
విజయనగరం
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025
రైల్వేశాఖ నిర్లక్ష్యం
జిల్లా నుంచి మామిడి ఎగుమతులకు రైల్వేశాఖ మోకాలడ్డుతోంది. ప్రత్యేక బోగీలు కేటాయించ కుండా రైతులు, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. –8లో
అమ్మా... అందరం కలిసి ఆడుకుంటామంటే సరే అన్నారు..
అదే పిల్లల చివరి మాట అని ఆ తల్లులకు తెలియదు..
అక్కడే మృత్యువు కాపుకాసి ఉందని గుర్తించలేకపోయారు..
మూడు గంటల పాటు పిల్లలు కనిపించకపోయే సరికి
తల్లిడిల్లిపోయారు.. ఏమయ్యారో అంటూ ఊరంతా
గాలించారు.. చివరకు కారులో ప్రాణవాయువు అందక విలవిల్లాడుతూ విగత జీవులుగా కనిపించిన పిల్లలను చూసి కుప్పకూలిపోయారు.
చిన్నారుల మృతికి కారణమైన కారు ఇదే..
డీఈఓ కార్యాలయాల ముట్టడి విజయవంతం చేయాలి
● ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపు
విజయనగరం అర్బన్: విద్యారంగాన్ని నిర్వీ ర్యం చేసే విధానాలను కూటమి ప్రభుత్వం మానుకోవాలనే డిమాండ్తో ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని డీఈఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా కమిటీ పిలు పునిచ్చింది. ఈ మేరకు స్థానిక ఎన్జీఓ హోమ్లో ఆదివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్జీటీలకు ప్రమోషన్ ఇచ్చి మోడల్ ప్రైమరీ స్కూళ్లకు ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 41 వద్ద 3వ పోస్టు ఇవ్వాలని కోరారు. ఎస్జీటీలకు ఆన్లైన్తో కూడిన మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్ చేయడం సరైన చర్య కాదని అన్ని ఖాళీలను బదిలీ కౌన్సెలింగ్లో చూపించాలని కోరారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యతో ప్రమేయం లేకుండా అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రవీంద్రనాయుడు, డి.శ్రీనివాస్, భాస్కరరావు, రాము, కె.శ్రీనివాసరావు, డి.రాము, జేఆర్కే ఈశ్వరరావు, జోగారావు, సూరిబాబు, డి.ఈశ్వరరావు, పాల్తేరు శ్రీనివాస్, టి.సన్యాసిరాజు, ఎ.కృష్ణారావు, ఇ.రామునాయుడు, వై.శ్రీనివా సరావు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలో ఫెయిలైన వారి కోసం సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమవుతాయని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించే పరీక్షలకు 2,851 మంది విద్యార్థులు హాజరవుతారని, వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి 8 మంది టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించామని చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ అధికారులు మరో 42 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఐదుగురు విధులు చేపడతారన్నారు. ఓపెన్ స్కూల్ పదోతరగతి పరీక్షకు 407 మంది, ఇంటర్మీడియట్కు 649 మంది హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. పదోతరగతి విద్యార్థులకు విజయనగరంలో రెండు, గజపతినగరం, ఎల్.కోట, బొబ్బిలిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం విజయనగరం, ఎస్.కోట, గజపతినగరం ప్రాంతాల పాఠశాలల్లో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు.
విజయనగరం క్రైమ్:
సమయం మధ్యాహ్నం 2 గంటలు.. గ్రామంలోని పెళ్లివేడుకలో పెద్దలు, ఆటపాటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. ఆటలాడుతూ గ్రామ బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న కారులోకి నలుగురు చిన్నారులు వెళ్లారు. పొరపాటున డోర్లు వేయడంతో లాక్ అయ్యాయి. అంతే.. వారికి ప్రాణ వాయువు అందలేదు. కాపాడాలంటూ వారి ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. మూడుగంటల తర్వాత వెతుకుతూ వెళ్లిన పెద్దలకు కొనఊపిరితో కారులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులు కనిపించారు. డోర్లు బద్దలగొట్టి చిన్నారులను బయటకు తీసినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటనతో విజయనగరం సమీపంలోని ద్వారపూడిలో మృత్యుఘోష వినిపించింది. సర్వజన ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది.
మాటలకందని విషాదం
అందరూ పదేళ్లలోపు పిల్లలే. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా సాకుతున్నారు. పిల్లలు ఆడుకుంటేంటే సంబర పడ్డారు. పెళ్లివేడుకలో బిజీ అయ్యారు. ఒకేసారి కారు రూపంలో కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), పండి ఉదయ్ (7), బూర్లె జాస్రిత(8)ను మృత్యువు కాటేయడంతో కన్నీరుకార్చారు.
విగతజీవులుగా మారిన చిన్నారులను పట్టుకుని బోరున విలపించారు.
కడుపుకోత..
మృతిచెందిన చిన్నారుల్లో బూర్లె చారులత, జాస్రిత అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకే సారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, ఆనంద్లు విషాదంలో ముని గిపోయారు. దేవుడా.. కడుపుకోత మిగిల్చావా అంటూ విలపించారు. సర్వజన ఆస్పత్రి మార్చురీ వద్ద ఉన్న కుమార్తెల మృతదేహాలను చూసిన ఉమ ఓ దశలో సొమ్మసిల్లి పోయింది. ఉదయ్ తల్లిదండ్రులు బుచ్చిబాబు, భవానీ, మణీశ్వరి తల్లిదండ్రులు సురేష్ అరుణలు సైతం బిడ్డల మృతదేహాలను పట్టుకుని రోదించారు.
పెళ్లింట
విషాదం
గజపతినగరం: మండలంలోని పాతబగ్గాం గ్రామంలో పెళ్లింట విషాదం అలముకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట చావుమేళం మోగింది. వివరాల్లోకి వెళితే.. దత్తిరాజేరు మండలం పాచిలవలస గ్రామానికి చెందిన సైలాడ సన్యాసిరావుకు గజపతినగరం మండలం పాతబగ్గాం గ్రామానికి చెందిన పప్పల గౌరితో వివాహం కుదిరింది. ఆదివారం రాత్రి ఒంటి గంటా 32 నిమిషాలకు వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో వధువు తల్లి పప్పల పైడమ్మ తన స్వగృహంలో మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి పనులు చేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో పాతబగ్గాంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెద్దలు వివాహాన్ని వాయిదా వేశారు.
న్యూస్రీల్
మరికొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా వధువు తల్లి మృతి గ్రామంలో విషాదఛాయలు
ఒకే సమయంలో నలుగురు చిన్నారులు మృతి
కారులో చిక్కుకుని ప్రాణాలు విడిచిన పిల్లలు శోకసంద్రంగా మారిన సర్వజన ఆస్పత్రి
ఇళ్ల మధ్యనే ఘటన...
మృత్యువుకు కారణమైన కారు వీధిలో ఇళ్ల మధ్యనే ఉంది. దాని పక్కగుండానే అందరూ రాకపోకలు సాగించినా.. అందులో ఉన్న చిన్నారులను గుర్తించలేకపోయారు. వారి ఆర్తనాదాలను ఆలకించలేకపోయారు. కారు అద్దాలు నలుపువి కావడం కూడా దీనికి ఓ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్టౌన్ ఎస్ఐ రామ్గణేష్లు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వజన ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలు సేకరించారు.
కారు ఎవరిది?
బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు ఎవరిది..? అక్కడే ఎందుకు పార్క్ చేశారు? డోర్కు లాక్ ఎందుకు వేయలేదు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్వారపూడిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు సంబంధించి వైజాగ్ నుంచి ఆ కారు వచ్చినట్టు సమాచారం. కారు ఓనర్, డ్రైవర్ ఒక్కరేనని తెలిసింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం