Top Stories
ప్రధాన వార్తలు

ఆధారాలు లేకుండా అరెస్టులా..?
‘‘అరెస్ట్ అనేది.. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అరెస్ట్ అన్నది.. వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల అరెస్ట్ విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది..’’– సుప్రీంకోర్టు ధర్మాసనం..సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని పేర్కొంది. కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్ట్లు చేయడం తగదంది. ‘ఏదైనా కేసులో అరెస్టు చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేసి తీరాలన్న ఆలోచన ఎంతమాత్రం సరికాదు. ఇలాంటి యాంత్రిక అరెస్ట్లు సబబు కాదు...’ అని గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణకు స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలని పునరుద్ఘాటించింది.హైకోర్టు తీర్పును రద్దు చేసిన ‘సుప్రీం’...మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. మిథున్రెడ్డి ముందస్తు బెయిల్పై తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పును పరిశీలిస్తే.. ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. మిథున్రెడ్డి పరువు, ప్రతిష్టలను కూడా కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్ధీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు తీర్పుపై సుప్రీంకు మిథున్రెడ్డి...గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మి«థున్రెడ్డి తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ గత నెల 3న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మిథున్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ పార్ధీవాలా ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.దర్యాప్తునకు సహకరిస్తున్నారు...మిథున్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, రంజిత్ కుమార్లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ ఇప్పటికే దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరయ్యారని తెలిపారు. మద్యం కేసులో మిథున్రెడ్డిని నిందితుడిగా చేర్చామని రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పును ఆక్షేపించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. తీర్పు వెలువరించేంత వరకు మిథున్రెడ్డిని అరెస్ట్ చేయబోమన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని ధర్మాసనం రికార్డ్ చేసింది.

భారత్ విజయం.. పాక్ నుంచి BSF జవాన్ విడుదల
సాక్షి, ఢిల్లీ: పాకిస్తాన్పై దౌత్యం విషయంలో భారత్ విజయం సాధించింది. ఎట్టకేలకు భారత బీఎస్ఎఫ్ జవాన్ పీకే షాను పాకిస్తాన్ విడుదల చేసింది. 20 రోజుల తర్వాత భారత జవాన్ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. దీంతో, సదరు జవాన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. బీఎస్ఎఫ్కు చెందిన భారత జవాన్ పూర్ణం కుమార్ షా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో, పీకే షాన్ పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం, దౌత్యపరంగా భారత్.. పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చింది. దీంతో, 20 రోజుల తర్వాత పీకే షాను.. ఈరోజు పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అటారీ సరిహద్దుల వద్ద జవాన్ను భారత్కు అప్పగించింది. Today BSF Jawan Purnam Kumar Shaw, who had been in the custody of Pakistan Rangers since 23 April 2025, was handed over to India: BSF(Pic Source: BSF) pic.twitter.com/TVzagO0AhK— ANI (@ANI) May 14, 2025182 బీఎస్ఎఫ్ బెటాలియన్కు చెందిన షా పశ్చిమ బెంగాల్ వాసి. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఇండో-పాక్ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్తాన్ రేంజర్లతో చర్చలు జరిపారు. ఇలాంటి సంఘటలు అసాధారణం కాదని, గతంలో కూడా ఇలాంటివి జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పౌరులు కానీ, జవాన్లు కానీ ఇలా అనుకోకుండా ఆవలి దేశ సరిహద్దులోకి వెళ్లిన సందర్భాల్లో ఇరుదేశాల అధికారులు మిలిటరీ ప్రొటోకాల్ ప్రకారం ఫ్లాగ్ మీటింగ్ల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు. అయితే, పహల్గాం ఉదంతం తర్వాత పాకిస్తాన్పై భారత్ ఆంక్షలు విధించిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పాక్ రేంజర్లకు పట్టు బడిన సమయంలో సాహు యూనిఫాంలో ఉన్నారని, అతని వద్ద సర్వీస్ రైఫిల్ కూడా ఉన్నట్టు అధికారులు చెప్పారు.

సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్
ఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice BR Gavai) ప్రమాణస్వీకారం చేశారు. భాతర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. గవాయ్కు అభినందనలు తెలిపారు. సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న గవాయ్.. చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్గా పేరు పొందారు.ఇక, మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితోపాటు, నాగ్పుర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఆరేళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకొని పలు కీలక కేసులను విచారించారు.#WATCH | Delhi: President Droupadi Murmu administers oath of office to Justice BR Gavai as the Chief Justice of India (CJI).(Video Source: President of India/social media) pic.twitter.com/3J9xMbz3kw— ANI (@ANI) May 14, 2025

పీసీబీ బుద్ధి మారలేదు!.. మళ్లీ ఐపీఎల్తో పోటీ.. కానీ ఊహించని షాక్!
చావు దెబ్బలు తింటున్నా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరు మారలేదు. ఇప్పటికే ఐపీఎల్-2025 (IPL 2025)కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL-2025) షెడ్యూల్ను ఖరారు చేసి చేతులు కాల్చుకున్న పీసీబీ.. మరోసారి అదే సాహసానికి సిద్ధపడింది. కాగా మార్చి 22న ఐపీఎల్ తాజా ఎడిషన్ మొదలుకాగా.. ఎన్నడూ లేని విధంగా పాక్ బోర్డు కూడా పోటీకి దిగింది. ఏప్రిల్ 11న తమ టీ20 లీగ్ను ఆరంభించింది.వాయిదా పడిన రెండు లీగ్లుఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్కు ఎప్పటిలాగే ప్రేక్షకాదరణ దండిగానే లభించగా.. పీఎస్ఎల్ను మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి తరుణంలో పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్తో పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగా.. పాక్ ఆర్మీ అందుకు ప్రతిదాడికి దిగింది. దీంతో గట్టిగా బదులిచ్చిన భారత్ రావల్పిండి, కరాచీ, లాహోర్లను టార్గెట్ చేయగా.. పీఎస్ఎల్ మ్యాచ్కు ముందే రావల్పిండి స్టేడియంలో క్షిపణి దాడి జరిగింది.పునఃప్రారంభంలోనూ పోటీఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇటు ఐపీఎల్తో పాటు.. అటు పీఎస్ఎల్ను కూడా వాయిదా వేశారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత.. ఈ రెండు లీగ్లు మళ్లీ మొదలుకానున్నాయి. అయితే, పునఃప్రారంభంలో కూడా పీసీబీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో పోటీకి దిగిందిరామని తేల్చి చెప్పిన ఆటగాళ్లుఈ సీజన్లో మిగతా ఐపీఎల్ మ్యాచ్లను మే 17 నుంచి అని బీసీసీఐ ప్రకటించిన మరుసటి రోజే పోటీగా.. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా మే 17 నుంచి పీఎస్ఎల్ తిరిగి ఆరంభం అంటూ ఆర్భాటానికి పోయింది. కానీ ఇక్కడ ఆసలు సవాల్ విదేశీ ప్లేయర్ల నుంచి ఎదురవుతోంది. భారత ఆర్మీ దాడులతో బెంబేలెత్తిన పలువురు విదేశీ ఆటగాళ్లు ఇక పాక్కు వచ్చే సమస్యే లేదని తెలిసింది.ముఖ్యంగా కేన్ విలియమ్సన్ సహా ఇతర న్యూజిలాండ్ ఆటగాళ్లు పాకిస్తాన్కు ససేమిరా అంటున్నట్లు సమాచారం. డారిల్ మిచెల్ అయితే మళ్లీ తాను పాక్లో అడుగుబెట్టబోనని తేల్చిచెప్పినట్లు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో కివీస్ ప్లేయర్లు మాత్రమే ఇంగ్లండ్ సహా ఇతర విదేశీ ప్లేయర్లు పీఎస్ఎల్ కోసం వెనక్కి వచ్చే అవకాశమైతే లేదు. కాగా 25న జరిగే ఫైనల్తో ఈ సీజన్ పీఎస్ఎల్ ముగుస్తుంది. అయితే పలువురు స్టార్ క్రికెటర్లు తిరిగి రానే రామని తేల్చేయడంతో వారి స్థానాల్ని వెంటనే భర్తీ చేసుకొని ఆయా ఫ్రాంచైజీలన్నీ పునఃప్రారంభానికి సిద్ధంగా ఉండాలని పీసీబీ సూచించింది. చదవండి: IPL 2025 Revised Schedule: దేశమా.. ఐపీఎలా..?

భారత్, పాక్ ఉద్రిక్తతలు.. అరుణాచల్లో చైనా దూకుడు
ఢిల్లీ: భారత్ విషయంలో డ్రాగన్ దేశం చైనా మరోసారి వక్రబుద్ధిని చూపించింది. ఈశాన్య భారతంలో సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో పలు స్థలాల పేర్లను చైనా మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారవని తెలుసుకోవాలన్న భారత విదేశాంగ శాఖ హితవు పలికింది.భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని స్థలాలను సౌత్ టికెట్గా చైనా పేర్లు మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే. అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల పేరు మార్చడాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారిపోవు. అరుణాచల్లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు మేం గమనించాం. ఇది మా వైఖరికి విరుద్ధం. అలాంటి ప్రయత్నాలను కచ్చితంగా తిరస్కరిస్తాం’ అని చెప్పుకొచ్చారు.Here's the actual names and places of Arunachal Pradesh which China has renamed! 👇@MEAIndia has reiterated that creative naming will not alter the undeniable reality that Arunachal Pradesh was, is, and will always remain an integral and inalienable part of India. pic.twitter.com/o4rcgiflfK— Sashanka Chakraborty (@SashankGuw) May 14, 2025అయితే, అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లను చైనా ఇప్పటికే పలుమార్లు మార్చింది. పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది. 2017లో ఆరు ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితాను విడుదల చేసింది. చైనా చేస్తున్న వాదనలకు భారత్ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తోంది. గత ఏడాది అరుణాచల్ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటెన్ పేర్లను పెట్టింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.India’s Foreign Ministry slams China for presenting new names of cities in the state of Arunachal Pradesh, which China claims as its own:"Creative naming won’t alter the undeniable fact that Arunachal Pradesh was, is & will always remain an integral & inalienable part of India” pic.twitter.com/hsbLg3jbC7— DR Yadav (@DrYadav5197) May 14, 2025

దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవల ఒడిదొడుకులకు లోనవుతుంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధర తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.88,050 (22 క్యారెట్స్), రూ.96,060 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.500, రూ.540 తగ్గింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.88,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.96,060 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.500 దిగి రూ.88,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.540 తగ్గి రూ.96,210 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు బుధవారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. మంగళవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,09,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్
రామ్ చరణ్ మైనపు విగ్రహం.. రీసెంట్ గా లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి చరణ్ అక్కడికి వెళ్లాడు. విగ్రహావిష్కరణ పూర్తి కాగానే యూకేలోని తన అభిమానులని కలిసి ముచ్చటించాడు. 'పెద్ది' విశేషాలు చెప్పి హైప్ పెంచేశాడు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) అభిమానులతో మాట్లాడిన చరణ్.. 'పెద్ది' సినిమా రంగస్థలం కంటే గొప్పగా ఉండబోతుంది. మామూలుగా అన్ని సినిమాలకు ఇలా చెప్పను. కానీ ఈసారి రాసిపెట్టుకోండి' అని చెప్పాడు. దీంతో అక్కడున్న ఫ్యాన్స్ అరిచి గోలగోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదివరకే రిలీజ్ చేసిన 'పెద్ది' గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా చివరలో వచ్చే క్రికెట్ షాట్ అందరికీ తెగ నచ్చేసింది. ఈ సందర్భంగా లండన్ లో ఫ్యాన్స్.. ఓ బ్యాట్ ని రామ్ చరణ్ కి బహుకరించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. బుచ్చిబాబు దర్శకుడు కాగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో) Idhi nenu mamuluga anni cinemalaki cheppanu... Ee Cinema matram raasi pettukondi 💥💥💥@AlwaysRamCharan about #PEDDI ! pic.twitter.com/CPOKMjOwcl— Trends RamCharan ™ (@TweetRamCharan) May 13, 2025

సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. హైకమాండ్ వార్నింగ్
భోపాల్: భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషీని.. ఉగ్రవాదులను హతమార్చేందుకు పంపించి మోదీ గుణపాఠం చెప్పారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాకిస్తాన్పై పోరులో భాగంగా ఆపరేషన్ సిందూర్కు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీ విజయ్ షా ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్కు పంపించి పాఠం నేర్పించారు’ అని వ్యాఖ్యలు చేశారు.దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. అనంతరం, మధ్యప్రదేశ్ బీజేపీ హైకమాండ్.. విజయ్ షాను పిలిపించి చీవాట్లు పెట్టింది. దీంతో, మరోసారి స్పందిస్తూ.. ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని, కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నానని షా విలేకరులకు చెప్పారు. ఆమెను కించపరిచే ఆలోచన కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే పదిసార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు.మరోవైపు.. మంత్రి విజయ్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా, కించపరిచేవిగా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు.Utterly derogatory, communal and sexist remark made by a BJP MP minister Kunwar Vijay Shah against Col Sofia Quereshi. . And it wasn’t off the cuff either (don’t miss the applause from his chamchas on stage) . Shocking beyond belief. What is the use of ‘nationalist’ flag waving… pic.twitter.com/pZ8VboyAoV— Rajdeep Sardesai (@sardesairajdeep) May 13, 2025

Cannes 2025 తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes 2025) లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela ) తన అద్భుతమైన ప్రదర్శనతో తన మాయాజాలాన్ని మరోసారి రిపీట్ చేసింది. తనదైన ఫ్యాషన్తో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసే ఊర్వశి రౌతేలా ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కుమని మెరిసింది. కొంతకాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ను మిస్ కాని ఊర్వశి ఈసారి కూడా స్పెషల్ అప్పియరెన్స్తో అదరగొట్టేసింది. డార్క్ గ్రీన్ ట్యాబ్ గౌను, ధరించి యువరాణి లుక్లో తళుక్కుమంది. మరీ ముఖ్యగా ఆమెధరించిన ప్యారెట్ ఆకారంలో క్రిస్టల్ క్లచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో దాని ధర ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 78వ ఎడిషన్ మే 13, 2025న ప్రారంభమై మే 24, 2025న ముగియనుంది. అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు 12 రోజుల పాటు జరిగే గ్లామర్, కళల అద్భుతమైన వేడుకలో సందడి చేయనున్నారు. బాలీవుడ్ హీరోయిన్లతోపాటు, ఈ సారి 76 ఏళ్ల సిమీ గరేవాల్ కేన్స్ ఉత్సవంలో అరంగేట్రం చేస్తోంది.. ఈ సంవత్సరం కేన్స్ ముఖ్యాంశాలలో ఒకటి, అమెరికన్ నట దిగ్గజం, రాబర్ డి నీరోకు జీవిత సాఫల్యానికి గౌరవ పామ్ డి'ఓర్ అవార్డును ప్రదానం చేయడం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ మీద నడిచింది.ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో 56 ఏళ్ల తరువాత కేన్స్లో అరంగేట్రం..అస్సలు ఊహించలేదుఊర్వశి ధరించిన గౌనుతో పాటు, రంగురంగుల రత్నాలు, చెవిపోగులు, రంగురాళ్ల కిరీటం మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. ఇక మేకప్ విషయానికి వస్తే, ముదురు ఊదా రంగు ఐషాడోతో బోల్డ్, గ్లామరస్ మేకప్, కళ్ళపై రైన్స్టోన్స్ స్టిక్కర్తో తన మరింత ఎలివేట్ చేసుకుంది. పక్షి ఆకారంలో ఉన్న బ్యాగును పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేన్స్లో చిలుకలా దుస్తులు ధరించి వచ్చిన తొలి మహిళ, ఇది నిజమా; లేక ఏఐ మాయాజాలమా అంటూ ఆశ్చర్యంలో మునిగి పోయారు.హైలైట్ ఏంటంటేఊర్వశి లుక్లో మరో హైలైట్ ఆమె క్లచ్. సాధారణ, ప్రాథమిక క్లచ్లను పక్కనపెట్టి, జుడిత్ లిబర్ డిజైనర్ క్రిస్టల్ చిలుక క్లచ్ను ఎంచుకుంది.అద్భుతమైన క్లచ్ ధర 5,495 US డాలర్లు అంటే దాదాపు రూ. 4,57,744లు.గతంలో ఊర్వశి రౌతేలా క్రొకోడైల్ నెక్ పీస్ ధరించి పలువుర్ని ఆకర్షించింది. 2023 కేన్స్లో రూ. 200 కోట్ల విలువైన నకిలీ మొసలి నెక్పీస్ ధరించిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది సిమా కౌచర్ రూపొందించిన పింక్ టల్లే గౌనులో ఆమె కేన్స్ రెడ్ కార్పెట్పై తొలి సారి తన బ్యూటీని ప్రపంచానికి చాటా చెప్పింది.

వివాదంలో పాకిస్తాన్ హైకమిషనర్.. యువతితో వీడియోలు లీక్
ఢాకా: పాకిస్తాన్ హైకమిషనర్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ తరఫున బంగ్లాదేశ్కు హైకమిషనర్గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. సదరు అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.వివరాల ప్రకారం.. సయ్యద్ అహ్మద్ మరూఫ్ పాకిస్తాన్ తరఫున బంగ్లాదేశ్కు హైకమిషనర్గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్లో పాకిస్తాన్ హైకమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, మరూఫ్ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఉన్న తిరుగుతున్న ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసింది. మరూఫ్ మే 11న ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్కు విమానంలో వెళ్లారని బంగ్లాదేశ్ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. హనీట్రాప్ కారణంగా అతడు బంగ్లాదేశ్ వీడినట్టు చెప్పుకొచ్చింది.The Pakistani Ambassador to Bangladesh, Syed Ahmed Maroof, was in a relationship with a Bangladeshi Muslim girl. After some intimate details became public, he was sent on leave. There was a time when Pakistanis used to rape Bangladeshi Muslim women nowadays, some Bangladeshi… pic.twitter.com/p60WkJJslU— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) May 12, 2025అయితే, అధికారులు మాత్రం.. మారూఫ్ అధికారికంగా సెలవులో ఉన్నారని నిర్ధారించారు. కానీ, ఎన్ని రోజులు అతను సెలవులో ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు.. ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ ముహమ్మద్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.Pakistan Ambassador to Bangladesh Syed Ahmed Maroof is reportedly untraceable after his honey trapped videos emerged online.There's a leaked video too. pic.twitter.com/UfYmLYfKVl— Avinash K S🇮🇳 (@AvinashKS14) May 13, 2025ఇక, ఇటీవల మరూఫ్కు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని తెలుస్తోంది. ఆయన వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయన్ని అవాంఛిత వ్యక్తి (పర్సనా నాన్గ్రేటా)గా ప్రకటించి 24 గంటల్లోగా మన దేశాన్ని వీడివెళ్లిపోవాలని గడువు విధించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శన నేడిలా!
ఇంగ్లండ్ పర్యటనకు జైస్వాల్, ఇషాన్ కిషన్.. సర్ఫరాజ్ ఖాన్ను నేరుగా..?
ఎందుకురా నీ బతుకు చావరాదు..! అని తిట్టడంతో
లగ్గం..షరతుల పగ్గం! పెళ్లికాని ప్రసాదుల కష్టాలు ఇంతింత కాదయా!
భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రశంసల జల్లు..!
చెరువులో మునిగి ఐదుగురు పిల్లలు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!
'కింగ్డమ్' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
జా.ఎన్టీయార్, హృతిక్ల వార్2 వసూళ్లు.. రూ.100కోట్లు..
ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
భార్య ప్రసవం కోసం వచ్చి
పవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
ముందుగానే నైరుతి రుతుపవనాలు
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
'వేర్ ఆర్ యూ గోయింగ్ కారా..'.. రామ్ చరణ్ కూతురి క్యూట్ వీడియో చూశారా?
నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)
అభిమానులకు షాకిచ్చిన ఛార్మి.. ఇలా మారిపోయిందేంటి?
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)
మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శన నేడిలా!
ఇంగ్లండ్ పర్యటనకు జైస్వాల్, ఇషాన్ కిషన్.. సర్ఫరాజ్ ఖాన్ను నేరుగా..?
ఎందుకురా నీ బతుకు చావరాదు..! అని తిట్టడంతో
లగ్గం..షరతుల పగ్గం! పెళ్లికాని ప్రసాదుల కష్టాలు ఇంతింత కాదయా!
భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రశంసల జల్లు..!
చెరువులో మునిగి ఐదుగురు పిల్లలు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!
'కింగ్డమ్' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
జా.ఎన్టీయార్, హృతిక్ల వార్2 వసూళ్లు.. రూ.100కోట్లు..
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
భార్య ప్రసవం కోసం వచ్చి
పవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
ముందుగానే నైరుతి రుతుపవనాలు
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
'వేర్ ఆర్ యూ గోయింగ్ కారా..'.. రామ్ చరణ్ కూతురి క్యూట్ వీడియో చూశారా?
అభిమానులకు షాకిచ్చిన ఛార్మి.. ఇలా మారిపోయిందేంటి?
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
భారత రక్షణశాఖకు ఇళయరాజా విరాళం
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
తల్లే హంతకురాలు.. కొడుకుని ముక్కలు ముక్కులుగా నరికి.. సూట్కేస్లో కుక్కి
"చివరికి ప్రకృతి కూడా కరుణించింది! 'సూపర్ సిక్స్' చలని కబురు ఎప్పుడు వింటామో..ఏమో! "
సినిమా

సాహసం చేసిన టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్
ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్ పాపులర్ అవుతూ ఉంటుంది. అలా గత కొన్నాళ్లలో చూసుకుంటే భాగ్యశ్రీ బోర్సే పేరు గట్టిగా వినిపిస్తుంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్ అయింది గానీ వరస అవకాశాలు ఈమెని వరించాయి.ప్రస్తుతం తెలుగులో రామ్ కొత్త సినిమాలో, అలానే దుల్కర్ సల్మాన్ 'కాంత'లో భాగ్యశ్రీనే హీరోయిన్. మరోవైపు ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబోలో రాబోయే మూవీలోనూ ఈమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె ఇప్పుడు ఓ సాహసం చేసింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) 'వన్ లైఫ్, వన్ బ్రీత్, వన్ జంప్' అని భాగ్యశ్రీ.. దుబాయిలో స్కై డైవింగ్ చేసింది. ఇందులో భాగంగా విమానంలో ఆకాశంలో చాలా ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి దూకేస్తారు. చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తున్నప్పటికీ.. ధైర్యం కావాలి. ఇప్పుడు ఈ అడ్వెంచర్ చేసి తన చిన్న చిన్న కోరికలని భాగ్యశ్రీ నెరవేర్చుకుంటోంది.మరోవైపు భాగ్య శ్రీ.. తెలుగు హీరో రామ్ తో డేటింగ్ లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత కలిసి ఓ సినిమా చేస్తున్న వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అంటున్నారు. అయితే ఇది నిజమా? మూవీ పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంటా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సినిమాలతోనే కాదు సాహసాలు చేస్తూ కూడా ట్రెండింగ్ లో ఉంటోందిగా.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse)

గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
'జబర్దస్త్' కామెడీ షో పేరు చెప్పగానే కొందరి పేర్లు గుర్తొస్తాయి. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. సాధారణ కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి.. టీమ్ లీడర్ గా ఎదిగి.. ప్రస్తుతం రియాలిటీ షోలకు యాంకర్ గా, మరోవైపు సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నాడు. వయసు దాటిపోతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది.సుడిగాలి సుధీర్ తో పాటు అతడి కుటుంబం గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే గతంలో తాను యాంకర్ గా చేస్తున్న టైంలో ఒకటి రెండుసార్లు కుటుంబ సభ్యులు.. షోలో కనిపించారు. అసలు విషయానికొస్తే గుడ్ న్యూస్ సుధీర్ పెళ్లి గురించి అయితే కాదు. వీళ్ల ఇంట్లోకి వారసుడు వచ్చాడు. సుధీర్ తమ్ముడు రోహన్-రమ్య దంపతులకు బాబు పుట్టాడు. ఈ మేరకు రోహన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్) సుధీర్ కి తమ్ముడు, చెల్లి ఉన్నారు. రోహన్ ఇక్కడే కుటుంబంతో కలిసి ఉండగా.. చెల్లి శ్వేత మాత్రం భర్తతో కలిసి విదేశాల్లో ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. సుధీర్ తమ్ముడు రోహన్ కి రమ్యతో పెళ్లి కాగా కొన్నేళ్ల క్రితం పాప పుట్టింది. ఇప్పుడు బాబు పుట్టాడు. దీంతో సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. అంతా ఓకే కానీ మరి సుధీర్ పెళ్లెప్పుడు చేసుకుంటాడో?సుధీర్ సినిమాల విషయానికొస్తే.. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడ్, కాలింగ్ సహస్ర అని మూవీస్ చేశాడు. ప్రస్తుతం G.O.A.T అనే చిత్రంలో నటిస్తున్నాడు. చాలారోజుల క్రితం దీన్ని ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) View this post on Instagram A post shared by Rohan Bayana (@bayana.rohan)

మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ని మిస్టర్ ఫెర్ఫక్షనిస్ట్ అంటారు. కానీ 'దంగల్' వరకు ఓకే కానీ ఆ తర్వాత ఇతడికి దురదృష్టం మొదలైంది. ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో దాదాపు మూడేళ్ల పాటు సినిమాలే చేయని ఆమిర్.. కొత్త మూవీతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.'సితారే జమీన్ పర్' టైటిల్ తో తీసిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇది 2023లో రిలీజైన 'ఛాంపియన్స్' అనే మూవీకి రీమేక్ అని క్లారిటీ వచ్చేసింది. కొన్ని సీన్లయితే మక్కీకి మక్కీ దింపేశారు. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేసి మరీ చెబుతున్నారు. మరోవైపు ఎప్పటిలానే ఆమిర్ సినిమాపై ట్రోలింగ్ షురూ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) 'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. షార్ట్ టెంపర్ ఉండే ఓ కోచ్ అనుకోని కారణాల వల్ల కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. దీంతో సదరు జడ్జి ఊహించని తీర్పు ఇస్తారు. మతిస్థిమితం లేని కొందరిని టీమ్ గా చేసి బాస్కెట్ బాల్ నేర్పించమని చెబుతారు. తర్వాత సదరు కోచ్ ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.మంగళవారం రాత్రి ట్రైలర్ రిలీజ్.. అప్పుడే ఆమిర్ ఖాన్ పై ట్రోలింగ్ మొదలైంది. టర్కీ ఫస్ట్ లేడీని గతంలో ఇతడి కలిశాడని, అందుకే సినిమాని బహిష్కరించాలని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: శుభవార్త చెప్పిన సుడిగాలి సుధీర్ తమ్ముడు) #SitareZameenPartrailer देखो मिस्टर परफेक्ट ने कैसे पर्फेक्ट्ली फ्रेम टू फ्रेम कॉपी मारी है 😃😃😃🕋🕋🕋I can’t imagine how much they have made a fool of Bollywood lovers in the Past #AmirKhan #Champions pic.twitter.com/ZeKtJoLQve— Ex Shia Muslim News (@ExShiaMuslim) May 13, 2025

ధైర్యమే కాదు... అంతులేని త్యాగం కూడా...
కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. కాగాపాక్ కుట్రలను దీటుగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.తాజాగా హీరోయిన్ ఆలియా భట్ కూడా ఇండియన్ ఆర్మీపై, సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగమైనపోస్ట్ పెట్టారు. ‘‘గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. మనం ఇళ్లలో హాయిగా నిద్రపోతున్నామంటే బోర్డర్లో ఉన్న సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు.ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా చేసుకున్నాం. ఆ సమయంలో దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. వారిది కేవలం ధైర్యం మాత్రమే కాదు... అంతులేని త్యాగం కూడా. ఈ ప్రతి యూనిఫామ్ వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రీ జోలపాటలా ఉండదని ఆ తల్లికి తెలుసు. ప్రాణాలు కోల్పోయిన సైనికులను తలచుకుని మనం దుఃఖిస్తున్నాము.అనిశ్చితి... ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావొచ్చు. కానీ... ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నాం. ప్రార్థనలు చేస్తూ, కన్నీళ్లు దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాం... ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించినదానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మన రక్షకుల కోసం, భారతదేశం కోసం కలిసి నిలబడదాం.. ‘జైహింద్’’ అంటూపోస్ట్ చేశారు ఆలియా భట్.
న్యూస్ పాడ్కాస్ట్

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం
క్రీడలు

Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ కష్టమే.. వాళ్లిద్దరు ఉంటే బెటర్!
టీమిండియా ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) స్థానాల్లో వెటరన్ క్రికెటర్లను తీసుకువస్తే బాగుంటుందని సెలక్టర్లకు సలహా ఇచ్చాడు. అజింక్య రహానే (Ajinkya Rahane), ఛతేశ్వర్ పుజారాలను జట్టులోకి తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.దిగ్గజాల వీడ్కోలు ఇంగ్లండ్ గడ్డపై రాణించాలంటే ఇలాంటి సీనియర్ల అవసరం ఉందని.. యువ ఆటగాళ్లు అక్కడ ఒత్తిడిని తట్టుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇటీవలే టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.తొలుత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. ఆ తర్వాత ఆరు రోజులలోపే కోహ్లి కూడా ఇదే బాటలో నడిచాడు. వీరిద్దరి నిష్క్రమణ కంటే ముందే దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్టులకు గుడ్బై చెప్పాడు.ఫలితంగా టీమిండియా టెస్టు జట్టులో సీనియర్లు లేనిలోటు కచ్చితంగా కనిపిస్తుంది. అదీ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం యువ ఆటగాళ్లకు అంతతేలికేమీ కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..రహానే, పుజారా రీ ఎంట్రీ‘‘రోహిత్ రిటైర్ అయినా విరాట్ కోహ్లి జట్టుతో కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ బోర్డు అతడిని ఒప్పించేందుకు విఫలయత్నం చేసిందని తెలిసింది. మరి అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాల పునరాగమనం ఇప్పుడైనా చూడవచ్చా? ఈ ఒక్క సిరీస్ కోసమైనా వాళ్లను ఎంపిక చేస్తారా?అసలు జట్టు సరైన దిశలోనే వెళ్తుందా? రాబోయేది అల్లాటప్పా సిరీస్ కాదు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. వేరే జట్టుతో మ్యాచ్లు ఆడాల్సి ఉంటే.. పర్లేదు కుర్రాళ్లని పంపవచ్చు అని అనుకోవచ్చు.కానీ ప్రస్తుత పరిస్థితి అంత తేలికగా తీసుకునేలా లేదు. కచ్చితంగా రహానే, పుజారాల గురించి ఆలోచించాలి. వాళ్లిద్దరు ఇంకా అద్భుతంగా ఆడుతున్నారు. పరుగులు కూడా రాబడుతున్నారు. వాళ్లు జట్టుతో ఉంటే కుర్రాళ్లకు కాస్త ధైర్యంగా ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.చివరగా అపుడేకాగా రహానే 2023 జూలైలో చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఇక మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో 85 టెస్టులు ఆడి 5077 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఛతేశ్వర్ పుజారా 103 టెస్టులాడి 7195 పరుగులు సాధించాడు. నయా వాల్గా పేరొందిన పుజ్జీ చివరగా 2023 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత జట్టుకు దూరమైన వీరిద్దరు రంజీల్లో అదరగొడుతున్నారు. అయితే, రహానే, పుజారాలను మాత్రం సెలక్టర్లు ఇన్నాళ్లూ పరిగణనలోకి తీసుకోలేదు. మరి ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలోనైనా వీరికి పిలుపునిస్తారేమో చూడాలి!చదవండి: IPL 2025: ఎవరు ఆడతారు... ఎవరు ఆగిపోతారు?

కోచ్ ముర్రేతో జొకోవిచ్ తెగదెంపులు
లండన్: ఒక దిగ్గజ ప్లేయర్తో మరో మాజీ వరల్డ్ నంబర్వన్ కోచింగ్ అనుబంధం ఆరు నెలలకే ముగిసింది. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన కోచ్, బ్రిటన్ మాజీ ప్లేయర్ ఆండీ ముర్రేతో తెగదెంపులు చేసుకున్నాడు. ఇకపై వీరిద్దరు కలిసి పని చేయరని ముర్రే మేనేజర్ ప్రకటించాడు. గత ఏడాది ముర్రే ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత తనకు కోచింగ్ సహకారం కావాలంటూ జొకోవిచ్ స్వయంగా ముర్రేను సంప్రదించాడు. దాంతో వీరిద్దరు ఈ ఏడాది తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్కు ముందు జత కట్టారు. అయితే ఇది ఎక్కువ కాలం సాగలేదు. తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేక వరుసగా ఓడుతున్న జొకోవిచ్ ఈ సీజన్లో ఇంకా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. నిజానికి రాబోయే క్లే కోర్టు సీజన్ ముగిసే వరకు కూడా తనకు ముర్రే కోచ్గా వ్యవహరిస్తాడని గతంలోనే జొకోవిచ్ చెప్పినా... చివరకు దానికి చాలా ముందే ఇద్దరూ విడిపోయారు. ‘గత ఆరు నెలలుగా నాకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. కోర్టులో కఠోర శ్రమతో పాటు కోర్టు బయట కూడా రోజులు బాగా గడిచాయి’ అని జొకోవిచ్ సోషల్ మీడియాలో ముర్రే గురించి పోస్ట్ చేయగా...తనకు కోచ్గా అవకాశం ఇచ్చిన జొకోవిచ్కు ముర్రే కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పటికే 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన 37 ఏళ్ల జొకోవిచ్ మరో గ్రాండ్స్లామ్ టైటిల్ సాధిస్తే టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్గా ఆల్టైమ్ రికార్డు నెలకొల్పుతాడు. మహిళల విభాగంలో ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్, జొకోవిచ్ పేరిట సంయుక్తంగా ఈ రికార్డు ఉంది. కెరీర్లో 99 సింగిల్స్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ 100వ టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాడు. తదుపరి ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు జరిగే జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో జొకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలో జొకోవిచ్ గెలిస్తే జిమ్మీ కానర్స్ (109; అమెరికా), రోజర్ ఫెడరర్ (103; స్విట్జర్లాండ్) తర్వాత 100 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మూడో క్రీడాకారిడిగా గుర్తింపు పొందుతాడు.

శ్రీకాంత్కు చుక్కెదురు
బ్యాంకాక్: ప్రపంచ మాజీ నంబర్వన్, భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో తెలంగాణకు చెందిన తరుణ్ మన్నేపల్లి 21–16, 21–19తో శ్రీకాంత్ను బోల్తా కొట్టించి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు.అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో 23 ఏళ్ల తరుణ్ 17–21, 21–19, 21–17తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)పై, 32 ఏళ్ల శ్రీకాంత్ 21–15, 21–17తో శంకర్పై గెలుపొందారు. భారత్కే చెందిన ఆయుశ్ శెట్టి, ఐరా శర్మ కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయారు. క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్ల్లో ఆయుశ్ శెట్టి 14–21, 20–22తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో, ఐరా 12–21, 18–21తో థమన్వోన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో మొహిత్–లక్షిత (భారత్) జోడీ 8–21, 10–21తో ఎన్జీ సాజ్ యావు–చాన్ యిన్ చాక్ (హాంకాంగ్) ద్వయం చేతిలో ఓడింది.

భారత్ను సెమీస్కు చేర్చిన రోహెన్ సింగ్
దక్షిణాసియా అండర్–19 పురుషుల ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అరుణాచల్ప్రదేశ్లో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 4–0 గోల్స్ తేడాతో నేపాల్ జట్టును ఓడించి గ్రూప్ ‘టాపర్’గా నిలిచి సెమీఫైనల్కు అర్హత పొందింది. భారత్ తరఫున చాపామాయుమ్ రోహెన్ సింగ్ (28వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఒమంగ్ డోడుమ్ (29వ నిమిషంలో), డానీ మీటీ (84వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఈనెల 16న జరిగే సెమీఫైనల్లో మాల్దీవులు జట్టుతో భారత్ తలపడుతుంది.
బిజినెస్

పేటీఎమ్లో రూ.2,104 కోట్ల బ్లాక్డీల్
ఫిన్టెక్ చైనా దిగ్గజం యాంట్ గ్రూప్ తాజాగా దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్లో 4 శాతం వాటా విక్రయించింది. పేటీఎమ్ బ్రాండ్ కంపెనీలో వాటాను షేరుకి రూ. 823–826 ధరల శ్రేణిలో దాదాపు రూ. 2,104 కోట్లకు అమ్మివేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 2.55 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలుబీఎస్ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం గోల్డ్మన్ శాక్స్(సింగపూర్) 37.35 లక్షల షేర్లు(0.59% వాటా) కొనుగోలు చేసింది. షేరుకి రూ. 823 సగటు ధరలో ఇందుకు రూ. 307.4 కోట్లు వెచ్చించింది. ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ లావాదేవీల తదుపరి పేటీఎమ్లో యాంట్ గ్రూప్ వాటా 9.85% నుంచి 5.85%కి తగ్గింది. బల్క్ డీల్స్ నేపథ్యంలో పేటీఎమ్ షేరు నిన్న బీఎస్ఈలో 1.1 శాతం నష్టంతో రూ. 857 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 864–823 మధ్య కదలాడింది.

మెప్పించని టాటా మోటార్స్
ఆటో రంగ టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 51 శాతం క్షీణించి రూ. 8,556 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.17,528 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,19,033 కోట్ల నుంచి రూ. 1,19,503 కోట్లకు స్వల్పంగా బలపడింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 28,149 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. 2023–24లో రూ. 31,807 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,34,016 కోట్ల నుంచి రూ. 4,39,695 కోట్లకు ఎగసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆటోమోటివ్ బిజినెస్ ప్రస్తుతం రుణరహితంగా మారినట్లు కంపెనీ సీఎఫ్వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. కంపెనీ విడదీతకు వాటాదారులు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: ఐబీఎం హెచ్ఆర్లో ఏఐ!జేఎల్ఆర్ ఓకేక్యూ4లో లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 2 శాతం నీరసించి 7.7 బిలియన్ పౌండ్లను తాకినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పూర్తి ఏడాదికి దాదాపు యథాతథంగా 29 బిలియన్ పౌండ్ల టర్నోవర్ సాధించినట్లు తెలియజేసింది. యూఎస్, యూకే మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య డీల్ జేఎల్ఆర్కు సానుకూలమని పేర్కొంది. ఐదేళ్ల కాలంలో 18 బిలియన్ పౌండ్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ4లో టాటా మోటార్స్ స్టాండెలోన్ నికర లాభం 35 శాతం క్షీణించి రూ. 1,382 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం రూ. 20,260 కోట్ల నుంచి రూ. 19,999 కోట్లకు స్వల్పంగా నీరసించింది.

సెన్సెక్స్ 1,282 పాయింట్లు డౌన్
ముంబై: ఐటీ, ఆటో, ప్రైవేటు బ్యాంకులు షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో మంగళవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,282 పాయింట్లు క్షీణించి 81,148 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్లు పతనమై 24,578 వద్ద నిలిచింది. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి చైనా మార్కెట్కు తరలిపోవచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విషయంలో అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలనే ప్రతిపాదనతో భారత్ ప్రపంచ వాణిజ్య మండలిని ఆశ్రయించడంతో ట్రేడ్ వార్ ఆందోళనలు తెరపైకి వచ్చాయి.అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడమూ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్థమంతా పరిమిత శ్రేణిలో బలహీనంగా ట్రేడయ్యాయి. ద్వితీయార్థం నుంచి అమ్మకాల తీవ్రత పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,386 పాయింట్లు క్షీణించి 81,044 వద్ద, నిఫ్టీ 378 పాయింట్లు పతనమై 24,547 వద్ద కనిష్టాలు తాకాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు(–2%), ఇన్ఫోసిస్(–3.50%), రిలయన్స్ (–1.50%), టీసీఎస్(–3%), భారతీ ఎయిర్టెల్(3%), ఐసీఐసీఐ బ్యాంకు (–1%) నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ పతనంలో ఈ షేర్ల వాటాయే 845 పాయింట్లు కావడం గమనార్హం. ⇒ రంగాల వారీగా సూచీల్లో ఐటీ 2.50%, టెక్ 2.40%, యుటిలిటీ 1.35%, విద్యుత్, మెటల్, ఆయిల్అండ్గ్యాస్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. స్మాల్క్యాప్ సూచీ 1%, మిడ్క్యాప్ ఇండెక్స్ 0.17శాతం పెరిగాయి. మరోవైపు ఫార్మా, ఇండ్రస్టియల్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ⇒ రక్షణ రంగ షేర్లకు మూడోరోజూ డిమాండ్ నెలకొంది. భారత్ డైనమిక్స్ 11%, యాక్సిస్కేడ్స్ 5%, డేటా ప్యాటర్న్స్, భారత్ ఎల్రక్టానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 4%, మిశ్ర ధాతు నిగమ్ 3.50% రాణించాయి. పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, డీసీఎక్స్ సిస్ట మ్స్ 3% లాభపడ్డాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ 9%, ఏరియల్ ఇన్నోవేషన్స్ 5% పెరిగాయి. ⇒ సెబీ మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఎండీ పదవికి అన్మోల్ సింగ్, హోల్టైమ్ డైరెక్టరు పదవికి పునీత్ సింగ్ జగ్గీ రాజీనామాతో జెన్సోల్ ఇంజనీరింగ్ షేరు 5% క్షీణించి రూ.52 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. తదుపరి అనూహ్య రికవరీతో 5% లాభపడి 57.28 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి, అక్కడే ముగిసింది.

ధరలు దిగొచ్చాయ్..!
న్యూఢిల్లీ: మరో విడత కీలక పాలసీ రేట్ల కోత అంచనాలకు ఊతమిస్తూ ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాల ధరలు తగ్గడంతో 3.16 శాతానికి పరిమితమైంది. చివరిసారిగా 2019 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.15 శాతంగా నమోదైంది. జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్వో) విడుదల చేసిన డేటా ప్రకారం వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలో 3.34 శాతంగా, 2024 ఏప్రిల్లో 4.83 శాతంగాను ఉంది.ఇక తాజా మార్చి డేటాతో పోలిస్తే ఏప్రిల్లో ఆహార ద్రవ్యోల్బణం 91 బేసిస్ పాయింట్లు తగ్గి 2.69 శాతం నుంచి 1.78 శాతానికి దిగి వచ్చింది. 2021 అక్టోబర్ తర్వాత మళ్లీ ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి. 2024 ఏప్రిల్లో ఆహార ద్రవ్యోల్బణం 8.7 శాతంగా నమోదైంది. ‘కూరగాయలు, పప్పు ధాన్యాలు, పండ్లు, మాంసం..చేపలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటి ధరలు తగ్గడంతో 2025 ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గాయి‘ అని ఎన్ఎస్వో వెల్లడించింది. డేటా ప్రకారం ద్రవ్యోల్బణం తెలంగాణలో అత్యల్పంగా 1.26 శాతంగా, కేరళలో అత్యధికంగా 5.94 శాతంగా ఉంది. రేట్ల కోత అంచనాలు.. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో జూన్లో నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లను మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం మీద అదనంగా 75 బేసిస్ పాయింట్లు (ముప్పావు శాతం) తగ్గించవచ్చని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని (రెండు శాతం అటూ ఇటుగా) నాలుగు శాతానికి పరిమితం చేయడం లక్ష్యంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగానే ధరలు దిగి వస్తుండటంతో ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో రెండు విడతలుగా పాలసీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) తగ్గించింది.
ఫ్యామిలీ

Miss World 2025: బ్యూటీ విత్ ఫన్..
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ –2025 పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరం అందాల మగువల శోభను అలంకిరించుకుంది. హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా వసతి పొందుతున్న ఈ సుందరాంగులు ఏ మాత్రం సమయం దొరికినా ఫన్ యాక్టివిటీస్తో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలుగు సినీ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా.. నన్ను చుట్టూకుంటివే’ అనే పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ పాటకు అనుగుణంగా మిస్ డెన్మార్క్, మిస్ చెక్ రిపబ్లిక్, మిస్ జెర్మనీ సుందరాంగులు ఒరిజినల్ స్టెప్పులేశారు. మరి కొందరు తారలు సోషల్ మీడియా యాప్స్ కోసం సెల్ఫీ మోడ్లో రీల్స్ చేస్తూ సందడి చేశారు. మిస్ వరల్డ్ పోటీలతో పాటు వినోదం కోసం చేస్తున్న ఈ రీల్స్, ఫొటో షూట్లను ఎప్పటికప్పుడు వారి ఇన్స్టా, ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మిస్ ఇండియా నందినీ గుప్తా అందమైన అధునాతన–సంప్రదాయ సమ్మిళిత దుస్తుల్లో హోటల్లోని స్విమ్మింగ్ ఫూల్ పరిసరాల్లో చేసిన క్యాట్ వాక్ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా బ్రెజిల్, బోత్వానా, ఘనా, ఎల్ సెల్వడోర్ వంటి దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారలు ఒకరినొకరు తమ మొబైల్స్లో ఫొటోలు తీస్తూ సందడి చేశారు.

అందం కాదు బంధం
ఇప్పుడు అందాలపోటీలు చాలా మారాయి. రంగు, రూపు, ఆకృతి లాంటివాటికి అంత ప్రాధాన్యం ఉండట్లేదు. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యాన్నే ఆరాధిస్తున్నారు. అందుకే అందాలపోటీల్లో ఇన్క్లూజివిటీ పెరిగింది. మేని ఛాయ, ఆకృతి ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అని చెబుతున్న మిస్ సోమాలియా జైనబ్(Zainab Jama) బాలీవుడ్ సినిమాలు చాలా చూస్తారట. షారూఖ్ ఖాన్, కరీనా కపూర్ తన ఫేవరెట్ యాక్టర్స్ అని చెబుతున్నారు. ఆమె ఇంకా ఎన్నో విషయాలను ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు.నేను ఎఫ్జీఎమ్ (ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్) సర్వైవర్ని. సోమాలియాలో ఉన్న కామన్ హార్మ్ఫుల్ ప్రాక్టీస్ ఇది. మా దేశంలోని దాదాపు 98 శాతం మహిళలు దీన్ని అనుభవించినవారే! ఇప్పుడున్న ఆడపిల్లల్లో 30 శాతం మంది ఈ ఆచారం బారినపడే వయసుకు చేరుకున్నారు. అంటే ఏడేళ్లకు ఎఫ్జీఎమ్ చేస్తారు. ఎఫ్జీఎమ్ అంటే మహిళల సెక్సువల్ ఆర్గాన్ని కత్తిరించడం. యవ్వనంలో ఆమెకు లైంగికేచ్ఛ లేకుండా చేయడం. లైంగికేచ్ఛ లేకపోతే ఏ మగవాడి ఆకర్షణకు లోనుకారనే ఒక ప్రమాదకర, మూఢ విశ్వాసమన్నమాట.ఇది ఒక్క సోమాలియాలోనే కాదు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇప్పటికీ ప్రాక్టీస్లో ఉంది. ఈ అనాచారం వల్ల మా దేశంలో చాలామంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతోమంది అధికరక్తస్రావంతో దాదాపు చావు అంచులదాకా వెళ్లారు. నేను కూడా దీన్నుంచి కోలుకుని.. ఈ కథను షేర్ చేయడానికి చాలా కాలమే పట్టింది. నా కథ విని.. ఇలాంటి దుర్మార్గమైన ఆచారాన్ని రూపుమాపడానికి తగిన స్పందన, సహాయం అందుతుందని ఒకే ఒక ఆశతో నా ఈ కథను నాకు దొరికిన వేదిక మీదల్లా పంచుకోవడం మొదలుపెట్టాను. ఈ బ్యూటీపాజెంట్లో కూడా నా తోటి కంటెస్టెంట్స్కి చె΄్పాను. ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి దురాచారం ఒకటుందని ఈ కంటెస్టెంట్స్లో చాలా మందికి తెలియదు. నా కథ విని చలించిపోయారు.ఫిమో ఇనిషియేటెడ్ ఫౌండేషన్ను స్టార్ట్ చేసి, ఆ దురాచారానికి వ్యతిరేకంగాపోరాడుతున్నానని తెలిసి.. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. నాలో భరోసా నింపారు. బ్యూటీపాజెంట్ అంటే కేవలం స్కిన్ షో మాత్రమే అనుకునేవారు ఈ విషయం విని తమ అభి్రపాయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కంటెస్టెంట్స్లో ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రగుల్. అందరం అన్నీ షేర్ చేసుకుంటున్నాం. దానివల్ల వ్యక్తిగత సమస్యలు,పోరాటాలు చిన్నవిగా తోస్తున్నాయి. ఎదుర్కోవడానికి బోలెడంత అండ దొరికిన ఫీలింగ్ కలుగుతోంది. సిస్టర్హుడ్ డెవలప్ అవుతోంది. ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సరికొత్త ప్రయత్నాలకు ప్రేరణనిస్తున్నారు.పాజెంట్ తర్వాత కూడా ఈ బాండింగ్ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను.కొత్తగా అనిపించడం లేదు.. ఇండియా, ఆఫ్రికా సంస్కృతి, ఆహారపు అలవాట్లకు వస్తే.. ఇక్కడ నాకేమీ కొత్తగా అనిపించట్లేదు. నేను ప్యూర్ వెజిటేరియన్ని. సో ఇక్కడి భోజనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తెలంగాణ నా సొంతింటిని మరిపిస్తోంది. ఈపాజెంట్, కంటెస్టెంట్స్తో బాండింగ్, కొత్త భాషలు, కొత్త కల్చర్స్ తెలుసుకోవడం.. ఇవన్నీ నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్. తిరుగు ప్రయాణంలో ఆ ఎక్స్పీరియెన్సెస్ని, ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానాన్ని తీసుకెళ్దామనుకుంటున్నాను. – సరస్వతి రమమండేలా స్ఫూర్తి నాకు ఏడేళ్లున్నప్పుడు జెనిటల్ మ్యుటిలేషన్ జరిగింది. అదొక పెయిన్ఫుల్æట్రామా. దానినుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. నాలా ఇంకే అమ్మాయికీ జరగొద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా తొమ్మిదేళ్ల వయసులో మా కుటుంబం యూకేకి మైగ్రేట్ అయింది రెఫ్యూజీగా. అక్కడే ఏవియేషన్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మేనేజ్మెంట్ చేశాను. ప్రయాణాలన్నా.. ఏరోప్లేన్స్ అన్నా చాలా ఇష్టం. అందుకే అందులోనే చదువు పూర్తి చేశాను. ఒక్క ఎఫ్జీఎమ్ కోసమే కాదు.. ఇలాంటి ఇంకెన్నో దురాచారాలు, హింస మీద అమ్మాయిలు, మహిళలకు చైతన్యం కలిగించే ఎన్నో ఫౌండేషన్స్తో కలిసి పనిచేస్తున్నాను.అమ్మాయిల చదువు కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలతోనూ అసోసియేట్ అయి ఉన్నాను. మహిళలందరినీ ఏకం చేసి వారి మధ్య సిస్టర్హుడ్ను పెంచడానికీ ప్రయత్నిస్తున్నాను. నా మాతృదేశానికి వెళ్లిపోయి.. యుగాలుగా నాటుకుని ఉన్న ఈ అనాచారాన్ని రూపుమాపడమే నా లక్ష్యం. ఇదొక్క సోమాలియాకే పరిమితమైన సమస్య కాదు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఉంది. మార్పు కోసం అన్ని దేశాల్లోనూ వర్క్ చేస్తాను. అయితే ఇది నేనిప్పుడు మీతో చెబుతున్నంత ఈజీ కాదని తెలుసు. మా ట్రెడిషన్ గురించి ప్రపంచానికి చెబుతున్నానని, ధిక్కరిస్తున్నానని బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. వెనకడుగు వేసేది లేదు. ఈ విషయంలో నాకు నెల్సన్ మండేలా స్ఫూర్తి. – ‘మిస్ సోమాలియా’ జైనబ్

రైతు కూతురి కలల సేద్యం
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా(Nandini Gupta) రాజస్థాన్లోని ఓ పల్లెటూరిలో రైతు కుటుంబంలో జన్మించింది. ‘అందరికీ నమస్కారం.. నేను మీ నందిని..’ అంటూ తెలుగులో చిరునవ్వుతో పలకరించిన ఈ బ్యూటీ మిస్ వరల్డ్పోటీలోపాల్గొనేంతగా తనను తాను ఎలా నిర్మించుకుందో వివరించింది. ‘ఎక్కడ నుంచి వచ్చాం అన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్లాం.. అన్నదే ముఖ్యం’ అన్న ఆత్మవిశ్వాసంతోపాటు భవిష్యత్తు ప్రణాళికలనూ మన ముందుంచింది మిస్ వరల్డ్– 2025 కాంటెస్ట్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా.‘‘అమ్మానాన్నలకు నేను, చెల్లి సంతానం. స్కూల్లో చదివేటప్పుడే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు ఆమెను చాలా మంది అభినందించడం, కెమెరా ఫ్లాష్ లైట్లలో వెలిగిపోతుండటం టీవీలో చూసి... ‘ఆమె ఎవరు?’ అని అమ్మను అడిగాను. ‘ఆమె మిస్ వరల్డ్, నటి’ అని చెప్పింది అమ్మ. నా మనసులో ఆనాటి సంఘటన బలంగా ముద్రించుకుపోయింది. అప్పటినుంచి అందంగా ఉండటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. మంచి డ్రెస్సులు వేసుకునేదాన్ని, మేకప్ చేసుకునేదాన్ని, హెయిర్స్టైల్స్ మార్చేదాన్ని. అందాలపోటీలోపాల్గొనడానికి ఏమేం చేయాలో తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఓ రైతు కూతురు కలలు కనే ధైర్యం చేయవచ్చా! అనే ఆలోచన లేకుండా నా ప్రయాణాన్ని కొనసాగించాను. నా ఆసక్తులు గమనించిన అమ్మానాన్నలు ఆ తర్వాత మా కుటుంబాన్ని ముంబయ్కి షిఫ్ట్ చేశారు. ఆ విధంగా ఆవాలు పండే పోలాల మధ్య పెరిగిన నేను ముంబయ్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను.మాట్లాడాలంటే బెరుకుపోటీలలోపాల్గొనే కొత్తలో వేదికలపైన నా గురించి నేను చెప్పుకోవడానికి, మైక్ ముందు మాట్లాడటానికి సిగ్గుపడేదాన్ని. ఏదో తెలియని బెరుకు ఉండేది. ఇలా అయితే రాణించలేను అనుకున్నాను. నా శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నించాను. నన్ను నేను కొత్తగా నిర్మించుకోవడంలో ఎలా ఉన్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను అనే విషయాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నా డ్రెస్, మేకప్, నా మాట, చూపు అన్నీ సమర్థంగా ఉన్నప్పుడు దేనికీ వెనకంజ వేయనక్కర్లేదు అని తెలుసుకున్నాను. ఆ ఆత్మవిశ్వాసమే ఈ రోజు ఇలా మీ ముందుకు తీసుకువచ్చింది.మార్పునకు శ్రీకారంఅందాలపోటీలవైపు వెళ్లేటప్పుడు మొదట్లో తటపటాయించినప్పటికీ మిస్ రాజస్థాన్ టైటిల్ గెలిచాక నా ఇష్టానికి మద్దతు ఇచ్చారు మా నాన్న. ఫెమినా మిస్ ఇండియాపోటీల్లో గెలిచాక అయితే ఆయన చాలా ఉద్వేగానికి గురయ్యారు. ఆ క్షణాలు ఎప్పటికీ మరవలేను. చదువంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్న కోరిక మేరకు బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అమ్మాయిలు తల మీదుగా ముసుగు ధరించాలి, వారికి పెద్దగా చదువు అక్కర్లేదు, త్వరగా పెళ్లి చేయాలనే ఆలోచన అక్కడి తల్లిదండ్రుల్లో ఉండేది. ఇప్పుడు అక్కడా బ్యూటీ కాంటెస్ట్లకు ట్రైనింVŠ ఇచ్చే అకాడమీలు పెరిగాయి. తల్లిదండ్రులు కూడా తమ కూతుళ్లను బ్యూటీ కాంటెస్ట్లోపాల్గొనడానికి పోత్సహిస్తున్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.దివ్యాంగుల సాధికారత కోసం..దివ్యాంగులను సమాజంలో ఒక భాగం చేయడం కోసం పనిచేయడమే నా లక్ష్యం. మా మేనమామ పుట్టుకతోనే దివ్యాంగుడు. సరిగా మాట్లాడలేరు. కానీ, ఎప్పుడూ మానసిక స్థైర్యంతో ఉంటారు. చిన్నప్పటి నుంచి అతని కళ్ల నుంచి ప్రపంచాన్ని చూశాను. కనిపించని బాధ ఏదో మోస్తున్నట్టుగా అతనిలో నాకు కనిపించేది. అలాంటి వాళ్లు పడుతున్న బాధలు స్వయంగా చూశాను. వికలాంగుల గాధలు చాలా బాధనిపించేవి. మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచాక ‘ఏక్తా ప్రాజెక్టు’లో భాగంగా అనేక మంది దివ్యాంగులతో కలిసి పలు కార్యక్రమాల్లోపాల్గొన్నా. వారి కలల సాకారానికి కృషి చేయాలనుకున్నాను. భవిష్యత్తు ప్రణాళికలుఇప్పటికే మోడల్గా ప్రకటనలలో యాక్ట్ చేస్తున్నాను. తెలుగు సినిమాలు, డ్యాన్స్లు అంటే చాలా ఇష్టం. మహేష్బాబు నటించిన సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి .. ’సాంగ్ మరీ మరీ ఇష్టం. ఆపాట విన్నప్పుడల్లా డ్యాన్స్ చేస్తుంటా. నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది’’ అంటూ వివరించింది ఈ బ్యూటీ. – నిర్మలారెడ్డిరాజస్థాన్లోని కోటాకు దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరులో రైతు కుటుంబంలో పుట్టి పెరిగింది నందిని గుప్తా. స్థానిక హస్తకళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోటా డోరియా వస్త్రాల ప్రాచుర్యానికి కృషి చేస్తోంది. ఫ్యాషన్లోనూ తన మూలాలను చూపించేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శైలినిపాటిస్తోంది. యోగా, డ్యాన్స్, హెల్తీ డైట్నుపాటించడమే తన బ్యూటీ సీక్రెట్ అని తెలిపింది.

అలా రిటైర్మెంట్ ..ఇలా ఆధ్యాత్మిక సేవ, కోహ్లీ దంపతుల ఫోటోలు వైరల్!
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మరునాడే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ,తన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మతో కలిసి ఉత్తర ప్రదేశ్లోని బృందావన్ దామ్ను సందర్శించారు. అక్కడ ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్ కలిసిన కోహ్లీ, అనుష్క దంపతులు ఆధ్యాత్మిక గురువు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్ని కలవడం ఇది రెండోసారి కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగామారాయి. సతీ సమేతంగా తమ అభిమాన ఆధ్యాత్మిక గమ్యస్థానమైన బృందావనానికి చేరుకున్నారు. కెల్లీ కుంజ్ ఆశ్రమంలోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్తో కొన్ని సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రవచనాలను శ్రద్ధగా విన్నారు. ఆ తరువాత కోహ్లీ, అనుష్క దంపతులు సాధువు ఆశీర్వాదాలు తీసుకున్నారు.🥹❤️ An emotional moment for all fans!Just a day after announcing his retirement from Test cricket, Virat Kohli visited Vrindavan with Anushka Sharma to seek blessings from Premanand Ji Maharaj. 🙏This moment is more than just spiritual—it's the beginning of a new chapter for… pic.twitter.com/FRRkl2vkHo— Abhishek Bhardwaj (@abhibhardwaj14) May 13, 2025 కెల్లీ కుంజ్ ఆశ్రమానికి చెందిన యూట్యూబ్ ఛానెల్లో వీరి వీడియో అప్లోడ్ అయింది. ఈ సందర్భంగా అనుష్క శర్మ కోరుకున్నది జరగాలంటే ఎలాంటి మంత్రాన్ని జపించాలని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్ను అని అడిగారు. దీనికి మహారాజ్ స్పందిస్తూ, అది పూర్తిగా సాధించదగినదని సాంఖ్య యోగం, అష్టాంగ యోగం , కర్మ యోగాలను అనుభవించిన తర్వాత భక్తి యోగానికి వచ్చానని, ఇది తన వ్యక్తిగత అనుభవమని చెప్పుకొచ్చారు. అయితే, వ్యక్తిఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆయన(దేవుడు) కృప ఉంటుంది. తన భక్తులకు అంతిమ శాంతికి మార్గాన్ని చూపించేవాడు ప్రభువు అని వెల్లడించారు. "ఒకరి కీర్తి , కీర్తి పెరుగుదల దేవుని దయగా పరిగణించబడదు అనేది నిజం. ఒక వ్యక్తిలో ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆ దేవుడి దయ ఉంటుంది... దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. ఆనందంతో దేవుని నామాన్ని జపించండి."అనుష్క బ్లాక్ ప్రింట్ ఉన్న తెల్లటి సూట్-సెట్ ధరించగా, విరాట్ ఆలివ్ గ్రీన్ ప్యాంటుతో జత చేసిన సేజ్ గ్రీన్ షర్ట్ ధరించాడు. ఈ జంట గతంలో 2025 జనవరిలో ఆధ్యాత్మిక నగరాన్ని సందర్శించారు. మాజీ కెప్టెన్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఫొటోలు


హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)


సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం.. బడిబాట పట్టిన విద్యార్థులు (ఫొటోలు)


అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)


దారి వెంట నీరాజనం..‘జై జగన్’ అంటూ నినాదాలు (ఫొటోలు)


#MissWorld2025: బ్యూటీ విత్ ఫన్..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)


చౌమహల్లా ప్యాలెస్లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)


చార్మినార్ దగ్గర మిస్ వరల్డ్ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)


భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)


హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)


నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)
అంతర్జాతీయం

అఫ్గానిస్తాన్లో చెస్ను నిషేధించిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం చెస్ను నిషేధించింది. జూదం వంటి ఈ ఆట.. ఇస్లామిక్ చట్టం షరియా ప్రకారం చట్ట విరుద్ధమని తాలిబన్ క్రీడా డైరెక్టరేట్ తెలిపింది. మతపరమైన ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ ఆందోళనలు పరిష్కారమయ్యే వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకకు అఫ్గానిస్తాన్లో చెస్ నిషేధంలో ఉంటుందని తేల్చి చెప్పింది.ఇప్పటికే తాలిబన్లు దేశంలో అనేక క్రీడలకు పరిమితులు విధించారు. హింసాత్మకమైనది, ఇస్లా ప్రకారం సమస్యాతమైనదంటూ మార్షల్ ఆర్ట్స్ను నిషేధించారు. ఇక మహిళలకు మొత్తం క్రీడల నుంచే దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో చెస్పై నిషేధం చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో కాబూల్లోని అజీజుల్లా గుల్జాదా కేఫ్ చెస్ పోటీలు నిర్వహించింది.ఇతర ముస్లిం మెజారిటీ దేశాల్లోనూ చెస్ ఆడతారని, అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ నిషేధం తన వ్యాపారంతోపాటు ఆటను ఆస్వాదించేవారిని దెబ్బతీస్తుందని.. అయినా తాను నిషేధాన్ని గౌరవిస్తానని వెల్లడించారు. యువతకు పెద్దగా కార్యకలాపాలు లేవని, దీంతో కొందరు యువకులు వచ్చి ఓ కప్పుటీ తాగి, స్నేహితులతో చెస్ ఆడతారని వెల్లడించారు.

జైళ్ల నుంచి జర్నలిస్ట్లను విడిచిపెట్టాలి
వాటికన్ సిటీ: జైళ్లలో ఉన్న జర్నలిస్ట్లందరినీ వెంటనే విడుదల చేయాలని నూతన పోప్ లియో 14 పిలుపునిచ్చారు. పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం మనకున్న విలువైన కానుకలని ఆయన నొక్కి చెప్పారు. మొట్టమొదటి సారిగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. వాటికన్ సిటీలో ఆడిటోరియంలోకి ఆయన ప్రవేశించడంతోనే అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. శాంతి బలోపేతమయ్యేలా, యుద్ధాన్ని తిరస్కరించేలా రాయాలని, అణగారిన వారికి గొంతుకగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా సత్యాన్ని కనుగొనే క్రమంలో జైళ్ల పాలైన జర్నలిస్టులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఇటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన పిలుపునివ్వగానే ప్రాంగణంమంతా చప్పట్లతో ప్రతిధ్వనించడం విశేషం. ‘ఇటువంటి వారిని చర్చి గుర్తిస్తుంది. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి యుద్ధం పురోగతిని గురించి బయటి ప్రపంచానికి తెలిపే వారి గురించే నా తపనంతా. గౌరవం, న్యాయం, ప్రజల సమాచార హక్కును కాపాడే ధీరులు వీరంతా. ఎందుకంటే, సమాచారం ఉంటేనే కదా ఎంపికలో స్వేచ్ఛ ఉండేది!’అని పోప్ పేర్కొన్నారు. మనం ఇతరులను చూసే విధానం, వారి మాట వినడం, వారి గురించి మాట్లాడే విధానం ద్వారా శాంతి మనతోనే ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. పోప్ ఎన్నికను కవర్ చేసేందుకు ప్రపంచ దేశాల నుంచి తరలివచి్చన సుమారు 6వేల మంది పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభంలో కొద్ది సేపు ఇంగ్లి‹Ùలో మాట్లాడిన ఆయన..ఆ తర్వాత మొత్తం ఇటాలియన్లోనే కొనసాగించారు. ముందు వరుసల్లో ఉన్న కొందరు జర్నలిస్టులను పోప్ లియో 14 పలకరించారు. హాలు నుంచి తిరిగి బయటకు వెళ్లేటప్పుడు కొందరితో కరచాలనం చేశారు. ఆటోగ్రాఫ్లపై సంతకం చేశారు. కొందరితో సెల్ఫీలకు పోజిచ్చారు.

హమాస్ చెర నుంచి అమెరికా బందీ విడుదల
దెయిర్ అల్–బలాహ్: తమ చెరలో ఉన్న అమెరికా పౌరుడైన ఇజ్రాయెల్ సైనికుడు ఈడన్ అలెగ్జాండర్ను గాజాలోని హమాస్ సాయుధ సంస్థ సోమవారం రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ శ్రేణులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మెరుపుదాడి చేపట్టి వందలాది మందిని చంపడంతోపాటు 250 మందిని బందీలుగా పట్టుకుపోవడం తెల్సిందే. వీరిలో ఈడన్ సహా ఇప్పటికీ చెరలోనే ఉన్న 59 మందిలో 24 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు చెబు తున్నారు. పట్టుబడిన సమయంలో ఇతడు ఇజ్రాయెల్ సైన్యంలోని ఇన్ఫాంట్రీ విభాగంలో విధుల్లో ఉన్నాడు. దాదాపు 19 నెలలపాటు గాజాలో హమాస్ వద్ద సజీవంగా ఉన్న వారిలో అమెరికాకు చెందిన ఏకైక వ్యక్తి ఈడన్. ఈడన్ కోసం సురక్షిత కారిడార్ ఏర్పాటు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ట్రంప్ ప్రభుత్వంపై సాను కూల ధోరణితోనే ఈడన్ను వదిలిపెట్టినట్లు హమాస్ ప్రకటించింది. యుద్ధం ముగిసే దిశగా సానుకూల పరిణామమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

పాక్కు సైనిక సామగ్రి తరలింపు అబద్ధం: చైనా
బీజింగ్: పాకిస్తాన్కు సరుకు రవాణా విమానంలో సైనిక సామగ్రిని తాము సరఫరా చేశామంటూ వస్తున్న వార్తలను చైనా ఖండించింది. ఇటువంటి వదంతులను వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జియాన్ వై–20 రకం విమానంలో పెద్ద మొత్తంలో సామగ్రిని పాకిస్తాన్ తరలించినట్లు ఆన్లైన్లో వస్తున్న వార్తలు అసత్యాలని పేర్కొంది. ‘ఇంటర్నెట్ చట్టానికి అతీతం కాదు. సైనిక సంబంధమైన వదంతులను, అసత్యాలను వ్యాప్తి చేసే వారిని బాధ్యులను చేస్తాం’అని స్పష్టం చేసింది. భారత్తో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరాక పాక్కు అత్యవసరమైన సామగ్రిని చైనా పంపించిందంటూ ఆన్లైన్లో వార్తలు షికారు చేశాయి. పాక్, చైనాల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. పాక్ ఆయుధ సామగ్రి, వ్యవస్థల్లో ఏకంగా 81 శాతం చైనా నుంచి కొనుగోలు చేసినవేనని స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) తెలిపింది.
జాతీయం

మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
ఢిల్లీ :న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారి తన దౌత్య కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సదరు అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది.

‘మోదీ జీ.. మీరు దేశాన్ని నడిపిస్తున్న తీరు అమోఘం’
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అఘోఘమని శశిథరూర్ కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ తో దాయాది పాకిస్తాన్ కు ఒక క్లియర్ మెస్సేజ్ పంపించారని అన్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్న దానిని అస్సలు పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఏం జరిగిందో అంతా చూశారన్నారు శశిథరూర్. భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతను సమర్థవంతంగా తిప్పికొట్టారని, ఇందులో తమకు ఎటువంటి సందేహం లేదన్నారు శశిథరూర్.ప్రధానిగా మోదీ దేశానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. ప్రత్యేకంగా సంక్షోభ సమయంలో మోదీ వ్యవహరిస్తున్నరు నిజంగా అద్భుతమన్నారు. అది కోవిడ్ లాంటి మహమ్మారి అయినా దేశ ద్రోహులపై చేసే యుద్ధమైనా మోదీ స్పందిస్తున్న తీరు వెలకట్టలేనిది. ఏది దేశానికి ముఖ్యమో అది మోదీ ఒక ప్రధానిగా చేసి చూపిస్తున్నారని శశిథరూర్ ప్రశంసించారు. ఈ మేరకు జాతీయ మీడియా ఎన్డీటీవో మాట్లాడిన శశిథరూర్.. దేశాన్ని నాలుగు కోణాల్లో చూస్తూ ముందుండి నడిపిస్తున్న నేత మోదీ అని కొనియాడారు. భారత్ సంక్షోభంలో ఉన్న ప్రతీసారి మోదీ ఇకపై కూడా ఇలానే వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు లోక్ సభ ఎంపీ శశథరూర్.ఇక్కడ చదవండి: ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం: ప్రధాని మోదీ

ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం: ప్రధాని మోదీ
ఆదంపూర్: భారత్ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో సైనికులు భారత్ మాతాకీ జై అంటే.. శత్రువు వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ తరువాత మంగళవారం ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' పంజాబ్లోని అదంపూర్ ఎయిర్బేస్కు వెళ్లారు. అక్కడ వాయుసేన సేవలను ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్కు ఇండియన్ ఎయిర్ఫోర్స్ తన సత్తా చూపించిందని అన్నారు. భారత్ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని అన్నారు. యుద్ధ రంగంలో మన సైనికులు చరిత్ర సృష్టించారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది ప్రపంచమంతా మార్మోగిందని, ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.నా జీవితం ధన్యమైంది‘దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారు. భారత్ శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది. మన సైన్యం సామర్థ్యం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. వీర సైనికులందరికీ నా సెల్యూట్. ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మారుమ్రోగింది. సైన్యం దేశ ఆత్మ విశ్వాసం పెంచింది. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సిద్ధాంతం. అక్క చెల్లెల సిందూరం తుడిచినవారిని నాశనం చేశాం’ అని మోదీ సైన్యాన్ని కొనియాడారు.‘గురిచూసి కొట్టిన దెబ్బతో.. శత్రు స్థావరాలు మట్టిలో కలిశాయి. వారు వెనుక నుంచి దాడి చేస్తే.. మీరు ముందు నిలబడి ధైర్యంగా దాడిచేశారు. పాకిస్తాన్ డ్రోన్స్, యూవీఏలు, ఎయిర్క్రాఫ్ట్లు మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేకపోయాయి. పాక్ శత్రువులు పౌరులను అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడింది. కానీ మీరు మాత్రం పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా శత్రువును దెబ్బకొట్టారు. అణు బ్లాక్ మెయిల్ను భారత్ ఎప్పటికీ సహించదు. మళ్ళీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానం ఇస్తుంది. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.#WATCH | At the Adampur Air Base, PM Narendra Modi said, "Besides manpower, the coordination of machine in #OperationSindoor was also fantastic. Be it India's traditional air defence system which has witnessed several battles or our Made in India platforms like Akash - all of… pic.twitter.com/Y2dYnanFmN— ANI (@ANI) May 13, 2025

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఫలితాల వివరాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో ఉంచారు. 93.66 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే ఇది 0.06 శాతం ఎక్కువ. 2024లో 93.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు కంటే బాలికలు 2.37 శాతం ఎక్కువ మంది పాసయ్యారు. బాలికలు 95%, బాలురు 92.63% ఉత్తీర్ణత సాధించారు.ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 2371939 మంది విద్యార్థులు హాజరుకాగా, 2221636 మంది ఉత్తీర్ణులయ్యారు. 99.79 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం టాప్లో నిలిచింది. విజయవాడ రీజియన్లో కూడా 99.79 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బెంగళూరు 98.90%, చెన్నై 98.71, పుణే 96.54 శాతం ఉత్తీర్ణత శాతంతో టాప్-5లో ఉన్నాయి.జవహర్ నవోదయ విద్యాలయ 99.49%, కేంద్రీయ విద్యాలయ 99.45%, ఇండిపెండెంట్ స్కూల్స్ 94.17%, సంభోటా టిబెటన్ స్కూల్స్ సొసైటీ 91.53%, ప్రభుత్వ పాఠశాలలు 89.26%, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ 83.94%, ఉత్తీర్ణత సాధించాయని సీబీఎస్ఈ ప్రకటించింది. చదవండి: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో విజయవాడ టాప్
ఎన్ఆర్ఐ

పహల్గామ్ విషాదం, ఎన్ఆర్ఐల శాంతి ర్యాలీ
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన చేశారు.అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావటం, ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకోవటంపై ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు. హింసామార్గంలో ఎవరూ కూడా లక్ష్యాలను సాధించలేరన్న విషయాన్నిపాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.ఉగ్రవాదుల అణిచేతకు భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం(నైటా), వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారతీయ జెండాలను ప్రదర్శిస్తూ, కొవ్వత్తులతో శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.

లండన్లో ఘనంగా తాల్ 20వ వార్షికోత్సవం, ఉగాది సంబరాలు
తెలుగు అసోసీయేషన్ ఆఫ్ లండన్(తాల్(TAL)) 20వ వార్షికోత్సవం తోపాటు, ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిలల 26న ఈస్ట్ లండన్లోని లేక్వ్యూమార్కీలో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. దీంతో ఇది తాల్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల తన బృందంతో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఈవెంట్ కన్వీనర్ రవీందర్ రెడ్డి గుమ్మకొండ, కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల ప్రత్యేక అథిధులుగా పాల్గొన్నారు. ముందుగా ఫల్గాం విషాద సంఘటనలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిముషాల మౌనం పాటించి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాల్ సమైక్యతను, మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది. తాల్ 20 సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఛైర్మన్ రవి సబ్బా ఈ తాల్ విజయ పరంపరకు తోడ్పడిన గత చైర్మన్లు, ట్రస్టీలు, ఉగాది కన్వీనర్లందర్నీ ఘనంగా సత్కరించారు. తాల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాములు దాసోజుని తాల్ కమ్యూనిటీ లీడర్షిప్ అవార్డుతో సత్కరించారు. తాల్ వార్షిక పత్రిక "మా తెలుగు 2025"ని కూడా ఈ వేడుకలో ఆవిష్కరించారు. అందుకు కృషి చేసిన సూర్య కందుకూరి, ప్రధాన సంపాదకుడు రమేష్ కలవల తదితర సంపాదక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో తాల్ చరిత్రను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీ ప్రదర్శన ద్వారా గత రెండు దశాబ్దాల విశేషాలను చిత్ర మాలికా రూపంలో ప్రదర్శించారు. ఇక ఈ వేడుకలోనే స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ సత్య పెద్దిరెడ్డి తాల్ ప్రీమియర్ లీగ్ (TPL) T20 క్రికెట్ సీజన్ను కూడా ప్రారంభించారు. ముఖ్యఅతిథి రామ్ మిరియాల2025 ఛాంపియన్ ట్రోఫీని ఆవిష్కరించారు.(చదవండి: టంపాలోనాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు)

వైట్హౌస్లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
క్రైమ్

వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
వినుకొండ : పొట్ట కూటి కోసం వస్తున్న కూలీలను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గడ్డమీద పల్లె, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దారుపల్లి తాండకు చెందిన ఆరుగురు రైతు కూలీలు మంగళవారం బొప్పాయి తోటలో కాయ కోసేందుకు బొలెరో ట్రక్లో పల్నాడు జిల్లా ఈపూరు వస్తున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరి బొండాల లారీ, బొలెరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో గడ్డమీద పల్లె గ్రామానికి చెందిన పగడాల రమణారెడ్డి (45), పగడాల సుబ్బమ్మ (40) దంపతులు, దారుపల్లి తాండకు చెందిన జొన్నగిరి రామాంజి (35), జొన్నగిరి అంకమ్మ (28) దంపతులు మృతి చెందారు. లారీలో ఉన్న కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ, డ్రైవర్ కదిరి నాగేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డారు. పగడాల సుబ్బమ్మ, జొన్నగిరి అంకమ్మలు ఘటనా స్థలంలో మృతి చెందగా, రమణారెడ్డి, రామాంజిలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. వినుకొండ పోలీసులు గాయపడ్డ వారిని సమీపంలోని వైద్యశాలకు, మృతదేహాలను మార్చురీకి తరలించారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి : పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద బొలెరో ట్రక్, లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
బ్రహ్మంగారి మఠం: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం మల్లేపల్లె చెరువులో ఈతకు దిగి చరణ్ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్ (12), తరుణ్ యాదవ్ (10) మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవులు కావటంతో మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. గ్రామంలోని చెరువులో ఈత కొట్టాలని భావించిన భవాని పిల్లలు చరణ్, పార్థు, మరో చెల్లెలు సావిత్రి కుమారుడు హర్ష, మల్లేపల్లె గ్రామానికి చెందిన మేకల గంగాధర్ యాదవ్ కుమారుడు తరుణ్ యాదవ్, కాశినాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన నారాయణ కుమారుడు దీక్షిత్ గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు. పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

మాజీ ప్రియురాలిపై దాడి చేసిన యువకుడి అరెస్టు
బంజారాహిల్స్(హైదరాబాద్): మాజీ ప్రియురాలిపై దాడికి పాల్పడటమే కాకుండా ఆమె తాజా బాయ్ఫ్రెండ్ను బెదిరింపులకు గురిచేస్తూ ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితుడిపై బంజారాహిల్స్ పోలీస్స్టేసన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతానికి చెందిన కోటి అఖిల్కుమార్(28) బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అందులో పనిచేస్తున్న యువతిని కొంతకాలంగా ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఉన్నత చదువుల కోసం పోలాండ్ దేశానికి వెళ్లి అక్కడ కొద్ది రోజులు సహజీవనం చేసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధిత యువతి మరో యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని మాజీ ప్రియుడు అఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను తరచూ వెంబడిస్తూ ఆమె రాకపోకలపై నిఘా ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె విధులు ముగించుకుని బంజారాహిల్స్ నుంచి క్యాబ్లో తార్నాకలోని తన గదికి వెళ్తుండగా ఆమెను అనుసరించి ఆమెకు తెలియకుండా నేరుగా ఆమె గదిలోకి వెళ్లి తాజా ప్రియుడితో కలిసి ఉండగా ఫొటోలు తీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె సెల్ఫోన్ లాక్కొని అందులో డేటాను తొలగించి ధ్వంసం చేశాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో కన్ను, ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. అఖిల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అఖిల్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

నువ్వులేని లోకంలో నేనుండలేను కొడుకా..
కరీంనగర్ జిల్లా: ‘కొడుకా.. నువ్వే గుర్తొస్తున్నావ్... ఒక్కగానొక్క కొడుకని అపురూపంగా చూసుకున్నా.. చదువుకుంటా అంటే హైదరాబాద్ పంపిన. మాయ దారి బెట్టింగ్లో రూ.లక్షలు పోగొట్టుకున్నా.. సరే బిడ్డా అని ధైర్యం చెప్పిన. అయినా మమ్మల్ని మోసం చేస్తివి. బెట్టింగ్కు బలై ఈ లోకాన్నే విడిచిపోతివి. నిన్ను మర్చిపోలేకపోతున్నా కొడుకా.. నీవు లేని లోకం నాకు వద్దు బిడ్డా’అంటూ.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఓ తండ్రి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మన్నెంపల్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు(49) కొడుకు నిఖిల్రావు (21) ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు అలవాటుపడి రూ.లక్షల్లో అప్పు చేశాడు. అవి తీర్చలేక, మానసిక ఒత్తిడితో రెండు నెలల క్రితం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిఖిల్ ఒక్కగానొక్క కొడుకు కావడంతో, అతని మృతిని తిరుపతిరావు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆదివారం తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే అతన్ని హైదరాబాద్లోని ఒక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్తో కొడుకు.. అతని మరణం తట్టుకోలేక తండ్రి మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
వీడియోలు


లండన్ వేదికగా SSMB29 బిగ్ అప్డేట్..


భారత్ జవాన్ ను విడిచిపెట్టిన పాకిస్థాన్


మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించిన చైనా


చంద్రబాబు పాలనాపై ఆర్కే రోజా కామెంట్స్


మా వాళ్లు ఎంతమంది పోయారంటే.. పాకిస్తాన్ కీలక ప్రకటన


ఏ క్షణమైనా 'రాజాసాబ్' టీజర్ రిలీజ్!


జగన్ ప్రభంజనం చూసి సోనియా గాంధే భయపడింది.. ఇక బాబెంత!


మా మదర్సాపై బాంబులు పడ్డాయి! పూంచ్ ముస్లింల ఆవేదన..


సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి


ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ