని కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తల్లి పార్వతి కారుణ్య నియామకంపై కొత్తవలసలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాన్ ఢీకొని యువకుడి మృతిపార్వతీపురం రూరల్: మండలంలోని రావికోన పంచాయతీ రంగాలగుడ గ్రామంలో వివాహానికి హాజరైన ఒడిశాకు చెందిన ముగ్గురు యువకుల్లో ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి. పెళ్లికి వెళ్లిన యువకులు ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా రంగాలగూడ గ్రామం మలుపు వద్ద ఒడిశా నుంచి ఎదురుగా వస్తున్న పౌల్ట్రీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న యువకులు రోడ్డుపై పడిపోగా తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు హుటాహుటిన పార్వతీపురం కేంద్రాస్పత్రికి 108 సాయంతో తరలించగా మార్గమధ్యంలో కండ్రిక నారు అనే వ్యక్తి మృతిచెందాడు. మరో ఇద్దరు యువకులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురి యువకులను ఒడిశాలోని అలమండ పంచాయతీ జగ్గుగూడ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజేతల స్ఫూర్తితో ముందుకు సాగాలి
విజయనగరం గంటస్తంభం: సమాజంలో నేటితరం విద్యార్థులకు అనేక సవాళ్లు ఉన్నప్పటికీ లక్ష్యసాధనకు కసిగా కృషి చేయాలని విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి మజ్జి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం జామి మండలంలోని అట్టాడ గ్రామంలో గల బీఎస్ఆర్ ఆశ్రమంలో జిల్లా పౌరవేదిక, ఎన్వీఎన్ బడ్ల్ బ్యాంక్ సంయుక్తంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో సత్తా చాటిన విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు నిరంతరం జాతీయ, అంతర్జాతీయ విజేతల జీవిత ఘట్టాలు చదవాలని వారినుంచి స్ఫూర్తి పొందాలని గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు సాధించిన విజయాలను చూసి చదువు పట్ల ఆసక్తి ఉన్నవారికి ఉత్సాహం కలుగుతుందన్నారు. విశ్రాంత చీఫ్ బ్యాంకింగ్ అధికారి పిడకల ప్రభాకరరావు మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభను చూపిన విద్యార్థులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ చాలముఖ్యమని పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా ఆరాటపడుతుంటారనే విషయాన్ని విద్యార్దులు మరిచిపోకూడదని హితవు పలికారు. పాఠశాలల వారీగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, ఎన్వీఎస్ బ్లడ్ బ్యాంక్ అధినేత తాడేపల్లి నాగేశ్వరరావు, తుమ్మగంటి రాంమోహన్రావు, ఇప్పలవలస గోపాలరావు, ఆశ్రమం నిర్వాహకులు భీశెట్టి శారద, ఆడారి హరిత సాయి తదితరులు పాల్గొన్నారు. సైనిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి మజ్జి కృష్ణారావు టెన్త్లో ప్రతిభ కనబరిచిన ఆశ్రమ విద్యార్ధులకు అభినందన -
బావిలో పడి మతిస్థిమితంలేని మహిళ మృతి
రాజాం సిటీ: కుమారుడు మృతిచెందడంతో మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ నేలబావిలో పడి మృతిచెందింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా ఉయ్యురుకు చెందిన పోతిరెడ్డి కుమారి (45) ఏడాది క్రితం రాజాం వచ్చి గాయత్రికాలనీలో నివాసం ఉంటోంది, ఆమె రెండో కుమారుడు నరేంద్ర నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె అప్పటినుంచి మానసికంగా ఇబ్బందులు పడి మతిస్థిమితం కోల్పోయి అనారోగ్యం పాలైంది. దీంతో కుటుంబసభ్యులు పలు ఆస్పత్రులకు తీసుకువెళ్లి వైద్యసేవలు అందించారు. అయినప్పటికీ అప్పుడప్పుడు బయటకు వెళ్లిపోవడం కుటుంబసభ్యులు వెతికి తీసుకురావడం పరిపాటిగా మారింది. నాలుగు రోజుల క్రితం తన పెద్దకుమారుడు సాయితేజ రాగోలు జెమ్స్కు తీసుకువెళ్లి చికిత్స అనంతరం మృతురాలి తమ్ముడైన తెలగవీధిలో నివాసం ఉంటున్న కొనిశెట్టి ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద ఉంచారు. ఈ నెల 20వ తేదీ రాత్రి ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లిపోయిన విషయాన్ని బుధవారం కుటుంబ సభ్యులు తెలుసుకుని అన్ని ప్రాంతాల్లో వెతికారు. తెలగవీధి శ్మశానవాటిక వెనుకభాగంలోని నేలబావిలో ఆమె మృతదేహం గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేక బావిలోపడి మృతిచెందినట్లు మృతురాలి కుమారుడు సాయితేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వై.రవికిరణ్ తెలిపారు. -
యోగాతో ఆరోగ్యకర జీవనం
విజయనగరం: యోగాతో ఆరోగ్యకర జీవనం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. యోగాంధ్ర సాధన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన నెలరోజుల యోగాభ్యాసన కార్యక్రమానికి రాజీవ్ క్రీడా మైదానంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, జేసీ ఎస్.సేతుమాధవన్తో కలిసి బుధ వారం శ్రీకారం చుట్టారు. యోగా శిక్షకుల ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన సంస్కృతిలో యోగా ఒక భాగమని, దీనిని అందరూ అభ్యసించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి విశాఖపట్నానికి వస్తుండడం సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరితో యోగాసనాలను అభ్యసన చేయించే ఉద్దేశంతో నెల రోజులపాటు కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యమని, ఆరోగ్య సాధనకు యోగా ఒక చక్కని మార్గమన్నారు. రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల నియంత్రణకు యోగా దోహదపడుతుందని చెప్పారు. జేసీ ఎస్.సేతు మాధవన్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొదటి వారం జిల్లా స్థాయిలో, రెండో వారం మండల స్థాయిలో అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు. యోగా ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవల అరకులో నిర్వహించిన మహా సూర్యవందనంలో జిల్లా నుంచి పాల్గొన్నవారికి కలెక్టర్ చేతులమీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, డీఎస్డీఓ ఎస్.వెంకటేశ్వరరావు, ఆయుష్ వైద్యాధికారులు వరప్రసాద్, ఆనందరావు, స్వప్నచైతన్య, పలువురు జిల్లా అధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు, వివిధ సంస్థలు, అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జీవనోపాధి పోతుంది
ప్రభుత్వ నిర్ణయంతో రేషన్ సరుకులను అవినీతికి తావులేకుండా ఇంటింటికీ వెళ్లి అందిస్తున్న ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల జీవనోపాధి పోతుంది. నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేయడం తగదు. పునరాలోచించాలి. – ఎస్ కృష్ణ, ఎండీయూ వాహన ఆపరేటర్ల సంఘం మండలాధ్యక్షుడు, రొంపల్లి రోడ్డున పడతాం.. ఎండీయూ వాహనాల్లో రేషన్ సరుకులు సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నాం. పేదలకు రేషన్ సరుకులు ఇస్తుంటే సంతోషంగా ఉంది. బండి ద్వారా నెలకు వచ్చిన రూ.10 వేలు ఆదాయమే కుటుంబానికి ఆధారం. మా బతుకును రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు. – బి.గణేష్, ఎండీయూ వాహన ఆపరేటర్, కొండకెంగువగిరిజనులకు కష్టాలు తప్పవు గతంలో రేషన్ సరుకులకు సుమారు 4 కిలోమీటర్లు మేర నడుచుకుంటూ వెళ్లేవారు. ఎండీయూ వాహనాలతో నడక కష్టాలు తప్పాయి. గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. ఈ వాహనాలను రద్దు చేయడం వల్ల రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు 2019 ముందు కష్టాలే ఎదురవుతాయి. – ఎస్.కుమారి, రావివలస పంచాయతీ సర్పంచ్ -
ఆర్థిక వ్యవస్థల రూపకల్పనలో శాసీ్త్రయ ఆవిష్కరణలు కీలకం
విజయనగరం అర్బన్: ఆధునిక సమాజం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను రూపొందించడంలో శాసీ్త్రయ ఆవిష్కరణలు కీలక భూమిక పోషిస్తున్నాయని బెంగళూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ (ఎన్ఐఏఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అన్షుమాన్ బెహరా అన్నారు. విజయనగరం గాజులరేగ సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ‘శాసీ్త్రయ ఆవిష్కరణల సామాజిక – ఆర్థిక ప్రభావాలు’ అనే అంశంపై బుధవారం జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక పరివర్తన మరియు ప్రజా విధానాలపై శాసీ్త్రయ పురోగతి, ఆర్థిక అభివృద్ధి అంశాలు ప్రభావం చూపుతాయని అన్నారు. అనంతరం ఎన్ఐఏఎస్, సీతం కళాశాల మధ్య భవష్యత్ విద్య, పరిశోధన సహకారాన్ని పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఎన్ఐఏఎస్ అసోసియేట్ ప్రొఫెసర్ అన్షుమాన్ బెహరా -
భద్రతే లక్ష్యంగా విధుల నిర్వహణ
● ఏఐఎస్ఎమ్ఏ జనరల్ సెక్రటరీ నారాయణరావు విజయనగరం టౌన్: భద్రతే లక్ష్యంగా ఈస్ట్కోస్ట్ రైల్వే పని చేస్తోందని ఈస్ట్కోస్ట్ రైల్వే ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎమ్ఏ) జనరల్ సెక్రటరీ పి.నారాయణరావు పేర్కొన్నారు. స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్లో డివిజనల్ సేఫ్టీ సెమినార్తో పాటూ ది ఆటోమెటిక్ బ్లాక్ సిస్టమ్పై అవగాహన, నూతన కార్యవర్గ నిర్ణయాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మరింత ఉన్నతమైన భద్రతాపరమైన విధులను నిర్వహించేందుకు ఎస్ఎమ్ఆర్లకు అప్డేట్స్ను ఇస్తూ, ప్రాధాన్యత కలిగిన అంశాలను ప్రస్తావించేందుకే సమావేశమయ్యామన్నారు. ఇప్పటివరకూ విజయనగరం, కొత్తవలసలో ఉన్న ఆటోమెటిక్ ట్రైన్ సిస్టమ్ పద్ధతిని త్వరలో విజయనగరం, రాయగడ ఆర్వీ లైన్, విజయనగరం పలాస మెయిన్ లైన్లో కూడా అమలు చేయబోతున్న తరుణంలో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఎమ్ఆర్లకు అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. స్టేషన్ వర్కింగ్ రూల్లో వస్తున్న అప్డేట్స్పై ఉన్న సందేహాలను నివృత్తి చేశామని చెప్పారు. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలపై నేరుగా స్టేషన్ మాస్టర్లనే ప్రధాన నిందితులుగా చేర్చే వైఖరి వస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 40 మంది ఎస్ఎమ్ఆర్లు పాల్గొని ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారన్నారు. వాటన్నంటినీ డివిజనల్ చీఫ్ అడ్వయిజర్లు, కార్యదర్శులు పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో డివిజనల్ ఛీప్ అడ్వయిజర్ పిఎన్.మూర్తి, డివిజనల్ అధ్యక్షుడు ఎస్ఎన్.అహ్మద్, అధిక సంఖ్యలో స్టేషన్ మాస్టర్లు పాల్గొన్నారు. -
విస్తుపోయే కోణాలు
ఉగ్ర కుట్రలో డీసీసీబీలో బ్యాంకు ఖాతా.. పెద్ద ఎత్తున నగదు విజయనగరంలోని డీసీసీబీ బ్యాంకులో సిరాజ్ పేరిట బ్యాంకు ఖాతా ఉన్నట్లు తెలిసింది. ఇందులో రూ.45 లక్షలకుపైగా ఉన్నట్లు సమాచారం. ఇది ఒక ఖాతాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ.22 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని భావిస్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా ఇదే బ్యాంకులో ఖాతాలతోపాటు.. లాకర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో కుటుంబ సభ్యుల పేరిట ఏమైనా ఖాతాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం అందరి ఖాతాల్లో రూ.70 లక్షలకుపైగా ఉండొచ్చని భావిస్తున్నారు. సిరాజ్ వ్యవహారం జరుగుతుండగానే.. తండ్రి రహమాన్ నగరంలోని డీసీసీబీ బ్యాంకుకు వెళ్లారు. లాకర్లు తెరిచేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అప్పటికే రెండో పట్టణ పోలీసుల ముందస్తు సూచనతో బ్యాంకు అధికారులు అప్రమత్తమై తెరిచేందుకు వీలులేదని చెప్పినట్లు సమాచారం. సిరాజ్ సెల్ఫోన్, ట్యాబ్లను ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మొత్తం ఖాతాలను ఫ్రీజ్ చేశారు. విజయనగరం క్రైమ్: ఉగ్రవాది మూలాలున్న సిరాజ్ కేసులో తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రావడం.. అందులోని అంశాలు, నిందితుడు సిరాజ్ ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. అవసరమైతే ఆత్మాహుతికి అయినా సిద్ధమే.. ఆబాద్ వీధికి చెందిన సిరాజ్ బీటెక్లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొత్తవలస వద్ద కంటకాపల్లిలోని శారద కంపెనీలో కొన్నాళ్లు పనిచేశాడు. తర్వాత హైదరాబాద్లో ఉంటూ, ఎస్సై ఎంపికల కోసం రెండుసార్లు ప్రయత్నం చేశాడు. గ్రూప్–2 శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. హైదరాబాద్లో ఉంటుండగానే.. సమీర్, వరంగల్కు చెందిన ఫర్వాన్ మొహిద్దీన్, ఉత్తరప్రదేశ్కు చెందిన బదర్తో పరిచయం ఏర్పడింది. ఖిలావత్, జిహాదీ విషయాలపై తరచూ చర్చించుకునే వారని సమాచారం. ముస్లింలు అన్యాయానికి గురవుతున్నారన్న భావనకు వచ్చారు. ముిస్లిమేతరులు.. ముస్లిం మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసగిస్తున్నారని భావించారు. అటువంటి మోసాల నుంచి తమ మహిళలను రక్షించుకునేందుకు ‘ఏహెచ్ఐఎం’ అనే పేరుతో గ్రూపులు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి, యువతను మతోన్మాదంవైపు ప్రేరేపించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలోనే మరికొంతమందితో పరిచయం ఏర్పడింది. సౌదీలో ఉంటున్న బీహార్కు చెందిన అబు ముసబ్ అనే వ్యక్తి సూచనలను అమలు చేయడం ప్రారంభించారు. ముస్లింయేతరులపై దాడులకు తక్కువ ఖర్చుతో రసాయన పదార్థాలు ఉపయోగించి ఐఈడీలు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒమన్లో ఉంటున్న హైదరాబాద్కు చెందిన ఇమ్రాన్ అక్రం అనే వ్యక్తి ఎక్స్ప్లోజివ్స్ తయారీకి రూ.3 వేలు పంపాడు. ఆన్లైన్ సైట్లలో కొంత.. మరికొంత పేలుడు పదార్థాలను విజయనగరంలోని పలు దుకాణాల వద్ద కొనుగోలు చేశాడు. మొత్తం కలిపి, ఐఈడీ తయారు చేసి విజయనగరంలోనే జన సంచారం ఉన్న ప్రాంతంలో పేలుళ్లకు పథక రచన చేశాడు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని మూడులాంతర్లు, వనంగుడి పైడితల్లి అమ్మవారి ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, దాసన్నపేట రింగురోడ్డు ప్రాంతాల్లో బాంబు బ్లాస్ట్లకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. తద్వారా నగర ప్రజలు.. ప్రధానంగా ముస్లిమేతరుల్లో భయాందోళనలు సృష్టించే ప్రణాళికగా సమాచారం. బాంబుల తయారీపై ఆన్లైన్లో తరచూ వెదకడం.. ఇంటిలిజెన్స్ దృష్టిలో పడింది. జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగానికి అయినా సిద్ధపడాలని సిరాజ్ నిర్ణయించుకోవడం గమనార్హం. ముస్లిం యేతరులే టార్గెట్.. విజయనగరం ఆబాద్వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్పై బాంబు ఎక్స్ప్లోజివ్స్ 113(1), 147, 148, 149, 152, బీఎఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో బాంబు పేలుళ్ల ప్రణాళికలకు సంబంధించి, ముస్లిమేతరులపై సిరాజ్కు ఉన్న ద్వేషం తదితర అంశాలపై స్వయంగా వెల్లడించిన అంశాలను ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. సిరాజ్ బృందం ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేతలు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిరాజ్, సమీర్లు సిగ్నల్ యాప్ ద్వారా చేసుకున్న చాటింగ్ బయటకు వచ్చింది. పేలుడు పదార్థాల ల్యాబ్ ఏర్పాటుపై చర్చించుకున్నారు. రాకెట్ లాంచర్ల తయారీనీ తెలుసుకున్నారు. మసీదులు, ముస్లింల ఇళ్లపైకి జేసీబీలు వస్తే రాకెట్ లాంచర్లతో పేల్చేద్దామని ప్రణాళిక వేసుకున్నారు. తమకు డబ్బులు వస్తే ఇలాంటి స్కూల్ పెట్టాలన్న కోరిక ఉన్నట్లు చాటింగ్ ద్వారా చర్చించుకున్నారు. సిరాజ్ కేసులో తవ్వేకొద్దీ వెలుగులోకి కొత్త అంశాలు ఆత్మాహుతికై నా సిద్ధం.. విజయనగరంలోని డీసీసీబీలో బ్యాంకు ఖాతా పెద్ద ఎత్తున నగదు.. ఫ్రీజ్ చేసిన అధికారులు విజయనగరంలోని పలుచోట్ల పేలుళ్లకు కుట్ర -
వివరాల నమోదు తప్పనిసరి
విజయనగరం ఫోర్ట్: స్కానింగ్ కోసం ల్యాబ్లకు వచ్చే గర్భిణులు ఎవరి రిఫరెన్స్తో వచ్చారో కచ్చితంగా రికార్డులో నమోదుచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో ఆర్ఎంపీ (సంచి వైద్యులు) వైద్యులు రిఫర్ చేసిన కేసులకు స్కాన్ చేయొద్దన్నారు. నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిపై పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏజెన్సీలో జ్వరాల తీవ్రతపై దృష్టి పెట్టాలి ● గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి ● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు విజయనగరం అర్బన్: ఏజెన్సీలో గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్నారని, మెరుగైన వైద్యం అందేలా అధికా ర యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజి శంకరరావు కోరారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందన్న పత్రికా కథనాలపై ఆయన స్పందించారు. మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, సాలూరు, కురుపాం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందని, వైద్య శిబిరాలు విరివిగా నిర్వహించేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ముగిసిన సాఫ్ట్స్కిల్స్ శిక్షణ విజయనగరం అర్బన్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించిన 16 వారాల సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రోగ్రాం కో ఆర్డినేటర్, సెంచూరియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.ఎస్.వి.రమణారావు మాట్లాడుతూ ఇండస్ట్రీ 4.0 డ్రోన్లు, స్టార్టప్లు, ఉపాధి అవకాశాలు వంటి ఆధునిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం విద్యార్థులకు శిక్షణ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి, డాక్టర్ రంజన్ కుమార్ బెహరా, ఎ.కె.జెనా, ఉపాధ్యాయులు రమణాచారి పాల్గొన్నారు. కలెక్టర్ చొరవతో సీఎస్ఆర్ నిధులు విజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చొరవతో సీఎస్ఆర్ నిధులు మంజూరయ్యాయి. విద్య, వైద్య రంగాలకు నిధు లు కేటాయించారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు మెడికల్ కళాశాలలో వైద్యపరికరాల కొనుగోలుకు రూ.కోటి మంజూరు చేశారు. పూసపాటి రేగ మండలం నడిపల్లి, చింతపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల కోసం రూ.54.50 లక్షలు కేటాయించారు. భారత్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్స్ కోసం 37 ప్రభుత్వ పాఠశాలలకు రూ.కోటి, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కోసం రూ.14.50 లక్షలు, గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ కోసం రూ.7.16 లక్షలను మంజూరు చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థ రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్కు జనరేటర్ కోసం రూ.11.34 లక్షలు మంజూరు చేసింది. బదిర బాలికల కోసం 45 బంకర్ బెడ్స్, 4 ఆర్ఓ ప్లాంట్లను మంజూరు చేసింది. నెల్లిమర్ల, గుర్ల, మెరకముడిదాం మండలాల్లోని 40 చెరువుల అభివృద్ధికి యాక్సిస్ బ్యాంక్ రూ.15 కోట్లు సీఎస్ఆర్ నిధులు మంజూరు చేసింది. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. చదురుగుడిలో చండీయాగం మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఆలయ ప్రాంగణంలో మూడో మంగళవారాన్ని పురస్కరించుకుని వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో చండీయాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు శంబరి కృష్ణ యాగాన్ని నిర్వహించి, యాగవిశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి తీర్ధప్రసాదాలను అందజేశారు. -
కళామతల్లి ముద్దుబిడ్డను ఆశీర్వదించండి
విజయనగరం టౌన్: కళలకు కాణాచిగా పేరొందిన విద్యలనగరం విజయనగరం అమ్ములపొది నుంచి జాలువారిన కళామతల్లి ముద్దుబిడ్డ దియారాజ్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఫ్రైడే చిత్ర నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్ కోరారు. శ్రీ గణేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాణమవుతున్న ఫ్రైడే చిత్రం యూనిట్ మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న జీఎస్ఆర్ గ్రాండ్లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లాకు చెందిన హీరోయిన్ దియారాజ్తో పాటు హీరో, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల అభిమానుల మనసు దోచుకునేలా ఫ్రైడే చిత్రం రూపకల్పన ఈశ్వర్బాబు ధూళిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోందన్నారు. హీరోయిన్ దియారాజ్ మాట్లాడుతూ జిల్లావాసులందరూ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందన్నారు. అనంతరం గురానా చారిటబుల్ ట్రస్ట్ అధినేత, జనసేన సీనియర్ నాయకుడు గురాన అయ్యలు దియారాజ్ను సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో ఆదాడ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరి ప్రాణాలు నిలిపిన ప్రభుత్వ వైద్యులు
● కోమా స్థితిలో సర్వజన ఆస్పత్రిలో చేరిన రోగులువిజయనగరం ఫోర్ట్: ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు రోగుల ప్రాణాలను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు కాపాడారు. కోమా స్థితిలో ఆస్పత్రిలో చేరిన రోగులు ప్రస్తుతం కోలుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, జనరల్ మెడిసిన్ విబాగం హెచ్ఓడీ డాక్టర్ సుదర్శి అందించిన వివరాల ప్రకారం..పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టి గ్రామానికి చెందిన వెంకట ఈశ్వరరావు అనే బాలుడు సెరిబ్రల్ మలేరియా, న్యుమోనియాతో కోమాస్థితిలో ఈనెల5నప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. బాలుడు మూగ, చెవిటి దివ్యాంగుడు. బాలుడిని ఆస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకున్నాడు. ఆస్పత్రిలో చేరినప్పుడు ఆహారం కూడా తీసుకోలేకపోయేవాడు. అలాగే బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన లక్కిడాపు అప్పారావు నెలరోజుల పాటు జ్వరంతో బాధపడడంతో సోడియం లెవెల్స్ తగ్గిపోయి కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఈనెల 5వతేదీన చేర్చారు. ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా బ్రెయిన్ టీబీ అని తేలింది. ప్రస్తుతం ఆ వ్యక్తి కూడా కోలుకున్నాడు. వారిద్దరికీ జనరల్ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బోళం పద్మావతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మలత, హెచ్ఓడీ డాక్టర్ సుదర్శిలు వైద్యం అందించారు. -
హనుమాన్ జయంతికి సర్వం సిద్ధం
విజయనగరం టౌన్: వైశాఖ బహుళ దశమి ఈ నెల 22న గురువారం నిర్వహించే హనుమాన్ జయంతికి సర్వం సిద్ధం చేసినట్లు ప్రాజెక్ట్ చైర్మన్ మడిపల్లి వెంకటాచలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో మంగళవారం ఉత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, లక్ష తమలపాకులతో అర్చనలు ఉంటాయన్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ జీఎస్.గుప్త మాట్లాడుతూ అదేరోజు సాయంత్రం చిన్నారులతో సిందూరార్చన, 27 రకాల పిండివంటలతో స్వామికి నైవేద్యం సమర్పిస్తామన్నారు. దేవాలయం కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ భక్తులకు మంచినీరు మజ్జిగ, మధ్యాహ్నం 7వేల మందికి అన్నప్రసాద వితరణ ఏర్పాటుచేశామని తెలిపారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో కలగర్ల నారాయణరావు, రామకృష్ణ, కేవీ. శంకరరావు, నాదం తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణం వద్ద రగడ
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ మద్యం దుకాణంలో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మధ్యాన్ని అమ్ముతున్నారంటూ పలువురు మద్యం ప్రియులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. వల్లూరు గ్రామానికి చెందిన పంచాది శ్రీనివాసరావు, గోవింద, తాతినాయుడు, తదితరులు మద్యం కొనేందుకు షాపుకు వెళ్లగా రూ.660 ఖరీదు గల రెండు బాటిల్స్ మద్యాన్ని రూ.700కు విక్రయించారు. బాటిల్స్పై అదనంగా వసూలు చేస్తుండడంతో మరి కొంతమందితో కలిసి షాపు నిర్వాహకులను కొనుగోలుదారులు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే స్టిక్కర్ మారలేదని షాపులోని వ్యక్తి సమాధానం ఇచ్చాడన్నారు. ఎకై ్సజ్ సీఐకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. చీప్ లిక్కర్ బాటిల్ నుంచి పెద్ద బ్రాండ్ల వరకు ఇదే దందా కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులైనా స్పందించి బాటిల్పై ఉన్న ధరకే మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సెన్సార్లు, ఏఐ ద్వారా మానవ కార్యకలాపాల గుర్తింపు
● లెండిలో సిల్చూర్ నిట్ నిపుణుడు డాక్టర్ బాదల్ సోనిడెంకాడ: అల్గారిథమ్ను ఉపయోగించి మానవ కార్యకలాపాల గుర్తింపు‘ అనే అంశంపై లెండి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం ఒక రోజు సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా అసోం లోని సిల్చూర్లో గల నిట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాదల్ సోని హాజరై కార్యక్రమంపై ప్రసంగించారు. ‘సెన్సార్ డేటా, స్మార్ట్ లెర్నింగ్ అధునాతన సెన్సార్ టెక్నాలజీలు, మెషిన్ లెర్నింగ్ విధానాల ద్వారా కార్యాచరణ గుర్తింపుపై దృష్టి సారించాలని సూచించారు. స్మార్ట్ లెర్నింగ్ అల్గారిథమ్తో సెన్సార్ డేటాను సమగ్రపరచడం పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఇంటర్ డిసిప్లినరీ రంగం ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్ హోమ్లు, భద్రత, మానవ–కంప్యూటర్ పరస్పర చర్య, మానవ ప్రతిచర్యలపై ఏఐ, నిజంగా తెలివైన వాతావరణాన్ని సృష్టించడానికి వీలు కల్పించడం వంటి కీలక రంగాల్లో ఎలా విప్లవాత్మక మార్పులు తెస్తోందో ఆయన వివరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఇటువంటి ఈవెంట్ను నిర్వహించడంలో ఇనిన్స్టిట్యూట్ ప్రయత్నాలను ప్రశంసిస్తూ, విద్యార్థులు, పరిశోధకులు ఈ ఆశాజనకమైన టెక్నాలజీ రంగాన్ని అన్వేషించడం, ఆవిష్కరణలు చేయడం ద్వారా చురుగ్గా సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అకడమిక్స్ డాక్టర్ వి.అంజి రెడ్డి, డీన్న్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: మూడేళ్ల క్రితం విజయనగరం టుటౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి ఉమామహేశ్వరరావుకు (20) 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు వెల్లడించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే..విజయనగరంలో 9వతరగతి చదువుతున్న బాలికతో శ్రీకాకుళం జిల్లా గార మండలం దీపావళి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు ఇన్స్ర్ట్రాగామ్లో పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి బాలికను లోబరుచుకుని శ్రీకాకుళం తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై 2023లో సదరు బాలిక తల్లిదండ్రులు విజయనగరం టుటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ లక్ష్మణరావు పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే అప్పటి విజయనగరం దిశ మహిళా పోలీస్స్టేషన్ సీఐ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడు ఉమామహేశ్వరరావుపై చేసిన నేరారోపణలు రుజువు కావడంతో పోక్సో జడ్జి పై విధంగా తీర్పు ఇచ్చినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి రూ.2లక్షలు పరిహారంగా ఇప్పించాలని జడ్జి తీర్పు వెల్లడించారన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ప్రాసిక్యూటర్ మెట్ట ఖజానారావు వాదనలు వినిపించగా కోర్టు కానిస్టేబుల్ లక్ష్మి, సీఎంఎస్ హెచ్సీ రామకృష్ణ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బందిని, తమ శాఖ సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. -
కదం తొక్కిన కార్మిక సంఘాలు
విజయనగరం గంటస్తంభం: కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి కె.సురేష్, ఏఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు బెహరా శంకర్రావు, ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు ఎం.లక్ష్మి మాట్లాడుతూ..లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. మూతపడిన పరిశ్రమలను తెరిపించాలి. ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్మిక, రైతుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఆపరేషన్ కాగార్ పేరుతో ఆదివాసీలపై దాడులు చేస్తూ అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే విధంగా వారికి కొమ్ము కాసేలా వ్యవహరిస్తోందన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను నేడు మారుస్తూ కార్మికులకు సంఘం పెట్టుకునే, సమ్మె చేసే హక్కు లేకుండా కట్టు బానిసలుగా చేసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితుల్లో జూలై 9న జరిగే జాతీయ సమ్మెను జయపద్రం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు టివీ.రమణ, నగర కార్యదర్శి బి.రమణ, ఆర్.శంకర్రావు, సుధీర్, శ్రీను, అప్పలరాజు, గిరి ప్రసాద్, బి.గీత, అప్పల సూరి, వెంకటలక్ష్మి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నా -
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల ఆందోళన
విజయనగరం ఫోర్ట్: తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల డ్రైవర్లకు నెలకు రూ.18,500 జీతం చెల్లించాలని ఆ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.రమణ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజమాని వాటా పీఎఫ్, ఈఎస్ఐ యాజమాన్యమే చెల్లించేలా చూడాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వీక్లీ ఆఫ్లు, పండగ, జాతీయ సెలవులు అమలు చేయాలని కోరారు. విధి నిర్వహణకు అవసరమైన సెల్ఫోన్లు ఇచ్చి రీచార్జ్ చేయించాలన్నారు. తల్లీబిడ్డ సేవలకు అదనంగా చేస్తున్న హైరిస్క్ గర్భిణులు, తీవ్ర రక్తహీనత ఉన్న గర్భిణుల సేవలకు అదనపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా, ఇన్సురెన్స్ సౌకర్యాలు కల్పించాలన్నా రు. గతంలో ఉన్న విధంగా రూ.7 లక్షల ఎక్స్గ్రేషి యా, దహన సంస్కారాలకు ఖర్చులు చెల్లించాలన్నారు. వాహనాల సంఖ్యను బట్టి అదనపు, బఫర్ సిబ్బందిని నియమించాలన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, ట్రెజరర్ ఎం.గణేష్ ఇతర డ్రైవర్లు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల నిలుపుదలే లక్ష్యంగా పరిపాలన సాగిస్తోంది. ఈ కోవలోకే ఆరోగ్య ఆసరాను కూడా చేర్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఆరోగ్య ఆసరా కింద రూ.5
విజయనగరం ఫోర్ట్: ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోగ్య ఆసరా కింద రూ.5వేల చొప్పున సాయం అందించేది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్న తేడా లేకుండా ఎక్కడ ప్రసవించినా సాయం అందేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసింది. ఫలితంగా ఆరోగ్య ఆసరా కింద అందించే తల్లుల సాయం నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఏటా వేల మంది తల్లులు ఆరోగ్య ఆసరా కింద లబ్ధి పొందేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2024 – 25లో ఇలా.. 2024 ఏప్రిల్ నెల నుంచి 2025 మార్చి మధ్యలో జిల్లాలో 20 వేల 17 మంది మహిళలు ప్రసవించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8102 మంది ప్రసవించగా ప్రైవేటు ఆసుపత్రుల్లో 11,915 మంది మహిళలు ప్రసవించారు. ఆరోగ్య ఆసరా కింద వీరికి రూ.5వేలు చొప్పున రూ.10కోట్లు చెల్లించాలి. అయితే కూటమి ప్రభుత్వం దీనికి చెల్లుచీటీ పలకడంతో ఆ సాయం అందలేదు. ఎన్టీఆర్ బేబి కిట్టు ఇస్తారట.. ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబి కిట్టు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆరోగ్య ఆసరా బదులు ఇది ఇచ్చేందుకు నిర్ణయించడంతో తల్లులకు చాలా వరకు ఆర్థిక ఆసరా పోయినట్టే. ఎందుకంటే కిట్టు విలువ రూ.1410 మాత్రమే ఉంటుందని సమాచారం. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకే ఇచ్చేందుకు నిర్ణయించినట్టు భోగట్టా. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవించే వారికి ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. వాస్తవంగా గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రసవానికి ఆసక్తి చూపుతున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ ప్రసవించినా ఆరోగ్య ఆసరా కింద సాయం అందించేవారు. నియమ నిబంధనలు రాలేదు.. ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ప్రభుత్వం అందిస్తామన్న ఎన్టీఆర్ బేబి కిట్లుకు సంబంధించి ఇంకా నియమ నిబంధనలు రాలేదు. వస్తే పరిశీలించి అమలు చేస్తాం. – డాక్టర్ జీవనరాణి, డీఎంహెచ్వో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్య ఆసరా కింద ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు ఇచ్చే రూ.5వేలు ఎంతో భరోసాగా ఉండేది. ప్రసవం తరువాత బాలింతల పౌష్టికాహారానికి ఇతోధికంగా సాయపడేది. దీనికి ఆరోగ్య ఆసరా ఎంతో ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఆ సాయం అందకపోవడంతో పౌష్టికాహార లోపంతో తల్లుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి. బేబి కిట్టుతో బిడ్డకు తప్ప తల్లికి ఒరిగే ప్రయోజనం శూన్యం. ఇదంతా ఆలోచించకుండా కేవలం గత ప్రభుత్వ పథకాల నిలుపుదలే లక్ష్యంగా పరిపాలిస్తున్న కూటమి పాలకులు ఆ దిశగా ఆలోచిస్తున్నారే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు బాలింతల నుంచి వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రసవించిన ప్రతీ తల్లికి ఆరోగ్య ఆసరా కింద రూ.5వేల సాయం కూటమి సర్కార్లో మంగళం రూ.1410 విలువ చేసే బేబి కిట్టు ఇస్తారట! అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికే.. జిల్లాలో ఏడాదికి 20 వేల వరకు ప్రసవాలు వీటిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8 వేలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 12 వేల వరకు ప్రసవాలు -
సీరాజ్ కాల్ డేటాపై ఎన్ఐఏ ఆరా!
విజయనగరం క్రైమ్: విజయనగరం ఆబాద్ వీధికి చెందిన సీరాజ్ ఉర్ రెహ్మన్ ఉగ్ర మూలాలపై ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు రెండో రోజు మంగళవారం కూడా రెండో పట్టణ పోలీస్స్టేషన్లో మధ్యాహ్నం వరకు మకాం వేశారు. ఈ సమయంలో సీరాజ్ ఉపయోగించిన ఫోన్ ఆధారంగా కాల్ డేటాపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిసింది. తన ఫోన్లో ఐదుగురు గ్రూపు సభ్యులతో కలిసి ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ చాటింగ్పై ఆరా తీసినట్టు సమాచారం. ఎస్ఐ శిక్షణ తీసుకునే సమయంలో హైదరాబాద్లో సమ్మీర్తో ఏర్పాటైన సంబంధాల నుంచి నేటి వరకు ఆయన కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అసలు ఆయనకు ఉగ్ర మూలాలకు ఎక్కడ బీజం పడిందన్న దానిపై లోతైన సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. ఉగ్ర వాదులతో సంబంధాలు ఎక్కడ ఏర్పడ్డాయి? ఎవరెవరితో ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి... పేలుళ్లకు కుట్ర ఎక్కడ పన్నారు... ఎవరెవరితో దీనికి స్కెచ్ వేశారన్న దానిపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇటు విజయనగరం, అటు హైదరాబాద్లో కలసి పేలుళ్లకు సమ్మీర్తో కలిసి పన్నిన కుట్రకు ఎక్కడ బీజం పడిందనే కోణంతో లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది. విజయనగరంలో పలు చోట్ల పేలుళ్లకు స్కెచ్ వేసిన సీరాజ్ ఏఏ ప్రాంతాల్లో వీటికి పథక రచన చేశాడన్న దానిపై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు విచారణ మరింత వేగవంతం చేశారు. రెండో రోజు దర్యాప్తు ఉగ్ర మూలాలపై ప్రత్యేక దృష్టి -
డీఎంహెచ్వో ఆకస్మిక పరిశీలన
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలం బొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో జీవనరాణి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఓపీ, ఐపీలను పరిశీలించి శత శాతం ఈహెచ్ఆర్ అబా నంబరుతో ఆన్లైన్ చేయా లని సూచించారు. ప్రతీ ఓపీకి అవసరమైన పరీక్షను నిర్వహించాలన్నారు. ల్యాబ్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. హెచ్బీ టెస్ట్ను మెరుగుపరచాలని సూచించారు. ఐపీ వార్డును పరిశీలించి చిన్న పిల్లల వ్యాక్సిన్ను పరిశీలించారు. ఓపెన్ ఓవెల్ పాలసీని అనుసరిస్తున్నారా... లేదా.. అని వ్యాక్సిన్ను పరిశీలించారు. మెడికల్ స్టోర్లో బిన్ కార్డ్స్ను పరిశీలించారు. విటమిన్ ఏ సిరప్ తగిన మోతాదులో ఉందో.. లేదో పర్యవేక్షించారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని వైద్యాధికారి ఎం.అనిల్కుమార్, సిబ్బందికి సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రవల్లిక ప్రతిభ విజయనగరం టౌన్: పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆఫ్ దుబాయ్, పిరమిడ్ యోగా అండ్ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 18న నిర్వహించిన పోటీల్లో భారత్కు చెందిన సాయినాథ్ కళా కమిటీ, ఎస్కేఎస్ అకాడమీలు పాల్గొన్నాయి. జిల్లాకు చెందిన కోలక ప్రవల్లిక దుర్గాదేవీగా వివిధ భారతీయ నృత్య రీతులను ప్రదర్శించి మన్ననలు పొందారు. ఇండియన్ కాన్సులేట్కి చెందిన అరుజిత్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రవల్లికకు నృత్య యువ ప్రతిభ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు. ప్రవల్లికను పలువురు అభినందించారు. భూసర్వేపై తస్మాత్.. ● సర్వే శాఖ డీడీ కుమార్ పూసపాటిరేగ: భూసర్వేపై అప్రమత్తంగా వుండాలని సర్వే శాఖ డెప్యూటీ డైరెక్టర్ డిఎల్బిఎల్.కుమార్ అన్నారు. పూసపాటిరేగలో జరుగుతున్న సర్వేను మంగళవారం పరిశీలించారు. రోవర్తో సర్వే చేసినప్పుడు హద్దులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. బ్లాక్ల వారీగా సర్వే జరిగినప్పుడు వీఆర్వోలు, విలేజి సర్వేయర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పూసపాటిరేగ మండలం గోవిందపురంలో సర్వే పూర్తయిందని మండల సర్వేయర్ గణపతిరావు తెలియజేశారు. పూసపాటిరేగ గ్రామంలో 170 ఎకరాల వరకు సర్వే జరిగినట్టు చెప్పారు. అనంతరం తహసీల్దార్ గోవిందను కలిసి సర్వే జరుగుతున్న తీరు, ఏవైనా సమస్యలు వున్నాయా.. మొదలగు అంశాలను అడిగారు. ఆయనతో పాటు ఆర్ఎస్ డీటీ కల్యాణి, డీటీ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధురి ఉన్నారు. -
యోగాంధ్రను విజయవంతం చేయాలి : జేసీ
విజయనగరం అర్బన్: జూన్ 21న అంతార్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుంచే యోగాపై పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు జేసీ, యోగా జిల్లా నోడల్ అధికారి సేతు మాధవన్ తెలిపారు. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖలో పాల్గొంటారని, ఇది లైవ్ ద్వారా ప్రసారం జరుగుతుందని ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల అధికారులు, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జేసీ పలు సూచనలు చేశారు. ఈ నెల 21 నుంచి క్యాంపెయిన్ ప్రారంభం అవుతుందని యోగా చేయడంపై ప్రజలలో చైతన్యం కలిగించి, ప్రతి ఒక్కరూ యోగాభ్యసనంలో పాల్గొనేలా చేయాలని తెలిపారు. ముందుగా మండలానికి ఇద్దరేసి యోగా శిక్షకులను గుర్తించి వారి ద్వారా టీఓటీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, టీఓటీల ద్వారా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జూన్ 16 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. జూన్ 16న ఫ్యామిలీ యోగా పేరుతో 4 తరాల కుటుంబ సభ్యులంతా పాల్గొనేలా చూడాలని, 17న సీనియర్ సిటిజన్స్ కోసం స్పెషల్ యోగా కార్యక్రమాలు ఉంటాయని, 18, 19 తేదీలలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 21న ఉదయం 7 గంటలకు రాజీవ్ క్రీడా ప్రాంగణంలో కర్టెన్రైజర్ కార్యక్రమం జరుగుతుందని, విద్యార్థులు, యువత, మహిళలు, అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపారు. సందేహాలకు, సలహాల కోసం జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వరప్రసాద్ 9849167238 ఫోన్ నంబరు సంప్రదించాలని తెలిపారు. కాన్ఫరెన్స్లో డీఆర్డీఏ పీడీ కల్యాణచక్రవర్తి, ఆయుష్ వైద్యులు డాక్టర్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డీఈవో యు.మాణిక్యంనాయుడు, డీఎస్వో మధుసూధనరావు, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, డీఎస్డీవో మెప్మా పీడీ చట్టిరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పింఛన్ పెంచండి సారూ
● కలెక్టర్కు వేడుకోలు పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వంలో పింఛన్ దారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సోమవారం వస్తేచాలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు కలెక్టర్ కార్యాలయానికి నడవలేని పరిస్థితుల్లో కుటుంబసభ్యుల సహాయంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొంతమందికి అర్హత ఉన్నా పింఛన్ రావడం లేదని, మరికొంతమందికి 90శాతం దాటి వైకల్యం ఉన్నా కేవలం రూ.6వేలే పింఛన్ ఇస్తున్నారని, తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్కు వినతిపత్రాలు అందజేస్తున్నారు. స్టేట్లెవెల్ కరాటే చాంపియన్షిప్కు రాజాం విద్యార్థులురాజాం సిటీ: త్వరలో జరగనున్న స్టేట్లెవెల్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు రాజాంలోని శివసైన్యం కరాటే విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్ ఆర్.శివ సోమవారం తెలిపారు. ఈ నెల 18న విజయనగరంలోని రాజీవ్ ఇండోర్స్టేడియంలో జరిగిన పోటీల్లో కుమిటీ విభాగంలో వి.రిషిక (ప్రథమస్థానం), కాటా విభాగంలో వి.మోహిత్ (ద్వితీయ స్థానం), కె.మహేష్ (మూడో స్థానం)లో నిలిచి ఈ ఘనత సాధించారన్నారు. విద్యార్థుల ప్రతిభను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు. గిరిజనవర్సిటీలో ఆదివాసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి● ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు విజయనగరం అర్బన్: ఆదివాసీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రియ గిరిజన యూనివర్సిటీలో ఆదివాసీలకు అధికప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. గిరిజన యూనివర్సిటీలో ఆదివాసీలకు కేటాయించిన సీట్ల శాతం ఇతర యూనివర్సిటీల మాదిరిగానే 75 శాతం మాత్రమే ఉందన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ప్రధానంగా ఆదివాసీ అధ్యయనాలు, ఆదివాసీ కేంద్రిత అంశాలు, పరిశోధనల కోసం ఏర్పాటు చేశారని అందువల్ల ఆదివాసీలకు మరింత ఎక్కువ సీట్లను రిజర్వ్ చేయాలని లేఖలో కోరారు. ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్యచీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని శివరాం గ్రామానికి చెందిన కుమిలి భాస్కరరావు(27)అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు భాస్కరరావు గ్రామంలో డబ్బులు అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు అడగడంతో మనస్తాపం చెంది సోమవారం ఉదయం ఇంటిలో ఇనుపరాడ్డుకు బెడ్షీట్ను కట్టి ఉరివేసుకున్నాడు. ఈ మేరకు గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుకున్నది..అనుకున్నట్లే..!
● సర్వజన ఆస్పత్రిపై కూటమి సర్కార్ కుట్ర ● ఉన్న చోటే ఉంచే విధంగా మంత్రి శ్రీనివాస్ ఆదేశాలు ● వైద్యకళాశాల వద్దకు తరలించేందుకు నిరాకరణ ● వైద్య విద్యార్థులు, వైద్యుల అవస్థలు పట్టించుకోని ప్రభుత్వంవిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి విషయంలో కూటమి సర్కార్ అనుకున్న విధంగానే చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు వేసుకున్న స్కెచ్ ప్రకారమే ఏర్పాట్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఉన్నచోటే శాశ్వతంగా ఉంచాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. వైద్యవిద్యార్థులు, వైద్యులు కష్టాలను సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా ప్రజల చిరకాల వాంఛను గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేరవేర్చింది. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎదురుచూశారు. కానీ ఎవరూ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసింది. గాజులరేగ సమీపంలో 70 ఎకరాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కాగా రూ. 500 కోట్లతో వైద్య కళాశాల, బోధనాస్పత్రి, హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నారు. కళాశాల మంజూరు చేయడంతో పాటు వైద్య కళాశాల ప్రారంభం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు కూడా ప్రారంభించేశారు. 150 మంది వైద్య విద్యార్థులకు వైద్య కళాశాల రావడం వల్ల సీట్లు లభించాయి. రెండో ఏడాది తరగతులు కూడా జరుగుతున్నాయి. 1500 పడకలతో విశాాలమైన భవనాల నిర్మాణం గాజులరేగ వద్ద నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో బోధనాస్పత్రి కోసం సువిశాలమైన భవనాన్ని నిర్మించారు. అందులో 1500 బెడ్స్ (పడకలు) సరిపడేలా భవన నిర్మాణం జరిగింది. ప్రస్తుతం సర్వజన ఆస్పత్రి, ఘోషాఆస్పత్రిలో కలిపి 500 పడకలు మాత్రమే ఉన్నాయి. దీంతో రోగులు అధిక సంఖ్యలో రావడం వల్ల అవి చాలడం లేదు. ఫలితంగా రోగులకు వరండాలో బెడ్స్ వేసి చికిత్స అందించాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడ అధిక సంఖ్యలో బెడ్స్ పట్టేవిధంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. అయినప్పటికీ కూటమి సర్కార్ ఉన్న చోటే, వసతులు చాలక పోయినా సర్వజన ఆస్పత్రిని ఇక్కడే ఉంచేవిధంగా పట్టుబట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రుపాయలు వెచ్చించి భవనాలు నిర్మిస్తే అక్కడికి వైద్య కళాశాల తరలించబోమని కూటమి పాలకులు చెప్పడంపై జనం విస్తుపోతున్నారు. వైద్యవిద్యార్థుల అవస్థలు వైద్య కళాశాలకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉండడంతో ప్రతిరోజూ వైద్య కళాశాల నుంచి వైద్య విద్యార్థులు ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండూ ఒకేచోట ఉంటే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రొఫెసర్లు కూడా వైద్య కళాశాలకు, సర్వజన ఆస్పత్రికి తిరగాల్సిన అవసరం ఉంటుంది. రెండూ ఒక చోట లేకపోవడం వల్ల వారు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. వారి అవస్థలను కూటమి సర్కారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్న చోటే ఉంచాలని మంత్రి ఆదేశాలుజిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ సమీపంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉంది. అక్కడే ఆస్పత్రిని ఉంచేందుకు అవసరమైన అవకాశాలను పరిశీలించాలని, 15 రోజుల్లోగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం కలెక్టరేట్లో వైద్యాధికారులు, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ఆస్పత్రిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించకుండా ఇక్కడే ఉంచేందుకు నిర్ణయించారు. ఇప్పడు బహిరంగగానే వారి అలోచనను బయట పెట్టేశారు. వసతులు చాలక అవస్థలు ప్రస్తుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులకు, యంత్ర పరికరాలు అమర్చేందుకు పూర్తిస్థాయిలో వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. అన్ని విభాగాలకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఒకటి రెండు విభాగాలకు ఫ్రొపెసర్లు రావాల్సి ఉంది. గదులు చాలక ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యంత్ర పరికరాలు ఏర్పాటు చేయడానికి గదులు చాలక వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
అధికారులంతా పీజీఆర్ఎస్కు హాజరుకావాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ● పీజీఆర్ఎస్కు 154 వినతులువిజయనగరం అర్బన్: ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్కు జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.సెలవు కోసం ఫోన్లో మెసేజ్ పెట్టే వారికి షోకాజ్ నోటీసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సెలవు కావాల్సిన వారు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇకపై ప్రతి శనివారం సాయంత్రం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజా వినతుల పరిష్కా వేదికకు వచ్చే నిరక్షరాస్యులకు అర్జీలను రాయడంలో సహకరించాడానికి కలెక్టరేట్ నుంచి ఇద్దరు సిబ్బందిని వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ తెలిపారు. నిరక్షరాస్యులైన వారు తమ అర్జీలను రాయడానికి దళారీలను ఆశ్రయిస్తున్నారని వారు అర్జీదారులను మభ్యపెట్టి వారి నుంచి డబ్బు తీసుకొని ప్రతి వారం కలెక్టరేట్ చుట్టు తిరిగేలా చేస్తున్నారని తెలిపారు. ఇకపై అర్జీదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిరాక్స్ కేంద్రాల్లో రాయించవద్దని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో సంప్రదించాలని కలెక్టరేట్ సూచించారు. అర్జీలు రాయడానికి డబ్బులు ఇచ్చిన వారిపై తీసుకున్న వారిపై కూడా దృష్టి పెట్టాలని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. కింది స్థాయిలోనే అర్జీలను ఇవ్వాలి అర్జీదారులు తమ సమస్యలను ముందుగా గ్రామస్థాయిలో లేదా మండల స్థాయిలో లేదా డివిజన్ స్థా యిలో పరిష్కారం కాని పక్షంలో మాత్రమే జిల్లా స్థాయికి రావాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఇచ్చిన అర్జీని గ్రామ స్థాయి లేదా మండల స్థాయి వా రికే పంపిస్తాం కాబట్టి సమయం వృథా కాకుండా అ ర్జీదారు గ్రామ లేదా మండలం లేదా డివిజన్ స్థాయిలో సంప్రదించి పరిష్కారం కానప్పుడు మాత్రమే జిల్లా స్థాయిలో సమర్పించాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 188 వినతులు అందాయి. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, ఇన్చార్జ్ డీఆర్ఓ మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 35 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: పోలీస్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు సోమవారం 35 ఫిర్యాదులు అందాయి. జిల్లా అడిషనల్ ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. మొత్తం వచ్చిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించి 12, కుటుంబకలహాలు 6, మోసాలకు సంబంధించి 3, ఇతర సమస్యలకు సంబంధించి 14 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్బంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సిబ్బంది సానుకూలంగా స్పందించాలని, చట్టపరిధిలో వాటిని పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేసేలా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్బీ సీఐ సుధాకర్, ఎస్సై రాజేష్ పాల్గొన్నారు. -
అమ్ముడు పోయిన ప్రజాస్వామ్యం
● బొబ్బిలి మున్సిపల్ చైర్మన్గా రాంబార్కి శరత్ ● దగ్గరుండి కథ నడిపించిన ఎమ్మెల్యే బేబీనాయన, ● మాజీ మంత్రి సుజయ్బొబ్బిలి: అధికార తాపత్రయం, అడ్డగోలుగానైనా పీఠం దక్కించుకోవాలనే కుటిల రాజకీయం వెరసి బొబ్బిలి మున్సిపల్ పీఠం టీడీపీ వశమైంది. గత నెల 29న అవిశ్వాస తీర్మానం నెగ్గిన తరువాత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎన్నికల పరిశీలకుడిగా హాజరైన ఈ ఎన్నిక ప్రక్రియను ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహన రావు నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఒక్కరి పేరే నామినేట్ చేస్తూ బీఫాం అందజేయడంతో సభకు ఆర్డీఓ వివరించారు. మున్సిపాలిటీలోని 8వ వార్డు కౌన్సిలర్గా ఉన్న రాంబార్కి శరత్ పేరును ఒక టీడీపీ కౌన్సిలర్ ప్రతిపాదించి, మరో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ (ఎన్నికకు ముందురోజే టీడీపీ కండువా కప్పారు) బలపరుస్తున్నట్లు వారి చేతే చెప్పించారు. కోరం కోసం అవసరమైన 16 మంది మాత్రమే హాజరయ్యారు. వారితో పాటు వైఎస్సార్సీపీ వైస్ చైర్మన్గా మొన్నటి వరకూ వ్యవహరించిన 19వ వార్డు కౌన్సిలర్ చెలికాని మురళీకృష్ణ కూడా హాజరయ్యారు. చేతులెత్తే ప్రక్రియ అవసరం లేకుండానే.. చైర్మన్ ఎన్నికకు ఒకటే ప్రతిపాదన వచ్చిందని, మరెవరైనా పోటీ చేసే అవకాశం ఉందా అని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ సమక్షంలో ఆర్డీఓ రామమోహన రావు కౌన్సిలర్లను ప్రశ్నించారు. దీనికి ఎవరూ నోరు మెదపలేదు. మరోసారి అడిగి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత రాంబార్కి శరత్ చైర్మన్గా ఎన్నికై నట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఆ వెంటనే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రేసులో ఉన్న కౌన్సిలర్తోనే ప్రతిపాదన అవిశ్వాస రాజకీయంలో దించేసిన చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సామాజిక వర్గానికే చైర్మన్ పదవి ఇస్తారని మొదటి నుంచి ప్రచారం సాగింది. అయితే కౌన్సిలర్లకు ఇవ్వాల్సిన, ఇతర ఖర్చుల కోసం మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 6వ వార్డు కౌన్సిలర్ గెంబలి శ్రీనివాసరావు భారీగా ఖర్చు చేశారని, ఆయన ఇప్పుడు రేసులో ఉన్నారని ప్రచారం సాగింది. అయితే దీనిని ఖండించని బేబీనాయన తదితరులు గుంభన రాజకీయాలు నడిపారు. చివరికి గెంబలి శ్రీనివాసరావు కూడా తనకు చైర్మన్ గిరీ ఇచ్చేందుకు బేబీనాయన హామీ ఇచ్చారని ఆయనే సుప్రీమ్ కనుక మరెవరు చెప్పినా జరిగే పనికాదని నాదే చైర్మన్ గిరీ అనీ ఢంకా భజాయించారు. చివరికి డొంకలో ఇరుక్కుపోయారు. ఆయనకు ప్రస్తుత చైర్మన్ రాంబార్కి శరత్ చేస్తున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడి పదవినిచ్చి మరోసారి చూద్దాంలే అని చివరి నిమిషంలో పక్కన పెట్టేశారు. అంతే కాదు. శరత్ చైర్మన్ కావడానికి సభలో నువ్వే ప్రతిపాదించాలని ఇరికించారు. దీంతో గెంబలి మరోసారి నిరుత్సాహ పడక తప్పలేదు. మరో కౌన్సిలర్ రామారావు గెంబలి ప్రతిపాదనను బలపర్చారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మున్సిపల్ చైర్మన్గా రాంబార్కి శరత్ కౌన్సిల్ హాల్లో బాధ్యతలు స్వీకరించారు. హాజరు కాని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు: బలం ఉన్నా టీడీపీ ఆడిన ప్రలోభాలు, పైరవీల వలలో పది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు చిక్కుకున్నారు. టీడీపీకి కేవలం పది మంది కౌన్సిలర్లే ఉన్నా ప్రలోభాలతో బలం పెరగడంతో ఎన్నిక లాంఛనమే అయింది. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఈ చైర్మన్ ఎన్నిక సమావేశానికి గైర్హాజరయ్యారు. నీతి వదిలేసిన రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలు నీతిమాలిపోయాయి. కేవలం కొద్ది రోజుల పరిపాలన కోసం స్థానిక సంస్థలను కూడా కూటమి నాయకులు నిస్సిగ్గుగా చేజిక్కించుకునేందుకు బరితెగించడం సరికాదు. దమ్ముంటే సక్రమంగా రాజకీయాలు చేయాలి. అమ్ముకునే, కొనుగోలు చేసే రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన జవాబిస్తారు. వచ్చే రోజుల్లో సరైన గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే -
మానవత్వంతో సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన సమస్యలను మానవతా దృక్పఽథంతో ఆలోచన చేసి పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి 108 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా, రెవెన్యూ అధికారి కె. హేమలత, కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉపకలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి భాగస్వామ్యులయ్యారు. అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి సమస్య పరిష్కరం ఏ దిశలో ఉందో సెల్ఫోన్ మెసేజ్ ద్వారా అర్జీదారుకు తెలియజేయనున్నట్లు తెలిపారు. కావున ఆర్జీల పరిష్కార ప్రక్రియలో ఎటువంటి పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. పీజీఆర్ఎస్లో అందిన కొన్ని వినతులు ● పార్వతీపురం మండలం జగన్నాథపురం గ్రామ యవత పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యాలా అవసరమైన పుస్తకాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్.ప్రవీణ్ తదితరులు వినతిపత్రం అందజేశారు. ● పాచిపెంట మండలం గంగన్న దొరకోనవలస గ్రామానికి ఉపాధిహామీ పథకం కింద సీసీ రోడ్డు, కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 5లక్షల నిధులను మంజూరు చేసినప్పటికీ గ్రామసర్పంచ్, ఎంపీడీఓ అనుమతులు మంజూరు చేయడం లేదని, కావున అనుమతులు మంజూరుపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్తులు విన్నవించారు. ● తోటపల్లి రిజర్వాయర్లో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి కల్పించాలని జి.చిరంజీవి, తోట ప్రసాద్, అల్లు సురేష్, సమ్మిడి రాజేష్ వినతిపత్రం అందజేశారు. ● కొమరాడ మండలం అర్తాం రెవెన్యూ పరిధిలోని 0.3 ఎకరాల కొండ పోరంబోకు భూమిని సాగు చేసుకుంటున్నామని, ఆ భూమికి పట్టాదారు పాస్పుస్తకాన్ని మంజూరు చేయాలని కోరుతూ కె. కృష్ణందొర వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవాలైతే చట్టపరిధిలో చర్యలు పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల దర్యాప్తులో వాస్తవాలు అయినట్లయితే చట్టపరిధిలో తక్షణమే చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫిర్యాదు దారుల నుంచి స్వయంగా సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సంబంధించిన స్టేషన్ అధికారులకు సిఫార్సు చేయనున్నామని, ఆయా అధికారులు ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరమైన చర్యలతో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ సిబ్బందికి ఫోన్లో ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యంగా కుటుంబ కలహాలు, భర్త, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, అత్తారింటి వేధింపులు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూలు, ప్రేమ పేరుతో మోసాలపై పలు ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. కార్యక్రమంలో 6 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. డీసీఆర్బీ ఎస్ఐ ఫకృద్దీన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 46 వినతులు సీతంపేట: ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో పుబ్బాడ గ్రామస్తులు పద్మ గ్రామానికి సీసీ రోడ్డు వేయాలని కోరారు. రెల్లిగూడకు చెందిన బంగారమ్మ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, వరదగోడ తన గ్రామంలో నిర్మించాలని రాజమానుగూడకు చెందిన సవర చిన్నారావు విజ్ఞప్తి చేశారు. సవర నవీన్ వన్బీ అడంగల్ ఇప్పించాలని కోరారు. తాగునీటి బోరు ఏర్పాటు చేయాలని కుంబికి చెందిన రామారావు వినతి అందజేశారు. వీధికాలువలు నిర్మించాలని మెట్టుగూడ గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర, పీహెచ్వో ఎస్వీ గణేష్, ఏఎంఓ కోటిబాబు, పీఆర్ ఏఈ కిరణ్, సీడీపీఓ రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ -
ఉపాధి వేతనదారు మృతి
పాలకొండ రూరల్: మండలంలోని వెలగవాడ పంచాయతీ సిరికొండ గిరిజన గ్రామంలో ఉపాధి పనులకు హాజరైన పాలక సరోజిని(54) అకస్మాత్తుగా మృతిచెందింది. గ్రామంలోని ఊరచెరువులో ఉపాఽధి పనులకు కుమారుడు నారాయణరావుతో కలసి సోమవారం ఆమె వెళ్లింది. మస్తర్లు వేయించిన తరువాత యథావిధిగా వేతనదారులు పనులకు ఉపక్రమించారు. ఈ క్రమంలో సరోజిని అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. విషయం గమనించిన సహచర వేతనదారులు, బాధితురాలిని కుమారుడితో పాటు ఇంటికి తరలించి, 108కు సమాచారం అందించారు. వాహనం చేరుకుని సిబ్బంది పరీక్షించి సరోజిని మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఎం.విజయరంగారావు, ఉపాఽధి ఏపీఓ ఈశ్వరమ్మ, క్షేత్ర సహాయకుడు బుల్లిబాబు మృతురాలి ఇంటికి వెళ్లి ఘటనపై ఆమె కుమారుడిని అడిగి తెలుసుకున్నారు, ఆ సమాచారం డ్వామా పీడీకి వివరించారు. మృతురాలికి భర్త పెంటయ్య ఉన్నాడు. గ్రామస్తులతో కలిసి పనులు చేస్తూ మృత్యువాత పడడంతో సహచర వేతనదారులు, గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. -
పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం
విజయనగరం: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సోమవారం సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణతో కలిసి పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా పార్టీ అనుబంధంగా ఉండే 29 విభాగాలకు సంబంధించి కమిటీల నియామకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతివిభాగంలో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు అవకాశం కల్పించాలని చెప్పారు. ప్రధానంగా మహిళలకు, యువతకు విభాగాల్లో ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో జిల్లా అధ్యక్షులతో పార్టీ అధినేత నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన అంశాలను వివరించారు. పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేయడంలో అనుబంధ కమిటీల అధ్యక్షులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంటరీ జిల్లా పరిశీలకుల నియామక ప్రక్రియ పూర్తయిందని, త్వరలో రాష్ట్రస్థాయిలో వివిధ అనుబంధ సంఘాల నియామకాల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. కార్యకర్తల్లో భరోసా నింపే బాధ్యత మీదే... ఐదేళ్ల పాటు రాష్ట్రంలో పాలన సాగించి ప్రస్థుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో భరోసా నింపాల్సిన బాధ్యత అనుబంధ విభాగాల అధ్యక్షులపై ఉందని మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ఎన్నికలకు ముందు అబద్ధపు హమీలు గుప్పించి, ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేకత మొదలైందన్నారు. ఏడాది కాలంలో ఇచ్చిన హమీల అమల్లో ఘోరంగా వైఫల్యం చెందిన కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పాలనలో లోపాలపై నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను ఆయా అనుబంధ విభాగాలు తీసుకోవాలని సూచించారు. పార్టీ బలంగా ఉన్నపుడే రానున్న ఎన్నికల్లో విజయావకాశాలు అందిపుచ్చుకోవచ్చని, అనుబంధ విభాగాల కమిటీల్లో సమర్ధవంతమైన వారికి స్థానం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం.. వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం త్వరలో ప్రారంభించనున్నమని మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. పార్టీ నాయకులంతా ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై అక్కడే సమావేశాలు నిర్వహించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. పార్టీ సంస్థాగత నియామకాల్లో పదవులు దక్కించుకున్న వారి పని తీరుపై నిశిత పరిశీలన ఉంటుందని, పార్టీ విజయానికి దోహదపడే కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందన్నారు. సమష్టి కృషితోనే అధికారంలోకి రావడం సాధ్యమన్న విషయం గుర్తించాలన్నారు. పార్టీ బలోపేతంలో సోషల్మీడియా, యువజన విభాగం, విద్యార్థి విభాగాలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా జిల్లా అధ్యక్షునిగా తాను, పార్టీ పరిశీలకునిగా నియామకమైన సత్యనారాయణ అందుబాటులో ఉంటామని భరోసా నిచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ వర్రి నర్సింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు. కిల్లి సత్యనారాయణను ఈ సందర్భంగా సత్కరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో భరోసా నింపే బాధ్యత మీదే.. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు విజయవంతం చేయాలి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో దిశానిర్దేశం హాజరైన పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ -
ఉద్యమబాటలో ఉపాధ్యాయులు
విజయనగరం అర్బన్: ఎన్నికలకు ముందు కూటమి నేతలు టీచర్ల సంక్షేమం కోసం పాటుపడతామంటూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలు విషయం దేవుడెరుగు... క్షేత్రస్థాయిలో సమస్యలు, డిమాండ్లను పరిష్కరించకుండా చుక్కలు చూపిస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులు, పాఠశాల వ్యవస్థ పునఃనిర్మాణ అంశాలపై ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలపై ఉపాధ్యాయ లోకం నిప్పులు చెరుగుతోంది. గత 30 వారాలుగా రాష్ట్రస్థాయిలో గర్తింపు పొందిన టీచర్ల సంఘాలతో సమావేశాలు నిర్వహించి డిమాండ్లను తెలుసుకున్నా పరిష్కరించకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. జీఓ 19, 20, 21ను వ్యతిరేకిస్తున్నారు. డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 21న ఉమ్మడి విజయనగరం జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఉపాధ్యాయుల డిమాండ్ల ఇవే ● ఉన్నత పాఠశాలల్లో 1:30 నిష్పత్తి ప్రకారం 45 మంది విద్యార్థులు దాటిన తర్వాత సెక్షన్లు ఏర్పాటు చేయాలి. ● మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాసీ్త్రయం. ● బదిలీల్లో స్టడీ సెలవులో ఉన్న టీచర్ల స్థానాలను ఖాళీగా చూపరాదు. ● ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 41 వద్ద 3వ పోస్టు ఇవ్వాలి. ఏప్రిల్ 23వ తేదీ రోల్ను పరిగణనలోకి తీసుకోవాలి. ● బదిలీల ప్రక్రియలో కొన్ని ఖాళీ పోస్టులను బ్లాక్ చేస్తుండడం మానుకోవాలి. ● 2023లో రేషనలైజేషన్ చేసి అదే ఏడాదిలో ఉద్యోగోన్నతి పొంది 2025లో రేషనలైజేషన్ అవుతున్న టీచర్లకు బదిలీల్లో అన్యాయం జరుగుతోంది. అటువంటి వారికి బదిలీల్లో 8 సంవత్సరాల పాయింట్లు కేటాయించాలి. ● పీహెచ్సీ కోటా టీచర్లను రేషనలైజేషన్ చేయడం సరైన పద్ధతి కాదు. ● ప్రభుత్వ, పంచాయతీరాజ్ సర్వీస్ రూల్స్ సమస్య తేలకుండా 8 ఏళ్లుగా లాంగ్ స్టాండింగ్ అయిన టీచర్లను సొంత యాజమాన్యానికి వెళ్లమని చెప్పడం భావ్యం కాదు. ● ఎంఈఓలకు బదిలీలు నిర్వహించి కోరుకున్న ఎంఈఓ 1, ఎంఈఓ 2 లకు హెచ్ఎం కన్వెర్షన్ ఇవ్వాలి. గరువులను మోసం చేస్తోన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగోన్నతులు, పాఠశాల విభజన సమస్యలను పరిగణనలోకి తీసుకోని వైనం 21న ఉమ్మడి విజయనగరం జిల్లా డీఈఓ కార్యాలయం ముట్టడికి పిలుపు -
ఉగ్రవాది కేసులో ముమ్మర దర్యాప్తు
విజయనగరం క్రైమ్: విజయనగరం ఆబాద్ వీధికి చెందిన సీరాజ్ ఉర్ రెహ్మాన్ను ఎక్స్ప్లోజివ్ యాక్టు కింద కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మూడు రోజుల కిందట అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు కేసు విచారణ కోసం నేషనల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (ఎన్ఐఏ) అధికారులు ఇద్దరు సోమవారం విజయనగరం వచ్చారు. రిమాండ్లో ఉన్న సీరాజ్ను విచారణ జరిపే అంశంపై జిల్లా పోలీస్ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిధిలో ఉన్న వ్యక్తిని విచారణ చేయాలంటే ఇక్కడి పోలీసులు కోర్టులో మరో పిటీషన్ వేయాలి. డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయాల్సి ఉంది. ఎన్ఐఏకు వచ్చిన సమాచారం మేరకు నేరుగా విజయనగరం వచ్చి అనుమానితులను అదుపులోకి తీసుకున్నా ఇక్కడి పోలీసులకు చెప్పి విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం డీఎస్పీ రంగంలోకి దిగారు. ఎన్ఐఏ అధికారులు వచ్చారన్న విషయం తెలియడంతో మీడియా బృందం టూటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. అయితే, కేసు విషయంలో పోలీసులు గోప్యత పాటించారు. తాము కేవలం ఎన్ఐఏకి సహకరించడం తప్ప కేసు పూర్వాపరాలను వెల్లడించలేమని డీఎస్పీ శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విజయనగరానికి వచ్చిన ఎన్ఐఏ అధికారులు 4 గంటలకు పైగా టుటౌన్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు -
సంకిలి చక్కెర కర్మాగారం పనిచేస్తుంది
● స్పష్టంచేసిన కలెక్టర్ అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: సంకలి చక్కెర కర్మాగారం యథావిధిగా పనిచేస్తుందని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పష్టంచేశారు. కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్మాగారాన్ని నడిపించేందుకు, సాగు విస్తీర్ణం పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఉన్న సంకలి ఏకై క చక్కెర కర్మాగారంలో డిసెంబర్లో చెరకు గానుగ ప్రారంభమై మార్చి వరకు జరుగుతుందన్నారు. చెరకు సాగును బట్టి సుమారు 2 లక్షల నుంచి 2.5 లక్షల టన్నుల వరకు చెరకు క్రషింగ్ జరుగుతుందన్నారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్,, వ్యవసాయశాఖ జేడీ రామారావు, తదితరులు పాల్గొన్నారు. విషాదకర ఘటన విజయనగరం ఫోర్ట్: ద్వారపూడిలో కారు డోర్ లాక్ పడి ఊపిరి ఆడక నలుగురు చిన్నారులు మృతిచెందడం విషాదకరమని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పిల్లల మృతదేహాలకు సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మార్చురీలో పోస్టు మార్టం నిర్వహించారు. అక్కడకు వెళ్లి చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట విజయనగరం జెడ్పీటీసీ సభ్యుడు కెల్ల శ్రీనివాసరావు, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, తదితరులు ఉన్నారు. ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడిగా గంగారావు వంగర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మరిచెర్ల గంగారావు నియమితులయ్యారు. వంగర మండలం వి.వి.ఆర్.పేటకు చెందిన గంగారావు మాస్టారు గతంలో ఉపాధ్యాయ సంఘాల నాయకుడిగా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిగా, పరోక్షంగా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా కీలకపాత్ర పోషించారు. ఆయన తండ్రి మరిచెర్ల తవిటినాయుడు 1963 నుంచి ఆరు దఫాలుగా సర్పంచ్గా పనిచేశారు. ఆయన భార్య మరిచెర్ల విజయలక్ష్మి సర్పంచ్గా, పలుమార్లు ఎంపీటీసీగా, మండల విప్గా, జేసీఎస్ కన్వీనర్గా, పీఏసీఎస్ అధ్యక్షురాలిగా, జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా పనిచేశారు. గంగారావుకు పదవి దక్కడం పట్ల ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, జెడ్పీటీసీ సభ్యురాలు కరణం రాధమ్మ, పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుతోపాటు పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పదవి రావడానికి కృషిచేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలే రాజేష్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్టార్ స్పీకర్ కాంటెస్ట్లో రాజుకు టైటిల్ విజయనగరం: ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన జాతీయస్థాయి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఐకాన్– 2025లో విజయనగరానికి చెందిన కెఆర్కే రాజు ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. భారతదేశంలో నిష్ణాతులైన ఇంపాక్ట్ స్పీకర్స్ ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు నిర్వహించారు. ఇంపాక్ట్ ఫౌండర్ గురూజీ గంపనాగేశ్వరరావు, మోటివేషనల్ స్పీకర్స్ బ్రదర్ షఫీ సుధీర్, సినీ నటులు కేవీ ప్రదీప్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్టు రాజు తెలిపారు. -
● కంచర గెడ్డ దురాక్రమణ
ఈ చిత్రం చూశారా... ఇది పొలం అనుకుంటే పొరపాటే. బొబ్బిలి మండలంలోని కాశిందొరవలస, నారాయణప్పవలస, గొర్లెసీతారాంపురం, తదితర గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందించే కంచర గెడ్డ జలాశయం. బొబ్బిలి మండలం కాశిందొరవలస గ్రామ సమీపంలో 15 ఏళ్ల కిందట జలాశయాన్ని నిర్మించారు. దీని అభివృద్ధికి గత ప్రభుత్వం 253.05 లక్షల రూపాయలు మంజూరు చేసింది. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను పక్కనపెట్టేసింది. ఇదే అదునుగా స్థానిక టీడీపీ నాయకుడు జలాశయాన్ని పడమర వైపునుంచి ఇదిగో ఇలా ఆక్రమణకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే 4 ఎకరాలు ఆక్రమించి పొలంగా మార్చేశాడు. సాగుకు సన్నద్ధమవుతున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదు. ఇదే విషయంపై తహసీల్దార్ ఎం.శ్రీను మాట్లాడుతూ ఆక్రమణపై రైతులు ఫిర్యాదు చేశారన్నారు. పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. – బొబ్బిలి రూరల్ -
మలేరియా నియంత్రణకు చర్యలు
పార్వతీపురంటౌన్: మలేరియా నియంత్రణకు కచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులకు ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మలేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. జిల్లాలో 248 గ్రామాలను మలేరియా ప్రభావిత గ్రామాలుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో మలేరియా నియంత్రణ చర్యలు ముమ్మరం చేయాలన్నారు. వర్షాకాలం ముందు తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయాలన్నారు. విజయనగరం/విజయనగరం క్రైమ్: విజయనగరం.. రాష్ట్రంలోనే సున్నితమైన, శాంతియుతమైన జిల్లా. కళలకు కాణాచి. సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం. వ్యవసాయమే అధికమంది జీవనాధారం. ఇలాంటి జిల్లాలో ఇప్పుడు ఉగ్రజాడ కలకలం రేపుతోంది. విశాఖపట్టణానికి చేరువగా ఉన్న విజయనగరాన్ని ఉగ్రకార్యకలాపాలకు అనువుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు జిల్లా వాసుల్లో భయాందోళన నింపుతున్నాయి. ఉగ్రభావజాలంతో కూడిన వ్యక్తిని ఇంటెలిజెన్స్ వర్గాలు అరెస్టు చేయడం, ఆయన వద్ద నుంచి బాంబుల తయారీకి వినియోగించే పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విజయనగరం ఉగ్రవాద చర్యలకు స్థావరంగా మారిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆబాద్ వీధిలో భయంభయం.. విజయనగరం కార్పొరేషన్ నడిబొడ్డున ఉన్న ఆబాద్వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ (28) ఉగ్రవాద భావజాలంతో పనిచేస్తున్నట్టు తెలంగాణా రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆయన ఇంటి పై శుక్రవారం రాత్రి దాడిచేసి అదుపులోకి తీసుకున్నాయి. రహస్యప్రదేశంలో విచారణ జరిపాయి. ఆయన వద్ద నుంచి బాంబుల తయారీలో వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆయనను కోర్టులో హాజరుపర్చి రిమాండ్లోకి తీసుకున్నాయి. ఈ సమాచారంతో ఆబాద్వీధిలో నిశ్శబ్దం ఆవరించింది. స్థానికులు భయంభయంతో గడుపుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా... విజయనగరం జిల్లా చరిత్రలో గతంలో ఎప్పడూ బాంబు పేలుళ్లు, ముష్కర మూకలదాడులన్న మాటే లేదు. ఇప్పుడు అదే విజయనగరం సిరాజ్ అరెస్టుతో వార్తల్లోకెక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం నేరుగా విజయనగరం వచ్చి ఆబాద్వీధిలో బాంబులను తయారుచేసేందుకు వినియోగించే సోడియం సల్ఫర్, అమ్మొనియం పాస్ఫరేట్, అల్యూమినియం పౌడర్తో సిరాజ్ను అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. ఈ విషయం ఇక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించకపోవడం విస్మయం కలిగిస్తోంది. దాడులు చేసేందుకేనా? ఉమ్మడి ఏపీలో 2013లో హైదరాబాద్లో ఐఎస్ఐఎస్ సంబంధాలు కలిగిన యాసిన్ భత్కల్, సయ్యద్ షెహెన్ షా తదితర ఏడుగురు ఉగ్రవాదులు ఐసిస్ తో సంబంధం పెట్టుకుని ఏడుచోట్ల బాంబులు పేల్చి దాదాపు 20 మంది ప్రాణాలు తీశారు. ఇప్పటికీ ఇది మర్చిపోలేని మారణహోమం. ఇప్పుడు అలాంటి దాడికే విజయనగరం వేదికగా పథక రచన చేస్తూ సిరాజ్ పట్టుబడ్డాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కా ఆధారాలతో ఆబాద్వీధిలో ఉర్థూ పాఠశాల ఎదురుగానే నివసిస్తున్న సిరాజ్ ఇంట్లో సోదాలు చేపట్టి పేలుడుపదార్థాలు స్వాధీ నం చేసుకోవడం దీనికి బలం చేకూర్చుతోంది. ఎవరికీ అనుమానం రాదనే... హైదరాబాద్లో బాంబు పేలుళ్లు చేసి అల్లర్ల సృష్టించేందుకు సౌదీ అరేబియాలోని ఐఎస్ఐఎస్ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. వాస్తవానికి ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా ముందుగుండు సామగ్రి విక్రయాలకు పెట్టింది పేరు. ఇటువంటి వెనుకబడిన ప్రాంతంలో పేలుళ్లకు అవసరమైన పదార్థాలను సులభంగా సేకరించవచ్చని, నిఘా ఉండదని భావించారు. అందులో భాగంగానే సోడియం సల్ఫర్, అమ్మోనియం ఫాస్మరేట్ వంటి పదార్థాలు కొనుగోలుచేసి సిరాజ్ తన ఇంట్లో భద్రపరిచినట్టు తెలుస్తోంది. అయితే, నగరంలోని ఏ దుకాణంలో ఈ పేలుడు పదార్ధాలను ఎంత మొత్తంలో కొనుగోలు చేశారు...? వాటి తయారీతో ఎంత మొత్తంలో నష్టం చేకూర్చేందుకు పథకరచన చేశారన్న అంశాలపై నిఘా వర్గాలు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. తెలియని వ్యక్తులకు పేలుడు పదార్థాలు విక్రయిసున్నవారి వివరాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. నగరానికి చెందిన సిరాజ్ అరెస్టుతో ఉలిక్కిపడిన జిల్లా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆబాద్వీధిలో భయంభయం అప్రమత్తమైన పోలీస్ శాఖ నిశిత సోదాలు ఇంజినీరింగ్ విద్య నభ్యసించిన సమయంలోనే... సిరాజ్ ఉర్ రెహ్మాన్ 2018 సంవత్సరంలో హైదరాబాద్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన సమయంలో అక్కడ బోయగూడలో ఉంటున్న సమీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్టు నిఘావర్గాలు గుర్తించాయి. ఇద్దరూ సౌదీఅరేబియాకు చెందిన ఐఎస్ఐఎస్తో సంబంధాలు నెరిపినట్టు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్న సమీర్ను పట్టుకోవడంతో విజయనగరంలో ఉన్న సిరాజ్ వ్యవహారం బయటపడింది. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులతో కార్డెన్ సెర్చ్, నాకాబందీ నిర్వహించిన పోలీసులకు సమీర్, సిరాజ్ల భాగోతం బహిర్గతమైంది. ఇద్దరూ కలిసి బాంబుల తయారీకి పథకరచన చేసినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్నాం ఇంటెలిజెన్స్ సమాచారంతో విజయనగరం ఆబాద్వీధిలో ఉగ్రవాద భావజాలంతో ఉన్న సిరాజ్ను అదుపులోకి తీసుకున్నాం. అతనితో పాటు హైదరాబాద్కు చెందిన సమీర్ను కూడా అక్కడి ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ కృష్ణమూర్తితో కలిసి వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించాం. – ఎం.శ్రీనివాస్, డీఎస్పీ, విజయనగరం రక్షణ కుటుంబంలో చీడపురుగు..! సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో ఏఎస్ఐగా, అన్న య ఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తి ఉగ్రభావజాలానికి ప్రేరేపితం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి సిరాజ్కు విచ్చలవిడి తనం ఎక్కువ. తండ్రి మందలించినా పెడచెవిన పెట్టేవాడు. ఎప్పుడు ఇంటికి వస్తాడో.. వెళ్తాడో తెలియదు. మూడులాంతర్ల సమీపంలోని ఓ మొబైల్ షాపు యజమానికి దగ్గర బంధువుగా సిరాజ్ను పోలీసులు గుర్తించారు. -
కాసులకా..? కార్యకర్తకా..?
బొబ్బిలి: బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి అవిశ్వాస తీర్మానం నెగ్గేలా చేసిన కూటమి నాయకుల సీల్డ్ కవర్ రాజకీయాలు సోమవారం బహిర్గతం కానున్నాయి. డబ్బులిచ్చేవారికే పదవి దక్కుతుందా.. లేదంటే కౌన్సిలర్ల మాట నెగ్గుతుందా అన్నది సోమవారం ఉదయం 11 గంటలకు జరగనున్న ఎన్నికలో తేలనుందన్న చర్చ సాగుతోంది. నేనంటే నేనేనని ఇద్దరు ఆశావహులు బయటకు చెబుతున్నా లోలోపల మాత్రం నేను బలై పోను కదా అనే అనుమానాలు మాత్రం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువాలు వేసుకునేందుకు వెనుకడుగు వేయగా, మరికొందరు ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టిమరీ కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు కండువాల వెనుక పెద్దకథే నడుస్తోంది. కండువాలు వేసుకోని వారిని అవసరం తీరాక దూరం పెట్టాలని కూటమి నాయకులు నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. దీంతో అటు సొంత పార్టీలోనూ, ఇటు బయట పార్టీలోనూ పరువు పోయే పరిస్థితి ఎదురుకానుందని పట్టణ వాసులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామ్మోహనరావు ఆధ్వర్యంలో జరగనున్న మున్సిపల్ సమావేశంలో చైర్మన్గా ఎవరికి ఓటువేయాలన్న విషయాన్ని ఇప్పటి వరకూ తేల్చిచెప్పని బేబీనాయన సమావేశానికి ముందు చెప్పనున్నట్టు సమాచారం. బేబీ నాయన చెప్పిన వారి పేరే సీల్డ్ కవర్లో ఉంటుందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. డబ్బులు ఖర్చు చేస్తున్న వ్యక్తికి చైర్మన్ గిరీని అప్పగిస్తారా? లేదంటే పార్టీ కోసం ఒకే చోట సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వ్యక్తికి అప్పగించనున్నారా ? అన్నది మీమాంసగా మారింది. పట్టణంలో టీడీపీ ఉనికికి ప్రశ్నార్థకంగా మారనున్న ఈ ఎపిసోడ్ సోమవారంతో ముగియనుంది. నేడు బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అధికారుల సమక్షంలో ఉదయం 11 గంటలకు చేతులెత్తే ప్రక్రియ -
ఉపాధ్యాయుడి వీరంగం
రాజాం: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడనే విమర్శలు ఇటీవల అధికమయ్యాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో వెంటనే చేరిపోయి మిగిలిన వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడంటూ పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. కుల సంఘాల నేతగా గొప్పలు చెప్పుకుంటూ సొంత కులంలోనే వర్గాలను పోషిస్తున్నాడంటూ మండిపడుతున్నారు. సంబంధిత ఉపాధ్యాయుడిపై ఈనెల 17న రాజాం సర్కిల్ కార్యాలయంలో సొంత కులానికి చెందిన పలువురు బాధితులు ఫిర్యాదుచేయడంతో విషయం బయటకు వచ్చింది. బొద్దాం గ్రామంలో రజక కులానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజాం పట్టణంలోని గాయత్రి కాలనీలో నివాసముంటున్నాడు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీలో పెత్తనం చేసిన ఈ ఉపాధ్యాయుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేరి వీరంగం వేస్తున్నాడు. గ్రామంలో రజక కులానికి చెందిన కొంతమందిపై వివక్ష చూపి వర్గపోరు ప్రారంభించాడు. రోజువారీ కూలితో బతికే రజకులపై కక్షగట్టి చుట్టు పక్కల గ్రామాల్లో జరుగుతున్న పండగల్లో వారికి కూలి లేకుండా చేస్తున్నాడు. ఈ మేరకు కొంతమంది రజకులు ఈ ఉపాధ్యాయుడి తంతుపై రాజాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమలో కొంతమంది కూటమికి ఓటు వేయలేదని చెప్పి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నాడని, ప్రభుత్వ ఉద్యోగిననే బాధ్యత లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారాలు చేయడం, రాయితీ రుణాలు మన వర్గానికి ఇచ్చారంటూ పబ్లిష్ చేసి మిగిలినవారిని కించపరచడం, గ్రామాల్లో జరిగే కథ, కార్యక్రమాలకు మిగిలిన కుటుంబాలను రానివ్వకుండా అడ్డుకోవడం చేస్తున్నాడని ఎ.వీరస్వామి, కె.నాగరాజు, వి.అచ్యుతరావు, వై.మంగయ్య తదితరులు వాపోతున్నారు. చేపల చెరువు నిధులు స్వాహా తమ కులానికి చేపల చెరువుల నిమిత్తం వచ్చిన రూ. 1.80 లక్షలు నగదు దోచేశాడని, అడిగినవారిని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. అధికారపార్టీ ఎమ్మెల్యే అండదండలు తనకున్నాయని చెబుతూ గ్రామంలో వివాదాలు సృష్టిస్తున్నాడని పేర్కొన్నారు. సంబంధిత ఉపాధ్యాయుడిపై కలెక్టర్కు, విద్యాఽశాఖాధికారికి ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉపాధ్యాయుడి బరితెగింపుపై గ్రామస్తులు సైతం మండిపడుతున్నారు. కూటమికి ఓటు వేయలేదంటూ గ్రామంలో రాజకీయాలు వర్గ వివక్షతో వివాదాలు సంఘానికి వచ్చిన డబ్బులు గోల్మాల్ రాజాం పోలీస్స్టేషన్లో బాధితుల ఫిర్యాదు -
విజయనగరం
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025రైల్వేశాఖ నిర్లక్ష్యం జిల్లా నుంచి మామిడి ఎగుమతులకు రైల్వేశాఖ మోకాలడ్డుతోంది. ప్రత్యేక బోగీలు కేటాయించ కుండా రైతులు, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. –8లోఅమ్మా... అందరం కలిసి ఆడుకుంటామంటే సరే అన్నారు.. అదే పిల్లల చివరి మాట అని ఆ తల్లులకు తెలియదు.. అక్కడే మృత్యువు కాపుకాసి ఉందని గుర్తించలేకపోయారు.. మూడు గంటల పాటు పిల్లలు కనిపించకపోయే సరికి తల్లిడిల్లిపోయారు.. ఏమయ్యారో అంటూ ఊరంతా గాలించారు.. చివరకు కారులో ప్రాణవాయువు అందక విలవిల్లాడుతూ విగత జీవులుగా కనిపించిన పిల్లలను చూసి కుప్పకూలిపోయారు.చిన్నారుల మృతికి కారణమైన కారు ఇదే.. డీఈఓ కార్యాలయాల ముట్టడి విజయవంతం చేయాలి● ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపు విజయనగరం అర్బన్: విద్యారంగాన్ని నిర్వీ ర్యం చేసే విధానాలను కూటమి ప్రభుత్వం మానుకోవాలనే డిమాండ్తో ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని డీఈఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా కమిటీ పిలు పునిచ్చింది. ఈ మేరకు స్థానిక ఎన్జీఓ హోమ్లో ఆదివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్జీటీలకు ప్రమోషన్ ఇచ్చి మోడల్ ప్రైమరీ స్కూళ్లకు ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 41 వద్ద 3వ పోస్టు ఇవ్వాలని కోరారు. ఎస్జీటీలకు ఆన్లైన్తో కూడిన మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్ చేయడం సరైన చర్య కాదని అన్ని ఖాళీలను బదిలీ కౌన్సెలింగ్లో చూపించాలని కోరారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యతో ప్రమేయం లేకుండా అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రవీంద్రనాయుడు, డి.శ్రీనివాస్, భాస్కరరావు, రాము, కె.శ్రీనివాసరావు, డి.రాము, జేఆర్కే ఈశ్వరరావు, జోగారావు, సూరిబాబు, డి.ఈశ్వరరావు, పాల్తేరు శ్రీనివాస్, టి.సన్యాసిరాజు, ఎ.కృష్ణారావు, ఇ.రామునాయుడు, వై.శ్రీనివా సరావు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలో ఫెయిలైన వారి కోసం సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమవుతాయని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించే పరీక్షలకు 2,851 మంది విద్యార్థులు హాజరవుతారని, వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి 8 మంది టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించామని చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ అధికారులు మరో 42 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఐదుగురు విధులు చేపడతారన్నారు. ఓపెన్ స్కూల్ పదోతరగతి పరీక్షకు 407 మంది, ఇంటర్మీడియట్కు 649 మంది హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. పదోతరగతి విద్యార్థులకు విజయనగరంలో రెండు, గజపతినగరం, ఎల్.కోట, బొబ్బిలిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం విజయనగరం, ఎస్.కోట, గజపతినగరం ప్రాంతాల పాఠశాలల్లో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. విజయనగరం క్రైమ్: సమయం మధ్యాహ్నం 2 గంటలు.. గ్రామంలోని పెళ్లివేడుకలో పెద్దలు, ఆటపాటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. ఆటలాడుతూ గ్రామ బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న కారులోకి నలుగురు చిన్నారులు వెళ్లారు. పొరపాటున డోర్లు వేయడంతో లాక్ అయ్యాయి. అంతే.. వారికి ప్రాణ వాయువు అందలేదు. కాపాడాలంటూ వారి ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. మూడుగంటల తర్వాత వెతుకుతూ వెళ్లిన పెద్దలకు కొనఊపిరితో కారులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులు కనిపించారు. డోర్లు బద్దలగొట్టి చిన్నారులను బయటకు తీసినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటనతో విజయనగరం సమీపంలోని ద్వారపూడిలో మృత్యుఘోష వినిపించింది. సర్వజన ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మాటలకందని విషాదం అందరూ పదేళ్లలోపు పిల్లలే. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా సాకుతున్నారు. పిల్లలు ఆడుకుంటేంటే సంబర పడ్డారు. పెళ్లివేడుకలో బిజీ అయ్యారు. ఒకేసారి కారు రూపంలో కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), పండి ఉదయ్ (7), బూర్లె జాస్రిత(8)ను మృత్యువు కాటేయడంతో కన్నీరుకార్చారు. విగతజీవులుగా మారిన చిన్నారులను పట్టుకుని బోరున విలపించారు. కడుపుకోత.. మృతిచెందిన చిన్నారుల్లో బూర్లె చారులత, జాస్రిత అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకే సారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, ఆనంద్లు విషాదంలో ముని గిపోయారు. దేవుడా.. కడుపుకోత మిగిల్చావా అంటూ విలపించారు. సర్వజన ఆస్పత్రి మార్చురీ వద్ద ఉన్న కుమార్తెల మృతదేహాలను చూసిన ఉమ ఓ దశలో సొమ్మసిల్లి పోయింది. ఉదయ్ తల్లిదండ్రులు బుచ్చిబాబు, భవానీ, మణీశ్వరి తల్లిదండ్రులు సురేష్ అరుణలు సైతం బిడ్డల మృతదేహాలను పట్టుకుని రోదించారు. పెళ్లింట విషాదంగజపతినగరం: మండలంలోని పాతబగ్గాం గ్రామంలో పెళ్లింట విషాదం అలముకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట చావుమేళం మోగింది. వివరాల్లోకి వెళితే.. దత్తిరాజేరు మండలం పాచిలవలస గ్రామానికి చెందిన సైలాడ సన్యాసిరావుకు గజపతినగరం మండలం పాతబగ్గాం గ్రామానికి చెందిన పప్పల గౌరితో వివాహం కుదిరింది. ఆదివారం రాత్రి ఒంటి గంటా 32 నిమిషాలకు వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో వధువు తల్లి పప్పల పైడమ్మ తన స్వగృహంలో మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి పనులు చేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో పాతబగ్గాంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెద్దలు వివాహాన్ని వాయిదా వేశారు.న్యూస్రీల్ మరికొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా వధువు తల్లి మృతి గ్రామంలో విషాదఛాయలుఒకే సమయంలో నలుగురు చిన్నారులు మృతి కారులో చిక్కుకుని ప్రాణాలు విడిచిన పిల్లలు శోకసంద్రంగా మారిన సర్వజన ఆస్పత్రి ఇళ్ల మధ్యనే ఘటన... మృత్యువుకు కారణమైన కారు వీధిలో ఇళ్ల మధ్యనే ఉంది. దాని పక్కగుండానే అందరూ రాకపోకలు సాగించినా.. అందులో ఉన్న చిన్నారులను గుర్తించలేకపోయారు. వారి ఆర్తనాదాలను ఆలకించలేకపోయారు. కారు అద్దాలు నలుపువి కావడం కూడా దీనికి ఓ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్టౌన్ ఎస్ఐ రామ్గణేష్లు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వజన ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలు సేకరించారు. కారు ఎవరిది? బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు ఎవరిది..? అక్కడే ఎందుకు పార్క్ చేశారు? డోర్కు లాక్ ఎందుకు వేయలేదు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్వారపూడిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు సంబంధించి వైజాగ్ నుంచి ఆ కారు వచ్చినట్టు సమాచారం. కారు ఓనర్, డ్రైవర్ ఒక్కరేనని తెలిసింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. -
కనులపండువగా శ్యామలాంబ పండగ ప్రారంభం
సాలూరు: శ్యామలాంబ అమ్మవారి ఉత్సవం కనులపండువగా ప్రారంభమైంది. ఆదివారం ఉయ్యాలకంబాల వేడుకను పెదకోమటిపేట గద్దె వద్ద సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. గద్దె వద్ద ఏర్పాటుచేసిన ఉయ్యాలలో జమిందార్ కుటుంబానికి చెందిన విక్రమచంద్ర సన్యాసిరాజు, తదితరులను ఉయ్యాలలో కూర్చోబెట్టి పెద్దలు ఊపారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకను తిలకించేందుకు తరలివచ్చారు. స్వల్ప తోపులాట నేపథ్యంలో యువరాజు, పెద్దలు కొంత ఇబ్బందిపడ్డారు. కార్యక్రమంలో సీ్త్రశిశు,గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్దేవ్ తదితరులు పాల్గొన్నారు. నేడు తొలేళ్ల ఉత్సవం సోమవారం తొలేళ్ల ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జన్నివీధిలో ఉన్న అమ్మవారి గద్దె నుంచి ఘటాను గొల్లవీధి వాసులు తీసుకొస్తూ కర్రలతో సాము చేస్తారు. ఒక వీధి తరువాత మిగిలిన వీధి వాసులంతా ఈ ఉత్సవంలో పాల్గొని ఘటాలను ఊరేగిస్తారు. ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మాధవరెడ్డి పండగ నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. ఆదివారం పట్టణానికి వచ్చిన ఆయన సిరిమాను తిరిగే ప్రాంతాలు, పార్కింగ్ తదితర అంశాలపై ఆరా తీసి అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. కంట్రోల్రూమ్ను పరిశీలించారు. ఇబ్బందులు పడిన పోలీసులు సుమారు వెయ్యి మంది పోలీసులు ఈ ఉత్సవానికి బందోబస్తు నిమిత్తం వచ్చారు. అయితే బందోబస్తు పోలీసులకు పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి అక్కడ విద్యుత్ వెలుగులు లేకపోవడంతో చీకట్లో పోలిసులు భోజనాలు చేయడం కనిపించింది. సెల్ఫోన్లైట్లు వేసుకుని, అటుగా వచ్చే వాహనాల వెలుతురు మధ్య పలువురు పోలీసులు భోజనాలు చేస్తూ ఇబ్బందులు పడ్డారు. -
గంజాయి పీలుస్తున్న వ్యక్తి అరెస్ట్
నెల్లిమర్ల: గంజాయి పీలుస్తూ పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై బి.గణేష్. తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ నారాయణపట్నం బ్రిడ్జి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ ప్రాంతంలో ఒక వ్యక్తి అక్రమంగా గంజాయి కలిగి ఉండి పీలుస్తున్నాడన్న సమాచారంపై సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే జరజాపు పేటకు చెందిన యశ్వంత్ అనే వ్యక్తి వద్ద 100 గ్రాముల గంజాయి, గంజాయి పీల్చడానికి ఉపయోగించే పరికరాలను సీజ్ చేసి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. నిందితుడు గడిచిన ఆరేడు సంవత్సరాల నుంచి గంజాయి వినియోగిస్తున్నాడని, ఒడిశా రాష్ట్రంలోని రాయగడ రైల్వేస్టేషన్ ప్రాంతంలో కొనుక్కుని ఇక్కడికి తీసుకొని వచ్చి వినియోగిస్తున్నట్లు విచారణలో చెప్పినట్లు తెలిపారు. మండలంలో ఎవరైనా గంజాయి వినియోగించినా.. గంజాయి కలిగి ఉన్నా, ఏ రూపంలో అయినా గంజాయికి సంబంధించి కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గణేష్ హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారాన్ని ఫోన్ 912110944 నంబర్కు తెలియజేయాలని కోరారు. దాడుల్లో సిబ్బంది దామోదర్ రావు, వీఆర్వో వెంకటలక్ష్మి, మహిళా పోలీస్ పాల్గొన్నారు. -
కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా
● జూలై 9న చేపట్టనున్నట్లు వెల్లడి విజయనగరం గంటస్తంభం: లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఈ నెల 20న కలెక్టరేట్ ఎదుట జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా పడినట్లు కేంద్ర కార్మిక సంఘాల నేతలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఐటీయూ, ఏఐఎఫ్టీయూ న్యూ, ఇఫ్టూ దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశం ఇంత తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్రప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్ల అమలును దూకుడుగా ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు. కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోందని కేంద్ర కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. జూలై 9వ తేదీన సమ్మె జయప్రదం చేసేందుకు సమాయత్తం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలయంపై పడిన పిడుగుగంట్యాడ: మండలంలోని పెదవేమలి గ్రామంలో కాళీమాత ఆలయంలో కొలువైన లక్ష్మీగణపతి ఆలయంపై ఆదివారం మధ్యాహ్నం పిడుగు పడింది, పిడుగు శబ్దానికి ఆలయం గోపురం పెచ్చులు ఊడిపోయాయి. ఆలయం కింద భక్తులు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వ్యక్తిపై దాడి కేసు నమోదుసంతకవిటి: మండలంలోని పొనుగుటివలస గ్రామంలో బొండాడ నారాయణ తమ్ముడి కొడుకు బొండాడ గణేష్ శనివారం రాత్రి పెదనాన్న నారాయణపై వెదురు కర్రతో దాడి చేయడంతో గణేష్పై కేసు నమోదు చేశామని ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బొండాడ నారాయణ, బొండాడ గణేష్ కుటుంబాల మధ్య ఉన్న పాత తగాదాల నేపథ్యంలో, శనివారం రాత్రి తాగిన మైకంలో గణేష్ నారాయణపై దాడి చేయడంతో నారాయణ చేతికి గాయమైంది..దీంతో నారాయణ ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నారాయణ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తివ్వాకొండల్లో ఏనుగుల సంచారంభామిని: మండలం సరిహద్దుగా గల తివ్వాకొండల్లో ఏనుగుల గుంపు తాగునీటి కోసం తహతహ లాడుతోంది. ఈ మేరకు ఆదివారం భామిని–గుమ్మలక్ష్మీపురం మండలాల సరిహద్దుల్లో ఏనుగుల గుంపు పచార్లు కొట్టినట్లు గిరిజనులు తెలిపారు. రాతి గుట్టల్లో నడుస్తూ నీటి కోసం పయనిస్తున్నట్లు చెప్పారు. ఒక పక్క మండు వేసవితో అల్లాడుతున్న పరిస్థితిలో ఏనుగుల గుంపు అవస్థలు పడుతున్నట్లు తెలియజేశారు. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యమెరకముడిదాం: మండలంలోని ఎం.గదబవలస గ్రామానికి చెందిన ఆరంగి అప్పలనాయుడు (42) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆరంగి అప్పలనాయుడు తరచూ మద్యం తాగుతుండడంతో కుటుంబకలహాలు నెలకొన్నాయి, ఈ క్రమంలో మనస్తాపం చెందిన అప్పలనాయుడు ఆదివారం ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుదరాయవలస ఎస్సై జె.లోకేష్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి అప్పలనాయుడు మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వేశాఖ నిర్లక్ష్యం
● ఈ ఏడాదీ మామిడి ఎగుమతులు నిల్ ● కిసాన్ రైళ్లకు ప్రాధాన్యం కల్పించని అధికారులు ● అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేక.. ప్రత్యామ్నాయ మార్గాల వైపు రైతులు ● సాధారణ రైళ్ల కై నా... డిస్కౌంట్ లిచ్చి నడపని అధికారులు ● తూతూ మంత్రంగా ఎగుమతిదారులతో మంతనాలు ● నష్టాలబాట పట్టలేక రోడ్డు రవాణా వైపే రైతుల మొగ్గుఅవసరం మేరకు అడిగాం రైల్వేశాఖ ద్వారా ఏటా మామిడి ఎగుమతులు రాయితీపై పంపించేవారం. కిసాన్ రైళ్లను అందించలేదు. జనరల్ బోగీల ద్వారా ఎగుమతులు చేసేందుకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. రోడ్డు రవాణా ద్వారా మామిడి ఎగుమతులును నేరుగా స్టాక్ పాయింట్కే పంపించేస్తున్నాం. దీనివల్ల ఖర్చు తగ్గింది. రైల్వే అధికారులు కొంచెం ప్రాధాన్యం కల్పించి, రాయితీలు కల్పించి ఉంటే బాగుండేది. – ముదునూరి నారాయణమూర్తి రాజు, మేంగో అసోసియేషన్ ప్రతినిధి, విజయనగరంమేంగో అసోసియేషన్లతో సమావేశం నిర్వహించాం ఈ ఏడాది మామిడి పంటను ఎగుమతులు చేసే విధంగా చూడాలని మేంగో అసోసియేషన్లతో సమావేశాన్ని నిర్వహించాం. అయితే పంట తక్కువ ఉందన్న కారణంగా వారంతా సుముఖత చూపించలేదు. పైగా కిసాన్ రైళ్లు, రాయితీలు కావాలని అడుగుతున్నారు. దీనిపైన ఉన్నతాధికారులకు నివేదించాం. జనరల్ బోగీలను ఇస్తామన్నాం. సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. – బి. వెంకట సత్యనారాయణ, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్, విజయనగరంవిజయనగరం టౌన్: మామిడి ఎగుమతులనుద్దేశించి విజయనగరం ఖ్యాతిని దేశ ప్రధాని మోడీ ప్రస్తుతించిన సంగతి తెలిసిందే. అటువంటి మామిడి ఎగుమతులపై రైల్వేశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో గతేడాది ఎగుమతుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది కూడా పంట పూర్తయిపోయి, ఇతర మార్గాల గుండా వెళ్లిపోతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం చలించకపోవడం గమనార్హం. సంబంధిత మేంగో అసోసియేషన్లతో తూతూమంత్రంగా సంప్రదింపులు చేసి వదిలేయడంతో వ్యాపారస్తులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టిసారించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏమాత్రమైనా వ్యాపారస్తులకు అవకాశం కల్పించి, రాయితీలిచ్చినట్లయితే ఈ ఏడాదైనా మామిడి పంట రైళ్ల ద్వారా వెళ్లేది. కానీ కేవలం నిర్లక్ష్యం కారణంగానే కోట్లాది రూపాయలను రైల్వేశాఖ నష్టపోయిందనడంలో అతిశయోక్తిలేదు. ఏడాదికోమారు పండే మామిడి పంటను ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు రైల్వే ద్వారా ఎగుమతులు చేస్తూ ఎంతో కొంతమేర రైతులు లాభాన్ని చూద్దామనుకుంటుంటారు. అయితే చద్దన్నం కన్నా ఊరగాయ ఖర్చే ఎక్కువ అన్న చందాన ప్రస్తుతం రైతుల పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా మామిడి పంటను రైతన్నలు బుట్టలు కట్టి, ప్యాకింగ్లు చేసి రైల్వే ద్వారా ఇతర ప్రాంతాలకు పంపించే మేంగో అసోసి యేషన్కు అమ్మకాలు చేపట్టడమే కాకుండా దగ్గరుండి బుట్టలను రైలుపెట్టెల్లో సర్ది మరీ పంపిస్తుంటారు. అయితే గతేడాది కూడా రైల్వేశాఖ నిర్లక్ష్యం కారణంగానే మామిడి ఎగుమతుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తలెత్తింది. కేవలం అధిక లభార్జానే ధ్యేయంగా రైల్వేశాఖ పనిచేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సాధారణ ఎక్స్ప్రెస్, పాసింజర్ రైళ్ల టికెట్ల ధరలను రైల్వేశాఖ పెంచేసింది. జనరల్ బోగీలతో పాటు స్లీపర్క్లాస్లను కుదించేసింది. ఏసీ భోగీలకు ప్రాధాన్యం కల్పించి సామాన్యుడి నడ్డి విరగ్గొట్టింది. మామిడి ఎగుమతులను కరోనా వంటి విపత్కర సమయంలోనూ కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టి రైతులకు వెన్నుదన్నుగా నిలబడిన రైల్వేశాఖ కరోనా తర్వాత సగం ధరకే వచ్చే కిసాన్ రైళ్లకు స్వస్తిపలికింది. దీంతో సరైన పంటలేక, చాలీచాలని లోడ్లను వ్యాపారస్తులు నలుగురైదుగురు కలిసి రైళ్ల ద్వారా పంపిద్దామంటే కిసాన్ రైళ్లు లేకుండా పోయాయి. సాధారణ గూడ్స్ ద్వారా పంపిద్దామంటే నాలుగైదు బోగీలే తప్ప మిగతావన్నీ ఖాళీగానే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతి బోగీకి డబ్బులు చెల్లించాల్సిందే. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. దానిమూలంగా ప్రత్యామ్నాయమార్గాలవైపు వ్యాపారులు దృష్టిసారించారు. ఉన్నతాధికారుల బాధ్యతా రాహిత్యం కారణంగానే రెండేళ్లుగా మామిడి ఎగుమతుల్లేకుండా పోయాయని పలువురు వ్యాపారస్తులు అభిప్రాయపడ్డారు. -
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
విజయనగరం: చెస్అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు స్పందన లభించింది. రింగ్రోడ్లో ఉన్న ఫైర్ చెస్ స్కూల్లో అసోసియేషన్ కార్యదర్శి కేవీ జ్వాలాముఖి ఆధ్వర్యంలో అండర్–7,9,11,13 విభాగాలతో పాటు ఓపెన్ విభాగాల్లో నిర్వహించిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 80 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో రాజాంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పోటీలను వి.వెంకటేష్, ధనలక్ష్మి, పద్మావతి, అర్చనలు పర్యవేక్షించారు. -
కిడ్నాపైన వివాహిత హత్య
శృంగవరపుకోట: మండలంలోని వెంకటరమణ పేట గ్రామానికి చెందిన వివాహిత కిడ్నాప్కు గురికావడం..ఆపై ఆమె మృతదేహం బావిలో లభ్యం కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎర్రాప్రగడ వెంకటక్ష్మి (38) శనివారం రాత్రి 10 గంటల సమయంలో కుమారై రిషితతో కలిసి బహిర్భూమికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత రిషిత ఇంటికి వచ్చి ఎవరో గుర్తుతెలియని కొందరు వచ్చి అమ్మను ఆటోఎక్కించి తీసుకెళ్లిపోయారని, తనను పక్కకు తోసేశారని తండ్రి సత్యనారాయణ, అన్నయ్య హరీష్కు చెప్పగా వారు పరిసర గ్రామాలకు బైక్లతో వెళ్లి వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు హరీష్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కిడ్నాప్ అయిన వివాహిత ఆచూకీ కోసం సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఆదివారం ఉదయం డాగ్స్క్వాడ్తో ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా గ్రామసమీపంలోని బావిలో మహిళ మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. వెలికితీసిన మృతదేహాన్ని వెంకటలక్ష్మిగా గుర్తించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించి వివరాలు సేకరించారు. బావిలో లభ్యమైన మృతదేహం ఉలిక్కిపడిన గ్రామస్తులు -
మాటలకందని విషాదం
అమ్మా... అందరం కలిసి ఆడుకుంటామంటే సరే అన్నారు.. అదే పిల్లల చివరి మాట అని ఆ తల్లులకు తెలియదు.. అక్కడే మృత్యువు కాపుకాసి ఉందని గుర్తించలేకపోయారు.. మూడు గంటల పాటు పిల్లలు కనిపించకపోయే సరికి తల్లిడిల్లిపోయారు.. ఏమయ్యారో అంటూ ఊరంతా గాలించారు.. చివరకు కారులో ప్రాణవాయువు అందక విలవిల్లాడుతూ విగత జీవులుగా కనిపించిన పిల్లలను చూసి కుప్పకూలిపోయారు.విజయనగరం క్రైమ్: సమయం మధ్యాహ్నం 2 గంటలు.. గ్రామంలోని పెళ్లివేడుకలో పెద్దలు, ఆటపాటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. ఆటలాడుతూ గ్రామ బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న కారులోకి నలుగురు చిన్నారులు వెళ్లారు. పొరపాటున డోర్లు వేయడంతో లాక్ అయ్యాయి. అంతే.. వారికి ప్రాణ వాయువు అందలేదు. కాపాడాలంటూ వారి ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. మూడుగంటల తర్వాత వెతుకుతూ వెళ్లిన పెద్దలకు కొనఊపిరితో కారులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులు కనిపించారు. డోర్లు బద్దలగొట్టి చిన్నారులను బయటకు తీసినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటనతో విజయనగరం సమీపంలోని ద్వారపూడిలో మృత్యుఘోష వినిపించింది. సర్వజన ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మాటలకందని విషాదం అందరూ పదేళ్లలోపు పిల్లలే. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా సాకుతున్నారు. పిల్లలు ఆడుకుంటేంటే సంబర పడ్డారు. పెళ్లివేడుకలో బిజీ అయ్యారు. ఒకేసారి కారు రూపంలో కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), పండి ఉదయ్ (7), బూర్లె జాస్రిత(8)ను మృత్యువు కాటేయడంతో కన్నీరుకార్చారు. విగతజీవులుగా మారిన చిన్నారులను పట్టుకుని బోరున విలపించారు. కడుపుకోత.. మృతిచెందిన చిన్నారుల్లో బూర్లె చారులత, జాస్రిత అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకే సారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, ఆనంద్లు విషాదంలో ముని గిపోయారు. దేవుడా.. కడుపుకోత మిగిల్చావా అంటూ విలపించారు. సర్వజన ఆస్పత్రి మార్చురీ వద్ద ఉన్న కుమార్తెల మృతదేహాలను చూసిన ఉమ ఓ దశలో సొమ్మసిల్లి పోయింది. ఉదయ్ తల్లిదండ్రులు బుచ్చిబాబు, భవానీ, మణీశ్వరి తల్లిదండ్రులు సురేష్ అరుణలు సైతం బిడ్డల మృతదేహాలను పట్టుకుని రోదించారు.ఇళ్ల మధ్యనే ఘటన... మృత్యువుకు కారణమైన కారు వీధిలో ఇళ్ల మధ్యనే ఉంది. దాని పక్కగుండానే అందరూ రాకపోకలు సాగించినా.. అందులో ఉన్న చిన్నారులను గుర్తించలేకపోయారు. వారి ఆర్తనాదాలను ఆలకించలేకపోయారు. కారు అద్దాలు నలుపువి కావడం కూడా దీనికి ఓ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్టౌన్ ఎస్ఐ రామ్గణేష్లు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వజన ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలు సేకరించారు.కారు ఎవరిది? బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు ఎవరిది..? అక్కడే ఎందుకు పార్క్ చేశారు? డోర్కు లాక్ ఎందుకు వేయలేదు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్వారపూడిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు సంబంధించి వైజాగ్ నుంచి ఆ కారు వచ్చినట్టు సమాచారం. కారు ఓనర్, డ్రైవర్ ఒక్కరేనని తెలిసింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. -
గుడి సేవకులు.. దేవుడిచ్చిన బంధాలు
పల్లకీలోని అమ్మాయి పేరు హిమబిందు. తండ్రి ఆవులశెట్టి చంద్రశేఖరప్ప వస్త్ర దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. బీసీఏ పూర్తి చేసిన ఈమె ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలు. మూడేళ్లుగా తన వంతు సేవగా ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎదురొచ్చి టెంకాయ కొడితే కానీ ఆ బృందం బయలుదేరుతున్న బస్సు కదలదు. అంతటి సెంటిమెంట్. పల్లకీ మోస్తున్నారంటే వాళ్లు సొంత మేనమామలు అనుకుంటే పొరపాటు. గుడి సేవ బృందంలోని సభ్యులు ఎంచుకున్న తోవ ఇది. తమతో పాటు సేవలో పాల్గొనే అమ్మాయిల పెళ్లి సందర్భంగా ఈ ‘పల్లకీ సేవ’ ఇంటి మనుషులుగా సొంత ఖర్చుతో నిర్వహిస్తుండటం విశేషం. కర్నూలు కల్చరల్: అమ్మాయిని ఓ అయ్య చేతిలో పెట్టాలంటే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. పెళ్లి చూపులు మొదలు.. అప్పగింతల వరకు ఒకటే హడావుడి. కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారుగా బతుకున్న రోజుల్లో బంధాలు, బంధుత్వాలు గుర్తుకు తెచ్చుకున్నా కళ్ల ముందు మెదలని పరిస్థితి. సొంతూళ్లకు దూరంగా, సప్త సముద్రాలకు అవతల ఉద్యోగాలు చేస్తున్న వారికి వరుసలు తెలియవు, ఉన్న ఊళ్లో ఎవరిని ఏమని పిలవాలో దిక్కుతోచదు. అలాంటిది పెళ్లి అనగానే.. తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతాయి. అమ్మో.. ఇంత తక్కువ సమయమా? అనే మాట వినపడటం సర్వ సాధారణం. అయితే ముక్కూమొహం తెలియని వాళ్లు, మేమున్నామని భరోసా కల్పిస్తే.. సొంత మేనమామళ్లా హడావుడి చేస్తే.. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మెలుగుతుంటే.. జీవితంలో అంతకంటే సంతోషం ఏముంటుంది. ఈ కోవకు చెందినదే ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’. కార్యక్రమం చేశామా, వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా.. ఈ బృందం ఓ కుటుంబంలా మెలుగుతోంది. కష్టాలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. సంతోషాలను కలిసి పంచుకుంటున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. వాట్సాప్ గ్రూపులో 1,500 పైనే సభ్యులు మొదట అరకొరగా మొదలైన మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత వాట్సాప్ గ్రూపు దినదిన ప్రవర్దమానంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఈ గ్రూపులో 1,500 మందికి పైగానే సభ్యులు. ఎంపిక చేసుకున్న గుడి వివరాలను గ్రూపులో తెలియజేసి కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకునేందుకు ఆసక్తి కలిగిన సభ్యుల వివరాలతో జాబితా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైన మేరకు సభ్యులకు అవకాశం కలి్పస్తున్నారు. మరో కార్యక్రమంలో మిగిలిన వారికి ఆ భాగ్యం లభిస్తోంది. ఇప్పటి 123 దేవాలయాల్లో కార్యక్రమం నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో మొదలైన కార్యక్రమం ఇప్పటి వరకు 123 దేవాలయాల్లో తమ సేవను విస్తరించడం విశేషం. కాశీలోని విశాలక్ష్మి గుడిలో ఏకంగా 9 రోజుల పాటు ఈ బృందం తమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకీలో పెళ్లి కూతురు‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలైన హిమబిందు స్వస్థలం నంద్యాల కాగా.. వివాహం ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించారు. వరుడు వీర నవీన్. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. వివాహం సందర్భంగా బృందం సభ్యులు సు మారు 150 మంది హాజరయ్యారు. వీరు పల్లకీని తీసుకొచ్చి పెళ్లి మంటపానికి తీసుకొస్తున్న తీరుకు వివాహానికి హాజరైన అతిథులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరికి ఎవరో అన్నట్లుగా బతుకుతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని చర్చించుకోవడం విశేషం. -
చిన్నారుల ఉసురు తీసిన కారు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని ద్వారపూడి గ్రామంలో విషాదం అలముకుంది. ఆటలాడుతూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. విజయనగరం రూరల్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడి గ్రామం, బీసీ కాలనీలో ఆదివారం ఒక పెళ్లివేడుక జరిగింది పెళ్లి హడావిడిలో ఉన్న తల్లిదండ్రులను విడిచి, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకటో తరగతి చదువుతున్న కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), 2వ తరగతి చదువుతున్న బూర్లె జాస్రిత (8), 3వ తరగతి చదువుతున్న పండి ఉదయ్ (7) సమీపంలోని నీళ్ల ట్యాంక్ వద్ద ఆడుకోవడానికి వచ్చారు. ఆటల్లో ఆటగా అక్కడే ఆగి ఉన్న ఒక కారులోకి ఎక్కారు. అకస్మాత్తుగా డోర్ లాక్ కావడంతో లోపల చిక్కుకుపోయారు. కేకలు వేసినా బయటకు వినపడక పోవడంతో నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి సందడిలో ఉన్న తల్లిదండ్రులు, ఎంతకూ తమ పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో కారులో పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.వెంటనే కారు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్నారన్న భావనతో 108 వాహనంలో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతిచెందినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుల్లో చారులత, జాస్రిత అక్కచెల్లెళ్లు. ఇద్దరు కుమార్తెలు మృతిచెందడంతో తండ్రి ఆనంద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటనలో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్టౌన్ ఎస్ఐ రామ్గణేష్ లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
తీవ్ర విషాదం.. కారు డోర్ లాక్ పడి నలుగురు చిన్నారుల మృత్యువాత
విజయనగరం: జిల్లాలోని ద్వారపూడి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు డోర్ లాక్ పడటంతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు.అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేశారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి (8) చరిష్మా (6), కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు ఇలా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డలు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతిచెందిన చిన్నారులపై పడి వారు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. చిన్నారుల తల్లిదండ్రుల్ని బంధువులు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా వారిని ఆపడం కష్టసాధ్యంగా మారింది. -
● చెరువులను తలపిస్తున్న రోడ్లు
గజపతినగరం: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గజపతినగరం మండల కేంద్రం మెంటాడ జంక్షన్ నుంచి పురిటిపెంట ఆంజనేయ స్వామి గుడి వరకు బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. అయితే పనులు అస్తవ్యస్తంగా ఉండడంతో శనివారం కురిసిన వర్షానికి రోడ్డంతా నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందిపడ్డారు. రహదారి మరమ్మతులపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్అండ్బీ జేఈ అజయ్ వద్ద ప్రస్తావించగా.. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో రోడ్డుపై నీరు నిలిచిపోతోందని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అలాగే గజపతినగరం నుంచి మెంటాడ వరకు నాలుగన్నర కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. -
సికిల్సెల్ ఎనిమియాతో తస్మాత్...
● డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: సికిల్సెల్ ఎనిమియా వ్యాధిని త్వరగా గుర్తించాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నేషనల్ సికిల్సెల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సికిల్సెల్ ఎనిమియాపై జిల్లా లోని పీహెచ్సీల వైద్యాధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో శనివారం ఆమె పాల్గొని మాట్లాడారు. సికిల్సెల్ ఎనిమియా వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా పని చేయాలన్నారు. సికిల్సెల్ ఎనిమియా వ్యాధిగ్రస్తులకు రక్తం తగ్గిన వెంటనే మళ్లీ ఎక్కించాలన్నారు. ఎంఎల్హెచ్పీలకు, ఏఎన్ఎంలకు వైద్యాధికారులు శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణలో డీఎల్వో డాక్టర్ కె.రాణి, డాక్టర్ అర్చనదేవి, డాక్టర్ కిషోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పిడుగులు పడేటప్పుడు తస్మాత్..: కలెక్టర్
పార్వతీపురం టౌన్: పిడుగులు పడేటప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణంలో మార్పులపై రాష్ట్ర విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఫోన్ ద్వారా కూడా అందిస్తుందని, వాటి ఆధారంగా ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. వాతావరణ విపత్తులపై ఏపీ విపత్తుల సంస్థ ఫోన్లలో అప్రమత్తం చేస్తుందని వాటిని పాటించాలని కోరారు. వివిధ ప్రాంతాల్లో పిడుగు పాటుకు ఒకరిద్దరు మృతి చెందినట్టు సమాచారం అందుతుందని ప్రజలందరూ వీటి పట్ల జాగ్రత్త వహించాలన్నారు.విద్యుదాఘాతంతో రెండు దున్నల మృతి భామిని: మండలంలోని సొలికిరికి చెందిన బిల్లింగి కురువులకు చెందిన రెండు దున్నపోతులు విద్యుదాఘాతానికి గురై శనివారం మృతి చెందాయి. వీటి సుమారు రూ.లక్ష ఉంటుందని చెబుతున్నారు. సొలికిరి నుంచి ఇసుకగూడ వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలు ఒరిగి ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయం భామిని విద్యుత్ శాఖాధికారులకు తెలియడంతో ప్రమాదాన్ని వచ్చి చూశారు. అనంతరం పశు సంవర్ధక శాఖ అధికారులు వచ్చి దున్నపోతులకు పోస్టుమార్టం చేసి బాధిత రైతుకు అప్పగించారు.బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు బొండపల్లి: మండల కేంద్రంలోని జాతీయ రహదారి 26పై నడిచి వెళ్తున్న కిలపర్తి సన్యాసప్పడును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయాల పాలయ్యాడు. సన్యాసప్పడు జాతీయ రహదారిని దాటే క్రమంలో విజయనగరం వైపు నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన పీడీఎస్ బియ్యం పార్వతీపురం రూరల్: మండలంలోని గోచెక్క గ్రామంలో ఆంధ్రా నుంచి ఒడిశాకు అక్రమంగా బొలెరో వాహనంలో పది క్వింటాళ్ల ప్రభుత్వ ఉచిత సరఫరా బియ్యాన్ని తరలించేందుకు సిద్ధం చేస్తుండగా ముందస్తు సమాచారంతో తరలించిన వారితో పాటు బొలెరో వాహనం పట్టుకున్నామని విజిలెన్స్ ఎస్ఐ బి.రామారావు తెలిపారు. బొలెరోలో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. గోచెక్క గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ బియ్యాన్ని తరలించేందుకు సిద్ధమవుతుండగా శనివారం పక్కా సమాచారంతో దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పట్టుబడిన బియ్యాన్ని ప్రభుత్వ గోదాంలకు తరలించినట్టు తెలిపారు. అలాగే వ్యక్తిపై కేసు నమోదు చేసి వాహనాన్ని పార్వతీపురం గ్రామీణ ప్రాంత పోలీసుస్టేషన్కు అప్పగించామన్నారు. దాడుల్లో సీఎస్డీటీ ఎం.రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. పాడైన రైల్వేగేట్ ● గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం రైల్వే గేట్ శనివారం రాత్రి పాడవ్వడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. రెండువైపులా సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటు వైజాగ్, విజయనగరం, గజపతినగరం.. ఇటు ఒడిశా, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి తదితర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సిబ్బంది వచ్చి సమస్య పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
కలికిరి: ఈత సరదా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు తీసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కలికిరి జేఎన్టీయూ కళాశాల నుంచి శనివారం మధ్యాహ్నం సుమారు పది మంది విద్యార్థులు కళాశాల సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు ఈతకెళ్లారు. ఈత వచ్చిన వారు బావిలో దిగగా.. ఈత రానివారు గట్టుపై కూర్చుని చూస్తున్నారు. ఈ క్రమంలో సివిల్ ఇంజిరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందిన సూర్యనారాయణ కుమారుడు చింతా రాకేష్(18) బావిలోకి ఒడ్డుపై నుంచి దూకాడు. బావిలోని పూడిక మట్టిలో ఇరుక్కుపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడటానికి ప్రయత్నించినా ఉపయోగం లేక పోవడంతో కళాశాలకు వెళ్లి అధ్యాపకులకు, సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పీలేరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సాయంతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ మదన్మోహన్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల పట్ల పర్యవేక్షణ కరువు... జేఎన్టీయూ కళాశాల విద్యార్థుల పట్ల పర్యవేక్షణ కరువవ్వడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు నిత్యం కళాశాల బయటకు వెళ్తూ వస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. రాత్రి సమయాల్లోనూ ఇలాగే జరుగుతోందని, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బందిపై మండిపడ్డారు. గతంలోనూ ఇలా ఓ విద్యార్థి ఈతకెళ్లి మృతి చెందినా కళాశాల అధికారులకు కనువిప్పు కలగలేదని చెప్పారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
బొబ్బిలి రూరల్: రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసే వారే నిజమైన హీరోలని పలువురు వక్తలు అన్నారు. మండలంలోని కోమటిపల్లి తాండ్రపాపారాయ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్, రెడ్క్రాస్, కారుణ్యఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వ హించారు. ఈసందర్భంగా కళాశాల విద్యార్థులు పలువురు రక్తదానం చేశారు. వారిని నిర్వాహకులు అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ జిల్లా చైర్మన్ జేసీ రాజు,ఎకై ్సజ్ సీఐ చిన్నంనాయుడు, ఎన్ఆర్ఐ ఆస్పత్రి సీఈఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘గిరి వెలుగు’కు తెర!
● కార్యాలయ సామగ్రి తరలింపు ● డీఆర్డీఏలో విలీన ప్రక్రియకు శ్రీకారం పార్వతీపురం: గిరిజన మహిళలకు ప్రత్యేకంగా లింక్ రుణాలు, సబ్సిడీలు, సంక్షేమ పథకాల అమలుకు ఏర్పాటు చేసిన గిరి వెలుగు (టీఎంపీయూ) కార్యాలయాన్ని డీఆర్డీఏ కార్యాలయంలో విలీనం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. శనివారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో వున్న గిరివెలుగు కార్యాలయంలో వున్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర రికార్డులను తరలించారు. గిరిజన మహిళలకు ఉపయుక్తంగా ఉండేందుకుగాను గిరిజన మహిళా సంఘాల అభ్యున్నతికి దోహదపడేలా గిరివెలుగును దశాబ్ద కాలం క్రితం ఏర్పాటు చేశారు. అయితే గిరి వెలుగు కార్యాలయాన్ని డీఆర్డీఏలో విలీనం చేయడంతో గిరిజనులకు ఐటీడీఏలో ఇక నుంచి వెలుగు విభాగం ఉండని పరిస్థితి ఏర్పడనుంది. ఈ విషయమై గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్మార్ మాట్లాడుతూ గిరిజన మహిళా సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గిరివెలుగును డీఆర్డీఏలో విలీనం చేయడం వల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇక మీదట గిరిజన మహిళలకు ప్రత్యేక సేవలు, పథకాలు అందే పరిస్థితి వుండదన్నారు. ఈ చర్య గిరిజన హక్కులను కాలరాయడమే అవుతుందన్నారు. ప్రభుత్వం డీఆర్డీఏలో గిరివెలుగు విలీనం ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఐటీడీఏలో గ్రీవెన్స్ ఎత్తివేయడంతో కలెక్టర్ కార్యాలయంలో అందరితో పాటే గిరిజనులను సమస్యలు తెలియజేయాల్సి వస్తుందని, గిరి వెలుగు కార్యాలయం డీఆర్డీఏలో విలీనంతో గిరిజనులకు సేవలందక మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వుందన్నారు. ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరారు. -
నిబంధనల శాపం
పల్లె విద్యార్థులకు● ఉచిత విద్యకు గ్రామీణ విద్యార్థుల దూరం ● ఒకటి, మూడు కిలోమీటర్ల నిబంధనలతో ఇక్కట్లు ● జిల్లాలో 302 ప్రైవేటు పాఠశాలల్లో చేరేందుకు అవకాశం ● దరఖాస్తు చేసేందుకు ఈ నెల 19 వరకు అవకాశం ● నిబంధనలు సడలించాలని కోరుతున్న తల్లిదండ్రులు, విద్యా వేత్తలు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు ప్రభుత్వ నింబధనల ప్రకారమే సీట్లు కేటాయిపు ఉంటుంది. విద్యార్థి నివాసం నుంచి ఒక కిలోమీటరు, మూడు కిలోమీటర్లు పరిధి మాత్రమే ఉండాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి అవకాశం కల్పించడం పేద విద్యార్థులకు వరం లాంటిది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు పక్కాగా పాటించాలి. – యు.మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరంరామభద్రపురం: విద్యాహక్కు చట్టం – 2009 ప్రకారం పేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించాలి. అయితే పాఠశాల విద్యార్థి నివాసం నుంచి ఒకటి లేదా మూడు కిలోమీటర్లలోపు ఉండాలనే నిబంధన గ్రామీణ విద్యార్థులకు శాపంగా మారింది. ఈ నిబంధనలతో పట్టణాల్లోనే ప్రైవేట్ పాఠశాలలు ఉండడంతో ఆ పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఉచిత విద్య సీట్లు పొందే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో సీట్లను పొందలేకపోతున్నారు. శాపంగా మారిన నిబంధనలు ఉచిత సీట్లు కేటాయింపుల్లో ప్రభుత్వ నిబంధనలు గ్రామీణ విద్యార్థులకు శాపంగా మారాయి. విద్యార్థి నివాసం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో సీట్లు పొందేందుకు మొదటగా అవకాశం కల్పిస్తారు. తరువాత పరిస్థితులను బట్టి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అంటే ఒక కిలోమీటరు పరిధిలోని విద్యార్థుల సీట్లు కేటాయింపులో మిగిలి ఉంటే 3 కిలోమీటర్లు పరిధిలో ఉన్న విద్యార్థికి కేటాయించేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలలు ఉండేది పట్టణాల్లోనే కనుక పట్టణ పరిసర ప్రాంతాల వారికే ఉచిత సీట్లు దక్కుతాయి. అయితే గ్రామీణ పేద విద్యార్థులకు దక్కే అవకాశం లేదు. ఈ నిబంధనలను డలించి గ్రామీణ విద్యార్థులకు కూడా సీట్లు పొందే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు. పేదలకు 25 శాతం ఉచిత సీట్లు.. పేద విద్యార్థులకు ఉచిత సీట్లు పొందేందుకు ప్రభుత్వం ఈ నెల 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్, పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనాధలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. డ్రాపౌట్లు లేకుండా చర్యలు చేపట్టడమే కాకుండా, పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు. జిల్లా వ్యాప్తంగా 302 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా విద్యాహక్కు చట్టం – 2009 సెక్షన్ 12(1)సీ ద్వారా గత ఏడాది 283 పాఠశాలల్లో 1326 మంది పేద విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో అధిక శాతం విద్యార్థులు ఆయా విద్యా సంస్థల్లో కొనసాగుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పక్కాగా అమలు చదువు కొనుక్కొనే స్థోమత లేని ఎంతో మంది పేద విద్యార్థులకు చదువుకు అంతరాలు, అడ్డుగోడలు ఉండకూడదని ఆలోచించి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలనే నిబంధనను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో గతంలో అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేసింది.నిబంధనలు సడలించాలి ఉచిత సీట్లు కేటాయింపుల్లో ప్రభుత్వ నిబంధనలను సడలించాలి. విద్యార్థి నివాసం నుంచి ఒక కిలో మీటరు, మూడు కిలోమీటర్లు పరిధి విధించడం ద్వారా గ్రామీణ పేద విద్యార్థులకు సీట్లు పొందే అవకాశం లేదు. మండలాన్ని యూనిట్గా తీసుకుని సీట్లను కేటాయిస్తే బాగుంటుంది. దీంతో గ్రామీణ విద్యార్థులు ఉచిత సీట్లు పొందే అవకాశం కలుగుతుంది. పక్కాగా ప్రణాళికబద్ధంగా అమలు చేయాలి. – కె.విజయగౌరి, యూటీఎఫ్ నాయకురాలు -
ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి
● ఇంచార్జ్ డీఆర్వో మురళి విజయనగరం అర్బన్: ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చనని ఇంచార్జ్ డీఆర్వో మురళి అన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తమ చాంబర్లో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఏడాది పొడవునా ఎప్పుడైనా ఫారం 6లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదే విధంగా మార్పులు చేర్పుల కోసం ఫారం 8, తొలగింపుల కోసం ఫారం 7లో దరఖాస్తు చేయాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన పోలింగ్ బూత్ ఎక్కడైనా ఉంటే వాటిని తొలగించేందుకు ప్రతిపాదనలు పంపిస్తామని వాటి వివరాలను అందజేయాలని కోరారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1500 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే మరొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తామని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 1200 ఓటర్లు పైబడిన కేంద్రాలు 138 వరకు ఉన్నాయని మురళి తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నుంచి శ్రీనివాస్రెడ్డి, టీడీపీ నుంచి కుటుంబరావు, బీజేసీ నుంచి అప్పారావు, కాంగ్రెస్ నుంచి సతీష్కుమార్, జనసేన నుంచి సతీష్, బీఎస్పీ నుంచి సోములు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు నేరం : డీఎంహెచ్వో
పార్వతీపురం టౌన్: జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.భాస్కరరావు అన్నారు. అటువంటి స్కానింగ్ సెంటర్లపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా సెంటర్ల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. గర్భస్థ శిశు స్థితిగతులు, సమస్యలు తెలుసుకునేందుకే స్కానింగులు చేయాలే తప్ప, వీటిని ఆసరాగా తీసుకుని గర్భస్థ శిశు వివరాలు వెల్లడించడం నేరమన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం డీఎంహెచ్వో అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 44 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ప్రతి స్కానింగ్ సెంటరులో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు ఆయా కేంద్రాలపై ప్రోగ్రాం అధికారుల ద్వారా ఎప్పటికపుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇకపై ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే అబార్షన్ల వివరాలతో పాటు అందుకు తగిన కారణాలను తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. సీ్త్రల పట్ల వివక్ష కూడదని వివరించారు. సమాజంలో చైతన్యం తీసుకురావాలి బాలికల పట్ల వివక్ష లేకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలన్నారు. ముఖ్యంగా జూనియర్ కళాశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడం ద్వారా మంచి ఫలితాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆడపిల్లల పట్ల అవగాహన పెరిగిందని, అది మరింత పెరగడం మంచి శుభ పరిణామమని, ఆ విధంగా అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు. కమిటీ సభ్యులు సూచించిన సలహాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో మరింత పటిష్టంగా చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో డా.కేవీఎస్ పద్మావతి, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్మోహన్రావు, డీఐవో డా.ఎం.నారాయణ, డీజీవో డా.సీహెచ్ కమలకుమారి, చిన్న పిల్లల వైద్యులు డా. వి.శ్రీధర్, రేడియోలజిస్ట్ డా.ఎం.జయరాం, సామాజిక కార్యకర్త శ్రీహరి, ఇతర వైద్యులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
‘కోట’లో కొత్త కుంపటి!
బొబ్బిలి: ప్రతిపక్ష కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి అడ్డదారిలో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పదవిని హస్తగతం చేసుకునేందుకు బొబ్బిలి రాజులు ‘కోట’ వేదికగా చేస్తున్న కుటిలరాజకీయాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. సీల్డ్ కవర్ రాజకీయాలొద్దని, తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పదవి ఇస్తేనే ఓటేస్తామని తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇందులో భాగంగానే టీడీపీ కండువాలు వేసుకోవాలని నాయకులు బొబ్బిలి కోటలో శనివారం ఎంత ప్రలోభపెట్టినా తిరస్కరించారు. పదవిని అమ్ముకుందామని చూస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. గత నెల29న టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు పదిమంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు డబ్బులు ఎర వేసి క్యాంపు నిర్వహించిన సంగతి తెల్సిందే! అవిశ్వాసం నెగ్గిన తరువాత సోమవారం చైర్మన్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఈ ఎన్నిక నేపథ్యంలో బొబ్బిలి రాజకీయాలు వేడెక్కాయి. అవిశ్వాసం కోసం నోటీసు ఇచ్చిన సమయంలో మేం చైర్మన్ మార్పు కోసమే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తాం! అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అయితే మేం మద్దతు ఇస్తామని తేల్చి చెప్పారు. అయితే, అవిశ్వాసంలో టీడీపీకి సహకరించిన పది మంది కౌన్సిలర్లనూ టీడీపీ కండువాలు వేసుకునేందుకు బొబ్బిలి రాజులు కోటలోకి పిలిచారు. దీనికి ఇద్దరుముగ్గురు కౌన్సిలర్లు తలొగ్గి మాజీ మంత్రి సుజయ్, ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడుల సమక్షంలో కండువాలు వేసుకున్నట్టు తెలిసింది. మిగతావారు మేం కండువాలు వేసుకోం! ముందుగా చెప్పినట్టు ఫలానా వ్యక్తికి చైర్మన్ పదవి ఇస్తేనే కండువాలు వేసుకుంటాం అని భీష్మించుకు కూర్చున్నారు. సాధారణ ఎన్నికల మాదిరి పైరవీలు.. రేసులో ఉన్న ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు తమకు మద్దతు పలకాలని రెండు పార్టీలకు చెందిన వారిని సంపన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వ్యక్తిగతంగా కలవడం, ఫోన్లు చేసి ఎరవేయడం చేస్తున్నట్టు తెలిసింది. రూ.లక్షల్లో ఇస్తామని చెప్పడంతో పాటు చేతులెత్తాక ఇస్తామని చెబుతుండటంతో కౌన్సిలర్లు కూడా డైలమాలో పడి వెళ్దామా వద్దా అనే సంశయంలో ఉన్నారు. మరోవైపు చైర్మన్ పదవి ఎన్నికకు కేవలం కొద్ది గంటలు మాత్రమే సమయముండడంతో కౌన్సిలర్లు, టీడీపీ రాజకీయ నాయకులు, మరో పక్క చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఆ ఇద్దరు కూడా టెన్షన్లో పడ్డారు. గంటగంటకూ బేరాలు ఎలా వస్తున్నాయని కౌన్సిలర్లు ఆరా తీస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు ప్రజలిచ్చిన కౌన్సిలర్ పదవులను అమ్మకానికి పెట్టడంపై సామాజిక మాధ్యమాలు, సామూహిక వేదికల్లో జనం దుయ్యబడుతున్నారు. ఎందుకీ ట్విస్టు?: టీడీపీ కౌన్సిలర్లతో చేతులు కలిపిన పది మంది కౌన్సిలర్లు ముందుగా అనుకున్నది కాపు సామాజిక వర్గానికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాంబార్కి శరత్ను చైర్మన్ చేద్దామని. నిన్న మొన్నటి వరకూ శరత్పేరు వినిపించగా ఇప్పుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్, పట్టణానికి చెందిన రాజకీయ నాయకులు, ఇతరులకు ఫైనాన్స్ చేసే సంపన్నుడు అయిన గెంబలి శ్రీనివాసరావు పేరు రేసులోకి వచ్చింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఇతను చైర్మన్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇందుకోసం భారీ మొత్తాన్ని ముట్ట జెబుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. శరత్ కోసం టీడీపీతో చేతులు కలిపిన కౌన్సిలర్లు ఈ తతంగాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే వారంతా కండువాల కార్యక్రమాన్ని బహిష్కరించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై వారు ముందుగానే రాజులతో ఇదేమిటిలా మారిందని అడిగితే.. అబ్బే అదేం లేదు! చైర్మన్ఎన్నిక అంతా అధిష్టానం ఇష్టం! అక్కడి నుంచి సీల్డ్ కవర్లో వచ్చిన పేరునే చైర్మన్గిరీకి ఎంపిక చేస్తామని సమాధానం ఇవ్వడంతో మీమాంసలో పడిపోయారంతా!. సీల్డ్ కవర్ రాజకీయాలొద్దు! ఎవర్ని చైర్మన్ చేస్తారో ఇప్పుడే చెప్పాలని పట్టుపట్టినట్టు భోగట్టా. సీల్డ్ కవర్ రాజకీయాలొద్దని తెగేసి చెప్పిన కౌన్సిలర్లు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టు అప్పటివరకు టీడీపీ కండువాలకు తిరస్కరణ రసవత్తరంగా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక -
పూసపాటిరేగ ఏఎంసీకి...రాజకీయ గ్రహణం
పూసపాటిరేగ: నెల్లిమర్ల నియోజకవర్గంలో కొద్ది నెలలుగా జనసేన, టీడీపీ మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు ప్రజలకు శాపంగా మారింది. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ప్రజాసమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ సేవలు సరిగా అందడం లేదు. పదవుల ఎంపిక, నిధుల కేటాయింపులోనూ నిర్లక్ష్యం ఆవహించింది. దీనికి పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపికలో జాప్యమే నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం ఏఎంసీ పాలక వర్గాలు నియామకాలు పూర్తయ్యాయి. పూసపాటిరేగ ఏఎంసీ పాలక వర్గం మాత్రం ఖరారు కాలేదు. కొన్నిరోజులు జనసేనకు చెందిన వ్యక్తికి ఏఎంసీ పీఠం కట్టబెట్టారని, మరికొన్ని రోజులు టీడీపీ అభ్యర్థిని నియమించారంటూ పుకార్లు రావడమే తప్ప, పాలకవర్గం కొలువుదీరలేదు. ఏఎంసీ చైర్మన్ పదవి జనసేనకు కేటాయించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పట్టుబడుతుండగా, టీడీపీకే కేటాయించాలని పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు పైరవీలు సాగిస్తున్నట్టు సమాచారం. ఏఎంసీ చైర్మన్ పదవికి పూసపాటిరేగ మండలం చల్లవానితోట గ్రామానికి చెందిన జనసేన నాయకురాలు పతివాడ వరలక్ష్మి, డెంకాడ మండలం ఏపీఎస్పీ క్వార్టర్స్కు చెందిన టీడీపీ నాయకురాలు చిల్ల పద్మ, నెల్లిమర్ల మండలం దన్నానపేటకు చెందిన గేదెల గాయత్రి, పూసపాటిరేగ మండలం పేరాపురానికి చెందిన బొంతు ఉమా, చౌడువాడకు చెందిన పసుపులేటి లలితకళ పేర్లు వినిపిస్తున్నాయి. ఏఎంసీ పీఠం ఎవరు దక్కించుకుంటే వారే రాజకీయంగా నిలదొక్కుకుంటారన్న వాదన బలపడడంతో ఎవరికి వారే ఏఎంసీ చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. సేవలు అందని ద్రాక్షగా మారాయి. ఆదాయం ఘనం సేవలు శూన్యం పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయం జిల్లాలోనే అన్ని వ్యవసాయమార్కెట్లు కంటె అధికంగా వస్తుంది. 2024–25 సంవత్సరానికి లక్ష్యం 1.67 కోట్లు కాగా రూ.1.69 కోట్ల ఆదాయం వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. 2023–24లో రూ.1.61 కోట్లు లక్ష్యం కాగా రూ.1.69 కోట్లు, 2022–23లో 1.20 కోట్లు లక్ష్యం కాగా 1.40 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంకంటే అధిక ఆదాయం వస్తున్నా ఇటీవల కాలంలో రైతులకు సరైన సేవలు అందడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏడుగురు సిబ్బంది ఉండాలి. కార్యదర్శి, సూపర్ వైజర్తోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొన్నినెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కూటమి సర్కారు వచ్చి సుమారు ఏడాది అవుతున్నా ఏఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీకి వస్తున్న ఆదాయంపై పర్యవేక్షణ చేసే నాథుడే కరువయ్యారు. కమిటీకి వస్తున్న ఆదాయంతో మార్కెట్ కమిటీ ఉద్యోగుల జీతభత్యాలు మినహా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించ లేదు. ఇప్పటికై నా పాలకవర్గ నియామకం పూర్తిచేసి, రైతులకు సేవలందించే దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జనసేన, టీడీపీ మధ్య ఆధిపత్య పోరు నియామకం కాని ఏఎంసీ పాలక వర్గం అధిక ఆదాయం వస్తున్నా సేవలు శూన్యం ఇద్దరు ఉద్యోగులతోనే విధులు -
ఆండ్ర జలాశయం నీరు విడుదల
విజయనగరం: నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశాల మేరకు నీటిపారుదలశాఖ అధికారులు శనివారం ఆండ్ర జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. మరి కొద్దిరోజుల్లో మెంటాడ, పిట్టాడా, గజపతినగరం, రామతీర్థం మూల స్టేషన్ మీదుగా నెల్లిమర్లలోని చంపావతి నదిలోకి నీరు చేరనుంది. అక్కడ నుంచి ఇన్ఫిల్టరేషన్ ద్వారా నగరంలోని రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం చంపావతి నీటి మట్టం తగ్గిపోవడంతో నగర ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చూసేందుకు విజయనగరం కార్పొరేషన్ చర్యలు చేపడుతోంది. వేసవిలో నీటి వృథాను అరికట్టాలని ప్రజలను అధికారులు కోరారు. వ్యాయామంతో ఆరోగ్యం ● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: ప్రతిరోజు వ్యాయమం చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వేసి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలన్నారు. ఆహార నియమాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎల్ఓ కె.రాణి, ఎన్సీడీ పీఓ సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రిని అక్కడే కొనసాగిద్దామా.. విజయనగరం ఫోర్ట్: వియనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని వైద్య కళాశాలకు తరలించకుండా అక్కడే కొనసాగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో వైద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నడుస్తున్న ఆస్పత్రి నగరం మధ్యలో ఉందని, అక్కడే కొనసాగించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారన్నారు. జిజిహెచ్ భవనాల మాస్టర్ ప్లాన్ తీసుకొని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అంచానాలను తయారు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి, కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు, ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ శివ శ్రీధర్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. పేలుడు పదార్థాలతో వ్యక్తి అరెస్టు విజయనగరం క్రైమ్: ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు పేలుడు పదార్థాలు కలిగి ఉన్న వ్యక్తిని విజయనగరం పోలీసులు అరెస్టుచేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం టు టౌన్ పరిధిలోని అబాద్ వీధికి చెందిన సీరజ్ఉర్ రెహ్మాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ స్నేహితులు. వీరు పేలుడు పదార్థాలతో రెండు చోట్ల సంచరించినట్టు ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు. పహల్గాం ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వీరి సంచారంపై నిఘాపెట్టారు. జిల్లా ఎస్పీకి సమాచారం అందించడంతో ఆయన ఆదేశాల మేరకు విజయనగరం డీఎస్పీ టుటౌన్ ఎస్ఐతో కలిసి శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విజయనగరంలోని అబాద్ వీధిలో ఉంటున్న సీరాజ్ ఉర్ రెహ్మన్ ఇంటిని సోదా చేశారు. ఆయన ఇంటిలో ఉన్న అమ్మోనియం సల్ఫర్, అల్యూమినియం పౌడర్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. విషయాన్ని రాష్ట్ర డీజీపీకి చేరవేయడంతో హైదరాబాద్లోని సమీర్ను సైతం అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఎక్స్ప్లోజివ్ యాక్ట్, అన్లాఫుల్ సస్పెన్షన్ యాక్టు అరెస్టుచేసి విజయనగరం కోర్టుకు తరలించగా 15 రోజులు రిమాండ్ విధించింది. -
పక్షుల దాహార్తి తీర్చేలా..
విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, సంస్థల ఆధ్వర్యంలో శనివారం ‘స్వచ్ఛాంధ్ర –స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉష్టతాపం నుంచి ఉపశమనం (బీట్ ది హీట్) సంకల్పంతో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటుచేశారు. వేతనదారులకు టెంట్లతో నీడ కల్పించారు. పక్షుల దాహార్తిని తీర్చేందుకు మట్టికుండల్లో నీటిని నింపి చెట్లకు వేలాడదీశారు. ద్వారపూడి వెల్నెస్ సెంటర్లో ప్రభుత్వ వైద్యకళాశాల ఆధ్వర్యలో తాగునీటి ఏటీఎంను ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణలో 150 లీటర్ల మజ్జిగ పంపిణీ చేయగా, గ్రీన్ బిల్డింగ్ చేయడానికి పీసీబీ రీజనల్ కార్యాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మద్యం తాగి డ్రైవ్ చేస్తే రూ.10వేల జరిమానా
విజయనగరం క్రైమ్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎంఎస్హెచ్ఆర్ తేజచక్రవర్తి విధించినట్టు ఎస్పీ వకుల్జిందల్ శనివారం తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 85 కేసులు నమోదు చేశారు. వారిని విజయనగరం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ తేజ చక్రవర్తి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం 85 మందికి రూ.8.50 లక్షల జరిమానా విధించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్యం మత్తులో చాలామంది వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావడం, ఇతర వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. ఈ తరహా వాహనదారులను కట్టడి చేసేందుకు, ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. ఒకే రోజు 85 డ్రంకన్డ్రైవ్ కేసుల్లో రూ.8.50 లక్షల జరిమానా వసూలు -
కూటమి పాలనలో.. భద్రత కరువు
● తహసీల్దార్ను భయభ్రాంతులకు గురిచేసేలా పార్వతీపురం ఎమ్మెల్యే తీరు ● అర్ధరాత్రి సమయంలో వాట్సప్కాల్ చేయడంలో ఆంతర్యం ఏమిటి? ● అధికారి తప్పుచేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి ● చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు అధికారిపై తప్పుడు ఆరోపణలు ● ఓ ఎమ్మెల్యేపై అధికారి పోలీసులకు ఫిర్యాదుచేయడం జిల్లా చరిత్రలో ప్రథమం ● దీనిపై విచారణ జరిపించాలి ●జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఓ గ్రామంలో సమస్య వచ్చింది. నేను ఫోన్ చేశాను.. తహసీల్దార్ ఫోన్ తీయలేదంటూ స్వయానా ఎమ్మెల్యే విజయచంద్ర చెప్పారు. సమస్య వస్తే తహసీల్దార్ ఒక్కరే కాదు.. ఆపైన ఆర్డీఓ ఉంటారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ ఉంటారు. ఎవ్వరికై నా ఫిర్యాదు చేయవచ్చు. అలా కాకుండా రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి మహిళా అధికారిని దుర్భాషలాడి, భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సమంజసం. ఓ మహిళా అధికారితో రాత్రి సమయంలో ఎలా మాట్లాడతారు. ఇదే విషయాన్ని తహసీలార్ద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తను చెప్పలేని మాటలు మాట్లాడారంటూ అందులో పేర్కొన్నారు. వాస్తవానికి మొట్ట మొదటి నుంచి పార్వతీపురం ఎమ్మెల్యే పనితీరు వివాదాస్పందంగా ఉంది. అక్కడ ఎంపీడీఓలు సైతం పని చేసేందుకు భయపడుతున్నారు. సీతానగరం ఎంపీడీఓ సెలవుపై వెళ్లిపోయారు. ఆ నియోజకవర్గంలో అధికారులు పని చేయలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్థానిక ఎమ్మెల్యేను నియంత్రించేలా చర్యలు చేపట్టాలి. తహసీల్దార్పై జరిగిన ఘటనలు పునారవృతం కాకుండా చూసుకోవాలి. విజయనగరం: కూటమి ప్రభుత్వంలో అధికారులకు భద్రత కరువైందని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడి చేయించగా... తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం తహసీల్దార్ వై.జయలక్ష్మిపై స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర భయభ్రాంతులకు గురిచేయడం వివాదస్పదంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలపై నియంత్రణ కరువైందని, కనీసం సీఎం, ఇన్చార్జి మంత్రులు, మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్వతీపురం ఎమ్మెల్యేపై తహసీల్దార్ చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాలనలో కీలకమైన అధికారులను బెదిరించడం తగదన్నారు. ధర్మపురిలోని సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. అర్ధరాత్రి సమయంలో వాట్సప్ కాల్ చేయడంలో ఆంతర్యం ఏంటి... పార్వతీపురం తహసీల్దార్ జయలక్ష్మి పార్వతీపురం ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాతో పాటు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిని ఎమ్మెల్యే సైతం మీడియా సాక్షిగా ధ్రువీకరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై తహసీల్దార్ ఫిర్యాదు చేయడం ఇదే తొలి సారి. తహసీల్దార్తో వాట్సాప్ కాల్లో మాట్లాడని ఎమ్మెల్యే స్వయంగా చెప్పారు. ఒక మహిళా అధికారికి రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేయడం, వాట్సాప్ కాల్ మాట్లాడడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే దూషించారని, భయంభ్రాంతులకు గురిచేశారంటూ ఆమె లిఖిత పూర్వకంగా చేసిన ఫిర్యాదుకాపీ బయటకు రావడంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ధర్నాలకు ఉసిగొల్పడం విడ్డూరంగా ఉంది. ఇలా అయితే అధికారులు పాలన సాగించడం కష్టం. ఎమ్మెల్యే ఏమైనా డాక్టరా...? పార్వతీపురం తహసీల్దార్ మానసిక స్థితి సరిగా లేదని ఎమ్మెల్యే వాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఆయనేమైనా డాక్టరా అంటూ ప్రశ్నించారు. ఆమె పనితీరు బాగులేకుంటే ఉన్నతాధికారులే చర్యలు తీసుకుంటారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలే తప్ప అధికారులను ఇబ్బందులకు గురిచేసే అధికారం ఎవరిచ్చారు?. ఓ మండల మేజిస్ట్రేట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తహసీల్దార్ ఫిర్యాదుపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలి. అధికారులకు భద్రత కల్పించాలి. సమస్యలుంటే డీఆర్సీ సమీక్షలో ప్రస్తావించి పరిష్కరిచుకోవాలే తప్ప లేనిపోని ఆరోపణలు తగవు. అభివృద్ధి లేదు... అంతా అవినీతే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత అభివృద్ధి జరగకపోగా.. అవినీతి రాజ్యమేలుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు అమలుచేయడంలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడంలేదు. కేవలం అవినీతి కార్యక్రమాలకే ప్రజాప్రతినిధులు మొగ్గు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశంలో పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నరసింహమూర్తి, ఎంపీపీ ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, ఎస్సీ సెల్ కార్యదర్శి పీరుబండి జైహింద్కుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంత్ తదితరులు పాల్గొన్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే... జిల్లాలో మహిళా తహసీల్దార్పై అనుచిత ప్రవర్తన జరుగుతుంటే అదే జిల్లాలో ఉన్న మహిళా మంత్రి, విప్గా పనిచేస్తున్న మరో మహిళా ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయం. ములగ గ్రామానికి చెందిన రైతుల నుంచి తహసీల్దార్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారని అందులో రూ.2 లక్షలు ఇచ్చినట్టు ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ విషయం రైతులు తన వద్ద చెప్పలేదంటున్నారు. తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే మహిళా తహసీల్దార్ను అవినీతి పరురాలిగా చిత్రీకరించడం, రాజకీయ రంగు పులమడం బాధాకరం. కొత్తగా పార్వతీపురం ఎమ్మెల్యేగా ఎన్నికై న విజయచంద్ర ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రభుత్వాలు మారినప్పటికీ అధికారులు మారరన్న విషయాన్ని తెలుసుకోవాలి. -
తారకరామా... ఎన్నాళ్లీ డ్రామా..!
● రెండు దశాబ్దాలుగా నత్తతో పోటీ ● విమానాశ్రయం, సాగుకు నీరెప్పుడు? ● వైఎస్సార్, జగన్మోహన్రెడ్డి హయాంలోనే ప్రాజెక్టు పనుల్లో కదలిక ● భోగాపురం ఎయిర్పోర్టుకు నీరందించాలంటే ప్రాజెక్టు పూర్తికావాల్సిందే.. ● పనులకు పూర్తిస్థాయిలో నిధులు విదల్చని కూటమి ప్రభుత్వం విజయనగరం గంటస్తంభం: తారకరామ తీర్థసాగరం.. రెండు దశాబ్దాలుగా సాగుతోన్న ప్రాజెక్టు. 2005 ఫిబ్రవరి 19న ప్రారంభించిన ప్రాజెక్టు అంచెలంచెలుగా అంచనా వ్యయం పెరుగుతుందే తప్ప పనిమాత్రం పూర్తి కావడం లేదు. రాష్ట్రంలో 15 ఏళ్లపాటు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబునాయుడు ఏ నాడు ప్రాజెక్టు పూర్తికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోలేదు. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అంతర్భగమైన కుమిలి రిజర్వాయర్లో మిగిలిన పనులను రూ.150.24 కోట్ల తో పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల్లోని 24,710 ఎకరాలకు సాగు నీరందుతుంది. ఆయా గ్రామాలకు 0.162 టీఎంసీలు తాగునీటి సరఫరాకు అవకాశం కుదురుతుంది. విజయనగరం కార్పొరేషన్కు 0.48 టీఎంసీల తాగునీరు సరఫరా చేయొచ్చు. భూసేకరణే అసలు సమస్య తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టుకు అవసరమైన 3497.58 ఎకరాల భూమికిగాను 3278.32 ఎకరాలను సేకరించారు. మిగతా 219.26 ఎకరాల సేకరణపై అధికారులు దృష్టిపెట్టారు. కుమిలి రిజర్వాయర్ ప్రాజెక్టులో కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాలపేట ముంపునకు గురవుతాయి. ఇందులోని 2,219 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. భూసేకరణ, పునరావాసానికే రూ.209.88 కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం తాజాగా కేవలం రూ.5కోట్లు మాత్రమే కేటాయించింది. తాడిపల్లి, కుడిపి, నీలంరాజు పేట గ్రామాల నిర్వాసితులకు పరిహారానికి రూ.75.69 కోట్లు ఖర్చవుతుంది. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక చంపావతి నుంచి నీటిని మళ్లించి, ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు విజయనగరం కార్పొరేషన్ కు తాగునీరు సర ఫరాకు అవకాశం కుదురుతుంది. నెల్లిమర్ల సమీపంలో చంపావతి ప్రగతి ఇదీ (శాతం) -
పైడితల్లికి స్వర్ణపుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి పైడితల్లికి శుక్రవారం స్వర్ణ పుష్పార్చన చేశారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్ శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ఇన్చార్జి ఈఓ కెఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి ● జేసీ సేతుమాధవన్ విజయనగరం అర్బన్: జిల్లాలోని పలు చోట్ల సోమవారం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని ఎన్నిక పరిశీలకుడు, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అధికారులకు సూచించారు. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్, కొత్తవలస మండల కో ఆప్షన్ మెంబర్, గరివిడి మండలం సేరిపల్లి ఉప సర్పంచ్ పదవులకు ఈ నెల 19న నిర్వహించే ఎన్నికలపై తన చాంబర్లో అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రత, వీడియో గ్రఫీ, వెబ్ కెమెరాల ఏర్పాటు, మీడియా కవరేజీ, పార్టీ విప్ అనుసరణ, ఓటింగ్ పద్ధతులపై అధికారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీపీఓ వెంకటేశ్వరరావు, బొబ్బిలి మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి విధులే క్రియాశీలకం ● ఎంఎస్పీలు, పోలీస్ సిబ్బందితో ఎస్పీ వకుల్ జిందల్ డెంకాడ: నేర నియంత్రణకు క్షేత్రస్థాయిలో ఎంఎస్పీలు, పోలీస్ సిబ్బంది నిర్వహించే విధులే క్రియాశీలకమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. డెంకాడ పోలీస్ స్టేషన్ పక్కనే అభివృద్ధి చేసిన భవనంలో భోగాపురం సర్కిల్ కార్యాలయాన్ని, సీఐ చాంబర్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. పోలీస్స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా పోలీసుల విధుల పర్యవేక్షణకు ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించామన్నారు. గ్రామాలపై నిఘా ఉంచాలని, కొత్తగా వచ్చే వక్తులు, పాతనేరస్తుల ప్రవర్తనను గమనించాలని ఎంఎస్పీలకు సూచించారు. భోగాపురం సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ ఈ–బీట్స్ను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను పర్యవేక్షించాలని, దత్తత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, ఎస్బీఐ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె.చౌదరి, ఎస్ఐలు ఎ.సన్యాసినాయుడు, ఐ.దుర్గాప్రసాద్, గణేష్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజాదర్బార్కు స్పందన కరువు
బొండపల్లి: బొండపల్లి మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తొలిసారిగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాదర్బార్కు స్పందన కరువైంది. తొలుత ఉదయం 9 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించి సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు. మండల కేంద్రంలోని రాజులు సావిడి వద్ద 4.30 గంటలకు దర్బార్ను నిర్వహించడంతో మంత్రికి వినతులు ఇచ్చేందుకు జనం ఆసక్తి చూపలేదు. కొందరు రెవెన్యూ పరమైన సమస్యలపై వినతులు అందజేశారు. గంటన్నర సేపు మంత్రి అర్జీలును స్వీకరించి వెళ్లి పోయారు. కార్యక్రమంలో తహసీల్దార్ డోలా రాజేశ్వరరావు, సర్పంచ్ బొండపల్లి ఈశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
ఉషు పోటీల్లో భామిని విద్యార్థుల సత్తా
భామిని: ఉషు పోటీల్లో భామిని విద్యార్థులు సత్తాచాటి మెడల్స్ సాధించి పలువురి మన్ననలు పొందారు. ఈ నెల 12,13 తేదీల్లో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో భామిని విద్యార్థులు విజేతలుగా నిలిచారని క్రీడల కోచ్ కె.సోమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఐటీడీఏ స్పోర్ట్స్ అధికారి ఎన్.జాకోబ్ దయానందం సహాయ సహకారాలతో పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఉషు పోటీలలో జూనియర్ విభాగంలో ఎన్.కె.శాంతి, సీనియర్ విభాగంలో పి.దీపిక, కె.సోమేష్లు గోల్డ్ మెడల్స్, పి.నాగరాజు, పి.చరణ్లు సిల్వర్ మెడల్స్ సాధించారని కోచ్ తెలిపారు. ఈ మేరకు పసుకుడిలో విజేతలను మండల నాయకులు బి.రవినాయుడు, కిరణ్కుమార్లు అభినందించారు. -
పర్యాటకంగా భోగాపురం అభివృద్ధికి చర్యలు
భోగాపురం: పర్యాటకంగా భోగాపురాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ అన్నారు. మండలంలో ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. రెడ్డి కంచేరు వద్ద ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బీచ్ రిసార్ట్స్ను, కవులవాడలో కన్వెన్షన్ నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలెక్టర్ అంబేడ్కర్తో కలిసి పరిశీలించారు. నిర్ణీత గడువుకంటే ముందుగానే ఎయిర్ఫోర్టు నిర్మాణం పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయని జీఎంఅర్ గ్రూప్ సీఈఓ మన్మోయ్రాయ్ వివరించారు. అనంతరం అజయ్జైన్ మాట్లాడుతూ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతున్న తరుణంలో పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి హోటళ్ల నిర్మాణం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, విమానాశ్రయ సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం కనులపండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశారు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీపాల శోభలో సీతారామస్వామికి ఊంజల్ సేవ జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్కుమార్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. చితికిపోయిన చిన్నారి● లారీ ఢీకొని బాలుడి దుర్మరణం కొత్తవలస: తెల్లతెల్లవారగానే అప్పుడే నిద్ర లేచి అక్క పాల ప్యాకెట్కు వెళ్తోందని తాను కూడా వెంట వెళ్తానని ఏడేళ్ల బాలుడు మారాం చేసి అక్కతో పాటు వెళ్లాడు. పాల ప్యాకెట్ తీసుకుని అక్కాతమ్ముళ్లు రోడ్డు దాటుతుండగా యమపాశం రూపంలో దూసుకుచ్చిన భారీ లారీ బాలుడిపైకి వెళ్లడంతో శరీరం నుజ్జ నుజ్జుయి అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం తెల్లవారుజూమున జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాలుడి తల్లి, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారి కొత్తవలస ఫైర్స్టేషన్ సమీపంలోని జనార్దన్ లేవుట్లో గల సాయిసంపత్ అపార్ట్మెంట్లో వాణికుమారి ఇద్దరు పిల్లలతో కలిసి తన తల్లి వద్ద ఉంటోంది. ఇటీవల భర్తతో కలహాలు రావడంతో ఆమె పిల్లలతో వచ్చి తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఎప్పటిలాగానే కూతురు చందస్వి(9)నిని పాలప్యాకెట్ కోసం రోడ్డు అవతలి వైపు గల పాలబూత్కు పంపించగా తాను కూడా వెళ్తానని కుమారుడు లేఖనకుమార్ (7) అక్కతో పాటు వెళ్లాడు. పాలప్యాకెట్ కొని రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో ఎస్కోట వైపు వెళ్తున్న భారీ లారీ ఢీకొట్టడంతో బాలుడు శరీరం ముక్కముక్కలై రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్లిన పాప జరిగిన విషయాన్ని తల్లి, అమ్మమ్మకు చెప్పడంతో వారు వచ్చి చూసేసరికి దారుణం జరిగిపోయింది. తల్లి వాణికుమారి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కంట తడి పెట్టించింది. విషయం తెలుసుకున్న కొత్తవలస సీఐ షణ్ముఖ రావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూడు పెంకుటిళ్లు దగ్ధం
గరుగుబిల్లి: మండలంలోని చినగుడబలో మూడు పెంకుటిళ్లు శుక్రవారం దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ముదిలి కళావతి, ముదిలి మోహన్రావు, ముడిలి భాస్కరరావులకు చెందిన పెంకుటిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కళావతి ఇంట్లో దీపం వెలిగించి ఉపాధిహామీ పనులకు వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన విషయాన్ని తెలుసుకున్న పార్వతీపురం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో కళావతి కుటుంబం కట్టుబట్టలు మినహా గృహోపకరణాలు, నగదు, బీరువాలో ఉన్న బట్టలు విలువైన పత్రాలు, ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండడంతో ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రజలు ముందుకు రాలేదు. అయితే అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వెళ్లి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ను తీసుకురాగా గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. మిగిలిన రెండు ఇళ్లలో పెద్దగా నష్టం జరగలేదు. ప్రమాద సమాచారం మేరకు ఘటనా స్థలానికి తహసీల్దార్ పి.బాల, ఆర్ఐ శ్రీనివాసరావు తదితరులు వచ్చి పరిశీలించి ఆస్తినష్టాన్ని అంచనా వేశారు. నష్టనివేదికలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.5లక్షలవరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపకశాఖాధికారి జి. ప్రభాకరరావు తెలిపారు. -
తాగునీటికి కటకట..!
● జిల్లాకేంద్రంలో నాలుగురోజుల కోసారి సరఫరా ● గిరిజన ప్రాంతాల్లో తాగునీటికి అవస్థలు ● తూతూ మంత్రంగా క్రాస్ ప్రోగాం ● ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచిన నేతలు ● జిల్లాలో నాలుగు తాగునీటి ప్రాజెక్టులు పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్రంగా తాగునీటి ఎద్దడి నెలకొంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల గొంతెండుతోంది. అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా వర్షాలు కురవకపోవడంతో మన్యంలో చాలా చోట్ల భూగర్భ జలాలు, నదులు, చెరువులు అడుగంటాయి. అనేక చోట్ల బోర్లు మొరాయించాయి. రక్షిత నీటి పథకాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో జిల్లావాసులు తాగునీటికి కటకటలాడుతున్నారు. బిందెడు నీటి కోసం పరుగు పెడుతున్నారు. మరోవైపు వేసవిలో తాగునీటి సరఫరాపై అధికారుల ముందస్తు ప్రణాళిక కొరవడింది. జల్జీవన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. కొన్ని గ్రామాల్లో ఇంటింటికి వేసిన కుళాయిలు దిష్టిబొమ్మల్లా మారాయి. పైప్లైన్ల లీకులు తదితర సమస్యలతో కొన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు చేరడంలేదు. కొందరికి బురద నీరే సరఫరా అవుతోంది. విధిలేని పరిస్థితుల్లో ఆ నీటినే తాగి జిల్లా వాసులు రోగాల బారిన పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు చెలమల నీటిపై ఆధారపడుతున్నారు. ఇంకొన్ని చోట్ల రెండు, మూడు రోజులకోసారి మాత్రమే తాగునీరు అందిస్తున్నారు. గిరిజనప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కిలోమీటర్ల దూరంలో ఉన్న గెడ్డ, వాగు నీటినే గిరిజనులు వినియోగిస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రోజు తప్పించి రోజు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో తాగునీటి పరిస్థితిని ఆధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోక వడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో రెండు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ, 451 పంచాయతీలున్నాయి. వాటి పరిధిలో 2,282 గ్రామాలున్నాయి. సీపీడబ్ల్యూఎస్ స్కీమ్లు 11, పీడబ్ల్యూఎస్ స్కీమ్లు 808, ఎంపీ డబ్ల్యూస్కీమ్లు 491, సోలార్ స్కీమ్లు 407, డైరెక్ట్ పంపింగ్ స్కీమ్లు 1,525 ఉన్నాయి. బోర్లు 7,518 వరకూ ఉన్నాయి. అయితే వాటి ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గతంలో జల్జీవన్మిషన్(జేజేఎం) పథకం కింద 2,013 పనులు మంజూరు చేశారు. ఇందులో 851 పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. వివిధ దశల్లో 703 పనులున్నాయి. అసలు ప్రారంభం కాని పనులు459 వరకూ ఉ న్నాయి. ఈ స్కీమ్ ద్వారా గతంలో 1,21,246 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో 65,959 కుళాయి కనెక్షన్లు మాత్రమే పూర్తిచేశారు. 55,287 కుళాయి పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో నాలుగురోజులకోసారి.. జిల్లాకేంద్రం పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 220 పైగా బోరుబావులున్నాయి. వాటి నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గతంలో జిల్లా కేంద్రంలో సుమారు రూ. 65కోట్లతో మెగా రక్షిత నీటి పథకం పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కూటమి నేతలు, అధికారులు ఈ పథకం ఊసే ఎత్తడం లేదు. మున్సిపాల్టీలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ప్రధాన పైప్లైన్, దానికి అనుసంధానించిన లింకు పైప్లైన్ల లీకుల కారణంగా తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వేసవికాలంలో కుళాయిల ద్వారా నాలుగు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా రెండురోజులకోసారి నీటిని పంపిణీ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో చెలమలు, నేలబావులే దిక్కు జిల్లాలో ఎక్కువశాతం గిరిజన ప్రాంతం ఉంది. గిరిజన ప్రాంతాల్లో, కొన్ని గిరిశిఖర గ్రామాల్లో తాగునీటి సమస్యకు గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో చెలమల నీటినే గిరిజనులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని మండలాల్లో తాగునీరు సరిగా అందక సమీపంలో గల వసతి గృహాలకు వెళ్లి నీటిని బిందెలతో తీసుకురావల్సిన పరిస్థితి ఏర్పడింది. భామిని, సీతంపేట మండలాల్లో కిలోమీటర్ల దూరం మహిళలు, గర్భిణులు నీటికోసం తహతహలాడాల్సిన పరిస్థితి నెలకొందని గిరిజనులు వాపోతున్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేస్తాం జిల్లాలో పెండింగ్లో ఉన్న జల్జీవన్ మిషన్ పనులు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేస్తాం. 55,287 కుళాయి పనులు పెండింగ్లో ఉన్నాయి. వేసవి ఎద్దడిని నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా క్రాస్ ప్రోగ్రాం నిర్వహించాం. కొన్ని గిరిశిఖర గ్రామాలకు తాగునీటి ఇబ్బందులను గుర్తించాం. తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నాం. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించాం. –ఒ. ప్రభాకరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి, పార్వతీపురం మన్యం -
సారా రహిత గ్రామంగా అప్పయ్యపేట
● గ్రామసభలో పంచాయతీ తీర్మానం నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొత్తపేట పంచాయతీ అప్పయ్యపేట గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దామని ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు తెలిపారు. గ్రామపెద్దలు, ప్రజల సమక్షంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించి ఈ మేరకు పంచాయతీ తీర్మానం చేశామన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా సారా అమ్మకాలు జరిపే ‘బి’ కేటగిరిలో అప్పయ్యపేటను గతంలో గుర్తించామని, గడిచిన మూడు నెలల నుంచి గ్రామ, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సారా అమ్మకాలు, నిల్వలపై నిఘా పెట్టామని, అనుమానితులను గుర్తించి బైండోవర్ చేశామన్నారు. అనంతరం జరిపిన దాడుల్లో మూడు నెలలుగా సారా విక్రయిస్తున్నట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, తాజాగా నిర్వహించిన గ్రామసభలో పూర్తిస్థాయి అంచనాకు వచ్చి సారా రహిత గ్రామంగా ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు. ఇకపై ఎలాంటి అమ్మకాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై నాగేశ్వరరావు, సర్పంచ్ అట్టాడ శ్రీను, దత్తత అధికారి కృష్ణ, కార్యదర్శి బంగార్రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
డీఎస్సీకి 31,038 దరఖాస్తులు
విజయనగరం అర్బన్: డీఎస్సీ–2025 పరీక్షకు జిల్లా నుంచి 18,001 మంది అభ్యర్థులు 31,038 దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పురుషుల కంటే మహిళలు 2,449 మంది అధికం. దరఖాస్తుదారుల్లో మహిళలు 10,225 మంది, పురుషులు 7,776 మంది ఉన్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలుపుకొని 583 పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీతో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నోటిఫికేషన్లో ఊహించని కఠిన నిబంధనలు విధించడం వల్ల వేల సంఖ్యలో నిరుద్యోగులు అర్హత కోల్పోయినట్టు సమాచారం. పురుషుల కంటే మహిళల దరఖాస్తులు 2,449 అధికం -
ఆటో బోల్తాపడి ఉపాధి వేతనదారు మృతి
వీరఘట్టం: మండలంలోని గడగమ్మ గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు అరసాడ ప్రసాదరావు(49) ఆటో బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో శుక్రవారం మృతిచెందాడు. ఈ మేరకు ఉపాధి హామీ ఏపీఓ జి.సత్యంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం గడగమ్మ గ్రామం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నగోర గ్రామంలోని ఆరుద్రమ్మ చెరువులో జరుగుతున్న ఉపాధి పనులకు గ్రామానికి చెందిన వేతనదారులు గడిచిన 7 వారాలుగా ఆటోలపై వెళ్తున్నారు. ఎప్పటిలాగానే శుక్రవారం కూడా వేతనదారులతోబయల్దేరిన ఆటోల్లో ఒక ఆటో అచ్చెపువలస గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలైన అరసాడ ప్రసాదరావును మెరుగైన వైద్య చికిత్స కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసాదరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.కళాధర్ తెలిపారు.పిడుగుపాటుతో గిరిజన యువకుడు..సీతంపేట: మండలంలోని దేవనాపురం సమీపంలో పిడుగుపాటుకు గురై ఓ గిరిజన యువకుడు శుక్రవారం మృతిచెందాడు. జేపీ బూర్జగూడకు చెందిన సవర చంద్రరావు(28) దేవనాపురం ప్రాంతంలో ఉన్న పొలంలో ట్రాక్టర్తో వేసవి దుక్కి దున్నించిన అనంతరం ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో పిడుగు ఒక్క ఉదుటన దగ్గరగా పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు. మృతుడు అవివాహితుడు. తండ్రి జమ్మయ్య కొన్నేళ్ల కిందట మృతిచెందాడు. చంద్రరావు మృతివార్త విన్న తల్లి సొట్టమ్మ, సోదరుడు రమేష్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎస్సై వై.అమ్మన్నరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
డెంగీ నిర్మూలన సామాజిక బాధ్యత
● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి విజయనగరం ఫోర్ట్/విజయనగరం: డెంగీ వ్యాధి నిర్మూలన సామాజిక బాధ్యతగా గుర్తించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి పిలుపునిచ్చారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గంటస్తంభం వరకు శుక్రవారం నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్బొవైరస్ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగీ వైరస్ల వల్ల ఈవ్యాధి వస్తుందన్నారు. ఇది మనిషి నుంచి మనిషికి ఏడిస్ ఈజిప్ట్ దోమలు కుట్టడం వల్ల సంక్రమిస్తుందని తెలిపారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉంటాయని చెప్పారు. పగటి పూట కుడతాయని, ఎక్కువ దూరం 400 మీటర్లు ఎగరలేవన్నారు. ఈవైరస్ వల్ల ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా డెంగీ రావచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రాణి, డీఎంఓ మణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక రేపువిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న చెస్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈ నెల 18 నిర్వహించనున్నట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జ్వాలాముఖి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న ఉదయం 9 గంటలకు విజయనగరం జిల్లా కేంద్రంలో గల రింగ్ రోడ్డు ఫైర్ చెస్ స్కూల్లో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్ 7, 9,11,13 వయస్సుల విభాగాల్లో బాల బాలికలతో పాటు, ఓపెన్ విభాగంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 25 నుంచి రాజాంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హత ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9703344488 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఎన్సీసీ బాలికల బెటాలియన్ శిక్షణ క్యాంప్ ప్రారంభంవిజయనగరం అర్బన్: గాజులరేగలోని సీతం కాలేజీలో ఎన్సీసీ 2(ఏ) వార్షిక శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. శిబిరాన్ని ప్రారంభించిన కమాండింగ్ ఆపీసర్ కల్నల్ గోపేంద్ర మాట్లాడుతూ పదిరోజులు నిర్వహిస్తున్న ఈ శిబిరంలో వసతి సౌకర్యాలు పక్కాగా ఉండాలని ఆదేశించారు. పరిశుభ్రతను కొనసాగించాలని భవిష్యత్తులో యువత ఉన్నత స్థాయికి చేరుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ కెప్టెన్ మీసాల సత్యవేణి, సుబేదార్ మేజర్ బోడ్లే, పరమేశ్వర్ సింగ్, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్స్ లెఫ్టినెంట్ వరలక్ష్మి, వెంకటరత్నం, అమృత, సునీత, నాగమణి, తులసి, సంధ్య, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి హాజరైన 600 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం పెందుర్తి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మంచినీటి పథకం వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని, అతడ్ని రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెందుర్తి మండలం జంగాలపాలెం వద్ద శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన బోని సత్యం(60)కు భార్య, కుమార్తె, అల్లుడితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి వీరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో చింతలపాలెనికి సమీపంలోని జంగాలపాలెంలో వాటర్ ట్యాంక్ ఎక్కి దూకడానికి సిద్ధమయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ కె.వి.సతీష్కుమార్ ఆదేశాలతో సమీపంలోనే ఉన్న బ్లూకోట్స్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ హుటాహుటిన అక్కడకు వెళ్లి, సత్యంను చాకచక్యంగా కిందికి దించేలా చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. బంధువులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
శాంతిని కోరుతూ చండీయాగం
విజయనగరం టౌన్: భారత్ పాకిస్తాన్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా భారతీయ సైనికుల క్షేమం, దేశ శాంతిని కోరుతూ రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో శుక్రవారం వేదపండితులు శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధర్వణ వేదపండితుడు సాయికిరణ్ శర్మ, యుజుర్వేద పండితుడు వెలువలపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ విశ్వశాంతికి, భారతదేశం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, యుద్ధంలో మన సైనికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని యజ్ఞయాగాదులను నిర్వహించామన్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని చండీయాగం చేపట్టామని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ప్రసిద్ధికెక్కారని, సుమారు 80 మంది దంపతులు యాగంలో పాల్గొనడం విశేషమన్నారు. యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ప్రసాద్ పర్యవేక్షించారు. -
రైతుల భూములు పోకుండా పైప్లైన్ వేయాలి
● రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు విజయనగరం ఫోర్ట్: రైతుల భూములు పోకుండా ప్రత్యామ్నాయంగా విశాఖ నుంచి రాయపూర్ వెళ్లే గ్రీన్హైవే పక్కగుండా హెచ్పీపీఎల్ వారు పైప్లైన్ వేసుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైప్లైన్ భూమి వినియోగపు హక్కు కోసం తీసుకునే ఉపరితల భూమిపై ఇళ్లు, తోటలు, బోర్లు, కట్టడాలు, పశువులు, కోళ్ల షెడ్లు వేసుకునే అవకాశం లేనందున మొత్తం భూమి విలువ కోల్పోతున్నందున రిజిస్ట్రార్ వేల్యూ పరిగణనలోకి తీసుకుని నాలుగు రెట్లు పెంచి ధరను నిర్ణయించి అందులో నుంచి 10 శాతం కాకున్నా 30 శాతం పరిహారం లెక్కకట్టి ఇవ్వాలని కోరారు. పండ్ల తోటలు, చెట్లు జీవిత కాలాన్ని లెక్కించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు లోకవరపు ఆదినారాయణమూర్తి, గంట్యాడ మండల ఽ అధ్యక్షుడు కోడెల శ్రీను, రైతు సంఘం నాయకులు గణేష్, నారాయణరావు, గోపాలం, రాములు, పైడిపినాయుడు, ప్రసాద్, దాలినాయుడు, జగన్, సంగమయ్య తదితరులు పాల్గొన్నారు. -
16 కేజీల గంజాయితో నలుగురి అరెస్ట్
కొత్తవలస: మండల కేంద్రంలో గల రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టగా 16 కేజీల గంజాయితో నలుగురు నిందితులు పట్టుబడినట్లు సీఐ షన్ముఖ రావు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ తెలిపిన మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం రాత్రి కొత్తవలస రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించగా ప్లాట్ఫామ్–1లో బ్యాగులతో నలుగురు వ్యక్తులు అనుమానాస్పందంగా తిరుగుతూ పోలీసులను చూసి కంగారు పడి పారిపోయేందుకు సిద్ధమవుతుండగా పట్టుకుని విచారణ చేసినట్లు తెలిపారు. వారి దగ్గర ఉన్న బ్యాగ్లను తెరిచి చూడగా పది గంజాయి ప్యాకెట్లలో 16 కేజీలు గంజాయి ఉన్నట్లు చెప్పారు. విజయవాడ ప్రాంతంలోని వాంబే కాలనీకి చెందిన జోజిబాబు, శామ్యూల్జాన్, మనికంఠ, మహేశ్వరరావులుగా నిందితులను గుర్తించామన్నారు. ఒడిశాలోని పాడువలో ఒక వ్యక్తి దగ్గర 16 కేజీల గంజాయిని నిందితులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని, నిందితులు అక్కడి నుంచి కిరండోల్ రైల్లో కొత్తవలస వరకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో విశాఖపట్నం చేరుకుని రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నారన్నారు. ఇందులో భాగంగా కొత్తవలస రైల్వేస్టేషన్లో వేచి ఉన్న సమయంలో పట్టుబడినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలాజీకి గంజాయిని, నిందుతులను అప్పగించినట్లు సీఐ వివరించారు. -
కుక్కల దాడిలో పలువురికి గాయాలు
రాజాం సిటీ: కుక్కలు విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. శుక్రవారం పట్టణ పరిధిలోని కాలెపువీధికి చెందిన చిన్నారి గంపల లలిత ఇంటి ముందు ఆరుబయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. వెంటనే స్థానికులు స్పందించి తీవ్రంగా గాయపడిన చిన్నారిని సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అలాగే మండల పరిధి మారేడుబాక గ్రామానికి చెందిన కోరాడ నారాయణమ్మ అనే వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. కుటుంబసభ్యులు రాజాం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పట్టణంతోపాటు మండలంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్రగాయాలు రాజాం సిటీ: మండల పరిధి శ్రీకాకుళం రోడ్డులోని రెండో మైలు రాయివద్ద శుక్రవారం బైక్ అదుపు తప్పడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం న్యూకాలనీకి చెందిన కేవీఎస్ భక్తవత్సలం తీవ్రగాయాల పాలయ్యాడు. రాజాం నుంచి స్వగ్రామం శ్రీకాకుళం ద్విచక్రవాహనంపై ఆయన వెళ్తుండగా రెండో మైలు రాయి వద్దకు వచ్చేసరికి మోటార్సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో భక్తవత్సలం తలకు తీవ్రగాయాలు కావడంతో 108కు సమాచారం అందించగా ఈఎంటీ ఆలుగుబిల్లి శ్రీనివాసరావు, పైలెట్ శంకరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకుకుళం తరలించారు. -
● ఇలా ఉంటే రోగాలు రావా..
పాలన మారింది. పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపించింది. ప్రజల ‘సంక్షేమ’మే కాదు.. ప్రజారోగ్యాన్ని పట్టించుకునేవారు కూడా కరువయ్యారు. కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణంలో జాప్యం పలు కాలనీలకు శాపంగా మారింది. ఇళ్లను మురుగునీరు చుట్టుముడుతోంది. వీధి కుళాయిలు సైతం మురుగునీటిలోనే దర్శనమిస్తూ ప్రజల ఆరోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. డెంగీ, మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా స్పందన శూన్యమే. పనులు చేసేందుకు నిధులు లేవని, తాము ఏమీ చేయలేమన్న సమాధానమే వినిపిస్తోందన్నది స్థానికుల మాట. పారిశుద్ధ్య, మురుగునీటి సమస్యలకు రాజాం మున్సిపాలిటీ కొండంపేటలోని ఓ వీధి, గంట్యాడ మండలం రామవరం గ్రామంలో కుళాయిల దుస్థితే నిలువెత్తు నిదర్శనం. – రాజాం సిటీ/గంట్యాడ -
● మూణ్నాళ్ల ముచ్చట..!
చిత్రంలోని సీసీ రోడ్డును చూశారా.. ఇది నెల్లిమర్ల మండలం పెద్ద బూరాడపేట గ్రామంలో నెలరోజుల కిందట నిర్మించారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో సుమారు 500 మీటర్ల మేర సీసీ రోడ్డు వేయడంతో గ్రామస్తులు సంతోషించారు. అయితే.. వారి సంతోషం మూణ్నాళ్లముచ్చటే అయ్యింది. రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలివ్వడంతో ఇదిగో ఇలా పెచ్చులూడి బుగ్గిరేగుతోంది. ఇదేం రోడ్డు నిర్మాణమంటూ స్థానికులు ముక్కునవేలేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపిస్తున్నారు. – నెల్లిమర్ల రూరల్ -
పందుల పెంపకానికి ప్రత్యేక స్థలాలు
విజయనగరం అర్బన్: మున్సిపాలిటీ ప్రాంతాల్లో పందుల సమస్యను నివారించేందుకు వీలుగా వాటి పెంపకానికి ప్రత్యేక స్థలాలు కేటాయించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. మున్సిపాల్టీల్లో పందుల సమస్య పరిష్కారంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, పందుల పెంపకందారులతో కలెక్టరేట్లో గురువారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పందుల పెంపకందారుల అభిప్రాయాలను తీసుకున్నారు. విజయనగరం కార్పొరేషన్లో సుమారు 1,085, బొబ్బిలిలో 45, రాజాంలో 40, నెల్లిమర్ల మున్సిపాలిటీల్లో 16 పందులు ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారని జేసీ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా మున్సిపల్ పరిధి నుంచి 5 కిలోమీటర్ల లోపల పందుల పెంపకానికి స్థలాన్ని కేటాయించాలన్నారు. విజయనగరంలో సుమారు 2 ఎకరాలు, బొబ్బిలిలో 30 సెంట్లు, రాజాంలో ఎకరా, నెల్లిమర్లలో 15 సెంట్లు స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. వెంటనే స్థలాలను గుర్తించి పెంపకం దారుల సంఘం ప్రతినిధుల అభీష్టం మేరకు సాయంత్రంలోగా వారికి కేటాయిస్తూ ఉత్తర్వులను సిద్ధంచేయాలని ఆదేశించారు. పందుల పెంపకం వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ వై.వి.రమణ, డీపీఓ టి.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు మోహనరావు, ఆశయ్య, మెప్మా పీడీ సత్తిరాజు, విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య ఇతర మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ -
అవిశ్వాసంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ?
బొబ్బిలి: కూటమి నాయకులు బొబ్బిలి పట్టణంలోని అభివృద్ధి పనులను విస్మరించి అవిశ్వాసంపైనే దృష్టిసారించారని వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్ నాయుడు విమర్శించారు. పలువురు కౌన్సిలర్లతో కలిసి మీడియాతో గురువారం మాట్లాడారు. మున్సిపాలిటీలో చేపట్టాల్సిన 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులకు సంబంధించిన అనేక పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినా పట్టించుకోని పాలకులు.. అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి అధికార మార్పిడికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కూటమి నాయకుల తీరును పట్టణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. పదవుల కాంక్షవల్ల పరిమిత కాలంలో వినియోగించాల్సిన నిధులు వెనుకకు మళ్లే ప్రమాదముందన్నారు. పదవులకన్నా అభివృద్ధి పనులకు పెద్దపీట వేసి పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఆయన వెంట 16వ వార్డు కౌన్సిలర్ సవలాపురపు రామకృష్ణ(బాబు ) ఉన్నారు. డీసీసీబీ నికర లాభం రూ.7.66 కోట్లు ● ఏ కేటగిరీ వాటాదారులకు రూ.1.09 కోట్ల డివిడెండ్ ప్రకటన విజయనగరం అర్బన్: గడచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రూ.7.66కోట్ల నికర లాభం ఆర్జించినట్టు డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి, జేసీ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో గురువారం జరిగిన సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి లావాదేవీల ముగింపునకు సంబంధించిన స్టాట్యూటరీ ఆడిట్ నివేదికను, లాభనష్టాల నివేదికపై బ్యాంకు సీఈఓ సీహెచ్ ఉమామహేశ్వరరావుతో కలిసి చర్చించారు. బ్యాంకును లాభాలబాటవైపు నడిపించిన సహకార సంఘాలు, డీసీసీబీ సిబ్బందిని అభినందించారు. నాబార్డు, ఆప్కాబ్ బ్యాంకులకు జేసీ కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకుకు చెందిన ఏ–క్లాస్ వాటాదారులకు లాభాల్లో ఒక శాతం రూ.1.09 కోట్లు డివిడెండ్గా ప్రకటించినట్టు తెలిపారు. మహాజనసభలో జిల్లా సహకార అఽధికారి పి.రమేష్, నాబార్డు డీడీఓ టి.నాగార్జున, ఆప్కాబ్ డీజీఎం అప్సజహాన్, మహాజన సభ్యులు పాల్గొన్నారు. 19న బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ● స్థానిక సంస్థల ప్రత్యక్షేతర సీట్ల ఖాళీలకు ఎన్నికలు విజయనగరం అర్బన్: జిల్లాలోని స్థానిక సంస్థలల్లో ఖాళీగా ఉన్న ప్రత్యక్షేతర ప్రజాప్రతినిధుల ఉప ఎన్నికలను ఈ నెల 19న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నిక ప్రక్రియ షెడ్యూల్ను జేసీ సేతుమాధవన్ గురువారం విడుదల చేశారు. బొబ్బిలి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి, కొత్తవలస మండల పరిషత్లో కో–ఆప్టెడ్ మెంబర్, గరివిడి మండలంలోని సేరిపేట పంచాయితీలో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ మున్సిపాలటీలు, పంచాయతీ రాజ్ చట్టాలకు అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రజా స్వామ్యయుతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. -
● పూడుకుపోయిన పాల్తేరు కాలువ
చిత్రంలో తుప్పలు, పూడికలతో నిండినది పాల్తేరు చానల్. సుమారు 3వేల ఎకరాల ఆయకట్టుకు వేగావతి నది నీటిని మళ్లించేందుకు ఈ కాలువే ఆధారం. పారాది నుంచి గొల్లాది, భీమవరం, ముగడ, పాల్తేరు, ఆళ్లవానివలస, ఆనవరం, పినపెంకి, రేజేరు గ్రామాల వరకు కాలువ విస్తరించి ఉంది. ఇది ఇప్పుడు పూడికలతో నిండిపోవడంతో సాగునీరు సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. శివారు భూములకు సాగునీరు అందడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. స్థానిక పాలకులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నది వారి వాదన. ఖరీఫ్ సమయం ముంచుకొస్తోందని, తక్షణమే కాలువ పనులు చేపట్టాలని కోరుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం రైతన్నల్లో ఆవేదన నింపుతోంది. పాచిపెంట పెద్దగెడ్డ నుంచి డొంకినవలస మెట్టభూములకు, రామభద్రాపురం ఏడొంపులగెడ్డ నుంచి నాయుడువలస మీదుగా కాలువ ఏర్పాటుచేసి సాగునీటి కష్టాలు తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎమ్మెల్యే బేబీనాయనకు విజ్ఞప్తిచేసినా స్పందన లేదని రైతులు వాపోతున్నారు. – బాడంగి -
సీఎస్ఆర్ నిధులతో చెరువుల అభివృద్ధి
విజయనగరం అర్బన్: చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో సీఎస్ఆర్ నిధులతో 40 చెరువుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. యాక్సిస్ బ్యాంకు సీఎస్ఆర్ నిధులతో ధాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనులు జరుగుతాయన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ధాన్ ఫౌండేషన్ ప్రతినిధులతో తన చాంబర్లో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. చంపావతి నదీ పరివాహక ప్రాంతాలైన నెల్లిమర్ల, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాల్లో 40 చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధికి ధాన్ పౌండేషన్ ముందుకు వచ్చిందని తెలిపారు. దీనికోసం ఐదేళ్లలో సుమారు రూ.15 కోట్ల వరకు ఖర్చుచేయనుందని వెల్లడించారు. ఈ ఏడాది అభివృద్ధి చేయబోయే చెరువులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఫౌండేషన్ ప్రతినిధులు అనిల్, లోకేష్, రాంకుమార్ తమ సంస్థ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఎంపిక చేసిన నాలుగు మండలాల పరిధిలో 235 గ్రామాలుండగా, చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో 168 గ్రామాలు ఉన్నాయని, వీటిలో 40 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డ్వామా పీడీ శారదాదేవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, పీఆర్ ఎస్ఈ ఎం.శ్రీనివాసరావు, డీపీఓ టి.వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్ఈ స్వర్ణకుమార్, మైనర్ ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
ఖరీఫ్ సాగు లక్ష్యం.. 1.16 లక్షల హెక్టార్లు
విత్తన కేటాయింపు ఇలా.. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి దుక్కులు ఆరంభమయ్యాయి. ఖరీఫ్ సాగుకు మెట్ట, పల్లం భూములను రైతులు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 1.16 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, దుక్కులు చేసేందుకు చేతిలో డబ్బులు లేక రైతులు సతమతమవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు. జిల్లాలో నువ్వు, వేరుశనగ పంటల సాగు ప్రారంభమైంది. అదును చూసుకుని మెట్ట భూముల్లో వేరుశనగ విత్తనాలు విత్తుతున్నారు. నువ్వు పంటను మెట్ట, పల్లపు భూముల్లో సాగు చేస్తున్నారు. గంట్యాడ, బొండపల్లి, విజయనగరం, డెంకాడ, గజపతినగరం, దత్తిరాజేరు, చీపురుపల్లి, మెరకముడిదాం, రామభద్రపురం, మెంటాడ, గరివిడి, గుర్ల తదితర మండలాల రైతులు నువ్వు, వేరుశనగ పంటల సాగులో బిజీ అయ్యారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి వ్యవసాయ అధికారులు 50,020 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేశారు. ఇందులో ఎంటీయూ –1121 రకం 38,000 క్వింటాళ్లు, సాంబమసూరి రకం 2,500 క్వింటాళ్లు, 1064 రకం 2,200 క్వింటాళ్లు, సోనామసూరి 2,500 క్వింటాళ్లు, ఎంటీయూ 1224 రకం 1650 క్వింటాళ్లు, స్వర్ణ రకం 2000 క్వింటాళ్లు, ఎంటీయూ1318 రకం 800 క్వింటాళ్లు, ఆర్జీఎల్ 2537 రకం 200 క్వింటాళ్లు, ఎంటీయూ 1061 రకం 60 క్వింటాళ్లు, ఆర్ఎన్ఆర్ 15048 రకం 50 క్వింటాళ్లు, ఎన్ఎల్ఆర్ 3449 రకం 60 క్వింటాళ్లు కేటాయించారు. నువ్వు, వేరుశనగ పంటల సాగు ప్రారంభం ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం ఇలా.. వరి సాధారణ సాగు విస్తీర్ణం 91,214 హెక్టార్లు మొక్కజొన్న 12,386, చెరకు 4,720 హెక్టార్లు 50,020 క్వింటాళ్ల వరి విత్తనాల కేటాయింపు ప్రారంభమైన తొలకరి దుక్కులు ‘అన్నదాత సుఖీభవ’ కోసం ఎదురుచూపు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,16,993 హెక్టార్లగా వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, చోడి, పత్తి, వేరుశనగ, గోగు, మిరుప, చెరకు తదితర పంటలను రైతులు సాగుచేస్తారని చెబుతున్నారు. వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 91,214 హెక్టార్లగా పేర్కొన్నారు. ఆ మేరకు విత్తనాలు, ఎరువులకు ప్రతిపా దనలు పంపించి సిద్ధం చేస్తున్నారు. -
ఏపీఈసెట్లో ర్యాంకుల పంట
విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్–2025 ఫలితాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. పలువురు విద్యార్థులు మొదటి పది ర్యాంకుల్లో నిలిచారు. విజయనగరం పట్టణానికి చెందిన వై.పద్మాకర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గ్రూప్లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మెటలడ్జికల్ గ్రూప్లో కొత్తవలస గొల్లలపాలెంకు చెందిన నంబూర్ అభిషేక్ ఫస్ట్ ర్యాంక్, లక్కవరపుకోట మండలం వీరభద్రపేటకు చెందిన యేడువాక తరుణ్కుమార్ 6వ ర్యాంక్ సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గ్రూప్లో పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం నీలానగరానికి చెందిన తుమ్మలపల్లి అమూల్య 8వ ర్యాంక్ సాధించారు. -
ఈ–బీట్స్తో పటిష్ట గస్తీ
విజయనగరం క్రైమ్: జిల్లాలో నేరాలు తగ్గించేందుకు ‘ఈ–బీట్స్’ విధానంలో గస్తీని పటిష్టం చేస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ–బీట్స్ విధానంపై పోలీసు అధికారులు, సిబ్బందికి జూమ్ మీటింగ్ ద్వారా గురువారం అవగాహన కల్పించారు. సిబ్బంది సందేహాలను నివృత్తి చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీస్ గస్తీని ట్రాక్ చేయడం, పహారా విధులను విశ్లేషించడం, పర్యవేక్షణ వంటివి లైవ్లోనే జరుగుతాయన్నారు. దీనికోసం పోలీస్ అధికారులు, సిబ్బందికి ముందుగా యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ క్రియేట్ చేస్తామని తెలిపారు. పోలీస్ బీట్లను నిర్ధారించి సిబ్బందికి విధులు కేటాయిస్తామన్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందని, బీట్వారీగా సమయానుగుణంగా విధులు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. పోలీస్ స్టేషన్ అవసరాలు, ప్రాధాన్యతలను అనుసరించి బీట్లను మార్చుకోవచ్చని తెలిపారు. ఈ–బీట్ అలర్ట్స్ అనే ఆప్షన్తో సంబంధిత అధికారులు ఎక్కడ నుంచైనా పరిశీలించవచ్చన్నారు. ఈ–బీట్స్ యాప్ పనితీరును టెక్నీషియన్ బి.హర్ష వివరించారు. జూమ్ మీటింగ్లో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230భోగాపురం విద్యార్థికి షైనింగ్స్టార్–2025 ఆవార్డుపూసపాటిరేగ: పదవతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన భోగాపురం మోడల్స్కూల్ విద్యార్థి కొయ్య హరీష్కు షైనింగ్ స్టార్స్–2025 అవార్డు వచ్చింది. ఈ ఏడాది పదవతరగతి ఫలితాల్లో హరీష్ 593 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి మోడల్స్కూల్స్లో ప్రథమస్థానంలో నిలిచాడు. దీంతో ఈనెల 20 వతేదీన అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం, మంత్రుల చేతుల మీదుగా షైనింగ్స్టార్ –2025 అవార్డు తీసుకోనున్నాడు. ఈనెల 19 వతేదీన మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో విద్యార్ధి తల్లిదండ్రులుతో పాటు రిపోర్టు చేయాలని భోగాపురం మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ సి.పార్వతి తెలిపారు.ప్రభుత్వ ఉత్తర్వు 20ని సవరించాలిపార్వతీపురంటౌన్: రాష్ట్ర విద్యాశాఖలో తొమ్మిది రకాల పాఠశాలల ఏర్పాటు ఆశాసీ్త్రయమని, కొత్తగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్వర్వు 20లోని నియమాలు విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్. బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 117నంబర్ ఉత్తర్వులకన్నా ఈ నిబంధనలు దారుణంగా ఉన్నాయని, ఉపాధ్యాయ సంఘాలతో లెక్కలేనన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా వారి సూచనలను వేటినీ పరిగణనలోకి తీసుకోకపోవడం అప్రజాస్వామ్యమన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి సహేతుకం కాదన్నారు. ప్రస్తుత ఉత్తర్వులు ఉపాధ్యాయులకు పనిభారాన్ని పెంచాలనే లక్ష్యంతోనే రూపొందించినట్లు అర్ధమవుతోందన్నారు. వీటి ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు కనీసం వారానికి 40 పీరియడ్లకు తక్కువ కాకుండా పనిచేయాల్సి ఉంటుందని, కొంతమంది ఇంకా ఎక్కువ పీరియడ్స్ కూడా పనిచేయవలసి వస్తుందన్నారు. కావున ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉత్వర్వులను సవరించాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఎక్కడైనా స్టాంపుల విక్రయం● జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర చీపురుపల్లి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేసిన లైసెన్స్ కలిగిన వెండర్ల ద్వారా స్టాంప్లను పబ్లిక్కు అందుబాటులో ఉండే ఎలాంటి ప్రాంతాల్లోనైనా విక్రయించవచ్చునని జిల్లా రిజిస్టార్ ఉపేంద్ర చెప్పారు. ఈ మేరకు చీపురుపల్లి పట్టణంలో స్టాంప్ల విక్రయాలకు సంబంధించి అధిక ధరలు తీసుకుంటున్నారని నోటరీ న్యాయవాది పి.తవిటినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం ఆయన చీపురుపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుతో మాట్లాడి ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రిజిస్టర్ స్టాంపులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై పబ్లిక్ను విచారణ చేసి వారి నుంచి వాంగ్మూలం సేకరించి రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. యూపీహెచ్సీల్లో వైద్యసేవలు మెరుగు పరచాలిపార్వతీపురంటౌన్: పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగు పర్చాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు ఆ దేశించారు. ఈ మేరకు యూపీహెచ్సీ వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో గురువారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో, క్షేత్రస్థాయి సేవలపై నెలవారీ నివేదికలను పరిశీ లించారు.ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ వివరాలు, ల్యాబ్ పరీక్షలు, మందులు, ఈహెచ్ఆర్ నమోదుపై సమీక్షించారు. కార్యక్రమంలో డీఐఓ నారాయణరావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, డా పీఎల్.రఘు కుమార్, డీపీఓ లీలారాణి, వైద్యాధికారులు డా.రవిచంద్ర, డా.గణేష్, డా.చాంద్, కార్యాలయం ఏఓ సాల్మన్ రాజ్, సీసీ శ్రీనివాసరావు, ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఈ శ్రమ్కు ఆదరణ కరువు
విజయనగరం గంటస్తంభం: అసంఘటిత రంగంలో కార్మికులు, వలస కార్మికులు, చిరు వ్యాపారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ ఈ–శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. దీంతో కార్మికుల సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రత పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి వీలవుతుంది. కామన్ సర్వీస్ సెంటర్లలో కార్మికులు ఉచితంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పోర్టల్ను ప్రారంభించి ఏడాది గడిచినా..చాలా మంది దరఖాస్తు చేసుకోకపోవడంతో సంక్షేమ పథకాల హక్కులకు దూరమవుతున్నారు. చేకూరే ప్రయోజనాలివి.. అసంఘటిత రంగంలో కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుంటే 12 అంకెలు కలిగిన ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తారు. ఈ కార్డులు ఉన్నవారికే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందితే రూ.ఒక లక్ష బీమాను ఉచితంగా అందజేస్తారు. అసంఘటిత రంగంలో కార్మికుల కోసం ప్రవేశపెట్టే పథకాల్లో నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్య మిస్తారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి ఉపాధి మార్గాలను చూపిస్తారు. కార్మికుడిగా నమోదైతే ప్రభుత్వమే తోడ్పాటు అందిస్తుంది. విపత్తులు సంభవించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయకారిగా ఉంటుంది. ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొందరు మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నారు. కొరవడిన అవగాహన.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 10 లక్షల 90వేల మందికి పైగా కార్మికులు ఉండగా..ఇంకా 5 లక్షల పైచిలుకు మంది ఈ–శ్రమ్ నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రారంభంలో అధికారుల అవగాహన కార్యక్రమాలు, కార్మిక సంఘాల నేతల సూచనలతో నమోదు చేసుకునేందుకు కార్మికులు పోటీపడ్డారు. క్రమంగా ఈ–శ్రమ్ పోర్టల్కు ఆదరణ కొరవడుతోంది. సంక్షేమ పథకాల ఫలాలు కార్మికులందరికీ అందేలా కార్మిక సంఘాల నే తలు, అధి కారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు. నమోదు ఉచితం ఈ–శ్రమ్లో వివరాల నమోదుకు అనుసంధానమైన మొబైల్ నంబర్ నామినీ ఆధార్ వివరాలు అవసరం. సమీప గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) లేదా కార్మికశాఖ కార్యాలయాల్లో సంప్రదిస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా అయ్యాక యూఏఎన్ గుర్తింపు కార్డు జారీ అవుతుంది. అసంఘటిత కార్మికులకు అండ నమోదు కాని వారు ఉపాధి వేతనదారులే సామాజిక భద్రత కోసం పోర్టల్ ఏర్పాటు బీమా అందజేయనున్న కేంద్రప్రభుత్వం అర్హులు వీరే.. 16 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఆదాయపు పన్ను పరిధిలోకి రానివారు ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్ఓ), ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్(ఈఎస్ఐ)సదుపాయం లేనివారు ఉద్యానవనాలు, నర్సరీలు, పాడి పరిశ్రమ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు టైలర్లు, డ్రైవర్లు, హెల్పర్లు, వీధి వ్యాపారులు, కల్లుగీత, రిక్షా కార్మికులు, చెత్త ఏరేవారు, కొరియర్ బాయ్లు, ఇళ్ల పనివారు, ఉపాధి వేతనదారులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, మధ్యాహ్న భోజనం వర్కర్లు, లోడింగ్,అన్ లోడింగ్ కార్మికులు, తదితరులందరూ ఈ పఽథకానికి అర్హులు.అవగాహన కల్పిస్తున్నాంఈ–శ్రమ్ పథకంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు ఆరుగురికి ప్రమాద బీమా పరిహారం రూ.2 లక్షలు చొప్పున అందజేశాం. ఒక ఇంటిలో ఎంతమంది ఉన్నా ఈ పథకానికి అర్హులే. – ఎస్డీవీ ప్రసాదరావు, కార్మికశాఖ ఉప కమిషనర్, విజయనగరం జిల్లా -
పనిలో పారదర్శకత,వేగవంతం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలందించేందుకు ‘ఈఆఫీస్‘ విధానాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయం ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం చేపట్టామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన బిల్డింగ్లో ప్రారంభించిన ఈ శిక్షణను ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ప్రభుత్వం డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తూ, కార్యాలయం పరిపాలనలో పారదర్శకతను, వేగవంతంగా సేవలందించేందుకు ‘ఈఆఫీసు‘ విధానాన్ని ప్రారంభించిందన్నారు. ఈ ఆఫీస్ విధానంతో అధికంగా పేపర్లు వినియోగించకుండా, వేగవంతంగా సేవలందించే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నోట్ఫైల్స్, నిర్ణయాలు, అధికారుల మధ్య సమాచార మార్పిడి పూర్తిస్థాయిలో డిజిటల్ రూపంలోనే జరుగుతాయన్నారు. ‘ఈఆఫీసు‘ విధానం పరిపాలనలో వినియోగం వల్ల కార్యాలయం సిబ్బందికి సౌలభ్యంగా ఉండడమే కాకుండా, ఫైల్స్కు భద్రత పెరుగుతుందని తెలిపారు. కావున, పోలీసు కార్యాలయం సిబ్బంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని, నిపుణులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని పోలీసు కార్యాలయ ఉద్యోగులకు ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఎంత పనైనా సులువుగా.. కార్యక్రమంలో ఈ ఆఫీసు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ ఆర్.నరేంద్ర మాట్లాడుతూ ఈఆఫీస్ వినియోగించడం ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పటికీ, భవిష్యత్తులో ఎంత పనినైనా సులువుగా చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రతిరోజూ అరగంట సమయాన్ని ఈఆఫీసు పట్ల అవగాహన కోసం వినియోగిస్తే, సులువుగా నిష్ణాతులు కావచ్చని చెప్పారు. ఈఆఫీసు వినియోగం వల్ల పంపిన ఫైల్స్ ఎవరి వద్ద పెండింగ్లో ఉన్నాయన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చునని నరేంద్ర అన్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సామ్యలత, ఏఓ పి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు వెంకటలక్ష్మి, రామకృష్ణ, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, పోలీసు కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందికి ఈ ఆఫీస్ శిక్షణ ఎస్పీ వకుల్ జిందల్ -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
వీరఘట్టం: మండలంలోని చిట్టపులివలస, ఎం.రాజపురం గ్రామాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. చిట్టపులివలస గ్రామానికి చెందిన కుప్పిలి పాపారావు(69) బుధవారం సాయంత్రం తన పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ఎం.రాజపురం గ్రామానికి చెందిన కొప్పర రాము (54) గురువారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి వస్తుండగా తెగిపడిన విద్యుత్ వైరును గమనించకపోవడంతో అది కాలికి తగిలి షాక్కు గురై తన ఇంటి ముందరే మృతిచెందాడు. ఈ ప్రమాదాలపై ఫిర్యాదుల మేరకు ఎస్సై జి.కళాధర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..రామభద్రపురం: మండలకేంద్రానికి చెందిన వ్యక్తి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక చింతల వీధికి చెందిన చింతల రామినాయుడు(80) కొన్ని నెలలుగా కడుపు నొప్పితో ఇబ్బందులు పడుతున్నాడు. ఆ బాధను తట్టుకోలేక ఈ నెల 7వ తేదీన తన పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విసయనగరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ని–క్షయ్ మిత్రలుగా ప్రభుత్వ ఉద్యోగుల నమోదు
పార్వతీపురంటౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఐఎంఏ సభ్యులు, ఎన్జీఓలు ని–క్షయ్ మిత్రలుగా నమోదు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. 100 రోజుల ఇంటెన్సిఫైడ్ టీబీ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ బారిన పడిన వ్యక్తులను దత్తత తీసుకుని, వారికి అవసరమైన పోషకాహార మద్దతుతో పాటు మెరుగైన జీవనం కోసం స్వచ్ఛందంగా ప్రతి నెలా రూ.700లు చొప్పున ఆరు మాసాల పాటు ఇచ్చేందుకు యోచించాలని కోరారు. వీటితో పాటు ప్రభుత్వం ఉచితంగా అందించే మందులను రోగి క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా టీబీని పూర్తిగా అంతమొందించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 10 మంది వరకు ప్రభుత్వ వైద్యులు టీబీ బారిన పడిన వ్యక్తులను దత్తత తీసుకుని, వారికి పోషకాహార మద్దతును ఇస్తున్నారని, అదేవిధంగా మిగిలిన ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రధానమంత్రి క్షయ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లాలో టీబీని పూర్తిగా అంతమొందించేందుకు 100 రోజుల ఇంటెన్సిఫైడ్ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందుకు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని, టీబీ బారిన పడిన వ్యక్తులకు పోషకాహారం కోసం విరాళాలు అందించాలనుకున్న వారు జిల్లా లెప్రసీ ఎయిడ్స్, టీబీ అధికారి, ఖాతా నంబర్ 004012010003135, ఐఎఫ్ఎస్సీ కోడ్ 0800406, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బెలగాం మెయిన్ రోడ్, పార్వతీపురం జిల్లా ఖాతాలో జమ చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇతర వివరాల కోసం ఫోన్ 80083 11511 నంబర్ను సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కాన్ఫరెన్న్స్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, ఇతర వైద్యాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
డెంగీ పట్ల అప్రమత్తం
ఆందోళన అవసరం లేదుదోమల వృద్ధిని అరికట్టడం ద్వారా డెంగీ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. డెంగీ వ్యాధి పట్ల ఆందోళన అవసరం లేదు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ద్రవపదార్థాలు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్ ఎస్.జీవన రాణి, డీఎంహెచ్ఓ ● జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశం ● 2024లో 203 కేసుల నమోదు ● ఈఏడాదిలో 23 కేసుల నమోదు ● నేడు డెంగీ నివారణ దినంవిజయనగరం ఫోర్ట్: డెంగీ వ్యాధి పట్ల ఏమాత్రం అలసత్వం వహించినా మృత్యువాత పడే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. శుక్రవారం జాతీయ డెంగీ నివారణ దినం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. గత ఏడాది రెండు వందలకు పైగా డెంగీ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. సకాలంలో చికిత్స చేయించుకుంటే కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. డెంగీ లక్షణాలు వైరల్ జ్వరం మాదిరి వచ్చి ఆకస్మాత్తుగా తీవ్రంగా పరిణమిస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులతో పాటు ఎముకలు విరిగేటంత నొప్పి కలిగిస్తుంది. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరగడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు ఉదర భాగాల చర్మంపై ఎర్రగా కందినట్లు చిన్నచిన్న మొటిమలు కనిపిస్తాయి. ఒక్కో సారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది. ఈడిస్ ఈజిప్టు అనే దోమకాటు వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. దోమ పగటి పూట కుడుతుంది. దోమ కుట్టినప్పుడు ఒళ్లుంతా దద్దుర్లు కనిపిస్తాయి. ఇళ్లలోని కుండీలు, గోలాలు, ఓవర్హెడ్ ట్యాంకుల్లోను, ఎయిర్ కూలర్లు, ఇళ్ల పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కప్పులు, పగిలిన సీసాలు, టైర్లు వంటి వాటిల్లో చేరిన దోమలు వర్షపు నీటిలో గుడ్లు పెట్టడంతో ఈడిస్ దోమ పెరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి పరిసర ప్రాంతాల్లో వృథా నీటిని నిల్వ ఉంచరాదు. పెంటకుప్పులు, ఇంట్లో వచ్చే చెత్తాచెదారం ఇంటికి దూరంగా వేయాలి. ఇళ్లలో ఉన్న అన్ని గదుల్లో దోమల మందు చల్లించాలి. దోమతెరలు వాడడం లేదా ఇంటి కిటీకీల తలుపులకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిల్వ చేసే పాత్రలను ప్రతి వారానికి ఒక సారి ఖాళీ చేసి మళ్లీ నింపుకోవాలి. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాతటైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. క్రమంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దోమ కాటునుంచి రక్షణకోసం శరీరం అంతా కప్పి ఉంచుకునే విధంగా దుస్తులు వేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలను బట్టలు లేకుండా బయట తిరగనీయరాదు. కుళాయి దగ్గర నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలో గల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి. -
జంఝావతి రబ్బర్ డ్యామ్ తనిఖీలు
కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్రెడ్డి ఆదేశాల మేరకు కొమరాడ మండలంలోని జంఝావతి నదిపై నిర్మాణం చేసిన జంఝావతి రబ్బర్ డ్యామ్తో పాటు రిజ్వయిర్ పరిసరాల్లో పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఎస్సై కె.నీలకంఠం ఆధ్వర్యంలో బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్సై నీలకంఠం మాట్లాడుతూ దేశ సరిహద్దులో ఏర్పడిన యుద్ధ వాతా వరణం నేపథ్యంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రిజర్వాయర్ పరిధిలో ఎలాంటి అపరిచిత వ్యక్తులు కనిపించినా స్థానిక పోలీసులకు సమచారం ఇవ్వాలని కోరారు. రబ్బర్ డ్యామ్ పరిసరాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. -
పిడుగుపాటుకు ఎనిమిది గొర్రెల మృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని పెద్ద బూరాడపేట సమీపంలో సోమవారం మధ్యాహ్నం పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు గ్రామానికి చెందిన డొప్ప త్రినాఽథ్ అనే రైతుకు చెందిన ఎనిమిది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సమీప పొలాల్లో గొర్రెలు మేత మేస్తుండగా ఆకస్మాత్తుగా పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. గొర్రెలు మేత మేస్తున్న సమయంలో పిడుగు పడడంతో ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.80వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు త్రినాఽథ్ వాపోయాడు. రైతును వెంటాడుతున్న దురదృష్టంబూరాడపేటకు చెందిన రైతు డొప్ప త్రినాఽథ్ను దురదృష్టం వెంటాడుతోంది. సుమారు ఐదు నెలల క్రితం ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షానికి పొలంలో రాలిన ధాన్యం గింజలను మేయడంతో సుమారు 100కు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ధాన్యాన్ని జీర్ణించుకోలేకపోవడంతో గొర్రెలు మృతి చెందాయి. అప్పట్లో సుమారు రూ.10లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. ఆ బాధ నుంచి తేరుకోకుండానే మళ్లీ పిడుగు రూపంలో ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధిత కుటుంబసభ్యులు తీవ్రంగా రోదించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
వెటర్నరీ కళాశాలలో వీసీఐ బృందం పర్యవేక్షణ
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) బృందం సభ్యులు బుధవారం పర్యవేక్షించారు. గుజరాత్ రాష్ట్రంలోని కామధేను యూనివర్సిటీ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.యమ్.లునగారియా, ఒడిశా వెటర్నరీ కళాశాల నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ డా.అంబికాప్రసాద్ కె.మహాపాత్ర, మహారాష్ట్ర వెటర్నరీ కళాశాల నుంచి డా.ప్రతిభా జండేతో కూడిన బృందం కళాశాలను సందర్శించింది. ఈ సందర్శనలో భాగంగా కళాశాలలో నిర్మించిన భవన సముదాయాన్ని బృందంసభ్యులు పర్యవేక్షించారు. విద్యార్థులకు సరిపడా తరగతి భవనాలు సక్రమంగా అందుబాటులో ఉన్నదీ లేనిదీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ భవనాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు సక్రమంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. కళాశాలలో మరో రెండు రోజుల పాటు పర్యవేక్షణ చేయనున్నారు. పర్యవేక్షణలో కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను పాల్గొన్నారు. డీఈఓకు ఎస్టీయూ జిల్లా కమిటీ వినతివిజయనగరం అర్బన్: ప్రభుత్వం తాజాగా ప్రకటించిన టీచర్ల బదిలీ ప్రక్రియలోని అసంబద్ధ నిబంధనలను సడలించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు బుధవారం డీఈఓ యూ.మాణిక్యంనాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2021, 2023వ సంవత్సరంలో రేషనలైజేషన్కు గురైన పీఎస్హెచ్ఎంలకు 2021వ సంవత్సరం ముందు పనిచేసిన ‘ఓల్డ్ స్టేషన్ పాయింట్’ను మంజూరు చేయాలని కోరారు. గత నెల 24, 25, 26 తేదీన వైద్య ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు హాజరుకాలేకపోయిన ఉపాధ్యాయులకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. టిస్లో ఉన్న తప్పుల సవరణకు ఎంఈఓలకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రిఫరెన్స్ కేటగిరి ఉన్న ఉపాధ్యాయులకు వారికి ఇష్టమైన మోడల్ ప్రైమరీ పాఠశాలకు వెళ్లే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంగా ఎస్జీటీలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. డీఈఓను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.జోగారావు, ప్రధాన కార్యదర్శి చిప్పాడ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. శుభం చిత్రయూనిట్ సందడివిజయనగరం టౌన్: ప్రముఖ హీరోయిన్ సమంత నిర్మించిన శుభం చిత్రయూనిట్ విజయనగరంలో బుధవారం సందడి చేసింది. ఈ మేరకు స్థానిక సప్తగిరి మల్టీప్లెక్స్లో సెకెండ్ షోలో ప్రేక్షకులను సినీ హీరోలు, హీరోయిన్లు షాలిని, షరియా, హర్షిత్, చరణ్, శార్వాణి, శ్రీనివాస్లు అలరించారు. దర్శకుడు కె.ప్రవీణ్, హాస్యనటుడు వంశీ ఇతర నటులు సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లావాసుల ఆదరణ ఎనలేనిదన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి తమలాంటి వారికి అవకాశమిచ్చి బాగా ప్రోత్సహించారన్నారు. సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని తీశారన్నారు. ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడం మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. త్వరలోనే మరిన్ని చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి నెలా అనీమియా కమిటీ సమావేశం
పార్వతీపురం టౌన్: జిల్లాలోని ప్రతి సచివాలయం పరిధిలో అనీమియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఇకపై ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులకు స్పష్టం చేశారు. కమిటీ సమావేశంలో తీసుకున్న చర్యలు, తద్వారా వచ్చిన ఫలితాలపై ఇక నుంచి సమీక్షిస్తానని తేల్చిచెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఇతర జిల్లా అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. జిల్లాలో కొత్తగా నిర్మించి అసంపూర్తిగా ఉన్న సీహెచ్సీలు, పీహెచ్సీలు, బీహెచ్పీయులను వినియోగంలోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ప్రధానంగా సీతానగరం, మామిడిపల్లి, శంబర పీహెచ్సీలో పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని, మిగిలిన భవనాలను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. చిన్న చిన్న పనులు జరగక భవనాలు నిరుపయోగంగా ఉండడం సబబు కాదని, ప్రభుత్వం తప్పక నిధులు విడుదల చేస్తుందనే భరోసా కల్పించి ఆయా కాంట్రాక్టర్లతో పనులు త్వరగా చేయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మలేరియా కేసులు ఉండకూడదు జిల్లాలో మలేరియా కేసులు ఉండడానికి వీల్లేదని, పోలియో, ఎయిడ్స్ మాదిరిగా ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించి మలేరియా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి కమిటీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మలేరియా కేసులు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి వారం తాగునీటి ట్యాంకులను పరిశీలించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే కచ్చితంగా పాటించాలని కలెక్టర్ అన్నారు. రోగుల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్మోహనరావు, డీసీహెచ్ఎస్ డా.బి.వాగ్దేవి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డా.కె.విజయపార్వతి, డా.పద్మావతి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కె.చలపతిరావు, యూపీహెచ్సీ, పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల వైద్యాధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
పోలీస్ కస్టడీలో గంజాయి డాన్..!
రామభద్రపురం: గంజాయి అక్రమరవాణా చేస్తున్న వ్యక్తులపై సీఐ కె నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ డాన్గా పేరున్న వ్యక్తి, కొట్టక్కి పోలీస్ చెక్ పోస్టు వద్ద కారులో అక్రమంగా గంజాయి తరలింపునకు కారకుడైన ప్రధాన నిందితుడు రామభద్రపురం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలిసింది. ఈ నిందితుడు గంజాయి అక్రమరవాణాలో పట్టుబడడంతో రామభద్రపురంతో పాటు ఎస్కోట, సాలూరు, కొత్తవలస, పాచిపెంట తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం ఉంది.అయితే విశాఖ సెట్రల్ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడిని హుకుంపేట పోలీస్స్టేషన్కు తరలించి అక్కడి నుంచి పీపీ వారెంట్పై రామభద్రపురం పోలీస్ కస్టడీకి తీసుకొచ్చి పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రథమ నిందితుడు అనంతగిరి చెందిన వ్యక్తిగా తెలిసింది. కొట్టక్కి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో ఫిబ్రవరి 10 వతేదీ రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో వాహనాలు చెక్ చేస్తున్నారు. ఇంతలో వాహనాల వెనుకన ఒడిశా నుంచి అక్రమంగా ఒడిశా నుంచి 150 కిలోల గంజాయిని తరలిస్తున్న డస్టర్ కారు డ్రైవర్ కారును జాతీయ రహదారి పక్కన చిన్న రూట్లో తప్పించి స్పీడ్గా లాగించేశాడు. దీంతో అప్రమత్తమైన ఏఎస్సై అప్పారావు, పోలీస్ సిబ్బంది వెంటాడారు. సరిగ్గా కొట్టక్కి దుర్గమ్మ గుడి వద్దకు వెళ్లేసరికి సరిగా దారి కనిపించకపోవడంతో కారు వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో కారును, అందులో ఉన్న 150 కిలోల గంజాయి(74 ప్యాకెట్లు)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులు ఉన్నట్లు విచారణలో తేలగా ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. వివరాలు సేకరిస్తున్న పోలీసులు -
ఈశ్వరమ్మ కంటకన్నీరు
సాలూరు: మున్సిపాలిటీ మీ తాతగారిదా? మేము అధికార పార్టీలో ఉన్నాం అంటూ వయస్సు పైబడిన మహిళా మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మపై టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది చిట్టి ఆగ్రహంతో ఊగిపోయాడు, బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం పూర్తయిన తరువాత, మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న వార్డుల్లో నీటి సరఫరా కోసం నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాక్టర్ వాటర్ట్యాంకర్ను చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు ప్రారంభించారు. అక్కడి నుంచి ఆమె వస్తున్న సమయంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది చిట్టి పండగ పనులపై ఆరోపణలు చేస్తూ చైర్పర్సన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ మీ తాతగారిదా? మేము అధికార పార్టీలో ఉన్నాం అంటూ కనీసం ఆమె వయస్సుకు విలువ ఇవ్వకుండా విరుచుకుపడ్డాడు, టీడీపీ పట్టణాధ్యక్షుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆమైపె విరుచుకుపడడంతో శ్యామలాంబ తల్లి అంతా చూస్తుందని, ఎవరు తప్పు చేస్తే వారికి ఆ పాపం తగులుతుందని అంటూ చైర్పర్సన్ కంటనీరు పెట్టుకుంటూ చీర కొంగుతో తుడుచుకుంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ విషయం గుర్తించిన మున్సిపల్ వైస్ చైర్మన్ సంఘటనా స్థలానికి వచ్చి చైర్పర్సన్పై ఇలా మాట్లాడడం సమంజసం కాదని, పండగ పనుల నేపథ్యంలో అధికారులు అజెండాలో పెట్టిన అన్ని అంశాలను కౌన్సిల్లో ఆమోదించామని తామెప్పుడూ పండగ పనులకు ఎటువంటి అడ్డంకులు సృష్టించలేదని, సహకరించామన్నారు. టీడీపీ కూటమి పెద్దలు ఈ పండగకు ప్రత్యేక గ్రాంట్లు తెస్తామని హామీలు ఇచ్చి తేలేక, చివరకు అప్పు (రియింబర్స్మెంట్)గా వచ్చిన రూ.2 కోట్లతో పండగ ముందు పనులు చేయించుకోలేక వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి రాజకీయాలకు దిగుతున్నారంటూ పలువురు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
సుఖీభవ లేక.. దుఃఖం దిగమింగలేక..!
సుఖీభవ సాయం తక్షణమే వేయాలిఖరీఫ్ సీజన్ మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అన్నదాత సుఖీభవ సాయం తక్షణమే రైతుల అకౌంట్లలో జమచేయాలి. గతంలో మాదిరి సాగు పెట్టుబడికి సాయం అందజేయాలి. రైతుల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించాలి. సీహెచ్.అప్పలనాయుడు, రైతు రెల్లివలస● డోలాయమానంలో అన్నదాతలు ● పథకం మంజూరుకు పూర్తికాని వెరిఫికేషన్ ● మరో 15 రోజుల్లో ఖరీఫ్సాగు ప్రారంభం ● సాగుకు అప్పుకోసం రైతన్న వెతుకులాట పూసపాటిరేగ: రైతు సంక్షేమానికి పెద్దపీటవేస్తామని హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం ఏడాదవుతున్నా ఇచ్చిన హామీని నెలబెట్టుకోవడంలో విఫలమమైంది. కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లలో ఇప్పటికే జమకాగా, రాష్ట్రం నుంచి అందజేయాల్సిన అన్నదాత సుఖీభవ మంజూరుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకంలో ప్రతి రైతుకు రూ.20 వేలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం జిల్లాలో 4,85,158 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 1,42,222 మంది రైతుల రికార్డులు మాత్రమే తనిఖీ అయ్యాయి. ఇంకా 3,42,936 మంది రికార్డుల వెరిఫికేషన్ పూర్తి చేసిన తరువాత వ్యవసాయ అధికారి లాగిన్లో వెరిఫికేషన్ పూర్తి చేశాక తుది జాబితా సిద్ధం కానుంది. ఈనెల 20 వతేదీ లోపు రికార్డుల వెరిఫికేషన్ పూర్తి చేయడానికి గడువు ఇచ్చినట్లు సమాచారం. రబీ సీజన్ దాదాపు పూర్తవడంతోమరో 15 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. ఈసమయానికి గతంలో రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమఅయ్యేవి. నేటి పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. అన్నదాత సుఖీభవ కోసం జిల్లాలోని రైతులు ఎదురు చూస్తున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే మార్గదర్శకాలను అనుసరించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం అకౌంట్లలో జమచేసి, ఎరువులు, విత్తనాలు రైతులకు రైతుభరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేవి. వీటితో పాటు వైఎస్సార్ పంటల బీమా, పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందించే వారని, నేడు ఆ పరిస్థితి లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం ఎప్పుడు వేస్తారు..? ప్రతి ఏడాది మే నెలలో వేయాల్సిన పెట్టుబడి సాయం రైతులకు ఎప్పడు వేస్తారు? అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా రైతులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పెట్టుబడి సాయం కోసం ఇంకా వెరిఫికేషన్లు పూర్తికాని పరిస్థితి. అధికారులు సర్వేలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించి అన్నదాత సుఖీభవ ఖరీఫ్ సీజన్కు ముందే అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. కోరాడ వెంకటరమణ, రైతు పూసపాటిరేగ -
పాలిసెట్లో ప్రతిభ
విజయనగరం అర్బన్: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. అధికమంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన 8,097 మందిలో 7,705 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో విజయనగరం జిల్లాలో 6,938 మందిలో 95.36 శాతంతో 6,616 మంది, పార్వతీపురం మన్యంలో 1,159 మందిలో 93.96 శాతంతో 1,089 మంది ఉత్తీర్ణలయ్యారు. విజయనగరం జిల్లాలో బాలికలు 97.44 శాతం, బాలురు 93.9 శాతం, మన్యంలో బాలికలు 96.59 శాతం, బాలురు 92.35 శాతం పాసయ్యారు. 117 మార్కులు సాధించిన షేట్ అబ్దుల్ ముజీర్, చిల్లా పూర్ణ సంజయ్, మండల వాగ్దేవిలు విజయనగరం జిల్లా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి ర్యాంకర్లగా నమోదయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 113 మార్కులతో పప్పల చక్రి (ప్రథమ), 112 మార్కులతో పొడుగు యోగిభద్రినాథ్ (ద్వితీయ), 111 మార్కులతో ఇప్పిలి వెంకటరమణ తృతీయ స్థానంలో నిలచారు. వంద మార్కులు పైబడి.. పాలిసెట్లో 120కు 100 మార్కుల పైబడి అధికమంది విద్యార్థులు సాధించారు. వెయ్యిలోపు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఉప్పు లాస్య మాధురి (116/120), ఎల్.భాషిణి (114/120), పూసపాటిరేగ మండలం కొప్పెర్లకు చెందిన పల్లా హేమశ్రీ (112/120), మత్స వెంకటలక్ష్మి (111/120), బి.జ్యోత్స్న (110/120), గరివిడి మండలం ఆర్తమూరుకు చెందిన పెద్దపోలు తేజా (106/120) ఉన్నారు. విజయనగరంలో 95.36 శాతం, మన్యంలో 93.96 శాతం మంది ఉత్తీర్ణత -
కన్వర్షన్కు దరఖాస్తులు రాలేదు..
తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అవుతోంది. మండలంలోని ఆరికతోటలో ఓ వెంచర్కు మాత్రమే ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు వచ్చింది. మిగిలినవి ఏవీ రాలేదు. చెరువులు, సాగునీటి కాలువలు ఆక్రమించి వెంచర్లు వేసినా, రోడ్లు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. బూసాయవలస ఎర్రన్న చెరువు సాగునీటి కాలువ పూడ్చేసినట్టు నా దృష్టికి రాలేదు. ఇరిగేషన్ అధికారులకు లెటర్ రాసి, పరిశీలిస్తాం. ఆక్రమణలు తొలగిస్తాం. ప్లాట్లు కొనుగోలుదారులు ప్రభుత్వ అనుమతి పొందిన వెంచర్లలో కొనుగోలు చేయడం మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ల్యాండ్ కన్వర్షన్ ఫీజు చెల్లించకపోతే కొనుగోలు దారులు చెల్లించాల్సి వస్తుంది. – ఎ.సులోచనరాణి, తహసీల్దార్, రామభద్రపురం -
ధాన్యం రైతు కన్నీరు
విజయనగరం ఫోర్ట్: ఓ వైపు అకాల వర్షాలు.. మరోవైపు చేతికందిన పంట కొనుగోలు చేసేవారు లేక ధాన్యం రైతు కన్నీరుపెడుతున్నాడు. రబీలో అష్టకష్టాలు పడి వరి పంటను సాగుచేశారు. పంట చేతికొచ్చింది. నూర్పిడి చేసిన ధాన్యం అమ్ముదామంటే కనీసం కొనుగోలు కేంద్రాలు లేవు. వ్యవసాయ, సివిల్సప్లై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదన్న సమాధానమే వినిపిస్తోంది. పండించిన పంటను ఏం చేయాలో తెలియక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు క్వింటా వద్ద రూ.400 నష్టపోయి రూ.1870కు విక్రయిస్తున్నారు. రైతు సంక్షేమానికి పాటు పడతామని గొప్పలు చెబుతున్న కూటమి సర్కారుకు ధాన్యం రైతుల దయనీయ పరిస్థితి పట్టడంలేదని విమర్శిస్తున్నారు. ● రబీలో 2,200 ఎకరాల్లో వరి సాగు రబీ సీజన్లో జిల్లాలో 2,200 ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వీటిలో ఒక్క గింజ కూడా కూటమి సర్కారు కొనుగోలు చేయలేదు. ఫలితం రైతుకు మద్దతు ధర లభించలేదు.