iBomma Ravi: లీకులు లేకుండా టాప్ సీక్రెట్గా..
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో కస్టడీ విచారణ మూడో రోజుకి చేరింది. అత్యంత గోప్యంగా, ఎలాంటి లీకులు లేకుండా సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి వివరాలు రాబడుతున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నత స్థాయి అధికారులే స్వయంగా ఈ విచారణను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పైరసీ కేసులో నిందితుడు ఇమ్మడి రవికి సంబంధించిన ఆరు అకౌంట్ల వివరాల కోసం బ్యాంకు అధికారులకు సీసీఎస్ లేఖ రాసింది. ఇప్పటికే డబ్భుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు ఒప్పుకున్న రవి.. 1xbet యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించాడు. అలాగే.. మూవీ రూల్జ్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశానని.. అందుగానూ క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్జ్కి డబ్బులు చెల్లించానని రవి పోలీసులకు తెలిపాడు. దర్యాప్తులో రవి తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్సైట్ను బెట్టింగ్ యాప్స్కి గేట్ వే చేసి.. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతోనే రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఫ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ని పోస్ట్ చేసేవాడని.. కరేబియన్ దీవుల్లో ఆఫీస్ ఏర్పాటు చేసి ఏకంగా 20 మంది యువకుల్ని రవి నియమించినట్లు తెలుస్తోంది. అయితే రెండ్రోజులపాటు జరిగిన విచారణలో రవి నుంచి కొద్దిపాటి సమాచారాన్నే మాత్రమే సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో రవి నెట్ వర్క్ పై లోతైన విచారణ జరుపుతున్నారు. రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు.
Vreels: టిక్టాక్ & ఇన్స్టాగ్రామ్ను దాటిపోయే కొత్త డిజిటల్ విశ్వం
డిజిటల్ ప్రపంచం ప్రతీ రోజూ మారుతోంది. నేడు మనం వీడియోల కోసం ఒక యాప్, మెసేజింగ్ కోసం మరో యాప్, షాపింగ్ కోసం ఇంకొకటి వాడుతున్నాం.ఈ మధ్యకాలంలో యూజర్లు ఒక ప్రశ్నను తరచూ అడుగుతున్నారు: “ఈ అన్నింటినీ ఒకే వేదికలో పొందలేమా?”ఇదే ప్రశ్న ఒక కొత్త ఆలోచనకు పుట్టుక ఇచ్చింది. ఆ ఆలోచనే నేడు ప్రపంచానికి అందుతున్న – వీరీల్స్ (Vreels) (www.vreels.com).అమెరికాలో ఉండే మన తెలుగువారి ఆలోచన — ప్రపంచానికి కొత్త వేదిక టెక్ ప్రపంచంలో ముందడుగు వేస్తున్న యువతెలుగువారు. అమెరికాలో ఉండి, ప్రపంచం కోసం ఒక అద్భుతమైన యాప్ను రూపొందించారు."సురక్షితం, అందరికీ సులభం, ప్రపంచస్థాయి ఫీచర్లతో" భారతీయ సృజనకు కొత్త రూపం ఇచ్చిన మేధస్సు ఇది. వీరి లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది — భారతీయులకు, ముఖ్యంగా క్రియేటర్లకు, యువతకు, ప్రపంచ స్థాయిలో ధైర్యంగా పోటీ ఇవ్వగల ఒక సరైన వేదికను అందించడం.వీరీల్స్ ఎందుకు ఇతర యాప్లను దాటిపోతోంది?1) వీడియోలు, చాట్, షాపింగ్ — అన్నీ ఒకే యాప్లో.. - మీరు రీల్స్ చేయాలంటే – Vreels - మిత్రులతో చాట్ చేయాలంటే - Vreels - ప్రోడక్ట్స్ కొనాలంటే - Vreels2) టిక్టాక్ & ఇన్స్టాగ్రామ్ కంటే సురక్షితం, స్పష్టత ఎక్కువ AI పెరుగుతున్న ఈ కాలంలో, యూజర్లు డేటా సేఫ్టీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో, Vreels ప్రతి డేటాను జాగ్రత్తగా, నిబంధనలకు లోబడి, ఎన్క్రిప్షన్తో రక్షిస్తుంది. ఇక్కడ యూజర్ డేటా అమ్మకం లేదు, లీక్ భయం లేదు. మీరు చూడమంటేనే, మీ డేటా కనిపిస్తుంది.3) Capsules — ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేక ఫీచర్ Vreels లోని Capsules మీ జ్ఞాపకాలను భద్రంగా, సమయంతో తాళం వేసి ఉంచుతుంది. మీరు నిర్ణయించిన టైమ్ వచ్చినప్పుడు మాత్రమే అవి అన్లాక్ అవుతాయి.4) Vreels Shop/Bid — వినోదం దగ్గరే షాపింగ్ యూజర్లు వీడియో చూస్తూ ఉండగానే ప్రోడక్ట్స్ కొనొచ్చు లేదా బిడ్ చేయొచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను నమ్మకంతో విక్రయించొచ్చు.ఇది షాపింగ్ కాదు— భారతీయ డిజిటల్ వ్యాపారానికి ఒక కొత్త దారితీసే ఫీచర్.5) క్రియేటర్ల కోసం ప్రత్యేక అవకాశాలు రిచ్ ఫీచర్లు, వేగవంతమైన పెర్ఫార్మెన్స్, పారదర్శకత — ఇవి అన్ని కలిపి క్రియేటర్లకు TikTok & Instagram కన్నా మెరుగైన వేదికను ఇస్తాయి.22 దేశాల్లో విడుదల… ఇప్పుడు App Store & Play Store లో అందుబాటులోయువ తెలుగువారి ప్రతిభతో పుట్టిన ఈ యాప్ ఇప్పటికే 22 దేశాల్లో బీటా రిలీజ్ అయి, Google Play Store మరియు Apple App Store లో అందుబాటులో ఉంది.ఇది ప్రారంభం మాత్రమే — ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు రానున్నాయి.Vreels — మీ డిజిటల్ ప్రయాణానికి కొత్త స్వరూపం మీరు క్రియేటర్ అయినా, షాపింగ్ ప్రేమికుడైనా, లేదా కొత్త ఫీచర్లు ప్రయత్నించే టెక్-ఎన్తుజియాస్ట్ అయినా — Vreels మీ కోసం. మీ అనుభవం కోసం. మీ భవిష్యత్తు కోసం.ఇప్పుడే ప్రయత్నించండి Vreels — భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comక్రింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్లలో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదా డౌన్లోడ్ కోసం క్రింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి:
అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ
ఆసియా క్రికెట్ మండలి పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత-‘ఎ’ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్-‘ఎ’ జట్టుతో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో జితేశ్ శర్మ సేన ఓటమిపాలైంది. దీంతో ఈ టీ20 ఈవెంట్లో కనీసం ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన దుస్థితి వచ్చింది.బంగ్లా చేతిలో భారత్ ఓటమిదోహా వేదికగా ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు (IND A vs BAN A) ‘సూపర్ ఓవర్’ ద్వారా భారత్ను ఓడించింది. సూపర్ ఓవర్లో ఆడిన 2 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయిన భారత్ ‘0’కే పరిమితం కాగా... బంగ్లాదేశ్ 1 పరుగు చేసి విజయాన్నందుకుంది.వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హబీబుర్ రహమాన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేయగా.... మెహ్రాబ్ హుసేన్ (18 బంతుల్లో 48 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్లు) దూకుడు ప్రదర్శించాడు.సరిగ్గా 194 పరుగులేభారత బౌలర్లలో గుర్జీప్నీత్ సింగ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 194 పరుగులే సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్లు), జితేశ్ శర్మ (Jitesh Sharma- 23 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించారు.Top-class innings from Vaibhav Sooryavanshi! 💥Watch India A take on Bangladesh A in the semi-final, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #DPWorldAsiaCupRisingStars2025 pic.twitter.com/7rSQRproSI— Sony Sports Network (@SonySportsNetwk) November 21, 2025 నేహల్ వధేరా (29 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 2 ఓవర్లలో భారత్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిపాన్ మోండోల్ (1/35) ఐదు పరుగులే ఇచ్చాడు.విజయం కోసం ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన భారత్ తొలి 5 బంతుల్లో 12 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి హర్ష్ దూబే, వధేరా కలిసి కష్టంగా 2 పరుగులు పూర్తి చేశారు. అయితే కీపర్ అక్బర్ ఘోర వైఫల్యంతో భారత్కు మూడో పరుగు కూడా వచ్చింది.సూపర్ ఓవర్లో అంతా తలకిందులు.. చావోరేవో తేల్చుకోవాల్సిన సూపర్ ఓవర్లో భారత జట్టు యాజమాన్యం ఆశ్చర్యకరంగా వైభన్ సూర్యవంశీని కాదని జితేశ్ శర్మ, రమణ్దీప్ల సింగ్లతో ఓపెనింగ్ చేయించింది. మోండోల్ వేసిన తొలి బంతికి జితేశ్, రెండో బంతికి అశుతోష్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ‘సున్నా’ వద్ద ముగిసింది.వైభవ్ను ఎందుకు పంపలేదు?ఆ తర్వాత తొలి బంతికి వికెట్ తీసిన సుయాశ్ శర్మ, తర్వాతి బంతిని వైడ్గా వేయడంతో బంగ్లాదేశ్ గెలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సూపర్ ఓవర్లో అనుసరించిన వ్యూహంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విధ్వంసకర వీరుడైన వైభవ్ను ఓపెనర్గా ఎందుకు పంపలేదంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మండిపడ్డారు. భారత్ ఓటమికి ఒకరకంగా ఇదే ప్రధాన కారణమనే చర్చ లేవనెత్తారు.ఓటమికి బాధ్యత నాదేఈ నేపథ్యంలో భారత కెప్టెన్ జితేశ్ శర్మ స్పందించాడు. ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. ‘‘ఈ మ్యాచ్ ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓటమికి బాధ్యత నాదే. సీనియర్ ఆటగాడిగా మ్యాచ్ను సరైన రీతిలో ముగించి ఉండాల్సింది.నేర్చుకునే దశలో ఇదొక భాగమే కానీ.. ఓటమి కాదు. ఏదో ఒకరోజు ఈ జట్టులోని ఆటగాళ్లే భారత జట్టుకు ప్రపంచకప్ అందించవచ్చు. వాళ్ల ప్రతిభకు ఆకాశమే హద్దు. మాకు ఇదొక అనుభవం.ఇక్కడ వికెట్ కీలక పాత్ర పోషించింది. ఇలాంటి పిచ్లపై ఎలా ఆడాలో మాకు తెలుసు. అయితే, పందొమ్మిదో ఓవర్లో బంగ్లా బౌలర్ అద్భుతంగా బౌల్ చేశాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. 20 ఓవర్ల ఆట మా నియంత్రణలోనే ఉంది. కానీ ఆఖర్లో చేదు ఫలితం వచ్చింది’’ అని జితేశ్ శర్మ పేర్కొన్నాడు.డెత్ ఓవర్లలో మేము బెస్ట్ఇక సూపర్ ఓవర్లో రెగ్యులర్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్యలను పంపకపోవడంపై స్పందిస్తూ.. ‘‘వాళ్లిద్దరు పవర్ప్లేలో మాస్టర్లు అని నాకూ తెలుసు. అయితే, డెత్ ఓవర్లలో నేను, అశుతోశ్, రమణ్ హిట్టింగ్ ఆడగలము. అందుకే సూపర్ ఓవర్లో మేమే బ్యాటింగ్కు వెళ్లాలని భావించాం. ఇది జట్టు నిర్ణయం. పూర్తిగా నా నిర్ణయం’’ అని జితేశ్ శర్మ స్పష్టం చేశాడు.చదవండి: SMAT: హైదరాబాద్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
కలిసొచ్చిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్
అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్ట్మార్ట్ ఇంటర్నేషనల్ మూడో త్రైమాసికంలో పటిష్టమైన ఆర్థిక ఫలితాలు సాధించడంలో భారత విభాగం ఫ్లిప్కార్ట్ కీలకంగా నిలిచింది. ఫ్లిప్కార్ట్ ’బిగ్ బిలియన్ డే’ సేల్స్ని నిర్వహించిన సమయం తమ సంస్థ ఆదాయాల వృద్ధికి సానుకూలంగా దోహదపడిందని వాల్మార్ట్ తెలిపింది.ఫిబ్రవరి–జనవరి వ్యవధిని కంపెనీ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంతర్జాతీయంగా వాల్మార్ట్ ఆదాయం 179.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్యూ3లో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సానుకూలంగా ఉన్నప్పటికీ, క్యూ4లో వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశంఉందని వాల్మార్ట్ తెలిపింది.ఈ ఏడాది సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ నడిచింది. 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ 77 శాతం వాటా కొనుగోలు చేసింది. తర్వాత దాన్ని 80 శాతానికి పెంచుకుంది.
రీల్ ఎంత పని చేసింది రాములా!
ఫిరాయింపుల ఎపిసోడ్.. దానం పరిస్థితి ఏంటో?
ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చిన 'రాజ్-కోటి' ఎలా విడిపోయారు..?
అడవిలోకి రానురానంటూ మొరాయింపు
రాకెట్లా దూసుకెళ్లిన బంగారం, వెండి రేట్లు..
అసిస్టెంట్ పైలట్పై 'పైలట్' అత్యాచారం!
Asia T20 Cup: ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్తాన్
బడే దామోదర్ ఎక్కడ?
కలిసొచ్చిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్
నాన్నా.. అమ్మను బాగా చూసుకో
భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు
కెప్టెన్గా ఇషాన్ కిషన్ పేరు ప్రకటన
బంగారం ధరల్లో ఊహించని మార్పు!: గంటల వ్యవధిలో..
వివాదాల 'డర్టీ సాంగ్' ఫుల్ వీడియో వచ్చేసింది
కట్టుబట్టలతో ఇంటినుంచి పారిపోయి..: అమల
ఈ రాశివారు శుభవార్తలు వింటారు, వ్యవహారాలలో విజయం
అంతరిక్షంలో ఏలియన్ రాకను గుర్తించిన నాసా
టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
అబ్బే! పెండింగ్ ఫైల్స్ కాద్సార్! పైరవీల లేఖలు
ముచ్చల్తో నిశ్చితార్థాన్ని ధ్రువీకరించిన మంధన
తారుమారైన బంగారం ధరలు: సాయంత్రానికే..
ఈ రాశి వారికి భూములు, వాహనాలు కొంటారు
నేను నిన్ను పట్టుకోవడానికి రావట్లేదెహే! నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు..
మళ్లీ భారత్ × పాకిస్తాన్ ఫైనల్?
ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది, అనుకూల మార్పులు
బిహార్ సీఎంగా నితీశ్ పదోసారి ప్రమాణ స్వీకారం..
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్
హైదరాబాద్కు వైఎస్ జగన్.. ఉప్పొంగిన అభిమానం
బంగారం ధరలు.. అది ‘నకిలీ అంచనా’: కియోసాకి
రీల్ ఎంత పని చేసింది రాములా!
ఫిరాయింపుల ఎపిసోడ్.. దానం పరిస్థితి ఏంటో?
ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చిన 'రాజ్-కోటి' ఎలా విడిపోయారు..?
అడవిలోకి రానురానంటూ మొరాయింపు
రాకెట్లా దూసుకెళ్లిన బంగారం, వెండి రేట్లు..
అసిస్టెంట్ పైలట్పై 'పైలట్' అత్యాచారం!
Asia T20 Cup: ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్తాన్
బడే దామోదర్ ఎక్కడ?
కలిసొచ్చిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్
నాన్నా.. అమ్మను బాగా చూసుకో
భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు
కెప్టెన్గా ఇషాన్ కిషన్ పేరు ప్రకటన
బంగారం ధరల్లో ఊహించని మార్పు!: గంటల వ్యవధిలో..
వివాదాల 'డర్టీ సాంగ్' ఫుల్ వీడియో వచ్చేసింది
కట్టుబట్టలతో ఇంటినుంచి పారిపోయి..: అమల
ఈ రాశివారు శుభవార్తలు వింటారు, వ్యవహారాలలో విజయం
అంతరిక్షంలో ఏలియన్ రాకను గుర్తించిన నాసా
టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
అబ్బే! పెండింగ్ ఫైల్స్ కాద్సార్! పైరవీల లేఖలు
ముచ్చల్తో నిశ్చితార్థాన్ని ధ్రువీకరించిన మంధన
తారుమారైన బంగారం ధరలు: సాయంత్రానికే..
ఈ రాశి వారికి భూములు, వాహనాలు కొంటారు
మళ్లీ భారత్ × పాకిస్తాన్ ఫైనల్?
నేను నిన్ను పట్టుకోవడానికి రావట్లేదెహే! నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు..
ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది, అనుకూల మార్పులు
బిహార్ సీఎంగా నితీశ్ పదోసారి ప్రమాణ స్వీకారం..
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్
హైదరాబాద్కు వైఎస్ జగన్.. ఉప్పొంగిన అభిమానం
బంగారం ధరలు.. అది ‘నకిలీ అంచనా’: కియోసాకి
ఫొటోలు
తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)
బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)
వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 21-28)
తెర వెనక ఇంత హంగామా నడిచిందా? (ఫొటోలు)
లేడీ క్రికెటర్ స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్ (ఫొటోలు)
అలనాటి హీరోయిన్ రాధ కూతురు.. పెళ్లయి రెండేళ్లయిపోయిందా? (ఫొటోలు)
దాగుడుమూతలు ఆడుతున్న హీరోయిన్ తమన్నా (ఫోటోలు)
కవ్వించే చూపులతో శ్రీలీల.. వైరల్ ఫోటోలు
సినిమా
కట్టుబట్టలతో ఇంటినుంచి పారిపోయి..: అమల
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగార్జున - అమల (Amala Akkineni) జంటగా నటించిన శివ సినిమా 36 ఏళ్ల తర్వాత రీరిలీజైంది. నవంబర్ 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను అందరూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న అమల ఈ సినిమా ప్రమోషన్స్లో చురుకుగా పాల్గొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.ఆస్తులు కోల్పోయాంఅమల మాట్లాడుతూ.. అమ్మ ఐరిష్, నాన్న బెంగాలి. నాన్న చిన్నతనంలో బెంగాల్ విభజన జరిగింది. అప్పుడు మేము ఆస్తులన్నీ కోల్పోయాం. కట్టుబట్టలతో నాన్న రాత్రికి రాత్రి ఇంటి నుంచి పారిపోయి వచ్చారు. బాగా చదువుకుంటేనే పైకొస్తామని ఆలోచించి చదువుపై దృష్టి పెట్టాడు. అలా బాగా చదివి యూకేలో నౌకాదళంలో ఉద్యోగం సంపాదించాడు. నాన్నకు తొమ్మిది మంది చెల్లెళ్లు, తమ్ముళ్లున్నారు. తను సంపాదించేదంతా వారికే పెట్టేవాడు.చిన్నతనంలో భరతనాట్యంఅమ్మానాన్న ఇద్దరూ నౌకాదళ అధికారులుగా పనిచేసేవారు. వృత్తిరీత్యా అనేక ప్రదేశాలు మారుతూ ఉండేవాళ్లం. అలా వైజాగ్లో ఉన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. మా డ్యాన్స్ టీచర్ అమ్మతో.. మీ కూతురికి మంచి టాలెంట్ ఉంది. చెన్నైలోని కళాక్షేత్రలో చేర్పించండి. అక్కడ ఇంకా బాగా నేర్పిస్తారు అని సలహా ఇచ్చింది.అక్కడే చదువుకున్నా..అలా నన్ను 9 ఏళ్ల వయసులో కళాక్షేత్ర స్కూల్లో చేర్పించారు. 19 ఏళ్లు వచ్చేవరకు అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాను. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నాట్యప్రదర్శనలు ఇచ్చాను. మా ఇంట్లో పనివాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, వంట చేయడం అన్నీ మేమే చేసుకునేవాళ్లం. సినిమాల్లో ఎంట్రీదర్శకుడు టి.రాజేందర్ తన సినిమా కోసం క్లాసికల్ డ్యాన్సర్ కావాలని కళాక్షేత్రకు వచ్చాడు. అలా మైథిలి ఎన్నయి కథలై సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యాను. అది చాలా పెద్ద హిట్టవడంతో సినిమాలు చేసుకుంటూ పోయాను. అత్తమ్మ అక్కినేని అన్నపూర్ణమ్మ దగ్గరే తెలుగు బాగా నేర్చుకున్నాను. తను నన్ను అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంది. తండ్రి మాట జవదాటడుపిల్లల విషయానికి వస్తే నాగచైతన్య తల్లి చెన్నైలో ఉంటుంది. కాలేజీ విద్య కోసం అతడు హైదరాబాద్ వచ్చాడు. అప్పుడే తన గురించి బాగా తెలుసుకున్నాను. చైకి మెచ్యూరిటీ ఎక్కువ. ఎటువంటి తప్పు చేయడు. నాన్న మాట జవదాటడు. చై, అఖిల్.. వీళ్లిద్దరినీ సొంత నిర్ణయాలు తీసుకోమని వదిలేశాం. అప్పుడే వాళ్లంతట వాళ్లు అన్నీ తెలుసుకుంటారు. నాకు మంచి కోడళ్లు దొరికారు. వాళ్లు చాలా టాలెండెట్. ఇంత మంచి కోడళ్లు దొరకడం నా అదృష్టం అని అమల చెప్పుకొచ్చింది.చదవండి: ఇమ్మూకి తల్లి ఊహించని గిఫ్ట్
ఆయనతో నటిస్తూ ఎంజాయ్ చేశా: కృతి సనన్
కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తారతమ్యం లేకుండా నటిస్తూ పాన్ ఇండియా కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు ధనుష్. అదేవిధంగా నటుడిగా, కథకుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సత్తా చాటుతున్న ఈయన ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలా ధనుష్ నటిస్తున్న తాజా చిత్రాల్లో తేరే ఇష్క్ మే(Tere Ishk Mein) హిందీ చిత్రం ఒకటి. కృతిసనన్(Kriti Sanon) నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహా్మన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి గుడ్ టాక్ను క్రియేట్ చేసింది. తేరే ఇష్క్ మే చిత్రం ఈనెల 28న హిందీ, తమిళం తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా కృతి సనన్(Kriti Sanon) ధనుష్ సరసన నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ ధనుష్ ఒక అసాధారణ నటుడని అన్నారు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం కలిగిన నటుడని అన్నారు. ఆయనతో నటించడానికి చాలా ఎగ్జైటెడ్ ఫీలయ్యానని, ధనుష్ నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. ఆయనతో కలిసి నటించడాన్ని చాలా ఎంజాయ్ చేశానని అన్నారు. తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందన్నారు. తామిద్దరం చాలా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టి.సిరీస్కు చెందిన గుల్షన్కుమార్, కలర్ ఎల్లో సంస్థ సమర్పణలో ఆనంద్ ఎల్.రాయ్, హిమాన్షూశర్మ, భూషన్కుమార్, కృష్ణకుమార్ కలిసి నిర్మించారు.
ఈ సినిమా హిట్టయితేనే పిశాచి 2 రిలీజ్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ఆండ్రియా (Andrea Jeremiah). ఈమె మంచి గాయని అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ రచయితగా, నిర్మాతగా మారింది. ఈమె కథను అందించి ది షో మస్ట్ గో ఆన్ పతాకంపై నిర్మించిన చిత్రం మాస్క్. బ్లాక్ మెడ్రాస్ ఫిలింస్ సంస్థతో కలిసి ఆండ్రియా ఈ చిత్రాన్ని నిర్మించింది. రుహాని శర్మ హీరోయిన్గా నటించిన ఇందులో ఛార్లీ, రమేష్ తిలక్, కల్లూరి వినో, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మాస్క్ రిలీజ్వెట్రిమారన్ మార్గదర్శకత్వంలో వికర్ణన్ అశోక్ అనే యువ దర్శకుడు తెరకెక్కించాడు. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించారు. ఆండ్రియా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించగా హీరో కెవిన్ కథానాయకుడిగా నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం (నవంబర్ 21న) తెరపైకి వచ్చింది. అది హిట్టయితేనే..ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆండ్రియా.. మాస్క్ మూవీ విజయంపై చాలా ఆశలే పెట్టుకుంది. కాగా ఈమె నటించిన మరో చిత్రం పిశాచి 2. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఆ చిత్రం గురించి నటి ఆండ్రియా వద్ద ప్రస్తావించగా.. తాను నిర్మించిన మాస్క్ మంచి విజయాన్ని సాధిస్తే ఆ తరువాత పిశాచి 2 చిత్రాన్ని తానే విడుదల చేస్తానంది. దీంతో మాస్క్ చిత్ర హిట్పై పిశాచి 2 చిత్ర విడుదల ఆధారడిందన్నమాట!
స్కిల్ గేమ్స్ అనుకొని ప్రమోట్ చేశాం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసిన కేసులో హీరోయిన్ నిధి అగర్వాల్, సోషల్ మీడి యా ఇన్ఫ్లుయెన్సర్ అమృత చౌదరి, యాంకర్ శ్రీముఖి శుక్రవారం మధ్యా హ్నం 2 గంటలకు సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధుశర్మ, సీఐడీ ఎస్పీ వెంకటలక్షి్మతో కూడిన బృందం వారిని విడివిడిగా ప్రశ్నించింది. జీత్ విన్ అనే బెట్టింగ్ సైట్ను నిధి అగర్వాల్, ఎమ్88 అనే యాప్ను శ్రీముఖి, యోలో 247, ఫెయిర్ప్లే యాప్లను అమృత చౌదరి ప్రమోట్ చేసినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. దర్యాప్తులో భాగంగా శ్రీముఖిని సుమారు గంటన్నరపాటు ప్రశ్నించారు.అలాగే నిధి అగర్వాల్, అమృత చౌదరిని సాయంత్రం 5:30 గంటల వరకు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్ అనే భావనతోనే వాటిని ప్రమోట్ చేసినట్లు నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖి వెల్లడించినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు సహా ఆయా సంస్థల నుంచి తీసుకున్న పారితోషికాలు, బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు పరిశీలించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి నమోదైన కేసుల్లో పలువురు టాలీవుడ్ నటులు, యాంకర్లు, యూట్యూబర్లు సహా మొత్తం 29 మందిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్తోపాటు పలువురు యూట్యూబర్లను ప్రశ్నించారు.
క్రీడలు
SMAT: తిలక్ వర్మ కాదు!.. హైదరాబాద్ కెప్టెన్గా అతడే
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో పాల్గొనే హైదరాబాద్ సీనియర్ జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. పదిహేను మంది సభ్యుల ఈ టీమ్కు సీవీ మిలింద్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. కాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కుమారుడే ఈ మిలింద్ అన్న విషయం తెలిసిందే. ఇకఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఉన్న హైదరాబాద్ తమ మ్యాచ్లన్నీ కోల్కతాలోనే ఆడుతుంది. ఏడు లీగ్ మ్యాచ్ల్లో మూడు ఈడెన్ గార్డెన్స్లో, నాలుగు జాదవ్పూర్ యూనివర్సిటీ గ్రౌండ్లో జరుగుతాయి. తొలి పోరులో ఈ నెల 26న మధ్యప్రదేశ్తో హైదరాబాద్ తలపడుతుంది. ఈ గ్రూప్లో మరో ఆరు జట్లు మహారాష్ట్ర, గోవా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్, బిహార్, చండీగఢ్ ఉన్నాయి.తిలక్ వర్మ బిజీబిజీఇదిలా ఉంటే.. ఈ దేశీ టీ20 టోర్నీలో టీమిండియా స్టార్ తిలక్ వర్మ గతేడాది హైదరాబాద్ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ నేపథ్యంలో తిలక్ జాతీయ జట్టు విధుల్లో బిజీగా గడుపనున్నాడు. ఈ నేపథ్యంలో తిలక్ స్థానంలో మిలింద్కు హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో నవంబరు 22 నుంచి డిసెంబరు 19 మధ్య టీమిండియా సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీకి హైదరాబాద్ జట్టు సీవీ మిలింద్ (కెప్టెన్), తనయ్ త్యాగరాజన్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, అమన్ రావు, హెచ్కే సింహా, ఆశిష్ శ్రీవాత్సవ, నితేశ్ కనాల, అజయ్దేవ్ గౌడ్, ప్రజ్ఞయ్ రెడ్డి (వికెట్ కీపర్), భవేశ్ సేఠ్ (వికెట్ కీపర్), నితిన్ సాయి యాదవ్, రక్షణ్ రెడ్డి, ఎండీ అర్ఫాజ్, రిషికేత్ సిసోడియా, రాహుల్ బుద్ధి. చదవండి: వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్లో టీమిండియా ఓటమి
అటు స్టార్క్... ఇటు స్టోక్స్
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాషెస్ సిరీస్ అనూహ్య రీతిలో ఆరంభమైంది. కిక్కిరిసిన పెర్త్ స్టేడియంలో ఆసీస్ పేసర్లు అదరగొట్టడంతో... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశాం అనుకుంటే... ఇంగ్లండ్ బౌలర్లు కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు. స్టార్క్ ధాటికి ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే కుప్పకూలగా... బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బంతితో విజృంభించాడు. ఐదు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బ తీశాడు. వెరసి... పర్యాటక ఇంగ్లండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్లో కీలకమైన ఆధిక్యం దక్కే అవకాశాలున్నాయి. పెర్త్: పేసర్లకు అనుకూలించే పెర్త్ పిచ్పై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా యాషెస్ సిరీస్ తొలి టెస్టు తొలి రోజే 19 వికెట్లు నేలకూలాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ధాటిగా ఆడుతూ 32.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (61 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా... ఒలీ పోప్ (58 బంతుల్లో 46; 4 ఫోర్లు), జేమీ స్మిత్ (22 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఆసీస్ పేసర్లు ఆకట్టుకున్న చోట... ఇంగ్లండ్ బౌలర్లు కూడా సత్తా చాటారు. సారథి బెన్ స్టోక్స్ 6 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ చెరో 2 వికెట్లు తీశారు. చేతిలో ఒక వికెట్ ఉన్న ఆస్ట్రేలియా... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. నాథన్ లయన్ (3 బ్యాటింగ్), బ్రెండన్ డగెట్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లోనే వికెట్...ఆస్ట్రేలియా గడ్డపై గత కొన్నాళ్లుగా ప్రభావం చూపలేకపోతున్న ఇంగ్లండ్ జట్టును స్టార్క్ (7/58) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో గట్టిదెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ జాక్ క్రాలీ (0)ని అవుట్ చేసిన అతడు... చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. తొలి ఓవర్లో వికెట్ పడగొట్టడం స్టార్క్కు ఇది 24వసారి. సీనియర్ బ్యాటర్ జో రూట్ (0) డకౌట్ కాగా... కెప్టెన్ బెన్ స్టోక్స్ (6) ప్రభావం చూపలేకపోయాడు. బెన్ డకెట్ 21 పరుగులు చేశాడు. పేసర్లకు సహకరిస్తున్న పిచ్పై సంయమనంతో బ్యాటింగ్ చేయడానికి బదులు ఇంగ్లండ్ జట్టు... తమకు అలవాటైన ‘బాజ్బాల్’ ఆటతీరును అవలంభించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. దీంతో ఒకవైపు వికెట్లు పడుతున్నా... ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అరంగేట్ర పేసర్ బ్రెండన్ డగెట్ 2 వికెట్లు తీశాడు. కామెరూన్ గ్రీన్కు ఒక వికెట్ దక్కింది. 6 ఓవర్లు వేసి 5 వికెట్లు...తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్... బౌలింగ్లో పట్టుదల కనబర్చింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఆసీస్ అరంగేట్ర ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (0)ను ఆర్చర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబుషేన్ (41 బంతుల్లో 9; 1 ఫోర్) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోగా... ఈ మ్యాచ్లో సారథ్యం వహిస్తున్న స్టీవ్ స్మిత్ (49 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఉస్మాన్ ఖ్వాజా (2) విఫలం కాగా... ట్రావిస్ హెడ్ (21), కామెరూన్ గ్రీన్ (24) తలా కొన్ని పరుగులు చేశారు. తొలి నాలుగు వికెట్లను ఆర్చర్, కార్స్ పంచుకోగా... ఆ తర్వాత కెప్టెన్ స్టోక్స్ మ్యాజిక్ ప్రారంభమైంది. కేవలం ఆరు ఓవర్లే బౌలింగ్ చేసిన అతడు... వరుసగా హెడ్, గ్రీన్, స్టార్క్ (12), కేరీ, బోలండ్ (3)లను పెవిలియన్ బాట పట్టించాడు. ఇంగ్లండ్ కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా... 5.23 రన్రేట్తో పరుగులు సాధించగా... ఆస్ట్రేలియా మాత్రం ఆ పని చేయలేకపోయింది.19 యాషెస్ టెస్టులో తొలి రోజే 19 వికెట్లు నేలకూలడం 1909 తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1909 మాంచెస్టర్ టెస్టు తొలి రోజు ఇరు జట్లు ఆలౌటయ్యాయి.5 ఆస్ట్రేలియా గడ్డపై 5 వికెట్లు పడగొట్టిన ఐదో ఇంగ్లండ్ కెప్టెన్గా బెన్ స్టోక్స్ నిలిచాడు. చివరిసారిగా 1982లో ఇంగ్లండ్ సారథి బాబ్ విల్లీస్ బ్రిస్బేన్ టెస్టులో ఈ ఘనత సాధించాడు.36 బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు పడగొట్టేందుకు వేసిన బంతులు. ఇంగ్లండ్ పేసర్లలో ఇది మూడో వేగవంతమైంది. గతంలో స్టువర్ట్ బ్రాడ్ 19 బంతుల్లో (ఆస్ట్రేలియాపై), 34 బంతుల్లో (న్యూజిలాండ్పై) ఈ ఫీట్ నమోదు చేశాడు.7/58 ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్కు టెస్టు క్రికెట్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆసీస్ ఆడిన గత మ్యాచ్లో వెస్టిండీస్పై స్టార్క్ 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టెస్టుల్లో స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 17వ సారి.100 ‘యాషెస్’ టెస్టుల్లో 100 వికెట్లు తీసిన 11వ ఆస్ట్రేలియా పేసర్గా స్టార్క్ నిలిచాడు. 21వ శతాబ్దంలో టెస్టు అరంగేంట్రం చేసిన వారిలో ఈ ఘనత సాధించిన మొదటి పేసర్ అతడే.0/1 యాషెస్ సిరీస్లో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదు కాకుండా ఇరు జట్లు ఓపెనింగ్ బ్యాటర్ వికెట్ కోల్పోవడం ఇదే తొలిసారి.10 బెన్స్టోక్స్ను స్టార్క్ అవుట్ చేయడం ఇది పదోసారి. భారత స్పిన్నర్ అశ్విన్ 13 సార్లు స్టోక్స్ను పెవిలియన్ చేర్చాడు.
ఖాళీలు 73... బరిలో 277
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026వ సీజన్కు సంబంధించిన వేలం ఈ నెల 27న జరగనుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మతో పాటు... హర్లీన్ డియోల్, ప్రతీక రావల్, పూజ వస్త్రకర్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్ వంటి భారత ఆటగాళ్లతో పాటు పలువులు అంతర్జాతీయ ప్లేయర్లు వేలం బరిలో ఉన్నారు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో సత్తాచాటే దీప్తి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలున్నాయి. మొత్తం 5 ఫ్రాంచైజీలు కలిసి ఈ వేలంలో రూ. 41.1 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఖాళీగా ఉన్న 73 స్థానాల కోసం మొత్తం 277 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. వారిలో 52 మంది క్యాప్డ్ ప్లేయర్స్ కాగా... 142 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. ఇక విదేశాల నుంచి 83 మంది పోటీ పడుతున్నారు. ఇందులో 66 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా... 17 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు. గరిష్ట ప్రారంభ ధర రూ. 50 లక్షలు కాగా... ఇందులో 19 మంది ప్లేయర్లు ఉన్నారు. దీప్తి, హర్లీన్, ప్రతీక, పూజ, ఉమ, క్రాంతితో పాటు సోఫీ డివైన్, అమేలియా కెర్ (న్యూజిలాండ్), సోఫీ ఎకిల్స్టోన్ (ఇంగ్లండ్), అలీసా హీలీ, మెగ్ లానింగ్ (ఆ్రస్టేలియా) కూడా తమ ప్రాథమిక ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించుకున్నారు. రూ. 40 లక్షల ప్రారంభ ధరతో 11 మంది, రూ. 30 లక్షల ప్రారంభ ధరతో 88 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ‘వేలంలో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. 50 స్థానాల కోసం వీరు పోటీ పడుతున్నారు. 23 విదేశీ స్థానాల కోసం 83 మంది పోటీలో ఉన్నారు’ అని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
స్మృతి WEDS పలాశ్
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ తొలిసారి విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మనసిచ్చిన వాడితో రేపు మనువాడబోతోంది. ఇన్నేళ్లుగా ఒకలా రేపటి రోజు ఒకలా స్మృతి కనిపించబోతోంది. జట్టు జెర్సీతో మైదానంలో ప్యాడ్లు, గ్లౌజ్లు, క్యాప్తో ఓపెనర్గా క్రీజులోకి వచ్చే ఆమె... రేపు మాత్రం అరుదైన డిజైనర్ లెహెంగా, నుదుటన పాపిట బిళ్ల, బుగ్గన చుక్క, మోచేతుల దాకా గాజులు, అరచేతి నిండా పండిన గోరింటాకు, కాళ్లకు పారాణితో వధువులా ముస్తాబై కమనీయ కళ్యాణ వేదికకు రానుంది. మధ్యప్రదేశ్కు చెందిన సంగీత దర్శకుడు, డైరెక్టర్ పలాశ్ ముచ్చల్తో స్మృతి కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. వీరిద్దరు త్వరలోనే ఒక్కటవుతారనే వార్తలు నెట్టింట తెగ షికార్లు చేశాయి. ప్రపంచకప్ తర్వాత ముహూర్తం ఖాయమనే ముచ్చట్లూ వినిపించాయి. చివరకు అన్నట్లే ప్రపంచకప్ ముగిసిన వెంటనే స్మృతి ఇంట పెళ్లి బాజా మోగనుంది. తన హోటల్ ‘ఎస్ఎం 18’ (స్మృతి మంధాన 18 జెర్సీ నంబర్)లో భారత జట్టు సహచరుల సందడితో పెళ్లి కోలాహలం ఎప్పుడో మొదలైంది. హల్దీ, మెహందీ వేడుకల్లో సహచరుల చిందులు, చిలిపి అల్లర్లు నెట్టింట కనువిందు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలతో పాటు డీవై పాటిల్ స్టేడియం మధ్యలో స్మృతి కళ్లకు గంతలు కట్టి పలాశ్ పిచ్ వద్దకు తొడ్కొని రావడంతోపాటు మోకాళ్లపై కూర్చోని ఆమెకు చేసిన పెళ్లి ప్రతిపాదన వీడియో కూడా నెట్టింట క్రికెట్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏకంగా 19 లక్షలు లైక్లు, 12 వేలపైచిలుకు కామెంట్లు, లెక్కలేనన్ని శుభాకాంక్షలు ఇన్స్టాలో వెల్లువెత్తాయి. ‘ఎక్స్’లో ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే జంట స్మృతి మంధాన, పలాశ్లకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూస్ పాడ్కాస్ట్
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా?... సీఎం చంద్రబాబు
ఉప్పొంగిన అభిమానం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హైదరాబాద్లో ఘన స్వాగతం
మనమంతా సాయి మార్గంలో నడుద్దాం... శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
భద్రతాబలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మడివి హిడ్మా. ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోలు సైతం మృతి
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలోగా నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగ ఉండండి.
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
బిజినెస్
ఇజ్రాయెల్ స్టార్టప్లతో జత
టెల్అవీవ్: భారత్, ఇజ్రాయెల్ స్టార్టప్లు సాంకేతిక సహకారమందించుకునేందుకు చేతులు కలపవలసి ఉన్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇక్కడ పేర్కొన్నారు. దీంతో ప్రధానంగా సైబర్సెక్యూరిటీ, మెడికల్ పరికరాలు తదితరాలలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ సహకారానికి ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. సొంత స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఇజ్రాయెల్తో చేతులు కలపనున్నట్లు పేర్కొన్నారు. పోటీ ధరలలో లోతైన టెక్నాలజీ, అత్యంత నాణ్యమైన ఆవిష్కరణలను అందించే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. భారత్కున్న విస్తారిత వ్యవస్థల ద్వారా ఇందుకు పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. ఇజ్రాయెల్ వాణిజ్య మంత్రి నిర్ బార్కట్తో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు నిర్వహించేందుకు గోయల్ ఇక్కడకు వచ్చారు.
ఇన్ఫ్రా, ఇంధన రంగ నిపుణులతో ఆర్థిక మంత్రి భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఢిల్లీలో మౌలిక రంగం, ఇంధన రంగాలకు చెందిన నిపుణులతో భేటీ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) బడ్జెట్పై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్కాన్స్ ఎండీ ఎస్.పరమశివన్, షాపూర్జీ పల్లోంజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ డైరెక్టర్ మనీష్ త్రిపాఠి, జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ ఎండీ కె.నారాయణరావు, జేఎం బక్సి గ్రూప్ డైరెక్టర్ సందీప్ వాద్వా, ఇన్ఫ్రా విజన్ ఫౌండేషన్ సీఈవో జగదన్షా తదితర కంపెనీల సారథులు ఇందులో పాల్గొన్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్ఫామ్పై ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సీతారామన్ రానున్న 2026–27 కేంద్ర బడ్జెట్కు సంబంధించి 11వ ముందస్తు సమావేశాన్ని ఇన్ఫ్రా, ఇంధన రంగాల నిపుణులతో నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ, షిప్పింగ్ శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డ్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు హాజరయ్యారు’’అని ఆర్థిక శాఖ తన పోస్ట్లో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ 2026–27 బడ్జెట్ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు ప్రాధాన్యం నెలకొంది. డిమాండ్, ఉపాధి కల్పనను పెంచడం, దేశ జీడీపీని 8 శాతం వృద్ధి రేటుకు చేర్చడం వంటి ప్రధాన సవాళ్లు ఆర్థిక మంత్రి ముందున్నాయి. వ్యవసాయం, ఎంఎస్ంఎఈలు, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ మార్కెట్ రంగాల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇప్పటి వరకు బడ్జెట్ ముందస్తు సమావేశాలు నిర్వహించడం గమనార్హం.
ఇండెక్సులలో రీట్స్కు చోటు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు(రీట్స్)ను మార్కెట్ ఇండెక్సులలో చేర్చే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధిత వర్గాలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో రీట్స్కు లిక్విడిటీ భారీగా మెరుగుపడే వీలున్నట్లు తెలియజేశారు. 2025 రిట్స్, ఇని్వట్స్ జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ పాండే ఇండెక్సులలో రీట్స్ను పొందుపరిచేందుకు పరిశ్రమ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలియజేశారు. రియల్టీ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు రీట్స్ను జారీ చేస్తాయి. తద్వారా ఇన్వెస్టర్లకు అధిక ధరల రియలీ్టని ఆఫర్ చేసేందుకు వీలుంటుంది. ప్రధానంగా డివిడెండ్ ఆదాయం ఆర్జించేందుకు వీలు కల్పించడంతోపాటు.. భవిష్యత్లో పెట్టుబడుల వృద్ధికి సైతం రీట్స్ ఉపయోగపడతాయి. ఇండెక్సులలో చోటు లభిస్తే రీట్స్లో లిక్విడిటీ పెరుగుతుందని పాండే పేర్కొన్నారు. మరోపక్క రీట్స్, ఇని్వట్స్ సంబంధిత బిజినెస్ల సులభతర నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎంఎఫ్ పథకాలలో.. ఇన్వెస్టర్లకు రక్షణ కలి్పస్తూనే లిక్విడ్ ఎంఎఫ్ పథకాలలో రీట్స్, ఇన్విట్స్ ఇన్వెస్ట్ చేసేందుకున్న అవకాశాలను సైతం పరిశీలిస్తున్నట్లు సెబీ చీఫ్ పాండే తెలియజేశారు. ఈ బాటలో తగిన రక్షణాత్మక విధానాలకు తెరతీయడం ద్వారా గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులలో ప్రయివేట్ ఇని్వట్స్ పెట్టుబడులు చేపట్టేందుకు అవకాశాలను అన్వేíÙస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విధంగా రీట్స్, ఇని్వట్స్లో మరిన్ని పెట్టుబడులను చేపట్టేందుకు వీలుగా సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పబ్లిక్ ఆస్తుల మానిటైజేషన్ను పెంచేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీటిలో పెట్టుబడులపై బీమా రంగ నియంత్రణ సంస్థ, పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత సంస్థ, ఈపీఎఫ్వో తదితరాలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎంఎఫ్లపై సెబీ ఆంక్షలు ప్రీఐపీవోలో పెట్టుబడులకు చెక్ న్యూఢిల్లీ: ప్రీఐపీవోలో షేర్ల కొనుగోలుపై మ్యూచువల్ ఫండ్స్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. సంబంధితవర్గాల సమాచారం ప్రకారం ఐపీవోకుముందు షేర్ల జారీ(ప్లేస్మెంట్స్)లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేయకుండా సెబీ నిషేధం విధించింది. తద్వారా ఐపీవోలలో లిక్విడిటీని పెంచడంతోపాటు.. కంపెనీల విలువ నిర్ధారణలో పారదర్శకతకు మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. ప్రీఐపీవో షేర్ల జారీలో పాల్గొనకుండా ఆదేశించామని, అయితే యాంకర్ రౌండ్లలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతులు కొనసాగుతాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఈ నెల మొదట్లో సెబీ యాంకర్ ఇన్వెస్టర్ కేటగిరీ, షేర్ల కేటాయింపులో సైతం సవరణలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్కు మరింత చోటు కల్పించింది. ఇందుకు వీలుగా యాంకర్ పోర్షన్ను 33 శాతం నుంచి 40 శాతానికి పెంచిన విషయం విదితమే.
రష్యా చమురుకు రిలయన్స్ గుడ్బై
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్లోని జామ్నగర్లో ఎగుమతులకు ఉద్దేశించిన రిఫైనరీ యూనిట్ కోసం రష్యా చమురు దిగుమతులను నిలిపివేసినట్టు ప్రకటించింది. ఐరోపా సమాఖ్య ఆంక్షలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంది. ఇప్పటి వరకు రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న సంస్థల్లో రిలయన్స్ ముందుండడం గమనార్హం. జామ్నగర్ కాంప్లెక్స్లో రిలయన్స్కు రెండు రిఫైనరీ యూనిట్లు ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేక ఆర్థిక మండలి రిఫైనరీ యూనిట్. ఇందులో రష్యా చమురును రిఫైనరీ చేసి యూరప్, యూఎస్, ఇతర మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. రోజువారీ 1.7–1.8 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి తక్కువ ధరలపై కొనుగోలు చేస్తూ వచి్చంది. జామ్ నగర్లోనే ఉన్న మరొక యూనిట్ను దేశీ మార్కెట్ అవసరాల కోసం వినియోగిస్తోంది. అయితే, రష్యా చమురు దిగుమతి, దాంతో పెట్రోలియం ఉత్పత్తుల తయారీపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించడం గమనార్హం. వీటిని అనుసరిస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా చమురు కొనుగోళ్లను నవంబర్ 20 నుంచి నిలిపివేసినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ప్రకటించారు. గతంలో కొనుగోలు చేసిన చమురు నిల్వల రిఫైనరీ పూర్తయిన అనంతరం, రష్యాయేతర దేశాల చమురునే ఇక్కడ వినియోగించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి యూనిట్ ద్వారా ఎగుమతి చేసే ఉత్పత్తులు రష్యాయేతర చమురుతో తయారైనవే ఉంటాయని స్పష్టం చేశారు. 2026 జనవరి 1 నుంచి ఐరోపా ఆంక్షలు అమల్లోకి రానుండగా, దీనికంటే ముందుగానే రష్యాయేతర చమురుకు మారిపోవడం పూర్తవుతుందన్నారు. తద్వారా ఐరోపా సమాఖ్య మార్గదర్శకాలను పాటిస్తామన్నారు.
ఫ్యామిలీ
పేదింటమ్మ పెద్ద మనసు
‘ధనానికి పేదను కావచ్చుగానీ గుణానికి కాదు’ అన్నట్లుగా ఉంటుంది కొందరి ధోరణి. వారి గుణంలోనే దానగుణం ఉంటుంది. అలాంటి ఒక మహిళ ఆత్రం లేతుబాయి.ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం సహేజ్ గ్రామానికి చెందిన లేతుబాయి తనకు ఉన్న మూడెకరాల స్థలంలో ఒక ఎకరం స్థలాన్ని పది కోలాం కుటుంబాలు ఇళ్లు కట్టుకోడానికి ప్రభుత్వానికి దానంగా ఇచ్చింది...ఆత్రం లేతుబాయి... అడవులను, చెట్టుపుట్టలనూ నమ్ముకొని జీవిస్తోంది. వ్యవసాయమే జీవనాధారంగా అతిసాధారణ జీవితాన్ని గడుపుతోంది. బాహ్య ప్రపంచం, ఆధునిక పోకడలు అస్సలు తెలియని అలాంటి మహిళపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కారణం... దుబ్బగూడ గ్రామంలో పది కొలాం కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. స్థలం లేకపోయినప్పటికీ ప్రత్యేక నిబంధనలతో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది. మంజూరైతే చేశారు గానీ ఆ ఇండ్లను కట్టేందుకు స్థలం అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో ఆత్రం లేతుబాయి తన భర్త జంగు, ముగ్గురు కుమారులతో చర్చించింది. తన పేరిట ఉన్న మూడెకరాల నుంచి ఒక ఎకరం ప్రభుత్వానికి అందజేసింది.లేతుబాయి గతంలో కూడా ఇలానే తమ బంధువులు కొంతమందికి పూరిగుడిసెలు వేసుకునేందుకు చోటు కల్పించింది. ‘మా కొలాం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నాయి. పక్కా ఇల్లు అనేది మాకు కల లాంటిది. అది నిజమైతే మా జీవితాలు మారుతాయి. అందుకే మాకు ఉన్న మూడు ఎకరాల్లో ఒక ఎకరం ఇచ్చాను’ అంటుంది 56 సంవత్సరాల లేతుబాయి. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా లేతుబాయి–జంగు దంపతులను ఘనంగా సన్మానించారు. లేతుబాయి నిర్ణయం ఎందరికో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. – గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్, ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి
మహిళల మానసిక ప్రపంచంలోకి...
ఉత్తరాన కశ్మీర్ నుండి దక్షిణాన మలయాళం వరకు, పశ్చిమాన రాజస్థానీ నుంచి తూర్పున అస్సామీ వరకు ‘బ్యాండెజ్ట్ మూమెంట్స్’ పుస్తకంలో ఎంతోమంది మహిళల గొంతులు వినిపిస్తాయి. మానసిక ఆరోగ్యం నుంచి సామాజిక శ్రేయస్సు వరకు ఎన్నో అంశాలపై పదిహేను భారతీయ భాషలలో, మూడు మాండలికాలలో (మార్వారీ, మాగహి, భోజ్పురి) మహిళలు రాసిన కథల ఇంగ్లీష్ అనువాదం... బాండెజ్ట్ మూమెంట్స్ పేరుతో ముందుకు వచ్చింది.ఉపాధ్యాయులైన ఇద్దరు మహిళలు ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. పేదరికం మాత్రమే కాదు మానసిక అనారోగ్యం కూడా పెద్ద సమస్యే అని చెబుతాయి ఈ పుస్తకంలోని కథలు. ఆందోళన, నిరాశ, అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (వోసిడి), స్కిజోఫ్రేనియా...మొదలైన వాటి గురించి రచయిత్రులు తమ జీవితానుభవాల నుంచి చెప్పిన కథలు ఇందులో ఉన్నాయి.గ్లాస్ వాల్స్ (తమిళ్), ప్లైయింగ్ షిష్ (అస్సామీ), ది టేల్ ఆఫ్ ది టాయిలెట్ (కన్నడ), కన్వర్ట్ మై బ్యాడ్ కర్మ టు గుడ్ (హిందీ)... మొదలైన కథలు స్త్రీలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల గురించి రాసినవే.మానసిక ఆరోగ్యం కూడా ఒక సామాజిక సమస్య అని, అది వివక్షతకు గురవుతుందని చెప్పే కథలు... ఓ మై టెనిఫాక్టర్ (మైథిలి), గర్ల్ ఇన్ ది డాల్హౌస్ (పంజాబీ)... మొదలైనవి.అబ్సెషన్ అనేది వ్యక్తి యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. విసియస్ సైకిల్ (గుజరాతి), ది స్మెల్ ఆఫ్ న్యూస్ (మలయాళం), బ్రేకింగ్ అవుట్ (ఉర్దూ), బోర్డర్ లైన్ (బెంగాలీ) అనేవి అబ్సెషన్ కేంద్రంగా నడిచే కథలు. క్రేజీ రివర్ (ఒడియా) అనేది మాట్లాడాలనే కోరికను, ఉత్సాహాన్ని కోల్పోయిన మహిళ కథ. ది షాడో (ఒడియా) ఒక మహిళ మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణించడాన్ని గురించి చెబుతుంది. ది ఎల్లో రోజ్ (ఉర్దూ) మానసిక సమస్యల్లో ఉన్న వారి ఒంటరితనం గురించి చెబుతుంది.
World Television Day: చిత్రలహరి వస్తుంది పద...
కొద్దిగా ఉన్నప్పుడే బాగుండేది. టీవీ ఉన్న ఇంటికి టీవీ లేని వాళ్లంతా వచ్చి కూచునేవారు. ఆదివారం రామాయణం కోసం ప్రతి ఇల్లూ ఆతిథ్యం ఇచ్చేది. చిత్రలహరికి గడప బయట నిలబడి తొంగి చూసే పిల్లల్ని అదిలించేవారు కాదు. ఇంటి పైన యాంటెనా, ఇంట్లో డయనారా అదీ హోదా అంటే. టెలివిజన్ జీవితంలో భాగం అయిన రోజులు బాగుండేవి. ఇవాళ జీవితమంతా టీవీగా మారి ఊపిరి సలపడం లేదు. టీవీ వచ్చిన రోజులకూ ఇప్పటికీ ఎంత తేడా!సినిమా తెర మీద కాకుండా మరో తెర మీద, అదీ ఇంట్లో ఉండే తెర మీద బొమ్మ పడుతుందని ఊహించని రోజుల్లో టెలివిజన్ వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నాటి హైద్రాబాద్, లేదా మద్రాస్ (చెన్నై), లేదా కొండపల్లి నుంచి సిగ్నల్స్ సరిగా ఆ రోజుకి అందాయో ఇక పండగే పండగ. ఎందుకు పండగ? సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు ఆ తెలుపు నలుపు టీవీలో ఏదో ఒకటి ఉచితంగా ప్రసారం అవుతూ ఉంటుంది. చూడొచ్చు. అందుకని.సమయం ఉన్న రోజులుమన దేశంలో 1959లో టెలివిజన్ మొదలైనా సరైన ప్రసారాలు రూపుదిద్దుకోవడానికి 1976కి కాని సాధ్యపడలేదు. నగరాలను దాటి ఊళ్లకు సిగ్నల్ అందే వ్యవస్థ ఏర్పడటానికి మరో పదేళ్లు పట్టింది. కలర్ ప్రసారాలు 1982లో మొదలైనా 1990లకు గాని కలర్ టీవీలు కొనే శక్తి ఊళ్లల్లో ఏ కొద్దిమందికో తప్ప అందరికీ రాలేదు. ఏతా వాతా 1985 నుంచి తెలుపు, నలుపు టీవీ ప్రసారాలు తెలుగు ప్రేక్షకులకు తెలుస్తూ వచ్చాయి. ఆ రోజుల్లో మనుషులందరి దగ్గరా ఎక్కడ లేని తీరిక, సమయం. కాబట్టి టీవీ ఆన్ చేసి అర్థమైనా కాకపోయినా చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. ఇక అందులో ఆసక్తికరమైన కార్యక్రమాలు మొదలయ్యాక అతుక్కుపోయారు. టెలివిజన్ చేసిన మొదటి పని ఏమిటంటే– దేశ వాసులందరికీ ఒకే టీవీ ఒకే వినోదం అనే భావన కలిగించడం. ప్రాంతీయ ప్రసారాలు ఉన్నా ముఖ్యమైన మీట ఢిల్లీలో ఉంటుందని అందరికీ తెలియచేయడం. కేంద్ర శక్తిని స్థాపించడంలో టెలివిజన్ ముఖ్య పాత్ర పోషించింది.రామాయణం సంచలనం1987 నుంచి మొదలైన ‘రామాయణం’ సీరియల్ టెలివిజన్ పవర్ ఏంటో దేశానికి చాటింది. వ్యాపార ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో వెల్లువెత్తడం కూడా మొదలయ్యాయి. అంతవరకూ టికెట్ ఇచ్చి సినిమా హాల్లో రామాయణం చూసిన జనం ఈ ఉచిత రామాయణాన్ని తండోపతండాలుగా చూశారు. ఆ తర్వాత ‘మహాభారత్’, ‘హమ్లోగ్’, ‘నుక్కడ్’, ‘ఉడాన్’, ‘మాల్గుడీ డేస్’... ప్రేక్షకులకు అందమైన డేస్ మిగిల్చాయి.చిత్రహార్–చిత్రలహరిప్రతి బుధవారం వచ్చే హిందీ పాటల ‘చిత్రహార్’, శుక్రవారం వచ్చే ‘చిత్రలహరి’ సూపర్హిట్ ఆదరణ పొందాయి. జనం తెలుగు పాటల కోసం టీవీల ముందు కొలువు తీరేవారు. ఆ రోజుల్లో ప్రతివారం ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ 1988) పాట తప్పనిసరిగా ఉండేది. పండగల ముందు ఆయా పండగలకు తగ్గట్టుగా పాటలు ఉండేవి. అదే సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ‘ఆనందో బ్రహ్మ’ సూపర్హిట్ అయ్యింది. ఆదివారం రోజు అతి పాత తెలుగు చిత్రం వచ్చినా జనం విరగబడి చూసేవారు.అపురూప క్షణాలుఇంటి పైనా యాంటెనా, ఇంట్లో టీవీ ఉండటం ఎంతో గొప్పయిన రోజులు అవి. ఇక కలర్ టీవీ ఉన్న ఇంటికి డిమాండ్ జాస్తిగా ఉండేది. వాన వచ్చినా, గాలి వీచినా నిలువని బొమ్మతో వేగినా అదే పెద్ద సంబరం. ఇన్స్టాల్మెంట్లో కొని ఇంటికి టీవీ తెచ్చిన రోజు పండగ ఉండేది. మధ్యతరగతి జీవులకు తగినట్టుగా ‘మినీ టీవీ’లు కంపెనీలు తెచ్చాక వాటితోనే సర్దుబాటు చేసుకున్న సన్నజీవులెందరో. దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్తో సహా దూరదర్శన్ అందరికీ అభిమాన పాత్రమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా సబ్టైటిల్స్తో చూసేవారు. అలా ఎన్నో ఉత్తర కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు చూశారు. టీవీ ప్రసారాల వల్ల ఇరుగిల్లు పొరుగిల్లు ఒకే ఇల్లయినట్టుగా అందరూ కలిసి మెలిసి ఉండేవారు. టీవీలో క్రికెట్ లైవ్ చూడటానికి ఎంతో మంచిగా వ్యవహరించాల్సి వచ్చేది. స్నేహాలు చేయాల్సి వచ్చేది.ఇప్పుడు చేతిలో ఫోన్. అనుక్షణం రీల్స్. చేతిలోనే కదిలే బొమ్మ. దేనికీ విలువ లేదు. ఓటీటీల్లో వందల సినిమాలు ఉన్నా దేనిని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఏదీ నచ్చదు. కానీ ఆ రోజుల్లో వచ్చిందే నచ్చేది. అతిగా లభ్యమైనది ఏదైనా విలువ కోల్పోతుంది. ఇవాళ విజువల్ ఎంటర్టైన్మెంట్ వేయి రూ పాలు సంతరించుకున్నా, ఇరవై నాలుగ్గంటల న్యూస్ చానల్స్ ఉన్నా అవన్నీ జల్లెడలో జారే ఊకలానే ఉంటున్నాయి. టెలివిజన్ ప్రసారాల ప్రొఫెషనలిజమ్, హుందాతనం, ఆ న్యూస్రీడర్లు, ఆ యాంకర్లు... ఆ మాట... ఉచ్చారణ... పలుకు... ఇప్పుడెక్కడ. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది.
పెద్దల్లోనూ యువతలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులు
తెలంగాణలో దీర్ఘకాలిక రుగ్మతలు (NCDs) రెండు వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయోవృద్ధుల్లోనే కాకుండా, ఇప్పుడిప్పుడే యువతలోనూ ఇవే వ్యాధులు వేగంగా పెరుగుతున్నట్టుగా తాజా అధ్యయనాలు చూపిస్తున్నాయని డా. జీషాన్ అలీ తెలిపారు.హైదరాబాద్లో తాజా సర్వే వివరాల ప్రకారం:60 ఏళ్లు దాటినవారిలో దాదాపు సగం మంది రక్తపోటుతో బాధపడుతున్నారునలుగురిలో ఒకరికి డయాబెటిస్తో బాధపడుతున్నారు సుమారు 44% శాతం మందికి ఊబకాయం సమస్యఇలా డయాబెటిస్, బీపీతో 30 నుంచి 40 ఏళ్ల పాటు జీవించడం ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. పెద్దవారు సులభంగా తట్టుకునే కొన్ని మందులు, చిన్న వయసు నుంచే ప్రారంభిస్తే.. పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.యువతలో పెరుగుతున్న జీవనశైలి రుగ్మతలుగతంలో 50 నుంచి 60 ఏళ్ల తర్వాత కనిపించే జీవనశైలి వ్యాధులు డయాబెటిస్, హైపర్టెన్షన్, హార్ట్ సమస్యలు ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్లకే నిర్ధారణ అవుతున్నాయని వైద్యులు తెలిపారు. చిన్న వయసులోనే ఈ రుగ్మతలతో 30–40 ఏళ్లు జీవించడం భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంహైదరాబాద్ ప్రజల ఆహారపు అలవాట్లలో అధిక కొవ్వు, తక్కువ ఫైబర్ ఉండటం, పైగా రోజురోజుకూ పెరుగుతున్న కూర్చునే జీవనశైలి ఇవే యువతలోనే దీర్ఘకాలిక రుగ్మతలు వేగంగా పెరగడానికి కారణం అఅని అమెరికాలోని Physicians Committee for Responsible Medicine (PCRM)కు చెందిన పోషకాహార నిపుణుడు డా. జీషాన్ అలీ తెలిపారు.ఇటీవల ఎం. ఎన్. ఆర్. మెడికల్ కాలేజీలో జరిగిన హెల్త్ సైన్స్ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులతో డాక్టర్ జీషాన్ అలీ మాట్లాడుతూ.. తృణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లపై ఆధారపడిన ప్లాంట్-బేస్డ్ ఆహారం భుజించడం, జీవనశైలిలో మార్పులు తదితరాలు మెటాబాలిక్ రిస్క్లను గణనీయంగా తగ్గించగలదని పేర్కొన్నారు. అంతేగాదు ఇటీవల 48 మంది హృదయ రోగులపై నిర్వహించిన ఐదేళ్ల అధ్యయన వివరాలను కూడా వెల్లడించారు.తక్కువ కొవ్వు ఉన్న శాకాహారాన్ని పాటిస్తూ, తేలికపాటి కార్డియో వ్యాయామం చేసిన వారిలో రక్తనాళాల ఇరుకుదనం స్పష్టంగా తగ్గిందని చెప్పారు. మొదటి ఏడాదిలో 1.75 శాతం మెరుగుదల కనిపించగా, ఐదేళ్లకు ఇది 3.1 శాతానికి చేరిందన్నారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులు చేయకుండా కేవలం సాధారణ వైద్య చికిత్స మాత్రమే తీసుకున్న రోగుల్లో వ్యాధి మరింతగా పెరిగినట్టు అధ్యయనం వెల్లడించిందని తెలిపారు.(చదవండి: కొత్తిమీర పంటతో జస్ట్ 30 రోజుల్లోనే రూ.లక్ష లాభం!.. శెభాష్)
అంతర్జాతీయం
బాప్రే..! గాజాలో బయటపడ్డ అత్యంత భారీ టన్నెల్
హమాస్ను అంతం చేసే లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించి గాజా, లెబనాన్లో దాడులు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) గుర్తించాయి. గాజాలో ఇప్పటిదాకా బయటపడ్డ అత్యంత భారీ సొరంగం ఇదే కావడం గమనార్హం. సుమారు 7 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్లో హమాస్ కీలక నేతలు తలదాచుకోవడంతో పాటు ఇజ్రాయెల్ అమర సైనికుడు హదర్ గోల్డిన్ను ఇక్కడే బంధీగా ఉంచినట్లు నిర్ధారించుకున్నారు.ఫిలడెల్ఫి కారిడార్ సమీపంలోని జనసాంద్రత గల నివాస ప్రాంతాల కిందుగా.. 25 మీటర్ల లోతుతో యూఎన్ఆర్డబ్ల్యూఏ కంపౌండ్, మసీదులు, క్లినిక్స్, స్కూళ్లు లాంటి సున్నితమైన ప్రాంతాల గుండా ఈ టన్నెల్ ఉంది. ఏకంగా ఓ నగరాన్నే నిర్మించుకున్నారని.. లోపల అత్యంతక్లిష్టమైన పరిస్థితులు ఉన్నట్లు ఇజ్రాయెల్ బలగాలు వెల్లడించాయి.టన్నెల్ లోపల.. అందంగా గోడలను నిర్మించారు. వాటి నిర్మాణానికి టైల్స్ వాడారు. దాక్కోవడానికి వీలుగా సుమారు 80 గదులు, వెస్ట్రన్ టాయ్లెట్లతో కూడిన బాత్రూమ్లు, కమాండ్ కంట్రోల్ రూమ్లు, దీర్ఘకాలిక నివాసాలతో పాటు భారీగా ఆయుధ నిల్వలు గుర్తించారు. రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ షబానె సహా హమాస్ సీనియర్ కమాండర్లు ఈ సొరంగాన్ని ఉపయోగించినట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు.. ఈ సొరంగంలో గతంలో అపహరించబడిన ఐడీఎఫ్ అధికారి లెఫ్టినెంట్ హదర్ గోల్డిన్ను ఉంచినట్లు గుర్తించారు. ఆయనకు సంబంధించిన వస్తువులూ లభించినట్లు వెల్లడించారు.యహలోమ్ యూనిట్, షయెటెట్ 13, 162వ డివిజన్, గాజా డివిజన్ బలగాలు కలిసి ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించాయి. ఈ ఆపరేషన్ ద్వారా గాజాలో హమాస్ ఉగ్రవాదుల భూగర్భ నెట్వర్క్ ఎంత విస్తృతంగా, ఎంత క్లిష్టంగా ఉందో మరోసారి బయటపడింది. ఆపై ఆ భారీ సొరంగాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. గాజాలోని పౌరులపై ముప్పును తొలగించేందుకు సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో ఆపరేషన్లు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఐడీఎఫ్ ఉద్ఘాటించింది. The ‘Israeli’ military published on Thursday video footage of what it says is a sprawling Hamas tunnel network in southern Gaza's Rafah area, where the remains of Hadar Goldin had been stored by the group for several years.The tunnel, described by the ‘Israeli’ military as one… pic.twitter.com/QNmORbuB9A— Roya News English (@RoyaNewsEnglish) November 20, 2025హదర్ గోల్డిన్ విషాదం.. #عاجل الكشف عن المسار التحت الأرضي الذي احتجز فيه الملازم أول هدار غولدين والذي امتد لأكثر من 7 كم طولاً وما يقارب 80 غرفة مكوث⭕️في إطار عملية لقيادة المنطقة الجنوبية شاركت فيها وحدة "يهلوم" ووحدة 13 للكوماندوز البحري اكتشفت قوات جيش الدفاع المسار التحت الأرضي الذي احتجز فيه… pic.twitter.com/8DRcLETYhb— افيخاي ادرعي (@AvichayAdraee) November 20, 2025హదర్ గోల్డిన్(Hadar Goldin).. 1991లో సిమ్హా గోల్డిన్-డాక్టర్ లియా గోల్డిన్ దంపతులకు జన్మించారు. ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) లెఫ్టినెంట్. 2014 గాజా యుద్ధంలో ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్లో ఆయన పాల్గొన్నారు. అమెరికా, ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన రెండు గంటలకే హమాస్ ఉగ్రవాదులు గోల్డిన్ను అపహరించారు. ఆపై తాజాగా బయటపడ్డ సొరంగంలో బంధించారు. అప్పటికి ఆయన వయసు 23 సంవత్సరాలు. అయితే..సొరంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన హతమైనట్లు హమాస్ ప్రకటించింది(ఎప్పుడనేది స్పష్టత ఇవ్వలేదు). ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని గాజాలో ఉంచారు. దాదాపు 11 ఏళ్లపాటు అతని తల్లిదండ్రులు పోరాటం చేశారు. 4,118 రోజుల తర్వాత(2025 నవంబర్ 9న) ఆయన మృతదేహం అవశేషాలు ఇజ్రాయెల్కు తిరిగి చేరాయి. నవంబర్ 11న క్ఫార్ సాబా సైనిక సమాధి స్థలంలో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. ఇజ్రాయెల్ చరిత్రలో అత్యధిక కాలం బంధించబడిన సైనికాధికారిగా ఈయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. గోల్డిన్ కథ ఇజ్రాయెల్ సైనికుల త్యాగానికి ప్రతీకగా నిలిచిపోయింది.
థాయ్లో ఫెర్రీ ప్రమాదం..100 మంది సురక్షితం
బ్యాంకాక్: థాయ్లాండ్లో ప్రముఖ పర్యాటక ప్రాంతం నుంచి ట్రాట్ ప్రావిన్స్లోని ప్రధాన భూభాగం వైపు వస్తున్న ఫెర్రీ ప్రమాదంలో చిక్కుకుంది. సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగం సిబ్బంది సహా మొత్తం 100 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో, పెనుప్రమాదం తప్పినట్లయిందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ సంస్థకు చెందిన ఫెర్రీ గురువారం పర్యాటక ప్రాంతమైన కోహ్ కూద్ నుంచి ట్రాట్ నగరం వైపు బయలుదేరింది. దాదాపు 40 కిలోమీటర్ల దూరానికి గాను మధ్యలోకి వచ్చేసరికి ఫెర్రీకి రంధ్రం పడి లోపలికి నీరు చేరడం మొదలైంది. సముద్రంలో భారీ అలలు ఎగసి పడుతుండటంతో అప్రమత్తమైన సిబ్బంది ఫెర్రీకి లంగరేసి అధికారులకు ప్రమాద సందేశాన్ని పంపించారు. సమాచారమందుకున్న ఇతర ఫెర్రీల నిర్వాహకులు, సమీప బోట్లలోని మత్స్యకారులతోపాటు నేవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గంట వ్యవధిలోనే ఫెర్రీలో ఉన్న 97 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం ఫెర్రీలోని నీటిని తోడివేసి, తీరానికి తీసుకెళ్లారు.
నైపుణ్యం కలిగిన వలసదారులను స్వాగతిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: వలసదారులపై ఇన్నాళ్లూ కఠిన వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. అమెరికాకు వారి అవసరమేంటో ఆయనకు ఎట్టకేలకు తెలిసొచ్చింది. నైపుణ్యం కలిగిన వలసదారులను కచ్చితంగా స్వాగతిస్తామని చెప్పారు. కంప్యూటర్ చిప్స్, క్షిపణులు లాంటి సంక్లిష్టమైన ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో అమెరికన్ కార్మీకులకు వలసదారులు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు గతంలో మద్దతు ఇచ్చానని గుర్తుచేశారు. ఇప్పుడు వలసదారులకు పెద్దపీట వేస్తే స్వదేశంలో కొందరి నుంచి వ్యతిరేకత రావొచ్చని అన్నారు. వ్యతిరేకతను భరిస్తానని చెప్పారు. బుధవారం యూఎస్–సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ట్రంప్ మాట్లాడారు. దేశ ఆర్థిక ప్రగతి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, మిస్సైల్స్ వంటి కంపెనీల్లో పని చేయడానికి నిపుణులైన వలసదారులు కావాలని తెలిపారు. వారి పరిజ్ఞానం తమ కార్మీకులకు ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. వస్తువుల ఉత్పత్తికి అవసరమైన మానవ వనరులను విదేశాల నుంచి రప్పించుకోవచ్చని అమెరికా సంస్థలకు ట్రంప్ సూచించారు. వేలాది మంది వచ్చినా తప్పకుండా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.ఈ విషయంలో నన్ను క్షమించాలి వలసదారుల రాకను వ్యతిరేకించేవారు నిజంగా చాలా తెలివైనవారు, నమ్మశక్యంకాని దేశభక్తులు అని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. అయితే, అమెరికా కార్మీకులకు నైపుణ్యాలు నేరి్పంచాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. మన కంపెనీల్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేవారిని అనుమతించకపోతే మనం విజయవంతమైన వ్యక్తులుగా ఎప్పటికీ ఎదగలేమని తేలి్చచెప్పారు. ఒక పెద్ద కంపెనీ ఏర్పాటై, ఉత్పత్తి ప్రారంభం కావాలంటే విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు, ఉద్యోగులు రావాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ విషయంలో తనను క్షమించాలని కోరారు. మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్)ను ఇప్పటికీ ఆరాధిస్తున్నానని, విదేశాల నుంచి మనకు కావాల్సిన నిపుణులను రప్పించుకోవడం కూడా ‘మాగా’అవుతుందని అమెరికా అధ్యక్షుడు వివరించారు. తనకు ఓటు వేసేవారి సంఖ్య తగ్గినా పట్టించుకోబోనని, చివరకు వారే అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు.
జీ20 శిఖరాగ్రంలో అమెరికా: దక్షిణాఫ్రికా
జొహన్నెస్బర్గ్: జీ20 శిఖరాగ్రం విషయంలో అమెరికా మనసు మార్చుకుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా చెప్పారు. ఇప్పటి వరకు శిఖరాగ్రాన్ని బాయ్కాట్ చేస్తామని చెప్పిన అగ్రరాజ్యం ఇప్పుడు పాల్గొనేందుకు సానుకూలత వ్యక్తపర్చిందని ఆయన అన్నారు. ఆఖరి క్షణంలో ఈ మేరకు తమకు సందేశం అందడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను మారుస్తున్నామన్నారు. మైనారిటీ శ్వేత జాతీయులపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నందున తాము ఆ దేశంలో జరిగే జీ20 శిఖరాగ్రాన్ని బహిష్కరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెల్సిందే. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
జాతీయం
గర్భధారణకు కారణమయ్యే... జెనెటిక్ స్విచ్
మహిళల్లో గర్భధారణకు అంకురార్పణ చేసే అత్యంత మౌలికమైన జెనెటిక్ స్విచ్ (జన్యు మీట)ను మన సైంటిస్టులు కనిపెట్టారు! పిండం గర్భాశయ ద్వారంలోకి సజావుగా చేరేందుకు వీలు కల్పించేది ఇదేనట! కనుక ఏ కోణంలో చూసినా దీన్ని జన్యు శాస్త్రంలోనే గాక ప్రసూతి వైద్యంలోనూ అతి పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. జన్యు శాస్త్ర ప్రస్థానాన్నే పునర్ నిర్వచించగలదని భావిస్తున్న ఈ కీలక పరిశోధనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ ప్రత్యుత్పత్తి, శిశు వైద్య పరిశోధన సంస్థ (ఎన్ఐఆర్ఆర్ సీహెచ్), ఇండియన్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ సైన్స్, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు సారథ్యం వహించడం విశేషం. పిండాన్ని తనలోకి స్వీకరించేందుకు గర్భాశయం సన్నద్ధం కావడం వెనక ఇమిడి ఉండే కీలకమైన కణజాల పనితీరును మన సైంటిస్టులు ఈ పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చారు. గర్భధారణ జరగాలంటే బుల్లి పిండం గర్భ సంచి మార్గంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని ఇంప్లాంటేషన్ గా పిలుస్తారు. గర్భధారణ దిశగా ఇది తొలి అడుగు మాత్రమే కాదు, ఒకరకంగా పునరుత్పత్తి ప్రక్రియ అంతటిలోనూ ఇదే అత్యంత కీలకం. గర్భ విచ్ఛిత్తికే గాక, చివరికి వంధ్యత్వానికి కూడా ఇంప్లాంటేషన్ లో వైఫల్యమే మూల కారణం!ఇలా చేశారు...హోక్సా10, ట్విస్ట్2 అనే రెండు కీలక జన్యువులను సైంటిస్టులు తమ పరిశోధన క్రమంలో గుర్తించారు. గర్భధారణ విషయంలో ఇవి రెండూ పరస్పర విరుద్ధ శక్తులుగా పని చేస్తూనే, అంతిమంగా అందుకు వీలు కల్పించడం విశేషం! ఎందుకంటే హోక్సా10 సాధారణంగా గర్భాశయ ద్వారాన్ని రక్షణాత్మక కణజాలాల సాయంతో నిత్యం మూసి ఉంచి కాపాడుతూ ఉంటుంది. ఇందుకోసం అది అనునిత్యం ఏకంగా 1,200 కణాలను నియంత్రిస్తూ ఉంటుంది. కానీ, సరిగ్గా పిండం ఆ ద్వారం వైపు వచ్చే వేళకు హోక్సా10 తాత్కాలికంగా స్విచ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. మరోలా చెప్పాలంటే దాని పనితీరు స్తంభిస్తుందన్నమాట. మరుక్షణమే ట్విస్ట్2 ఒళ్లు విరుచుకుని క్రియాశీలకం అవుతుంది. గర్భాశయ కణజాలాన్ని మృదువుగా మార్చి పిండం దాని ద్వారం గుండా సజావుగా లోనికి సాగేలా చేస్తుంది. హోక్సా10, ట్విస్ట్2 నడుమ సంబంధం వల్ల గర్భాశయ ద్వారం గట్టిదనం నుంచి మృదుత్వాన్ని, అవసరం తీరగానే తిరిగి యథాస్థితికి మారుతున్నట్టు ఇండియన్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం రూపొందించిన మ్యాథమాటికల్ రీ మోడలింగ్ లో తేలింది. అనంతరం ఎలుకల్లో ప్రయోగాత్మకంగా ట్విస్ట్2 కార్యకలాపాన్ని నిరోధించి చూడగా గర్భధారణ ప్రక్రియే నిలిచిపోవడాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు కాల్ డెత్ డిస్కవరీ జర్నల్ లో తాజాగా ప్రచురితమయ్యాయి.ప్రయోజనాలు ఎన్నెన్నో!ఈ జెనెటిక్ స్విచ్ ఉనికి వెలుగులోకి రావడానికి ఎంతో ప్రాధాన్యం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘ జన్యువులు, వాటి స్వరూప స్వభావాలు, పనితీరు తదితరాల గురించి మనకు ఇప్పటిదాకా తెలిసింది గోరంత అయితే తెలియాల్సిందేమో కొండంత. కీలకమైన జన్యు నెట్ వర్క్ తదితరాలపై మరింత అవగాహనకు జెనెటిక్ స్విచ్ వీలు కల్పించగలదు. తద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మెరుగైన చికిత్సతో పాటు తీవ్ర గాయాలను త్వరితంగా నయం చేయడం వంటివీ వీలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి‘ అని వారు వివరించారు. ‘కొన్నిసార్లు ఆరోగ్యకరమైన పిండం కూడా ఫలదీకరణ చెందడంలో విఫలమవుతుంటుంది. అందుకు కారణాలను అన్వేషించడంలో జెనెటిక్ స్విచ్ వ్యవస్థ ఉనికి ఎంతగానో తోడ్పడుతుంది. ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ చికిత్స ప్రక్రియలు మరింతగా విజయవంతం అయ్యేలా చేయగలదు‘ అని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్
నూతన ప్రపంచానికి నూతన ఐరాస: రాజ్నాథ్
లక్నో: ఇజ్రాయెల్–హమాస్, ఉక్రెయిన్– రష్యా వంటి సంక్షోభాలతోపాటు మానవీయ విపత్తులు వంటివి తలెత్తినప్పుడు ఐక్యరాజ్యసమితి మరింత సమర్థవంతమైన పాత్ర పోషించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నొక్కి చెప్పారు. నూతన ప్రపంచానికి, నూతన ఐక్యరాజ్యసమితి, నూతన అంతర్జాతీయ క్రమత అవసరముందని ఆయన పేర్కొన్నారు. సిటీ మాంటెస్సోరి స్కూల్ నిర్వహించిన ప్రపంచ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షోభాలతో నిండిన నేటి ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి కీలకంగా వ్యవహరించలేకపోతోందని ఆయన తెలిపారు. అగ్ర రాజ్యాల పలుకుబడి, ప్రపంచ సంక్లిష్ట రాజకీయాల కారణంగా ఐరాస అంతగా రాణించడం లేదని చెప్పారు. ఈ సంస్థ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నూతన ఐరాస అంటే కొత్తగా మరో సంస్థను ఏర్పాటు చేయడం కాదు, నూతన శక్తిని సంతరించుకున్న ఐక్యరాజ్యసమితి అని ఆయన వివరించారు.
పూర్తి సంతృప్తితో వెళ్తున్నా..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రజలకు తన వంతు సేవలు అందించానని, పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేయబోతున్నానని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నాలుగు దశాబ్దాల ఈ ప్రస్థానం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. న్యాయరంగ విద్యారి్థగానే తన ప్రయాణానికి ము గింపు పలుకబోతున్నానని తెలిపారు. జస్టిస్ గవాయ్ ఈ నెల 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. శుక్రవారం చివరి పని దినం పూర్తిచేసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టులో సెర్మోనియల్ బెంచ్ నిర్వహించారు. జస్టిస్ గవాయ్తోపాటు బెంచ్ సభ్యులైన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్ గవాయ్కి ఘనంగా వీడ్కోలు పలికారు. పూర్తి సంతృప్తి, సంతోషంతో సుప్రీంకోర్టును వీడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి తాను చేయగలిగినదంతా చేశానని ఉద్ఘాటించారు. పదవిని సేవగానే భావించాలి ప్రతి న్యాయమూర్తి, ప్రతి న్యాయవాది, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ సూత్రాలకు లోబడి పనిచేయాలని జస్టిస్ గవాయ్ సూచించారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాన్ని భారత రాజ్యాంగం బోధిస్తోందని గుర్తుచేశారు. రాజ్యాంగానికి కట్టుబడి తన విధులను చిత్తశుద్ధితో నిర్వ ర్తించడానికి కృషి చేశానని పేర్కొన్నారు. 1985లో ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రవేశించానని, తద్వారా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టానని గుర్తుచేసుకున్నారు. ఈరోజు న్యాయరంగ విద్యార్థిగానే పదవీ విరమణ చేస్తున్నానని తెలిపారు. రికార్డుకెక్కిన జస్టిస్ గవాయ్జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఈ ఏడాది మే 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలలకుపైగా సేవలందించారు. రెండో దళిత సీజేఐగా, మొదటి బౌద్ధ మతస్తుడైన సీజేఐగా ఆయన రికార్డుకెక్కారు. వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్, అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ తదితరులు మాట్లాడారు. జస్టిస్ గవాయ్ మహోన్నతమైన సేవలందించారని కొనియాడారు. ఒక సామాన్యుడు నిరంతర కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని నిరూపించారని ప్రశంసించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మరో వీడ్కోలు కార్యక్రమంలోనూ జస్టిస్ గవాయ్ పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల్లో(ఎస్సీ) క్రీమీలేయర్పై ఇచ్చిన తీర్పుతో సొంత సామాజికవర్గం నుంచి ఆగ్రహం ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో క్రీమీలేయర్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించకూడదని తాను ఇచ్చిన తీర్పు ఎస్సీలో చాలామందికి నచ్చలేదని అన్నారు.
కుప్పకూలిన తేజస్
న్యూఢిల్లీ/దుబాయ్: దుబాయ్ వైమానిక ప్రదర్శనలో పెనువిషాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో తేజస్ పైలట్ మృతి చెందినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. తేజస్ ఎంకే1 కూలిపోయి మంటలు చెలరేగిన దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో భాగంగా టేకాఫ్ తీసుకున్న ఈ ఫైటర్ జెట్ హఠాత్తుగా కిందికి దిగింది. నేలను తాకగానే బంతి ఆకారంలో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ వెలువడింది. పైలట్, వింగ్ కమాండర్ నమాన్‡్ష సయాల్ అక్కడికక్కడే మరణించారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన జనం ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు. చాలాసేపటి దాకా షాక్లోనే ఉండిపోయామని చెప్పారు. ప్రమాదం జరగ్గానే అగి్నమాపక, అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేశారు. సంతాపం ప్రకటించిన సీడీఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దుబాయ్ ఎయిర్ షోలో వివిధ దేశాలకు చెందిన విమానాలు, ఫైటర్ జెట్లు పాల్గొంటున్నాయి. ఐఏఎఫ్కు చెందిన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్(ఎల్సీఏ) తేజస్ ఎంకే1 కూడా ఇందులో చేరింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.10 గంటలకు విన్యాసాల్లో భాగంగా అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ కాగానే ప్రమాదం జరిగినట్లు భారత వైమానిక దళం ‘ఎక్స్’లో వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన పైలట్ ఘటనా స్థలంలోనే మృతిచెందారని పేర్కొంది. ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని, బాధితుడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని, అన్నివిధాలుగా అండగా ఉంటామని వివరించింది. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తుకు ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సైతం స్పందించారు. పైలట్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తేజస్ విమాన ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోవడం పట్ల సీడీఎస్తోపాటు సైనిక దళాల్లోని అన్ని ర్యాంకుల అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టుచేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్లో ప్రతి రెండేళ్లకోసారి ఎయిర్ షో నిర్వహిస్తుంటారు. రకరకాల విమానాలను ఇందులో ప్రదర్శిస్తుంటారు. విమానాల విన్యాసాలు సైతం ఉంటాయి. ఈసారి 150 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. భారత వైమానిక దళం నేతృత్వంలోని సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఈ ఎయిర్షోలో విజయవంతంగా విన్యాసాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు తేజస్ యుద్ధ విమానం కూలిపోవడం విషాదాన్ని నింపింది. ఆయిల్ లీకేజీ వల్లేనా? తేజస్ ఫైటర్జెట్ కూలిపోవడం గత 24 ఏళ్లలో ఇది కేవలం రెండోసారి మాత్రమే. ప్రమాదం ఎలా జరిగిందో గుర్తించడానికి నిపుణులు ప్రయతి్నస్తున్నారు. దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొంటున్న తేజస్ ఎంకే1 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో చమురు లీక్ అవుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ప్రభుత్వం ఖండించింది. అలాంటిదేమీ లేదని, అంతా సవ్యంగానే ఉన్నట్లు వివరణ ఇచ్చింది. ఇంతలోనే ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. చమురు లీక్ వల్లే కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇంజన్లో మంటలు అంటుకోవడం వల్లే తేజస్ అదుపుతప్పి నేలకూలినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏమిటీ తేజస్? తేజస్ను బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) ఉమ్మడిగా చాలావరకు దేశీయ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేశాయి. ఇది సింగిల్–ఇంజన్, మల్టీ–రోల్ ఫైటర్జెట్. 2003లో తేజస్ అని అధికారికంగా పేరుపెట్టారు. ఇందులోని ఇంజన్మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. భారత వైమానిక దళం ప్రస్తుతం ఎంకే1 వేరియంట్ తేజస్ను ఉపయోగిస్తోంది. అత్యాధునిక ఎంకే1ఏ వేరియంట్ కోసం ఎదురు చూస్తోంది. తేజస్ విమానం షార్ట్–రేంజ్ క్షిపణులను, ఆకాశం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను మోసుకెళ్లగలదు. ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకోగలదు. 2020 అక్టోబర్లో తేజస్ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. తర్వాత సరిచేశారు. తేజస్ను వైమానిక దళంలో కీలక అస్త్రంగా పరిగణిస్తుంటారు. ఏడాది క్రితం ప్రమాదం 2024 మార్చి నెల లో ‘భారత్ శక్తి’ ప్రదర్శనలో భాగంగా రాజస్తాన్లోని పోఖ్రాన్లో విన్యాసాలు నిర్వహించి వెనక్కి తిరిగివస్తుండగా తేజస్ విమానం కూలిపోయింది. జైసల్మేర్ సమీపంలోని ఓ కాలనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పైలట్ క్షేమంగా బయటపడ్డాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తేజస్ జెట్లు 2001లో విధుల్లో చేరగా, కూలిపోవడం అదే మొదటిసారి. తాజాగా దుబాయ్లో జరిగిన ప్రమాదం రెండోది.
ఎన్ఆర్ఐ
ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు.
బహ్రెయిన్లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి
ముగ్గురు కళాశాల డ్రాపౌట్లు 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి ప్రవేశించారు. తద్వారా మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ రికార్డును చెరిపేశారు. ఫోర్బ్స్ ప్రకారం, మెర్కోర్ (Mercor )అనే AI-ఆధారిత రిక్రూటింగ్స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురుస్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా,ప్రపంచంలోనే అతి చిన్న బిలియనీర్లుగా నిలిచారు. ఈ ముగ్గురూ, స్వయంకృషితో బిలయనీర్లుగా ఎదిగారు. వీరిలో హిరేమత్ భారతీయసంతతికి చెందినవాడు కావడం విశేషం. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మెర్కోర్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 88,560.68 కోట్లకు (10 బిలియన్ డాలర్లు)గా ఉంది. 350 మిలియన్ల డాలర్ల తాజా నిధులతో కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి ఎగిసింది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా ఈ ముగ్గురూ నిలిచారు. మెర్కోర్ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.ఈ ముగ్గురి ప్రయాణంకాలిఫోర్నియాలోని శాన్జోస్లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బోయిస్ స్కూలు నుంచే మొదలైంది.అక్కడ డిబేట్ టీమ్లో టాప్ మెంబర్స్గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచు కున్న తొలి వ్యక్తులు.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో మెర్కోర్పై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి చదువును విడిచి పెట్టాల్సి వచ్చింది. మెర్కోర్లో పని చేయకపోతే, రెండు నెలల క్రితమే పట్టభద్రుడయ్యేవాడినని, ఇంతలోనే తన జీవితం 180-డిగ్రీల యు-టర్న్ తీసుకుందని పేర్కొన్నాడు. అలాగే సూర్య మిధా జార్జ్టౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్న సమయంలోనే బ్రెండన్ ఫుడీని కలిశాడు. దీంతో హిరేమత్తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు. అలా వారి అభిరుచులు కలిసి, నైపుణ్యాన్ని మేళవించి మెర్కోర్ నాంది పలికింది. ప్రపంచ రికార్డుకు దారి తీసింది.
అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావుకి అరుదైన గౌరవం
ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావు కావేటిని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అంతర్జాతీయ న్యాయ సేవల్లో విశేష కృషి చేసినందుకు గాను డా. శ్రీనివాస్ రావు కావేటికి ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ ఇంటర్నేషనల్ కౌన్సెల్ లీడర్షిప్ ఇన్ ది యూఎస్ ఆఫ్ 2025’ అవార్డు దక్కింది. ‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ డా. శ్రీనివాస్ రావు కావేటికి ఈ అవార్డును అందించింది.‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ అందించిన ఈ గౌరవం, భారతీయ చట్టాలను అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలతో సమన్వయం చేయడంలో డా. కావేటి చేసిన అసాధారణ కృషికి దక్కిన గుర్తింపు అని చెప్పవచ్చు. అంతర్జాతీయ న్యాయ సేవలలో కావేటి లా సంస్థ ఎంతో పేరొందింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా అడుగుపెట్టిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాలలో సొలిసిటర్గా, నోటరీ పబ్లిక్గా సేవలందించారు.ఆయన స్థాపించిన కావేటి లా ఫర్మ్.. అమెరికా, భారతదేశం, యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో సేవలందిస్తోంది. కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, బిజినెస్ ఇమ్మిగ్రేషన్ వంటి కీలక రంగాలలో సరిహద్దులు దాటి క్లయింట్లకు సేవలను అందిస్తోంది. ఒకే గొడుగు కింద స్థానిక, అంతర్జాతీయ న్యాయ సేవలను అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు న్యాయ విద్యతో పాటు ఎంబీఏ, జర్నలిజంలో మాస్టర్స్ పట్టాలను కూడా పొందారు. న్యాయ విద్యార్థులకు, చార్టర్డ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తూ గ్లోబల్ ఎడ్యుకేటర్గా కూడా ఆయన గుర్తింపు పొందారు.(చదవండి: ఘనంగా 'ఆటా' 19 మహాసభలు కిక్ ఆఫ్ వేడుడ
క్రైమ్
iBomma Ravi: లీకులు లేకుండా టాప్ సీక్రెట్గా..
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో కస్టడీ విచారణ మూడో రోజుకి చేరింది. అత్యంత గోప్యంగా, ఎలాంటి లీకులు లేకుండా సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి వివరాలు రాబడుతున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నత స్థాయి అధికారులే స్వయంగా ఈ విచారణను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పైరసీ కేసులో నిందితుడు ఇమ్మడి రవికి సంబంధించిన ఆరు అకౌంట్ల వివరాల కోసం బ్యాంకు అధికారులకు సీసీఎస్ లేఖ రాసింది. ఇప్పటికే డబ్భుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు ఒప్పుకున్న రవి.. 1xbet యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించాడు. అలాగే.. మూవీ రూల్జ్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశానని.. అందుగానూ క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్జ్కి డబ్బులు చెల్లించానని రవి పోలీసులకు తెలిపాడు. దర్యాప్తులో రవి తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్సైట్ను బెట్టింగ్ యాప్స్కి గేట్ వే చేసి.. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతోనే రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఫ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ని పోస్ట్ చేసేవాడని.. కరేబియన్ దీవుల్లో ఆఫీస్ ఏర్పాటు చేసి ఏకంగా 20 మంది యువకుల్ని రవి నియమించినట్లు తెలుస్తోంది. అయితే రెండ్రోజులపాటు జరిగిన విచారణలో రవి నుంచి కొద్దిపాటి సమాచారాన్నే మాత్రమే సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో రవి నెట్ వర్క్ పై లోతైన విచారణ జరుపుతున్నారు. రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు.
కథ ముగిసింది... కల చెదిరింది...
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా మృతితో విప్లవ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం అలముకుంది. రాజ్యాంగ పరిధిలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి కగార్ను ఆపేయాలంటూ లేఖ విడుదల చేశాయి. సాయుధ పోరాటం మరో కొత్త రూపం తీసుకుంటుందని చెబుతూ.. రాబోయే మార్పునకు ముందస్తు సంకేతాలను విప్లవ శ్రేణులు అందిస్తున్నాయి. ఇదే సమయాన హిడ్మా మరణంతో దేశంలో మావోయిస్టులది ముగిసిన అధ్యాయమేనంటూ కమ్యూనిస్టు వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కగార్ మొదలయ్యాక జరిగిన నష్టాలన్నీ ఒక ఎత్తయితే.. హిడ్మా మరణం మరో ఎత్తు అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.మీడియాకు హాట్ టాపిక్హిడ్మాకు ముందు తరం మావోయిస్టులు.. పోలీసులు, అటవీ శాఖతోనే ఎక్కువగా పోరాడగా, ఏకంగా పారా మిలిటరీ సైన్యానికే సవాల్ విసిరిన చరిత్ర హిడ్మాది. అంబూష్ దాడులు చేసి జవాన్లనే బందీలుగా పట్టుకున్న తీరు ఇప్పటికీ ఆశ్చర్యకరమే. ఈ బందీలను విడిపించేందుకు మరోసారి అడవిలోకి వెళ్లే సాహసం పారా మిలిటరీ బలగాలే చేసేవి కావు. మీడియా ప్రతినిధుల ద్వారానే బందీలను విడిపించుకునేవి. అందుకే మీడియా వర్గాలకు హిడ్మా ఒక హాట్ టాపిక్గా మారాడు. దీంతో టాస్క్ఫోర్స్, జాయింట్ టాస్క్ఫోర్స్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా వంటి ప్రత్యేక దళాల అవసరం పడింది. బీఎస్ఎఫ్, ఐటీబీటీల వంటి మిలిటరీ విభాగాలను రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా పట్టు దొరక్క.. మాజీ మావోయిస్టులతో ఏర్పడిన డీఆర్జీ వంటి లోకల్ దళాలు కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో భాగమయ్యాయి.మిలిటరీ అయినా జాగ్రత్తలు తప్పలేదుహిడ్మా నేతృత్వాన చేసిన దాడులతోనే పీఎల్జీఏకు భారీ ఎత్తున ఆధునిక ఆయుధాలు సమకూరాయి. ఆయన అండతోనే దక్షిణ బస్తర్ సబ్జోన్గా పేర్కొనే సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జనతన సర్కార్లు ఏర్పాటయ్యాయి. ఈ సర్కార్లను నిర్వీర్యం చేసేందుకు జోన్లో ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒక క్యాంపు వంతున ఏర్పాటు వ్యూహాన్ని బలగాలు అమలు చేశాయి. అయితే, దేశంలో మిగిలిన క్యాంప్లతో పోలిస్తే అత్యంత కట్టుదిట్టమైన రక్షణ చర్యలు ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ప్రతీ క్యాంపు చుట్టూ ప్రహరీ, అవతల ట్రెంచ్తో పాటు మూడు వరుసల ముళ్ల కంచెలు ఉంటాయి. ప్రతీ క్యాంప్ చుట్టూ నలువైపులా రెండు ఎకరాలకు విస్తీర్ణానికి తగ్గకుండా చుట్టూ దట్టంగా ఉన్న అడవిని నరికి మైదాన ప్రాంతంలా మార్చి, నలువైపులా రాత్రి పూట స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేశారు. రాకెట్ లాంచర్లతో దాడి జరిగితే నష్టాన్ని తగ్గించేందుకు వీలుగా క్యాంప్లో ఉండే రేకుల షెడ్డు బ్యారక్లపైన ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. రాత్రివేళ దాడులను అరికట్టేందుకు ఆకాశంలో వెలుతురు విరజిమ్మే ఫ్లవర్ బాంబులను అందుబాటులో పెట్టారు. దాడుల్లో గాయపడిన జవాన్లకు సత్వర వైద్యసాయం అందించేందుకు వీలుగా ప్రతీ క్యాంప్లో ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాయంతోనే కూంబింగ్లు చేపట్టారు. మందుపాతరలను కనిపెట్టేందుకు స్నైపర్ డాగ్స్ను కూంబింగ్లో తోడుగా తీసుకెళ్తున్నారు.మావో బాటలో గెరిల్లా వార్మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణం, పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు ఆయుధాలతో సహా లొంగిపోగా.. మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు ఏకంగా 210 మంది అనుచరులతో అడవిని వీడాడు. ఇలా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా విప్లవ శ్రేణుల్లో ఆశలు కొడిగట్టిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం మడ్వి హిడ్మా. ఆయన ఉంటే చాలు సాయుధ పోరాటం మళ్లీ గాడిన పడుతుందనే నమ్మకం వారిలో ఉండేది. మార్క్స్, లెనిన్ తదితర విప్లవ గురువులు చెప్పిన కమ్యూనిజం గురించి హిడ్మాకు పెద్దగా తెలియదంటూ మాజీ మావోలు, ఛత్తీస్గఢ్ పోలీస్ బాస్లు, స్థానిక ఆదివాసీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేసేవారు. అయినప్పటికీ హిడ్మాపై విప్లవకారులు నమ్మకం కోల్పోలేదు. ఎందుకంటే మావో సేటూంగ్ చూపిన గెరిల్లా యుద్ధతంత్రాన్ని అమలుచేస్తూ సాయుధ పోరాటాన్ని దండకారణ్యంలో మరో ఎత్తులకు తీసుకెళ్లింది హిడ్మానే. అందుకే ఆయన మరణంతో సాయుధ పోరాటం రూపురేఖలు, దశాదిశ మారిపోయే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పైలట్పై లైంగిక దాడి కేసు నమోదు
హైదరాబాద్: బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో విమాన పైలట్గా పనిచేస్తున్న యువతిపై అదే సంస్థలో పైలట్ అయిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బెంగుళూరులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు బెంగుళూరు హలసూరు పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు బేగంపేటలో ఓ ఏవియేషన్ సంస్థలో యువతి (26)తో పాటు రోహిత్ శరణ్ (60) అనే వ్యక్తి కమర్షియల్ పైలట్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల సంస్థకు చెందిన పని నిమిత్తం యువతితో పాటు రోహిత్శరణ్ బెంగుళూరుకు వెళ్లారు. అక్కడి హోటల్ గదిలో యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ప్రతిఘటించిన యువతి అక్కడి నుంచి పారిపోయి నగరానికి చేరుకుంది. రోహిత్శరణ్ తనతో వ్యవహరించిన తీరు పట్ల బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రోహిత్ శరణ్పై కేసు నమోదు చేసిన పోలీసులు కేసును బెంగళూరుకు బదిలీ చేశారు.
భార్య.. భర్త.. ఓ ప్రియురాలు
నెల్లూరు జిల్లా: మండల కేంద్రమైన కలిగిరి పోలీస్స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఏపినాపి గ్రామానికి చెందిన కోటపాటి విష్ణువర్ధన్కు ఎనిదేళ్ల క్రితం సరితతో వివాహమైంది. వారికి ఒక కుమార్తె ఉంది. విష్ణువర్ధన్ అనకాపల్లిలో ఇటుకబట్టీల వద్ద పని చేస్తున్నాడు. అక్కడ ధనలక్ష్మి అనే మహిళ పనిచేసేది. ఆమె భర్త నుంచి విడిపోయింది. విష్ణు, ఆమెకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ధనలక్ష్మిని తీసుకుని విష్ణు ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్లాడు. కాగా అనకాపల్లిలో ధనలక్ష్మి అదృశ్యంపై కేసు నమోదైంది. భర్త కనిపించడం లేదని సరిత ఫిర్యాదుతో కలిగిరి పోలీసులు విచారణ చేసి పామూరులోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. వారిని కలిగిరికి తీసుకొచ్చారు. అనకాపల్లి నుంచి వచ్చిన పోలీసులు ధనలక్ష్మిని వాహనంలో తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రియురాలిని తన నుంచి దూరం చేస్తున్నారంటూ విష్ణుఫర్టిలైజర్ దుకాణం నుంచి పురుగు మందు తీసుకొచ్చి రోడ్డుపై తాగాడు. వెంటనే సరిత, ఇతర కుటుంబ సభ్యులు అతడిని కలిగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం విష్ణు పరిస్థితి నిలకడగా ఉంది.
వీడియోలు
AP: అరటి తోటను ట్రాక్టర్తో దున్నేస్తున్న రైతు.
ఈనెల 26వ తేదీ నుంచి ఏపీలో పలు చోట్ల వర్షాలు
Magazine Story : 11 ఏళ్లయ్యింది! రాహులో రాహులా!!
Garam Garam Varthalu: రూపాయికే చికెన్..
Garam Garam Varthalu: ఎవరైతే నాకేంటి..! మంత్రి గారింట్లో దూరిన పులి
Garam Garam Varthalu: ఊరంతా చీరలు పంచి పెళ్ళికి రమ్మని ఆహ్వానం
Gankala Kavitha: పార్టీ ఏదైనా వైఎస్ జగన్ చేసిన మంచి చెప్పాల్సిందే
విద్యావ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి: హరీశ్ రావు
మ్యాథ్స్ టీచర్ వేధింపులు ప్రిన్సిపాల్ కాళ్లపై పడిన విద్యార్థినులు
జగన్ హైదరాబాద్ పర్యటన పై ఎల్లో మీడియా చిల్లర డిబేట్లు... ఏకిపారేసిన కాకాణి

