Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu Serious Drama On Rowdy MLAs1
తమలపాకుతో కొట్టినట్లు.. నెమలీకతో మొట్టినట్లు..!

మొదట్నుంచి చంద్రబాబు తీరే అంత.. రకరకాల హామీలు.. రంగురంగుల అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి ఉన్నంత ఆరాటం.. ఆత్రం పాలనలో ఉండదు.. తనకుతాను విజనరీని అనుకుంటూ భ్రమల్లో ఉంటూ విదేశీ విహారాలు.. అంతర్జాతీయ సదస్సులు.. సెలబ్రిటీలతో ఫొటోలతో కాలం గడుపుతూ ఉంటారు.. ఇటు ఎమ్మెల్యేలు దాదాపుగా తమ నియోజకవర్గాలకు సీఎంలుగా భావించుకుంటూ ఏకంగా నియంతలుగా మరి చెలరేగిపోతుంటారు.. ఇది పలుసందర్భాల్లో రుజువైంది.ఇలా ఎమ్మెల్యేలు కట్టుతప్పి మీడియాకు.. ప్రతిపక్షాలకు వార్తంశంగా మారిన ప్రతిసందర్భంలోనూ చంద్రబాబు సీరియస్ గెటప్ వేస్తారు. వెంటనే కళ్ళు పెద్దవి చేస్తూ అందరిమీదా ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. ఎమ్మెల్యేలు భయ పడతారు. సొంత పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో చంద్ర నిప్పులు అంటూ కథనాలు వస్తాయి.. ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయాక మళ్ళీ అందరూ ఎవరి స్టయిల్లో వాళ్ళు జనం మీద స్వారీ చేస్తారు.. మళ్ళీ బాబుగారు ఆగ్రహం నటిస్తారు.. తమలపాకుతో తీవ్రంగా కొడతారు.. నెమలీకలతో మొట్టికాయలు వేస్తారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఆ దెబ్బలకు తాళలేక ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ కుయ్యో మొర్రో.. ఇక ముందు మేం తప్పులు చేయం అని ఎటెన్షన్ లోకి వస్తారు.. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే.తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా తనకుతాను మహరాజులా.. నియోజకవర్గానికి సర్వాంతర్యామిలా మారిపోయి అధికారం చెలాయిస్తున్నారు. సత్యవేడు ఎమ్మెలు ఆదిమూలం , గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వంటివాళ్ళు మహిళలను వేధించే పనుల్లో బిజీ అయ్యారు. వారిమీద సొంతపార్టీ కార్యకర్తలే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అయితే ఏకంగా ప్రభుత్వ సిబ్బందికి రాత్రిపూట ఫోన్లు చేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయన దెబ్బకు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు ప్రయత్నించారు.ఇక నిన్నగాక మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అయితే తగిన మత్తులో ఏకంగా ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ సిబ్బందిని తెలుగుదేశం ఎమ్మెల్యే కొట్టినా అయన చప్పుడు చేయలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక రౌడీ షీటర్ కు పెరోల్ ఇప్పించగా ఆ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఇక ఎచ్చెర్ల జనసేన ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర రావు అయితే నియోజనవర్గంలోని ఏ వ్యాపార సంస్థనూ వదలడం లేదు.. నెలవారీ మామూళ్లు ఇవ్వకుంటే వ్యాపారాలు నడవదు అని బహిరంగ వార్ణింగ్ ఇస్తున్నారు. జమ్మలమడుగులో సిమెంట్ కంపెనీలు నడవాలంటే నా కనుసన్నల్లో ఉండాలి అంటూ చెలరేపోతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఆపేవాళ్లు లేకపోతున్నారు.నిన్నటికి నిన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఏకంగా జూనియర్ ఎన్టీయార్ మీద ఇష్టానుసారం మాట్లాడి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా అభిమానులు హైద్రాబాదులో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే తీరును ఖండించారు. ఇది పార్టీని ఇబ్బంది పెట్టింది. మరోవైపు ఈ రౌడీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇంచార్జి మంత్రులకు అప్పగించాలని చినబాబు లోకేష్ నిర్ణయించారట.ఏకంగా చంద్రబాబు వార్నింగులనే పట్టించుకోని ఈ ముదురు ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రిని లెక్క చేస్తారా? ఆయన మాకన్నా ఏం ఎక్కువ.. అయన చెబితే మేం వినాలా.. అసలు మా జిల్లాలో పక్కజిల్లా మంత్రి పెత్తనం ఏమిటన్న ఉక్రోషంతో ఉన్న ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రి మాటలు ఖాతరు చేస్తారా అని పార్టీ ఇన్సైడర్ టాక్ నడుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కోకిలపూడి శ్రీనివాస్ కూడా గెలిచింది మొదటి సారి కానీ బండెడు ఆరోపణలు.. పుట్టెడు వివాదాలతో తులతూగుతున్నారు.ఇక పరిస్థితి చేయిదాటిపోతుంది జనంలో పార్టీ, ప్రభుత్వం పరువుపోతుందని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన మరుక్షణం చంద్రబాబు సీరియస్ అవుతుంటారు.. ఇలా ఐతే ఉపేక్షించను.. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను.. ఈ విషయంలో ఎవర్నీ క్షమించేది లేదని హెచ్చరిస్తారు.. కాదు కాదు.. హెచ్చరించినట్లు కలరింగ్ ఇస్తారు.. ఇటు ఎమ్మెల్యేలు కూడా బెదిరిపోయినట్లు నటిస్తారు.. అందరూ చాయ్ తాగి సమోసాలు తిని భుజమ్మీద చేతులు వేసుకుంటూ బయటకు వస్తారు.. మళ్లీయే ఎవరి దందాలు వాళ్ళవి. ఇలా ఉంటుంది బాబుగారి ఆగ్రహం.-సిమ్మాదిరప్పన్న

Hanuma Vihari Joins Tripura After Leaving Andhra Pradesh2
ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ను వదిలేసిన హనుమ విహారి

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ని ప్రముఖ క్రికెటర్‌ హనుమ విహారి వదిలేశారు. త్రిపుర రాష్ట్రానికి ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. 2025-26 కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న విహారి.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌తో విసిగి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. సీనియర్ ప్లేయర్ అయిన తనకి అవకాశాలు ఇవ్వటం లేదని.. మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్నా కానీ అవకాశం ఇవ్వట్లేదని హనుమ విహారి ఆవేదన వ్యక్తం చేశారు.ఇండియా జట్టులో సైతం ఆడి తన ప్రతిభ కనబర్చిన విహారికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఏపీని వదిలి కొత్త వాతావరణంలో ఆడాలని ఆయన నిర్ణయించారు. క్రీడల్లో కూడా కూటమి సర్కార్‌ రాజకీయాన్ని చొప్పించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Jammu And Kashmir: Landslides On The Way To Vaishno Devi Temple3
జమ్మూకశ్మీర్‌: విరిగిపడిన కొండచరియలు.. ఐదుగురి మృతి

జమ్మూకశ్మీర్‌ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఐదుగురు మృతి చెందగా.. 14 మందికి గాయపడ్డారు. వైష్ణోదేవి యాత్ర మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపేశారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.పలు రైళ్లను కూడా రద్దు చేశారు. కత్రా నుండి బయలుదేరే దాదాపు 10 రైళ్లు రద్దయ్యాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై చందర్‌కోట్, కేలా మోర్, బ్యాటరీ చెష్మా వద్ద వాహనాలను నిలిపివేశారు. ఉధంపూర్, కాజిగుండ్ వద్ద కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిష్త్‌వార్, రాంనగర్‌-ఉధంపూర్, జంగల్వార్-థత్రి మార్గాలు దెబ్బతిన్నాయి.కథువా జిల్లాలో సహార్ ఖడ్ నదిపై వంతెన దెబ్బతింది. దీంతో జమ్మూ-పఠాన్‌కోట్ హైవేపై రవాణా నిలిచిపోయింది. నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. మొధోపూర్ బ్యారేజ్ ఒక లక్ష క్యూసెక్కుల నీటిని దాటి పోయింది. ఉధంపూర్‌లో తావి నది 20 అడుగుల ప్రమాద స్థాయిని దాటి పోయింది. చెనాబ్ నది 899.3 మీటర్లకు చేరింది. ఆగస్టు 27 వరకు జమ్మూ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కాశ్మీర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.⚠️ Heavy rains trigger landslide on Vaishno Devi Yatra Route Near Adhkwari➡️ 5 pilgrims dead, 14 injured➡️ Yatra suspended, trains & routes disrupted➡️ Red alert issued,heavy rains to continue for 40 hrsRescue ops & helplines active.#JammuKashmir #VaishnoDevi #jammufloods pic.twitter.com/lGqlw6IYvL— Abheet Sangotra 🇮🇳 (@abheet20) August 26, 2025

How Marwadis Build Wealth Business Secrets Financial Mindset4
మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?

భారతదేశంలో ఎన్నో సామాజిక వర్గాలకు చెందినవారు వ్యాపారాలు సాగిస్తున్నారు. అందులో చాలామంది విజయం సాధిస్తున్నారు. అయితే మార్వాడీ సామాజిక వర్గానికి మాత్రం వ్యాపారం చేయడంలో, అందులో విజయం సాధించడంలో ప్రత్యేక స్థానం ఉంది. వారి ఆర్థిక ఆలోచనా విధానం, వ్యాపార పద్ధతులు కాస్త భిన్నంగా ఉంటాయి. దాంతో వీరు వ్యాపారంలో ముందుంటున్నారనే వాదనలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీసుకురావడంలో ఈ వర్గం ప్రావీణ్యం పొందిందని కొందరు చెబుతుంటారు. అయితే వీరు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం.చిన్నతనం నుంచే...మార్వాడీ కుటుంబాల్లో చిన్నప్పటి నుంచే వ్యాపార అంశాలను పిల్లలకు నేర్పిస్తారు. చాలా షాపులు, వ్యాపారాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే మెలకువలు నేర్పిస్తారు.ఖర్చు చేయడం కన్నా పొదుపు చేయడంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.మార్వాడీలు ఏదైనా వస్తువు కొంటే ధర తగ్గించేందుకు భేరమడడం అలవాటు చేసుకుంటారు. ఇది తమ వ్యాపారాల్లో పెట్టుబడిని తగ్గించి లాభాలకు కారణం అవుతుంది.వ్యాపారంలోని ప్రమాదాలను స్వీకరించి అందుకు అనుగుణంగా ముందుకుసాగేలా సానుకూలతను అలవర్చుకుంటారు.నగదు ప్రవాహంపై ఫోకస్‌అధిక రుణాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం కంటే సొంత నిధులతో బిజినెస్‌ నడిపిస్తారు.లాభాలను తిరిగి వ్యాపారంలోకే మళ్లిస్తారు.నగదు ప్రవాహంపైనే ప్రధానంగా దృష్టి పెడుతారు.బిజినెస్ మోడల్స్వ్యాపారం, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.ఎక్కువ రిస్క్‌ ఉన్న వ్యాపారాల జోలికి వెళ్లరు.దశల వారీగా పెరిగే అవకాశాలున్న వ్యాపారాలనే ఎంచుకుంటారు.కమ్యూనిటీ నెట్‌వర్క్‌నమ్మకంతో బిజినెస్ సంబంధాలను పెంపొందించుకుంటారు.అప్పు, పెట్టుబడి, మార్కెట్ యాక్సెస్ కోసం సామాజిక సంబంధాలను ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగించుకుంటారు.తరతరాల సంపద నిర్మాణంవ్యాపార వారసత్వాన్ని జాగ్రత్తగా, ప్రణాళికబద్ధంగా ఉండేలా చూసుకుంటారు.ఆస్తులను, తమ పెట్టుబడులను విభిన్న రంగాలకు విస్తరిస్తారు. రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ మార్కెట్లు వంటి వాటిలో పెట్టుబడి పెడుతారు.ఇదీ చదవండి: అమెజాన్‌ కొత్తగా మరో 40 ఆశ్రయ్‌ కేంద్రాలు

Vinayaka Chavithi 2025 Step By Step Guide to Puja at Home5
వినాయక చవితి పూజ ప్రాముఖ్యత అష్టోత్తరం

పూజ ప్రాముఖ్యతవినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ఏ శుభకార్యం మొదలుపెట్టే ముందు ‘వక్రతుండ మహాకాయ‘ మంత్రంతో ఆయనను ప్రార్థించడం ఆచారం.మొదట గణపతి పూజ చేయడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. జ్ఞానం, బుద్ధి, ధైర్యం ప్రసాదిస్తాడు. భక్తుని మనసులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని విశ్వాసంవినాయకచవితి పండుగ వచ్చిందంటే ఉదయాన్నే మేల్కొని, అభ్యంగన స్నానమాచరించి, పూజా ఏర్పాట్లు మొదలుపెడతాం. ఇంటిని శుభ్రపరచుకొని, అరటిబోదెలతో, పుష్పాలతో మంటపాన్ని అలంకరించి, పైన పాలవెల్లి వ్రేలాడదీసి మండపంలో స్వస్తిక్‌ పద్మాన్ని లిఖించి, హరిద్రా గణపతిని, మట్టి వినాయకుని స్థాపించి, దీపారాధన గావించి స్వామిని ఆహ్వానిస్తాం. సేకరించిన పత్రి, గరిక (దుర్వాయుగ్మాలు)లతో, అర్కపూలతో, షోడశోపచారాలతో పూజించి, యథాశక్తితో ఉండ్రాళ్లు, చలిమిడి, వడపప్పు తదితర ప్రసాదాలు నివేదించి వినాయక కథ, శమంతకోపాఖ్యానము చదువుకొని లేదా విని అక్షింతలు కొన్ని స్వామి పాదాలవద్ద వుంచి, తమ శిరస్సుపై ధరించాలి.శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవిపూజాద్రవ్యాలు : వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునెయ్యి లేదా నువ్వులనూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశం, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.పూజావస్తువులు : దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/ తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠం.నైవేద్యం : ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, దోసపండు, పిండివంటలు మొదలగునవి.పూజాపత్రి : గరిక, మాచిపత్రి, బలురక్కసి లేక ములక, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ : శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించు కోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో : విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్‌. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడం శుభఫలదాయకం.గణేశుని పూజ పూజకు ఏర్పాట్లుముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమలతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన : (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‌‘­ యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘ దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి : (పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్‌ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ గణేశాయ నమఃశ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాఃశ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజఃషోడశైతాని నామాని యః పఠేత్‌ శృణుయాదపిఃవిద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనంఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి.గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామముఓం భూః ఓం భువః ఓగ్‌ం సువః ఓం మహః ఓం జనఃఓం తపః ఓగ్‌ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‌‘‘సంకల్పం : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, ్జకృష్ణా – గోదావరి నదీ మధ్య ప్రదేశే స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, ఋధవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్‌ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ................................ (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ : (కలశాన్ని గంధం, పుష్పాలు, అక్షతలతో పూజించి కలశంపై కుడిచేతిని ఉంచి, కింది శ్లోకం చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితఃమూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాఃకుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణఃఅంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాఃగంగేచ యమునేచైవ కృష్ణా గోదావరి సరస్వతి!నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానాంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని కింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను) గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత ఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాధనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్‌ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్‌ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను) స్వామికి పుష్పాలతో పూజ(ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి(పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‌‘‘ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని తిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడిచేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ కింది మంత్రాలు చెప్పుకోవలెను).ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహాశ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి.గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ çఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)స్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా ఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్‌ సన్నిధింకురుధ్యానం : స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘విఘ్నాంధ కారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‌‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్‌ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్‌ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...)ప్రాణ ప్రతిష్ఠః (స్వామి వారికి ప్రాణం పోయుట) ఓమ్‌ అసునీతే పునరస్మాను చక్షుః పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‌‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్‌ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‌‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్‌ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధివినాయక స్వామిన్‌ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్‌ : స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘ఆసనమ్‌ : స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్‌ సమర్పయామి‘‘పాద్యమ్‌ : స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘అర్ఘ్యమ్‌ : స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్‌ : స్వామి వారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనాథం నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి.పంచామృత స్నానమ్‌ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ కింద చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు : ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు : ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‌‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‌‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి : ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‌ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార : ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్‌ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘శుద్ధోదకమ్‌ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్‌ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.)వస్త్రమ్‌ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్‌ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలను గాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధమ్‌ : (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్‌ ధారయామి.అక్షతలు : (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాం తండులాన్‌ శుభాన్‌‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్‌ సమర్పయామి‘‘సింధూరం : శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘మాల్యం : శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘పుష్పమ్‌ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు).సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అథాంగ పూజా : (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి.దూర్వాయుగ్మ పూజ గరికతో లేని పక్షంలో అక్షతలతో పూజించాలిఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక) ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు) ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు) ఓం çహరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు) ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి) ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి) ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు) ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ) ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు) ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం) ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు) ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు) ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్దె) ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు) ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘(21 రకాల ఆకులను కలిపి వేసి నమస్కారం చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఆఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్త దేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్‌దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

 Shocking Facts About Mahabubnagar Mother And Daughter incident6
‘నా భర్తను కాపాడండి.. నా చివరి కోరిక తీర్చండి’

సాక్షి,మహబూబ్‌ నగర్‌: యశోద అనే మహిళ రేబిస్‌ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తాను పడుతున్న మనోవేధనను, చివరి కోరికను ఇంట్లో బ్లాక్‌ బోర్డుపై రాసింది.నా భర్తను కాపాడండి.. రేబిస్‌ ఉంది. వ్యాక్సిన్‌కు తగ్గదు. చెట్టు మందు తినిపించండి. మీరు చేయించండిలక్కీని ఆస్పత్రిలో చూపించు వాడికి రేబిస్‌ ఉంది.నా చివరి కోరి ధారూర్‌(వికారాబాద్‌)లో చెట్టు మందు తాగు.. లేట్‌ చేయకు.. అంటూ బాధితురాలు తన చివరి క్షణాల్లో కుటుంబం గురించి ఆలోచించి తనువు చాలించింది. మహబూబ్‌ నగర్‌ జిల్లా మొనప్పగుట్టలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. యశోద అనే మహిళ రేబిస్‌ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది.పోలీసుల వివరాల మేరకు..యశోద గత జూన్‌ నెలలో తన ఇంటి ఆవరణలో పల్లీలు,డ్రై ఫ్రూట్స్‌ ఆరబెట్టింది. అవే పల్లీలు,డ్రై ఫ్రూట్స్‌ను వంటకాల్లో వాడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ సభ్యులకు రేబిస్‌ సోకిందని అనుమానం పెట్టుకుంది.ఆ అనుమానంతోనే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ యాంటీ రేబిస్‌ ఇంజక్షన్‌ చేయించింది. నాటు వైద్యం చేయించుకునేలా బలవంతం చేసింది. కుటుంబ సభ్యులందరికీ రేబిస్‌ సోకిందని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది.ఘటన జరిగిన సమయంలో ఆఫీస్‌కు వెల్లిన యశోద భర్త.. ఇంటికి ఫోన్‌ చేశాడు. అమ్మ బెడ్రూంలోకి వెళ్లి డోర్‌ తీయడం లేదని చెప్పాడు. దీంతో భయపడిపోయిన నరేష్‌ పక్కింటి వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో పక్కింటి వారు బెడ్రూం రూమ్‌ బలవంతంగా ఓపెన్‌ చేసి చూడగా.. తల్లి,కుమార్తె విగతజీవులుగా కనిపించారు. కాగా, భర్త, కొడుకు మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని ఆత్మహత్య చేసుకునే ముందు యశోద గోడపై రాయడం గమనార్హం. యశోద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

SECOND HUNDRED FOR SARFARAZ KHAN IN BUCHI BABU TROPHY7
మళ్లీ శతక్కొట్టిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఈసారి సెలెక్టర్లు తప్పించుకోలేరు..!

తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆథ్వర్యంలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌, ముంబై స్టార్‌ ప్లేయర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో టీఎన్‌సీఏ ఎలెవెన్‌పై 114 బంతుల్లో 138 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన అతడు.. హర్యానాతో ఇవాళ (ఆగస్ట్‌ 26) ప్రారంభమైన మ్యాచ్‌లో 112 బంతుల్లో 111 పరుగులు (9 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. హర్యానాతో మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ తన జట్టు కష్టాల్లో (81/3) ఉన్నప్పుడు బరిలోకి దిగి సూపర్‌ సెంచరీతో మెరిశాడు. హార్దిక్‌ తామోర్‌తో కలిసి జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్కును దాటించాడు. 59 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి.. ఆతర్వాత 40 బంతుల్లో శతక మైలురాయిని తాకాడు.టీఎన్‌సీఏ ఎలెవెన్‌పై కూడా సర్ఫరాజ్‌ ఇదే తరహాలో సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కూడా కష్టాల్లో ఉన్న తన జట్టును సెంచరీతో గట్టెక్కించాడు. ఆ ఇన్నింగ్స్‌లో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన సర్ఫరాజ్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 36 పరుగులు చేశాడు. అయినా ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌ తర్వాత ముంబై ఆడిన రెండో మ్యాచ్‌లో (బెంగాల్‌తో) సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆడలేదు. తిరిగి మూడో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చి మరోసారి శతక్కొట్టాడు.27 ఏళ్ల సర్ఫరాజ్‌ తాజా ప్రదర్శనలతో భారత సెలెక్టర్లకు సవాల్‌ విసిరాడు. సర్ఫరాజ్‌ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ సెలెక్టర్లు అతడ్ని ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక చేయలేదు. ఆ పర్యటనలో సర్ఫరాజ్‌ స్థానంలో అవకాశం దక్కించుకున్న కరుణ్‌ నాయర్‌ దారుణంగా విఫలం కావడంతో సెలెక్టర్లు మళ్లీ సర్ఫరాజ్‌ ఖాన్‌ వైపు చూసే అవకాశం ఉంది. సర్ఫరాజ్‌ గతేడాదే స్వదేశంలో ఇంగ్లండ్‌పై టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే రెండు హాఫ్‌ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత న్యూజిలాండ్‌పై భారీ సెంచరీతో (150) మెరిశాడు. ఈ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో అవకాశాలు దక్కలేదు. కెరీర్‌లో మొత్తం 6 టెస్ట్‌లు ఆడిన సర్ఫరాజ్‌ సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 37.10 సగటున 371 పరుగులు చేశాడు. బుచ్చిబాబు టోర్నీ తర్వాత సర్ఫరాజ్‌ ఖాన్‌ దులీప్‌ ట్రోఫీ ఆడనున్నాడు. ఆ టోర్నీలో కూడా సర్ఫరాజ్‌ సెంచరీలు చేస్తే సెలెక్టర్లు అతన్ని తప్పక టెస్ట్‌ జట్టుకు ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Secunderabad GRP implements special plan for safety full details8
బాబోయ్‌ ఇంతమంది నేరస్తులా..!

వందలాది రైళ్లు.. లక్షలాది మంది ప్రయాణికులు.. ఈ క్రమంలో నేరాల సంఖ్యా అదేవిధంగా పెరిగిపోతోంది. ఈ వ్యవహారం రైల్వే పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కళ్లు మూసి తెరిచేలోగా మాయమవుతున్న బ్యాగులు.. చైన్‌ స్నాచింగ్‌ గ్యాంగ్‌లు.. సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లే ముఠాలు.. అవసరమైతే దాడులకు వెరవని కరుడుగట్టిన నేరగాళ్లు.. ఈ నేపథ్యంలో నేర నియంత్రణ ఎలా..? నేరగాళ్లను కట్టడి చేయడం ఎలా..? అనేది ప్రభుత్వ రైల్వే పోలీసులకు (జీఆర్‌పీ) పెద్ద టాస్క్‌గా మారింది. ఇందుకు సీనియర్‌ అధికారుల సూచనల ఆధారంగా వ్యూహం రచించారు. అసలు నేరాలకు కారణం ఎవరు అనే దానిపై దృష్టి సారించారు. టెక్నాలజీ సాయంతో బృందాలు రంగంలోకి దిగాయి. పని మొదలెట్టాయి. ఆ వ్యూహం పేరే.. ‘జైలు–బెయిలు’.సికింద్రాబాద్‌: రైళ్లలో పాత నేరస్తులే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అరెస్టయ్యి బెయిలుపై విడుదలైన వారిపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ప్రత్యేక బృందాలు రిమాండ్‌ ఖైదీలు, బెయిల్‌ పొంది జనంలో తిరుగుతున్న వారి వివరాలను సేకరించే పనిలో పడింది. ఆ వివరాలతో పాటు వారి కదలికలపై నజర్‌కు టెక్నాలజీ (Technology) సాయం తీసుకుంటోంది. కళ్లుమూసి తెరిచేలోగా మాయం.. ఇటీవలి కాలంలో సికింద్రాబాద్‌ జిల్లా పరిధిలో రైళ్లలో నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కారణాలేమైనప్పటికీ అన్ని నేరాలు పోలీస్‌ స్టేషన్‌ వరకు రావడం లేదు కూడా.. కదులుతున్న రైళ్లలో సెల్‌ఫోన్లను లాక్కెళ్లడం.. లగేజీలు దొంగిలించడం.. ఏసీ బోగీల్లో విలువైన వస్తువుల తస్కరణ.. కోచ్‌లలో దొంగల స్వైర విహారం వంటివి నమోదవుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో అధిక శాతం కేసులు నమోదవుతున్నాయి. నేరాలు జరిగే సమయం చూస్తే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అధికశాతం జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. బాబోయ్‌ ఇంతమంది నేరస్తులా..!సికింద్రాబాద్‌ జిల్లా పరిధిలో ఐదేళ్ల నేరాలు పరిశీలిస్తే 149 మంది చైన్‌స్నాచర్లు.. 694 మంది నేరగాళ్లు దొంగతనం.. దోపిడీ కేసుల్లో అరెస్టయ్యారు. వీరిలో కొందరు జైళ్లలో ఉండగా మరికొందరు బెయిల్‌పై బయటకొచ్చారు. అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. వీరి నేరాల పథక రచనకు జైళ్లు వేదికలుగా మారుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అందుకే జైలులో ఎందరున్నారు. బెయిల్‌ (Bail) మీద బయటకొచ్చిందెవరు అనే విషయంపై జీఆర్పీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ట్రాకింగ్‌ చాలా కష్టమే.. అయినా.. ఓ రకంగా చూస్తే సికింద్రాబాద్‌ జిల్లా పరిధిలోని నేరస్తులందరినీ ట్రాక్‌ చేయడం చాలా కష్టమైన పనే. చాలా మంది సిబ్బంది కూడా అవసరం. అదనపు పనిగంటలు కూడా కావాలి. ఓ వైపు రోజు వారీ విధి నిర్వహణ.. రైళ్లలో భద్రత.. రైలు ప్రమాదాల మృతుల గుర్తింపు.. ఇతర విధులకే సరిపడా సిబ్బంది లేరు. సికింద్రాబాద్‌ జిల్లాలో తీసుకుంటే 12 రైల్వే పోలీస్‌ స్టేషన్లు.. 17 అవుట్‌పోస్టులు ఉన్నాయి. వీటిలో నేరాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్న సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్ల పరిధిలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ (RPF) పోలీసులు 667 మంది అవసరం ఉండగా ప్రస్తుతం 364 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. రైలు ప్రమాద ఘటనల్లో మృతుల దర్యాప్తు కోసయే సమయం వృథా అవుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. చ‌ద‌వండి: డ్రైవ‌ర్ ఆవ‌లిస్తే అల‌ర్ట్ చేస్తుంది..! టెక్నాలజీ సాయంతో...సమస్యలన్నింటినీ పక్కన పెట్టి.. నేర నియంత్రణ కోసం సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ చందనాదీప్తి (Chandana Deepti) నేతృత్వంలో సీనియర్‌ అధికారుల సూచనలతో పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు కదిలేందుకు నిర్ణయించుకున్నారు. టెక్నాలజీ సాయంతోనేరగాళ్ల మొబైల్‌ నెంబర్లు, ఆధార్, చిరునామాలు ఇలాంటి ప్రాథమిక అంశాల ఆధారంగా వారి కదలికలపై దృష్టి సారించేలా ప్రయత్నిస్తున్నారు. వారు ఏ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. వారు తిరుగుతున్న వ్యక్తులు ఎవరు? రాష్ట్రం దాటి వెళ్తున్నారా.. రైలు ప్రయాణాల్లో ఉంటున్నారా..? స్రత్పవర్తన ఉందా ఇలాంటి అంశాల ఆధారంగా వారిని ట్రాక్‌ చేస్తున్నారు.

Kommineni Srinivasa Rao Analysis On 130th Constitution Amendment Bill9
కొత్త చట్టం అధికారపార్టీకి చుట్టమైతే?

నాగుపామును ఆడించే మంత్రగాడు అదే పాము కాటుకు గురయ్యాడని సామెత. మన రాజకీయ నేతలు చేసే కొన్ని విన్యాసాలు భవిష్యత్తులో వారికే తలనొప్పిగా మారతాయన్నది వారు విస్మరిస్తుంటారు. తాజాగా కేంద్రం తీసుకు వస్తున్న చట్టం కూడా అదే తరహాలో ఉందా అనిపిస్తోంది. వినడానికి మాత్రం ఇది బాగుందే అనిపించవచ్చు. కాని పరిశీలిస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న సంగతి అర్థమవుతుంది.ప్రధాని లేదా ముఖ్యమంత్రి, లేదా మంత్రులు ఎవరైనా ముప్పై రోజులు జైలులో ఉండవలసి వస్తే వారి పదవి ఆటోమాటిక్‌గా పోయే విధంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చట్టం తీసుకువస్తోంది. ఈ చట్టాన్ని సడన్‌గా ఎందుకు తీసుకు వస్తున్నారన్న దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీయేతర పక్షాలు ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించి ప్రభుత్వాలను అస్థిర పరచడానికి ఇది ఒక ఆయుధం అవుతుందన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. తమ మిత్రపక్షాలలో ఎవరైనా తోక ఝాడిస్తున్నారన్న అనుమానం వచ్చినా వారిపై కూడా ఈ అస్త్రం ప్రయోగించవచ్చన్న అభిప్రాయాన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.ప్రత్యేకించి కేంద్రంలో పూర్తి మెజార్టీ లేని నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లను కట్టడి చేయడానికి కూడా దీన్ని వాడవచ్చని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ బిల్లుపై టీడీపీ, జేడీ(యూ)లు కూడా మథన పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ చట్టాన్ని కేంద్రం చిత్తశుద్దితోనే చేస్తుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు.కాని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటీవలికాలంలో పెడదోరణులు ప్రబలిపోయాయి.తమ ప్రత్యర్దులను ఎలాగైనా అణచివేయాలని, తద్వారా శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలన్న తాపత్రాయం మన నాయకులలో అధికంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎంతకాలం పాలనలో ఉన్నా ఫర్వాలేదు. అలా కాకుండా నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుండడమే ఇబ్బందిగా మారుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైనా ప్రజాప్రతినిధి రెండేళ్లు జైలు శిక్షకు గురైతే వెంటనే అతను పదవికి అనర్హుడవుతాయన్నది దాని సారాంశం. దానివల్ల అనర్థాలు రావచ్చని తలంచిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ తీర్పును రివర్స్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.కానీ అప్పట్లో రాహుల్ గాంధీ అవగాహనా రాహిత్యంతో ఆ ఆర్డినెన్స్ కాపీని బహిరంగంగానే చించివేశారు. ఒక రకంగా ఇది తన ప్రభుత్వాన్ని తానే అవమానించుకున్నట్లు కాదా! పైగా ఆనాటి ప్రదాని మన్మోహన్ సింగ్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో వచ్చిన ఆ ఆర్డినెన్స్ పూర్వాపరాలు ఆలోచించకుండా అనుచితంగా ప్రవర్తించడంతో ఆ తీర్పు అమలులోనే ఉంది. దాని ఫలితంగా కొందరు తమ పదవులు కోల్పోయారు. ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష పడడంతో రాజ్యసభ సభ పదవి పోయింది. ఆ తర్వాత కాలంలో రాహుల్ గాంధీనే ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్షకు గురి కావడం, ఆ తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడం జరిగిపోయింది. తదుపరి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి పునరుద్దరించుకోగలిగారు. అది వేరే సంగతి.రాహుల్ ఈ ఉదంతంలో తాను చేసిన తప్పుకు తానే బలైనట్లే కదా! ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రయోగం చేస్తోందా? ఒకవేళ వేరే ప్రభుత్వం కేంద్రంలో వస్తే ,అప్పుడు ఇదే చట్టం బీజేపీ ప్రభుత్వాల మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వారు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నది వాస్తవం. ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో మాట్లాడుతూ నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా? అని ప్రశ్నించారు. కొంతకాలం క్రితం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంంటూ హడావుడి చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, కొందరు మంత్రులను అరెస్టు చేశారు. డిల్లీలో పోలీస్ వ్యవస్థ కేంద్రం చేతిలోనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకుండా జైలులో ఉంటూనే ప్రభుత్వ విషయాలపై ఆదేశాలు ఇస్తుండేవారు. అలాగే తమిళనాడుకు చెందిన ఒక మంత్రిని ఈడి అరెస్టు చేసింది. ఆయన కూడా పదవికి రాజీనామా చేయకుండా కేబినెట్‌లో కొనసాగారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి అనుకూలంగా లేనివి. ఢిల్లీలో ఎన్నికలకు ముందు ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ నాయకత్వం లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ ను జైలులో పెట్టిందని అప్పట్లో ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించేది. ఇలా కొద్దిమందిని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టం తెస్తుండడం కరెక్టేనా అన్న చర్చ ఉంది.నిజంగానే మోడీకి అవినీతి వ్యవహారాలపై చిత్తశుద్ది ఉంటే ఏపీలో టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మోడీని అవినీతిపరుడని, టెర్రరిస్టు అని.. ఇంకా చాలాచాలా మాటలు టీడీపీ అధినేత, 2019 ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శించేవారు. మోడీ స్వయంగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే చంద్రబాబు దానిని తనకు ఏటీఎం గా మార్చుకున్నారని ఆరోపించారు. ఎన్నికలలో చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన పీఎస్‌ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరపగా వివిధ కాంట్రాక్టు వ్యవహారాలలో రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని తేలినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే కాదు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడ్డారని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది.అప్పటికే కేంద్రానికి చెందిన ఈడీ అదే కేసులో పలువురిని అరెస్టు చేసింది. చంద్రబాబు వరకు కేసును ఈడీ తీసుకు రాలేదు.ఈలోగా టీడీపీతో మళ్లీ బీజేపీ జత కట్టింది. మరి ఇప్పుడు ఆ ఆరోపణలు సంగతేమిటి? అసలు ఆ కేసులలో నిజానిజాలు ఏమిటి? అన్యాయంగా చంద్రబాబు మీద ఆ ఆరోపణలు చేశారా?లేక వాస్తవం ఉందా? అన్నది ప్రజలకు తెలియనవసరం లేదా? తన ప్రభుత్వ ఓటమి తర్వాత చంద్రబాబు ఈ పరిణామాలను ఊహించే తెలివిగా బీజేపీ పెద్దలతో రాజీ చేసుకున్నారన్నది చాలా మంది భావన. ఆ తర్వాత బతిమలాడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారన్నది బహిరంగ రహస్యమే.ఇలాంటివాటి గురించి మోడీ జవాబు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి, తమ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీ(యూ)లను తమ అదుపులో ఉంచుకోవడానికి ఇలాంటి చట్టం తెస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.దానికి తగినట్లుగానే టీడీపీ లోక్‌సభ పక్ష నేత లావు కృష్ణదేవరాయలు ఈ బిల్లును సమర్థిస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లోపాలను సరిదిద్దాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చ జరుగుతుందని అన్నారు. అంటే ఈ బిల్లుపై వారు లోపల భయపడుతున్నట్లు తెలుస్తూనే ఉంది. జేడీ(యూ) నేత త్యాగి కూడా అదే తరహాలో స్పందించారు. కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలలో నిజం ఉన్నా, లేకపోయినా, చంద్రబాబు విషయంలో బీజేపీ అనుసరించిన ద్వంద్వ విధానం సహజంగానే ఈ సందేహాలకు తావిస్తుంది.ఇండియా కూటమి లోనే అవినీతిపరులు ఉన్నట్లు తమ పక్షంలో ఎవరూ లేనట్లు మోడీ మాట్లాడినా జనం ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అవినీతి ఆరోపణలు వచ్చినా ఎందరిపై కేసులు పెడుతున్నారు? దేశ ప్రధాని మీద కేసు పెట్టే పరిస్థితి ఉందా? అలాగే ముఖ్యమంత్రి మీద కూడా రాష్ట్ర స్థాయిలో కేసులు పెట్టడం తేలిక కాదు. కాకపోతే న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని కేంద్రం లోని అధికార పార్టీ తమ వ్యతిరేక పార్టీల సీఎం లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు.మరో ఉదాహరణ చూద్దాం. దశాబ్దాల కిందట కేంద్రం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది. అయినా దాని అమలు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇదే మోడీ ప్రభుత్వం ఇందులో ద్వంద ప్రమాణాలు పాటించడం లేదా? సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ జేడీ(యూ) పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ) కోరింది.దానిని ఆఘమేఘాల మీద ఆమోదించి అనర్హత వేటు వేసేశారు. తమ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడిని చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్ లోక్ సభ స్పీకర్ ను కోరింది. మొత్తం టర్మ్‌ పూర్తయ్యింది కాని, ఆ పిటిషన్‌ను తేల్చలేదు. ఇంకా పలు ఉదాహరణలు ఇలాంటివి ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 2014-19 మధ్యకాలంలో ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ అటు శాసన వ్యవస్థలోను, ఇటు న్యాయ వ్యవస్థలోను పోరాడుతోంది. ఇంతవరకు అదేమీ తేలలేదు. అలాగే అంతకుముందు టర్మ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. వారిపై అప్పటి స్పీకర్ చర్య తీసుకోలేదు.పైగా వారంతా బీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు ప్రకటించారు. కేంద్రంలోను, వివిధ రాష్ట్రాలలోను పరిస్థితులు ఇలాఉంటే ఇప్పుడు కేంద్రం తీసుకువస్తున్న ఈ కొత్త చట్టం ఎలాంటి దుష్పరిణామాలకు దారి తీస్తుందా అన్న భయం అందరిలో ఉంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Producer PT Selvakumar Shocking Comments On Vijay10
విజయ్‌తో సినిమా.. ఆస్తులన్నీ అమ్ముకున్నా: నిర్మాత

దళపతి విజయ్‌(Vijay)పై ఆయన మాజీ మేనేజర్‌, ‘పులి’ నిర్మాత పీటీ సెల్వకుమార్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘పులి’ సినిమాతో తాను భారీగా నష్టపోతే.. ఆయన రెమ్యునరేషన్‌ మాత్రం డబుల్‌ అయిందన్నారు. సినిమా కోసం ఆస్తులన్నీ అమ్ముకున్న తనకు.. ఈ రోజు వరకు విజయ్‌ నుంచి ఓదార్పు మాట రాలేదన్నారు. విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో 2015లో పులి అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ కే టీ స్టూడియోస్ బ్యానర్ పై శిబు తమీన్స్, పీటీ సెల్వకుమార్ నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన తమిళ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. విజయ్ తో పాటు కిచ్చా సుదీప్, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై..తొలి రోజే డిజాస్టర్‌ టాక్‌ సంపాదించుకుంది. దీంతో నిర్మాలతకు, బయ్యర్లుకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత నిర్మాత సెల్వకుమార్‌ ఈ సినిమాపై స్పందించారు.రిలీజ్‌కి ముందే కుట్ర..ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని సినిమాను విడుదల చేశాం. రిలీజ్‌కి ఒక్క రోజు ముందు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు దాడి చేశారు. ఇది పక్కా ప్లాన్‌ ప్రకారం జరిగింది. నా పక్కన ఉన్నవారే కుట్ర చేశారు. సినిమా విడుదల కాదనే వార్తలను వ్యాప్తి చేశారు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న అవమానం, ఒత్తిడి వర్ణనాతీతం. నా 27 ఏళ్ల కష్టార్జితం మొత్తం ఈ ఒక్క సినిమా కోసమే ఖర్చు చేశా. నా కలలతో ముందుకు సాగాలని కోరుకున్నాను. కానీ ఆ కష్టార్జితం నాశనమైంది.మధ్యలో బయటకు వచ్చేశారుఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమాను థియేటర్స్‌కి తీసుకొచ్చాం. తొలి రోజు నెగెటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. స్టోరీ, గ్రాఫిక్స్‌ వర్క్‌పై ఫ్యాన్స్‌ సైతం ఫైర్‌ అయ్యారు. తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్స్‌ నుంచి బయటకు వెళ్లడం కళ్లారా చూశాను. అప్పుడు నా స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునే వాళ్లు.విజయ్‌ దూరం పెట్టాడు.. సినిమా అపజయం చెందడంతో విజయ్‌ నన్ను దూరం పెట్టేశాడు. సినిమా రిలీజ్‌ తర్వాత ఐదారు రోజుల పాటు విజయ్‌తో మాట్లాడే అవకాశం రాలేదు. ఈ అపజయం విజయ్‌ కెరీర్‌పై కొంచెం కూడా పడలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన పారితోషికం డబుల్‌ అయింది. పులి చిత్రానికి రూ. 25 కోట్లు తీసుకున్న విజయ్‌.. ఆ తర్వాత చిత్రానికి రూ. 45 కోట్ల రెమ్యునరేషన్‌ పుచ్చుకున్నాడు. కానీ వాళ్లు మాత్రం నన్ను దేశ ద్రోహిగా, వైఫల్యం చెందిన వ్యక్తిగానే చూశారు. కొన్ని విషయాలను బయటపెట్టలేను కానీ.. పులి సినిమాతో నా 27 ఏళ్ల కల, కృషి నాశనం అయ్యాయి’ అని ఓ ఈవెంట్‌లో సెల్వకుమార్‌ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement