
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
విజయనగరం టౌన్: వంగర మండలం లక్ష్మీపేట దళితుల ఊచకోత కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఉత్తరాంధ్ర దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఉత్తరాంధ్ర దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేసు విచారణలో పక్షపాత వైఖరి చూపిస్తున్న లక్ష్మీపేట ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేయాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ నాయకులు కంఠవేణు, శ్రీను, ఉదయ్ భాస్కర్, బాబూరావు, చిత్ర గంగులు, గురుమూర్తి, భీమారావు, కృష్ణ, నాగరాజు, రామప్పడు, రవి, ఆదాడమోహనరావు, పి.వి.రమణ, బొంగ భానుమూర్తి, రాజేష్, చంటి, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధికార యంత్రాంగానికి లక్ష్మీపేట దళిత సంఘాల నాయకుల వినతి