ప్రధాన వార్తలు

జగన్ చరిష్మాను మరింత పెంచుతున్న కూటమి సర్కారు!
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించినట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత.. కచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లుంది. బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ద దేనిమీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డ్కు వెళుతున్నారే! ఈ సమస్య ప్రజలలోకి బాగా వెళ్లిపోతుందే! అన్న గొడవ తప్ప, రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు!. పైగా జగన్ టూర్ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రూ.260 కోట్లు ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక, ధరలు దారుణంగా పడిపోయి రెండు నెలలుగా రైతులు నానా బాధలు పడుతున్నారు. మామిడి పండ్లతో రైతులు రోజుల కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా!. ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?. కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలకు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక, పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా?అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోంది. టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని, జగన్నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ, తమ అక్కసు తీర్చుకున్నాయి. జగన్కు మద్దతుగా కాని, తమ బాధలు చెప్పుకోవడానికి గాని రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం. టమోటాలు, ఇతర ఉత్పత్తులకు సరిగా ధర లేకపోతే రైతులు పలు సందర్భాల్లో కింద పారబోసి నిరసనలు తెలిపిన ఘటనలు ఎన్ని జరగలేదు? అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది! ఎన్ని ఆంక్షలు పెట్టింది!.. ఎక్కడైనా ఇంతమందే రావాలని చెబుతారా? ఒకవేళ స్థలాభావం ఉంటే దానిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, ఐదుగురితోనే మాట్లాడాలని, రైతులను ఆటోలలో ఎక్కించుకోకూడదని, మోటార్ బైక్లకు పెట్రోల్ పోయరాదని.. ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున మూడు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. సుమారు రెండువేల మందిని నియమించారట. వీరు జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా, ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాట్లు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా పాతిక చెక్ పోస్టులు పెట్టారట. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనపర్తి వద్ద భద్రతాకారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోకపోతే, మద్దతు దారులను వెంట బెట్టుకుని నడుచుకుంటూ వెళ్లారే? అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే! చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు. అదే.. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే, డ్రైవరుతోపాటు జగన్, ఇతర ప్రయాణీకులపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందింది. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించి జగన్కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా! జగన్నాధ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా? అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడినదని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలో డబుల్ టాక్ చేయడం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏమి విలువ పెరుగుతుందో తెలియదు. బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పోలీసులు లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతనిని పరామర్శకు కూడా జగన్ కారు దిగడానికి పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో రూ.16లకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే, ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా? అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు రూ.నాలుగు సబ్సిడీని కేంద్రం భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప, వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వెళ్లుతున్నారు అన్నప్పుడుగాని వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా! ఇదే కదా ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా, తన వెంట జనం ఉన్నారని జగన్ పదే, పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. కాని ప్రజాస్వామ్యంలో అణచివేత విధానాల వల్ల ఉపయోగం ఉండదని అనుభవ పూర్వకంగా తెలియ చేసినట్లయింది. బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే, అంతే వేగంగా అది పైకి లేస్తుందన్న సంగతి మరోసారి స్పష్టమైంది. పోలీసులు మెయిన్ రోడ్డుపై ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు, గుట్టలు దాటుకుంటూ, అడవుల గుండా కూడా తరలిరావడం కనిపించింది. కొందరు యువకులు మోటార్ సైకిళ్తపై చిన్న, చిన్న డొంకల ద్వారా తరలివచ్చిన తీరుకు సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షించాయి. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అదే తీరుగా ఉంది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికలలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావన. అందుకే కూటమి సూపర్ సిక్స్తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకు రావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. వైయస్సార్సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలి. జగన్కు టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను ప్రభుత్వమే రోజురోజుకు మరింతగా పెంచుతున్నందుకు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Ongole: పాపం పసివాడు
చిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.అయ్యో లక్షిత్లక్షిత్ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే.. ఎవరి పని?బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ టీచర్లపైనే లక్షిత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విషాదంలో రెండు ఊర్లుకంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్షిత్ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

‘మహా’ మంత్రి వీడియో వైరల్..
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. మంత్రి సంజయ్ శిర్సాత్ ఇప్పుడు ఆ వీడియోతో ఒక్కసారిగా వైరల్గా మారారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. మంత్రి సంజయ్ శిర్సాత్ మంచంపై కూర్చొని సిగరెట్ కాల్చుకుంటూ ఫోన్లో మాట్లాడున్న సమయంలో పక్కనే ఒక బ్యాగ్ ఉంది. అయితే ఆ బ్యాగ్లో భారీ నగదు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. ఈ క్రమంలోనే ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ప్రధానంగా ఆయన గత ఐదేళ్లలో ఆర్థికంగా ఎదిగిన తీరుపై అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. సదరు మంత్రి పైసా తీసుకోకుండా ఏ పని చేయ్యడనే ఆరోపణలు కూడా చుట్టుముట్టిన తరుణంలో ఐటీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తనకు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందిన విషయాన్ని మంత్రి సంజయ్ శిర్సాత్ కూడా అంగీకరించారు. దీనిపై స్పందిస్తానని, తనపై అనవసర ఆరోపణలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తన పక్కన సూట్కేసులో భారీగా డబ్బులున్నాయనే విషయంపై కూడా ఆయన స్పందించారు. ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెబుతూనే, ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో వివరణ ఇస్తానని చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఆయన ఆస్తులు 2019 నుంచి 2024 మధ్య కాలంలో భారీగా పెరగడం కూడా అనుమానాలకు దారి తీసింది. Shindes men on radar. Shiv Sena minister Sanjay Shirsat’s video surfaced where half opened bag with bundle of notes lying near his bed. Shirsat confirmed the authenticity of this video. Shirsat also facing inquiry in purchase of hotel at Rs 65 Cr against mkt rate of Rs120 Cr. pic.twitter.com/KW5CeiPMeu— Sudhir Suryawanshi (@ss_suryawanshi) July 11, 2025 ఈ క్రమంలోనే మంత్రిపై పలువురు వ్యక్తులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఫిర్యాదు చేశారని, ఆ క్రమంలోనే తాను నోటీసు కూడా అందుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించడానికి తనకు తగినంత సమయం కావాలని మంత్రి వేడుకుంటున్నారు. మంత్రి సంజయ్ శిర్సాత్.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్(వెస్ట్) నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండ్ శివసేన పార్టీకి చెందిన శిర్సాత్ ఆస్తులు గత ఐదేళ్లలో గణనీయంగా ఎలా పెరిగాయనే దానిపై వివరణ ఇవ్వాలని ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది.

ఒక్క కూటమి ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించాడా?
రైతులను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు నిలదీస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారు?. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైన మాట్లాడారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా?. జగన్ వెళ్తుటే మాత్రం అడ్డుకుంటున్నారు.. .. వైస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా?. పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా?. బంగారుపాళ్యం మార్కెట్కు 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్కు పర్మిషన్ ఇచ్చారా?. ఎల్లో మీడియాలో వైఎస్ జగన్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కొంతమందికి కూలీ ఇచ్చి జగన్ను తిట్టిస్తున్నారు.... మామిడి కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తలో మాట చెబుతున్నారు. ఏది నిజం? అసలు మామిడి కొనుగోళ్లకు సంబంధించిన రూ. 260 కోట్లకు జీవో వచ్చిందా?. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది అని పేర్ని నాని కూటమి సర్కార్పై మండిపడ్డారు.

చరిత్ర సృష్టించిన జో రూట్..
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన సెంచరీతో సాధించాడు. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో తొలి బంతికే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.రూట్కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం విశేషం. తొలి రోజు ఆట మొదటి సెషన్లోనే బ్యాటింగ్కు వచ్చిన జో రూట్.. తన అద్బుత ప్రదర్శనతో స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజోలో పాతుకుపోయిన ఈ ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఓలీ పోప్, బెన్ స్టోక్స్తో కలిసి కీలక భాగస్వామ్యాలను రూట్ నెలకొల్పాడు. రూట్ ఓవరాల్గా 104 పరుగులు చేసి ఔటయ్యాడు.ద్రవిడ్ రికార్డు బ్రేక్..ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రూట్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్గా రూట్(36) రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉండేది.వీరిద్దరూ 35 టెస్టు సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్తో వీరిద్దరిని రూట్ అధిగమించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రూట్నే టాప్లో ఉన్నాడు.అదేవిధంగా టెస్టుల్లో భారత్పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్మిత్ రికార్డును సమం చేశాడు. స్మిత్ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. రూట్ కూడా సరిగ్గా 11 టెస్టు సెంచరీలు చేశాడు.బుమ్ బుమ్ బుమ్రా..రెండో రోజులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్(44), జో రూట్(104) అద్బుతమైన బంతులతో పెవిలియన్కు పంపాడు. 87 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.భారత్పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్లుజో రూట్ (ఇంగ్లండ్)- 11స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 11గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 8వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 8రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 8అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్లు..సచిన్ టెండూల్కర్ (భారత్) 51జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) 45రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 41కుమార్ సంగక్కర (శ్రీలంక) 38జో రూట్ (ఇంగ్లాండ్) 37చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే

అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..
విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్ కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్.. ఇజ్రాయెల్, తైవాన్లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు.

‘ఓ భామ అయ్యో రామా’ మూవీ రివ్యూ
టైటిల్: ఓ భామ అయ్యో రామనటీనటులు: సుహాస్, మాళవిక మనోజ్, అనిత హంసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి తదితరులునిర్మాణ సంస్థ: వీ ఆర్ట్స్నిర్మాతలు : హరీష్ నల్లరచన, దర్శకత్వం: రామ్ గోదలసంగీతం: రథన్సినిమాటోగ్రఫీ : ఎస్ మణికందన్ఎడిటర్: భవిన్ ఎం షావిడుదల తేది: జులై 11, 2025యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు కాన్సెప్ట్ కథలతో అలరిస్తూనే మరోవైపు కామెడీ చిత్రాలతోనూ నవ్విస్తున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ బ్యానర్పై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో 'ఓ భామ అయ్యో రామ'పై హైప్ క్రియేట్ అయింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(జులై 11) ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రామ్ (సుహాస్) చిన్నప్పుడే తల్లి(అనిత హంసానందిని)చనిపోతుంది. మేనమామ(అలీ)నే అన్ని తానై పెంచుతాడు. పెద్ద చదువుల కోసం పారెన్ వెళ్లాలనేది తన లక్ష్యం. స్నేహితులంతా సినిమాకు వెళ్తే..మనోడు మాత్రం థియేటర్ బయట నుంచే విని.. సినిమా హిట్టో ఫట్టో చెప్పేస్తాడు. మామ, స్నేహితులే ప్రపంచంగా బతుకుతున్న రామ్ జీవితంలోకి అనుకోకుండా సత్యభామ(మాళవిక మనోజ్) వచ్చేస్తుంది. బడా వ్యాపారవేత్త(పృథ్వీరాజ్) ఏకైక కూతురే ఈ సత్యభామ. ఆమెకు ఎవరైనా నచ్చితే.. వారికోసం ఏదైనా చేసేస్తుంది. రామ్ని ఇష్టపడమే కాకుండా అతన్ని సినిమా డైరెక్టర్ని చేయాలని ఫిక్సవుతుంది. అతనికి ఇష్టం లేకపోయినా.. స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాత మూడేళ్ల వరకు మనం కలువొద్దని కండీషన్ పెట్టి.. అతనికి దూరంగా వెళ్లిపోతుంది. ఆ మూడేళ్లలో రామ్ జీవితం ఎలా మారింది? సత్యభామ.. రామ్కి దూరంగా ఎందుకు వెళ్లింది? రామ్ తండ్రి ఎవరు? సినిమాలు అంటేనే నచ్చని రామ్ని దర్శకుడిగా చేయాలని సత్యభామ ఎందుకు ప్రయత్నించింది. రామ్ దర్శకుడుగా సక్సెస్ అయ్యాడా లేదా? చివరకు రామ్, సత్యభామ కలిశారా లేదా అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘తెలుగు సినిమా అంటే లవ్, ఎమోషన్, డ్రామా.. ఇవన్నీ ఉండాలి’ అని ఓ సీన్లో హీరో సుహాస్ అంటాడు. ఆ డైలాగ్కు తగ్గట్టే ఓ భామ అయ్యో రామ సినిమా కథ ఉంది. అయితే వాటిని సరిగా వాడుకోవడంలోనే దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఓ యూత్ఫుల్ లవ్స్టోరీకి మదర్ సెంటిమెంట్ని యాడ్ చేసి ఫన్వేలో కథనాన్ని నడించారు. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. లవ్స్టోరీ రొటీన్గానే ఉన్నా.. ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక ప్లాష్బ్యాక్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. హీరో తల్లి చనిపోయే ఎమోషనల్ సీన్తో కథని ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశం కాస్త కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు కలిసిన తర్వాత కథనం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. హీరో ఎక్కడ ఉంటే అక్కడికి హీరోయిన్ వెల్లడం.. బయటకు తీసుకెళ్లి.. కథ చెబుతూ విసిగించడం మొదట్లో బాగున్నా.. ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ కావడం కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశారు. సెకండాఫ్లో వచ్చే హీరో మదర్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్ పెళ్లి ఎపిసోడ్ కామెడీగా ప్లాన్ చేసినా..అది వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్లో హీరోయిన్ చేసే అల్లరి పనులన్నింటికి.. సెకండాఫ్లో మంచి జస్టిఫికేషన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. అయితే కథను మరింత బలంగా రాసుకొని.. ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రామ్ పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక హీరోయిన్ మాళవిక మనోజ్కి ఇది తొలి తెలుగు సినిమా. సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది. కథనం మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అనిత హంసానందిని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించింది. హీరో తల్లిగా పాత్రలో నటించి అందర్ని సర్ప్రైజ్ చేసింది. మదర్ సెంటిమెంట్ సీన్ల ఈ సినిమాకు హైలెట్. ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మణికందన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్రధాన బలం. ప్రతీ సీన్ తెరపై చాలా రిచ్గా చూపించాడు. రథన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. బ్రహ్మకడలి ఆర్ట్వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గలేదని సినిమా చూస్తే అర్థం అవుతుంది. హీరో మార్కెట్, కథని మించి ఖర్చు చేశారు. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్

రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం
సాక్షి,న్యూఢిల్లీ: ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజా సింగ్కు లేఖ రూపంలో తెలియజేశారు. మీ రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు పార్టీ పని విధానం , సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. మీరు లేవనెత్తి అంశాలు అసందర్భం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో మీ రాజీనామాను ఆమోదిస్తున్నాం అని అరుణ్ లేఖలో తెలియజేశారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచందర్రావు ఎన్నికను వ్యతిరేకిస్తూ గోషామహల్(హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి జూన్ 30వ తేదీన రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాపై వివరణ ఇవ్వమని హైకమాండ్ కోరితే అందుకు తాను సిద్ధమని చెప్పారాయన. కానీ, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే ఇప్పుడు రాజీనామాకు అధిష్టానం ఆమోదం తెలపడం గమనార్హం.

బలూచిస్తాన్: ఐడీ కార్డు చూసి ప్రయాణికుల్ని కాల్చేశారు!
బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఘోరం జరిగింది. బస్సుల్లో వెళ్తున్న కొందరిని తుపాకులతో వచ్చిన దుండగులు అపహరించారు. ఆపై సమీపంలోని కొండల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు తనిఖీలు చేసి మరీ కిరాతకంగా కాల్చి చంపారు.బలూచిస్తాన్ ప్రావిన్స్లో దారుణం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పలు బస్సుల నుంచి ప్రయాణికులను తుపాకులు చూపించి బెదిరించి ఎత్తుకెళ్లారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు పరిశీలించి కాల్చి చంపారు. శరీరం నిండా తుట్లతో 9 మంది ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారి ఒకరు ప్రకటించారు. ఘటనకు కారకులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. పాక్ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది. దుండగుల కోసం భద్రతాల బలగాలు రంగంలోకి దిగాయి.ఇదిలా ఉంటే.. బలూచ్ వేర్పాటువాద మిలిటెంట్ గ్రూపులు గతంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాయి. ఇందులో బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) అత్యంత బలమైంది. అఫ్గనిస్తాన్-ఇరాన్ సరిహద్దుల గుండా ఇది స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే పాక్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. Pakistan Bus Attack: Gunmen Kill 9 Punjabi Passengers in Balochistan After Checking ID Cards#Balochistan #Pakistan https://t.co/seQhPWzqLJTo get epaper daily on your whatsapp click here: https://t.co/Y9UVm2LHAx— Free Press Journal (@fpjindia) July 11, 2025బలూచిస్తాన్ అత్యంత అరుదైన ఖనిజాలకు మూలం. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వనరులను పంజాబ్ ప్రావిన్స్కు దోచిపెడుతోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్ నుంచి వాహనాలను, ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తూ వస్తోంది.గత కొన్ని నెలలుగా బలూచిస్తాన్లో వరుస హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ గురైంది. బొలాన్ జిల్లాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ సుమారు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును హైజాక్ చేసింది. అందులో 30 మందిని కాల్చి చంపింది. మరో 215 మందిని బందీలుగా తీసుకుంది. బందీలలో ఎక్కువ మంది సైనికులు, పోలీసు, ISI, యాంటీ టెర్రరిజం ఫోర్స్ సభ్యులుగా ఉండడం గమనార్హం. పాక్ సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి.. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా దాడులు జరిపింది. అంతకు ముందు.. 2024 ఆగస్టులో ముసాఖేల్ జిల్లాలో 23 మంది ప్రయాణికులను ఐడెంటిటీ కార్డులు అడిగి కాల్చి చంపింది బీఎల్ఏ.

యూపీఐతో చెల్లింపుల్లో మనమే సూపర్ఫాస్ట్
యూపీఐ దన్నుతో, మిగతా ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారత్లో చెల్లింపుల విధానం అత్యంత వేగవంతంగా ఉంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ విధానం చాలా వేగంగా వినియోగంలోకి వచ్చిందని ఫిన్టెక్ నోట్లో పేర్కొంది. అదే సమయంలో నగదుకు ప్రత్యామ్నాయాలైన డెబిట్, క్రెడిట్ కార్డుల్లాంటి ఇతరత్రా సాధనాల వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించింది.ప్రస్తుతం యూపీఐ ప్రతి నెలా 1,800 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేస్తోందని ఐఎంఎఫ్ పేర్కొంది. వివిధ పేమెంట్ ప్రొవైడర్స్ సేవలు ఉపయోగించుకునే యూజర్ల మధ్య నిరాటంకంగా చెల్లింపు లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు క్లోజ్డ్ లూప్ సిస్టమ్లతో పోలిస్తే యూపీఐలాంటి ఇంటర్ఆపరబుల్ పేమెంట్ సిస్టమ్లు సమర్ధవంతంగా ఉంటాయని తెలిపింది. అయితే, ఇది మరింత వినియోగంలోకి వచ్చే కొద్దీ ప్రైవేట్ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి కూడా దారి తీయొచ్చని, అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఆ హీరో నా కొడుకే.. తనతో గొడవపడ్తూ ఉంటా: సవతి తల్లి
IND vs ENG 3rd Test: జేమీ స్మిత్ ప్రపంచ రికార్డు
ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా.. ఇది చదవండి!
ప్రేమ వివాహం చేసుకున్నారని..
ఎన్టీఆర్ జిల్లా: పోస్టాఫీసులో రూ.50 లక్షల గోల్మాల్
పాక్ యువ నటి మృతి.. పోస్ట్మార్టం రిపోర్టులో సంచలన విషయాలు!
‘మహా’ మంత్రి వీడియో వైరల్..
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
Ongole: పాపం పసివాడు
ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
Telangana: నంబర్ ప్లేట్లు మార్చాల్సిందే
పొలిటికల్ రిటైర్మెంట్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
టెక్సాస్లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
పెట్రోబాదుడులో ఇండియా టాప్
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
‘ది 100’ మూవీ రివ్యూ
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్ది కాదు!!
ఫిష్ వెంకట్కు సాయం చేసిన మరో హీరో..
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
ఆ సినిమా చేయడమే తప్పు.. రంగస్థలం రిజెక్ట్ చేశా: ఆర్కే సాగర్
వరల్డ్ నెం1 బ్యాటర్గా ఇంగ్లండ్ ఆటగాడు.. టాప్-10లోకి గిల్
ఏం గుండె సామీ నీది..? కింగ్ కోబ్రా రియల్గా..
ఆ హీరో నా కొడుకే.. తనతో గొడవపడ్తూ ఉంటా: సవతి తల్లి
IND vs ENG 3rd Test: జేమీ స్మిత్ ప్రపంచ రికార్డు
ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా.. ఇది చదవండి!
ప్రేమ వివాహం చేసుకున్నారని..
ఎన్టీఆర్ జిల్లా: పోస్టాఫీసులో రూ.50 లక్షల గోల్మాల్
పాక్ యువ నటి మృతి.. పోస్ట్మార్టం రిపోర్టులో సంచలన విషయాలు!
‘మహా’ మంత్రి వీడియో వైరల్..
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
Ongole: పాపం పసివాడు
ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
Telangana: నంబర్ ప్లేట్లు మార్చాల్సిందే
పొలిటికల్ రిటైర్మెంట్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
టెక్సాస్లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
పెట్రోబాదుడులో ఇండియా టాప్
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
‘ది 100’ మూవీ రివ్యూ
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్ది కాదు!!
ఫిష్ వెంకట్కు సాయం చేసిన మరో హీరో..
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
ఆ సినిమా చేయడమే తప్పు.. రంగస్థలం రిజెక్ట్ చేశా: ఆర్కే సాగర్
వరల్డ్ నెం1 బ్యాటర్గా ఇంగ్లండ్ ఆటగాడు.. టాప్-10లోకి గిల్
ఏం గుండె సామీ నీది..? కింగ్ కోబ్రా రియల్గా..
సినిమా

మరో రీమేక్.. 'దఢక్ 2' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్లో మరో రీమేక్ రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా పరిచయమైన 'దఢక్' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. కాకపోతే ఇందులో హీరోహీరోయిన్లతో పాటు స్టోరీ కూడా పూర్తిగా మారిపోయింది. కాకపోతే మెయిన్ పాయింట్ మాత్రం దాదాపు అదే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఏ మూవీకి రీమేక్? ట్రైలర్ ఉందనేది ఇప్పుడు చూద్దాం.మరాఠీలో వచ్చిన 'సైరాత్' సినిమా అదిరిపోయే హిట్. దాన్ని హిందీలో 'దఢక్' పేరుతో రీమేక్ చేశారు. తక్కువ కులానికి చెందిన ఓ అబ్బాయి.. పై కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ప్లాట్ పాయింట్. ఆ మూవీ హిందీలోనూ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ 'దఢక్ 2' తీశారు. ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)ట్రైలర్ చూడగానే అరె ఈ స్టోరీ ఎక్కడో చూసినట్లు ఉందే అనిపించింది. తమిళంలో 2018లో 'పరియరుమ్ పెరుమాళ్' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు దీన్నే హిందీలో 'దఢక్ 2' పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్ ఆర్ట్ ఫిల్మ్ తరహాలో ఉంటుంది. రీమేక్కి వచ్చేసరికి మాత్రం కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చారనిపిస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది తక్కువ కులానికి చెందిన కుర్రాడిగా, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి పై కులానికి చెందిన అమ్మాయిగా నటించారు.ట్రైలర్ అయితే చూడటానికి బాగానే ఉంది. హీరోహీరోయిన్లుగా చేసిన సిద్ధాంత్, తృప్తి జంట మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి సినిమా ఏ మేరకు క్లిక్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్)

మరోసారి తల్లి కాబోతున్న దేవర నటి.. 'ఇన్నాళ్లు సీక్రెట్గా ఉంచాం'
నటి చైత్ర రాయ్ (Chaitra Rai) గుడ్న్యూస్ చెప్పింది. తను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో భర్త, కూతురితో కలిసి మెటర్నటీ ఫోటోషూట్ జ్ఞాపకాలను పంచుకుంది. 'ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం. ఇప్పుడు ఆ సీక్రెట్ను మీ అందరితో పంచుకోవాలనిపించింది. నాకు మరో బేబీ రాబోతోంది. నిశ్క శెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.సీరియల్స్ నుంచి సినిమాల్లోకి..మీ ప్రేమాభిమానాలు మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి' అని క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చైత్ర దంపతులకు కూతురు నిష్క శెట్టి సంతానం. ఇప్పుడా పాపతో ఆడుకునేందుకు త్వరలోనే మరో బుజ్జాయి రానుందన్నమాట! కాగా కన్నడ బ్యూటీ చైత్ర.. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ఒకరికి ఒకరు, దటీజ్ మహాలక్ష్మి, రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17) చదవండి: పెళ్లి పేరు ఎత్తితేనే భయమేస్తోంది.. నేనైతే మ్యారేజ్ చేసుకోను

బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!
'బాహుబలి' రిలీజ్ తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి తెలుగు సినిమాలతో పాటు కేజీఎఫ్ తదితర చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించాయి. హిందీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్లో పరిస్థితి దారుణంగా తయారైంది. స్టార్ హీరోలు తీసిన సినిమాలు సరిగా ఆడట్లేదు. కొందరు సౌత్ దర్శకులు.. హిందీ హీరోలతో తీసిన జవాన్, యానిమల్ లాంటివి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఈ క్రమంలోనే గత కొన్నాళ్లలో హిందీ నటీనటులు.. బాహాటంగానే సొంత ఇండస్ట్రీపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా అలాంటి కామెంట్స్ చేశాడు. 'కేజీఎఫ్' చిత్రంలో విలన్గా అలరించిన ఇతడు.. ఇప్పుడు 'కేడీ ది డెవిల్' అనే మరో కన్నడ మూవీలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులోనే సంజయ్ దత్.. బాలీవుడ్ పరిస్థితి ఏంటో చెప్పేశాడు.(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్)ప్రస్తుతం మీరు దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు కదా.. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఏం తీసుకెళ్తారు? అని ఓ రిపోర్టర్ అడిగాడు. దీనికి బదులిచ్చిన సంజయ్ దత్.. 'మంచి సినిమాలు తీయాలనే ప్యాషన్ని బాలీవుడ్కి తీసుకెళ్తా. గతంలో మా దగ్గర మంచి సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు మా వాళ్లు.. కలెక్షన్, నంబర్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ సౌత్లో అలా కాదు. ముఖ్యంగా తెలుగులో మూవీస్పై మంచి ప్యాషన్ కనిపిస్తోంది. అందుకే నాకు ఇక్కడ పనిచేయడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలోనూ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. ఆ చిత్రంతో పాటు తెలుగు సినీ పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు. 'తెలుగులో చాలామంది నిర్మాతలు నాకు తెలుసు. వాళ్లతో కలిసి నేను పనిచేశాను. 1980ల నుంచి హైదరాబాద్ వస్తున్నాను. ఇక్కడి వాతావరణం, ఫుడ్ బాగుంటాయి. తెలుగులో ప్రభాస్తో సినిమా చేస్తున్నా. తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. ప్రభాస్ నాకు ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తున్నాడు' అని సంజూ చెప్పాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే బాలీవుడ్లో ఇప్పుడు ఎవరూ సరైన సినిమాలు తీయట్లేదని, ఈ విషయంలో టాలీవుడ్ చాలా బెటర్ అని అర్థం. ఓ రకంగా చూస్తే పరోక్షంగా సొంత ఇండస్ట్రీ పరువునే తీసేశాడు!(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన)

'మర్యాద రామన్న'కు రీమేక్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా
తెలుగులో కొన్నే సినిమాలు చేసినప్పటికీ మృణాల్ ఠాకుర్ అభిమానుల్ని బాగానే సంపాదించుకుంది. కొన్నిరోజుల క్రితం ఓ విషయమై ఈమె తెగ ట్రెండ్ అయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా ఓ హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర ట్రైలర్ని రిలీజ్ చేశారు. 56 ఏళ్ల హీరోతో ఈ మూవీలో రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?)2010లో తెలుగులో 'మర్యాద రామన్న' సినిమా రిలీజైంది. రాజమౌళి దర్శకత్వం వహించగా కమెడియన్ సునీల్.. ఇందులో హీరోగా నటించాడు. పలు భాషల్లో ఇది రీమేక్ అయింది. హిందీలో అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్' పేరుతో రీమేక్ చేశాడు. 2012లో ఇది విడుదలైంది. హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధం చేశారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2' పేరుతో జూలై 25న రిలీజ్ చేయబోతున్నారు. తొలి పార్ట్లో సోనాక్షి సిన్హా హీరోయిన్ కాగా.. ఇప్పుడు మృణాల్ ఠాకుర్ హీరోయిన్.ట్రైలర్ విషయానికొస్తే.. పంజాబ్ నుంచి సర్దార్, స్కాట్లండ్ వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కుటుంబానికి సాయం చేసే క్రమంలో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. తర్వాత ఏమైంది? ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తోంది. తొలి భాగంలానే దీన్ని కూడా కామెడీ ఎంటర్టైనర్గా తీశారు. ట్రైలర్ ఓకే ఓకే ఉంది. పెద్దగా మెరుపులేం లేవు. మరి థియేటర్లలో మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన)
న్యూస్ పాడ్కాస్ట్

ఏపీ ముఖ్యమంత్రిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

రైతుకు గడ్డు కాలం.. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు... చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

చిత్తూరు జిల్లాలో మామిడి రైతన్న చిత్తు చిత్తు... ఆశలు చిదిమేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. నేడు రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరో 2వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల పిడుగు

ఆంధ్రప్రదేశ్లో పోలీసుల రెడ్బుక్ అరాచకాలకు హైకోర్టు రెడ్సిగ్నల్

మా భూములిచ్చే ప్రసక్తే లేదు... ఏపీ రాజధాని భూ సమీకరణ సభల్లో ఎమ్మెల్యే, అ«ధికారులను తరిమికొట్టిన రైతులు

పాకిస్తాన్పై యుద్ధం ఎందుకు ఆపేశారో మోదీ ప్రభుత్వం చెప్పాలి... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్

ఏపీలో గత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యలో పెరుగుదలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రుజువులు అందజేసిన వైఎస్సార్సీపీ... తమ విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించిందన్న పార్టీ నేతలు

ఘటన జరిగిన రెండేళ్లకు కేసు నమోదు చేయడం ఏమిటి?... వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య... బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనం

ప్రజలకు అండగా నిలబడాలి, నిత్యం వారికి అందుబాటులో ఉండాలి... వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
క్రీడలు

కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే
క్రికెట్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు వియాన్ ముల్డర్ (Wiaan Mulder). ఈ సౌతాఫ్రికా ఆల్రౌండర్ ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టు సందర్భంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్గా తన తొలి ప్రయత్నంలోనే ఏకంగా 367 పరుగులతో దుమ్ములేపాడు.కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. అజేయ ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రొటిస్ క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే అతడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా (Brian Lara) పేరిట క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డుకు చేరవయ్యాడు. అయితే, అనూహ్యంగా తాను 367 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ముల్డర్ ఆశ్చర్యపరిచాడు.లారా వంటి లెజండరీ బ్యాటర్ పేరిటే ఈ రికార్డు ఉండాలని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ముల్డర్పై ప్రశంసలతో పాటు విమర్శల వర్షమూ కురిసింది. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకేనని. అయినా అతడేమీ 399 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయదంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.లారా రియాక్షన్ ఇదేతాజాగా ఈ విషయం గురించి వియాన్ ముల్డర్ స్పందించాడు. తన అభిప్రాయంతో లారా ఏకీభవించలేదంటూ ఆసక్తికర విషయం చెప్పాడు. ‘‘నాకు కాస్త విరామం దొరికినపుడు.. బ్రియన్ లారాతో మాట్లాడాను. నీకంటూ సొంత లెగసీ సృష్టించుకోవాలని ఆయన నాతో అన్నాడు.నీకోసమే నువ్వు ఆడాలని చెప్పాడు. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టడానికేనని... మరోసారి గనుక నేను ఇలా 400కు చేరువగా వస్తే మాత్రం.. అప్పుడు ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని చెప్పాడు.నా నిర్ణయం సరైందేనిజానికి ఇప్పుడు నేను బ్యాటింగ్ కొనసాగించి.. తనకంటే ఎక్కువ స్కోరు చేస్తే సంతోషించేవాడినని నాతో అన్నాడు. ఆయనలో ఉన్న గొప్పదనం అదే. అయితే, ఇప్పటికీ నా నిర్ణయం సరైందేనని నేను భావిస్తున్నా. ఆటను, దిగ్గజాలను గౌరవించడం అన్నిటికంటే ముఖ్యం’’ అని వియాన్ ముల్డర్ సూపర్స్పోర్ట్తో వ్యాఖ్యానించాడు.మిస్ చేసుకున్నావుకాగా వియాన్ ముల్డర్ గురించి మరో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘అతడు తప్పు చేశాడు. 400 కొట్టేందుకు అతడు ప్రయత్నించి ఉండాల్సింది. అలా అయితేనే కదా.. క్వాడ్రపుల్ సెంచరీ చేసేవాడో లేదో తెలిసేది. కానీ 367 పరుగుల వద్ద ఉన్నపుడు డిక్లేర్ చేశాడు.తానేం చెప్పదలచుకున్నాడో అది చెప్పేశాడు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశాలు వస్తాయి. టెస్టు ఇన్నింగ్స్లో 400 రన్స్ మామూలు విషయం కాదు. ఈసారి నువ్వు ఇది మిస్ చేసుకున్నావు’’ అంటూ విమర్శించాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ నయా చాంపియన్ సౌతాఫ్రికా రెండు టెస్టులు ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లింది. తొలి టెస్టులో కేశవ్ మహరాజ్ సారథ్యంలో.. రెండో టెస్టులో ముల్డర్ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0తో క్లీన్స్వీప్ చేసింది.చదవండి: ప్యాట్ కమిన్స్ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి

‘గంభీర్ ఎవరికీ ముఖ్యం కాదు.. కోచ్గా ఉండటం కష్టం’
ఆటగాడిగా కంటే కోచ్గా ఉండటం అత్యంత కష్టమైన పని అని టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) అన్నాడు. జట్టులోని ప్లేయర్గా కేవలం మన ఆటకు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని.. అదే శిక్షకుడిగా ఉంటే జట్టులోని అందరి ఆటగాళ్ల ప్రదర్శనకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.అందువల్ల కోచ్పై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని.. అందుకే తాను ఈ మధ్య తరచుగా తన గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) మార్గదర్శనంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత.. అతడి స్థానంలో గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు.వన్డే, టీ20లలో రైట్ రైట్శ్రీలంకలో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం ద్వారా తన కోచింగ్ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించిన గౌతీ.. పరిమిత ఓవర్ల సిరీస్లో వరుస విజయాలు చవిచూశాడు. ముఖ్యంగా అతడి నేతృత్వంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నెగ్గడం చెప్పుకోదగినది.టెస్టులలో బ్రేకులుఅయితే, టెస్టు ఫార్మాట్లో మాత్రం గంభీర్కు కఠినమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా తొలిసారి 3-0తో వైట్వాష్ కావడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (3-1)ని పదేళ్ల తర్వాత చేజార్చుకోవడం.. గంభీర్పై విమర్శలకు దారితీశాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి ఇంగ్లండ్ టూర్కు వచ్చిన గంభీర్కు తొలి మ్యాచ్లో చేదు అనుభవమే మిగిలింది. లీడ్స్ టెస్టులో టీమిండియా ఓడిపోయింది. అయితే, గత చేదు జ్ఞాపకాలు చెరిపేసేలా తొలిసారి ఎడ్జ్బాస్టన్లో జయభేరి మోగించింది. దీంతో గంభీర్కు కాస్త ఊరట లభించింది.తరచుగా గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందిఈ నేపథ్యంలో సహచర మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గతంలో కంటే ఇప్పుడు తరచుగా గడ్డానికి రంగు వేయాల్సి వస్తోంది.ఆటగాడిగా ఉన్నపుడు మన ఆట గురించి మాత్రమే ఆలోచిస్తాం. అదే కోచ్గా మారితే.. జట్టు మొత్తానికి మనదే బాధ్యత. ప్రతి విషయానికి మనమే జవాబుదారీగా ఉండాలి. ఎలాంటి వ్యక్తిగత, ప్రత్యేక ఎజెండాలు లేకుండా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలి.అయితే, కోచ్గా ఉండటం వల్ల అభద్రతా భావం మాత్రం ఎప్పుడూ దరిచేరదు. జట్టుతో కలిసే మనం నేర్చుకుంటాం. వారితో కలిసే ఎదుగుతాము. ఏదేమైనా ప్రతిరోజూ ఓ కొత్త సవాలే.గంభీర్ ఎవరికీ ముఖ్యం కాదుదేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం. ఇక్కడ గౌతం గంభీర్ అనే వ్యక్తి ముఖ్యం కాదు. భారత క్రికెట్ అనేదే అన్నింటికంటే ముఖ్యమైనది. డ్రెసింగ్రూమ్లో తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. వారి అభిప్రాయాలు కోచ్గా నాకూ ముఖ్యమే. ఏదేమైనా ఆటగాడిగా ఉండటం కంటే కోచ్గా కష్టతరమైన పనే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్యాట్ కమిన్స్ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి

అరుదైన క్రికెటర్.. 34 ఏళ్లకే రిటైర్మెంట్
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో రెండు దేశాలకు ప్రాతినిథ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ప్రస్తుత ఐర్లాండ్ ఆటగాడు పీటర్ మూర్ ఒకరు. మూర్ 34 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐర్లాండ్ తరఫున వరల్డ్కప్ ఆడాలన్న కలతో ఆ దేశానికి వలస వెళ్లిన మూర్.. ఆ కోరిక తీరకుండానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.ఐర్లాండ్కు ఆడకముందు మూర్ జింబాబ్వే జట్టులో సభ్యుడు. మూర్ 2014లో బంగ్లాదేశ్తో జరిగిన ఓ వన్డే మ్యాచ్లో జింబాబ్వే తరఫున అరంగేట్రం చేశాడు. నాటి నుంచి మూర్ జింబాబ్వే ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా మారాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ కమ్ వికెట్కీపర్ అయిన మూర్ జింబాబ్వే తరఫున 49 వన్డేలు, 21 టీ20లు, 8 టెస్ట్లు ఆడాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీల సాయంతో 1700 పైచిలుకు పరుగులు సాధించాడు.అనంతరం మూర్ ఐరిష్ మూలాలు (నాన్నమ్మ) ఉండటంతో ఐర్లాండ్కు వలస వెళ్లాడు. 2023 మూర్ ఐర్లాండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి ఆ దేశం తరఫున 7 టెస్ట్లు ఆడాడు. ఐర్లాండ్ తరఫున 2024 జులైలో అతని అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. నాడు మూర్ తన జన్మదేశమైన జింబాబ్వేపై మూర్ 79 పరుగులు చేశాడు. అతను చివరిగా అంతర్జాతయ మ్యాచ్ ఆడింది కూడా జింబాబ్వేపైనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూర్ జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 4, 30 పరుగులు చేశాడు. ప్రొఫెషనల్ కెరీర్లో మూర్ తన చివరి మ్యాచ్ను నిన్ననే (జులై 10) ఆడాడు. ఐరిష్ దేశవాలీ టోర్నీలో మన్స్టర్ రెడ్స్కు ప్రాతినిథ్యం వహించిన మూర్.. వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో అతని జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే మ్యాచ్లో మూర్ సహచరుడు కర్టిస్ క్యాంఫర్ 5 వరుస బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మూర్ తన అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికినా దేశవాలీ, టీ20 లీగ్ల్లో కొనసాగుతునాని చెప్పాడు.

ప్యాట్ కమిన్స్ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి
లార్డ్స్ టెస్టులో టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిరోజు సత్తా చాటాడు. ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే (18), బెన్ డకెట్ (23) వికెట్లు కూల్చి భారత్కు శుభారంభం అందించాడు. తద్వారా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కోసమంటూ నితీశ్ (Nitish Kumar Reddy)ను ఎంపిక చేయడం సరికాదన్న విమర్శకులకు ఆటతోనే బదులిచ్చాడు.కమిన్స్ని సలహా అడిగితే ఏమన్నాడంటేఈ నేపథ్యంలో లార్డ్స్ టెస్టు మొదటి రోజు పూర్తయిన అనంతరం నితీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘ఇక్కడికి వచ్చే ముందే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులలో ఎలాంటి వైరుధ్యాలు ఉంటాయని ప్యాట్ (ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ Pat Cummins)ను అడిగాను.నాకిదే తొలి ఇంగ్లండ్ పర్యటన కాబట్టి సలహాలు ఇవ్వమన్నాను. అందుకు బదులుగా.. ‘పిచ్ స్వభావంలో పెద్దగా తేడా ఉండదు. అయితే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు బౌలింగ్ను మార్చుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు’’ అని నితీశ్ రెడ్డి తెలిపాడు.కాగా ఐపీఎల్లో నితీశ్ రెడ్డి సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ప్యాట్ కమిన్స్ గత రెండేళ్లుగా కెప్టెన్గా ఉన్నాడు. అతడి సారథ్యంలోనే వరుస అవకాశాలు దక్కించుకున్న ఈ ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. టీమిండియాలోనూ ఎంట్రీ ఇచ్చి తనను తాను నిరూపించుకుంటున్నాడు.మా కోచ్ వల్లే ఇదంతా..ఇక... టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మోర్నీతో కూడా నా ఆట గురించి చాలానే చర్చించాను. ముఖ్యంగా సరైన లైన్ అండ్ లెంగ్త్తో నిలకడగా బౌలింగ్ చేయడంపై దృష్టి సారించాము. గతేడాది కాలంగా ఈ విషయమై కఠినంగా శ్రమించాను.అందుకు ప్రతిఫలంగా నా బౌలింగ్లో రోజురోజుకీ పరిణతి కనిపిస్తోంది. ఇలాంటి కోచ్తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి ప్రయాణం చేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా’’ అని నితీశ్ రెడ్డి కోచ్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.లార్డ్స్లో అమీతుమీకాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో గిల్ సేన ఈ ఓటమికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. స్టోక్స్ బృందాన్ని ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ వేదికపై తొలిసారి గెలుపు నమోదు చేసింది.ఇక ఇరుజట్ల మధ్య లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో గురువారం (జూలై 10) మూడో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ మొదటి రోజు ఆట ముగిసేసరికి.. 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నస్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్ 99, బెన్ స్టోక్స్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో నితీశ్ రెడ్డి రెండు వికెట్లు కూల్చగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఒక్కో వికెట్ దక్కాయి. చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గావాట్ రా రెడ్డి, బాగుంది రా మామ👌 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/cH9KYukrVX— Sony Sports Network (@SonySportsNetwk) July 10, 2025
బిజినెస్

గోల్డ్ ఈటీఎఫ్లు.. జిగేల్! ఏకంగా రూ.2,081 కోట్లు
బంగారం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు జూన్లో బలమైన డిమాండ్ కనిపించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవలి కాలంలో స్థిరమైన ర్యాలీ చేస్తుండడం ఇన్వెస్టర్లను మరింతంగా ఆకర్షిస్తోంది. జూన్ నెలలో ఏకంగా రూ.2,081 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.ఈ ఏడాది మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.292 కోట్లతో పోల్చి చూస్తే జూన్లో ఏడింతలైనట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.6 కోట్లు, మార్చిలో రూ.77 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ కాలాన్ని పరిశీలించి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.8,000 కోట్లుగా ఉన్నాయి.ఈ ఏడాది జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్లు రూ.3,751 కోట్లను ఆకర్షించగా, ఆ తర్వాత తిరిగి జూన్లోనే గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం గమనించొచ్చు. జూన్లో రెండు గోల్డ్ ఈటీఎఫ్లు మొదటిసారి మార్కెట్లోకి వచ్చి (ఎన్ఎఫ్వోలు) ఇన్వెస్టర్ల నుంచి రూ.41 కోట్లను సమీకరించాయి. జూన్ చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తుల విలువ మే చివరితో పోల్చి చూసినప్పుడు 4%పెరిగి (మే చివరి నుంచి) రూ.64,777 కోట్లకు చేరింది.స్థిరమైన ధరలు, అనిశ్చిత పరిస్థితులు..‘‘జూన్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి బలమైన పెట్టుబడులు రావడం సెంటిమెంట్లో మార్పునకు నిదర్శనం. ధరలు స్థిరంగా ఉండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఈక్విటీ, డెట్ సాధనాల్లో అస్థిరతలు ఇందుకు కారణమై ఉండొచ్చు’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ తెలిపారు. కొత్త పథకాల ద్వారా నిధుల సమీకరణ కూడా మెరుగ్గానే ఉన్నట్టు చెప్పారు.గోల్డ్ ఈటీఎఫ్ల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. గోల్డ్ ఈటీఎఫ్లకు సంబంధించి ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) జూన్లో 2.85 లక్షలు పెరిగాయి. మొత్తం ఫోలియోలు 76.54 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్ల ధరలు బంగారం మార్కెట్ ధరలనే ప్రతిఫలిస్తుంటాయి. ఒక ఈటీఎఫ్ యూనిట్ గ్రాము బంగారంతో సమానం. కానీ, కొన్ని ఫండ్స్ సంస్థలు ఇంతకంటే తక్కువ పరిమాణంలోనూ పెట్టుబడులకు అనుమతిస్తున్నాయి.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
టీసీఎస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) షేరు ధర బలహీనమైన జూన్ త్రైమాసిక ఫలితాల మధ్య బిఎస్ఇలో ప్రారంభ ఒప్పందాలలో 2 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ సహా ఇతర ఐటీ షేర్లు కూడా 3 శాతం వరకు క్షీణించాయి.ఉదయం 9.46 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్లు లేదా 0.23% నష్టపోయి82,996.41 పాయింట్ల వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు లేదా 0.22% నష్టంతో 25,299.55 వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్ఎం, టెక్ ఎం, ఎటర్నల్ (జొమాటో), బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో కొనసాగుతుండగా హెచ్యూఎల్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్గా కొనసాగుతున్నాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.03 శాతం, 0.14 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.8 శాతం, నిఫ్టీ ఆటో 0.15 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, పీఎస్యూ బ్యాంక్ సూచీలు వరుసగా 0.57 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి.

వేదాంతా 3డీ వ్యూహం
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ దిగ్గజం వేదాంతా బిజినెస్ను రెట్టింపునకు పెంచుకునేందుకు వీలుగా 3డీ వ్యూహానికి తెరతీయనుంది. దీనిలో భాగంగా విడదీత, వివిధీకరణ(డైవర్సిఫికేషన్), రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టనుంది. కంపెనీ 60వ సాధారణ వార్షిక సమావేశంలో కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ సెపె్టంబర్లోగా వివిధ బిజినెస్ల విడదీతను పూర్తిచేగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాటాదారులనుద్దేశించి ప్రసంగిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రతీ బిజినెస్ 100 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా ఆవిర్భవించేందుకు వీలున్నట్లు పేర్కొన్నారు. 3డీ వ్యూహం కంపెనీ పరిమాణాన్ని రెట్టింపు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా వాటాదారులకు గరిష్ట ప్రయోజనం చేకూరనున్నట్లు తెలియజేశారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణ చివరి దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందుకు 99.5 శాతం వాటాదారులు, రుణదాతల అనుమతి పొందినట్లు తెలియజేశారు. విడదీత పూర్తయితే వేదాంతా వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ విడదీసిన 4 బిజినెస్ల నుంచి ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నట్లు వివరించారు. కాగా.. యూఎస్ షార్ట్సెల్లర్ సంస్థ వైస్రాయ్ రీసెర్చ్.. ఒక రోజు ముందు వేదాంతా రిసోర్సెస్ ఒక పారసైట్ వంటిదని, దేశీ యూనిట్(వేదాంతా లిమిటెడ్)ను వ్యవస్థాగతంగా బలహీనపరుస్తున్నదంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అనిల్ అగర్వాల్ ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే వైస్రాయ్ రీసెర్చ్ ఆరోపణలకు ఎలాంటి ప్రాతిపదికలేదని వేదాంతా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.

లార్జ్క్యాప్ విభాగంలోకి కొత్తగా 11 కంపెనీలు
న్యూఢిల్లీ: లార్జ్క్యాప్, మిడ్క్యాప్ విభాగంలో కంపెనీలకు స్థానచలనం చోటుచేసుకోనుంది. లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పరంగా సవరించిన జాబితాను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. ఈ సందర్భంగా ఇండియన్ హోటల్స్, సోలార్ ఇండస్ట్రీస్, మజగాన్ డాక్ షిప్బిల్డర్స్, అపోలో హాస్పిటల్స్ తదితర కంపెనీలు మిడ్క్యాప్ నుంచి లార్జ్క్యాప్ విభాగం కిందకు రానున్నాయి. సీమెన్స్ ఎనర్జీ నేరుగా లార్జ్క్యాప్లోకి ఎంట్రీ ఇస్తోంది. దీంతో లార్జ్క్యాప్ విభా గం నుంచి మిడ్క్యాప్ కిందకు రైల్ వికాస్ నిగమ్ (ఆర్వీఎన్ఎల్), హీరో మోటోకార్ప్, స్విగ్గీ, పాలీ క్యాబ్ ఇలా 11 కంపెనీలు చేరనున్నాయి. దీనిపై నువమా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఒక నివేదికను విడుదల చేసింది. 9 స్మాల్ క్యాప్ కంపెనీలు మిడ్క్యాప్ విభాగం కిందకు అప్గ్రేడ్ కానున్నాయి. అలాగే, మిడ్క్యాప్ కిందకు కొ త్తగా హెక్సావేర్ టెక్నాలజీస్, ఐటీసీ హోటల్స్ చేరనున్నాయి. ఇవి ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ కావడం గమనార్హం. ఏటా జనవరి, జూలైలో యాంఫి (ప్రతి 6 నెలలకు ఒకసారి) కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా జాబితాను ప్రకటిస్తుంటుంది. ఫిబ్రవరి1, ఆగస్ట్ 1 నుంచి మార్పులు అమల్లోకి వస్తాయి. యాంఫి వర్గీకరణకు అనుగుణంగా ఫండ్స్ సంస్థలు తమ పెట్టుబడుల కోసం స్టాక్స్ను ఎంపిక చేసుకుంటాయి. లార్జ్క్యాప్ ఫండ్స్, లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్, మిడ్క్యాప్ ఫండ్స్, స్మాల్క్యాప్, మలీ్టక్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఈ వర్గీకర జాబితాకు అనుగుణంగా పోర్ట్ఫోలియోలో మార్పులూ చేస్తుంటాయి. కనుక ఫండ్స్ పెట్టుబడులకు ఈ జాబితా కీలకంగా పనిచేస్తుంటుంది. ఫండ్స్ పెట్టుబడులకు అనుగుణంగా ఆయా స్టాక్స్ ధరల్లోనూ మార్పులు చూడొచ్చు.మిడ్క్యాప్ నుంచి లార్జ్క్యాప్ విభాగంలోకి ఇండియన్ హోటల్స్ సోలార్ ఇండస్ట్రీస్ మజ్గాన్ షిప్ బిల్డర్స్ మ్యాక్స్ హెల్త్కేర్ శ్రీ సిమెంట్స్ మ్యాన్కైండ్ ఫార్మా అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లుపిన్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ సీమెన్స్ ఎనర్జీ (కొత్త చేరిక)లార్జ్ క్యాప్ నుంచి మిడ్క్యాప్ విభాగంలోకి ఆర్వీఎన్ఎల్ హీరో మోటోకార్ప్ ఇండియన్ ఓవర్సీ బ్యాంక్ కమిన్స్ ఇండియా స్విగ్గీ పాలీక్యాబ్ ఇండియా బోష్ లిమిటెడ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్లైఫ్ డాబర్ ఇండియా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ మార్కెట్ విలువ కటాఫ్ తగ్గింపుమార్కెట్ విలువ పరంగా టాప్–100 కంపెనీలు లార్జ్క్యాప్ కిందకు వస్తాయి. మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250 వరకు మొత్తం 150 కంపెనీలు మిడ్క్యాప్ కిందకు పరిగణనలోకి తీసుకుంటారు. మిగిలినవి స్మాల్క్యాప్ కిందకు వస్తాయి. గత ఆరు నెలల కాలంలో స్టాక్ వారీ సగటు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ‘‘గత ఆరు నెలల్లో మార్కెట్ ఎంతో అస్థితరలను చూసింది. దీంతో 2024 డిసెంబర్ నుంచి చూస్తే మార్కెట్ విలువ కటాఫ్ తగ్గింది. లార్జ్క్యాప్ విభాగం కటాఫ్ విలువ 2024 డిసెంబర్ చివరికి ఉన్న రూ.లక్ష కోట్లు నుంచి రూ.91,600 కోట్లకు దిగొచి్చంది. మిడ్క్యాప్ విభాగం కటాఫ్ (గరిష్ట విలువ) సైతం రూ.33,200 కోట్ల నుంచి రూ.30,800 కోట్లకు తగ్గింది’’అని నువమా నివేదిక తెలిపింది. గత నాలుగేళ్లలో లార్జ్క్యాప్ విభాగం కటాఫ్ విలువ గణనీయంగా తగ్గడం ఇదే మొదటిసారి. స్టాక్స్ విలువలు దిద్దుబాటునకు గురి కావడమే ఇందుకు దారితీసింది.
ఫ్యామిలీ

రూ. 1.6 కోట్ల జీతం, అయినా అమెరికాలో ఇండియన్ టెకీ జీవితం ఇదీ!
అమెరికాలో కొలువు, అదీ ఐటీ కంపెనీలో ఉద్యోగం అనగానే ఏడంకెల జీతం... లైఫ్ సెట్ అనుకుంటాం. కోట్ల రూపాయలు, తక్కువలో తక్కువ లక్షల రూపాయల ప్యాకేజీ, లగ్జరీ లైఫ్ అని భావిస్తాం కదా. కానీ న్యూయార్క్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక భారతీయ యువతి అనుభవం వింటే మాత్రం ‘అవునా.. నిజమా’అని ఆశ్చర్యపోక తప్పదు. ప్రముఖ సెర్చి ఇంజీన్ కంపెనీ గూగుల్లో న్యూయార్క్ నగరంలో టెకీగా పనిచేస్తోంది ఇండియాకు చెందిన మైత్రి మంగళ్. ఆమె జీతం ఏడాదికి రూ.1.6 కోట్లు. పాడ్కాస్టర్, రచయిత కుశాల్ లోధాతో, మంగళ్ అమెరికాలో జీతం, నెలవారీ ఖర్చుల గురించి చేసిన చర్చ ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. నెల ఖర్చులు, తిండి, ఇంటి అద్దె ఖర్చులతో పోలిస్తే ఇది ఎంత అంటూ తన గోడును వెళ్లబోసుకుంది.ఈ వివరాలను లోధా సోషల్ మీడియాలో షేర్ చేశారు. "Googleలో సగటు ప్యాకేజీ ఎంత? అని Googleలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైత్రిని అడిగాను. సాధారణంగా రూ.1.6 కోట్లు ఉంటుందని పంచుకుంది" అని లోధా చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్లో అపార్ట్మెంట్ అద్దె సుమారు రూ.2.5 లక్షలు. నెలవారీ ఖర్చురూ.4.2 లక్షలు. ఇది కాకుండా బయట తినడం, కిరాణా సామాగ్రి , ఎంటర్టైన్మెంట్ సహా ఇతర ఖర్చులు సుమారు రూ. 85,684-రూ. 1,71,368 వరకు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు మరో రూ. 8,568-రూ. 17,136 దాకా అవుతాయి. View this post on Instagram A post shared by Kushal Lodha (@kushallodha548) ఇది చూసిన నెటిజన్లు ఔరా అంటూ నోరెళ్ల బెట్టారు. భారీ జీతం, న్యూయార్క్లాంటి గ్లోబల్ నగరాల్లో అసలైన జీవితం అంటూ కమెంట్స్ చేశారు.అన్నట్టు ఈ వీడియోనుమైత్రి మంగళ్కు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆమెకు 173 వేల మంది అనుచరులు ఉన్నారు.

డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...
మాతృత్వపు మధురిమ ఎవరికైనా అపురూపం. ఆ క్షణాలు కాబోయే తల్లులందరికీ భావోద్వేగభరితంగా ఉంటాయి. క్షణం క్షణం ఉత్కంఠ.. ఒకపక్క భరించలేని ప్రసవ వేదన..మరోవైపు వచ్చే బుడతడు కోసం ఆస్పత్రి బయట బంధువుల పడిగాపులు..అదంతా ఓ అపురూపమైన క్షణం. మర్చిపోలేని ప్రసవానుభవం కూడా. అలాంటి మధుర క్షణాలను చాలా రియలిస్టిక్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ని త్వరగా చదివేయండి మరీ..మలయాళ నటుడు, బిజేపీ నాయకుడు కృష్ణ కుమార్ కుమార్తె దియా కృష్ణ నెట్టింట తన ప్రసవ అనుభవానికి సంబంధించిన వీడియోని షేర్ చేసుకున్నారు. అది కేవలం డెలివరీ సమయంలోని పరిస్థితులు కాదు..మొత్తం ఆస్పత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి నొప్పులు మొదలు..బిడ్డను కని డిశ్చార్జ్ అయ్యి వచ్చే వరకు మొత్తం తతంగాన్ని ఆమె చాలా చక్కగా రికార్డు చేశారు. ప్రతి దృశ్యం కదిలించేలా ఉంటుంది. ప్రసవ సమయంలో ఇలా ఉంటుందా అనే ఫీల్ని తెప్పిస్తుంది. ఇక్కడ దియా డెలివెరికి వెళ్లే క్షణంలో అందంగా మేకప్ వేసుకుని మరీ వెళ్తుంది. ఎందుకంటే మొటిమలతో ఉన్న ముఖంతో నా బిడ్డకు స్వాగతించడం ఇష్టం లేదంటూ చెప్పడం వీడియోలో చూడొచ్చు. అయితే ఆమె మొటిమలు చెడ్డవి కావు గానీ..నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకే ఇలా అని చెబుతుంది వీడియోలో. ఆ వీడియోలో భర్త, ఆమె తల్లిదండ్రులు ప్రసవ వేదన సమయంలో ఓదార్చడం, వైద్య సిబ్బంది మద్దతు తదితర దృశ్యాలన్ని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. చివర్లో ఆమె చేతుల్లో బిడ్డను పెట్టే అపురూపమైన క్షణం అత్యంత అద్భుతంగా ఉంటుంది. దియా ఇందులో ఆధునిక వైద్య విధానం ఎలా ఉందో తెలియజేసేందుకే ఇదంతా షూట్ చేసినట్లు చెప్పుకొచ్చారామె. ఇక ఇక్కడ దియాకి సుఖ ప్రసవం అయ్యింది. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఈ వీడియో క్లిప్ షేర్ చేసిన మూడు రోజుల్లోనే ఆరు మిలయన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా, నెటిజన్లు మాత్రం అందరిలా కాకుండా ప్రతీది రియలిస్టిక్గా ప్రసవ సమయంలో ఉండే ఉద్విగ్న స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారని ఆమెని ప్రశంసించగా, మరికొందరు మాత్రం ఇలాంటివి ఎందుకు చిత్రీకరిస్తారని మండిపడుతూ పోస్టులు పెట్టారు. (చదవండి: 71 ఏళ్ల వయసులో సీఏ అయ్యాడు..! మనవరాలి కోసం..)

ఆ శకం ముగిసింది : రూ. 183 కోట్ల డీల్, రూ. 3వేల కోట్ల లగ్జరీ ప్రాజెక్ట్
బాలీవుడ్లో 100 ఏళ్లకు పైగా చరిత్ర, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన ఒక ఐకానిక్ స్టూడియో శకం ముగియనుంది. 1943లో శషధర్ ముఖర్జీ స్థాపించిన ఫిల్మిస్తాన్ స్టూడియోస్ (Filmistan Studios) ఇపుడిక కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మారబోతోంది. దీన్ని ఆర్కేడ్ డెవలపర్స్ జూలై 3న రూ. 183 కోట్లకు కొనుగోలు చేసిందని టైమ్స్ నౌ డిజిటల్ నివేదించింది. ఈ మార్పు బాలీవుడ్ స్వర్ణయుగానికి మూలస్తంభం, ఐకానిక్ స్టూడియో శకం ముగింపును సూచిస్తుందని పలువురి సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఏర్పడిన స్టూడియోలలో ఒకటి ఫిల్మిస్తాన్ స్టూడియో. దీన్ని ఏర్పాటు చేసిన శశధర్ ముఖర్జీ మరోవ్వరో కాదు బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, రాణి ముఖర్జీల తాత. ముంబైలోని గోరేగావ్ వెస్ట్లో ఉన్న ఈ స్టూడియోను నటుడు అశోక్ కుమార్, జ్ఞాన్ ముఖర్జీ , రాయ్ బహదూర్ చునిలాల్ వంటి దిగ్గజ వ్యక్తులతో కలిసి స్థాపించారు. బాంబే టాకీస్ను విడిచిపెట్టిన వీరంతా హైదరాబాద్ నిజాం సహాయంతో దీన్నిస్థాపించారు. అప్పటినుంచి అనేక ప్రతిష్టాత్మక సినిమాలకువేదికైంది. ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదిక ప్రకారం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్ దీన్ని కొనుగోలు చేసింది. 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టూడియో స్థానంలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కు సన్నాహాలు చేస్తోంది. 2026లో షురూ కానున్నఈ ప్రాజెక్ట్కు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రీమియం 3, 4 , 5 BHK అపార్ట్మెంట్లతో కూడిన రెండు ఎత్తైన 50-అంతస్తుల భవనాల సముదాయంగా నిర్మించనుంది. ఆర్కేడ్ డెవలపర్స్ ఛైర్మ, ఎండీ అమిత్ జైన్ లింక్డ్ఇన్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. పట్టణ,విలాసవంతమైన జీవనానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు.చదవండి: Akhil Anand చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు 14 ఏళ్లకే!మరోవైపు ఫిల్మిస్తాన్ స్టూడియోను విక్రయంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేష్ ((AICWA) స్పందించింది. ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది కార్మికులు,కార్మికులు, కళాకారులు రోడ్డున పడతారని వాదిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జోక్యం చేసుకుని స్టూడియో కూల్చివేతను ఆపాలని కోరింది.ఈ స్టూడియో కేవలం ఒక నిర్మాణ మైలురాయి మాత్రమే కాదు, వేలాది మంది తెరవెనుక నిపుణుల అవిశ్రాంత అంకితభావంపై నిర్మించిన గొప్ప సాంస్కృతిక వారసత్వ వేదిక అని పేర్కొంది. ఇలాంటి అనేక ఇతర చారిత్రాత్మక చలనచిత్ర స్టూడియోలు ఇదే దశలో ఉన్నాయనీ, వినోద రంగంలో ఉపాధికి విస్తృత ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ అసోసియేషన్ నేతలు సీఎంకు ఒక లేఖ రాశారు. ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!

71 ఏళ్ల వయసులో సీఏ అయ్యాడు..!
విద్యకు బ్రేక్ అనేది ఉండదు. చదవాలన్నా కోరిక బలంగా ఉంటే చాలు వయసు పెద్ద మేటర్ కాదని గతంలో చాలామంది ప్రూవ్ చేశారు. వాళ్లంతా ఏవో కారణాలతో చదువుకోలేకపోతే..ఆయా కోర్సులను పూర్తి చేసి తమ డ్రిమ్ని నిజం చేసుకున్నారు. ఈ తాతయ్య అలాకాదు ఏకంగా అత్యంత కఠినతరమైన సీఏని 71 ఏళ్ల వయసులో పూర్తి చేసి శెభాష్ అనిపించుకున్నాడు. అదికూడా మనవరాలి కారణంగా ఈ ఘనత సాధించాడు ఈ తాతయ్య. స్ఫూర్తిదాయకమైన అతడి స్టోరి ఏంటో చూద్దామా..!.ఆయనే తారా చంద్ అగర్వాల్. ఆ తాతయ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (SBBJ) మాజీ ఉద్యోగి. రిటైర్డ్ వయసులో అందరిలో రెస్ట్ తీసుకోకుండా, ప్రతిష్టాత్మకమైన సీఏ పరీక్షలు రాయాలనుకోవడం విశేషం. ఆ వయసులో ఏ పుణ్య క్షేత్రాలు, లేదా మనవరాళ్లు, మనవళ్లతో కాలక్షేపం చేస్తారు. కానీ ఈయన అలా కాదు. ఆ విశ్రాంతి సమయంలో తన డ్రీమ్ నెరవేర్చుకుని స్ఫూర్తిగా నిలిచాడు. నిజానికి ఆయన ఈ ఎగ్జామ్ రాయడానికి కారణం తన మనవరాలేనట. ఆమె సీఏ చదువు కోసం సహాయం చేసేవారట. ఆమెకు అకౌంట్స్పై ఉండే సందేహాలను తీరుస్తూ..తెలియకుండానే ఆ సబ్జెక్టుపై ఆసక్తి పెరిగిందట. అలా ఆ జిజ్ఞాస కాస్తా విద్యా వృత్తిగా మారి చివరకు సీఏ పరిక్షలకు ప్రిపేరవ్వాలనే సంకల్పానికి దారితీసింది. ఆ విధంగా ఆయన సీఏ అయ్యాడు. ఈ ఏడాది జులై6న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసిన చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫైనల్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో తారా చంద్ వజయవంతం గాపూర్తి చేసి..అందరిని ఆశ్చర్యపరిచాడు. పైగా యువతకు ఆదర్శంగా నిలిచారాయన. చార్టర్డ్ అకౌంటెంట్ నిఖిలేష్ కటారియా స్ఫూర్తిదాయకమైన కథను లింక్డ్ఇన్లో పంచుకోవడంతో నెట్టింట వైరల్గా మారింది. కాగా, ఈ ఏడాది సీఏలో మొత్తం 14,247 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఐసీఏఐ వెల్లడించింది. (చదవండి: డిటాక్స్..రిలాక్స్..! కాసేపు టెక్నాలజీకి బ్రేక్ ఇద్దామా..!)
ఫొటోలు


గౌతమ్ కృష్ణ 'సోలో బాయ్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)


మెటర్నిటీ ఫోటోషూట్, కలకాలం నిలిచిపోయే అందమైన భావోద్వేగం (ఫోటోలు)


విశాఖపట్నం : వలకు చిక్కిన భారీ ట్యూనా, కొమ్ము కోనాం చేపలు (ఫొటోలు)


విజయవాడ : వైభవంగా ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు (ఫొటోలు)


‘కేడీ’ ది డెవిల్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


పదేళ్ల తర్వాత మళ్లీ కలిసిన 'బాహుబలి' టీమ్ (ఫోటోలు)


విష్ణువిశాల్- గుత్తా జ్వాలా కూతురి నామకరణ వేడుక (ఫోటోలు)


ట్రెడిషనల్ శారీ లుక్లో అక్కినేనివారి కోడలు శోభిత (ఫోటోలు)


కాశీలో యాంకర్ రష్మీ గౌతమ్ ప్రత్యేక పూజలు (ఫోటోలు)


ప్చ్.. బాహుబలినే వదులుకున్న స్టార్లు వీళ్లే (ఫోటోలు)
అంతర్జాతీయం

రూ.70 కోట్లు పలికిన హ్యాండ్ బ్యాగ్
పారిస్: అక్కడక్కడా చిరిగిపోయి, మరకలు పడి, బాగా వాడేసిన నల్లని బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్. కానీ అది అలాంటిలాంటి బ్యాగ్ కాదు. అలనాటి అందాల హాలీవుడ్ నటి వాడిన బ్యాగ్. ఆ క్రేజ్ వల్లేనేమో, ప్రఖ్యాత ఫ్రెంచ్ నటి దివంగత జేన్ బిర్కిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ ఏకంగా 82 లక్షల డాలర్లకు, అంటే దాదాపు రూ.70 కోట్లకు అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక హ్యాండ్ బ్యాగ్కు ఇంతటి ధర పలకడం వేలంపాటల చరిత్రలో ఇదే తొలిసారి. ప్రఖ్యాత సోత్బీ వేలం సంస్థ దీనిని గురువారం ఆన్లైన్లో విక్రయించింది. 10 లక్షల డాలర్ల బిడ్డింగ్తో మొదలైన వేలం పాట క్షణాల్లో కోట్లు దాటేసి కొత్త రికార్డ్ను కొట్టేసింది. ఎట్టకేలకు జపాన్కు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి ఈ బ్యాగును సొంతం చేసుకున్నారు. ఎవరీ బిర్కిన్? తన అందం, అభినయంతో ఫ్రెంచ్ సినిమాలను ఒక ఊపు ఊపిన అలనాటి ప్రఖ్యాత బ్రిటిష్ నటి జేన్ బిర్కిన్. నేపథ్య గాయనిగా, ఫ్యాషన్ డిజైనర్గా, సామాజిక కార్యకర్తగా... ఇలా పనిచేసిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారామె. నాటి సినీ, ఫ్యాషన్ ప్రపంచ ఐకాన్గా వెలిగిపోయారు. 1946 డిసెంబర్ 14న లండన్లోని మేరీలీబాన్లో జన్మించారు. 76వ ఏట పారిస్లో తుదిశ్వాస విడిచారు. హెర్మ్స్ లగ్జరీ వస్తువుల సంస్థ ప్రత్యేకంగా బిర్కిన్ కోసమే 1984లో ఈ బ్యాగును తయారుచేసింది. పారిస్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో బిర్కిన్ పక్క సీటులో హెర్మ్స్ సంస్థ చైర్మన్ జీన్ లూయిస్ డ్యూమస్ ప్రయాణించారు. ‘‘విమానం ఎక్కినప్పుడు వస్తువులు పెట్టుకోవాలంటే వాంతి చేసుకునే కవర్లో పెట్టుకోవాల్సి వస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాండ్ బ్యాగులన్నీ చిన్నగా ఉన్నాయి. అల్లిన బుట్టను వాడడం ఇబ్బందిగా ఉంది. కాస్తంత పెద్ద బ్యాగు తయారు చేయొచ్చుగా!’’ అని అతడిని బిర్కిన్ కోరింది. అడిగిందే తడవుగా సంస్థలోని నిష్ణాతులను పురమాయించి అత్యంత నాణ్యమైన తోలుతో, ప్రత్యేకతలతో పెద్ద బ్యాగ్ను తయారు చేయించి 1985లో ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ బ్యాగులను ఇకపై మీ పేరుతో అమ్ముకోవచ్చా అని అడిగితే ఆమె సరేనన్నారు. ఆమె చాన్నాళ్లపాటు అంటే 1985 నుంచి 1994 దాకా రోజూ ఆ బ్యాగును వెంట తీసుకెళ్లేది. అందాల నటి చేతిలో మరింత అందంగా కనిపించిన ఆ బ్యాగుకు ఫ్యాషన్ ప్రపంచం ఫిదా అయింది. తర్వాత మరో నాలుగు బ్యాగులను కూడా కంపెనీ నుంచి ఆమె బహుమతిగా అందుకున్నారు. కానీ ఈ బిర్కిన్ బ్యాగు మాత్రం ఫ్యాషన్ చిహ్నంగా స్ధిరపడింది. దాంతో హెర్మ్స్ తయారీ బిర్కిన్ బ్యాగుల ధర సైతం అమాంతం పెరిగిపోయింది. కేవలం అత్యంత సంపన్నులు మాత్రమే కొనగలిగే బ్యాగ్గా మారిపోయింది.బ్యాగుతో పాటు గోళ్ల కత్తెర బిర్కిన్కు గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం అలవాటు. అందుకే ఆమెకు బహూకరించిన బ్యాగుకు కంపెనీ వెండి గోళ్ల కత్తెరనూ జతచేసింది. జిప్ లాక్ చేయడానికి బుల్లి తాళం కూడా ఇచ్చింది. బ్యాగుకు యూనిసెఫ్, మెడిసిన్స్ డ్యూ మోండే వంటి మానవీయ సంస్థల గుండ్రని స్టిక్కర్లను అతికించారామె. బిర్కిన్ 2023లో చనిపోయారు. అంతకు కొద్ది రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ, ‘నా నటన, గానం, ఫ్యాషన్, సమాజసేవతో పాటు నేను చనిపోయాక నా బ్యాగ్ గురించి కూడా జనం మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో!’ అని అన్నారు. ఆమె ఊహించినట్లే లగ్జరీ వస్తువుల ప్రపంచంలో ఇప్పుడా బ్యాగు ప్రత్యేక స్థానం ఆక్రమించుకుందని సోత్బీ హ్యాండ్బ్యాగులు, యాక్సెసరీల గ్లోబల్ హెడ్ మోర్గాన్ హ్యాలిమీ వ్యాఖ్యానించారు. ఒరిజినల్ బ్యాగును ఎయిడ్స్ ఛారిటీ నిధి కోసం వేలం పాట సంస్థకు ఆమె 1994లోనే ఇచ్చేశారు. 2000లో అది మరోసారి వేలానికి వచి్చంది. తర్వాత పాతికేళ్లుగా ఎవరికీ కనిపించలేదు. ఇన్నాళ్లకు సోత్బీ దాన్ని దక్కించుకుని గురువారం ఇలా రికార్డు స్థాయిలో విక్రయించింది. ఈ బ్యాగు మోడల్ అంటే తమకెంతో ఇష్టమని పలువురు సెలెబ్రిటీలు, ఆరి్టస్టులు, స్టైలిస్టులు గతంలో చెప్పారు.

ట్రంప్ పొగిడినా కష్టాలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనుషుల్ని మెచ్చడం అత్యంత అరుదు. అందునా తనకు నచ్చని దేశాల అధ్యక్షులను వైట్హౌజ్కు పిలిపించుకుని మరీ అవమానించడం ఆయనొక అలవాటుగా మార్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఓ దేశ అధ్యక్షుడ్ని మెచ్చుకుంటే.. అది కూడా బెడిసి కొట్టింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ , దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీని తన ఓవెల్ ఆఫీస్లో మీడియా సమక్షంలోనే డిక్టేటర్(నియంత) అంటూ తిట్టిపోశారు. అలాగే.. రామఫోసా ముందు ఓ వీడియో ప్రదర్శించి.. సౌతాఫ్రికాలో తెల్లవాళ్లను ఊచకోతలు కోస్తున్నారంటూ ఏకంగా ఓ తప్పుడు వీడియోను ప్రదర్శించి మరీ విమర్శలు గుప్పించారు.ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మినహా ఆయన ప్రత్యేకంగా ఎవరినీ ప్రశంసించింది లేదు. తాజాగా లిబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొకాయ్పై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. ఇప్పటిదాకా వైట్హౌజ్కు వచ్చిన ఏ నేత కూడా ఇంత అందంగా ఆంగ్లంలో మాట్లాడలేదంటూ.. Such good English అని ట్రంప్ వ్యాఖ్యానించారు. Where did you learn to speak so beautifully? అంటూ ఆరా తీశారు. తనకు తెలిసిన అమెరికన్ల కంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడారంటూ కితాబిచ్చారు.Trump to Liberia’s President “Your English is beautiful better than some Americans I know.” 🇱🇷😂FYI: English is Liberia’s official language.#Trump #Liberia #JosephBoakai #Politics pic.twitter.com/WidIjSWA3N— A.S (@DHAS013) July 10, 2025అయితే ఈ పొగడ్త వివాదాస్పదంగా మారింది. లిబీరియా అధికార భాష ఆంగ్లమే. పైగా బొకాయ్ లిబీరియాలోనే విద్యనభ్యసించారు. దీంతో ఆఫ్రికా అంతటా ట్రంప్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఆఫ్రికన్ యూత్ యాక్టివిస్ట్ ఆర్చీ హారిస్ స్పందిస్తూ.. మా దేశం ఆంగ్ల భాష మాట్లాడే దేశం. ఈ ప్రశ్నను ప్రశంసగా కాక, అవమానంగా భావించాను అని అన్నారు.దక్షిణాఫ్రికా రాజకీయ నాయకురాలు వెరోనికా మెంటే స్పందిస్తూ.. ట్రంప్ అలా అన్నాక కూడా బొకాయ్ ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోలేదు? అని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యను హృదయపూర్వక ప్రశంసగా, ట్రంప్ ఆఫ్రికా దేశాలకు మిత్రుడిగా అభివర్ణించింది. లిబీరియా.. 1822లో అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ ద్వారా స్థాపించబడింది. 1847లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆంగ్ల భాష అధికార భాషగా ఉంది, కానీ అనేక స్థానిక భాషలు కూడా మాట్లాడబడతాయి.

అమెరికాలో కూలిన సొరంగం.. కార్మికులకు తప్పిన ప్రమాదం
లాస్ ఏంజిల్స్: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్ పరిధిలోని విల్మింగ్టన్ లో నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కూలిపోయింది. ఈ ఘటనలో రెస్క్యూ సిబ్బంది 31 మంది కార్మికులను రక్షించారు. సొరంగం యాక్సెస్ పాయింట్ నుండి దాదాపు ఆరు మైళ్ల దూరంలో అది కూలిపోయిందని అధికారులు తెలిపారు. 🚨🇺🇸#BREAKING | NEWS ⚠️LIVE Over 20 people trapped after an industrial tunnel collapses in Wilmington Los Angeles over 100 LAFD firefighters on site trying to rescue the workers… pic.twitter.com/rlRQQfmgkz— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 10, 2025సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు 100 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి తరలివెళ్లారు. వీరు 31 మంది కార్మికులను రక్షించారు. సొరంగంలోని ఒక భాగం కూలిపోవడంతో, పలువురు కార్మకులు అందులో చిక్కుకున్నారు. సమాచారం అందగానే లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక విభాగం సంఘటనా స్థలానికి చేరుకుంది. సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా, 31 మంది కార్మికులను సొరంగం నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 18 అడుగుల వెడల్పు కలిగిన ఈ సొరంగాన్ని నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్నారు. మురుగునీటిని మళ్లించేందుకు ఇది ఉపయుక్తం కానుంది. లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ ఈ సంఘటనను ‘ఎక్స్’లో తెలిపారు. The City of Los Angeles has mobilized resources to the tunnel collapse in Wilmington.More than 100 LAFD responders have been deployed, including Urban Search and Rescue teams.Thank you to all of those who are acting immediately to respond to this emergency.— Mayor Karen Bass (@MayorOfLA) July 10, 2025

అమెరికా.. మీకు ఇదే మా సందేశం: తాలిబన్లు
మార్పును బట్టే సమాజం ముందుకు పోతోంది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం మతం, ఆచార వ్యవహారాల పేరిట వెనక్కి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జాబితాలో అఫ్గనిస్తాన్కు చోటు ఉంది. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలతో వీధుల వెంట విచ్చలవిడిగా తిరుగుతుండడం, విద్యపై నిషేధం, మహిళలపై అక్కడ అమలు చేస్తున్న కఠిన ఆంక్షల సంగతి సరేసరి. ఇలాంటి తరుణంలో తాలిబన్ల నుంచి కలలో కూడా ఊహించని వీడియో ఒకటి విడుదలై ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓపెన్ చేయగా.. ముసుగులో ఉన్న కొందరు వ్యక్తుల చుట్టూ ఏకే 47 తుపాకులతో, మారణాయుధాలతో తాలిబన్లు కనిపిస్తారు. అమెరికా ఇదే మా సందేశం అంటూ ఓ వ్యక్తి చెబుతున్నాడు. ఆ వెంటనే కింద ఉన్న వ్యక్తికి ఉన్న ముసుగు తొలగించగానే.. చిరునవ్వుతో Welcome to Afghanistan అంటూ ఆహ్వానిస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అఫ్గన్ నేలపై ఉన్న ప్రకృతి సుందర దృశ్యాలు, అక్కడి ఆహారం.. ఇలా అన్నింటినీ అందులో చూపించారు. పాశ్చాత్య టూరిస్టులు అక్కడి సంప్రదాయ పఠాన్ దుస్తులను ధరించి.. స్థానిక వంటలు ఆస్వాదిస్తూ, జలపాతాల్లో ఈతలు కొడుతూ, స్థానికులతో నవ్వుతూ కనిపిస్తారు. ఇవన్నీ మాంచి ఫన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో సాగుతాయి. ఈ వీడియోను తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. కానీ, తాలిబన్లకు సంబంధించిన పేజీల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సాధారణంగా.. ఉగ్రవాదులు విదేశీయులను అపహరించి.. వాళ్ల పీకలు కోస్తూ వీడియోలు తీసి బయటకు వదలడం గతంలో జరిగేది. ఆ ఫార్ములానే ఇప్పుడు టూరిజం ప్రమోషన్ కోసం తాలిబన్లు వాడుకుంటున్నారు. మీ నుంచి(అమెరికా) మేం స్వేచ్ఛను దక్కించుకున్నాం. ఇప్పుడు మీరు మా దేశానికి అతిథులుగా రండి అంటూ ఆ వీడియోలో చెప్పడం ఉంది.ప్రశాంతమైన వాతావరణం, అందులో విదేశీ పర్యాటకులతో స్థానికుల సందడి.. పైగా డమ్మీ తుపాకులపై Property of US Government అని రాసి ఉండడం వాళ్ల వెటకారాన్ని బయటపెట్టంది. వెరసి అఫ్గనిస్తాన్ను ఆతిథ్యభరిత దేశంగా చూపించే ప్రయత్నమిదనే విషయం ఈ వీడియోతో స్పష్టమవుతోంది. అయితే..అఫ్గనిస్తాన్ను అమెరికా బలగాలు వీడాక.. 2021 అగష్టులో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ అంతర్జాతీయంగా ఆ ప్రభుత్వానికి గుర్తింపు దక్కకపోవడంతో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. పైగా ఈ దేశం ఇంకా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలోనే ఉండడంతో.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికీ అఫ్ఘానిస్థాన్కి ప్రయాణించవద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆ దేశం.ప్రపంచానికి తాము మారిపోయామని తాలిబన్లు చూపించిన ఈ ప్రయత్నం ఒకవైపు ఆశ్చర్యంతో పాటు వీడియోపై విమర్శలు అదే స్థాయిలో వెల్లువెత్తాయి. తుపాకులతో యుద్ధ నేరాల తరహాలో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడంపై మండిపడుతున్నారు. పైగా వీడియోలలో ఎక్కడా ఒక మహిళను చూపించకపోవడమూ విమర్శలు తావిస్తోంది. ఇది అడ్వైర్టైజ్మెంటా? లేదంటే పర్యాటకులకు హెచ్చరికనా? అని గొణుక్కునేవారు లేకపోలేదు. The Taliban has released a tourism appeal video aimed at attracting American visitorsTheir message to Americans:"Now that we've liberated our homeland from you, you're welcome to come back as tourists or guests"Would you go? #Afganistan pic.twitter.com/iLRYXFAJjn— Nabila Jamal (@nabilajamal_) July 9, 2025‘‘తాలిబాన్లు ప్రపంచంపై ఓ ముద్ర వేసుకుని ఉన్నారు. అది చెరిపేసుకునేందుకు గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బాహ్య ప్రపంచానికి ఏం ఆకర్షణీయంగా కనిపిస్తుందో అంచనా వేయడంలో వాళ్లు తప్పటడుగే వేస్తున్నారు’’ అని ఓ విశ్లేషకుడు ఈ వీడియోపై అభిప్రాయపడ్డారు. ఇంతకీ అఫ్గన్ నేలపై ఏమున్నాయి.. కాబూల్ (Kabul) అఫ్గన్ రాజధాని నగరం. గార్డెన్స్ ఆఫ్ బాబర్, దారుల్ అమల్ ప్యాలెస్, నేషనల్ మ్యూజియం వంటి ప్రాచీన, సాంస్కృతిక స్థలాలు ఉన్నాయి. దారుల్ అమల్ ప్యాలెస్హెరాత్ (Herat)లో సుప్రసిద్ధ మసీదు, హెరాత్ సిటాడెల్ వంటి ఇస్లామిక్ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన కట్టాడాలున్నాయి.మజార్-ఇ-షరీఫ్ (Mazar-e-Sharif) – Blue Mosque అనే అద్భుతమైన మసీదు ఇక్కడ ఉంది.బామియాన్ (Bamiyan) – బౌద్ధ విగ్రహాల అవశేషాలు, UNESCO వారసత్వ ప్రదేశం.కాందహార్ (Kandahar) – Mosque of the Sacred Cloak, అఫ్గాన్ చరిత్రకు కేంద్రం.జలాలాబాద్ (Jalalabad) – పచ్చని ఉద్యానవనాలు, ఆకర్షనీయమైన వాతావరణం.ఫైజాబాద్ (Faizabad) – హిందూ కుష్ పర్వతాల మధ్య ఉన్న ప్రకృతి అందాలు.బాండ్-ఎ-అమీర్ నేషనల్ పార్క్ (Band-e Amir National Park) – నీలి సరస్సులు, పర్వతాలు; అఫ్గాన్లో మొట్టమొదటి నేషనల్ పార్క్.పంజ్షీర్ లోయ (Panjshir Valley) – మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.బాల్క్ (Balkh) – పురాతన నగరం; రూమీ జన్మస్థలం, బౌద్ధ మరియు జరోస్త్రియన్ చరిత్రకు కేంద్రం.బిజినెస్ ఇన్సైడర్ గణాంకాల ప్రకారం.. 2021 చివరి నుంచి ఇప్పటిదాకా 14,500 మంది విదేశీయులు అఫ్గనిస్తాన్లో పర్యటించారు. అందులో రష్యా, చైనా, టర్కీ, మిడిల్ ఈస్ట్కు చెందిన వాళ్లు న్నారు. వీళ్లలో చాలామంది వ్లోగర్స్ ఉండడం గమనార్హం. వీళ్లు అక్కడి టూరిజాన్ని, ఆహారపు అలవాట్లను ప్రమోట్ చేసే వీడియోలనే ఎక్కువగా వదిలారు.
జాతీయం

తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నైలో తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, తిరుమల మిల్క్ డెయిరీలో రూ.45కోట్ల మేర మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఫిర్యాదు వచ్చాయి. దీంతో, పోలీసులు.. దీనిపై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండానే నవీన్ ఆత్మహత్య చేసుకున్నారు.వివరాల ప్రకారం.. తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి చెన్నై బ్రిటానియా నగర్, ఫస్ట్ స్ట్రీట్లోని తన ఇంట్లో నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, డెయిరీలో మనీ ల్యాండరింగ్ జరిగిందని.. దీనిపై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. దీనిపై విచారణకు హాజరు కాకుండానే ఇలా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆత్మహత్యకు గల కారణాలు తల్లికి, స్నేహితులకు, బంధువులకు నవీన్ మెయిల్స్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్య అనంతరం, నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవీన్ బొల్లినేని స్వస్థలం కృష్ణా జిల్లాగా తెలుస్తోంది.

‘కూతురు సంపాదన మీద బతుకుతున్నావా?ఎందుకా బతుకు?’
ఢిల్లీ: కూతురు సంపాదన మీద బతుకుతున్నావా? ఏందుకా? బతుకు? అనే ఇతరుల సూటిపోటి మాటలు తండ్రిలోని రాక్షసత్వాన్ని నిద్ర లేపాయి. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కూతురు ప్రాణాలు తీసేలా చేశాయి. గురుగ్రామ్లో తండ్రి చేతిలో దారుణ హత్యకు గురైన రాష్ట్ర స్థాయి టెన్నీస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్యకేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.గురువారం రాత్రి గురుగ్రామ్లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణిని రాధికా యాదవ్ (25)ను ఆమె త్రండి దీపక్ యాదవ్ (49) తుపాకీతో కాల్చి చంపాడు. అయితే, ఈ దారుణం జరగడానికి కారణం రాధికా యాదవ్ ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తుంటుంది. ఇదే విషయంలో దీపక్ యాదవ్.. రాధికాను మందలించారు. పట్టించుకోకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తూ కూతురు తన పరువు తీస్తోందని భావించే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని తేలింది. ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో రాధికా యాదవ్ మరణానికి అసలు కారణంగా ఆమె ఇన్ స్టా రీల్స్ చేయడం కాదని నిర్ధారించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తేలింది. రాధికా యాదవ్కు టెన్నిస్ అంటే ప్రాణం. ఓ సానియా మిర్జా, సెరెనా విలియమ్స్లా రాణించాలని అనుకుంది. అందుకు తగ్గట్లుగానే చిన్ననాటి నుంచి టెన్నీస్లో తర్ఫీదు పొందింది. రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు టెన్నీస్ మ్యాచ్లలో అసాధారణమైన ఆటతీరుతో తనకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉందని నిరూపించింది. కానీ, అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?.కొద్ది కాలం క్రితం జరిగిన రాష్ట్రస్థాయి టెన్నీస్ పోటీల్లో పాల్గొన్న రాధికా యాదవ్కు తీవ్ర గాయమైంది. దీంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నీస్కు దూరం కావడంతో మానసికంగా కృంగి పోయింది. అప్పుడే నేను ఆటకు దూరమైతేనేం. నాలాగా టెన్నీస్లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహిస్తే సరిపోతుంది కదా అని అనుకుంది. అనుకున్నదే తడవుగా కుటుంబసభ్యులు,గురువుల సహకారంతో టెన్నీస్ అకాడమనీ ప్రారంభించింది. అనతికాలంలో తన కోచింగ్తో రాధికా యాదవ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తండ్రి దీపక్ యాదవ్ కూడా తనకు చేదోడు వాదోడుగా నిలిచారు. అదిగో అప్పుడే.. మనం కష్టాల్లో ఉంటే సంతోష పడేవాళ్లు.. సంతోషంగా ఉంటే ఈర్ష, అసూయతో కుళ్లుకునే వాళ్లు ఉంటారనే నానుడిని నిజం చేశారు దీపక్ యాదవ్ ఇరుగు పొరుగు వారు.దీపక్ యాదవ్ కుటుంబానికి పేరు, ప్రతిష్టలు రావడం ఇష్టం లేని ఇతరులు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు. ఆ మాటలు తట్టుకోలేక కూతురి ప్రాణం తీసినట్లు తండ్రి దీపక్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు. ‘నేను ఇంట్లో నిత్యవసర వస్తువుల కోసం, లేదంటే ఇతర పనుల నిమిత్తం బయటకు వెళుతుంటాను. అలా నేను బయటకు వెళ్లిన ప్రతీసారి ఇతరులు నన్ను సూటిపోటి మాటలతో హింసించేవారు. కూతురు సంపాదన మీద బ్రతుకుతున్నావా?. ఎందుకా బతుకు? అనే మాటలు నన్ను ఎంతగానో బాధించేవి. వాటిని నేను పట్టించుకునే వాడిని కాదు. కొందరు నా కూతురి వ్యక్తిత్వంపై అనుచితంగా మాట్లాడారు. ఈ వరుస సంఘటనలు నన్ను మానసికంగా కుంగదీసాయి. నా కూతుర్ని టెన్నిస్ అకాడమీని మూసేయమని చెప్పాను. కానీ ఆమె తిరస్కరించింది. నాలో సహనం నశించింది. ఆమె వంటచేస్తున్నపుడు వెనుక నుండి నా లైసెన్స్డ్ రివాల్వర్తో మూడు రౌండు కాల్పులు జరిపాను. నా కూతురిని నేనే హత్య చేశాను’ అని దీపక్ యాదవ్ పోలీసుల ఎదుట కన్నీరుమున్నీగా విలపించారు. పోలీసుల ప్రకారం.. మృతురాలు రాధికా యాదవ్ మామ కుల్దీప్ యాదవ్ దారుణం ఎలా జరిగిందో పోలీసులకు కళ్లకు కట్టిన వివరించారు. గురువారం ఉదయం 10:30కు గట్టి శబ్దం వినిపించడంతో, ఆయన దీపక్ నివసించే మొదటి అంతస్థుకు పరుగెత్తారు. నాకు గన్ను పేలిన శబ్ధం వినిపించింది. మొదటి ఫ్లోర్కి వెళ్లగా నా మేనకోడలు రాధికా వంటగదిలో రక్తపు మడుగులో పడి ఉంది. డ్రాయింగ్ రూమ్లో రివాల్వర్ కనిపించింది. ఆ తర్వాత నా కుమారుడు పీయూష్ యాదవ్తో కలిసి మేము ఆమెను కారులో తీసుకుని ఆస్పత్రికి తరలించాం. వైద్యుడు ఆమెను పరీక్షించిన తర్వాత ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఆమె గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి… చాలా ట్రోఫీలు గెలుచుకుంది. ఆమె హత్యకు కారణం నాకు అర్థం కావడం లేదు.ఆమె మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఎందుకు హత్య జరిగింది అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను మొదటి అంతస్థు (ఫ్లోర్)కి వెళ్లినప్పుడు దీపక్, మంజు యాదవ్, రాధికా మాత్రమే అక్కడ ఉన్నారు ’అని కుల్దీప్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

శాస్త్ర సాంకేతికత మండళ్లకు నిధుల కొరత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఉండాల్సిన రాష్ట్రాల సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్లు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, విపత్తు నిర్వహణ, డిజిటల్ హెరిటేజ్ సెంటర్ల అభివృధ్ధి, జీఐ మ్యాపింగ్, రిమోట్ సెన్సింగ్, ఆరోగ్య సంరక్షణ పరికరాల తయారీ వంటి రంగాల పరిశోధనలో కౌన్సిల్లు కీలక పాత్ర పోషించేవి. అయితే సంస్థాగత లోపాలు, మానవ వనరుల కొరతకుతోడు కేంద్రప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు బాగా తగ్గడంతో సైన్స్, టెక్నాలజీ మండళ్లు పూర్తిగా నీరుగారిపోతున్నాయని నీతి ఆయోగ్ ఆక్షేపించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘రాష్ట్రాల శాస్త్రసాంకేతికత మండళ్ల బలోపేతానికి మార్గసూచీ’నివేదికలో నీతి ఆయోగ్ పలు అంశాలను ప్రస్తావించింది. సిబ్బంది, నిధుల కరువు శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణల కోసం రాష్ట్రాలు వెచ్చిస్తున్న బడ్జెట్ 2023–24 ఏడాదితో పోలిస్తే 2024–25లో సగటున 17 శాతం మేర పెరిగినట్లు కనిపిస్తున్నా వాస్తవంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే సమధిక నిధులు కేటాయించాయి. ప్రతిరాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన నిధుల వాటా తెగ్గోసుకుపోతోంది. 2024–25లో కేరళ అత్యధికంగా రూ.173.34 కోట్లు, గుజరాత్ రూ.161 కోట్లు, హరియాణా రూ.130కోట్లు, ఉత్తర్ప్రదేశ్ రూ.140 కోట్లు కేటాయించారు. ఇవి మినహా మరే ఇతర రాష్ట్రం వంద కోట్లకు మించి బడ్జెట్ను కేటాయించకపోవడం విచారకరమని నీతి ఆయోగ్ పేర్కొంది. తెలంగాణ సర్కార్ 2023–24లో రూ.8.40 కోట్ల నిధులు కేటాయించింది, 2024–25లో రూ.19.23 కోట్లకు పెంచారు. అయితే ఇందులో రాష్ట్రానికి కేంద్ర నిధులు రూ.96 లక్షలు మాత్రమే అందాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో 2023–24లో రూ.4.84 కోట్లు కేటాయించారు. 2024–25 ఏడాదిలో ఒక్క రూపాయి నిధులు పెంచలేదు. కొన్ని రాష్ట్రాలు పాక్షిక కేంద్ర సహాయాన్ని పొందుతున్నప్పటికీ, కేంద్రం నుంచి కేటాయింపులు 2024–25 ఏడాదిలో రూ.50 కోట్ల కన్నా తక్కువగా ఉన్నాయని నీతి ఆయోగ్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీల నుండి ప్రాజెక్టు ఆధారిత నిధులను రాబట్టడంతో రాష్ట్రాల మండళ్లు పూర్తిగా వెనుకబడ్డాయని వివరించింది. కొన్ని రాష్ట్రాల కౌన్సిల్లు మాత్రం సైన్స్ పార్కులు, సైన్స్ సిటీలను ఏర్పాటు చేయడానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, సాంస్కృతిక శాఖలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అనేక రాష్ట్రాలు తమ పాలక మండలి సమావేశాలను క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నాయి. దాంతో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం అవుతోంది. దీంతో కీలక కార్యక్రమాల అమలు కుంటువడుతోంది. కొన్ని మండళ్లకు కాస్తంత మెరుగ్గా నిధులు మంజూరైనప్పటికీ ఆ నిధుల సద్వినియోగం జరగట్లేదు. ఆర్థికంగా బలంగా లేకపోవడం, పరిపాలనా అడ్డంకులు, సిబ్బంది కొరత కారణంగా మండళ్లలో విస్తృతస్థాయిలో పరిశోధనలు జరగట్లేదు. దీంతో వాటి సామర్ధ్యం తగ్గిపోతోందని నీతి ఆయోగ్ పేర్కొంది.

సహజ వనరుల లైఫ్‘లైన్’!
‘దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. చమురు కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. వివిధ మార్గాల ద్వారా ఇంధన సరఫరాలు నిరంతరాయంగా అందుతున్నాయి. హార్ముజ్ మార్గం బందైనా భారత్కి ఇబ్బంది లేదు. వేరే మార్గాల్లో భారత్కు క్రూడాయిల్ వస్తుంది’ – ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం, హార్ముజ్ మార్గం మూసేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ఇటీవల చెప్పిన మాటలివి. ఆయన చెప్పింది నిజమే. ఇప్పటికే మనదేశం ప్రపంచంలోనే అతిపొడవైన ఎల్పీజీ పైప్లైన్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇలాంటి పైప్లైన్లే ప్రపంచ దేశాలకు చమురు, సహజ వాయువుల వంటి ఇంధనాలు అందిస్తున్న ప్రాణవాయువులు. ఈ పైప్లైన్లు ప్రపంచ దేశాలను చుడుతూ భారీగా విస్తరిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్ల పొడవుతో గ్యాస్ పైప్లైన్ అందుబాటులో ఉందో తెలుసా? 14.2 లక్షల కిలోమీటర్లు.అంటే భూమిని 35సార్లు చుట్టొచ్చన్న మాట. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్ జీ) పైప్లైన్ల సామర్థ్యం 5 బిలియన్ (500 కోట్ల) టన్నులు. అలాగే చమురును సరఫరా చేసే పైప్లైన్ల పొడవు 5,04,000 కిలోమీటర్లు.చమురు, సహజ వాయువు.. ప్రపంచాన్ని నడిపిస్తున్న సహజ ఇంధన వనరులు ఇవి. ఆర్థిక వ్యవస్థ రథచక్రాలివి. ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన వనరుల పంపిణీకి చమురు, సహజ వాయువు పైప్లైన్లు కీలకమైనవి. ‘అన్నింటా మనం’ అన్నట్టు చమురు, సహజ వాయువు రంగంలో భారత్ సైతం తనదైన ముద్రవేస్తోంది. ప్రపంచంలో అతిపొడవైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) పైప్లైన్ ప్రాజెక్టుకు మన దేశం శ్రీకారం చుట్టింది.టాప్–5లో గెయిల్గ్యాస్ సరఫరా కోసం చైనాలో 21.9 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 17,800 కిలోమీటర్లు, భారత్లో 20.7 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 14,300 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలో ఇతర అన్ని దేశాల్లో అభివృద్ధి దశలో ఉన్న మొత్తం పైప్లైన్ కంటే ఈ రెండు దేశాలు నిర్మిస్తున్నవే అధికం కావడం విశేషం. గ్యాస్ పైప్లైన్స్ను అభివృద్ధి చేస్తున్న టాప్–5 మాతృ సంస్థలు ప్రభుత్వ రంగానికి చెందినవి కావడం విశేషం. రష్యాలో గ్యాస్ప్రామ్, చైనా–పైప్చైనా, భారత్–గెయిల్, నైజీరియా–ఎన్ ఎన్ పీసీ, ఇరాన్ లో చమురు మంత్రిత్వ శాఖ వీటిలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న అత్యంత పొడవైన గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులు 2,775 కిలోమీటర్ల ఇరాన్–పాకిస్తాన్ పైప్లైన్, అలాగే భారత్లో 2,655 కిలోమీటర్ల జగదీష్పూర్–హల్దియా–బొకారో–ధమ్రా సహజ వాయువు పైప్లైన్. నిర్మాణంలో ఉన్న అతి పొడవైన చమురు పైప్లైన్ ప్రాజెక్టుల్లో ఆఫ్రికాలోని చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ యాజమాన్యంలోని 1,950 కిలోమీటర్ల నైజర్–బెనిన్ ఆయిల్ పైప్లైన్, భారత్లో నుమాలిఘర్ రిఫైనరీ లిమిటెడ్కు చెందిన 1.635 కిలోమీటర్ల పారాదీప్ నుమాలిఘర్ క్రూడ్ పైప్లైన్ (పీఎన్ సీపీఎల్) టాప్–2లో నిలిచాయి.అగ్రదేశాల సరసన మనమూ..అమెరికాకు చెందిన ప్రముఖ ఇంధన రంగ విశ్లేషణ సంస్థ ‘గ్లోబల్ ఎనర్జీ మానిటర్’ గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా 59,100 కిలోమీటర్ల గ్యాస్ సరఫరా పైప్లైన్స్ నిర్మాణంలో ఉన్నాయి. మరో 1,51,300 కిలోమీటర్ల పైప్లైన్ ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. వీటన్నింటి అంచనా వ్యయం 533.6 బిలియన్ డాలర్లు. అభివృద్ధి చేస్తున్న పైప్లైన్ల పరంగా చైనా, రష్యా, భారత్, ఆస్ట్రేలియా, యూఎస్ ముందున్నాయి. చమురు సరఫరా కోసం 9,100 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణంలో ఉంది. మరో 21,900 కిలోమీటర్ల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఉన్నాయి. 2023 మే నాటికి 25.3 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్న మొత్తం చమురు సరఫరా పైప్లైన్స్లో 49 శాతం ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో విస్తరించాయి. ఈ ప్రాంతాలు 4,400 కిలోమీటర్ల ముడి చమురు సరఫరా పైప్లైన్స్ను నిర్మిస్తున్నాయి. అలాగే 10,800 కిలోమీటర్ల ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి.2,800 కి.మీ. పొడవు!ప్రపంచంలో అతిపొడవైన ఎల్పీజీ పైప్లైన్ ప్రాజెక్టును భారత్ చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలైన బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ సంయుక్తంగా ఐహెచ్బీఎల్ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయి. ప్రాజెక్టు కోసం 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారు. 2,800 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ ప్రాజెక్టులో గుజరాత్లోని కాండ్లను ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్తో అనుసంధానిస్తారు. ఏటా 83 లక్షల టన్నుల ఎల్పీజీని రవాణా చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇది దేశ మొత్తం ఎల్పీజీ డిమాండ్లో 25 శాతం.
ఎన్ఆర్ఐ

నృత్యంతో అలరించిన నేహారెడ్డి
నేహా రెడ్డి ఆళ్ల .. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి.. తల్లిదండ్రులు శివరామి రెడ్డి, నాగ మల్లేశ్వరి. తన తల్లి నాగ మల్లేశ్వరికి ఉన్న కళాపేక్ష వల్ల చిన్నప్పుడే వర్జీనియాలోని కళామండపం నృత్య పాఠశాలలో గురు మృణాళిని సదానంద గారి దగ్గర చేరి, కూచిపూడిలో మెలకువలు నేర్చుకుంది. గురువు మృణాళిని సదానంద గారి శిష్యరికంలో యెన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.. అంతేకాకుండా నేహా చదువులో కూడా అత్యంత ప్రతిభను కనపరుస్తూ ఎన్నో బహుమతులను తెచ్చుకుంది. మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేహ నృత్యప్రదర్శన ఇచ్చింది. అంతేకాకుండా అమెరికాలో జరిగే పండుగ కార్యక్రమాలలో తన నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుని ప్రసంశలు పొందింది. నృత్యంలోనే కాదు చదువులోనూ రాణిస్తున్న నేహాకు డాక్టర్ కావాలనేది లక్ష్యం. శనివారం, జూలై 5న తన గురువు గారు కళారత్న శ్రీమతి మృణాళిని సదానంద గారి అధ్వర్యం లో నృత్య సంభావన (అరంగేట్రం)చేసింది నేహా రెడ్డి ఆళ్ల.. గురు మృణాళిని సదానంద గారు అన్ని నృత్యములకు కొరియోగ్రఫీ చేయగా నేహ తన నృత్యప్రదర్శనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గురు సత్యప్రియ రమణ చీఫ్ గెస్ట్గా ఇండియా నుండి వచ్చారు.. కవిత చీడల ప్రవక్తగా వ్యవహారించారు. నట్టువంగం శ్రీ కమల్ కిరణ్ గారు, వాయిలిన్ విద్వాన్ శ్రీ వింజమూరి సుభాష్ గారు, గాత్రం శ్రీమతి కృపా లక్ష్మి మరియు శ్రీ శశాంక గారు, శ్రీ విజయ్ గణేష్ గారి మృదంగం, శ్రీ సౌమ్య నారాయణన్ గారు ఘటం, వాయిలిన్ సపోర్టింగ్ ఎంఎస్ పద్మిని గారు, స్పెషల్ ఎపెక్ట్స్ శ్రీ రామకృష్ణ గోపినాథ్ తదితరులు సంగీతాన్ని అందించారు. కార్యక్రమానంతరం అందరినీ నేహా రెడ్డి ఆళ్ల తల్లితండ్రులు శ్రీ శివరామి రెడ్డి మరియు శ్రీమతి నాగ మల్లేశ్వరి దంపతులు మరియు సోదరుడు చేతన్ రెడ్డి ఆళ్ల సత్కరించారు..అమెరికాలో అందెల సవ్వడి, డాక్టర్ కావాలనేది కల

న్యూజిలాండ్లో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు
న్యూజిలాండ్లోని ప్రధాన నగరాల్లో కూడా ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్లోని పిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి, కో–కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, డేగపూడి సమంత్, సభ్యులు బాలశౌర్య, రాజారెడ్డి, పిళ్లా పార్థ, జిమ్మి, గీతారెడ్డి, ఆళ్ల విజయ్, రమేష్ పనటి, సంకీర్త్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.భారతదేశం నుండి గౌరవ అతిథులుగా అలూరు సంబ శివ రెడ్డి , ఆరే శ్యామల రెడ్డి, జి. శాంత మూర్తి , నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ మాజీ మంత్రి మైకేల్ ఉడ్ హాజయ్యారు. ఎన్నారైలు బీరం బాల, కళ్యాణ్రావు, కోడూరి చంద్రశేఖర్, అర్జున్రెడ్డి, మల్లెల గోవర్ధన్, జగదీష్ రెడ్డి, ఇందిర సిరిగిరి తదితరులు పాల్గొన్నారు.

లండన్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో లండన్లోనిని ఈస్టమ్లో దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి 76వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.యూకే నలుమూలల నుంచి వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆన్ లైన్ లో పాల్గొని వేడుకల్లో భాగస్వాములైన వారిని అభినందించారు. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని రాజశేఖరరెడ్డి జీవి తాన్ని, వారు సాధించిన విజయాలను స్మరించుకో వడం సంతోషంగా ఉందన్నారు. మహానేత ఆశయ సాధనకు వైఎస్ జగన్ శ్రమిస్తున్నార న్నారు. నేతలందరూ వైఎస్ జగన్ వెంట నడవాలని, ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ ఓబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ యూకే కో-కన్వీనర్ మలిరెడ్డి కిశోర్రెడ్డి, కీలక కమిటీ సభ్యులు శ్రీనివాస్ దొంతిబోయిన, ఎస్ఆర్ నందివెలుగు, సురేందర్ రెడ్డి అలవల, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ కల్చరల్ సొసైటీ 12వ సర్వ సభ్య సమావేశం
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) / TCSS పన్నెండవ వార్షిక సర్వ సభ్య సమావేశం జూన్ 29వ తేదీన స్థానిక ఆర్య సమాజం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 30 మందికిపైగా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పదకొండవ సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల వివరాలను సభ్యులకు వివరించిన తరువాత పద్దులను ఉపాధ్యక్షులు భాస్కర్ గుప్త నల్ల ఆమోదించారు. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు ముద్దం విజ్జేందర్ , గర్రెపల్లి శ్రీనివాస్, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకట రమణ వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి మోడరేటర్గా ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2024‐2025 ఆర్థిక సంవత్సరానికి గానూ పద్దుల తనిఖీ దారులుగా సేవలు అందించిన కైలాసపు కిరణ్, తెల్లదేవరపల్లి కిషన్ రావు గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీ రాజ్యాంగానికి ప్రతిపాదించిన కొన్ని ముఖ్యమైన సవరణలకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు. 2025 నుంచి 2026 గాను పద్దుల తనిఖీ దారులుగా నీలం సుఖేందర్, కిరణ్ కుమార్ ఎర్రబోయిన గార్లను ప్రతిపాదించి ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు సాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీ ని ఆస్వాదించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ గార్ల తోపాటు ఇతర జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి)
క్రైమ్

14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి
తమిళనాడు: చెంగల్పట్టు సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్న ఓ 10వ తరగతి బాలుడు రోజూ సాయంత్రం వేళల్లో ట్యూషన్కు వెళ్లేవాడు. ఈనేపథ్యంలో చెంగల్పట్టులో మెకానిక్గా పనిచేస్తున్న పాండిచ్చేరి వాసి అమితు అబ్దుల్ ఖాదర్ 13.04.2024న ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలుడిని తన ద్విచక్ర వాహనం ఎక్కమని అడిగాడు. అతను ఎక్కనని చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా, అబ్దుల్ ఖాదర్ ఆ బాలుడిని కత్తితో బెదిరించి తన బైకుపై తీసుకెళ్లి తిరుమణి రైల్వే గేట్ సమీపంలోని ఒక పొదలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.నేను పిలిచినప్పుడల్లా రాకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని కూడా బెదిరించాడు. భయంతో ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఈ సందర్భంలో, గత 03.05.2024న, ట్యూషన్ పూర్తి చేసుకుని, రాత్రి 8.30 గంటలకు కాంచీపురం హై రోడ్కు తిరిగి వస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసి, చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ముళ్ల పొదలో బంధించి కత్తితో బెదిరించి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధను భరించలేక, ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో షాక్ కు గురైన ఆ బాలుడి తల్లిదండ్రులు చెంగల్పట్టు నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అమీద్ అబ్దుల్ ఖాదర్పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అంతేకాకుండా, చెంగల్పట్టు పోక్సో కోర్టు ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. బుధవారం ఈ కేసును విచారించిన ప్రభుత్వ న్యాయవాది లక్ష్మి అమీద్ అబ్దుల్ ఖాదర్కి యావజ్జీవ శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కల్తీ కల్లు కల్లోలం!
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాజధాని నగరంలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. ఆరుగురి అమాయకుల ప్రాణాలను బలిగొంది. మోతాదుకు మించిన రసాయనాలు కలిపి తయారు చేసిన కల్లు తాగి నిరుపేదలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మంగళవారం నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో ఉన్న కల్లు కాంపౌండ్లలో హైదర్నగర్, సాయిచరణ్ కాలనీలకు చెందిన పలువురు కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వివిధ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించగా.. బుధవారం వరకు ఆరుగురు మృతి చెందారు. మరో 32 మంది నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తనిఖీలు నామమాత్రం.. నగరం సహా శివారులోని పలు కాంపౌండ్లలో కల్లు అమ్మకాలపై తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో కల్తీ కల్లు విక్రయాలకు అడ్డే లేకుండా పోయింది. ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు కల్లు కాంపౌండ్లపై నిఘా ఉంచకపోవడంతోనే వాటి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. మోతాదుకు మించి రసాయనాలు కలిపి కల్తీ కల్లును తయారు చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఎక్సైజ్శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వల్లే కూకట్పల్లి విషాదాంతం జరిగినట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా కల్లు కాంపౌండ్లు.. ప్రకృతి సిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కల్లు ఆరోగ్యకరమైంది. స్వచ్ఛమైన ఈ కల్లును తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తొలగుతాయి. సాధారణంగా చెట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల కల్తీ కల్లు ఉండదని చెప్పవచ్చు. డిమాండ్ మేరకు కల్లు ఉత్పత్తి లేకపోవడం, అప్పటి వరకు ఈ వృత్తిపై ఆధారపడిన గీత కార్మికులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఫలితంగా కల్లుకు కొరత ఏర్పడింది. మద్యం ధరలు భారీగా ఉండటంతో రోజువారీ కూలీలు కృత్రిమంగా లభించే కల్లుతో సేదతీరుతున్నారు. వీరి బలహీనతను కొంత మంది కల్లు వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫాజోలమ్ వంటి ప్రమాదకర రసాయపాలను వినియోగించి కల్లు తయారు చేస్తున్నారు. తయారీలో మోతాదుకు మించి రసాయనాలను వినియోగిస్తుండటంతో.. ఈ కల్లు తాగినవారు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గ్రేటర్తో సహా శివారుల్లోని పలు ప్రాంతాలు, బస్తీలు, పురపాలక సంఘాల్లో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కల్లు కాంపౌండ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నమూనాలు సేకరించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమీ çపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కల్తీ జరుగుతోందనే ఆరోపణలుతున్నాయి. ఒకే లైసెన్స్తో.. ఎన్నో కాంపౌండ్లు.. నగరంతో సహా పలు చోట్ల ఒకే కల్లు దుకాణం లైసెన్సు పొంది ఎక్కువ దుకాణాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒక లైసెన్స్ ఒకటే దుకాణం నడిపించాల్సి ఉంటుంది. అయినా వ్యాపారులు మాత్రం ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వీరిపై ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగానే మారుతోంది. నాడీ వ్యవస్థపై ప్రభావం.. డైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లు తాగిన వారిలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని, మానసిక విచక్షణ కోల్పోయి పిచి్చగా ప్రవర్తిస్తుంటారని చెబుతున్నారు. ఈ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్షతగాత్రులకు సర్జరీల సమయంలో నొప్పి నివారణ కోసం ఇచ్చే మత్తు ఇంజక్షన్లు కూడా పని చేయవని, మోతాదుకు మించిన డోసు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. సాధ్యమైనంత వరకు ఈ కల్లు తాగకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.

నైట్ డ్యూటీకి వెళ్లి.. మిస్టరీగా నర్స్ మృతి
అనంతపురం: నగరంలోని సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు దివ్య (22) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన వడ్డె దివ్య.. మూడేళ్లుగా సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అదే ఆస్పత్రికి చెందిన హాస్టల్లోనే ఉంటున్నారు. ఆరోగ్యం బాగోలేదని మంగళవారం రాత్రి తోటి నర్సులకు తెలిపి ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రించారు. బుధవారం మధ్యాహ్నమైనా ఆమె లేవలేదు. మధ్యాహ్నం షిఫ్ట్ నర్సులు వచ్చి పలుకరించినా స్పందన లేకపోవడంతో పల్స్ పరిశీలించారు. నాడి చిన్నగా కొట్టుకుంటుండడంతో వెంటనే సవేరా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, దివ్య మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

తండ్రిని చంపేసి.. సెకండ్ షో సినిమాకు వెళ్లి..
మల్కాజ్గిరి జిల్లా: భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రినే హత్య చేయించింది. తల్లి, ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా నమ్మించాలని యతి్నంచి కటకటాలపాలైంది. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరి«ధిలో జరిగింది. హత్య వివరాలను బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలి్పన మేరకు..ముషిరాబాద్ పరిధిలోని ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతులు. లింగం సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తుండగా, శారద జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ నెల 6న లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న మధ్యాహ్నం పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్లో ఓ ఫోటో పంపి గుర్తించాలని కోరారు. మృతుడ్ని తండ్రిగా గుర్తించి..తల్లి శారదతో కలిసి ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు. లింగం శవాన్ని చూసి బోరున విలపించారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతకోసి చంపారని శారద పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ముగ్గురూ కలిసి ... లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వీరి ఇంటి సమీపంలో ఉంటుంది. మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై లింగం కోపగించి..అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు. భర్త దగ్గరకు కాపురానికి వెళ్లిపోవాలని మనీషాను ఒత్తిడిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె తల్లి శారద, మహ్మద్ జావీద్ సహకరించారు. ఈమేరకు హత్య చేసిన తర్వాత శవాన్ని ఎక్కడ వేయాలో అని చర్చించి 15 రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు.కల్లులో నిద్ర మాత్రలు కలిపి... లింగంకు కల్లు తాగే అలవాటు ఉండడంతో అందులో నిద్రమాత్రలు కలపాలని జావీద్ ఈ నెల 5న శారదకు టాబ్లెట్లు అందించాడు. లింగం కల్లు తాగి ఇంట్లో పడుకోగా.. విషయాన్ని శారద..కుమార్తె మనీషా, జావీద్లకు సమాచారం ఇచి్చంది. మనీషా సమీపంలోని వైన్స్లో మద్యం కొనుగోలు చేసి వచి్చ..మరోసారి లింగంకు తాగించారు. అనంతరం శారద, మనీషాల సహకారంతో లింగం కాళ్లు చేతులు కట్టేసిన జావీద్..అతడి ముఖంపై దిండుతో అదిమి..పిడికిలితో గుండెపై మోది, గొంతు కోసి చంపేశారు. శవాన్ని ఇంట్లో వేలాడదీశారు. సినిమాకు వెళ్లి..క్యాబ్లో శవాన్ని తరలించి.. హత్య అనంతరం ముగ్గురు జావీద్ ఉండే ఇంటికి బైక్పై వెళ్లి.. అటునుంచి సెకెండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని ఎదులాబాద్ చెరువులో పడేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. లింగం అపస్మారక స్థితిలో ఉండడంతో డ్రైవర్ అనుమానించి కారు బుకింగ్ రద్దు చేసుకున్నాడు. మద్యం సేవించాడని, ఎదులాబాద్లో కుటుంబ సభ్యులకు అప్పగించాలని డ్రైవర్కు నచ్చజెప్పి ఒప్పించారు. కారులో శవంతో మనీషా, శారద ఉండగా..జావీద్ బైక్పై వెనుక అనుసరించి.. శవాన్ని చెరువు కట్టపై దించారు. క్యాబ్ వెళ్లగానే శవాన్ని చెరువులో పడేసి ముగ్గురు బైక్పై ఇంటికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కుటుంబ సభ్యుల పైనే అనుమానం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వీడియోలు


గుర్తుపెట్టుకోండి.. జక్కంపూడి గణేష్ కౌంటర్


శశిథరూర్ కు కాంగ్రెస్ వార్నింగ్


నేను ఊదను పో.. డ్రంక్ & డ్రైవ్ లొల్లి


ఐటీ రంగంలో అసాధారణ విజయాన్ని సాధించిన ఎన్వీడియా కంపెనీ


రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ అధిష్టానం


ఆ ట్రాక్టర్లు మావే..! డ్రైవర్ల సంచలన వీడియో


కొంతమందికి కూలీ ఇచ్చి వైఎస్ జగన్ ను తిట్టిస్తున్నారు


మరోసారి కోలీవుడ్ వైపు నాగ చైతన్య


శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల బాహాబాహీ


ఎమ్మెల్యే వేధింపులు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం