
జీకేఆర్ పురం నుంచి జపాన్కు..
బాడంగి: మండలంలోని జీకేఆర్ పురం గ్రామానికి చెందిన ఉత్తరాంధ్ర తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృందానికి జపాన్ నుంచి పిలుపు అందింది. జపాన్లో తప్పెటగుళ్ల ప్రదర్శన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక్కడ నుంచి ఆయనతో పాటు ఆరుగురు కళాకారులు శనివారం జపాన్ చేరుకుంటారు. అక్కడ మన దేశం తరఫున ప్రదర్శన ఇవ్వనున్నారు. జపాన్లో ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనల్లో తప్పెటగుళ్ల కళను ప్రదర్శిస్తామని సత్యం తెలిపారు. ఇతర దేశాలకు తమ కళను పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు.