
బయట చేయించుకోవాల్సిందే..!
థైరాయిడ్ పరీక్ష..
● సర్వజన ఆసుపత్రిలో పనిచేయని థైరాయిడ్ టెస్టింగ్ మిషన్ ● ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్న రోగులు
●ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు
పి.ఆదినారాయణ.
ఇతనిది పూసపాటి రేగ మండలం. ఇతను చర్మ సంబంధిత సమస్యతో సర్వజన ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగానికి వెళ్లగా అక్కడ వైద్యులు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని చీటీ రాసి ఇచ్చారు.
అది పట్టుకుని ల్యాబ్ దగ్గరకు వెళ్లగా అతనికి కూడా థైరాయిడ్ పరీక్ష బయట ప్రైవేటు ల్యాబ్లో చేయించుకోవాలని సిబ్బంది సూచించారు.
●ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడు పేరు పి.ఉమామహేశ్వరరావు. ఇతనిది పూసపాటి రేగ మండలం వెంపడాం గ్రామం. చర్మ సంబంధిత సమస్యతో సర్వజన ఆసుపత్రిలోని
డెర్మటాలజీ విభాగానికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఇతనికి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని ఓపీపై రాసి ఇచ్చారు. అది పట్టుకుని ల్యాబ్ దగ్గరకు వెళ్తే.. థైరాయిడ్ టెస్టు ఇక్కడ కావడం లేదు.. బయట చేయించుకోవాలని అక్కడ సిబ్బంది చెప్పారు.
దీంతో ప్రైవేటు ల్యాబ్కు వెళ్లాడు.
విజయనగరం ఫోర్ట్:
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో థైరాయిడ్ పరీక్షలు చేసే యంత్రం పనిచేయకపోవడంతో సంబంధిత రోగులకు అవస్థలు తప్ప డం లేదు. థైరాయిడ్ పరీక్ష బయట చేయించుకోవా లని సంబంధిత విభాగంలోని సిబ్బంది చెబుతుండడంతో రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా రు. ఈ పరీక్ష కోసం ప్రైవేటు ల్యాబ్లో 500 నుంచి 800వరకు ఫీజులు తీసుకుంటున్నారు. దీంతో రోగులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ సర్వజ న ఆసుపత్రిలో ప్రతిరోజూ 15 నుంచి 20 మంది వరకు థైరాయిడ్ పరీక్ష కోసం వస్తారు. జనరల్ మెడిసిన్, డెంటల్, డెర్మటాలజీ, పలమనాలజీ, జనరల్ సర్జరీ, ఎముకల విభాగం, న్యూరో మెడిస న్, న్యూరోసర్జరీ, ఈఎన్టీ, యురాలజీ తదితర విభాగాలు ఉన్నాయి. ఓపీ విభాగాల్లో రోగులను పరీక్షించిన వైద్యులు థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని చీటీలు రాసి సర్వజన ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్కు వెళ్లాలని చెబుతారు. ఇలా రోజుకు 15 నుంచి 20 మంది వరకు ఈ పరీక్ష అవసరం పడుతుంది. ప్రస్తు తం ఆసుపత్రిలో ఈ పరీక్ష చేయకపోవడం వల్ల వారంతా ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. తరచూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమామహేశ్వరావుకు థైరాయిడ్ పరీక్ష కోసం రాసి ఇచ్చిన ఓపీ చీటీ
సాంకేతిక సమస్యతో..
సర్వజన ఆసుపత్రిలో థైరాయిడ్ మిషన్ సాంకేతిక సమస్య వల్ల పని చేయడం లేదని తెలిసింది. త్వరలోనే బాగు చేయిస్తాం. రోగులకు అందుబాటులోకి తీసుకువస్తాం.
– డాక్టర్ శంబంగి అప్పలనాయుడు,
సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి

బయట చేయించుకోవాల్సిందే..!

బయట చేయించుకోవాల్సిందే..!