
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ను ఈ నెల 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు సోమవారం తెలిపారు. పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. వార్షిక పబ్లిక్ పరీక్షల్లో గైర్హాజరయిన 63 మంది జనరల్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేశామన్నారు. అలాగే, ఒకేషనల్ విభాగంలో ఇంటర్ పరీక్షలు రాయాల్సిన 422 మంది కోసం జిల్లాలో తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వీటిలో రాజాంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ రామ ఒకేషనల్ జూనియర్ కళాశాల, ఎస్.కోటలోని ప్రభుత్వ, ఏవీఎన్, దీప్తి, శ్రీవరలక్ష్మి జూనియర్ కళాశాలలు, నెల్లిమర్లలోని సీకేహెచ్ జూనియర్ కళాశాల, గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజయనగరం ఎస్ఎస్పీ ఓకేషనల్ జూనియర్ కళాశాల ఉన్నాయి. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్ధులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని కోరారు.