
24 గంటల్లో అర్జీలు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చిన వినతులను 24 గంటల్లో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన పీజీఆర్ఎస్లో వినతులు స్వీకరించే ముందు అధికా రులతో సమీక్షించారు. ఆన్లైన్లో ఇంకా చూడవలసిన వినతులు 8 ఉన్నాయని గడువు దాటిన వినతులు 2 ఉన్నాయని వినతుల పరిషాకరంలో గడువు దాటినందుకు సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం లోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. రీ ఓపెన్ కేసులు లేకుండా చూడాలని జిల్లా ఆడిట్ టీమ్ కూ డా పెండింగ్ లేకుండా ఎప్పటి వినతులు అప్పుడే ఆడిట్ చేయాలని సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 160 వినతులు అందాయి. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఇన్చార్జ్ డీఆర్ఓ మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అర్జీలలో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించిన భూసమస్యలు 82 నమోదయ్యాయి. పంచాయతీ రాజ్ శాఖ 10, పింఛన్ల మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 21, మున్సిపాలిటీకి 10, జీఎస్డబ్ల్యూకు 1, విద్యాశాఖకు 7, హౌసింగ్కు 1 అందగా వైద్యశాఖకు 2, విద్యుత్ శాఖకు 5 వినతులు అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.
కలెక్టరేట్ వద్ద సహాయ కేంద్రం
ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే నిరక్షరాస్యులకు అర్జీలను రాయడానికి కలెక్టరేట్ వద్ద సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అర్జీదారుల కోసం షామియానా ఏర్పాటు చేసి కలెక్టరేట్ నుంచి ఆరుగురు సిబ్బందిని నియమించడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఆర్ఓ కార్యాయలం వద్ద మరో ఇద్దరు అర్జీలు రాసే సహకారం అందజేయడంతో మధ్యవర్తుల జాడ కనబడలేదు. నిరక్షరాస్యులైన వారు తమ అర్జీలను రాయడానికి దళారులను ఆశ్రయిస్తున్నారని వారు అర్జీదారులను మభ్య పెట్టి వారి నుంచి డబ్బును తీసుకుని ప్రతివారం కలెక్టరేట్ చుట్లూ తిరిగేలా చేస్తున్నారని ఇకపై కూడా అర్జీదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిరాక్స్ కేంద్రాల్లో రాయించవద్దని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హాయకేంద్రంలో సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
బదిలీల ఫైళ్లు ముందుగానే పెట్టండి
బదిలీల ఫైళ్లను ఆఖరి తేదీన కాకుండా ముందుగానే పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బదిలీలలో ఎటువంటి సిఫార్సులను ఆమోదించబోనని, నిబంధనల మేరకే చేపడతానని స్పష్టం చేశారు.
అడిషనల్ ఎస్పీ పీజీఆర్ఎస్కు 32 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల వేదిక కార్యక్రమాన్ని ఏఎస్పీ సౌమ్యలత నిర్వహించి 32 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మా ట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్బీ సీఐలు ఆర్వీఆర్కే చౌదరి,లీలారావు డీసీ ఆర్జీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
పీజీఆర్ఎస్కు 160 వినతులు

24 గంటల్లో అర్జీలు పరిష్కరించాలి