కమ్మవీధిలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కమ్మవీధిలో అగ్నిప్రమాదం

May 26 2025 12:27 AM | Updated on May 26 2025 12:27 AM

కమ్మవ

కమ్మవీధిలో అగ్నిప్రమాదం

రూ. 5.50 లక్షల ఆస్తినష్టం

విజయనగరం క్రైమ్‌: నగరంలోని కమ్మవీధిలో ఆదివారం మధ్యాహ్న 1 గంట ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వీధిలోని ఒక గృహిణి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెడుతుండగా ఒక్కసారిగా అగ్గిపుల్ల పక్కకు ఒరిగి ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ అధికారులు సంతోష్‌, మహేష్‌ బృందం ఫైర్‌ ఇంజిన్‌తో కమ్మవీధిలో అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సూబట్ల సూర్యారావు ఇంట్లో ఈ ప్రమాదం సంభవించగా రూ.లక్ష నగదు, బంగారం, ఇంట్లో ఉన్న టీవీ, బీరువా దగ్ధమయ్యాయి. అలాగే ఆ ఇంటిని ఆనుకుని ఉన్న సూబట్ల రాజు, సూబట్ల లక్ష్మణరావుల ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

పిడుగుపాటుకు రెండు ఆవుల మృతి

బలిజిపేట: మండలంలోని పెద్దింపేటలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతిచెందాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పెద్దింపేటలో మధ్యాహ్నం వర్షం కురిసి ఆగిపోయిన తరువాత రైతులు ఆవులను మేతకు విప్పి గ్రామం శివారుకు వెళ్తున్న సమయంలో పిడుగులు పడడంతో ఆవులు మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మజ్జి కృష్ణమూర్తి, టి.సూర్యనారాయణలకు చెందిన రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. కృష్ణమూర్తి ఆవు రూ.30వేలు, సూర్యనారాయణ ఆవు రూ.40వేలు ఖరీదు ఉంటాయని గ్రామస్తులు తెలిపారు.

కుక్క కాటుతో మరో రెండు ఆవులు

పాలకొండ రూరల్‌: మండలంలోని అట్టలి గ్రామంలో నివసిస్తున్న శిర్లి తౌడమ్మ చెందిన రెండు పాడి ఆవులు పిచ్చికుక్క కాటుకు గురై ఆదివారం మృతి చెందాయి. దీంతో బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తమ కుటుంబ పోషణలో భాగమైన ఆవులను కుక్క కరిచేయడంతో అవి మృతి చెందినట్లు బాధితురాలు భోరుమంది. ఇటీవల మండలంలోని రుద్రిపేట గ్రామంలో కుక్కకాటుకు గురై ఓ లేగ దూడ మరణించిన ఘటన మరువక ముందే మరో ఆవులు చనిపోయాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలపై దృష్టి పెట్టాలని అయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు.

31న జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు

బొబ్బిలి: ఈనెల 31న పట్టణంలో 18వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు బొబ్బిలి తైక్వాండో క్లబ్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం దీనికి సంబంధించిన బ్యానర్‌ను ఆవిష్కరించారు. క్టబ్‌ కార్యదర్శి చెలికాని వేణుగోపాల రావు ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు జిల్లావ్యాప్తంగా 200 మంది హాజరై జూనియర్‌,సబ్‌ జూనియర్‌, జూనియన్‌ క్యాడెట్‌, సీనియర్‌ విభాగాల్లో జరిగే పోటీల్లో తలపడతారన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు వచ్చే నెల 9 నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని కోచ్‌ బంకురు ప్రసాద్‌ తెలిపారు.

కమ్మవీధిలో అగ్నిప్రమాదం1
1/4

కమ్మవీధిలో అగ్నిప్రమాదం

కమ్మవీధిలో అగ్నిప్రమాదం2
2/4

కమ్మవీధిలో అగ్నిప్రమాదం

కమ్మవీధిలో అగ్నిప్రమాదం3
3/4

కమ్మవీధిలో అగ్నిప్రమాదం

కమ్మవీధిలో అగ్నిప్రమాదం4
4/4

కమ్మవీధిలో అగ్నిప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement