చిట్టిబాబుకు జాతీయ అవార్డు | - | Sakshi
Sakshi News home page

చిట్టిబాబుకు జాతీయ అవార్డు

May 24 2025 1:04 AM | Updated on May 24 2025 1:04 AM

చిట్టిబాబుకు జాతీయ అవార్డు

చిట్టిబాబుకు జాతీయ అవార్డు

విజయనగరం టౌన్‌: భారత రాజ్యాంగ విధాన పరిషత్‌ సభ్యుడు, నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా వ్యవస్థాపకుడు, భారతరత్న సి.సుబ్రహ్మణ్యం జాతీయ అవార్డును జిల్లాకు చెందిన దళిత బహుజన శ్రామిక యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు శుక్రవారం న్యూఢిల్లీలోని ఇండియన్‌ హేబిటేట్‌సెంటర్‌లో అందుకున్నారు. ఛీప్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ సత్యానంద మిశ్రా, నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా డైరెక్టర్‌ బిరాజ్‌ పట్నాయక్‌, ఎన్‌సీడీహెచ్‌ఆర్‌ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ బీనాపలికల్‌ తదితరుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సమాజ మార్పునకు కృషిచేసే 14 మందిని గుర్తించి జాతీయ అవార్డు అందించారని, అందులో తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement