
గోపాలకృష్ణ మాస్టారుకు అవార్డు ఆనందదాయకం
రేగిడి: మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు పుర్లి గోపాల కృష్ణంనాయుడికి తెలుగు వెలుగు సాహితీవేదిక నంది అవార్డు రావడం ఆనందదాయకమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్లు అన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని అంబకండి గ్రామంలో గోపాలకృష్ణంనాయుడు మాస్టారును దుశ్శాలువాలు, బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్ల ఉపాధ్యాయుడు అయినప్పటికీ తెలుగుభాషపై ఉన్న మక్కువతో విద్య, సాంస్కృతిక సేవా రంగంలో విశిష్టమైన కృషిచేసి అవార్డు పొందడంతో ఈ ప్రాంతానికే మంచి పేరు వచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, ఎంపీటీసీ పుర్లి సత్యవతి, లావేటి గణపతిరావునాయుడు, లావేటి శ్రీహరిరావు, లావేటి వెంకట వేణుగోపాలనాయుడు, ఎస్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్