విజయ్ చివరి సినిమా జననాయగన్ కాదా? మాట నిలబెట్టుకుంటాడా?
తమిళ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ చివరి సినిమా జననాయగన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్గా వస్తున్న జననాయగన్ ఈ నెల 9న విడుదల కానుంది. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తన సినిమా ప్రయాణానికి ముగింపు పలికి ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ తన పార్టీ సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తూ రాజకీయ రంగంలో చురుకుగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా పెట్టుకుని తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. అయితే సినీ హీరోల రాజకీయ ప్రయాణం అంత సులభం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు గుడ్బై చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. మొదట్లో ప్రజలే తనకు ముఖ్యమని, సినిమాలు తనకు ప్రాధాన్యం కాదని పలుమార్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత మంచి డైరెక్షన్ టీమ్ ఉండి ఉంటే తను రాజకీయాల్లోకే వచ్చే వాన్ని కాదని ప్రకటించారు. ఇలా పవన్ ఎలాగైనా తన నాలుకను మడతేస్తూ ఉంటారు. ఇప్పుడు పొత్తులో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కినా కూడా సినిమాలు మాత్రం ఆపడం లేదు. కమల్ హాసన్ పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు విరామం ఇచ్చారు. తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఉపేంద్ర కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, తిరిగి దర్శకుడిగా, నటుడిగా బిజీగా మారిపోయారు. విజయ్కాంత్ మంచి స్థితిలో ఉన్న కెరీర్ను వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. ఒక దశలో ప్రతిపక్ష నేతగా నిలిచినా, తర్వాత పార్టీ బలహీనమైపోయింది. విజయ్ రాజకీయాల్లో ఎంతవరకు విజయవంతం అవుతాడో చెప్పడం కష్టం. ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా, కనీస స్థాయిలో సీట్లు సాధించకపోయినా, ఆయన ప్రయాణం ఇతర స్టార్ హీరోల అనుభవాలకు భిన్నంగా ఉండకపోవచ్చు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకున్న క్రేజ్, ప్రజల మద్దతు రాజకీయాల్లోకి మారడం అంత తేలిక కాదు. ఇండస్ట్రీ బంగారు బాతు లాంటిది. అయినా పదవి లేకుండా రాజకీయ వేడి తట్టుకోవడం స్టార్ హీరోలకూ పెద్ద సవాలే మరి.
Vreels - సోషల్ మీడియాకు సరికొత్త నిర్వచనం
డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న ఈ రోజుల్లో, యూజర్ డేటా గోప్యతా సమస్యలు, స్పష్టతలేని అల్గోరిథమ్స్, మరియు కొద్ది మంది మాత్రమే లాభపడే ఆదాయ వ్యవస్థలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో, Vreels (www.vreels.com) ఒక కొత్త దృష్టికోణాన్ని తీసుకొని వచ్చింది. ఇది యూజర్ గోప్యత, పారదర్శకత, సమాన అవకాశాలు, మరియు కమ్యూనిటీ ఇంటరాక్షన్పై ఆధారపడి రూపుదిద్దబడిన వేదిక.యూజర్కు అనుగుణంగా రూపొందిన వేదికVreels ప్రత్యేకత ఏమిటంటే - ఇది యూజర్ల కోసం మాత్రమే కాకుండా, యూజర్లతో కలిసి నిర్మించబడుతున్న వేదిక. మీటప్లు, ఓపెన్ ఫోరమ్ల ద్వారా కంటెంట్ క్రియేటర్లను, యూజర్లను నేరుగా కలుసుకుంటూ, వారి అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకుని ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.ప్రతిభకు సమాన ప్రాధాన్యత, వ్యక్తీకరణ స్వేచ్ఛ, నైతిక ఆదాయ విధానం, మరియు యూజర్ నియంత్రణ వంటి అంశాలే ఈ వేదిక అభివృద్ధికి దిశానిర్దేశకాలు. అల్గోరిథమ్ ప్రయోజనాలకన్నా, కమ్యూనిటీ అవసరాలే ఇక్కడ ప్రధానంగా పరిగణించబడతాయి.విద్యార్థులు మరియు కొత్త ప్రతిభలకు ప్రోత్సాహంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న అపారమైన సృజనాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు Vreels ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. క్యాంపస్ స్థాయిలో నిర్వహిస్తున్న కంటెంట్ కార్యక్రమాలు విద్యార్థులను సురక్షిత వాతావరణంలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రోత్సహిస్తున్నాయి.విద్యాసంస్థను వెరిఫై చేసిన యూజర్లు ఇతర కళాశాలల విద్యార్థులతో కనెక్ట్ అవుతూ, దీర్ఘకాలిక సామాజిక మరియు వృత్తిపరమైన నెట్వర్క్లను నిర్మించుకోగలరు. గోప్యతా రక్షణలు, కంటెంట్ నియంత్రణలు యువతలోని సందేహాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ప్రారంభ దశలోనే ఆదాయ అవకాశాలుసోషల్ మీడియా రంగంలో అరుదైన అడుగు వేస్తూ, Vreels ఒక స్పష్టమైన మైల్స్టోన్ ఆధారిత ఆదాయ విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం:• ప్రతి 10,000 ఫాలోవర్లకు ₹10,000 చెల్లింపు • గరిష్ట ఆదాయ పరిమితి లేదు (ప్రోగ్రామ్ అమలులో ఉన్నంత వరకు)పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా మారకముందే, యూజర్ల శ్రమకు విలువ ఇస్తూ, ప్రారంభ దశ నుంచే ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం ఈ విధాన ప్రత్యేకత.సోషల్ కామర్స్ దిశగా అడుగు - Vreels Shop2026 తొలి త్రైమాసికంలో Vreels Shop ప్రారంభం కానుంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వ్యాపారాలు, కొత్త బ్రాండ్లు యూజర్లతో నేరుగా కనెక్ట్ కావచ్చు. ప్రస్తుతం వెండర్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.ఇది క్రియేటర్లు, వ్యాపారులు, బ్రాండ్లకు కొత్త ఆదాయ మార్గాలను తెరవనుంది.వ్యక్తిగత అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చే ఫీచర్లుVreelsలోని ప్రత్యేకమైన ఫీచర్ Memory Capsule — మీరు ఎంచుకున్న ఫోటోలు, వీడియోలు లేదా సందేశాలను, నిర్ణయించిన సమయానికి, ఎంపిక చేసిన వ్యక్తికే షేర్ చేసే అవకాశం ఇస్తుంది. ఇది పబ్లిక్ షేరింగ్కు భిన్నంగా, వ్యక్తిగత భావోద్వేగాలకు విలువ ఇస్తుంది.PixPouch ఫీచర్ ద్వారా యూజర్లు తమ విజువల్ జ్ఞాపకాలను సక్రమంగా భద్రపరచుకుని, కావాలనుకున్నప్పుడే ఎంపిక చేసిన వారికి షేర్ చేయవచ్చు.ఒకే యాప్లో సంపూర్ణ అనుభవం• Vreels ఒకే వేదికలో: షార్ట్ వీడియోలు (Reels) • రియల్టైమ్ చాట్ • వాయిస్ & వీడియో కాల్స్అన్నీ అందిస్తూ, యూజర్లు యాప్ల మధ్య మారాల్సిన అవసరాన్ని తొలగిస్తోంది.గోప్యతే పునాదిప్రకటనల ఆదాయంపై ఆధారపడే వేదికలతో పోలిస్తే, Vreels గోప్యత మరియు డేటా భద్రతను తన మౌలిక నిర్మాణంలోనే సుస్థిరంగా ఏర్పాటు చేసింది. యూజర్ల కంటెంట్, పరస్పర చర్యలపై పూర్తి నియంత్రణ యూజర్లకే ఉంటుంది.ప్రపంచ దృష్టికోణంఅమెరికా ఆవిష్కరణా దృక్పథ్వం మరియు భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభ కలయికతో రూపొందిన Vreels, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అనేక టెక్నాలజీ పేటెంట్లు దాఖలయ్యాయి. ప్రాంతీయ భాషల మద్దతు కూడా నిరంతరం విస్తరిస్తోంది.Vreels — మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా — మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒక్కే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels - భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comక్రింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్లలో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదా డౌన్లోడ్ కోసం క్రింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి.
విడాకుల తర్వాత మళ్లీ కలవనున్న చహల్, ధనశ్రీ వర్మ..?
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్–ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మ విడాకుల తర్వాత మళ్లీ కలవనున్నారని తెలుస్తుంది. ‘ది 50’ అనే రియాలిటీ షోలో ఇద్దరూ జంటగా ఒకే వేదికపై కనిపించబోతున్నారని సమాచారం. ఈ విషయంపై అధికారిక సమాచారం లేనప్పటికీ.. సోషల్మీడియా కోడై కూస్తుంది.‘ది 50’ షోలో చహల్, ధనశ్రీ పేర్లు టెంటేటివ్ లైనప్లో ఉన్నాయని సమాచారం. ఈ షోలో ఒర్రీ, ఎమివే బంటై, నిక్కీ తంబోలి, శ్వేతా తివారి, అంకితా లోఖండే, శివ్ ఠాకరే, కుషా కపిలా, శ్రీశాంత్, ఊర్ఫీ జావేద్, తాన్యా మిట్టల్, ఫైసల్ షేక్ వంటి ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ ది 50 షోలో చహల్, ధనశ్రీ కనిపిస్తే విడాకుల తర్వాత ఈ ఇద్దరు పబ్లిక్ ప్లాట్ఫామ్పై కలిసి కనిపించడం మొదటిసారి అవుతుంది. చహల్, ధనశ్రీ 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆతర్వాత కొద్దికాలం పాటు వీరి వివాహ బంధం సజావుగా సాగింది. కలిసి ఉన్నంతకాలం వీరు అనునిత్యం సోషల్మీడియాలో ఉండేవారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ వీరిద్దరు విడాకులకు అప్లై చేశారు. 18 నెలలు వేర్వేరుగా నివసించిన తర్వాత 2025లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. బాంద్రా ఫ్యామిలీ కోర్టు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. చహల్ రూ. 4.75 కోట్ల భరణం చెల్లించినట్లు సమాచారం.విడాకుల తర్వాత వీరిద్దరి మధ్య కొంతకాలం పాటు సోషల్మీడియా వార్ జరిగింది. ఒకరి వ్యాఖ్యలకు ఒకరు కౌంటర్లిస్తూ పోయారు. ఈ క్రమంలో చహల్ RJ మహ్వష్తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ పబ్లిక్లో కనిపించడం, ఐపీఎల్ మ్యాచ్ల్లో మహ్వష్ చహల్కు సపోర్ట్ చేయడం ఈ రూమర్స్కు బలం చేకూరుస్తున్నాయి.
నాన్నా.. మేమేం చేశాం?
మహబూబ్ నగర్ జిల్లా: భార్య విడాకులు ఇచ్చిందనే కోపంలో అతడు కిరాతకుడిలా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కొడుకు, కూతురిని కర్కశంగా హతమార్చాడు. ఆపై మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. సీఐ రాజేందర్రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన చాకలి శివరాములుకు ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన ఓ మహిళతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివరాములు డ్రైవర్గా పనిచేస్తూ హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరికి కూతురు రితిక, కుమారుడు చైతన్య ఉన్నారు. అయితే దంపతులు తరచూ గొడవపడేవారు. ఆరేళ్ల క్రితం భర్తను వదిలి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివరాములు తీలేరుకు వచ్చాడు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా శివరాములు అమ్మానాన్న చూసేవారు. ఈ క్రమంలో దంపతులను కలపాలని రెండుసార్లు గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు. ఫలితం లేకపోవడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. గతేడాది మార్చి నెలలో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి శివరాములు మనస్తాపానికి గురై ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మూడు రోజుల నుంచే ప్లాన్.. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారని భావించిన శివరాములు మూడు రోజుల క్రితం నిర్ణయించుకున్న ఓ ప్లాన్ ప్రకారం తన ఇద్దరు పిల్లలు రితిక(8), చైతన్య(6)లను పొలం దగ్గరకు తీసుకెళ్లి రాత్రి అక్కడే నిద్రించి ఉదయం ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భోజనం చేయకుండా తన పిల్లలను బైక్పై తీసుకెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో శివరాములు తమ్ముడి భార్య రాత్రి 8 గంటలకు ఫోన్ చేయగా రితిక అనారోగ్యంతో ఉందని మరికల్ ఆస్పత్రికి తీసుకొచ్చా.. డాక్టర్కు చూపించి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా వెళ్లి కూతురు, కుమారుడిని పొలం దగ్గర ఉన్న పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. అర్ధరాత్రి సమయంలో వారు గాఢనిద్రలో ఉండగా తాడుతో ఒక్కొక్కరి గొంతు నులిమి చంపేశాడు. పొలం పక్కనే ఉన్న కోయిల్సాగర్ సాగునీటి కాల్వలో మృతదేహాలను పడేసి నీళ్లలో లోపలికి తొక్కేశాడు. పిల్లలను చంపిన తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ముందుగా పొలం దగ్గర ఉన్న గడ్డి మందు తాగాడు. ఆపై పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. అయితే సింగిల్ ఫేజ్ ఉండి అది ట్రిప్ కావడంతో షాక్ కొట్టి వదిలేసింది. మళ్లీ పశువుల కొట్టంలోకి వచ్చి గడ్డపారతో పొడుచుకొని చనిపోవాలని ప్రయత్నించాడు. అది కూడా సాధ్యం కాకపోవడంతో బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. అయినా చనిపోకపోవడంతో తనను బతికించాలని పక్క పొలం రైతులకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేశాడు. వారు వెంటనే అక్కడకుచేరుకొని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలను కాల్వలో నుంచి బయటకు తీశారు. శివరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. కాగా.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రితిక 4వ తరగతి, చైతన్య 1వ తరగతి చదువుతున్నారు. డబ్బులు ఇవ్వడం లేదని.. తండ్రిని చంపిన తనయుడు పాపన్నపేట(మెదక్): డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కొడుకు కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని సీతానగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లంగడి లక్ష్యయ్య (48) వ్యవసాయంతోపాటు విద్యుత్ లైన్మెన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. భార్య శేఖమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహం, వ్యవసాయం నిమిత్తం కొంత అప్పులు చేశాడు. శ్రీకాంత్ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ, ఖర్చుల కోసం తరచూ తండ్రిని వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పలుమార్లు తండ్రీకొడుకు మధ్య గొడవలు జరిగాయి. సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే కొడుకు డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో శ్రీకాంత్ ముందుగా సుత్తితో తండ్రిపై దాడి చేయగా, తల్లి కొడుకు చేతి నుంచి సుత్తి లాక్కుంది. తీవ్ర ఆవే«శంతో రగిలిపోతున్న శ్రీకాంత్.. అక్కడే ఉన్న కర్రతో తండ్రి తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు.
సత్యసాయి బాటలో వెనెజువెలా నేతలు.. కారణం ఇదే..
మా నాన్నకి పుట్టింది కొడుకు, కూతురు కాదు..!
శ్రీవారి సేవలో 'సంక్రాంతికి వస్తున్నాం' తారలు
Stock Market Updates: 26,150 దిగువన నిఫ్టీ..
‘చమురు వెనెజువెలాదే.. కానీ పెత్తనం చేసేది నేనే’
మనుషుల కేసుల్లోనూ ఇన్ని దరఖాస్తులు రాలేదు
విడాకుల తర్వాత మళ్లీ కలవనున్న చహల్, ధనశ్రీ వర్మ..?
సోలార్ రూఫ్టాప్లో టాటా పవర్ రికార్డు
భార్యకు వంటరాదని విడాకులా?
కిమ్ క్షిపణి గర్జనల వేళ.. ‘డ్రాగన్-కొరియా’ షాకింగ్ ట్విస్ట్!
బంగారం ధరల్లో ఊహకందని మార్పు!
కరెంటు లేదు.. ఆహారం దొరకదు
వెండిపై అస్సలు తగ్గని కియోసాకి
ఆ డ్యాన్సులే కొంప ముంచాయా?
'బాయిలోనే బల్లి పలికే' మంగ్లీ కాపీ కొట్టిందా.. క్లారిటీ ఇదే
ఆయనకు చేతకాదు నువ్వు నమ్మాల్సిందే!
ఏపీ అప్పులు రూ.2.93 లక్షల కోట్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సన్నిహితులతో సఖ్యత
'దిల్రాజు'తో మా అక్క పెళ్లి.. మొదట ఒప్పుకోలేదు: తరుణ్
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్
... మీ నోబెల్ బహుమతికి మరొకరు పోటీ వస్తున్నార్సార్!
ఓట్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారు
బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
మూడో సారి తండ్రి అయిన అంబటి రాయుడు
అమ్మ రెండో పెళ్లి.. నేనే సాక్షి సంతకం పెట్టా!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
విరాట్ కోహ్లి అనూహ్య నిర్ణయం!
సత్యసాయి బాటలో వెనెజువెలా నేతలు.. కారణం ఇదే..
మా నాన్నకి పుట్టింది కొడుకు, కూతురు కాదు..!
శ్రీవారి సేవలో 'సంక్రాంతికి వస్తున్నాం' తారలు
Stock Market Updates: 26,150 దిగువన నిఫ్టీ..
‘చమురు వెనెజువెలాదే.. కానీ పెత్తనం చేసేది నేనే’
మనుషుల కేసుల్లోనూ ఇన్ని దరఖాస్తులు రాలేదు
విడాకుల తర్వాత మళ్లీ కలవనున్న చహల్, ధనశ్రీ వర్మ..?
సోలార్ రూఫ్టాప్లో టాటా పవర్ రికార్డు
భార్యకు వంటరాదని విడాకులా?
కిమ్ క్షిపణి గర్జనల వేళ.. ‘డ్రాగన్-కొరియా’ షాకింగ్ ట్విస్ట్!
బంగారం ధరల్లో ఊహకందని మార్పు!
కరెంటు లేదు.. ఆహారం దొరకదు
వెండిపై అస్సలు తగ్గని కియోసాకి
ఆ డ్యాన్సులే కొంప ముంచాయా?
'బాయిలోనే బల్లి పలికే' మంగ్లీ కాపీ కొట్టిందా.. క్లారిటీ ఇదే
ఆయనకు చేతకాదు నువ్వు నమ్మాల్సిందే!
ఏపీ అప్పులు రూ.2.93 లక్షల కోట్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సన్నిహితులతో సఖ్యత
'దిల్రాజు'తో మా అక్క పెళ్లి.. మొదట ఒప్పుకోలేదు: తరుణ్
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్
... మీ నోబెల్ బహుమతికి మరొకరు పోటీ వస్తున్నార్సార్!
ఓట్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారు
బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
మూడో సారి తండ్రి అయిన అంబటి రాయుడు
అమ్మ రెండో పెళ్లి.. నేనే సాక్షి సంతకం పెట్టా!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
విరాట్ కోహ్లి అనూహ్య నిర్ణయం!
ఫొటోలు
ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
నుమాయిష్ ఎగ్జిబిషన్లో లేడీస్ డే వేడుకలు (ఫొటోలు)
గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు
కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)
ఎ.ఆర్. రెహమాన్ బర్త్డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
Sankranti 2026 : పల్లె గాలిలో రుచుల పండుగ (ఫొటోలు)
సినిమా
శివకార్తికేయన్కు కథ చెప్పిన పార్కింగ్ డైరెక్టర్!
సినిమా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు, ఎప్పుడు పాపులర్ అవుతారో, ఎవరు ఎవరితో కలసి చిత్రాలు చేస్తారో ఊహించలేం. ఉదాహరణకు రజనీకాంత్ 173వ చిత్రం విషయానికే వస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే చర్చ జరిగింది. ధనుష్ సహా పలువురు దర్శకుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా దర్శకుడు సుందర్ సి పేరు ఖరారైంది. డాన్ దర్శకుడితో రజనీకాంత్దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది హఠాత్తుగా ఆయన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. ఆహా.. లక్కీచాన్స్ అని అందరూ అనుకున్నారు. అంతలోనే డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు పేరు వినిపించింది. అయితే తాజాగా డాన్ చిత్రం ఫేమ్ శిబి చక్రవర్తి పేరు ఖరారైంది.పార్కింగ్ డైరెక్టర్ఇకపోతే పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ ఏం చేస్తున్నారని ఆరా తీస్తే ఆయన ఇటీవల శివకార్తికేయన్కు కథ వినిపించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన నటించిన పరాశక్తి చిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఒక వేళ రామ్కుమార్ బాలకృష్ణన్ కథకు పచ్చజెండా ఊపితే వెంకట్ ప్రభుతో మూవీ చేశాకే ఆయన చిత్రం ఉండే అవకాశం ఉంది.చదవండి: ఉస్తాద్ భగత్సింగ్లో ఛాన్స్.. అందుకే వదిలేసుకున్నా: హీరోయిన్
ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ చేసిన ప్రయోగాత్మక సినిమా 'అయలాన్'. ఏలియన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. అనివార్య కారణాల వల్ల బిగ్ స్క్రీన్ రిలీజ్ అవ్వలేదు. తర్వాత ఓటీటీలోనూ కేవలం తమిళమే స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. మరి తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు తెలుగు వెర్షన్ తీసుకొచ్చేస్తున్నారు.శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏలియన్ కామెడీ సినిమా 'అయలాన్'. 2024 సంక్రాంతికి తమిళంలో రిలీజైంది. అప్పుడే తెలుగు కూడా ప్లాన్ చేశారు. తర్వాత అప్పుడే జనవరి 26న తీసుకొస్తామని ప్రకటించారు. హైదరాబాద్కి వచ్చిన శివకార్తికేయన్ ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ పలు కారణాలతో విడుదల కాలేదు. తర్వాత తమిళ వెర్షన్ని సన్ నెక్స్ట్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ గురించి ఏ సమాచారం లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ)కానీ గత నెల అంటే డిసెంబరులో తెలుగు వెర్షన్ని జీ తెలుగులో ప్రసారం చేశారు. ఇప్పుడు ఓటీటీ గురించి కూడా అప్డేట్ వచ్చేసింది. ఆహా లో రేపటి(జనవరి 07) నుంచి తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నారు.'అయలాన్' విషయానికొస్తే.. ఓ మిషన్లో భాగంగా ఏలియన్ భూమ్మీదకు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో హీరో(శివ కార్తికేయన్)ని కలుస్తుంది. కొన్నాళ్లకు ఏలియన్-హీరోకు స్నేహం ఏర్పడుతుంది. సదరు ఏలియన్కి టాటూ అని పేరు కూడా పెడతారు. కొన్ని సంఘటనల వల్ల టాటూ కొందరు వ్యక్తుల్లో చిక్కుకుంటుంది. దాన్ని కాపాడేందుకు హీరో ఏం చేశాడు? టాటూ, భూమ్మీదకు రావడానికి కారణమేంటి? అనేది మిగతా స్టోరీ. ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఏలియన్ కామెడీ చూద్దామనుకుంటే దీన్ని మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు)
తానున్న చోటే వేడుక...
‘‘అమ్మాయి అచ్చ తెలుగు సాంప్రదాయ సుందరి... సౌభాగ్య లక్ష్మిపోలిక.., అబ్బాయి మాటకారి... మోహనాంగుడే మరి... తానున్న చోటే వేడుక’’ అంటూ సాగుతుంది ‘భల్లే భల్లే’ పాట. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలోని పాట ఇది. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14 సాయంత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఈ సినిమాలోని ‘భల్లే భల్లే’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.‘భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక... మాయే చేసిందిలే... మంత్రం వేసిందిలే’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, హరిచరణ్ పాడారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ‘‘కేరళలోని పచ్చని ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో చిత్రీకరించిన పాట ఇది. ఈ పాటలో శర్వా, సాక్షిల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. హీరో శ్రీవిష్ణు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో సత్య, సునీల్, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఆదికి శంబాల మంచి బ్రేక్ ఇచ్చింది: నిర్మాత ‘దిల్’ రాజు
‘‘ఒకప్పుడు ‘బొమ్మరిల్లు’ సినిమా సినీ ఇండస్ట్రీలో చాలా మార్పు తీసుకొచ్చింది. నిజంగా ‘బొమ్మరిల్లు 2’ తీయాలంటే మాత్రం ఆది, వాళ్ల నాన్న సాయి కుమార్లతో తీయాలి. కొడుకు సక్సెస్ కోసం తండ్రి పడే తపనను మాటల్లో చెప్పలేం. అలా సాయి కుమార్గారు తన కొడుకుతో పాటు ‘శంబాల’ టీమ్ మొత్తానికి బ్యాక్బోన్లా నిలిచి, ఈ సినిమా విజయంలో భాగమయ్యారు. ‘శంబాల’ ప్రోమో చూసినప్పుడే ఈ చిత్రం సక్సెస్ అవుతుందని చెప్పాను. అది నిజమైంది’’ అని పేర్కొన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శంబాల’.యుగంధర్ ముని దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదలైంది. తమ సినిమా మంచి విజయం సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శంబాల’ సినిమాకు పబ్లిక్లో మంచి టాక్ వచ్చి, సక్సెస్ కావడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి, క్రిస్మస్ విన్నర్గా నిలిచింది. ఆది కెరీర్లో ‘శంబాల’ 25వ చిత్రం. ఈ మూవీతో తనకి మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పుకోవాలి. అలాగే మొత్తం యూనిట్కి శుభాకాంక్షలు’’ అని అన్నారు.‘‘మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుందని ‘శంబాల’ చిత్రం నిరూపించింది. సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. జనవరి 9న ఈ సినిమా హిందీలో రిలీజ్ అవుతోంది. అక్కడ కూడా సక్సెస్ అవుతుందనే భావిస్తున్నాను’’ అని చెప్పారు సాయి కుమార్. ‘‘ఇకపై కెరీర్ను బాగా ప్లాన్ చేసుకుని, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాను’’ అని తెలిపారు ఆది సాయికుమార్. ‘‘ఆదిగారు లేకుండా ఈ సినిమా లేదు. కొన్ని థియేటర్స్లో మా ‘శంబాల’ సినిమా కంటిన్యూస్గా 11 రోజులు హౌస్ఫుల్తో ప్రదర్శితమైంది’’ అని అన్నారు యుగంధర్ ముని. ‘‘మా సినిమాను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని చెప్పారు మహిధర్ రెడ్డి, రాజశేఖర్. అనంతరం ‘శంబాల’ సినిమా సక్సెస్లో భాగమైన ప్రతి ఒక్కరికీ మెమొంటోలను అందజేశారు ‘దిల్’ రాజు.
క్రీడలు
ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం
సిడ్నీ: సొంతగడ్డపై జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజృంభిస్తున్నారు. ఫలితంగా ఆఖరిదైన ఐదో టెస్టులో ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే 3–1తో చేజిక్కించుకున్న కంగరూలు ఆఖరి పోరులో పరుగుల వరద పారిస్తున్నారు. ఓవర్నైట్ స్కోరు 166/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆ్రస్టేలియా జట్టు... మంగళవారం ఆట ముగిసే సమయానికి 124 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది.ఓపెనర్ ట్రవిస్ హెడ్ (166 బంతుల్లో 163; 24 ఫోర్లు; 1 సిక్స్), కెపె్టన్ స్టీవ్ స్మిత్ (205 బంతుల్లో 129 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో కదం తొక్కారు. కామెరాన్ గ్రీన్ (37; 3 ఫోర్లు, 1 సిక్స్), బ్యూ వెబ్స్టర్ (58 బంతుల్లో 42 బ్యాటింగ్; 4 ఫోర్లు) కూడా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3, స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టారు. చేతిలో 3 వికెట్లు ఉన్న ఆసీస్ జట్టు... ఇంగ్లండ్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్మిత్తో పాటు వెబ్స్టర్ క్రీజులో ఉన్నాడు. స్మిత్ సూపర్ సెంచరీ... శతకానికి 9 పరుగుల దూరంలో మంగళవారం ఇన్నింగ్స్ కొనసాగించిన హెడ్... 105 బంతుల్లో మూడంకెల మార్క్ అందుకున్నాడు. ఈ సిరీస్లో హెడ్కిది మూడో సెంచరీ కావడం విశేషం. నైట్ వాచ్మన్ నెసెర్ (90 బంతుల్లో 24; 4 ఫోర్లు) అతడికి చక్కటి సహకారం అందించడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. మూడో వికెట్కు నెసెర్తో కలిసి హెడ్ 72 పరుగులు జోడించాడు. అతడు అవుటయ్యాక స్మిత్తోనూ అదే లయ కొనసాగించాడు. నాలుగో వికెట్కు 54 పరుగులు జోడించిన అనంతరం హెడ్ అవుట్ కాగా... కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా (49 బంతుల్లో 17; 2 ఫోర్లు) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అలెక్స్ కేరీ (16) విఫలమయ్యాడు.అయితే చివర్లో గ్రీన్, వెబ్స్టర్ అండతో స్మిత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు పెద్దగా రాణించలేకపోయిన స్మిత్... చివరి మ్యాచ్లో తనదైన ఆటతీరుతో చెలరేగాడు. ఈ క్రమంలో 166 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యాషెస్లో అతడికిది 13వ సెంచరీ కాగా... సిడ్నీ మైదానంలో ఐదోది. ఈ ఇన్నింగ్స్లో ఆ్రస్టేలియా ఏడు వికెట్లకు అర్ధ శతక భాగస్వామ్యాలు నమోదు చేసింది. ‘భాగస్వామ్యాలు బాగా కుదిరాయి. అందుకే సాఫీగా పరుగులు రాబట్టగలిగాం. తొలి ఇన్నింగ్స్లో రెండొందల పరుగుల ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వికెట్ నెమ్మదిగా మారుతోంది. ఇది నా సొంత మైదానం. ఇక్కడ బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా’ అని స్మిత్ అన్నాడు.⇒ 13 ‘యాషెస్’లో స్టీవ్ స్మిత్ సెంచరీల సంఖ్య. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో జాక్ హబ్స్ (12)ను అధిగమించి స్మిత్ రెండో స్థానానికి చేరాడు. డాన్ బ్రాడ్మన్ 19 శతకాలతో ‘టాప్’లో ఉన్నాడు.⇒ 37 టెస్టు క్రికెట్లో స్మిత్ సెంచరీల సంఖ్య. అత్యధిక శతకాలు చేసిన ప్లేయర్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (36)ను అధిగమించి ఆరో స్థానానికి ఎగబాకాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్వస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), జో రూట్ (41), కుమార సంగక్కర (38) ముందున్నారు.⇒3682 ‘యాషెస్’లో స్మిత్ చేసిన పరుగులు. బ్రాడ్మన్ (5028) అగ్ర స్థానంలో ఉండగా... స్మిత్ రెండో స్థానానికి చేరాడు. ⇒ 18 సారథిగా స్మిత్ సాధించిన శతకాలు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్ (25), విరాట్ కోహ్లి (20), రికీ పాంటింగ్ (19) ముందున్నారు.
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టీవ్ స్మిత్.. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గ్రీన్, వెబ్స్టెర్తో కలిసి స్కోర్ బోర్డును అతడు పరుగులు పెట్టించాడు.ఈ క్రమంలో స్మిత్ 165 బంతుల్లోనే తన 37వ టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్మిత్ 129 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. స్మిత్తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావెస్ హెడ్(163) కూడా భారీ శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు సాధించింది. కంగారులు ఇంగ్లండ్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో శతక్కొట్టిన స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ రికార్డు బ్రేక్..అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఇంగ్లండ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా స్మిత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో స్మిత్ ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్(5,028) అధిగమించాడు. స్మిత్ ఇప్పటివరకు ఇంగ్లండ్పై మూడు ఫార్మాట్లు కలిపి 5,085 పరుగులు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుస్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 5085 పరుగులుడాన్ బ్రాడ్మాన్ (ఆస్ట్రేలియా) - 5028 పరుగులుఅల్లన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 4850 పరుగులువివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) - 4488 పరుగులురికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 4141 పరుగులువిరాట్ కోహ్లీ (భారత్) - 4036 పరుగులుసచిన్ టెండూల్కర్ (భారత్) - 3990 పరుగులు👉అదేవిధంగా టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆరో స్ధానానికి స్మిత్ ఎగబాకాడు. ఈ జాబితాలో స్మిత్ కంటే ముందు సంగక్కర(38), జో రూట్(41), పాంటింగ్(41), కల్లిస్(45), సచిన్ టెండూల్కర్(51) ఉన్నారు.
'మాట వింటే ఉండు.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపో'
టెస్టు క్రికెట్లో ‘బాజ్బాల్’ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టుకు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ట్రోఫీని ఇంగ్లండ్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. యాషెస్ 2025-26లో తొలి మూడు టెస్టుల్లో ఘోర ఓటములను చవిచూసిన స్టోక్స్ సేన.. కేవలం 11 రోజుల్లోనే సిరీస్ను కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ జట్టుతో పాటు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్పై విమర్శల వర్షం కురిసింది. అంతేకాకుండా టూర్ మధ్యలో నిర్వహించిన 'నూసా (Noosa)' పర్యటన వంటివి కూడా ఇంగ్లండ్ జట్టు ప్రతిష్టను దెబ్బతీశాయి.డేంజర్లో మెకల్లమ్ పోస్ట్..అయితే ఆస్ట్రేలియా గడ్డపై ఘోర ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ పదవి ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ మీడియా కథనాల ప్రకారం.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మెక్కల్లమ్కు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. జట్టు వాతావరణంతో పాటు సంస్కృతిలో సమూల మార్పులు చేయాలని మెక్కల్లమ్ను బోర్డు సూచించినట్లు సమాచారం.ఒకవేళ అందుకు అతడు అంగీకరించకపోతే తనంతట తానుగా రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఈసీబీ కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్, ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ ప్రస్తుతం సిడ్నీలోనే ఉన్నారు. ఐదో టెస్టు ముగిసిన వెంటనే జట్టు వైఫల్యాలపై అధికారిక సమీక్ష జరగనుంది. అయితే కెప్టెన్ బెన్ స్టోక్స్ మద్దతు మాత్రం మెక్కల్లమ్కు ఉంది. "బ్రెండన్తో కలిసి పని చేయడం నాకు చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి ఈ జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలమని నమ్ముతున్నాను. ఇప్పుడున్న స్థితిలో జట్టును మెక్కల్లమ్ మాత్రమే గట్టెక్కించగలడు" అని స్టోక్స్ సిడ్నీ టెస్టుకు ముందు స్పష్టం చేశాడు. కాగా వరుసగా మూడు టెస్టుల్లో ఓటమి చవిచూసిన ఇంగ్లీష్ జట్టు.. ఎట్టకేలకు బాక్సింగ్ డే టెస్టులో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సిడ్నీ టెస్టు నువ్వానేనా అన్నట్లగా సాగుతోంది.
విష్ణు వినోద్ విధ్వంసకర సెంచరీ.. 14 సిక్స్లతో వీర విహారం! వీడియో
విజయ్ హాజారే ట్రోఫీ 2025-26లో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో వినోద్ విధ్వంసం సృష్టించాడు. 248 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దు చెలరేగాడు. ఈ క్రమంలో అతడు కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.32 ఏళ్ల విష్ణు వినోద్ సెంచరీ సాధించాక మరింత చెలరేగిపోయాడు. అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఓవరాల్గా 84 బంతులు ఎదుర్కొన్న వినోద్.. 13 ఫోర్లు, 14 సిక్స్లతో 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు బాబా అపరాజిత్(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా లక్ష్యాన్ని కేరళ రెండు వికెట్లు కోల్పోయి కేవలం 29 ఓవర్లలోనే చేధించింది.అంతకుముందు బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి 47.4 ఓవర్లలో 247 పరుగులకే కుప్పకూలింది. అజయ్ రోహరా(53), జశ్వంత్(57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగితా ప్లేయర్లంతా విఫలమయ్యారు. కేరళ బౌలర్లలో నిదేష్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఈడెన్ యాపిల్ టామ్, అనికేత్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మాత్రం విఫలమయ్యాడు.గైక్వాడ్ రికార్డు బ్రేక్..ఈ మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన వినోద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సులు బాదిన రెండో ప్లేయర్గా అతడు నిలిచాడు. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో వినోద్ ఇప్పటివరకు 106 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు రుతురాజ్ గైక్వాడ్(105) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో గైక్వాడ్ను వినోద్ అధిగమించాడు. ఈ జాబితాలో కర్ణాటక ఆటగాడు మనీష్ పాండే(108) అగ్రస్ధానంలో ఉన్నాడు. విష్ణు వినోద్ ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్లు వీరే..1 - మనీష్ పాండే: 99 ఇన్నింగ్స్లలో 108 సిక్సులు2 - విష్ణు వినోద్: 53 ఇన్నింగ్స్లలో 106 సిక్సులు3 - రుతురాజ్ గైక్వాడ్: 55 ఇన్నింగ్స్లలో 105 సిక్సులు4 - యూసుఫ్ పఠాన్: 56 ఇన్నింగ్స్లలో 91 సిక్సులు5 - ఇషాన్ కిషన్: 50 ఇన్నింగ్స్లలో 85 సిక్సులుచదవండి: బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం!💯 up in style as well 👌Vishnu Vinod brings up his century in just 63 balls 👏A brilliant attacking knock from the Kerala batter 🔥Scorecard ▶️ https://t.co/szHbOWqpZK#VijayHazareTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/r18j0PEvMC— BCCI Domestic (@BCCIdomestic) January 6, 2026
న్యూస్ పాడ్కాస్ట్
సీమ జల ద్రోహి చంద్రబాబు. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలి. రాయలసీమ జిల్లాల వైఎస్సార్సీపీ నేతల డిమాండ్
సీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్దేశించిన సమాచారాన్ని ఇవ్వని చంద్రబాబు సర్కార్
రాయలసీమకు సైంధవుడు చంద్రబాబే... ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపివేసి మరణ శాసనం
వెనెజువెలాపై అమెరికా భీకర దాడులు... దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకొని న్యూయార్క్కు తరలించిన అమెరికా సేనలు
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సూపర్ సిక్స్ మోసాల ఖరీదు ఒక లక్ష 42 వేల కోట్ల రూపాయల పైమాటే...కొత్త ఏడాదిలోనైనా బకాయిలు చెల్లించాలంటూ ప్రజల డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో అత్యంత అధ్వానంగా మారిన ‘108’ నెట్వర్క్ నిర్వహణ... అంబులెన్స్ సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న బాధితులు
2026కు ఘన స్వాగతం పలికిన విశ్వమానవాళి... ఆనందోత్సాహాల నడుమ న్యూ ఇయర్ వేడుకలు
ఆంధ్రప్రదేశ్లో ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని నీరుగార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో బాదుడే బాదుడు...ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం...
పార్కుల ముసుగులో చంద్రబాబు పందేరం.. ఆంధ్రప్రదేశ్లో దళితుల భూముల్లో ‘ప్రైవేట్’ దందా!
బిజినెస్
పెరిగిన ఆధార్ కార్డు ఛార్జీలు
ఆధార్ కార్డు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే.. పేపర్లెస్ ఆధార్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ యాప్ కూడా ప్రవేశపెట్టింది. ఇపుడు తాజాగా.. ఆధార్ PVC కార్డు కోసం సర్వీస్ ఛార్జీని రూ.50 నుంచి రూ.75కి పెంచింది.పెరిగిన PVC కార్డు సర్వీస్ ఛార్జీలలో.. ట్యాక్స్, డెలివరీ ఛార్జీలు ఉన్నాయి. 2020లో ఈ సేవ ప్రవేశపెట్టిన ధర పెంచడం ఇదే మొదటిసారి. 2026 జనవరి నుంచి ఆధార్ PVC పొందాలనుకుంటే వినియోగదారులు కొత్త ఛార్జీలు చెల్లించాల్సిందే. myAadhaar వెబ్సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ అప్లై చేసుకొనే వినియోగదారులకు కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. సంవత్సరం జనవరి 1 నుండి కొత్త ధర అమలులోకి వచ్చిందని UIDAI తెలిపింది.ధర పెరుగుదలకు కారణంపీవీసీ ఆధార్ కార్డు ధరల పెరుగుదలకు కారణం.. నిర్వహణ ఖర్చులు పెరగడం అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొన్నేళ్లుగా.. ఆధార్ PVC కార్డ్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన మెటీరియల్స్, ప్రింటింగ్, సురక్షిత డెలివరీ, లాజిస్టిక్స్ ఖర్చు పెరిగింది. దీనివల్ల ఛార్జీలు పెంచినట్లు సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!ఆధార్ PVC కార్డును ఎలా ఆర్డర్ చేయాలి?➤ఆధార్ PVC కార్డు కోసం myAadhaar వెబ్సైట్ లేదా mAadhaar యాప్ ఉపయోగించాలి.➤యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి.. ఆధార్ నెంబర్ , క్యాప్చ ఎంటర్ చేసిన తరువాత.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయినా తరువాత.. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.➤ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు ఆప్షన్ ఎంచుకున్న తరువాత 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.➤ప్రాసెస్ పూర్తయిన తరువాత.. ఐదు పని దినాలలోపు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.Once you have placed an order for your #AadhaarPVCCard, within a few days your card is printed and sent through India Post’s Speed Post service, which is fast, secure, and trackable.You can easily check the delivery status online.To track the delivery status of your #Aadhaar… pic.twitter.com/ZFQOet6TU2— Aadhaar (@UIDAI) January 6, 2026
అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!
ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు రకరకాల పథకాలను ఆచరణలోకి తెస్తున్నాయి. పోను.. పోను.. వాటి కోసం ప్రజా ధనం కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఉచితాల విషయంలో విమర్శలు వినవస్తున్నా.. కోర్టులు అక్షింతలు వేస్తున్నా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. రూ.46 వేలు జమ చేయడం కూడా ఇలాంటిదేమో అని అనుకునేవాళ్లు లేకపోలేదు.ప్రస్తుతం మన దేశంలో అన్ని వయసులవారికి.. రకరకాల పథకాలు అమలు అవుతున్నాయి. వాటిల్లో చాలామందికి చాలావాటిపై అవగాహన ఉండడం లేదు. దీంతో.. ప్రభుత్వాలే అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే అదనుగా స్కామర్లు కూడా రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా యూజర్లను, అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే తరహా మోసం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లింక్పై క్లిక్ చేసి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 46,715 పొందండి. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదా? మరోసారి ఆలోచించండి! అనే ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తోందట అని కొందరు మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తుందని వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మకండి. ఇదంతా అబద్దం అని స్పష్టం చేసింది. ఇలాంటి ఒక పథకం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని వెల్లడించింది.ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్తసోషల్ మీడియాలో ఫేక్ సందేశాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో.. తప్పుడు లింక్స్ పంపించి.. డబ్బు దోచేస్తున్నారు. కాబట్టి తెలియని లింక్స్ లేదా తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. మోసాల భారి నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం అపరిచిత లింకులపై క్లిక్ చేయకుండా ఉండటమే.🚨Just click on the link & share your personal info to get ₹46,715 from the Govt 💸Sounds too good to be true? Think again! A #WhatsApp message claims that the Ministry of Finance is offering financial aid of ₹46,715 to the poor. #PIBFactCheck🚫 This is a SCAM!🚫… pic.twitter.com/FcmmBU56LS— PIB Fact Check (@PIBFactCheck) January 5, 2026
20 నిమిషాల్లో కోటీశ్వరుడైన ట్రేడర్!
బ్యాంకులు కొన్నిసార్లు పొరపాటున లేదా అనుకోకుండా ఖాతాదారుల ఖాతాల్లో భారీ నగదు జమ చేసేస్తుంటాయి. జరిగిన తప్పు తెలుసుకుని మళ్లీ.. ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చినప్పటికీ.. స్టాక్ మార్కెట్లో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం బహుశా ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కోటక్ సెక్యూరిటీస్ సాంకేతిక లోపం కారణంగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడర్ గజానన్ రాజ్గురు ఖాతాలోకి రూ. 40 కోట్లు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని చూసిన ట్రేడర్ కొంత ఆశ్చర్యానికి గురైనప్పటికీ.. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి 20 నిమిషాల్లో ఏకంగా రూ. 2.38 కోట్ల లాభాన్ని గడించారు. ఆ తరువాత ఇందులో రూ. 54 లక్షల నష్టం వచ్చింది. ఆ తరువాత మరోసారి ట్రేడ్ చేసి.. చివరకు రూ. 1.74 కోట్ల లాభాన్ని పొందాడు.విషయం తెలుసుకున్న.. కోటక్ సెక్యూరిటీస్, ట్రేడర్ నుంచి 40 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా, అతడు ట్రేడ్ చేసి సంపాదించిన రూ. 1.75 కోట్ల లాభాన్ని కూడా తీసుకుంది. దీనిపై ట్రేడర్ కోర్టును ఆశ్రయించారు. అతని అభ్యర్థనను కోర్టు కూడా రెండు సార్లు తిరస్కరించినప్పటికీ.. అతడు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తుండడంతో.. చివరికి బాంబే హైకోర్టు రూ.1.75 కోట్ల లాభాన్ని తన వద్దే ఉంచుకోవడానికి అనుమతించింది.ఇదీ చదవండి: సరికొత్త రికార్డ్.. చైనాను అధిగమించిన భారత్!ట్రేడర్ తన సొంత తెలివితేటలను ఉపయోగించి రిస్క్ చేశారని, అందులో వచ్చిన లాభం తనకే చెందుతుందని కోర్టు తీర్పునిచ్చింది. అయితే 40 కోట్ల రూపాయలు కోటక్ సెక్యూరిటీస్ తీసుకోవడంలో తప్పులేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ తీర్పు.. ట్రేడింగ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
భలే మంచి బాస్! కార్పొరేట్ ఆఫీస్లో వైరల్ వీడియో
విషపూరిత పని సంస్కృతులు రాజ్యమేలుతున్న కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులకు ఆనందాన్ని పంచే బాస్లూ అక్కడక్కడా ఉంటారు. ఎప్పుడూ వర్క్ టెన్షన్లో ఉండే ఓ ఉద్యోగినిని ఇలాగే సర్ప్రైజ్ చేశారు ఆమె మేనేజర్, తోటి ఉద్యోగులు.బెంగళూరులోని ఓ కార్యాలయంలో పని చేస్తున్న ఐశ్వర్యను ఏదో మీటింగ్ అంటూ రూంలోకి పిలిచారు. దీంతో చేత్తో ల్యాప్టాప్ పట్టుకుని చకాచకా వెళ్లిపోయింది. తలుపు తీసి లోపలికి అడుగు పెట్టగానే ఆమె మేనేజర్ సహా తోటి ఉద్యోగులు మరచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో 2 వేల మంది ఫారోవర్లను చేరుకోవడాన్ని సెలబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించి ఆనందాన్ని పంచారు.ఈ వీడియోను తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశారు ఐశ్వర్య. "నా కార్పొరేట్ ప్రయాణంలో కొత్త ప్రయత్నాలు చేసేందుకు, ఎదిగేందుకు నిరంతరం ప్రోత్సహించే గొప్ప బాస్ దొరికినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలిని" అంటూ తన అనుభూతిని పంచుకున్నారు.ఎప్పుడూ మా బాస్ అలాంటోడు.. ఇలాంటోడు.. అంటూ బాస్ల రాక్షసత్వాల గురించే వినే సోషల్ మీడియాలో ఈ మంచి బాస్ వీడియో వైరల్గా మారింది. ‘భలే మంచి బాస్’ అంటూ కామెంట్లు చేశారు నెటిజనులు. View this post on Instagram A post shared by Aiswarya (@dentist_in_corporate_)
ఫ్యామిలీ
సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!
చిలుకా పదపద నెమలి పదపద..మైనా పదపద మనసా పద.. గాలి పటమా పద పదా.. హంసలాగా పదపద.. అమాసనే పరిపదకిటా.. హద్దు కాదు పద పద..పైకి పోయే పటమే.. ఇది పందెం గెలిచే పటమే.. అంటూ సాగే ఈ పాటను వింటుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో.. పతంగుల సీజన్ వచ్చిందంటే.. పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఇప్పటికే పతంగుల సందడి మొదలైంది. దీంతో మార్కెట్లో అనేక మోడళ్లు, రకాల పతంగులు ముంచెత్తుతున్నాయి. భాగ్యనగరంలోని ప్రతి గల్లీలోనూ రంగురంగుల గాలిపటాలు ఎగరుతున్నాయి. అయితే గతంలో చైనా మాంజా మిగిల్చిన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ సారైనా వాటి వినియోగానికి చెక్ పెట్టాలని అధికారులు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. చైనా మాంజాతో ప్రమాదం పొంచి ఉందని గ్రహించాలని, మన ఆనందం మరొకరిని బాధించకుండా చూసుకోవాలని చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో కొత్త ఏడాది అడుగుపెట్టగానే ఆకాశం రంగుల పతంగులతో నిండిపోతుంది. జనవరి ప్రారంభం నుంచి సంక్రాంతి పండుగ ముగిసే వరకూ, కొన్ని ప్రాంతాల్లో జనవరి చివరి వరకూ కూడా పతంగుల సందడి కొనసాగుతూనే ఉంటుంది. బాల్కనీల్లో, టెర్రస్పై నిలబడి, ఖాళీ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా చేరి.. ‘కాయ్ పో చె!’ అంటూ ఉత్సాహంగా అరవడం నగర జీవనశైలిలో ఒక ప్రత్యేకమైన పండుగ సంస్కృతిగా మారిపోయింది. అయితే దీనిని కొందరు స్వార్థపరులు సొమ్ముచేసుకునే ప్రయత్నంలో పండుగ లాంటి ఈ వాతావరణాన్ని విషాధంగా మిగులుస్తున్నారు. పతంగులకు వాడే చైనా మాంజా, సింథటిక్ మాంజా హైదరాబాద్లో యేటా వందల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పండుగ ఆనందం, మరుసటి క్షణంలో విషాదంగా మారుతున్న దృశ్యాలు అనేక మందిని బాధిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పతంగులు ఎంచుకోవాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పండుగ ఆరోగ్య రహస్యాలు, పతంగుల పోటీలు వంటి విశేషాలు తెలుసుకుందాం.. కాలక్రమేణా మార్పు.. వాస్తవానికి మనం ప్రస్తుతం వినియోగిస్తున్న గాలిపటాలు స్థానంలో మొదట వస్త్రంతో తయారుచేసిన గాలిపటాలు తయారయ్యేవి. అయితే నెమ్మదిగా పేపరు గాలిపటాలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. అయితే వీటి వల్ల ప్రకృతికి అంత ప్రమాదం ఏమీ లేదు.. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభించే ప్లాస్టిక్ గాలిపటాలతో పర్యావరణానికి హాని పొంచివుందని నిపుణులు చెబుతున్నారు. అసలు గాలిపటాల సంస్కృతి మొదటి చైనాలో పుట్టింది. కాలక్రమంలో నెమ్మదిగా ఇతర దేశాలకూ పాకింది. దేశంలో నిజాం నవాబుల ప్రోత్సాహంతో ఈ సంస్కృతి తెలుగు రాష్ట్రాలకూ విస్తరించింది. ఇప్పుడు ఒక ప్రాంతం, ప్రదేశం అంటూ లేదు.. దేశవ్యాప్తంగా గాలిపటాల సందడి కనిపిస్తుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనడం చూస్తుంటాం. ఆరోగ్య రహస్యం.. యేటా శీతాకాలంలో.. అంటే సంక్రాంతి సమయంలో ఈ గాలిపటాల సందడి కనిపిస్తుంటుంది. అయితే దీనికీ కొన్ని శాస్త్రీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ సమయంలో గాలి ఒకే దిశగా వీచడం వల్ల గాలిపటాలు ఎగరేయడానికి అనువుగా వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో పాటు చలికాలంలో ఇన్ఫెక్షన్లు, అనేక ఆరోగ్య సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయంపూట సూర్య రశ్మిని ఆస్వాదిస్తూ పతంగులు ఎగరేయడం వల్ల విటమిన్ ‘డి’ శరీరానికి లభించడమే కాకుండా ఎండ వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మన సామాజిక బాధ్యత.. గాలిపటాలు ఎగరేయడమంటే ఎవరికైనా ఆసక్తే. అందుకే ‘పతంగుల పండగలు’ పేరుతో ప్రత్యేక పోటీలు పెట్టుకొని మరీ గాలిపటాలు ఎగరేయడాన్ని ఆస్వాదిస్తారు. అయితే మాంజా ప్రమాదాల నేపథ్యంలో పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలదే. రంగు రంగుల పతంగులు, ప్లాస్టిక్ మోడళ్లకు ఆకర్షితులవుతున్న చిన్నారులకు సామాజిక బాధ్యతను నేర్పించాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది.. ముఖ్యంగా గాలిపటం అంటే పత్తి దారం, ఇప్పటి సింథటిక్ మాంజా మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించాలి. దీని వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పాలి. గాలిపటాల పోటీలను ఆస్వాదించే వారు.. వాటి వినియోగంలో ఉపయోగించే మెటీరియల్లోని తేడాలను, దాని వల్ల కలిగే అనర్థాలను భవిష్యత్తు తరానికి తెలియజెప్పడంలోనూ పోటీపడాలి. అలనాటి స్మృతులు..ఇప్పటి వారికంటే మార్కెట్లో రెడీమేడ్ గాలిపటాలు దొరుకుతున్నాయిగానీ..ఓ ఇరవైయేళ్ల క్రితం గాలిపటాలు కావాలంటే.. వార్తాపత్రికలను చింపి కొబ్బరి ఈనెలు, మైదాపిండి జిగురును ఉపయోగించి పతంగులు తయారుచేసుకునే వాళ్లు. అయితే వీటిలోనూ అనేక మోడళ్లు.. విభిన్న రకాల పేర్లు ఉన్నాయి. గుడ్లందార్, గుడ్డి లంగోటి, అద్దా వంటివి మన దగ్గర సాధారణంగా వినిపించే పేర్లు.. ‘గుడ్లందార్’ అంటే రెండు కళ్లున్న గాలిపటం. ఒంటికన్ను ఉన్న దాన్ని ‘గుడ్డి లంగోటి’ అంటారు. ‘అద్దా’ అంటే చాలా పెద్ద పతంగి అని అర్థం. వీటితోపాటు విభిన్న రకాల్లో, వర్ణాల్లో గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తాయి. మోడ్రన్ గాలిపటాలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టెక్నాలజీ నేపథ్యంలో ఎల్ఈడీ లైట్లతో వెలిగే పతంగులు.. చీకట్లో మిలమిలా మెరిసే పతంగులూ కనిపిస్తున్నాయి. (చదవండి:
మేఘాల మధ్య దోబూచులాడే భానోదయాన్ని తిలకించాలంటే..!
మంచు తెరలను కప్పుకున్న పచ్చని కొండ కోనలు..మేఘాల మధ్య దోబూచులాడుతూ ఆకాశాన అద్భుతమైన భానోదయాన్ని తిలకించాలంటే అది వంజంగిలోనే సాధ్యం. ఆంధ్రప్రదేశ్లో సన్రైజ్ టూరిజం గురించి మాట్లాడితే వెంటనే గుర్తుకు వచ్చే పేరు వంజంగి. ఒకప్పుడు చిన్న గిరిజన గ్రామంగా ఉన్న ఈ ఊరు, ఇప్పుడు సన్రైజ్ టూరిజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. వంజంగి అనే పేరు వినగానే చాలా మంది మనసులో మెదిలేది మేఘాల మధ్య నుంచి వెలుగులు చిందిస్తూ ఉదయించే సూర్యుడు. కమర్షియల్ హంగులు లేని ఈ గిరిజన ప్రాంతం, ప్రకృతి సహజ అందాలతో ప్రశాంతమైన పర్యాటక అనుభవాన్ని అందిస్తోంది. తెల్లవారుజామున ఆకాశంలో మేఘాలు దోబుచులాడే విన్యాసమే వంజంగిని ప్రత్యేకంగా నిలబెడుతోంది.అరకు దగ్గరలో.. ప్రకృతి మధ్యలో..అరకు లోయకు సమీపంలో, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో పాడేరు మండలానికి దగ్గరగా ఉన్న వంజంగి కొండ, ఇటీవలి కాలంలో పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తున్న అందమైన ప్రాంతం. ఒకప్పుడు సాధారణ గిరిజన గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం, ఇప్పుడు యువ పర్యాటకులు, ఫోటోగ్రాఫర్లు, సోలో ట్రావెలర్ల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందింది.గుడ్మార్నింగ్వంజంగి చేరుకోవడానికి పర్యాటకులు సుమారు రెండు గంటల పాటు ట్రెక్కింగ్ చేస్తారు. రాత్రి మొత్తంట్రెక్కింగ్ చేసి అలసిపోయిన క్షణంలో, మేఘాలను చీల్చుకుంటూ భానుడు ‘గుడ్మార్నింగ్’ చెప్పే దృశ్యం కనిపిస్తుంది. ఆ ఒక్క క్షణమే చాలుం అలసట అంతా మరిచిపోయి, మరో ప్రపంచంలోకి అడుగుపెట్టామా అనే అనుభూతి కలుగుతుంది.ఎటు చూసినా కొండలను దుప్పటిలా కప్పేసిన మేఘాలుం వాటి మధ్య నుంచి తన కిరణాలతో సందర్శకులను తాకే సూర్యుడు. ఈ అరుదైన దృశ్యం కోసమే పర్యాటకులు దూర దూరాల నుంచి వంజంగి చేరుకుంటారు.రోజుకో తీరువంజంగిలో సూర్యోదయం ప్రతీ రోజూ ఒకేలా ఉండదు. ఇదే ఇక్కడి అసలైన ప్రత్యేకత. కొన్ని రోజులు మేఘాలు పరుపులా పరిచేసినట్టు కనిపిస్తాయి. ఆ మేఘాల మధ్య మధ్యలో సూర్యుడు క్షణకాలం దర్శనమిచ్చి మళ్లీ మాయం అవుతాడు. మరోసారి ఫోటో తీసుకుందాం అనుకునేలోపే మబ్బులు కమ్మేస్తాయి. కానీ కనిపించిన ఆ ఐదు నిమిషాలే చాలుం జీవితాంతం గుర్తుండి΄ోయే జ్ఞాపకాలు మిగులుతాయి.క్లౌడ్ బెడ్ సన్రైజ్వంజంగిని చాలామంది ‘క్లౌడ్ బెడ్ సన్రైజ్’ అని పిలుస్తారు. ఉదయం ఐదు గంటలకు కనిపించే సూర్యోదయాన్ని వీక్షించేందుకు చాలామంది తెల్లవారుజామున 3–4 గంటలకే ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. సాధారణంగా ఒక రోజు ముందే అరకు చేరుకుని, అక్కడి నుంచి పాడేరు దారి మీదుగా వంజంగివైపు ప్రయాణిస్తారు. సుమారు రెండు గంటల ట్రెక్కింగ్ అనంతరం వ్యూ పాయింట్ చేరుకుంటారు.లగ్జరీ కాదు నిజజీవితంవంజంగి పర్యాటకం అంటే లగ్జరీ కాదు. ఇక్కడ కృత్రిమ ఏర్పాట్లు, భారీ సంఖ్యలో పర్యాటకులు, గలగలా మోగే శబ్దాలు కనిపించవు. గిరిజన గ్రామం కావడంతో హోమ్స్టేలు కూడా పరిమితంగానే ఉంటాయి. విద్యుత్ సరఫరా, మొబైల్ సిగ్నల్స్ కొన్నిసార్లు బలహీనంగా ఉండొచ్చు. కానీ ఈ చిన్న చిన్న అసౌకర్యాలే వంజంగిని ఒక ప్యూర్ ట్రావెల్ డెస్టినేషన్గా మార్చాయి.– ఎం.జి.కిశోర్, ట్రావెలర్బాధ్యతాయుతమైన పర్యాటకానికి ఉదాహరణసోషల్ మీడియా కారణంగా వంజంగి పాపులారిటీ పెరిగినా, ఇప్పటికీ ఇది కమర్షియల్ పర్యాటక కేంద్రంగా మారలేదు. ఇది లోపం కాదు, పెద్ద ప్లస్ పాయింట్. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్రకృతిని కాపాడుకోవడం కోసం పర్యాటకులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. దీని వల్ల ఈ ప్రాంతం తన సహజ స్వరూపాన్ని ఇప్పటికీ నిలుపుకుంటోంది.ఎప్పుడు వెళ్లాలి?వంజంగి సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు సరైన సమయం. ఈ సమయంలో పొగమంచు, మేఘాల మధ్య నుంచి సూర్యుడు ఉదయించే దృశ్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సన్రైజ్ చూడాలంటే ఉదయం 4.30 నుంచి 5 గంటల మధ్య వ్యూ పాయింట్కు చేరుకోవాల్సి ఉంటుంది.ఎక్కడ ఉండాలి?విశాఖ జిల్లా నుంచి లంబసింగి లేదా అరకు చేరుకుని, అక్కడి నుంచి వంజంగి ట్రిప్ ప్లాన్ చేయవచ్చు. ఉదయం 5:00–6:30 మధ్య మబ్బుల మ్యాజిక్ షో ముగిసిన వెంటనే ఎక్కువ మంది తమ హోటల్కి వెళ్తారు. చాలామంది అరకును బేస్ చేసుకుని వంజంగి ట్రిప్ ప్లాన్ చేస్తారు. వంజంగికి దగ్గరలోని పాడేరు మండలంలో కూడా నైట్స్టే ప్లాన్ చేయవచ్చు. అక్కడి నుంచి షేరింగ్ ఆటో లేదా జీప్ ద్వారా వంజంగి కొండ పాదం వరకు చేరుకోవడం సులభం. వంజంగి, ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు ప్రకృతిని గౌరవిస్తూ, ప్రశాంతంగా ప్రయాణాన్ని ఆస్వాదించగలిగే ఒక ప్రత్యేక అనుభవం. బయటి ప్రపంచానికి దూరంగా ఒకరోజు గడపాలి అనుకునేవారికి ఇది ఒక అవసరం.ఎం జి కిశోర్ ట్రావెలర్(చదవండి: ట్రావెల్స్లో సరికొత్త ట్రెండ్స్..! ఇలాంటి టూర్స్ గురించి విన్నారా?)
ట్రావెల్స్లో సరికొత్త ట్రెండ్స్..! ఇలాంటి టూర్స్ గురించి విన్నారా?
ఏ కాలంలో అయినా ప్రయాణమంటే సంతోషం. ఉల్లాసం. ఉత్సాహం. అయితే కాలంతోటు ప్రయాణాలకు సంబంధించి అభిరుచులు, ఆసక్తులు, ట్రెండ్స్ మారుతున్నాయి. అలాంటి వాటిలో కొన్ని ట్రెండ్స్ గురించి...రోడ్ ట్రిప్పదిమందితో కలిసి ప్రయాణాలను ఎంజాయ్ చేసే వారు ఒక రకం. ఒంటరిగా మాత్రమే ఎంజాయ్ చేసే వారు మరొక రకం. రెండో కోవకు చెందిన వారికి నచ్చిన ట్రెండ్...రోడ్ ట్రిప్. హిల్టన్ ‘ట్రెండ్స్ రిపోర్ట్’ ప్రపంచవ్యాప్తంగా రోడ్ ట్రిప్లకు పెరుగుతున్న ఆసక్తి గురించి వెల్లడించింది. ‘క్లాసిక్ రోడ్ ట్రిప్ అనేది లగ్జరీ అనుభవం’ అంటున్నాడు డ్రైవింగ్ హాలిడే స్పెషలిస్ట్ హంటర్ మోస్. ఒకటి లేదా రెండు రోజుల ప్రయాణల పట్ల ఆసక్తి చూపే వారు రోడ్ ట్రిప్లను ఇష్టపడుతున్నారు. జెన్ జీలో ఎక్కువ మంది సోలో రోడ్ ట్రిప్లను ఇష్టపడుతున్నారు.‘చే గువేరా ది మోటర్సైకిల్ డైరీస్ పుస్తకం చదివిన తరువాత, మోటర్ బైక్పై ప్రయాణాలు చేయాలనే ఆసక్తి మొదలైంది. మొదట్లో కష్టం అనిపించినా ఆ తరువాత ఎలాంటి సమస్య అనిపించలేదు. రోడ్డు ట్రిప్లతో మనసు ఉత్సాహంగా ఉంటుంది’ అంటున్నాడు హైదరాబాద్కు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ చేతన్.‘ఉత్తర అమెరికా, యూరప్లలో కారు అనేది వాహనం మాత్రమే కాదు. అంతకుమించి. రోడ్డు ప్రయాణాలలో అది వారికి స్నేహితుడు. రోడ్డు పొడవునా కారుతో ముచ్చట్లు చెబుతూ ప్రయాణిస్తుంటారు చాలామంది’ అంటుంది ఒక ట్రావెల్ డిజిటల్ సంస్థలో చీఫ్ బిహేవియర్ ఆఫీసర్గా పనిచేస్తున్న మిలేనా నికోలోవా.అల్ట్రా పర్సనలైజ్డ్ ట్రిప్స్ప్రయాణం అంటేనే సంతోషం. అయితే విషాద సమయాల్లో చేసే ప్రయాణాలు కూడా ఉంటాయి. విషాదం నుంచి బయటి పడి మనసును తేలిక చేసుకునే ప్రయాణాలు ఇవి. ఇలాంటి అల్ట్రా పర్సనలైజ్డ్ ట్రిప్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఊపందుకున్నాయి.కుటుంబ సభ్యుల మరణం, విడాకులు తీసుకోవడం... ఇలా జీవితంలోని రకరకాల విషాదాల నుంచి బయటపడడానికి ఈ స్పెషల్ టూర్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘గ్రీఫ్ టూర్స్ అనేవి ట్రావెల్ ఇండస్ట్రీకి సరికొత్త అవకాశం’ అంటుంది కల్చరల్ ట్రెండ్స్ స్పెషలిస్ట్ జాస్మిన్ బినా.‘విషాదాల నుంచి బయటపడడానికి ప్రయాణాలు, కొత్త ప్రదేశాలు ఏ మేరకు ఉపయోగపడతాయి?’ అని చెప్పడానికి సంబంధించి శాస్త్రీయ పరిశోధనలు పరిమితంగానే ఉన్నప్పటికీ ‘విషాదం నుంచి బయటపడే ఒక మార్గం...ప్రయాణం’ అనేదాంట్లో విభేదాలు లేవు.న్యూరో ఇమేజింగ్తో దుఃఖాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త మేరీ ఫ్రాన్సిస్... ‘ప్రయాణం అనేది దుఃఖం నుంచి బయటపడే మార్గాలలో ఒకటి’ అన్నారు. దుఃఖం నుంచి బయటపడే ఈ మార్గాన్ని ‘వెల్నెస్ ట్రావెల్ ట్రెండ్’ అని కూడా పిలుస్తున్నారు. ‘రెండు ప్రపంచాల మధ్య మనం ఊగిసలాడుతున్నప్పుడు దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయాణం ఉపకరిస్తుంది. అదుపు తప్పిన భావోద్వేగాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడం ద్వారా దుఃఖభారాన్ని తగ్గించుకోవచ్చు’ అంటున్నారు డాక్టర్ రాబర్ట్ నీమెయర్. (చదవండి: జస్ట్ రెండేళ్లకే ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల అధిక వేతనం..! కానీ..)
అందంలో.. అధికారంలో..ఆమెకు సాటిరారెవ్వరూ..!
కుటుంబ నేపథ్యం ఆర్థిక సమస్యలకు నిలయం. ఆ నేపథ్యం నుంచి చదువుపై మనసు లగ్నం చేయడం గ్రేట్ అంటే..అందులోనూ..ఏకంగా సివిల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్పై గురిపెట్టడం అంటే మాటలు కాదు. అయినా..ఆ అనితరసాధ్యమైన ఆ పరీక్షను ఎలగైనా గెలవాలన్నదే ఆమె ధ్యేయం. అదొక్కటి అజేయంగా ఎదురునిలబడేలా చేసి..గెలుపుని పాదాక్రాంతం చేసుకుని స్ఫూర్తిగా నిలిచారామె. అంతటితో ఆగలేదు..విధుల పరంగానూ వార్తల్లో నిలిస్తూ..అధికారి అంటే ఇలా ఉండాలి అని ప్రశంసలు సైతం అందుకుని పేరు తెచ్చుకున్నారు. అంతేగాదు ఆమె అందంలోనూ మేటీ. అంతా ఆమెనూ మేథస్సుతో కూడిన అందాల రాశిగా పిలుచుకుంటారు. ఎవరామె..? అంటే..ఆ అందాల సరస్వతే అను బెనివాల్. ఢిల్లీలోని పితాంపురా ప్రాంతంలో ఏప్రిల్ 26, 1992న జన్మించిన అను బెనివాల్ కుటుంబం అత్యంత పేదరికంతో అల్లాడుతూ ఉండేది. తండ్రి సంజయ్ కుమార్ ఓ చిన్న బటన్ తయారీ యూనిట్ని నడిపేవాడు, తల్లి కుటుంబ పోషణ కోసం తనవంతుగా సూట్లు కుట్టేది. అయితే తండ్రి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతగా చదువుకోలేదు. అయినా తన పిల్లలు బాగా చదువుకోవాలని ఆరాటపడేవాడు. అతడి ఆశయానికి అనుగుణంగానే ఇద్దరు పిల్లలు చదువులో బాగా రాణించారు. అంతేగాదు ఆమె యూపీఎస్సీకి సన్నద్ధమైన తరుణంలో ఆమె తల్లిదండ్రులిద్దరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి గుండె జబ్బు వినికిడి లోపంతో బాధపడుతుంటే..ఆమె తల్లి, నాడీ సంబంధిత రోగి, రెండు శస్త్రచికిత్సలు కూడా చేయించుకుందామె. ఇన్ని సవాళ్లు ఇంట్లో ఉన్నా చదువులో ఎప్పుడూ రాజీపడలేదు.. అను. ఇక ఆమె సోదరుడు ఢిల్లీలో ఐఐటీ ఇంజనీరింగ్ వైపుకి వెళ్లగా, అను ఢిల్లీలోనే పాఠశాల విద్య, BSc డిగ్రీ, ఎమ్మెస్సీ పూర్తి చేసింది. కొన్నాళ్లు నానోసైన్స్ పరిశోధన రంగంలో పనిచేసింది. తన విద్యా, పరిశోధన పని పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షపై దృష్టి సారించి.. భౌగోళిక శాస్త్రాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుంది.సివిల్ ఎగ్జామ్లో అను జర్నీ..అను 2018లో తొలిసారి సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైంది కానీ ప్రాథమిక దశలోనే ఉత్తీర్ణురాలైంది. ఇక రెండో ప్రయత్నంలో మెయిన్స్కు చేరినా.. తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే అను పట్టుదటతో మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా ర్యాంక్ 638 ర్యాంక్ సాధించినా..అనుకున్న రంగంలో విధులు నిర్వర్తించే అకాశం రాకపోవడంతో మరోసారి సివిల్స్ ఎగ్జామ్కి సన్నద్ధమై మరి నాల్గోప్రయత్నంలో 2022లో 217 ఆల్ ఇండియా ర్యాంక్ను సాధించి.. ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్)కు ఎంపికైంది. అలా ఆమె మధ్యప్రదేశ్ కేడర్లో ఐపీఎస్ అధికారిణిగా విధులు నిర్వర్తించేవారామె. అంతేగాదు ఆమె ఇటీవల మధ్యప్రదేశ్లో గాల్వియర్లో వాహన తనిఖీల నిమిత్తం ఓ అనూహ్య ఘటనతో వార్తల్లో నిలిచి ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో దటీజ ఐపీఎస్ అను అంటూ అంత కీర్తించారు ఆమెను. ఆ వీడియోలో ఒక డ్రైవర్తో మీ మామ రాష్ట్రపతి అయిన చలానా జారీచేస్తాం అని చెప్పిన డెలాగ్ శెభాష్ మేడమ్ అంటూ సలాం కొట్టారు ఆమెకు. పాలనలో తనకు సాటిలేరెవ్వరూ అనిపించుకుంది ఐపీఎస్ అను బెనివాల్. వ్యక్తిగత జీవితం..ఇక ఈ అధికారిణి అను మధ్యప్రదేశ్ కేడర్లో పనిచేస్తున్న IPS అధికారి డాక్టర్ ఆయుష్ జఖర్ను వివాహం చేసుకున్నారు. ఇక ఆమె భర్త రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దిలీప్ జఖర్ కుమారుడు. ఇక అను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ..నెటిజన్లతో పిట్నెస్కి సంబంధించిన టిప్స్ షేర్స్ చేస్తుంటుంటారామె. View this post on Instagram A post shared by NDTV India (@ndtvindia)(చదవండి: జస్ట్ రెండేళ్లకే ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల అధిక వేతనం..! కానీ..)
అంతర్జాతీయం
35 రోజుల్లో 11 మంది హిందువుల దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై తీవ్రమైన హింస కొనసాగుతోంది. యూనస్నేతృత్వంలోని ప్రభుత్వం ఇవి మతపరమైన దాడులు, హత్యలు కాదని పదేపదే చెబుతున్నప్పటికీ, జరుగుతున్నసంఘటనలు, వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిణామాలు దేశంలో మైనారిటీల భద్రతకు శాంతిభద్రతలు ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి.బంగ్లాదేశంలో జరుగుతున్ హింసను కేవలం యాదృచ్ఛిక సంఘటనగానో లేదా వేర్వేరు నేరాలుగానో కొట్టిపారేయడం కష్టమవుతోందంటున్నారు విశ్లేషకులు. కేవలం ఒక నెలలోనే దేశవ్యాప్తంగా కనీసం 11 మంది హిందువులు హత్యకు గురయ్యారు, వీరిలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో చనిపోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో 35 రోజుల వ్యవధిలో ఇన్ని హత్యలు జరిగాయి. ఈ మరణాలు, మూకదాడులు, కాల్పులు , గుంపు దాడుల పరంపరను వెల్లడిస్తున్నాయి. ఈ వరుస ఘటనలు మైనారిటీలలో విస్తృత భయాలను రేపడంతోపాటు, ప్రభుత్వ సామర్థ్యం, ఉద్దేశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.2026 జనవరి 5, ఒకే రోజులో రెండు హత్యలుజనవరి 5న, జెస్సోర్ జిల్లాలో హిందూ వార్తాపత్రిక సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చి చంపారు. కొన్ని గంటల్లోనే ఢాకా సమీపంలోని నర్సింగ్డి జిల్లాలో హిందూ కిరాణా వ్యాపారి మణి చక్రవర్తిపై దాడి. ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్యలతో కేవలం 18 రోజుల్లోనే హిందువుల హత్యల సంఖ్య ఐదు, ఆరుకు చేరింది.ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యంజనవరి 3న మూక దాడి, సజీవ దహనంషరియత్పూర్ జిల్లాకు చెందిన హిందూ వ్యాపారవేత్త ఖోకన్ చంద్ర దాస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక మూక దాడిలో తీవ్రంగా గాయపడి జనవరి 3న మరణించాడు. అతణ్ని కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతను ఒక చెరువులోకి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తీవ్రమైన కాలిన గాయాలతో, ఢాకాలో మరణించాడు.డిసెంబర్ 29, 2025: సహోద్యోగి కాల్చివేతఅన్సార్ బాహినిలో హిందూ సభ్యుడైన బజేంద్ర బిస్వాస్ను మైమెన్సింగ్ జిల్లాలోని ఒక వస్త్ర కర్మాగారంలో అతని సహోద్యోగి కాల్చి చంపాడు. దీనిని పోలీసులు మొదటగా అనుకోకుండా జరిగి ఉండవచ్చని పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు, కానీ ఈ హత్య మైనారిటీ వర్గాలలో పెరుగుతున్న ఆందోళనను మరింత పెంచింది.డిసెంబర్ 24, 2025: మాబ్ లించింగ్అమృత్ మండల్ను రాజ్బరి జిల్లాలో ఒక గుంపు కొట్టి చంపింది. హత్యకు మతపరమైన కోణం లేదని అధికారులు పేర్కొన్నారు, కానీ కొన్ని రోజులకే మరొక మూక దాడి జరిగడంతో మైనారిటీ భయాలు మరింత తీవ్రమయ్యాయి.డిసెంబర్ 18, 2025: ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మూక దాడిమైమెన్సింగ్లో 27 ఏళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ హత్య ఒక మలుపు తిరిగింది. దాస్ను ఇస్లామిక్ గుంపు కొట్టి చంపింది, అతని శరీరాన్ని హైవేకి వేలాడదీసి నిప్పంటించింది. దైవదూషణ జరిగిందనే అస్పష్టమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, దర్యాప్తు అధికారులు తరువాత హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని కనుగొన్నారు.ఇదీ చదవండి: సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలిడిసెంబర్ 12న, 18 ఏళ్ల హిందూ ఆటోరిక్షా డ్రైవర్ శాంటో చంద్ర దాస్, కుమిల్లాలో గొంతు కోసి హత్య చేశారు. డిసెంబర్ 7న, 1971 విముక్తి యుద్ధ అనుభవజ్ఞుడు జోగేష్ చంద్ర రాయ్, అతని భార్య సుబోర్నా రాయ్లను రంగ్పూర్లో వారింట్లోనే గొంతు కోసి చంపేశారు. డిసెంబర్ 2న ఇద్దరు హిందువులు బంగారు వ్యాపారి ప్రంతోష్ కోర్మోకర్ను నర్సింగ్డిలో కాల్చి చంపగా, ఉత్పోల్ సర్కార్ను ఫరీద్పూర్లో నరికి చంపారు.మైనారిటీ హత్యలతో పాటు, బంగ్లాదేశ్లో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయి ఒక నివేదిక ప్రకారం 2025లోనే 197 మూక హత్యలు, 2024లో 293 హత్యలు జరిగాయి. మానవ హక్కుల సంఘాలు దీనిపై హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్ డీసీకి చెందిన హిందుస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఢాకాను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మైనారిటీ భద్రతకు హామీ ఇవ్వాలని కోరింది.అయినప్పటికీ యూనస్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. దీపు చంద్ర దాస్ హత్యపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు రగలడంతో తాత్కాలిక ప్రభుత్వం సంతాపాన్ని వ్యక్తం చేసింది.భారతదేశం ఖండనభారతదేశం దీపు చంద్ర హత్యను తీవ్రంగా ఖండించింది. "బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై కొనసాగుతున్న శత్రుత్వం , దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మైమెన్సింగ్లో ఇటీవల జరిగిన హిందూ యువకుడి దారుణ హత్యను మేము ఖండిస్తున్నామనీ, బాధితులను న్యాయం చేయాలని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
వెనెజువెలా బాధ్యతపై ట్రంప్ సంచలన ప్రకటన
వెనెజువెలా భవిష్యత్తుపై ట్రంప్ తన ప్లాన్ను ప్రకటించారు. ఆదేశంలో ఇప్పట్లో ఎన్నికలు ఉండవని తెలిపారు. ప్రస్తుతం ఆ దేశంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని మౌళిక సదుపాయాలు, సంస్థాగత నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. వెనెజువెలా బాధ్యత ఎవరూ చూసుకుంటారు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇట్స్..మీ అని ట్రంప్ బదులిచ్చారు.కొద్దిరోజుల క్రితం వెనెజువెలాపై యుఎస్ దాడి చేసి.. అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెనెజువెలా తదుపరి అధ్యక్షుడు ఎవరు? అక్కడి పాలన, తదితర పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ తదితర విషయాలపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. అయితే ఆ దేశ భవిష్యత్తుపై ట్రంప్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆ దేశంలో ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ లేదని తెలిపారు.ట్రంప్ మాట్లాడుతూ.. "మనం మెుదటగా దేశాన్ని సరిచేయాలి, ప్రజలు ఓటు వేయలేని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించకూడదు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించేలా యుఎస్ ఆయిల్ కంపెనీలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మెుదటగా యుఎస్ ఆయిల్ కంపెనీలు వెనెజువెలాలో పెట్టుబడులు పెడతాయి. అనంతరం ఆ మెుత్తాన్ని దాని రెవెన్యూ ద్వారా రీయంబర్స్మెంట్ చేసుకుంటాయి." అని అన్నారు.ఈ వ్యవస్థ మెుత్తం సెట్ కావడానికి 18 నెలల వరకూ సమయం పడుతుందని ట్రంప్ తెలిపారు. వెనెజువెలాతో అమెరికా యుద్ధం చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని డ్రగ్స్ అమ్మేవారితో అమెరికా ఎప్పుడు యుద్ధం చేయదని తెలిపారు. ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఆదేశ నాయకత్వమే కారణమని తెలిపారు.అయితే అక్కడే ఉన్న ఒక జర్నలిస్టు అంతిమంగా వెనెజువెలా ఛార్జ్ ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించగా ట్రంప్ దానికి బదులిస్తూ అది 'నేనే' అని తెలిపారు. తన సెక్రటరీ స్పానిష్ భాష చాలా బాగా మాట్లాడుతుందని ఆ వ్యవహారాలు తాను చూసుకుంటుందని తెలిపారు. ఒకవేళ వెనెజువెలాలో పరిస్థితులు అదుపులో లేకపోతే మరోసారి దాడి చేయడానికి యుఎస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్లో మరింత ఉధృతమైన ఆందోళనలు
‘‘ఇజ్రాయెల్తో 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగినప్పుడు కూడా ఖమేనీ ఎక్కడికి పారిపోలేదు. అలాంటి సొంత దేశంలో.. అదీ అక్కడక్కడా జరిగే నిరసనలు చూసి పారిపోతారా?..’’ అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ దేశం విడిచిపోతారన్న కథనాలను ఇరాన్ వర్గాలు ఖండిస్తున్నాయి. కానీ, పరిస్థితులు మాత్రం ఆ ప్రచారంలో కాస్తో కూస్తో వాస్తవం లేకపోలేదని చెబుతున్నాయి. ఇరాన్లో ప్రజా నిరసనల వేళ.. అయతొల్లా అలీ ఖమేనీ అడ్రస్ లేకుండా పోయారు. ఆఖరికి.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా ఆయన స్పందించడం లేదు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయారని ప్రచారం జోరందుకుంది. కానీ, ఇరాన్ వర్గాలు ఆ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. అయితే మారుతున్న సమీకరణాలు.. పరిస్థితులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఖమేనీ నెక్ట్స్ స్టెప్ గురించి ది టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్లో చెలరేగిన ఆందోళనలను ‘ఫ్లాన్ ఏ’ ద్వారా అణచివేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే.. వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య నేపథ్యంలో ఖమేనీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రజా ఉద్యమం చల్లారకపోయినా.. ఒకవేళ ట్రంప్ జోక్యం చేసుకున్నా.. తక్షణమే దేశం విడిచిపోవాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సదరు కథనం పేర్కొంది. 86 ఏళ్ల ఖమేనీకి, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో తన వారసుడిగా భావిస్తున్న కుమారుడు ముజ్తబా సహా సుమారు 20 మంది బృందంతో ఖమేనీ టెహ్రాన్ విడిచి వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు ప్లాన్ బీ సిద్ధమైనట్లు ది టైమ్స్ పత్రిక సదరు ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశాన్ని కథనంగా ఇచ్చింది. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు 78 నగరాలకు విస్తరించాయి. కనీసం 35 మంది మరణించగా, 1200 మందికి పైగా అరెస్టయ్యారు. అయితే.. భద్రతా బలగాల కాల్పుల్లో పసికందులు కూడా బలయ్యారని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. విదేశీ జోక్యం దాకా పరిస్థితి వస్తే ఆయన తప్పకుండా దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి తరలి పోవచ్చనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అలాంటి ఇలాంటి సంక్షోభం కాదుఇరాన్ కరెన్సీ రియాల్ విలువ 2025 డిసెంబర్లో డాలర్కు 42 వేల రియాల్కు చేరుకుంది. దీంతో ఆహార ధరలు (72%) ఔషధాల రేట్లు(50%) ఆకాశాన్నంటాయి. 2026 బడ్జెట్లో పన్నులు 62% పెంచే ప్రతిపాదన జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అంతర్జాతీయ ప్రతిస్పందనఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులపై దాడులు జరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్లో ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని సూచించింది.బలహీనంగా ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’.ఇరాన్ మిత్ర బలగాలైన హమాస్, హిజ్బుల్లా, హౌతి తిరుగుబాటుదారులు, సిరియా ప్రభుత్వం గత కొన్నేళ్లలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో అమెరికా–ఇజ్రాయెల్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమి క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది. ఇరాన్పై వెనెజువెలా తరహా సైనిక చర్య జరిగితే ఇవి ఎంత వరకు మద్దతుగా నిలుస్తాయనేదానిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.ఖమేనీ పాలనప్రముఖ మత గురువు అయిన ఖమేనీ.. 1979 ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 1981లో అధ్యక్షుడిగా, 1989లో సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అంటే గత 35 ఏళ్లుగా ఆయన ఇరాన్లో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. ఆర్థిక సంక్షోభం, ప్రజా అసంతృప్తి, అంతర్జాతీయ ఒత్తిడి మధ్య ఖమేనీ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.
ఒక్కో దంతం బరువు 45 కిలోలు..ఆ ఏనుగు ఇక లేదు
కెన్యా దేశానికి చెందిన ప్రియమైన క్రెగ్ అనే ఏనుగు తన రెండు దంతాలతో ప్రసిద్ధి చెందింది. ఒక్కో దంతం 45 కిలోలతో ఆ ఏనుగు ఖ్యాతి గడించింది. అయితే ఆ ఏనుగు కన్నుమూసింది. ఇటీవల అంబోసెలి నేషనల్ పార్క్లో ఆ ఏనుగు మరణించింది. చనిపోయేనాటికి ఏనుగు వయస్సు 54 ఏళ్లు.1972లో అంబోసెలి నేషనల్ పార్క్లో జన్మించిన క్రెగ్.. ఇప్పుడు అదే పార్క్లో మరణించింది. సూపర్ టస్కర్ అనే అరుదైన వర్గానికి చెందిన ఏనుగు. ఈ వర్గానికి చెందిన ఏనుగుల దంతాలు ఒక్కొక్కటి 45 కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి.క్రెగ్ యొక్క దంతాలు చాలా పొడవుగా ఉండి నడుస్తున్నప్పుడు నేలను తాకేవి. కెన్యా వన్య ప్రాణ సంరక్షణలో క్రెగ్ ప్రముఖ పాత్ర పోషించింది. క్రెగ్ మరణం తర్వాత అతని దంతాలను జాగ్రత్తగా తొలగించి సంరక్షణ కోసం భద్రపరిచింది. క్రెగ్ వారసత్వాన్ని కాపాడే క్రమంలో ఆ దంతాలను భద్రపరిచారు.
జాతీయం
బెంగాల్ ఎన్నికల పోరు.. ఎవరిది జోరు?
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం మొదలుపెట్టేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ తరపున ప్రచారం సాగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రచార బాధ్యతను ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు. ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగానే ఆ పరిస్థితి ఉందా అంటే.. లేదనే అంటోంది తాజా సర్వే.మళ్లీ దీదీకే చాన్స్మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముందని 'ఓట్ వైబ్' సర్వే అంచనా వేసింది. దీని ప్రకారం 39.6 శాతం మంది ఓటర్లు దీదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. కమలం పార్టీకి ఓటు వేస్తామని చెప్పిన వారు 30.5 శాతం మంది మాత్రమే. నిమ్న వర్గాల నుంచి కాషాయ పార్టీకి ఎక్కువ మద్దతు లభించడం ఆసక్తికర పరిణామం. ఎస్సీ (50%), ఎస్టీ (38%), ఓబీసీ ఓటర్లలో (44%) అధిక శాతం బీజేపీ వైపు మొగ్గు చూపారు. మైనారిటీలు మమతా బెనర్జీ పార్టీకే జై కొట్టారు. ముస్లిం ఓటర్లలో 54 శాతం మంది తృణమూల్ వైపు నిలిచారు. హిందూ సాధారణ వర్గం ఓటర్లలో అత్యధిక మద్దతు కూడా తృణమూల్ కాంగ్రెస్కే దక్కడం విశేషం.ప్రభుత్వ పనితీరు.. ప్చ్బెంగాల్ యువత ఎక్కువగా బీజేపీకి మద్దతుగా ఉన్నారని సర్వే వెల్లడించింది. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారు కాషాయపార్టీకి అండగా ఉన్నారు. సీనియర్ సిటిజనులు మాత్రం మమతా బెనర్జీపైనే నమ్మకం ఉంచారు. అయితే దీదీ ప్రభుత్వ పనితీరుపై మాత్రం బెంగాల్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రభుత్వం బాలేదని 40.6 శాతం మంది నిర్మోహమాటంగా తేల్చేశారు. 38.3 శాతం మంది మాత్రం ప్రభుత్వ పనితీరు బాగుదంటూ కితాబిచ్చారు. ముస్లింల్లో సగానికి పైగా మమతా ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేయగా.. ఎస్సీ, ఎస్టీల్లో మాత్రం 50 శాతం కంటే ఎక్కువ మంది పేలవం అంటూ పెదవి విరిచారు. ఓటు ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయం తీసుకోని వారు 18.5 శాతం మంది అని సర్వే తెలిపింది.దీదీ బెస్ట్ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ మాత్రమే సరైన నాయకురాలని బెంగాల్ ప్రజలు క్లియర్కట్గా తేల్చేశారు. సర్వేలో ఆమెకు 35.4 శాతం మంది మద్దతు ప్రకటించారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారికి 20.9 శాతం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య (Samik Bhattacharya) 14.8 శాతం మద్దతుతో రెండుమూడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. నిరుద్యోగంపై బెంగఉపాధిలేమి బెంగాల్ ప్రజలను బాగా కలవరపెడుతోంది. నిరుద్యోగం (Unemployment) పట్ల 33.8 శాతం మంది ఓటర్లు ఆందోళన వెలిచ్చారు. శాంతిభద్రతలు/మహిళల భద్రత (19.1%), అవినీతి (18.3%) గురించి కూడా బెంగాలీలు బెంగగా ఉన్నారు. మతపరమైన ధ్రువీకరణ (కమ్యునల్ పోలరైజేషన్) గురించి మాత్రం బెంగాల్ ఓటర్లు (3 శాతం) పెద్దగా పట్టించుకోలేదు. నాయకత్వం లేదా సిద్ధాంతం ఆధారంగా కాకుండా.. ప్రభుత్వ పనితీరును చూసే ఓటు వేస్తామని 29.3 శాతం మంది చెప్పడం గమనించాల్సిన విషయం. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతఎమ్మెల్యేల స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టు సర్వే బయటపెట్టింది. కేవలం 26.9 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకునేందుకు అనుకూలంగా ఉన్నారు. అదే పార్టీ నుండి వేరే అభ్యర్థిని నిలబెట్టాలని ఎక్కువ మంది ఓటర్లు కోరుకుంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థిని మార్చకపోతే ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయాలని యోచిస్తున్నారు.బీజేపీకి అదే మైనస్బెంగాల్లో బీజేపీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లు అంతర్గత కలహాలు, వర్గ విభేదాలని 20 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. బెంగాల్ సంస్కృతిని (Bengal culture) అర్థం చేసుకోలేదనే అభిప్రాయాన్ని 16.2 శాతం మంది సర్వేలో వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన రాష్ట్ర నాయకుడు లేకపోవడం బీజేపీకి మరో మైనస్ అని 14.5 శాతం మంది పేర్కొన్నారు.చదవండి: చిరాగ్ పాశ్వాన్ ఈసారైనా చక్రం తిప్పుతారా?టీఎంసీకి కబీర్ ఎఫెక్ట్టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ (Humayun Kabir).. తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్కు గండి కొట్టే అవకాశముందని ఓటర్లలో 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆయన వెనుక బీజేపీ లేదా టీఎంసీ ఉండివుండొచ్చన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్లో బాబ్రీ మాదిరి మసీదు నిర్మాణానికి పూనుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే.
ఆ ఒక్క రాష్ట్రంలోనే 2కోట్ల 89 లక్షల ఓట్ల తొలగింపు
పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల అభ్యంతరాలను పక్కన పెట్టి.. ఈ ప్రక్రియను కొనసాగించాలని కోర్టులు సైతం ఆదేశించాయి. దీంతో.. ఎన్నికల సంఘం చకచకా ప్రక్రియను కొనసాగిస్తోంది. లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) నివేదికను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 2కోట్ల 89 లక్షల మంది ఓట్లను తొలగించినట్లు తెలిపింది. దేశంలో ఓటర్ల జాబితాను సమగ్రంగా పారదర్శకంగా రూపొందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం 2025లో (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమగ్రంగా సర్వే జరిపి కొత్త ఎంట్రీలను చేర్చడం, అర్హత లేనివి తొలగించడం.. ఇంకా ఏవైనా సవరణలుంటే చేయడం తదితరమైనవి చేయనున్నారు. అయితే ఇటీవలే యూపీలో (SIR) సర్వే నిర్వహించగా తాజాగా దాని వివరాలను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు.దీనిపై ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ "రాష్ట్రంలో మెుత్తంగా 15కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 12 కోట్ల మంది వెరిఫికేషన్లో పాల్గొన్నారు. మెుత్తంగా 81శాతం మంది సర్వే పత్రాలపై సంతకం చేసి సమర్పించారు. 18శాతం మంది పాల్గొనలేదు. ఓటర్ల సర్వేలో 46.32లక్షల మంది ఓటర్లు మరణించినట్లు తేలింది. 2.17 కోట్ల మంది వలసకు వేరే ప్రాంతం వెళ్లారు. 25.47 లక్షల మంది వారి పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్నారు". అని తెలిపారు. రమారమీగా దాదాపు 3 కోట్ల మందిని ఓటర్ల జాబితానుండి తొలిగించినట్లు పేర్కొన్నారు.దీంతో దేశంలో అత్యధిక శాతం ఓట్ల తొలగింపు జరిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రికార్డులోకెక్కింది. ఉత్తరప్రదేశ్ 18.75శాతం, తమిళనాడు 15శాతం, గుజరాత్ 14.5శాతం ఆ తరువాతి స్థానాల్లో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి ఆరు వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపింది. ఉత్తరప్రదేశ్లో దాదాపు 91శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని మరో తొమ్మిదిశాతం మిగిలి ఉందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.
పెద్ద కళ్లకళ్లతోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?
సోషల్ మీడియా రోజుకో వింత వైరల్గా మారుతుంది. తాజాగా మరోసారి వైరల్ వింత మిస్టరీగా మార్చింది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోనే. ఇంతింత కళ్లతో ఉన్న ఒక మహిళ ఫోటోను దిష్టి బొమ్మలా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలలో తెగ వాడేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ దీనిపై ఎక్స్లో ఒక పోస్ట్ పంచుకోవడంతో చర్చ జోరందుకుంది. బెంగళూరు వెలుపల ఉన్న ఒక నిర్మాణ స్థలంలో ఈ ఫోటో చూశాననీ, Google Lens, ఆన్లైన్ శోధనలను ప్రయత్నించానని, కానీ స్పష్టమైన సమాధానాలు దొరకలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ "ఆమె ఎవరు?" కోరింది. దీంతో ఆన్లైన్లో హాస్యాస్పదమైన ఊహాగానాలతోపాటు, రకరకాల సమాధానాలువచ్చాయి.I see this woman everywhere in Karnataka outside bangalore where there’s a construction happening. I tried google lens to check for discussions but can’t find any details. Who is she? pic.twitter.com/RAgMDXXJMt— unc unitechy (@unitechy) January 5, 2026 కర్ణాటకలో నిర్మాణ ప్రదేశాలు, దుకాణాలు, పొలాలలో కూడా పదే పదే కనిపించే ఒక మహిళ ఫోటోపై దృష్టి సారించింది. సగం నిర్మించిన ఇళ్ల నుండి వ్యవసాయ భూమి వరకు ఈ మహిళ ఫోటోను ఎందుకు పెట్టారనే చర్చ ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపర్చింది. ఆఖరికి AI చాట్బాట్లు కూడా అడిగేశారు. ఈఫోటోను'దిష్టి పరిహారం'గా వాడుతున్నారని కొందరంటే, చిక్కబల్లాపుర సమీపంలోని ఒక పొలంలో దిష్టిబొమ్మలా ఇదే ఫోటోలను చూశానని మరొకరు కమెంట్ చేశారు.ఇదీ చదవండి: గ్వాలియర్లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్This lady is Niharika Rao, a You Tuber. Hundreds of people in Karnataka are putting up her photo in front of their shops, houses, farms to ward off negativity (drishti)This, is the true power of feminism pic.twitter.com/xsPRbFX7OD— 𝕲𝖆𝖓𝖊𝖘𝖍 * (@ggganeshh) May 16, 2024 ఇంతకీ ఆమె ఎవరంటేగణేష్ అనే వినియోగదారు వివరణాత్మక వివరణ ఇవ్వడంతో దీనిపై ష్టత వచ్చింది. అతని ప్రకారం, ఫోటోలు ఉన్న మహిళ పేరు నిహారిక రావు. ఒక యూట్యూబర్. స్థానికులు ఆమె ఫోటోను ఇళ్ళు, దుకాణాలు, పొలాలు, నిర్మాణ ప్రదేశాల వెలుపల ఉంచిన తరువాత నెగిటివిటీ పోయిందట,మంచి జరిగిందట. ఇది ఆ నోటా ఈ నోటా పాకి దీన్ని దిష్టిబొమ్మగా వాడేస్తున్నారన్నమాట. ఇదీ చదవండి: సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి
ఇంట్లోకి రాగానే ఆ దంపతులకు ఊహించని దృశ్యం..!
రాజస్థాన్లోని కోటాకు చెందిన ఓ వ్యక్తి తన తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చినప్పుడు వారి ఇంట్లో ఊహించలేని దృశ్యం కనిపించింది. సుభాష్ కుమార్ రావత్ ఇంట్లో చోరీకి వెళ్లిన ఓ దొంగ.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఎవరూ లేని ఇంటిలో దొంగతనం చేయడానికి ప్లాన్ చేసిన ఓ దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే కన్నంలో సగం దూరిన తర్వాత మధ్యలోనే ఇరుక్కుపోయాడు. బయటకురావడానికి చాలా ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో కిందకి వేలాడుతూ ఉన్నాడు. బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. నేల నుండి 10 అడుగుల ఎత్తులో తల, చేతులు ఇంట్లో లోపల ఉండగా కాళ్లు బయట వేలాడుతూ కనిపించాడు.అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చిన యజమాని సుభాష్ కుమార్ రావత్ వంటగదిలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో దొంగ వేలాడుతుండడాన్ని గమనించారు. తాను దొంగనంటూ ఆ చెప్పిన ఆ వ్యక్తి ఆ దంపతులపై బెదిరింపులకు దిగాడు. తన సహచరులు బయట ఉన్నారని, తాను బయటపడనివ్వకపోతే వారు హాని చేస్తారంటూ హెచ్చరించాడు.In Rajasthan's Kota, a family returned from Khatu Shyam Ji darshan to find a thief stuck in the exhaust fan hole! They called police to pull him out. Accused Pawan drives a police officer's car. 😳 pic.twitter.com/mwNcxjD2AF— Ghar Ke Kalesh (@gharkekalesh) January 6, 2026దీంతో ఆ దంపతులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి దొంగను కన్నం నుంచి బయటకు తీశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఎవరికీ అనుమానం రాకుండా పోలీసు స్టిక్కర్ ఉన్న కారులో వచ్చినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా పోలీసులే షాక్ అయ్యారు. జనవరి 3న జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఎన్ఆర్ఐ
క్వీన్స్ కామన్ వెల్త్ వ్యాసరచన పోటీలో విజేతగా తెలుగమ్మాయి..!
వసుధైవకుటుంబకమ్ అనే సార్వజనీన సార్వకాలిక దృక్పథం.. ప్రపంచ సాహిత్యంలో వలసవాద ధోరణుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ అల్లాడిన ప్రపంచవ్యాప్తంగా ఉండే దీనప్రజానీకానికి మద్దతు తెలిపే కవిత్వ ధోరణి.. ఇలాటి పెద్దపెద్ద విషయాలు ఒక చిన్నారి కవితలలో కనపడటం మామూలు విషయం కానేకాదు. సింగపూర్లో క్రెసెంట్ గర్ల్స్ స్కూల్ నుంచి సెకండరీ 2 విద్యార్థిని అయిన ఆచంట లక్ష్మీ మనోజ్ఞ ఇలాటి గొప్ప అద్భుతాన్నే చేసి చూపించింది. పూవు పుట్టగానే పరిమళిస్తున్న చందంగా చదువుతో పాటు సంగీత సాహిత్యాలు పియానో వాదన, నృత్యం ఇలా బహువిధాలుగా తన ప్రజ్ఞను వికసింపజేసుకుంటున్న మనోజ్ఞ ఈ సంవత్సరం రాయల్ కామన్వెల్త్ సొసైటీ (RCS), పాఠశాలల కోసం ప్రపంచంలోనే అత్యంత పురాతన అంతర్జాతీయ రచనల పోటీ అయిన 'ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC) 2025' విజేతలలో ఒకరిగా ఎంపిక అవడం విశేషం. ఈమె తన కవిత్వం ద్వారా, విశ్వమానవాళికి సంబంధించిన సంవేదనలతో తాదాత్మ్యాన్ని పొందుతుంది. వారి జీవితాలలో నిండిన దైనందిన భావావేశాల లయలను తన కవితలద్వారా స్పృశిస్తుంది. పియానో పట్టుకోని వేళలను ప్రపంచ పౌరుల సుఖదుఃఖాలను ప్రతిబింబించే కవితలను అల్లడానికి సమయాన్ని వినియోగిస్తుంది. పిన్న వయస్కురాలైనప్పటికీ ఈమె కవితా ధోరణులలో ఎలిజబెత్ లిమ్ మరియు ఆన్ లియాంగ్ వంటి రచయితలచే పొందిన ప్రభావాలున్నాయి.మనోజ్ఞ రాసిన, బహుమతి గెలుచుకున్న 'ఇండియా టు మారిషస్' అనే కవిత, తన తల్లి నుంచి వేరు చేయబడి, భారతదేశంలోని తన ఇంటి నుండి మారిషస్లోని ఒక ఎన్క్లోజర్కు తరలించబడిన ఒక చిన్న కోతి కథను చెబుతుంది. భారతదేశంలో జన్మించినా ఆరు నెలల వయస్సులో సింగపూర్కు వెళ్లి అక్కడ శాశ్వత నివాసం చేసే కుటుంబానికి చెందిన మనోజ్ఞ, ఈ పోటీకోసం ఎన్నుకునే ఇతివృత్తంగా - 'అవర్ కామన్వెల్త్ జర్నీ'కి సంబంధించి భారతదేశం గురించి రాయాలనుకుంది.ఆమెకు భారతదేశం, మారిషస్లను కలిపే బానిస కార్మిక వ్యాపారం గురించి అవగాహన ఉంది. దానితో ఆ దేశాల మధ్య మార్గం గురించి, అలాగే మన భారతదేశం నుండి మారిషస్కు వచ్చిన వారి అనుభవాల గురించి పరిశోధించడం ప్రారంభించింది. కార్మికులతో పాటు అన్యదేశ వన్యజీవులతో కూడా వలస వ్యాపారం చేస్తున్నారని తెలుసుకొని వేదనపడ్డది. ఆ విషయమే కోతికి సంబంధించిన ప్రతీకాత్మక దృష్టికోణం నుండి రాయడానికి ఆమెకు ప్రేరణగా మారింది. ఆమె బహుమతి పొందిన కవితలో భారతదేశం నుంచి మారిషస్కు దాని దయనీయమైన ప్రయాణాన్ని వర్ణిస్తూ, మరియు తల్లిచెంత, స్వంత భూమిలో లభించే ఆత్మీయమైన వాతావరణం హఠాత్తుగా కోల్పోయి, పరాయి చోటున బందీయై పలుబాధలు పడుతూ తిరిగి తల్లి ప్రేమను ఆశిస్తూ అది లభించక పడే తపన...జాలికొలిపే తీరులో దాని ఆర్ద్రమైన కోరికను తన తల్లికి స్వగతంగా విన్నవించుకునే -పసికోతి ద్వారా చెప్పబడిన హృదయవిదారకమైన ఒక ఘటనకు చెందిన కవిత ఇది.. బందిఖానాలో ఉన్నప్పుడు , స్వానుభవాలపట్ల గమనిక..తను పొందిన తీపి అనుభవాలకూ.. ప్రస్తుతం అనుభవించే మనోవేదనకూ మధ్య జరిగే సంఘర్షణను ప్రతి ఒక్కరి హృదయాలను తాకేటట్టు వర్ణించే మనోహరమైన కవిత ఇది. ఈ కవితను రాయడానికి భూమికగా - ఇండియానుండి సింగపూర్కు వచ్చి, ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని, తన మరియు తన సోదరి కోసం వారిదైన నూతన జీవితాన్ని ఏర్పరచుకున్న తీరుతెన్నులను గురించి తన తల్లిదండ్రులు చెప్పిన సంగతులు తనకు స్ఫూర్తినిచ్చాయని మనోజ్ఞ చెప్తుంది. ఇలాటి గంభీరమైన, ప్రభావశీలమైన కవితా రచనతోనే ప్రతిష్టాత్మకమైన క్వీన్స్ కామన్వెల్త్ వ్యాసరచన పోటీలో తను రన్నరప్గా ఎంపికైంది. ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరిగింది. తన కుటుంబ సభ్యులు ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి ప్రసన్న, సోదరి శ్రీ మేఘనల సమక్షంలో చిరంజీవి మనోజ్ఞ ఈ అవార్డును హర్ మెజెస్టీ క్వీన్ కెమిల్లా నుంచి అందుకుంది.(చదవండి: మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు)
విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “TTA సేవా డేస్ - 2025” సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, అవసరమైన సామగ్రి పంపిణీ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు రెండు వారాల పాటు పలు జిల్లాల్లో నిర్వహించారు.హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ, మెదక్ సహా పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభించి, బెంచీలు, యూనిఫామ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సులు అందజేశారు. పాఠశాలల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయాల పునర్నిర్మాణం కూడా చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో 10కే రన్ను కూడా నిర్వహించారు. వృద్ధుల కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన క్యారం బోర్డు ఛాంపియన్షిప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ మహా సేవా కార్యక్రమాలను టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెడ్డి నాయకత్వంలో టీటీఏ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, ఫౌండర్ డా. పైళ్ళ మల్లా రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పటలోల్ల, అడ్వైజరీ సభ్యులు భరత్ రెడ్డి మాదడి, శ్రీని అనుగు, పూర్వ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల, ఇండియా కోఆర్డినేటర్ డా. ద్వారకానాథ రెడ్డి, ఇండియా సేవా డేస్ కోఆర్డినేటర్ మధుకర్ రెడ్డి బీరాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యుల మార్గదర్శకత్వం ఈ భారీ సేవా కార్యక్రమాలకు తోడ్పడింది.అమెరికా నుండి వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీఏ టీమ్ సభ్యులకు, ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీఏ మహాసభలు “టీటీఏ మెగా కన్వెన్షన్ - 2026” జూలై 17–19, 2026లో షార్లెట్, నార్త్కరోలైనాలో జరుగనున్నట్లు టీటీఏ నాయకులు వెల్లడించారు
పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..! హాట్టాపిక్గా భారత సంతతి వ్యక్తి పోస్ట్
భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారడమే గాకా ఆ అంశం హాట్టాపిక్గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి. ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు. అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు". అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్లు పెట్టడం గమనార్హం.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్నారై పోస్ట్)
మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
అమెరికాలో మన తెలుగు వారు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా మేరీల్యాండ్లో తెలుగు బాలికలు టెక్నాలజీతో ఓ సమస్య పరిష్కారం కనిపెట్టి.. ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్లో క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. టెక్నాలజీ రంగంలో విశేష ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్( స్టెమ్)లో విద్యార్ధుల మేధాశక్తిని, సాంకేతిక ప్రతిభను, సామాజిక బాధ్యతను గుర్తించేలా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్'లో పాల్గొన్న ఆరుగురు తెలుగు బాలికల బృందం, క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. హృతిక, సియోన, ప్రజ్ఞ, జాసు, ధృతి, లాస్య అనే ఆరుగురు తెలుగు విద్యార్ధినులు టెక్నోటియారాస్ పేరుతో జట్టుగా ఏర్పడ్డారు. గత నాలుగు నెలలుగా నిరంతర శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం, టీమ్ వర్క్ను జోడించి తమ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. కేవలం రోబోలను తయారు చేయడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఒక వినూత్న పరిష్కారాన్ని వీరు కనుగొన్నారు.ప్రాణాపాయం లేని ఆస్బెస్టాస్ తొలగింపు!పాత భవనాల్లో ఉండే 'ఆస్బెస్టాస్' వల్ల కార్మికులకు కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఈ బృందం గుర్తించింది. దానికి పరిష్కారంగా ఒక అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ప్రతిపాదించింది. నిపుణుల సలహాలు తీసుకుంటూ, క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి వీరు రూపొందించిన ఈ 'ఇన్నోవేషన్ ప్రాజెక్ట్' అందరి ప్రశంసలు అందుకుంది.మెక్డొనో స్కూల్ క్వాలిఫైయర్ పోటీల్లో పాల్గొన్న టెక్నో టియారాస్ తెలుగు విద్యార్ధుల అద్భుత ప్రదర్శనకు ప్రశంసలు, పురస్కాలు లభించాయి. సామాజిక సమస్యకు పరిష్కారం చూపినందుకు అత్యున్నత 'క్వాలిఫైయర్ ఛాంపియన్షిప్' అవార్డును కైవసం చేసుకున్నారు.రోబోట్ డిజైన్ దాని పనితీరులో రెండో స్థానాన్ని సాధించి తమ సాంకేతిక సత్తాను చాటారు. తెలుగు బాలికల మధ్య ఉన్న సమన్వయం, నాయకత్వ లక్షణాలు, వారిలో ఉన్న ఉత్సాహాన్ని చూసి జడ్జీలు సైతం ఆశ్చర్యపోయారు. తెలుగు విద్యార్ధినులు సాధించిన ఈ విజయాల వెనుక కోచ్లు ఆలోక్, అభిజిత్ల మార్గదర్శకత్వం చాలా ఉపకరించింది. అలాగే వారి కుటుంబ సభ్యులు, నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ ప్రతినిధులు ఈ చిన్నారులను నిరంతరం ప్రోత్సహించారు. తెలుగు వారందరికి గర్వకారణంగా నిలిచిన ఈ బాలికలు ఇప్పుడు మేరీల్యాండ్ స్టేట్ కాంపిటీషన్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ యువ టెక్నాలజిస్ట్ల బృందం మరో మూడు నెలల్లో జరగనున్న ప్రతిష్టాత్మక స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి అర్హత సాధించింది. క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న బాలికల బృందానికి నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ మేరీల్యాండ్ నాయకులు, సభ్యులు అభినందించారు. స్టేట్ లెవెల్ పోటీల్లోనూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్ఆర్ఐ పోస్ట్)
క్రైమ్
ఖతర్నాక్ విగ్గురాజా
బట్టతల కారణంగా పెళ్లి ఈడు దాటిపోతుండడంతో.. అతగాడు ఘరానా మోసానికి దిగాడు. విగ్గుతో మేనేజ్ చేస్తూ ఎలాగోలా ఓ అమ్మాయికి తాళిబొట్టు కట్టేశాడు. తీరా.. కాపురంలోకి అడుగుపెట్టాక అతగాడి హెయిర్స్టైల్పై అనుమానం వచ్చిందామెకు. కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. అక్కడి నుంచే అసలు డ్రామా మొదలుపెట్టాడు.. బట్టతల భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భార్య నోయిడా పోలీసులను ఆశ్రయించింది. విగ్గు పెట్టుకుని తనను పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత జుట్టు రాలుతోందంటూ డ్రామాలు ఆడాడనని.. చివరకు విషయం తెలిసిపోవడంతో విగ్గు పీకేసి విలన్ వేషాలు వేస్తున్నాడని వాపోయిందామె. అప్పటి నుంచి సైకోలా మారిపోయి వేధించడం మొదలుపెట్టాడు.. నా ఫోన్ నుంచి వ్యక్తిగత ఫొటోలు సేకరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడు. చేసేది లేక నగలు ఇచ్చేశాను. ఆపై అదనపు కట్నం కోసం నా తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. భరించలేక న్యూఢిల్లీ ప్రతాప్ భాగ్లోని అత్తింటి నివాసంలో పంచాయితీ పెట్టించా. అందరి ముందు విగ్గు తీసేసి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి మమ్మల్ని వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొందామె. సదరు భర్త కుటుంబం మొత్తంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని.. పరారీలో ఉన్న భర్త కుటుంబం కోసం గాలిస్తున్నట్లు బిస్రాఖ్ పీఎస్ అధికారి మనోజ్కుమార్ చెబుతున్నారు.
35 రోజుల్లో 11 మంది హిందువుల దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై తీవ్రమైన హింస కొనసాగుతోంది. యూనస్నేతృత్వంలోని ప్రభుత్వం ఇవి మతపరమైన దాడులు, హత్యలు కాదని పదేపదే చెబుతున్నప్పటికీ, జరుగుతున్నసంఘటనలు, వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిణామాలు దేశంలో మైనారిటీల భద్రతకు శాంతిభద్రతలు ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి.బంగ్లాదేశంలో జరుగుతున్ హింసను కేవలం యాదృచ్ఛిక సంఘటనగానో లేదా వేర్వేరు నేరాలుగానో కొట్టిపారేయడం కష్టమవుతోందంటున్నారు విశ్లేషకులు. కేవలం ఒక నెలలోనే దేశవ్యాప్తంగా కనీసం 11 మంది హిందువులు హత్యకు గురయ్యారు, వీరిలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో చనిపోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో 35 రోజుల వ్యవధిలో ఇన్ని హత్యలు జరిగాయి. ఈ మరణాలు, మూకదాడులు, కాల్పులు , గుంపు దాడుల పరంపరను వెల్లడిస్తున్నాయి. ఈ వరుస ఘటనలు మైనారిటీలలో విస్తృత భయాలను రేపడంతోపాటు, ప్రభుత్వ సామర్థ్యం, ఉద్దేశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.2026 జనవరి 5, ఒకే రోజులో రెండు హత్యలుజనవరి 5న, జెస్సోర్ జిల్లాలో హిందూ వార్తాపత్రిక సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చి చంపారు. కొన్ని గంటల్లోనే ఢాకా సమీపంలోని నర్సింగ్డి జిల్లాలో హిందూ కిరాణా వ్యాపారి మణి చక్రవర్తిపై దాడి. ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్యలతో కేవలం 18 రోజుల్లోనే హిందువుల హత్యల సంఖ్య ఐదు, ఆరుకు చేరింది.ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యంజనవరి 3న మూక దాడి, సజీవ దహనంషరియత్పూర్ జిల్లాకు చెందిన హిందూ వ్యాపారవేత్త ఖోకన్ చంద్ర దాస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక మూక దాడిలో తీవ్రంగా గాయపడి జనవరి 3న మరణించాడు. అతణ్ని కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతను ఒక చెరువులోకి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తీవ్రమైన కాలిన గాయాలతో, ఢాకాలో మరణించాడు.డిసెంబర్ 29, 2025: సహోద్యోగి కాల్చివేతఅన్సార్ బాహినిలో హిందూ సభ్యుడైన బజేంద్ర బిస్వాస్ను మైమెన్సింగ్ జిల్లాలోని ఒక వస్త్ర కర్మాగారంలో అతని సహోద్యోగి కాల్చి చంపాడు. దీనిని పోలీసులు మొదటగా అనుకోకుండా జరిగి ఉండవచ్చని పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు, కానీ ఈ హత్య మైనారిటీ వర్గాలలో పెరుగుతున్న ఆందోళనను మరింత పెంచింది.డిసెంబర్ 24, 2025: మాబ్ లించింగ్అమృత్ మండల్ను రాజ్బరి జిల్లాలో ఒక గుంపు కొట్టి చంపింది. హత్యకు మతపరమైన కోణం లేదని అధికారులు పేర్కొన్నారు, కానీ కొన్ని రోజులకే మరొక మూక దాడి జరిగడంతో మైనారిటీ భయాలు మరింత తీవ్రమయ్యాయి.డిసెంబర్ 18, 2025: ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మూక దాడిమైమెన్సింగ్లో 27 ఏళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ హత్య ఒక మలుపు తిరిగింది. దాస్ను ఇస్లామిక్ గుంపు కొట్టి చంపింది, అతని శరీరాన్ని హైవేకి వేలాడదీసి నిప్పంటించింది. దైవదూషణ జరిగిందనే అస్పష్టమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, దర్యాప్తు అధికారులు తరువాత హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని కనుగొన్నారు.ఇదీ చదవండి: సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలిడిసెంబర్ 12న, 18 ఏళ్ల హిందూ ఆటోరిక్షా డ్రైవర్ శాంటో చంద్ర దాస్, కుమిల్లాలో గొంతు కోసి హత్య చేశారు. డిసెంబర్ 7న, 1971 విముక్తి యుద్ధ అనుభవజ్ఞుడు జోగేష్ చంద్ర రాయ్, అతని భార్య సుబోర్నా రాయ్లను రంగ్పూర్లో వారింట్లోనే గొంతు కోసి చంపేశారు. డిసెంబర్ 2న ఇద్దరు హిందువులు బంగారు వ్యాపారి ప్రంతోష్ కోర్మోకర్ను నర్సింగ్డిలో కాల్చి చంపగా, ఉత్పోల్ సర్కార్ను ఫరీద్పూర్లో నరికి చంపారు.మైనారిటీ హత్యలతో పాటు, బంగ్లాదేశ్లో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయి ఒక నివేదిక ప్రకారం 2025లోనే 197 మూక హత్యలు, 2024లో 293 హత్యలు జరిగాయి. మానవ హక్కుల సంఘాలు దీనిపై హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్ డీసీకి చెందిన హిందుస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఢాకాను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మైనారిటీ భద్రతకు హామీ ఇవ్వాలని కోరింది.అయినప్పటికీ యూనస్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. దీపు చంద్ర దాస్ హత్యపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు రగలడంతో తాత్కాలిక ప్రభుత్వం సంతాపాన్ని వ్యక్తం చేసింది.భారతదేశం ఖండనభారతదేశం దీపు చంద్ర హత్యను తీవ్రంగా ఖండించింది. "బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై కొనసాగుతున్న శత్రుత్వం , దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మైమెన్సింగ్లో ఇటీవల జరిగిన హిందూ యువకుడి దారుణ హత్యను మేము ఖండిస్తున్నామనీ, బాధితులను న్యాయం చేయాలని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భోపాల్లో(మధ్యప్రదేశ్) ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్యురాలు ఇక లేదు. గత 24 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న 24 ఏళ్ల డాక్టర్ రష్మి వర్మ తుది శ్వాస విడిచింది.ఎయిమ్స్ భోపాల్లోని ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వర్మ డిసెంబర్ 11న అధిక మోతాదులో ఎనస్తీషియా ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అపస్మారక స్తితిలో ఉన్న ఆమెను భర్త అదే ఇన్స్టిట్యూట్లో చేర్చారు. అప్పటి నుండి వెంటిలేటర్ మద్దతుపై చికిత్స తీసుకుంటూ సోమవారం ఉదయం కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించామని ఎయిమ్స్ భోపాల్ అధికారి తెలిపారు. అయితే, ఈ సంఘటనపై కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు కారణంగా మరిన్ని వివరాలను పంచుకోవడానికి నిరాకరించారు. ఎయిమ్స్లో టాక్సిక్ వర్క్ కల్చర్ ఆరోపణలు ఆమె సీనియర్ విభాగాధిపతి డాక్టర్ మొహమ్మద్ యూనస్ డా. వర్మను గత కొంతకాలంగా దీర్ఘకాలం మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. బలమైన ఆరోపణలున్నప్పటికీ, ఆసుపత్రి యాజమాన్యం మొదట్లో మౌనం వహించింది. అయితే బాధితురాలి ఆత్మహత్యా యత్నం, వైద్యుల సంఘాలు , పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో డాక్టర్ మొహమ్మద్ యూనస్ను యాజమాన్యం తన పదవి నుండి తొలగించింది. తాత్కాలికంగా అనస్థీషియా విభాగానికి అటాచ్ చేసింది. ఈ విషయంపై రహస్య విచారణ నిర్వహించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.ఆమె సహచరులు అందించిన వివరాల ప్రకారం, డాక్టర్ వర్మ డిసెంబర్ 11న తన డ్యూటీని పూర్తి చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె భర్త, ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రతన్ వర్మ, ఆమె అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆమెను ఎయిమ్స్కు తీసుకువచ్చారు. ఇదీ చదవండి: గ్వాలియర్లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్గుండెపోటు , మెదడుకు నిలిచిపోయిన ఆక్సిజన్అత్యవసర విభాగానికి చేరుకునేసమయానికి ఆలస్యం జరిగిపోయింది. దాదాపు 25 నిమిషాలు కావడంతో ఆమె గుండె దాదాపు ఏడు నిమిషాలు కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారు.వెంటనే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ప్రారంభించారు. మూడు రౌండ్ల పునరుజ్జీవనం తర్వాత, గుండె స్పందించింది. కానీ మెదడుకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా, అప్పటికే తీవ్రమైన నాడీ సంబంధిత నష్టం జరిగింది. గుండెపోటు సమయంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడు కణజాలానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని కోలుకునే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు వివరించారు. ఆసుపత్రిలో చేరిన 72 గంటల తర్వాత నిర్వహించిన MRI స్కాన్లో మెదడు డ్యామేజ్, దీర్ఘకాలిక ఆక్సిజన్ కొరత ఉన్నట్లు ఆధారాలు వెల్లడయ్యాయని ఎయిమ్స్ భోపాల్ గతంలో పేర్కొంది.మంచి మనిషిని, టీచర్ను కోల్పోయాంఐదేళ్లకు పైగా బోధనా అనుభవంతో, ఆమె క్లినికల్ నైపుణ్యం ఆమె సొంతమని ప్రధానంగా రోగులు పట్ల చాలా దయతో ఉండేదని విద్యార్థులు సహచరులు గుర్తు చేసుకున్నారు. తన సొంత డబ్బులను రోగుల చికిత్స కోసం చెల్లించేదని కంటతడిపెట్టారు. ఆమె మరణించే సమయానికి బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్, నర్సింగ్ శిక్షణా సెషన్లకు ఇన్ఛార్జ్ ఫ్యాకల్టీగా, నోడల్ ఆఫీసర్గా కూడా పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యంకాగా డాక్టర్ వర్మ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని MLN మెడికల్ కాలేజీ నుండి MBBS పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్లో MD డిగ్రీ చదివారు. AIIMS భోపాల్లో అనేక పరిపాలనా బాధ్యతలను కూడా నిర్వహించారు. అలాగే LN మెడికల్ కాలేజీ, పీపుల్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMS), భోపాల్లో కూడాసేవలందించారు.ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
మాజీ కబడ్డీ ప్లేయర్ కాల్చివేత కలకలం
పంజాబ్లో లూథియానాలో మాజీ కబడ్డీ ఆటగాడిని కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు మీ అబ్బాయి చంపేశాం..వెళ్లి అతని మృతదేహాన్ని తెచ్చుకోండి అంటూ నేరుగా అతని ఇంటికి వెళ్లి చెప్పడం తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది.సోమవారం ఈ హత్య జరిగింది.మాజీ కబడ్డీ స్టార్ గగన్దీప్ సింగ్ అలియాస్ గగ్నా మనుకే గ్రామంలో తన స్నేహితుడు ఏకమ్తో కలసి ఉండగా దారుణ హత్యకు గురయ్యాడు. మోటార్బైక్లపై వచ్చిన దుండగులు గగ్నాపై పై కాల్పులు జరిపారు. అనంతరం అతని మృతదేహాన్ని సమీపంలోని పొలంలో పడేశారు. మీ వాడిని చంపేశాం.. డెడ్బాడీ తెచ్చుకోవండి కుటుంబ సభ్యులతో స్వయంగా చెప్పారు. దీనిపై మృతుడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అరాచకం తప్ప మరొకటి కాదని బాధితుడి తండ్రి గుర్దీప్ సింగ్ బగ్గా (60) కన్నీటి పర్యంతమయ్యారు. లూథియానా రూరల్ ఎస్ఎస్పి అంకుర్ గుప్తా ప్రకారం, గగన్దీప్కు కనీసం మూడు బుల్లెట్ గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు పేర్కొన్న ఐదుగురు నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు.హత్యకు కారణంబగ్గా అందిందించిన వివరాల ప్రకారం నిందితులకు, మృతుడు గగ్నా స్నేహితుడు ఏకమ్తో పాత కక్షలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో వీరి మధ్య సయెధ్య కుదిర్చేందుకు, రాజీకి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే నిందితులు అతన్ని కాల్చి చంపారు.కాగా గగ్నా ఒక రైస్ షెల్లర్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధితుడి భార్య నవప్రీత్ కౌర్ మాట్లాడుతూ, గగన్దీప్, ఏకమ్ కలిసి కబడ్డీ ఆడేవారని, అయితే నిందితులకు నచ్చలేదని చెప్పింది. మరోవైపు డిసెంబర్ 31న, నిందితులు ఏకమ్పై కత్తులతో దాడి చేశారు. ఈ రోజు నా భర్తను కాల్చి చంపారని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.ఇదీ చదవండి: గ్వాలియర్లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్గ్రామ క్షక్షలతోనే ఈ హత్య జరిగిందని భావిస్తున్నామని లూథియానా రేంజ్ డిఐజి సతీందర్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు కబడ్డీకి సంబంధించిన వివాదమేమీ వెలుగులోకి రాలేదన్నారు. ప్రధాన నిందితుడిని గుర్సేవక్ సింగ్ అలియాస్ మోటుగా గుర్తించారు. ఉదయం గ్రామస్థాయి వైరం కారణంగా రెండు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం, గుర్సేవక్ సింగ్ అలియాస్ మోటు తన అనుచరులతో కలిసి తిరిగి వచ్చి కాల్పులు జరిపాడు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. కుటుంబ సభ్యులు పేర్కొన్న నిందితులలో ఒకరిని ఇప్పటికే అరెస్టు చేయగా, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామ డీఐజీ తెలిపారు.ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారంమనూకేకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాగ్రాన్ ఎమ్మెల్యే సర్వజిత్ కౌర్ మనుకే మీడియాతో మాట్లాడుతూ గగన్దీప్ గ్రామంలోని పేద యువకులను కబడ్డీ ఆడటానికి ప్రోత్సహించేవాడని చెప్పారు. నిందితుల లక్ష్యం ఏకామ్..కానీ గగన్దీప్ అతనికి అండగా నిలబడటంతో వారు అతడిని కాల్చి చంపారు. పంజాబీ యువత దారి తప్పుతోందని, గూండాయిజం వల్ల శవాలు తప్ప మరేమీ మిగలదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజుల్లోనే పంజాబ్లోఇది మూడో దారుణ హత్య ఇది.ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యం
వీడియోలు
ఇలా చేస్తే..! 12 ఏళ్లలో 50 లక్షలు మీదే..!
నీ శిష్యుడి కోసం రాయలసీమ గొంతు కోస్తే.. మేము ఊరుకోం!
2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను చంపిన భార్య
YSRCP కొత్త సమన్వయకర్తలు వీళ్లే..
మంటలకు పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
కొద్దిలో తప్పిన భారీ ప్రమాదం.. బస్సు డ్రైవర్ ఏమన్నాడంటే!
ఆంధ్రా అప్పు ఏకంగా 3లక్షల కోట్లు
గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ కన్ను
తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా..!
రాయలసీమ ప్రాజెక్ట్ పై అసలు కథ.. బాబును అడ్డంగా బుక్ చేసిన మంత్రి నిమ్మల..

