అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం

May 26 2025 12:21 AM | Updated on May 26 2025 12:21 AM

అల్పప

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం

అధికారులంతా అప్రమత్తంగా

ఉండాలి : జిల్లా కలెక్టర్‌

విజయనగరం అర్బన్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మే 27వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల యాజమాన్య సంస్థ తెలియజేసిందని ఈ నేపథ్యంలో అన్ని మండలాల తహసీల్దార్‌లు, ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. అల్పపీడన ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని, పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అన్ని మండలాలు డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సాగునీటి వనరులపై

ప్రభుత్వ నిర్లక్ష్యం

రేగిడి: సాగునీటి వనరులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ తలే రాజేష్‌ అన్నారు. ఈ ఏడా ది ఖరీఫ్‌ దగ్గరపడుతున్నప్పటికీ ఇంతవరకు తోటపల్లి, మడ్డువలస ప్రధాన పిల్ల కాలువల పనులు ఆధునికీకరణ చేపట్టకపోవడం దారుణమన్నారు. ఆదివారం రేగిడి వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. మడ్డువలస ప్రధా న కాలువకు లైనింగ్‌ పనులు పూర్తి చేయకపోవడం, పిల్ల కాలువలకు ఏర్పాటు చేసిన తూము లు, షట్టర్లు ఎక్కడికక్కడ పాడైనా.. వాటిని బాగు చేయడం లేదని, దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పొలాలకు సాగునీరు అందడం కష్టమేనని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదు సరికదా కనీసం వ్యవసాయ రంగంపై అయినా దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సమయానికే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమై న విత్తనాలను సిద్ధంగా ఉంచేదని, ఈ ఏడాది ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలకు విత్తనాలను అందించకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించ డం దారుణమని పేర్కొన్నారు. వారి వెంట పా ర్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయు డు, మండల పార్టీ కన్వీనర్‌ వావిలపల్లి జగన్మో హనరావు ఉన్నారు.

ప్రజా చైతన్యమే జేవీవీ లక్ష్యం

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌

డీవీజీ శంకరరావు

విజయనగరం అర్బన్‌: సామాజిక రుగ్మతల నుంచి ప్రజలను చైతన్య పరిచే దిశగా జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ డాక్టర్‌ డీవీజీ శంకరరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన జనవిజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో పనిచేసే జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు ఈ దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన ఫలాలు ప్రజలకు అందించాలని ఉద్దేశంతో ఈ సంస్థ పని చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ డీడీ అన్నపూర్ణ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థ సమాజానికి అవసరం ఎంతో ఉందన్నారు. జేవీవీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ ఎంవీఆర్‌ కృష్టాజీ మాట్లాడుతూ 30 ఏళ్ల జనవిజ్ఞాన వేదిక ప్రస్థానంలో ఎన్నో సైన్స్‌ ఉద్యమాలను చేపట్టి విజయాలను సా ధించిందని అన్నారు. సామాజిక కార్యకర్తలు బొడ్డేపల్లి రామకృష్ణారావు, మమ్ముల తిరుపతిరావులను ఈ సందర్భంగా సత్కరించారు. జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యు.శాంతికుమారి, జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, సాహితీ స్రవంతి అధ్యక్షుడు చీకటి దివాకర్‌, యూటీఎఫ్‌ నాయకులు నిర్మల, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.

అల్పపీడన ప్రభావంతో  భారీ వర్షాలకు అవకాశం 
1
1/2

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం

అల్పపీడన ప్రభావంతో  భారీ వర్షాలకు అవకాశం 
2
2/2

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement