ప్రధాన వార్తలు

బకాయిల మోత.. విద్యార్థులకు వాత
ఉన్నత చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదలు అప్పులపాలు కాకూడదనే గత ప్రభుత్వ స్ఫూర్తికి కూటమి సర్కారు గండికొట్టింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో ఇటు విద్యార్థులు–తల్లిదండ్రులతో పాటు అటు కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. నాణ్యమైన విద్య మిథ్యగా మారిపోయింది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన విద్యా రంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాల దుస్థితి దినదిన గండంగా తయారైంది. ‘ఫీజు రీయింబర్స్మెంట్’ బకాయిలు కొండలా పేరుకు పోవడంతో కళాశాలల మనుగడ, విద్యార్థుల భవిష్యత్తు పెను ప్రమాదంలో పడింది. ప్రభుత్వం సకాలంలో ‘ఫీజు’ చెల్లింపులు చేయక పోవడం యావత్ కళాశాలల ఉనికికే ప్రశ్నార్థకమైంది. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో దాదాపు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2,200 కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు (వసతి దీవెన).. మొత్తంగా రూ.6,400 కోట్లు పెండింగ్ పెట్టింది. వాస్తవానికి అధిక శాతం కళాశాలలు విద్యార్థుల ఫీజులపైనే ఆధారపడి నిర్వహణను చేపట్టడంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయి. అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించలేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిణామాల ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదు. అధునాతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా కళాశాలలు అప్గ్రేడ్ అవలేక మూస పద్ధతిలోనే కొనసాగడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాలు ఉన్నప్పుడు నైపుణ్యం కలిగిన సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అరకొర సిబ్బందితో బోధనను సాగించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులకు కోలుకోలేని నష్టం కలుగుతోంది. విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ కింద అందించే మొత్తాన్ని కూడా నిలిపి వేయడంతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య భారంగా మారింది. గతంలో వసతి దీవెన కింద ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసినప్పుడు కళాశాలల హాస్టల్లో విద్యార్థులు సకాలంలో చెల్లింపులు చేసేవారు. ఆ విధంగానూ కళాశాలలు ఆర్థికంగా బలంగా ఉండేవి. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను భ్రష్టు పట్టించింది. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను తీవ్రంగా నాశనం చేసింది. విద్యార్థులు హాయిగా కళాశాలలకు వెళ్లి చదువుకునే వాతావరణాన్ని దెబ్బ తీసింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు సైతం కంటిమీద కునుకు లేకుండా ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. విద్యా సంవత్సరం ముగిసినా ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేయక పోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యమేనని మండి పడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయని పక్షంలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. త్వరలో కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పూర్తిగా దిగజారిన విద్యా రంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వాస్తవానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రైవేటు కళాశాలల మనుగడను దృష్టిలో పెట్టుకుని ‘క్వార్టర్’ (మూడు నెలలు) ప్రాతిపదికన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలయ్యేలా షెడ్యూల్ను అమలు చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు చేయడంతో పారదర్శకతతో పాటు యాజమాన్యాల నుంచి జవాబుదారీ తనాన్ని ప్రోత్సహించింది. కానీ, కూటమి ప్రభుత్వం క్వార్టర్ను కాస్తా.. ఆరు నెలలకు ఒకసారికి మార్చింది. తల్లుల ఖాతాల్లోకి బదులు కళాశాలలకు నేరుగా ఫీజులు చెల్లిస్తామని చెప్పింది. కానీ, విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ ఫీజులు చెల్లించక పోవడంతో ప్రైవేటు కళాశాలల నిర్వహణ దెబ్బతిని ఉన్నత విద్య ప్రమాదంలో పడుతోంది.గాడి తప్పిన షెడ్యూల్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేసిన చరిత్ర దేశంలో వైఎస్ జగన్కే దక్కుతుంది. అంతకు ముందు వరకు ప్రభుత్వం నుంచి అరకొర చెల్లింపులు ఉండటంతో పేదింటి బిడ్డలు ఉన్నత చదువుల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. కానీ, 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐదేళ్లు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిన చదువులు ఏడాదిగా కుదుపులకు గురవుతున్నాయి. విద్యార్థుల చదువులను బాధ్యతగా తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం రాజకీయ ధోరణితో అంధకారంలోకి నెడుతోంది. 2024 మార్చి వరకు షెడ్యూల్ ప్రకారం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదలయ్యాయి. ఆ వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో విద్యార్థులకు క్రమం తప్పకుండా చెల్లించే ఫీజులను కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఫీజుల చెల్లింపుల షెడ్యూల్ విధానాన్ని నాశనం చేసింది. ఈ క్రమంలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాక మొత్తంగా ఆరు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, ఏప్రిల్–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) నిధులను విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ఈ ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా లక్షలాది మంది పేదింటి విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. అప్పులు చేసి సర్టిఫికెట్లు, పరీక్షలకు హాల్ టికెట్లు తీసుకుంటున్న దుస్థితి కనిపిస్తోంది.రూ.6,400 కోట్ల బకాయిలు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల చెల్లింపుల కింద కూటమి ప్రభుత్వం సుమారు రూ.6,400 కోట్లు బకాయిలు పెట్టింది. ఇందులో విద్యార్థుల హాస్టల్ ఖర్చుల కింద రూ.2,200 కోట్ల చెల్లింపులకు మంగళం పాడేసింది. అసలు ఎక్కడా ఆ ఊసే ఎత్తడం లేదు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్పై అడపాదడపా మాట్లాడుతూ.. సకాలంలో చెల్లింపులు చేసేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. కానీ, ఇప్పటికీ రూ.4,200 కోట్ల వరకు బకాయిలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలనను మొదటి నుంచి ప్రారంభిస్తామంటే చట్టాలు, రాజ్యాంగం అంగీకరించవు. అందుకే ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే 2014–19లో టీడీపీ హయాంలో16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1,778 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణ బాధ్యతగా భావించి చెల్లింపులు చేసింది. బడ్జెట్లోనూ విద్యకు లోటే ఒక విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2024–25కు నిధులు ఏమీ విదల్చక పోగా, 2025–26 విద్యా సంవత్సరానికి బడ్జెట్లో రూ.3,900 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసింది. విద్యార్థుల భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. టీడీపీ ప్రభుత్వ బకాయిలతో కలిపితే మొత్తం రూ.18,663.44 కోట్లు ఉన్నత విద్య కింద ఉచిత చదువులకు ఖర్చు పెట్టింది.

జూలై రెండో వారంలో..
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల చివరి వారంలోనే వస్తుందని సమాచారం. కాగా స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడో ముగిసిన పాలకవర్గాల గడువు రాష్ట్రంలోని స్థానిక సంస్థల గడువు ఎప్పుడో ముగిసింది. గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు 2024, జనవరిలోనే అయిపోయింది. జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాల గడువు గత ఏడాది జూన్లో పూర్తయింది. ఇక పురపాలక సంఘాలకు ఈ ఏడాది జనవరిలో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వీలున్నంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది. మరోవైపు కేంద్రం ప్రతి ఏటా స్థానిక సంస్థలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు నిధులు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే పాలకవర్గాలు లేని కారణంగా ఈ నిధులను రాష్ట్రం కోల్పోవాల్సి వస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేకపోతోందని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక సమరానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. కాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే ముందే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనుంది. దీంతో పాటు సన్న రకం ధాన్యానికి బోనస్ ఇచ్చే ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది. ఈ రెండు పథకాల నిధులను జమ చేసిన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజులు మాత్రమే సమయం ఉందని ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సమాచారాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ ఇస్తారని, ఈ ఎన్నికల అనంతరం వారం రోజుల వ్యవధిలోనే సర్పంచ్లు, మున్సిపాలిటీలకు కూడా ఎన్నికల నగారా మోగించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అధికార పార్టీలో ‘కమిటీల’ హడావుడి స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయనే సమాచారం నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హడావుడి పెరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేయనున్న గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకానికి గడువు విధించారు. డీసీసీ అధ్యక్షులు, పార్టీ పరిశీలకులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 25వ తేదీకల్లా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలని, గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలకు నియామక ఉత్తర్వులను కూడా ఇచ్చేయాలని ఆమె ఈ సమావేశంలో ఆదేశించారు. దీంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుగురు ముఖ్య నాయకుల పేర్లను పీసీసీకి పంపాలని, వీరికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ డైరెక్టర్లుగా అవకాశం కల్పిస్తామని చెప్పినట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో కేడర్ ఉత్సాహంగా పాల్గొనేలా చేయాలనే వ్యూహంతోనే మీనాక్షి ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్ల పెంపు లేకుండానే..! ఈ నెల చివరి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పక్షంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు అవకాశం లేనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పార్లమెంటుతో పాటు రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. అయితే ఇది ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. అందువల్ల బీసీలకు పాత రిజర్వేషన్లనే కొనసాగించవలసి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం సీట్లు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో..కేంద్రం అనుమతితో నిమిత్తం లేకుండా పార్టీ పరంగా బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. నేడు మంత్రులతో సీఎం కీలక చర్చలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికల నిర్వహణ, రైతు భరోసా నిధుల పంపిణీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. వాస్తవానికి ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సోమవారం మాత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.పంచమి ప.1.27 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ధనిష్ఠ రా.11.42 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.18 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు, అమృతఘడియలు: ప.1.13 నుండి 2.50 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.29, సూర్యాస్తమయం: 6.31. మేషం... కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్మానయోగం.వృషభం.... మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.మిథునం... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. పనులు వాయిదా.కర్కాటకం.. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలత. ధనలాభం.సింహం... కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.కన్య.... ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దూరప్రయాణాలు.తుల.... దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.వృశ్చికం... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ప్రమోషన్లు. దైవచింతన.దనుస్సు.... ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.మకరం.... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. దైవదర్శనాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.కుంభం... మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.మీనం.... ఆకస్మిక ధన, వస్తులాభాలు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ఇంటర్వ్యూలు రాగలవు.

దాడులే దాడులు
టెల్ అవీవ్/టెహ్రాన్/దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ/జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ ఆదివారం వరసగా మూడో రోజూ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు గ్యాస్, చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలు తదితరాల జోలికి రావొద్దని ఇరాన్ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. వాటిపై దాడులు చేస్తే కనీవినీ ఎరగని రీతిలో సైనిక శక్తిని ప్రయోగించి ఇరాన్ను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తక్షణం దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటేనే దాడులు తగ్గుముఖం పడతాయని పునరుద్ఘాటించారు.ఊపిరి సలపనివ్వని ఇజ్రాయెల్ ఇరాన్కు ఏమాత్రం సమయమివ్వకుండా టెహ్రాన్, సమీప ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్లో పౌర భవన సముదాయంపై దాడిలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 29 మంది చిన్నారులే! ఇప్పటిదాకా 406 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ‘ది సౌత్ పార్స్’ సహజవాయువు ప్రాసెసింగ్ ప్లాంట్ దాడిలో దారుణంగా దెబ్బతింది.పర్షియన్ గల్ఫ్లో బుషెహర్ ప్రావిన్సులోని చమురుశుద్ది కర్మాగారమూ మంటల్లో చిక్కుకుంది. షహ్రాన్ ఆయిల్ డిపోపైనా దాడులు జరిగాయి. ‘‘ఆయుధాల ఉత్పత్తి కేంద్రాల నుంచి సిబ్బంది పారిపోండి. వాటిపై దాడులు చేయబోతున్నాం. అణు విద్యుత్కేంద్రాల సమీప ప్రాంతాల పౌరులూ పారిపొండి’’ అని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఇస్ఫహాన్ అణువిద్యుత్ కేంద్రంపై మరోసారి దాడులు చేసినట్టు ప్రకటించింది.క్షిపణులతో హోరెత్తించిన ఇరాన్ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. యుద్ధవిమానాల ఇంధన తయారీ కేంద్రాలపై మిసైళ్లు ప్రయోగించింది. హైఫా సిటీలో చమురుశుద్ది కర్మాగారంపై దాడులు చేయడంతో పైప్, ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. దాడుల్లో ఇప్పటిదాకా 14 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 390 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. టెల్అవీవ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరుసగా మూడోరోజు మూసేశారు. టెల్అవీవ్ వీధుల్లో కుప్పకూలిన భవనాలు, కాలిపోయిన కార్లు, బద్దలైన కిటికీలు, తలుపులూ దర్శనమిస్తున్నాయని అసోసియేటెట్ ప్రెస్ రిపోర్టర్ తెలిపారు.టెల్ అవీవ్కు దక్షిణాన బాట్యామ్ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్ట్మెంట్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా 35 మంది జాడ గల్లంతైంది. పలువురిని రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి కాపాడాయి. ఘటనాస్థలిని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సందర్శించారు. ఇరాన్ కావాలనే జనావాసాలపైనే దాడులు చేస్తోందని మండిపడ్డారు.దీనికి భారీమూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. యుద్ధం నేపథ్యంలో కుమారుడు అవ్నర్ వివాహ వేడుకను వాయిదా వేసుకుంటున్నట్టు నెతన్యాహూ వెల్లడించారు. అటు హమాస్, ఇటు ఇరాన్ దాడులతో దేశమంతా యుద్ధంలో మునిగి తేలుతుంతే ఇంట్లో పెళ్లి సంబరాలు చేసుకుంటారా అంటూ విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఖమేనీ హత్యకు ప్లాన్!వారించిన ట్రంప్ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టు సమాచారం! అమెరికా ఈ మేరకు వెల్లడించింది. ‘‘అందుకు సర్వం సిద్ధమైంది. వద్దంటూ అధ్యక్షుడు ట్రంప్ వారించడంతో వెనక్కు తగ్గింది’’అని లేదంటే ఖమేనీని చంపడం పెద్ద పని కాదని ఇజ్రాయెల్ వర్గాలు అన్నాయి.వెంటనే ఆపగలను: ట్రంప్ ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణను ఇప్పటికిప్పుడు ఆపేయగలనని ట్రంప్ చెప్పుకున్నారు. ‘‘ఆ దేశాలను నిలువరించి ఈ రక్తపాతాన్ని ఆపడం నాకు చాలా తేలిక. ఈ రగడతో అమెరికాకు సంబంధం లేదు. ఇజ్రాయెల్కు మేం ఎలాంటి సాయమూ చేయడం లేదు’’ అని చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరాయి.మీరు ఆపితే మేమూ ఆపుతాందాడులవేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ దాడులను ఆపితే తామూ దాడులను నిలిపేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు. కానీ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోంది. అందుకే బుషెహర్ ప్రావిన్సులో ఖతార్తో కలిసి ఇరాన్ నిర్వహిస్తున్న అసాలుయే ఆయిల్ రిఫైనరీపై దాడి చేసింది’’ అంటూ మండిపడ్డారు.తమ ఆర్థికమూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని దుయ్య బట్టారు. ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం జరగాల్సిన ఆరో విడత కీలక అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్ను తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్ధరహితమని ఇరాన్ ప్రకటించింది. చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు తామూ సిద్ధమని జర్మనీ పేర్కొంది.

47మృతదేహాల గుర్తింపు
అహ్మదాబాద్: ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆదివారానికి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ సహా 47 మంది మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. 24 మృతదేహాలను సంబందీకులకు అప్పగించారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు 230 బృందాలను ఏర్పాటు చేశారు. ఎయిరిండియా డ్రీమ్లైనర్ గురువారం కుప్పకూలిన ఘటనలో రుపానీ సహా 242 మంది ప్రయాణికులు మృత్యువాతపడగా ఒకే ఒక్క వ్యక్తి సజీవంగా బయటపడటం తెల్సిందే. విమానం పడిన ప్రాంతంలో ఉన్న ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా 33 మంది సైతం ప్రాణాలు కోల్పోయారు.గుర్తు పట్టలేనంతంగా మాడి మసవ్వడంతో అధికారులు సంబందీకుల నుంచి సేకరించిన డీఎన్ఏ ద్వారా మృతదేహాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. 230 మంది ప్రయాణికుల చిరునామాలు సేకరించారు. మృతి చెందిన ప్రయాణికుల్లో ముగ్గురి సంబం«దీకులు మాత్రం ఇప్పటి వరకు డీఎన్ఏ నమూనాలను ఇవ్వలేదని చెప్పారు. మిగతా వారి విషయంలో సంబందీకులకు డెత్ సర్టీఫికెట్లను సైతం అందజేస్తున్నామన్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా ఆదివారం ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనా క్రమాన్ని అధికారులు ఆయనకు వివరించారు.క్షతగాత్రులను పీకే మిశ్రా పరామర్శించారు. విమాన ప్రమాదానికి కారణాలపై ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రధానంగా దర్యాప్తు జరుపుతోంది. ఆదివారం ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన విదేశీ బృందానికి అహ్మదాబాద్ ఫైర్ బ్రిగేడ్ అధికారులు వివరాలను అందించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం ఢిల్లీలో మొదటిసారిగా సమావేశం కానుంది. మూడు నెలల్లోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది.

నాన్నా.. డబ్బు పంపండి!
అప్పులు చేస్తున్నాం... డబ్బులు పంపుతున్నాంమా బాబును అమెరికా పంపినప్పుడు ఎంతో సంతోషించాం. కానీ ఇప్పుడు ప్రతీ రోజూ ఏడుస్తున్నాం. ఫీజులు పెరిగాయి. ఉద్యోగాల్లేవు. అమ్మా డబ్బులు పంపు అనడం మాత్రమే ప్రతీ ఫోన్ కాల్లో విన్పిస్తోంది. అప్పులు చేసి మరీ పంపుతున్నాం. ఈ పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్తుందో అనే ఆందోళన ఉంది. – వరలక్ష్మి పల్లవ (విద్యార్థి తల్లి, హైదరాబాద్)సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మన విద్యార్థులు అనుకున్నదొకటి... అక్కడ జరుగుతున్నది మరోటి. భౌగోళిక పరిస్థితులు, అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు మన విద్యార్థులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ ఇబ్బందులు భారత్లో ఉన్న తల్లిదండ్రులకూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రానురాను డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తోంది. దీంతో విద్య కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థులకు ఊహించని విధంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. 2014లో డాలర్ విలువ రూ.60.95 ఉంటే, ఇప్పుడు రూ.86.25కు చేరింది. దీంతో విదేశీ విద్య కోసం వెళ్లిన మన విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. దీనికితోడు పార్ట్ టైం ఉద్యోగాలకు అవకాశాలు సన్నగిల్లడంతో భారత్లోని తల్లిదండ్రుల వైపు విద్యార్థులు దీనంగా చూసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫోన్ చేసి డబ్బులు పంపండి అని అడుగుతున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ అన్ని దేశాల్లోనూ భారత విద్యార్థుల పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. విదేశీ విద్యకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న విద్యార్థులూ ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఏటా రూ.4.32 లక్షల కోట్లు.. ఏటా 13 లక్షల మంది భారతీయులు వివిధ దేశాలకు వెళ్తున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇందులో టూరిస్టులు, విద్యార్థులూ ఉన్నారు. అయితే, విదేశీ చదువుల కోసం వెళ్లే వారిలో 38 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉన్నారు. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు ఉంటే.. 2022 నాటికి ఇది రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. రూపాయి మారకం విలువ పెరగడంతో 2024లో చేస్తున్న ఖర్చు 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ.4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం లెక్కగట్టింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ ఊహించని విధంగా పతనమవ్వడంతో 2025లో విదేశాలకు వెళ్లే విద్యార్థులపై 14 శాతం అదనపు భారం పడే వీలుంది. అంటే, రూ.5.86 లక్షల మేర భారం ఉండొచ్చని విదేశాంగ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాకు వెళ్లడానికి ముందు విద్యార్థులు అక్కడి వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా అంచనా వేసుకున్నారు. డాలర్ ముందు రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కెనడాలో రూ.1.60 లక్షలు, ఆ్రస్టేలియాలో రూ.1.80 లక్షలు, బ్రిటన్లో రూ.2 లక్షలకు పైగా అదనపు వ్యయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. దీనికితోడు వసతి ఖర్చులు 15 శాతం వరకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఇతర సంక్షోభాల నేపథ్యంలో జీవన వ్యయం ఏకంగా 22 శాతం పెరిగింది. అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడది రూ.52 లక్షల వరకూ వెళ్లింది. ప్రధాన సమస్య అదే.. అమెరికాలో చదవడం కంటే ముందు పార్ట్టైం ఉద్యోగంపైనే మన దేశ విద్యార్థులు ఆధారపడుతున్నారు. భారత్లో ఉద్యోగాలు రాని వాళ్లు, వస్తాయనే నమ్మకం లేని వాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్తున్నారు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశాంగ శాఖ అధ్యయనంలో గుర్తించారు. అమెరికాకు దాదాపు 3 లక్షల మంది భారతీయులు వెళ్తుంటే, వారిలో 1.25 లక్షల మంది తెలుగువాళ్లే ఉంటున్నారు. 2024లో భారత్తోపాటు ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య పెరిగింది. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. ఇక్కడ అమెరికాతో పోలిస్తే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు వచ్చాయి. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. బ్రిటన్, ఆ్రస్టేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. దిగితే గానీ లోతు తెలియదు: కూర్మం దామోదర్ (అమెరికాలో ఎంఎస్ చేస్తున్న వరంగల్ విద్యార్థి) అమెరికా చదువు కోసం కలలు కన్నాం. ఇక్కడికి వస్తే చాలు ఎన్ని అప్పులు చేసినా తీర్చి, ఎంతో కొంత వెనకేసుకుని వెళ్తామని ఆశించాం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. పార్ట్టైం ఉద్యోగాల్లేవు. డాలర్ ధర పెరగడంతో ఫీజులూ ఊహించని విధంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఏంటో మాకే అంతుబట్టడం లేదు.

మోసం చేశాడు సరే.. డబ్బులిప్పిస్తాం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో బాలికలు, మహిళలు, దళితులకు రక్షణ లేకుండా పోతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ చూసుకుని వారి అనుచరులు, వందిమాగధులు చెలరేగిపోతున్నారు. మహిళలపై జరుగుతున్న దారుణాలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా, ప్రజా సంఘాల నుంచి నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ తరుణంలో రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు అల్లుడు వరుసయ్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు పులపర్తి సత్యదేవ్ పెళ్లి చేసుకుంటానంటూ ఒక దళిత మైనర్ బాలిక (17)ను గర్భవతిని చేసి.. అధికారం అండతో ధైర్యంగా తిరిగాడు.ఆమె బిడ్డను కన్న తర్వాత కూడా బుకాయిస్తూ వచ్చాడు. ఏడాది కాలంగా ఈ విషయం బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు తొక్కిపెట్టారు. డబ్బులిప్పిస్తామని.. పెళ్లొద్దంటూ దుప్పటి పంచాయితీ చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని వైఎస్సార్సీపీ మహిళా నేతలు బయట పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ఎట్టకేలకు పోక్సో కేసు పెట్టారు. అయితే అధికార పార్టీ అండదండలతో నిందితుడు పరారీలో ఉన్నాడు. టీడీపీ పెద్దలు డబ్బులిప్పిస్తామంటూ దుప్పటి పంచాయితీ చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటకు చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ సత్యదేవ్ రెండేళ్లుగా వెంటపడుతూ వచ్చాడు. తనకు టీడీపీలో ముఖ్య నేతలంతా సన్నిహితంగా ఉంటారని, తాను ఎంత చెబితే అంత అంటూ నమ్మించి.. ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేశాడు. సత్యదేవ్ మాటలు నమ్మి ఆ బాలిక మోసపోయింది. బాలికతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకుని గర్భవతిని చేశాడు. ఆ బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు తేలడంతో పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. దీంతో కులం తక్కువ దానివి ఎలా పెళ్లి చేసుకోవాలంటూ దూషిస్తూ అబార్షన్ చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు సత్యదేవ్ మోసంపై రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథానికి బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ సమయంలో కేసు లేకుండా ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకునేలా అధికార పార్టీ నేతలు ఆ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పెళ్లి చేసుకోవడమే పరిష్కారమని బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో అయ్యప్ప దీక్ష తీసుకున్నానని నిందితుడు పెళ్లి వాయిదా వేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికకు ఎనిమిదవ నెల వచ్చేసింది. అబార్షన్ చేయడం ప్రమాదమని వైద్యులు చెప్పి, సిజేరియన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత బిడ్డ్డ ఉన్నట్లుండి చనిపోయాడు. బిడ్డకు వైద్యం అందకుండా చేసి చనిపోయేందుకు సత్యదేవే కారకుడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ అప్పటి నుంచి బొమ్మూరు పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధిత కుటుంబం తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఈ నెల 4న జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు సత్యదేవ్ను పిలిపించి పెళ్లి చేసుకోవాలని వారం గడువు ఇచ్చారు. అయినప్పటికీ బాలికకు న్యాయం జరగలేదు. దీంతో ఈ బాగోతాన్ని వైఎస్సార్సీపీ మహిళా నేతలు పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి మీడియా ఎదుట బయటపెట్టారు. బాలికకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని వారు డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక దళిత బాలికకు తన అనుచరుడి కారణంగా ఏడాదిగా అన్యాయం జరుగుతున్నా టీడీపీ ఎమ్మెల్యే వాసు ఏమీ ఎరగనట్టు ఉండటం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆక్షేపించారు. ఇప్పటికీ బాధిత బాలికకు న్యాయం చేసే బదులు ప్రైవేట్ సెటిల్మెంట్కు ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు.మానవతా దృక్పథంతోనే కేసు నమోదులో ఆలస్యంమానవతా దృక్పథంతో ఆలోచించడం వల్లే కేసు నమోదుకు ఆలస్యమైంది. ఈనెల 4న బాధితురాలు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. జిల్లా వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య బాధితురాలిని బొమ్మూరు పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆమెకు నేను, సౌజన్య కౌన్సెలింగ్ చేశాం. సత్యదేవ్తో తనకు పెళ్లి జరిపించాలని కోరింది. సత్యదేవ్ను, అతని బాబాయిని పిలిపించి మాట్లాడాం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని పది రోజులు గడువు కోరాడు. ఏడు రోజుల్లో స్పష్టం చేయాలని ఇద్దరికీ చెప్పాం. నిందితుడు పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన మాటతో కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు ఆ గడువు తీరిపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యదేవ్పై క్రైంనెంబర్ 197/2025 యు/ఎస్64(2)(ఎం), 89బిఎన్ఎస్,సెక్షన్ 5(1)ఆర్/డబ్ల్యూ 6ఆఫ్ పోక్సో యాక్ట్ అండ్ సెక్షన్ 3(2)(వి) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్ 1989 కింద కేసు నమోదు చేశాం. సత్యదేవ్ కోసం గాలిస్తున్నాం. బిడ్డ ఎలా చనిపోయిందో కూడా విచారిస్తాం. – బి.విద్య, డీఎస్పీ, తూర్పు జోన్, రాజమహేంద్రవరంఆరేళ్ల బాలికపై అత్యాచారం కర్నూలులో దారుణం నిందితుడిపై పోక్సో కేసుకర్నూలు: కర్నూలులో ఆరేళ్ల బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం టీచర్స్ కాలనీలో విజయ్కుమార్ అలియాస్ రాజు (40) ఉంటున్నాడు. అదే కాలనీలో ఉంటున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్డాడు. ఇతనికి పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న బాలికను ఇంట్లోకి పిలిచి ఈ నెల 13న దారుణానికి ఒడిగట్టాడు. శనివారం బాలిక మూత్రానికి వెళ్లడానికి ఇబ్బంది పడుతుండటంతో తల్లి కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరిశీలించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదే రోజు విజయ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు.

తలసరి ఆదాయం పెరిగితేనే...
భారత్, చైనా సమవుజ్జీలేనా? డాలర్లలో చూసినపుడు, 1990 ప్రాంతంలో భారత్, చైనా ఇంచుమించుగా ఒకే ఆర్థిక పరిమాణంలో, ఒకే రకమైన తలసరి ఆదాయంతో ఉన్నాయి. నిజానికి, అప్పట్లో చైనాలో తల సరి ఆదాయం మనకన్నా తక్కువగా ఉండేది. సుమారు 190 దేశాల జాబితాలో రెండు దేశాలు 140 నుంచి 145 మధ్య స్థానాల్లో ఉండేవి. చైనాలో ఆర్థిక సంస్కర ణలు 1978లో మొదలయ్యాయి. వారి వృద్ధి వెంటనే ఏమీ వేగం పుంజుకోలేదు. తర్వాత, పదమూడేళ్ళకి, అంటే 1991లో భారత్ సంస్కరణల బాటపట్టింది. ఇపుడు ప్రపంచంలో చైనాది రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. అది 2010లోనే ఆ స్థితికి చేరింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకారం, భారత్ కొద్ది రోజుల క్రితం, నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. వచ్చే మూడేళ్ళలో జర్మ నీని దాటి, భారత్ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది.ఎంతో ఎదిగినా... ఇంకా వెనకే!భారత్, చైనా గత మూడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి అద్భుతం, చారిత్రకం, అసాధారణం. ఆసియాలోని ఈ రెండు దిగ్గ జాల జనాభా ప్రపంచ జనాభాలో నలభై శాతం మేరకు ఉంటుంది. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ సైజు సుమారు 4.1 ట్రిలియన్ల డాల ర్లుగా ఉంది. దానికన్నా ఐదింతలు ఎక్కువగా చైనాది 19 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. భారత సంఖ్యామానం ప్రకారం ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లతో సమానం.భారత్ 2000 నుంచి 2024 వరకు 6.3 శాతం వార్షిక వృద్ధిని కనబరచిందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఇది వేగవంతమైన వృద్ధి రేటు. ఇటీవలి సంవత్సరాల్లో, భారత్ వృద్ధి రేటు సుమారు 7.3 శాతానికి పెరిగింది. ఇక 1990 నాటి స్థితితో పోలిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ ఇపుడు 11.5 రెట్లు పెద్దదిగా ఉంది. జనాభా 1.6 రెట్లు మాత్రమే పెరిగింది. మరో విధంగా చెప్పాలంటే, 1990లో సుమారు 360 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం 2025 నాటికి 2,700 డాలర్లకు పెరిగింది. అయినా చైనాతో వైరుధ్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.రెండు దేశాలు 1990లో ఒకే విధమైన తలసరి ఆదాయంతో ఉన్నాయి. చైనాలో తలసరి ఆదాయం 2025లో భారత్ కన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా 13,000 డాలర్లకు దూసుకొచ్చింది. చైనా ఆర్థిక వ్యవస్థ గత 35 ఏళ్ళలో 51 రెట్లకు పైగా విస్తరించింది. చైనా మూడు దశాబ్దాలపాటు 10 శాతం వృద్ధి రేటును కొనసాగించగలిగింది. మొత్తం 197 దేశాల్లో నేడు భారత్ 141వ స్థానంలో ఉండగా, చైనా 70వ ర్యాంకునకు ఎగబాకింది. ప్రపంచ బ్యాంక్ ప్రకారం, భారత్ ఇపుడు మధ్యాదాయ కేటగిరీలో స్థిరంగా ఉంది. చైనాను అధిక –ఆదాయ దేశంగా పరిగణిస్తున్నారు. తలసరి ఆదాయం 14,000 డాలర్ల ఎగువున ఉంటే అలాంటి హోదా దక్కుతుంది. ఆ వాకిలిని కూడా దాటినవాటిని ప్రపంచ బ్యాంక్ అభివృద్థి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా గౌరవిస్తుంది. భారత్ 2047 నాటికి ఎలాగైనా ఆ స్థితిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ కల సాకారమవడానికి, మనం వచ్చే 20 ఏళ్ళపాటు డాలర్లలో సగటున 7.8 శాతం వృద్ధి వేగాన్ని అందుకుని, అదే రీతిలో కొనసాగవలసి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో, మనం చూపిన 7.3 శాతం వృద్ధి రేటుకన్నా అది కాస్త ఎక్కువ. ఎందుకు వెనకబడ్డాం?భారత్ 1990–2025 మధ్య కాలంలో చైనాతో పోల్చుకుంటే, ఎందుకు వెనుకబడింది? ఎగుమతులు, ముఖ్యంగా శ్రమ శక్తి ద్వారా ఒనగూడే ఎగుమతుల ప్రాబల్యం విషయంలో, ఉన్న సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేయబట్టా? ప్రాథమిక ఆరోగ్య, విద్య రంగాలకు తక్కువ పెట్టుబడులు ఉండబట్టా? మనం 1991లో చాలా వరకు రద్దు చేసు కున్న లైసెన్సుల వ్యవస్థ స్థానంలో ఇన్స్పెక్టర్ల వ్యవస్థ ఏర్పడబట్టా? లేక సాఫీగా వ్యాపారాలు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న మన దేశంలోని మూడంచెల పాలనా వ్యవస్థే దీనికి కారణమా? లేక మన దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థకుగాను నత్తనడకన సాగే వృద్ధి రూపంలో మూల్యం చెల్లించుకోక తప్పదా?చైనాతో పోల్చుకుంటే భారత్ పనితీరు పేలవంగా ఉండటానికి సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ప్రశ్నలకు జవా బులు అన్వేషించడం వల్ల ఇప్పటికిప్పుడు ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు కనుక వాటినక్కడ వదిలేద్దాం. వృద్ధి రేటును సాధించ డానికి, అది కూడా వచ్చే ఇరవై ఏళ్ళపాటు స్థిరంగా కొనసాగించ డానికి ఏం చెయ్యవలసిన అవసరం ఉందో దానిపై దృష్టి కేంద్రీకరించడం మనందరి తక్షణ కర్తవ్యం. అది సమ్మిళిత వృద్ధి అయితే, తలసరి ఆదాయాలు కూడా పెరుగుతాయి. అంటే, ఉత్పాదకత, వేతనాలు, కుటుంబాల ఆదాయాలు, ఉన్నత–గుణాత్మక ఉద్యోగాలు వృద్ధి చెందాలి. దాన్ని సాధించకపోతే, 2047 నాటికి భారత్ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందుతుందేమోకానీ, మధ్యా దాయ కేటగిరీలో చిక్కుకుపోతుంది. తలసరి ఆదాయం ఎదుగు బొదుగు లేకుండా 10,000 డాలర్లకు దిగువన ఉండిపోవచ్చు.ప్రపంచ బ్యాంక్ రికార్డులను తిరగేస్తే, గత యాభై ఏళ్ళలో, చాలా దేశాలు అటువంటి గతినే పొందాయని తేలుతుంది. మధ్య– ఆదాయ కేటగిరీ నుంచి అధిక– ఆదాయ కేటగిరీకి 34 దేశాలు మాత్రమే ఎగబాకగలిగాయి. దాదాపు 108 దేశాలు మధ్య– ఆదాయ వలలోనే చిక్కుకుపోయాయి. అమెరికన్ల తలసరి ఆదాయంలో సుమారు పదవ వంతుకి, లేదా ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే, సుమారు 8000 డాలర్లకు మాత్రమే అవి పరిమితమైపోయాయి. ఏం చేయొచ్చు?మధ్య–ఆదాయ వల నుంచి తప్పించుకునేందుకు, భారత్ బహుశా, దక్షిణ కొరియా (అత్యంత ఆకర్షణీయమైన పరిణామం), చిలీ, పోలెండ్ల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక దేశం మధ్య –ఆదాయం నుంచి అధిక–ఆదాయానికి పరిణామం చెందేందుకు మూడు (పెట్టుబడి, ప్రేరణ, నవీకరణ) టానిక్లు అవసరమని ప్రపంచ బ్యాంక్ పరిశోధన వెల్లడిస్తోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ స్థాయిని అందుకునేందుకు అన్ని రాష్ట్రాలు (సూటిగా చెప్పాలంటే, ఆయా రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, గ్రామాలు) కలసికట్టుగా కృషి చేయాలని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థించారు. ఉద్యోగాలు, ఉత్పత్తి, ఎగు మతులు పెరిగేందుకు దోహదపడగల చిన్నతరహా (సూక్ష్మ సంస్థలు కాదు) సంస్థలకున్న వృద్ధి సామర్థ్యానికి పడిన సంకెళ్ళనన్నింటినీ తెగ్గొట్టాలని కోరారు. ప్రధానంగా, రాష్ట్రాల అంశాల జాబితాలోకి వచ్చే వ్యవసాయ రంగానికున్న ప్రతిబంధకాలన్నింటినీ తొలగించు కోవాలని కూడా ఆ మాటల తాత్పర్యం. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 40 శాతానికి భారత్ పెట్టు బడులు పెంచుకోవాలి. మహిళా శక్తి భాగస్వామ్యాన్ని 35 శాతంనుంచి 50 శాతానికి పెంచుకోవాలి. గ్లోబల్ వాల్యూ చైన్లు, వాణిజ్య ఒప్పందాలు, విదేశీ పెట్టుబడులకు అడ్డంకిగానున్న సుంకాలను తగ్గించడం, అవరోధాలను తొలగించడం ద్వారా నూతన టెక్నా లజీల టానిక్ను వ్యవస్థలోకి చొప్పించాలి. పరిశోధన, అభివృద్ధి రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా నవీకరణకు దారులు తెరవాలి. నైపుణిని, శిక్షణను, ఉద్యోగ నియామక అర్హతలను ఇబ్బడిముబ్బడిగా పెంపొందించడం ద్వారా మానవ ప్రతిభ వ్యుత్పత్తుల మూలధనాన్ని పోగేసుకోవాలి.భారత్ ఎదుట మరో పెను సవాల్ ఉంది. అది 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి తీసుకురావడం. ఈ సవాల్ను ఎదుర్కొంటూనే భారత్ లక్ష్య సాధనకు కృషి చేయాలి. అజీత్ రణడే వ్యాసకర్త ఆర్థికవేత్త(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)

కలలో కూడా ఊహించలేదు
లండన్: టీమిండియా సారథ్య బాధ్యతలు నిర్వర్తించే అవకాశం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. పేస్ తురుపుముక్క బుమ్రా అందుబాటుపై ముందుగానే చెప్పడం కుదరదన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకు... యథేచ్చగా ఆడేందుకు తగిన లక్ష్యాలను నిర్దేశించుకుంటామన్నాడు. స్టార్, వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలకడంతో గిల్కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఇన్నాళ్లు ఓపెనింగ్ సవాల్ను ఎదుర్కొన్న శుబ్మన్ ఇప్పుడు మొదటిసారి ఓపెనింగ్తోపాటు సారథ్య పరీక్షకూ ఇంగ్లండ్కు వచ్చాడు. 2007లో టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గింది. తర్వాత చాలాసార్లు పర్యటించినా విజయం మాత్రం దక్కలేదు. ఇప్పుడు గిల్ నేతృత్వంలోని భారత్ ఈ నిరీక్షణకు తెరదించేందుకు ఐదు టెస్టుల సిరీస్లో రాణించడంపై దృష్టి సారించింది. ఇంగ్లండ్లోని స్కై స్పోర్ట్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై గిల్ వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా... ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా జట్టు సంస్కృతిని మార్చాలనుకుంటున్నాను. సురక్షితమైన వాతావరణం కల్పించడం ద్వారా ఆ ఆటగాడు యథేచ్చగా ఆడే అవకాశం కల్పిస్తే... అతని పూర్తిస్థాయి సామర్థ్యం బయటపడుతుంది. ఓ నాయకుడు జట్టుకు చేయాల్సింది అదేనని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇది అంతసులువు కాదని నాకూ తెలుసు. అయితే ఆ దిశగా నా ప్రణాళికలుంటాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్లో దూకుడుగా ఉన్నట్లే జట్టును నడిపించే విషయంలోనే అంతే పట్టుదలను ప్రదర్శిస్తాడు. సిరీస్ లేదంటే పర్యటనలో ఆటగాళ్ల నుంచి తనకు ఏం కావాలనేది స్పష్టం చేస్తాడు. ముగిసిన తర్వాత సమీక్షలోనూ ఇదే పంథా అనుసరిస్తాడు. ఇది సరైన మార్గనిర్దేశనమని నేను భావిస్తున్నా. దూకుడైన సారథిగా కోహ్లి మార్కు కూడా జట్టుపై ఉంది. ఇద్దరి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. అంచనాలనేవి సహజం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతం గంభీర్లు నాపై అసాధారణ ఒత్తిడిని పెట్టలేదు. అమితమైన అంచనాలను పెంచలేదు. అయితే ఓ ఆటగాడిగా, కెప్టెన్గా నాపై సహజంగానే కొన్ని అంచనాలయితే తప్పకుండా ఉంటాయి. ఇది కాదనలేని సత్యం. వాటిని అందుకునేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. నా ఆటతీరుపై మా నాన్న ప్రభావం తప్పకుండా ఉంటుంది. నాలాగే తను కూడా భారత టెస్టు జట్టుకు కెప్టెన్ను అవుతానని ఏనాడూ ఊహించలేదు. ఆయన కూడా నాలాగే టీమిండియాకు ఆడటం, జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాలనే ఆశలే పెట్టుకున్నాడు. కెప్టెన్సీపై నాతో సంప్రదింపులు జరుగుతున్నప్పుడే నాన్న నాకు ఫోన్ చేసి ఆడిగారు. కానీ నేను మాత్రం అధికారికంగా నియమించాకే నాన్నతో ఆ విషయాన్ని పంచుకున్నాను. గంభీర్ శైలిని అందిపుచ్చుకోవడం... ఐపీఎల్లోనే కోచ్ గంభీర్ శైలికి అలవాటు పడ్డాను. కోల్కతా నైట్రైడర్స్కు నేను ఆడినపుడు గంభీర్ మెంటార్గా ఉన్నాడు. కాబట్టి అతని శిక్షణ శైలిపై అవగాహన ఉంది. ఇప్పుడు ఓ జాతీయ జట్టుకు అతను హెడ్ కోచ్ కాబట్టి ఎంతబాగా అతని శైలి తెలిసున్నప్పటికీ ఇంకాస్త జాగ్రత్తగా అనుసరించాల్సి ఉంటుంది. జట్టు కోసం అంకితభావం, నిబద్ధతతో పనిచేసే గంభీర్ ఆటగాళ్లకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. జట్టు ముందున్న లక్ష్యాలు, ఆటగాళ్లు అందుకోవాల్సిన అంచనాలు ముందే స్పషీ్టకరిస్తాడు. జట్టుకు ఏ సమయంలో ఏం కావాలనేది ఓ సానుకూల దృక్పథంతో ఆటగాళ్ల మానసిక స్థయిర్యాన్ని పెంచుతాడు. బుమ్రా అందుబాటుపై... పేసర్ బుమ్రాపై పని భారాన్ని తగ్గించేందుకు అన్ని టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఏ, ఏ మ్యాచ్లు ఆడతాడనేది ఇప్పుడే వెల్లడించడం సాధ్యం కాదు. ఐదు టెస్టుల పూర్తిస్థాయి సిరీస్లో పరిస్థితులు, పలు అంశాలను బట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ అతను ఈ మ్యాచ్ ఆడడు. వచ్చే మ్యాచ్ ఆడతాడు అని చెప్పలేం. ఇంగ్లండ్ ‘బజ్బాల్ క్రికెట్’ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలేం లేవు. పరిస్థితులను బట్టే జట్టు ఎత్తుగడలు అమలవుతాయి. దూకుడు ప్రతీసారి ఫలించదు. ఆ విషయం నాకు తెలుసు.

సూపర్ సిక్స్ కాదు.. ఫస్ట్ బాల్కే కూటమి అవుట్: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, హైదరాబాద్: సూపర్ సిక్స్ అని గొప్పగా చెప్పుకునే సీఎం చంద్రబాబు ప్రజల దృష్టిలో మొదటి బాల్కే అవుట్ అయ్యారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశానంటూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలకు న్యాయం చేస్తే.. హామీలను అమలు చేయకుండానే నెరవేర్చేసినట్టు కూటమి సర్కార్ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు తగ్గి, ఆదాయం పెరిగితే.. కూటమి ఏడాది పాలనలో ఆదాయం తగ్గి, అప్పులు పెరిగాయనే విషయాన్ని ఆధారాలు, గణాంకాలతో సహా వివరించారు. వాస్తవాలను దాచిపెట్టి, అద్భుతమైన పాలనను అందించామని.. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించనని చంద్రబాబు బెదిరించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తాను వెల్లడించిన గణాంకాలు వాస్తవం కాదు అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే..తల్లికి వందనం మహామోసంతల్లికి వందనం పథకం ప్రారంభం.. ఏడాది పాలన పూర్తి సందర్భంగా చంద్రబాబు మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలను మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశామంటూ, దానిపై మాట్లాడినే నాలుక మందం అంటూ ప్రతిపక్షంతో పాటు ప్రజలకు కూడా హెచ్చరికలు చేశారు. ఎన్నికల ముందు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున 87 లక్షల మందికి ఇస్తామని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు అందులో 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. అదికూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద 2.07 కోట్ల మందికి నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. 53.50 లక్షల మందికి రైతు భరోసా కింద రూ.20 వేల చొప్పున ఇస్తామన్నారు. ఇందుకు ఏడాదికి రూ.10 వేల కోట్లకు పైగా అవసరం కాగాజజ కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఉద్యోగం రాని యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 1,54,047 మందికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని ఊదరగొట్టారు. వాటిని ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా వాటినే వైఎస్సార్సీపీ అడుగుతోంది. వాటికి సమాధానంగా అన్ని సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాశానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది.బడ్జెట్, వ్యయాలు.. సంక్షేమ లెక్కలివి– వైఎస్సార్సీపీ 2023–24లో బడ్జెట్ రూ.2,35,780 కోట్లు. 2024–25లో కూటమి ప్రభుత్వ బడ్జెట్ రూ.2,45,076 కోట్లు. అంటే మా కంటే కూటమి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు బడ్జెట్లో ఎక్కువగా పెట్టింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి జీతాల కోసం వెచ్చించింది రూ.52 వేల కోట్లు. పెన్షన్లు రూ.21,500 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.29,500 కోట్లు. ఇవన్నీ కలిపితే మొత్తం రూ.1,03,000 మా ప్రభుత్వ హయాంలో చేసిన వ్యయం. మూలధనం పెట్టుబడి కింద చేసిన వ్యయం రూ.23,300 కోట్లు. మొత్తం బడ్జెట్ రూ.2,35,780 కోట్లలోనే జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు చేసిన వ్యయాలను తీసేస్తే మిగిలిన నిధులు సుమారుగా రూ.1,09,000 కోట్లు. ఈ నిధుల నుంచే వైఎస్ జగన్ ప్రకటించిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశాం.– కూటమి ప్రభుత్వంలో జీతాల కోసం ఖర్చు చేసింది రూ.59 వేల కోట్లు, పెన్షన్లు రూ.27 వేల కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.31 వేల కోట్లు. ఇవన్నీ కలిపితే కూటమి హయాంలో చేసిన వ్యయం మొత్తం రూ.1,18,000 కోట్లు. ఈ ప్రభుత్వంలో చేసిన మూలధన పెట్టుబడి వ్యయం రూ.19వేల కోట్లు. బడ్జెట్లోంచి జీతాలు, వడ్డీలు, పెన్షన్లకు చేసిన వ్యయం తీసేస్తే మిగిలిన నిధులు మొత్తం రూ.1,07,000 కోట్లు. మరి ఇన్ని నిధులు ఉండి కూడా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చంద్రబాబు వివరణ ఇవ్వాలి. కేవలం కూటమి ప్రభుత్వంలో హామీల్లో అమలు చేసింది రూ.వెయ్యి పెన్షన్ పెంచడం తప్ప మరొకటి కనిపించడం లేదు.సంపద సృష్టి అంటే ఇదేనా?– అప్పులపై చంద్రబాబు ఎన్నికల ముందు అనేక అబద్ధాలు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఏపీకి ఉన్న అప్పు రూ.1,40,717 కోట్లు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే 2019 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.3,90,247 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. సీఏజీఆర్ ప్రకారం చూస్తే 22.63 శాతం ఎక్కువగా అప్పులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే 2024 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.7,21,918 కోట్లు. అంటే ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.3,32,671 కోట్లు. వైఎస్సార్సీపీ హయాంలో సీఏజీఆర్ 13.5శాతం మాత్రమే. ఇవన్నీ కాగ్ నివేదికలో ఉన్న లెక్కలు. వీటిని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారు. శ్రీలంక, కంబోడియాగా ఏపీని మార్చేస్తున్నారంటూ దిగజారుడు ప్రచారం చేశారు. – వైఎస్సార్సీపీ పాలనలో 2022–23లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1,57,768 కోట్లు. 2023–24లో రూ.1,73,767 కోట్లు. ఆ రెండేళ్లలో ఆదాయం చూస్తే 10శాతం పెరిగింది. ఆ ఏడాది అప్పులు చూస్తే 19 శాతం మాత్రమే పెరిగాయి. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అప్పులు 30 శాతం పెంచితే.. ఆదాయం మాత్రం కేవలం 3 శాతం మాత్రమే పెరిగింది. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి?. 2024 ఏప్రిల్ నాటికి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,500 కోట్లు అయితే, 2025 ఏప్రిల్లో నాటికి వచ్చిన రాష్ట్ర జీఎస్టీ రూ.2,652 కోట్లు. అంటే.. 24 శాతం తక్కువగా వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం 2024లో రూ.7,483 కోట్లు కాగా, 2025లో వచ్చిన ఆదాయం రూ.6,569 కోట్లు. అంటే 12 శాతం ఆదాయం పడిపోయింది. పన్నేతర ఆదాయం ఏప్రిల్ 2024లో రూ.442 కోట్లు అయితే, 2025 ఏప్రిల్ నాటికి రూ.345 కోట్లు. అంటే 22 శాతం తక్కువ. ఏప్రిల్ 2024లో పన్ను, పన్నేతర ఆదాయం కలిపి లెక్కిస్తే రూ.7,925 కోట్లు కాగా, 2025 ఏప్రిల్ నాటికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.6914 కోట్లు. అంటే 12 శాతం తక్కువ.ఉద్యోగుల సొమ్మును వాడేశారుఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏల అమలు ఏదీ. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.32,997 ఉంది. అందులో ఏపీ భాగం 19,138 కోట్లు. 2014–19 నాటికి రూ.76,516 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన రూ.57,378 కోట్ల సొమ్మును అదనంగా వాడుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.76,038 కోట్లు. అంటే మేం ఉద్యోగుల సొమ్మును వాడుకోకపోగా రూ.478 కోట్లను మేం తిరిగి జమ చేశాం. కానీ.. ఉద్యోగుల విషయం మా ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు.ఏడాదిలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటున్న పవన్కళ్యాణ్ ఈ విషయాలపై ఎందుకు దీనిపై మౌనంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని దుకాణాలు వెలవెలబోతుంటే.. ఒక్క మద్యం దుకాణాలు మాత్రమే కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో వ్యాపారాల కోసం కాల్మనీ నుంచి ఫైనాన్స్ తీసుకుని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాది కూటమి పాలనపై కేకే సర్వేలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమైందని తేలింది. ఏడాది పాలన తరువాత కూటమి ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తోంది. ఏడాదిలో ఎన్నో అరాచకాలు చేశారు. చివరకు ప్రశ్నించే జర్నలిస్ట్లను కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి, వేధించారు.
సైప్రస్ చేరుకున్న ప్రధాని మోదీ
బకాయిల మోత.. విద్యార్థులకు వాత
47మృతదేహాల గుర్తింపు
ర్యాగింగ్ నంబరు 165 @ 2024
క్యాన్సర్కు కళ్లెం
రికార్డుల కొబ్బరి
సాంకేతిక లోపంతో రన్వేపై ఆగింది!
పరిమితికి మించి పొగాకు సాగు వద్దు
హోరెత్తిన నో కింగ్స్
మసీదు భూముల వ్యవహారం.. పచ్చనేతలకు ఫలహారం!
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
డ్యాన్స్ మాస్టర్ కోసం వెళ్లిన రోజా, మీనా, రంభ, దేవయాని (ఫోటోలు)
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
రామ్ చరణ్-ఉపాసన వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ (ఫొటోలు)
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
ఏపీలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
WTC ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్గా
ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
బీజేపీలోకి స్వప్న?
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు.. 2025లో భారత్ ఎక్కడంటే.. (ఫొటోలు)
ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి.. క్షేమం అంటూ పోస్ట్
సైప్రస్ చేరుకున్న ప్రధాని మోదీ
బకాయిల మోత.. విద్యార్థులకు వాత
47మృతదేహాల గుర్తింపు
ర్యాగింగ్ నంబరు 165 @ 2024
క్యాన్సర్కు కళ్లెం
రికార్డుల కొబ్బరి
సాంకేతిక లోపంతో రన్వేపై ఆగింది!
పరిమితికి మించి పొగాకు సాగు వద్దు
హోరెత్తిన నో కింగ్స్
మసీదు భూముల వ్యవహారం.. పచ్చనేతలకు ఫలహారం!
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
WTC ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్గా
ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
బీజేపీలోకి స్వప్న?
ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి.. క్షేమం అంటూ పోస్ట్
మార్క్రమ్ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు
కేవలం ఆత్మరక్షణ కోసమే గాలిలో కాల్పులు జరపాల్సి వచ్చింది!
టీడీపీలో వారిని వదలను.. ప్రసాద్ బాబు సంచలన వ్యాఖ్యలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
సినిమా

ప్రభాస్ ది రాజాసాబ్ టీజర్.. టైమ్ ఫిక్స్ చేసిన డైరెక్టర్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ను తేదీని కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.అయితే ఇప్పటికే జూన్ 16న ఉదయం 10:52 గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ మారుతి తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఆల్ సెట్ డార్లింగ్స్.. లెట్స్ రాక్ ఫ్రమ్ టుమారో' అంటూ టైమ్ ఫిక్స్ చేశారు.టీజర్పై అధికారిక ప్రకటన రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం. ది రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.All SET darlings Hope u all ready 💖 Let's rock from tomorrow 10.52 am#TheRajaSaabTeaser pic.twitter.com/Q2aGbYAcnU— Director Maruthi (@DirectorMaruthi) June 15, 2025

ఫాదర్స్ డే.. మంచు లక్ష్మీ ఇలా మృణాల్ అలా
తండ్రి గురించి విషయాలు చెప్పిన మంచు లక్ష్మీతండ్రి సూపర్ హీరో అంటూ మృణాల్ క్రేజీ పోస్ట్బెస్ట్ డాడ్ అంటూ సాయేషా ఇన్ స్టా పోస్ట్త్వరలో తండ్రి కాబోతున్న భర్త గురించి కియారా ఇలాతల్లితో కలిసి ఎంజాయ్ చేస్తున్న సుప్రీతచీరలో అందమైన చందమామలా ఐశ్వర్యా రాజేశ్ View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sayyeshaa (@sayyeshaa) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john)

ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటుడు.. తొలి ఇండియన్గా ఘనత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన లంబోర్గిని ఎస్ఈని తన సొంతం చేసుకున్నారు. ఈ ప్రత్యేక మోడల్ను కొనుగోలు చేసిన మొదటి భారతీయ నటుడిగా నిలిచారు. తన భార్య గౌతమి కపూర్తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.5.21 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.ఈ లంబోర్గిని ఉరుస్ ఎస్ఈ మోడల్ కారును 2024లో అధికారికంగా భారతదేశంలో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ నటుడు ఈ కారును కొనలేదు. దీంతో మొదట ఈ లగ్జరీ కారు కొన్న నటుడిగా రామ్ కపూర్ నిలిచారు. రామ్ తన బ్రాండ్ న్యూ లంబోర్గిని కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అతని వద్ద రామ్ పోర్స్చే , పోర్సే, ఫెరారీ , రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను కూడా కలిగి ఉన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే రామ్ కపూర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ మిస్త్రీలో కనిపిస్తాడు. ఇది అమెరికన్ సిరీస్ ఆధారంగా తెరెకెక్కించారు. ఇందులో అతను డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 27 నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా గతేడాది యుధ్రా మూవీలోనూ మెరిశారు. View this post on Instagram A post shared by Auto Journal India (@autojournal_india)

ఇది నా రిక్వెస్ట్.. గద్దర్ అవార్డుల వేడుకపై దిల్ రాజు
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా గద్దర్ అవార్డుల వేడుక జరిపింది. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఈ వేడుక శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకని దగ్గరుండి విజయవంతం చేసిన దిల్ రాజు.. తాజాగా మీడియాతో మాట్లాడారు. అవార్డ్స్ వేడుక సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.(ఇదీ చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవంపై ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు.. 'గద్దర్ అవార్డ్స్ వేడుకలు నిన్న భారీ ఎత్తున నిర్వహించాం. ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ అవార్డ్స్ వేడుక కోసం గత 6 నెలలు నుంచి వర్క్ చేశాం. ఇది పెద్ద సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అవార్డ్ గ్రహీతలందరికీ థాంక్స్. ముఖ్యమంత్రి గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్. ఇంత పెద్ద ఈవెంట్లో సీఎం.. రెండు గంటలు పైన ఉన్నారు. త్వరలో ఏపీలో కూడా అవార్డ్స్ మొదలవుతాయి. ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుందంటే స్వీకరించే వాళ్లు ఎన్ని పనులున్నా కచ్చితంగా వచ్చి స్వీకరించాలి ఇది నా రిక్వెస్ట్' అని చెప్పుకొచ్చారు.అలానే ప్రభుత్వ అవార్డుల స్వీకరణలో సినీ పరిశ్రమ తీరుపై ఏఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కోసం ఆరు నెలలుగా కష్టపడితే సక్సెస్ అయింది. ప్రభుత్వం అవార్డులు ఇస్తుందంటే అందరూ హాజరై తీసుకోవాలి. అవార్డుల తేదీ ప్రకటించాక ఆ తేదీన అందరూ అవార్డు కోసం కేటాయించాలి. ఇంత పెద్ద ఈవెంట్లో ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించాలని దిల్ రాజు కోరారు.ఈ వేడుకలో 'పుష్ప 2' చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ స్వీకరించగా, ఉత్తమ నటిగా '35: ఇది చిన్న కథ కాదు' సినిమాకుగాను నివేదా థామస్ పురస్కారం అందుకుంది. గతేడాది అన్ని విభాగాలకు అవార్డులు బహుకరించగా.. 2014 నుంచి 2023 వరకు మాత్రం మూడేసి ఉత్తమ చిత్రాల్ని ఎంపిక చేసి అవార్డ్స్ ఇచ్చారు. గ్రహీతలకు సిల్వర్ మొమెంటో, ప్రశాంసా పత్రం, రూ.5 లక్షల మొత్తాన్ని అందజేశారు.(ఇదీ చదవండి: హీరోయిన్ నివేదా థామస్ ఇంతలా మారిపోయిందేంటి?)
న్యూస్ పాడ్కాస్ట్

పొగాకు రైతుల సమస్య డైవర్ట్ చేయడానికి దుర్మార్గానికి పాల్పడటం భావ్యమా?... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

నవ్వితేనే అరెస్టు చేస్తారా?... సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్రావు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం... మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన ఎయిర్ ఇండియా విమానం.. 265 మంది దుర్మరణం... మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు శాపంగా మారింది... పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్

ఏడాది కూటమి పాలనతో ఏపీలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం. పాఠశాలల్లో అటకెక్కిన నాడు-నేడు అభివృద్ధి పనులు. అమ్మ ఒడికి వీడ్కోలు.. ఇంగ్లిష్ మీడియంకు మంగళం

పత్రికా స్వేచ్ఛపై పైశాచికత్వం... ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’ మీడియా సంస్థ కార్యాలయాలపై టీడీపీ కూటమి నేతల దాడులు... కార్యకర్తలు, రౌడీగ్యాంగ్లతో కలిసి బీభత్సం

ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో ఆగని అఘాయిత్యాల పర్వం... బాలికలు, మహిళలపై అత్యాచారాలతో భయానక పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం... ప్రభుత్వం చెప్పేదానికి కాగ్ నివేదికలు పూర్తి విరుద్ధం... చంద్రబాబు కూటమి ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో కుప్పకూలిన శాంతిభద్రతలు.. చంద్రబాబుతోపాటు టీడీపీ నేతల నేరపూరిత చర్యలే అందుకు కారణం.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మండిపాటు

ఆంధ్రప్రదేశ్లో పచ్చ మాఫియా అరాచకాలు... యథేచ్ఛగా డ్రగ్స్ దందా... పేకాట క్లబ్బులతో భారీగా దోపిడీ
క్రీడలు

చరిత్ర సృష్టించిన బావుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే
టెంబా బావుమా.. ప్రస్తుతం ఈ పేరు వరల్డ్ క్రికెట్లో మారుమ్రోగిపోతుంది. షాన్ పొలాక్, మార్క్ బౌచర్, గ్రేమ్ స్మిత్, హషీమ్ అమ్లా, జాక్వస్ కల్లిస్ వంటి దిగ్గజ కెప్టెన్లకు సాధ్యం కానిది.. 35 ఏళ్ల బావుమా సాధించాడు. గత 27 ఏళ్ల అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని బావుమా తన దేశానికి తీసుకొచ్చాడు.లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసీస్ను బావుమా సారథ్యంలోని ప్రోటీస్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో సఫారీలు రెండో ఐసీసీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్లో బావుమా కెప్టెన్గా, ఆటగాడిగా ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్లో 36 పరుగులతో కీలక నాక్ ఆడిన టెంబా.. రెండో ఇన్నింగ్స్లో విరోచిత పోరాటం చేశాడు. ఓ వైపు తొడ కండరాల గాయంతో బాధపడుతూనే.. జట్టును ముందుండి నడిపించాడు. 134 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చరిత్ర సృష్టించిన బావుమా..తన కెప్టెన్సీతో సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన బావుమా.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్గా తొలి 10 మ్యాచ్లలో ఓటమి లేకుండా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్గా బావుమా నిలిచాడు.బావుమా ఇప్పటివరకు పది మ్యాచ్లలో ప్రోటీస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అందులో సౌతాఫ్రికా తొమ్మిది మ్యాచ్లలో విజయం సాధించింది. మరొకటి డ్రాగా ముగిసింది. ఇప్పటివరకు ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఇంగ్లండ్కు చెందిన పెర్సీ చాప్మన్ కెప్టెన్గా తొలి 10 మ్యాచ్లలో తొమ్మిది విజయాలు సాధించాడు. కానీ అందులో ఓ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిపోయింది.బావుమా కెప్టెన్సీలో మాత్రం దక్షిణాఫ్రికా తొలి 10 మ్యాచ్లలో ఒక్కటి కూడా ఓడిపోలేదు. చాప్మన్ 1926-31 మధ్య ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ దిగ్గజం వార్విక్ ఆర్మ్ స్ట్రాంగ్ (1920-21) కూడా కెప్టెన్గా తొలి పది మ్యాచ్లలో ఓటమిని చవిచూడలేదు. కానీ అందులో 8 మ్యాచ్ల్లో విజయం సాధించగా, మరో రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.చదవండి: IND vs ENG: సెలక్టర్లకు స్వీట్ వార్నింగ్.. ఇంగ్లండ్ గడ్డపై సర్ఫరాజ్ సూపర్ సెంచరీ

సెలక్టర్లకు స్వీట్ వార్నింగ్.. ఇంగ్లండ్ గడ్డపై సర్ఫరాజ్ సూపర్ సెంచరీ
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఇంగ్లండ్పై గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.కాగా ఈ సిరీస్ సన్నహాకాల్లో భాగంగా బెకింగ్హమ్ వేదికగా భారత సీనియర్ జట్టు భారత-ఎ టీమ్తో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో తలపడతుతోంది. అయితే ఈ మ్యాచ్లో భారత-ఎకు ప్రాతినిథ్యం వహిస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో మెరిశాడు.బీసీసీఐ వర్గాల సమాచారం.. ప్రకారం రెండో రోజు ఆటలో సర్ఫరాజ్ టీ20 తరహాలో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 76 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. తర్వాత ఇతరులకు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్ అయ్యాడు. కాగా ఇంగ్లండ్ సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్కు చోటు దక్కలేదు. అతడు స్ధానంలో కరుణ్ నాయర్కు అవకాశమిచ్చారు.కానీ సర్ఫరాజ్ ఇప్పుడు తన అద్బుత ప్రదర్శనతో సెలక్టర్లకు గట్టి సమాధానమిచ్చాడు. బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ వీవీయస్ లక్ష్మణ్ ముందే సర్ఫరాజ్ ఈ సెంచరీ సాధించినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా ఈ ముంబైకర్ 92 పరుగులు చేశాడు.ఈ క్రమంలో సర్ఫరాజ్ను భారత జట్టుతో పాటు ఇంగ్లండ్లోనే ఉంచే అవకాశముంది. ఇక ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో భారత సీనియర్ జట్టు 459 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్, కేఎల్ రాహల్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా- ఎ జట్టు 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 45 పరుగులు చేయగా.. వాషింగ్టన్ సుందర్ 35, శార్దుల్ ఠాకూర్ 19 పరుగులు చేశారు.బుమ్రా ఫెయిల్..అయితే ఈ మ్యాచ్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిరాశపరిచాడు. ఏడు ఓవర్లు వేసిన బుమ్రా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 36 పరుగులు సమర్పించుకున్నాడు. అర్షదీప్ సింగ్ కూడా 12 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకుండానే 52 పరుగులు సమర్పించుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించారు.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: వారిద్దరి వల్లే ఓడిపోయాము.. మా జట్టులో ఆ సమస్య ఉంది: ఆసీస్ కెప్టెన్

ఐపీఎల్లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! అక్కడ 11 సిక్స్లతో విధ్వంసం
మేజర్ లీగ్ క్రికెట్-2025 సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కాలిఫోర్నియా వేదికగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 32 పరుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో గెలుపొందింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది.శాన్ ఫ్రాన్సిస్కో స్టార్ పేసర్లు బార్ట్లెట్, హ్యారీస్ రౌఫ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి నైట్రైడర్స్ను దెబ్బ తీశారు. నైట్రైడర్స్ బ్యాటర్లలో ఉన్ముక్త్ చంద్(53), మాథ్యూ ట్రంప్(41) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.మెక్గుర్క్ తుపాన్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యునికార్న్స్ ఇన్నింగ్స్లో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన మెక్గర్క్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. మెక్గర్క్ కేవలం 38 బంతుల్లోనే 2 ఫోర్లు,11 సిక్స్లతో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(52)హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక లాస్ ఏంజిల్స్ బౌలర్లలో వాన్ షాల్క్విక్ మూడు వికెట్లు పడగొట్టగా.. అలీఖాన్ రెండు, రస్సెల్, నరైన్ తలా వికెట్ సాధించారు.ఐపీఎల్లో ఫెయిల్..కాగా జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఐపీఎల్-2025 సీజన్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 6 మ్యాచ్లు ఆడిన మెక్గర్క్.. 9.17 సగటుతో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్లకు అతడిని జట్టు నుంచి తప్పించారు.Jake Fraser-McGurk's 88 runs earned him the title of Stake Player of the Match today in Oakland. 🔥@stakenewsindia x @StakeIND pic.twitter.com/jP44Of6wrH— Cognizant Major League Cricket (@MLCricket) June 15, 2025

వారిద్దరి వల్లే ఓడిపోయాము.. మా జట్టులో ఆ సమస్య ఉంది: ఆసీస్ కెప్టెన్
ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా ఓటమి రుచి చూపించింది. లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఆసీస్ పరాజయం పాలైంది. 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో కంగారులు పై చేయి సాధించినప్పటికి.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయారు.ఆసీస్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దక్షిణాఫ్రికా స్టార్ ఐడైన్ మార్క్రమ్(136) అద్బుతమైన సెంచరీతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడిపోవడం 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఛాంపియన్స్ సౌతాఫ్రికాపై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో అద్బుతంగా రాణించారని అతడు కొనియాడాడు.మిగితా ఫార్మాట్లతో పోలిస్తే టెస్టు క్రికెట్లో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. మనం ఊహించని విధంగా పరిస్థితులు చాలా త్వరగా మారవచ్చు. ఈ మ్యాచ్లో మేము కొన్ని తప్పులు చేశాము. తొలి ఇన్నింగ్స్లో మంచి ఆధిక్యం లభించిన తర్వాత కూడా ప్రత్యర్ధి ముందు సరైన టార్గెట్ను ఉంచలేకపోయాము.ఇంకా సెషన్ బ్యాటింగ్ చేసి ఉంటే మంచి స్కోర్ వచ్చేండేది. కానీ దక్షిణాఫ్రికా మాకు అవకాశం ఇవ్వలేదు. స్టార్క్-హాజిల్వుడ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రతీ పరుగుకు మేము చప్పట్లు కొట్టి అభినందించాము. బ్యాటింగ్ ఆర్డర్ టాప్-7లో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. రాబోయే వాటిని పరిష్కరించుకుంటాము. కానీ జట్టులో ఉన్న ప్రతీ ఒక్క ప్లేయర్ గత రెండేళ్లుగా అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతోనే మేము ఇక్కడవరకు వచ్చాము. దురదృష్టవశాత్తూ టాస్క్ను ఫినిష్ చేయలేకపోయాము.ఈ మ్యాచ్లో కూడా మొదటి రెండు రోజుల్లో మా బౌలర్లు బాగా రాణించారు. మేము ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాము. లియన్ నాథన్ లయన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ అతనికి వికెట్ దక్కలేదు. ఐడెన్ మార్క్రమ్, టెంబా బావుమా అద్బుతమైన నాక్లు ఆడారు. మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. మ్యాచ్ సాగిన నాలుగు రోజుల పాటు వారు ఎక్కడ పట్టు కోల్పోలేదు. విజయానికి వారు పూర్తి అర్హులు" అంటూ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: WTC Final: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు
బిజినెస్

టెక్ దిగ్గజంలో తొలగింపులు
కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ ఫ్యాక్టరీల్లో పని చేసే ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రణాళిక వేసింది. వచ్చే జూలై మధ్యలో తొలగింపుల ప్రక్రియ ప్రారంభమై నెలాకరు కల్లా పూర్తికానుంది. కొత్త సీఈవో లిప్ బు టాన్ వచ్చాక ఇది తొలి, భారీ ఉద్యోగాల కోత కానుంది.ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ఇంటెల్ నేరుగా ప్రకటించనప్పటికీ ఈమేరకు కంపెనీ ఉద్యోగులకు ఇంటర్నల్ మెమోల ద్వారా తెలియజేసినట్లు పలు అంతర్జాతీయ వార్త పత్రికల్లో కథనాలు వచ్చాయి. కంపెనీ తన అంతర్గత తయారీ విభాగమైన ఇంటెల్ ఫౌండ్రీలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకుని, మరింత చురుకైన సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగానే ఉద్యోగ కోతలు చేపడుతోందని పేర్కొన్నాయి.కంపెనీ చేపడుతున్న ప్రస్తుత తొలగింపుల్లో ఎంత మందిపై ప్రభావం పడుతుందనే విషయం వెల్లడికాలేదు. సీనియర్ నాయకత్వం నిర్దేశించిన ఆర్థిక లక్ష్యాలను చేరుకునే వరకు, తొలగింపులను అమలు చేయడంలో వ్యాపార యూనిట్లకు విచక్షణ ఉంటుందని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమ్మకాలు క్షీణించడం, మరోవైపు ఎన్విడియా, ఏఎండీ వంటి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ముఖ్యంగా ఏఐ ఫోకస్డ్ హార్డ్ వేర్ లో ఉద్యోగ పునర్నిర్మాణంపై ఇంటెల్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇలా చేస్తే.. ఇంటి పైకప్పు అదుర్స్!
సాక్షి, సిటీబ్యూరో: ఫాల్స్ సీలింగ్తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. దీంతో పాటు సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసే ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది.మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి.తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడక గది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది.గోడల రంగుకు, సీలింగ్కు ఒకే రకమైంది కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని వేసుకోవచ్చు. దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కని్పంచే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు.జాగ్రత్తలివే..ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి.ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 10–12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి.ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.ఉడెన్ ఫాల్స్ సీలింగ్లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి.

పాన్ కార్డు అలాగే వాడుతున్నారా? కట్టండి రూ.10వేలు!!
పాన్ కార్డు, ఆధార్ లేకుండా నేటి కాలంలో ఆర్థికపరమైన ఏ పనినీ పూర్తి చేయడం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాన్, ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికీ చాలా మంది తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోలేదు. అలాంటి వారి పాన్ కార్డులు ఇనాక్టియావ్గా మారాయి. అయినప్పటికీ కొందరు ఆర్థిక లావాదేవీల్లో ఇనాక్టివ్ పాన్ కార్డులను అలాగే ఉపయోగిస్తున్నారు.ఇలాంటి వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ కింద ఒక్కో లావాదేవీపై రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎవరైనా ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యంగా అధిక విలువ కలిగిన లావాదేవీలలో ఇనాక్టివ్ పాన్ ఉపయోగిస్తే ప్రతి సందర్భంలో ప్రత్యేక జరిమానా విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. బ్యాంకు ఖాతా తెరవడం లేదా నిర్వహించడం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేయడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వంటి లావాదేవీలు ఇందులో ఉన్నాయి.👉 ఆధార్ అప్డేట్కు కొత్త డెడ్లైన్రెండు పాన్ కార్డులున్నా తప్పే..ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఇలాంటి వారు రెండింటిలో ఒక పాన్ కార్డును సరెండర్ చేయాలి. అలా చేయకుండా పట్టుబడితే ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొంతమందికి రెండు పాన్ కార్డులు ఉండవచ్చు. ఉదాహరణకు పాన్ కార్డు వివరాల్లో తప్పులున్నప్పుడు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్పు కోసం కొత్త పాన్ కార్డు తీసుకొని ఉండవచ్చు. ఇలా రెండు పాన్ కార్డులు కలిగి ఉంటే ఎలాంటి జరిమానా విధించకుండా వదిలేస్తారు. అదే ఉద్దేశపూర్వకంగా రెండు పాన్కార్డులు పెట్టుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు. కాబట్టి ఎవరి దగ్గరైనా రెండు పాన్ కార్డులు ఉంటే వెంటనే సరెండర్ చేయడం మంచిది.

ఆఫీస్ స్థలాలకు డిమాండ్.. అమెరికన్ కంపెనీల హవా..
దేశీయంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో అమెరికన్ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్ చ.అ. స్పేస్ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్స్పేస్ లీజింగ్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2022–24 క్యాలెండర్ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్ సంస్థలు ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్ నగరాల్లో ఆఫీస్ డిమాండ్కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి.ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్ఎల్ హెడ్ (ఆఫీస్ లీజింగ్, రిటైల్ సర్వీసెస్), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (కర్ణాటక, కేరళ) రాహుల్ ఆరోరా చెప్పారు. అమెరికన్ సంస్థలు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు.
ఫ్యామిలీ

బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..
దేవుడు పిలిస్తే పలుకుతాడు. ప్రార్థిస్తే స్పందిస్తాడు అనేది చాలామంది భక్తుల నమ్మకం. ఆశ్చర్యకరంగా ఈసారి తల మీద అభయహస్తం ఉంచి ఆశీర్వదిస్తూ కెమెరాకు చిక్కాడు. నిజం, ఫొటోలో కనిపిస్తున్న చేయి, మామూలు చేయి కాదని, ఇది స్వర్గం నుంచి వచ్చిన దేవుని అభయహస్తమని నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగతి ఏంటంటే, కెంటకీ అమాండా అనే మహిళ, ఎనిమిది నెలల గర్భవతి. అంతా మూములుగా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోకుండా ఒక చేదునిజం, రోజూ ఆమెను కలతకు గురిచేసింది. కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో, ఆ తల్లి ప్రతి స్కాన్కి ముందు దేవుడిని ఒక్కటే అడిగేది– ‘దేవుడా! నా బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించు’ అని. అలా ఒకరోజు అల్ట్రాసౌండ్ స్క్రీన్పై బిడ్డ తల మీద ఒక పెద్ద చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు కనిపించి దేవుడు ఆమె ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ‘దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాడు’ అంటూ సంతోషంలో మునిగిపోయింది. ‘ఇది ఫొటో కాదు, ఆకాశం నుంచి వచ్చిన దేవుని ప్రేమ. దేవుడు నా ప్రార్థనకు ఇచ్చిన సమాధానం’ అంటూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంతమంది ‘అది బిడ్డ చేయే’ అని వాదించినా, చాలామంది ఇది నిజంగానే దేవుడి ఆశీర్వాదంగా... ‘ఈ ఫొటోలో దేవుడి చేయి మాత్రమే కనిపించలేదు. నీ బిడ్డను తాకాడు. భరోసా ఇచ్చాడు. తన ప్రేమను చూపాడు. ’ అంటూ ఆమె నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నారు. (చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?)

పీసీఓఎస్తో మానసిక సమస్యలు..
నేను గర్భవతిని అని మూత్రపరీక్ష ద్వారా తెలిసింది. డాక్టర్ను ఎప్పుడు కలవాలి?– రమ్య, గుంటూరుగర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్ను కలవాలి. ఎందుకంటే శరీరంలో థైరాయిడ్, సుగర్, రక్తపోటులాంటి సమస్యలు ఉంటే, శిశువుపై వాటి ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ను కలిసిన వెంటనే వారు రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేస్తారు. అలాగే, శరీర పరిస్థితిని బట్టి ఫోలిక్ యాసిడ్, విటమిన్ –డి వంటి మాత్రలు సూచిస్తారు. ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. మొదటి వారాల్లోనే శుభ్రమైన, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు తగిన ఆహార నియమాలు కూడా డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులు, జన్యుపరమైన లోపాలు భర్తవైపు లేదా భార్యవైపు ఉన్నా, అవి శిశువుకు వచ్చే అవకాశముంటుంది. అందుకే ప్రారంభ దశలోనే ఆయా సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే, దానికి తగిన వైద్యం తీసుకోవాలి. సాధారణంగా గర్భం ఎనిమిదో వారం వచ్చేసరికి మొదటి స్కాన్ చేస్తారు. దానితో బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తర్వాతి స్కా మూడో నెలలో చేస్తారు. ఈ స్కానింగ్, మొదటి దశ రక్తపరీక్షల ద్వారా చాలా ముఖ్యమైన విషయాలను గుర్తించవచ్చు. అవసరమైన మందులు, తీసుకోవాల్సిన చికిత్సలు కూడా సూచిస్తారు. శరీర బరువు, రక్తపోటు స్థాయిని బట్టి ప్రారంభ దశలో చేయవలసిన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన అలవాట్లను సూచిస్తారు. ఆహార నిపుణుల సలహాలు, జన్యుపరమైన కౌన్సెలింగ్ కూడా ఇప్పటి నుంచే తీసుకోవాలి. అందుకే ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ప్రసూతి నిపుణులను తప్పనిసరిగా కలవాలి.పీసీఓఎస్తో మానసిక సమస్యలుప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మహిళలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం, శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, ముఖంపై మొటిమలు ఎక్కువగా రావడం, తల మీద జుట్టు పల్చబడిపోవడం వంటి శారీరక సమస్యలే కాకుండా పలు మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నడివయసుకు చేరుకునే సరికి మతిమరపు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఒక్కోసారి మానసిక కుంగుబాటుకు లోనవడం వంటి లక్షణాలతో బాధపడతారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీదర్ హడల్స్టన్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలో తేలింది. అలాగే, పీసీఓఎస్తో బాధపడే మహిళలకు టైప్–2 డయాబెటిస్ ముప్పు సాధారణ మహిళల కంటే రెట్టింపుగా ఉంటుందని కూడా ఈ పరిశోధనలో బయటపడింది. ఈ సమస్యల కారణంగానే పీసీఓఎస్తో బాధపడే మహిళలు నడివయసులో కెరీర్లోను, ఆర్థిక వ్యవహారాల్లోను వెనుకబడిపోతారని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన సారాంశం ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురితమైంది.ఆత్మహత్యా ధోరణులు కూడా..పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో రకరకాల శారీరక, మానసిక సమస్యలతో పాటు ఆత్మహత్యా ధోరణులు కూడా పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే, పీసీఓఎస్తో బాధపడే మహిళలు ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడే అవకాశాలు మూడు శాతం ఎక్కువగా ఉన్నట్లు తైవాన్లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ము హాంగ్ చెన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. (చదవండి: మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు)

మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు
తల్లిదండ్రుల మాటలు పిల్లల్లో భద్రతనివ్వాలి, బలమవ్వాలి, ఉత్సాహాన్ని నింపాలి. కానీ చాలా సందర్భాల్లో అవే మాటలు పిల్లల్లో భయాన్ని నాటేస్తాయి. దాంతో పిల్లలు తమ తప్పులను భయంతో దాచడం నేర్చుకుంటారు. లేదా మౌనంగా తిరగబడతారు. చివరకు తల్లిదండ్రుల ప్రేమకూ, పిల్లల బాధకూ మధ్య ఓ అఘాతం ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, పిల్లల వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చే మాటలు; ప్రేమను బెదిరింపుగా మార్చే పదాలు; పిల్లల వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించే వ్యాఖ్యల గురించి తెలుసుకోవాలి. వాటిని మార్చుకుని పిల్లల్లో ఆశనూ, ఆశయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. ‘‘నీకు అన్నీ కొనిపెడుతున్నాం, చదివిస్తున్నాం. ఇంకేం కావాలి?’’చాలామంది తల్లిదండ్రులు ఈ వాక్యాన్ని ప్రేమతో, బాధ్యతతో, త్యాగాన్ని గుర్తుచేసే కోణంలో చెబుతారు. కాని, పిల్లలకు ఇది లావాదేవీలా అనిపిస్తుంది. ప్రేమ అనేది కేవలం తినిపించడం, చదివించడం వంటి బాహ్య సౌకర్యాలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. దాంతో, వారు తమ ఎమోషనల్ అవసరాలను తల్లిదండ్రుల నుంచి కాకుండా, బయటి ప్రపంచం నుంచి పొందాలని ప్రయత్నిస్తారు. కొంచెం సానుభూతి చూపినా వారికి దగ్గరవుతారు. (చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?)‘‘నీకు అన్నీ సమకూర్చడం పేరెంట్స్గా మా బాధ్యత. నువ్వు ఆనందంగా ఉన్నావా?’’ అని అడిగితే చాలు. తల్లిదండ్రులు తనతోనే ఉన్నారనే అనుభూతిని పెంచుతుంది. ‘నా భావాలు తల్లిదండ్రులకు ముఖ్యం’ అనే భద్రతా భావన పెరుగుతుంది. కంగారు పడకుండా తమ బాధలను, కలలను, భయాలను పంచుకుంటారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, అనుబంధం, కృతజ్ఞత లాంటి భావాలు పెరుగుతాయి. ‘‘నీ కోసమే బతుకుతున్నా!’’ఈ వాక్యం తల్లిదండ్రుల త్యాగాన్ని చెప్పేదే అయినా, బిడ్డ వల్లనే తన బతుకు భారమైపోయిందన్న సందేశాన్ని పంపిస్తుంది. ‘‘అమ్మ, నాన్న నాకోసం జీవితాన్నే వదిలేశారు. మరి నేను నా కోరికల కోసం బ్రతికితే ఎలా?’’ అనే భావనను నాటుతుంది. కోర్సులు, కెరీర్, పెళ్లి నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోలేరు. ప్రేమ అనేది త్యాగం కావాలన్న తప్పుడు నమ్మకం వారిలో చెరగని చిహ్నంలా మిగిలిపోతుంది. తర్వాత కూడా ఇతరులతో సంబంధాల్లో తామే త్యాగం చేయాలన్న కండిషనింగ్తో బతకాల్సి వస్తుంది. ‘‘నీతో జీవించడం నా జీవితంలో అతి గొప్ప భాగం. నువ్వు నీ పంథాలో నడవాలి, నేను నీ వెంటే ఉంటాను’’ అని చెప్పి చూడండి. ఈ ఒక్క వాక్యంలో ఆత్మీయత, స్వేచ్ఛ, అనుబంధం మూడూ వ్యక్తమవుతాయి. తల్లిదండ్రుల ప్రేమ నిబంధనలపై ఆధారపడదన్న నమ్మకంతో వారు తమ నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలుగుతారు. కొడుకు/కూతురు అనే పరిధిలో కాకుండా తమ వ్యక్తిగతమైన గమ్యాన్ని అన్వేషించే బలమైన వ్యక్తిగా ఎదుగుతారు.‘‘నీ మాటలు వింటుంటే గుండె పగిలిపోతుంది!’’ఈ వాక్యం తల్లిదండ్రుల భావోద్వేగ బాధను వ్యక్తపరుస్తోంది అనిపించినా, నిజానికి ఇది పిల్లల వ్యక్తిత్వ అభివ్యక్తిని అణచివేసే వాక్యం. తమ మాటలు పెద్దవాళ్లకు బాధ కలిగించవచ్చని, కాబట్టి నిశ్శబ్దంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని నాటుతుంది. దీంతో పిల్లలు తమ అసలు భావాలను పంచుకోకుండా దాచేస్తారు. ఫేక్ పర్సనాలిటీలో జీవించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలంలో ఇది యాంగ్జయిటీ, డిప్రెషన్ లేదా కోపానికి దారి తీస్తుంది. దీనికి బదులుగా ‘‘నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసుకోవాలనుంది. అదేమిటో చెప్పడం వల్ల మనం నిజంగా దగ్గర కావచ్చు’’ అని చెప్పడం వల్ల పిల్లలలో భద్రతను, విశ్వాసాన్ని, స్పష్టతను నాటుతుంది. ఎలాంటి భావాలనైనా తల్లిదండ్రులతో పంచుకోవాలనిపిస్తుంది. వారు తమ నిజమైన భావాలను అంగీకరించడంలో సామర్థ్యం, ఆత్మగౌరవం పెరుగుతుంది.‘‘నువ్విలా ఉంటే నీతో ఎవ్వరూ కలవరు!’’ఈ వాక్యం ఇతర మాటలకంటే తీవ్రంగా పిల్లల ఆత్మగౌరవంపై తీవ్రమైన దెబ్బ తీస్తుంది. తమ వ్యక్తిత్వం పట్ల అసహనం, తమలో మారలేని లోపాలు ఉన్నాయన్న అపోహ, భవిష్యత్తులో ఒంటరిగా ఉండిపోతామన్న భయం నాటుతుంది. దీనివల్ల సోషల్ యాంగ్జయిటీ మొదలవుతుంది. వారిని బంధాలకు దూరంగా ఉంచుతుంది. ఇతరులకు నచ్చేందుకు తమ అసలైన భావనలను, అభిరుచులను దాచిపెడతారు. ‘‘నేను కలవదగిన వ్యక్తిని కాను’’ అన్న కోర్ బిలీఫ్ బలపడుతుంది.‘‘నువ్వు మారాలనుకునే క్షణం నుంచే, నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారటం మొదలవుతుంది’’ అని చెప్తే మార్పును శిక్షగా కాక, శక్తిగా చూపుతుంది. ‘నాలో మార్పు సాధ్యమే’, ‘నేను మారగలను’ అనే గ్రోత్ మైండ్ సెట్ను నాటుతుంది. దీనివల్ల నా జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయనే భావన చిగురిస్తుంది. మార్పు అవకాశం బయట ఎక్కడో లేదని, తనలోనే మొదలవుతుందనే ఇంట్రాస్పెక్షన్తో పిల్లలు ఎదుగుతారు. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్)

ఇంద్రద్యుమ్నుడి కథ
పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలకు కష్టం తెలియనివ్వకుండా పరిపాలించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. యజ్ఞయాగాలు చేశాడు. తనువు చాలించిన తర్వాత పుణ్య ప్రభావం వల్ల స్వర్గానికి వెళ్లాడు. అక్కడ అనేక సంవత్సరాలు సుఖభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు. ఏళ్లు గడిచాక భూలోకంలో అతడి కీర్తి అంతరించింది. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడనే సంగతిని కూడా ప్రజలు మరచిపోయారు. భూలోకంలో అతడి కీర్తి అంతరించిపోవడంతో దేవతలు ఇంద్రద్యుమ్నుడిని తిరిగి భూలోకానికి తోసేశారు. స్వర్గం నుంచి తిరిగి భూమ్మీద పడ్డ ఇంద్రద్యుమ్నుడు జరిగిన దానికి బాధపడుతూ, అడవులలో సంచరిస్తూ ఒకనాడు మార్కండేయ మహర్షిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నేనెవరో మీకు తెలుసు కదా! నా పేరు ఇంద్రద్యుమ్నుడు’ అన్నాడు.మార్కండేయుడు అతడిని తేరిపార చూసి, ‘నాయనా! నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు ఎన్నడూ వినలేదు. అయినా నేను తాపసిని. రాజులతోను, వారి చరిత్రలతోను నాకు పనిలేదు’ అని బదులిచ్చాడు.‘మహర్షీ! మీకంటే ముందుగా పుట్టినవారు, సజీవులుగా ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? తెలిస్తే, వారెక్కడ ఉంటారో చెప్పండి. కనీసం వారికైనా నేను తెలుసేమో కనుక్కుంటాను’ అభ్యర్థించాడు ఇంద్రద్యుమ్నుడు.‘మంచుకొండ మీద ఒక గుడ్లగూబ ఉంది. అది నా కంటే ముందు పుట్టింది. దాని పేరు ప్రావారకర్ణుడు. దానిని అడిగి చూడు’ అన్నాడు మార్కండేయుడు.ఇంద్రద్యుమ్నుడు తనతో మార్కండేయ మహర్షిని వెంటబెట్టుకుని, మంచుకొండ వద్ద గుడ్లగూబ దగ్గరకు వెళ్లాడు. ‘ఓ ఉలూకమా! నేను ఇంద్రద్యుమ్నుడిని. నీకు నేను తెలుసునా?’ అని అడిగాడు.తెలీదని బదులిచ్చింది గుడ్లగూబ.కాస్త నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు, ‘పోనీ! నీ కన్నా ముందుగా పుట్టి సజీవులుగా ఉన్నవారు ఎవరైనా నీకు తెలుసునా?’ అని అడిగాడు.గుడ్లగూబ కాసేపు ఆలోచించి, ‘ఇక్కడకు దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో నాడీజంఘుడు అనే కొంగ ఉంది. ఆ కొంగ నాకంటే ముందు పుట్టింది’ అని చెప్పింది. ఇంద్రద్యుమ్నుడు ఈసారి మార్కండేయుడిని, గుడ్లగూబను వెంటబెట్టుకుని సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ కొంగను కలుసుకుని, ‘నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.‘నాకు తెలీదు గాని, నా కంటే ముందుగా పుట్టిన తాబేలు ఇదే సరస్సులో ఉంటోంది. దానికి తెలుసేమో’ అంది కొంగ.‘దయచేసి, ఆ తాబేలుని పిలుస్తావా? కనుక్కుంటాను’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.తాబేలుకు కబురు పంపింది కొంగ.ముసలి తాబేలు నెమ్మదిగా తడబడుతూ సరస్సు ఒడ్డుకు వచ్చింది. ‘కచ్ఛపరాజమా! నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.తాబేలు కాసేపు ఆలోచించి, ‘ఆ మహారాజు తెలియకపోవడమేంటి? చల్లని మహారాజు. వెయ్యి యజ్ఞాలు చేశాడు. గొప్ప దానాలు చేశాడు. ఆయన పాలన సాగినన్నాళ్లూ రాజ్యంలో నిత్య సంతర్పణలు జరిగేవి. ఆ మహారాజు భూసురులకు వేలాది గోవులను దానం చేయడం వల్ల, ఆ గోవులు తొక్కుతూ సంచరించడం వల్లనే ఇక్కడ ఈ సరోవరం ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరు ఏమిటనుకున్నావు? ఇది ఇంద్రద్యుమ్న సరోవరం’ అని బదులిచ్చింది.‘హమ్మయ్య! నా గురించి తెలిసిన జీవి ఒకటి ఇంకా ఈ భూమ్మీద జీవించి ఉంది’ అని మనసులో సంతోషించాడు ఇంద్రద్యుమ్నుడు.తాబేలు మాటలకు ఆనందపరశుడయ్యాడు. ‘కచ్ఛపరాజమా! నేనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజును’ అని చెప్పి, ఆ తాబేలుకు నమస్కరించాడు.ఇంద్రద్యుమ్నుడి కీర్తి ఇంకా భూమ్మీద మిగిలే ఉండటంతో దేవతలు దివ్యవిమానంలో అక్కడకు చేరుకున్నారు.‘ఇంద్రద్యుమ్నా! నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా ఉంది. నువ్వు వెంటనే మాతో వచ్చి, స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ముక్తకంఠంతో పలికారు దేవతలు.ఇంద్రద్యుమ్నుడు వారితో పాటు దివ్యవిమానమెక్కి స్వర్గానికి తిరిగి బయలుదేరాడు.∙సాంఖ్యాయన
ఫొటోలు


హీరోయిన్ లయ వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తని చూశారా? (ఫొటోలు)


విజయవాడలో వెడ్డింగ్ రిసెప్షన్లో చరణ్ దంపతులు (ఫొటోలు)


ఫాదర్స్ డే స్పెషల్ : నాన్న పేరు నిలబెట్టిన స్టార్స్ వీరే (ఫోటోలు)


గ్రాండ్గా గద్దర్’ అవార్డ్స్ వేడుక.. పురస్కారాలు అందుకున్నది వీళ్లే (ఫోటోలు)


అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక (ఫొటోలు)


సాక్షిపై కక్ష సాధింపు సరికాదు.. మీడియా స్వేచ్ఛను హరించడమే.. (ఫొటోలు)


SA Vs AUS Photos: 27 ఏళ్ల నిరీక్షణకు తెర.. డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా (ఫొటోలు)


రామ్ చరణ్-ఉపాసన వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ (ఫొటోలు)


ఏ అలా, ఏ తుఫానూ ఎంతో కాలం ఉండవు, దారి మనమే వెతుక్కోవాలి: సమంతా పోస్ట్ (ఫోటోలు)


బెడ్ రూంలో ఫోటోషూట్.. మాజీ మిస్ ఇండియా ఫోటోలు వైరల్
అంతర్జాతీయం

దాడులు... ప్రతిదాడులు
టెహ్రాన్/జెరూసలేం/దుబాయి/వాషింగ్టన్: తొలిదెబ్బతోనే పలువురు ఇరాన్ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యలను సమాధిచేసిన ఇజ్రాయెల్ శనివారం మరోసారి ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. శనివారంనాటి దాడిలో మరో ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు ప్రాణాలుకోల్పోయారు. సైనిక జనరల్ స్టాఫ్లో డెప్యూటీ ఇంటెలిజెన్స్ అధికారి అయిన జనరల్ గోలామ్రెజా మెహ్రీబీ, ఆపరేషన్స్ విభాగ డెప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీలు మరణించిన విషయాన్ని ఇరాన్ సైతం ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు ఇరాన్లోని పలు జనావాసాలపై పడ్డాయి. అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలియరాలేదు. టెహ్రాన్లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్పైనా క్షిపణులు పడ్డాయి. ఆగ్నేయ ఇరాన్ ‘ఖుజెస్తాన్’ప్రావిన్సులోని అబదాన్ నగరంపై, మిలటరీ స్థావరం సమీపంలోని కెర్మాన్షా ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ దాడులుచేసింది. ఇరాన్ గగనతల రక్షణవ్యవస్థలు ధ్వంసంకావడంతో ఇప్పుడు ఆ దేశ గగనతలం గాల్లో దీపంగా తయారైందని, ఇష్టమొచ్చినట్లు మేం దాడిచేయగలమని ఇజ్రాయెల్ రక్షణశా ఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీడెఫ్రిన్ ప్రకటించారు. 70 ఫైటర్జెట్లతో శత్రు గగనతల రక్ష ణ వ్యవస్థను భస్మీపటలం చేశామని పేర్కొన్నారు. రేడియో ధార్మికత సాధారణమే సైన్యాధికారులను కోల్పోయి సైనికంగా, స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా, శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్ వెంటనే ప్రతికార దాడులకు దిగింది. శనివారం ఉదయం సైతం మరోసారి వందల కోద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్రాజధాని టెల్ అవీవ్ సిటీమీదకు ఎక్కుపెట్టింది. ఇజ్రాయెల్ ఐరన్డోమ్ క్షిపణ విధ్వంసక వ్యవస్థ సమర్థవంతంగా వాటిని గాల్లోనే పేల్చేసింది. దీంతో ఆకాశంలో భారీ విస్ఫోటనాలు, మెరుపులు చూసి, భారీ శబ్దాలు విని ఇజ్రాయెల్వాసులు భయకంపితులయ్యారు. అయితే భారీఎత్తున ఒకేసారి క్షిపణులు దూసుకురావడంతో కొన్ని ఐరన్డోమ్ వ్యవస్థను దాటుకొని మరీ లక్ష్యాలను ఢీకొట్టాయి. దీంతో రిషాన్ లీజియన్ నగరంలో ఇద్దరు, టెల్అవీవ్లోని రమాత్ గాన్ ప్రాంతంలో ఒక మహిళ చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాడులనేపథ్యంలో టెల్ అవీవ్ సమీప బెన్ గురియణ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసేసింది. మృతసముద్రతీర ప్రాంతంలో చాలా డ్రోన్లను కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్లోని ఇస్ఫహాన్ అణుకేంద్రంపై శుక్రవారం పలుమార్లు దాడులుజరిగాయని, రేడియోధార్మికత స్థాయిలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ శనివారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేసింది. ఇరాన్ ఆర్మీ చీఫ్గా అమీర్ హతామి ఇరాన్ నూతన ఆర్మీ చీఫ్గా అమీర్ హతామి నియమితులయ్యారు. ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హతామి ఇరాన్ సైన్యానికి చీఫ్ కమాండర్గా వ్యవహరిస్తారు. హతామి 2013 నుంచి 2021 వరకు ఇరాన్ రక్షణ మంత్రిగా పనిచేశారు. ఇరాన్ సైనిక వ్యవస్థతో బలమైన సంబంధాలున్న హతామికి మూడు దశాబ్దాలకు పైగా వ్యూహాత్మక, కార్యాచరణ అనుభవం ఉంది. మరోవైపు బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం నూతన చీఫ్గా జనరల్ మజీద్ మౌసావితో ఖమేనీ శనివారం భర్తీచేశారు. ప్రస్తుత చీఫ్ అమీర్ అలీ హజిజాదే శుక్రవారంనాటి దాడుల్లో చనిపోవడం తెల్సిందే. యుద్ధాన్ని ఆపాలన్న ప్రపంచదేశాలు ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో అస్థిరత రాజ్యమేలుతుండగా కొత్తగా ఇరాన్తోనూ ఇజ్రాయెల్ సమరానికి సై అనడాన్ని ప్రపంచదేశాలు తప్పుబట్టాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని కోరాయి. శాంతిస్థాపన దిశగా చర్చలు జరపాలని శనివారం వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాసిలికాలో నూతన పోప్ లియో–14 సందేశం ఇచ్చారు. ఇతర ఉనికి మరొకరు ప్రశ్నించకూడదని, బెదిరించకూడదని అన్నారు. ‘‘ఇరాన్ అణుకేంద్రంపై ఇజ్రాయెల్ బాంబులేస్తే, టెల్అవీవ్పై ఇరాన్ క్షిపణులను పడేసింది. పెరిగిన ఉద్రిక్తతలను చాలించండి. ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయమిది. శాంతి, దౌత్యమార్గాల్లో నడవండి’’అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శనివారం పిలుపునిచ్చారు. రహస్యంగా డ్రోన్లు తరలించి.. రష్యాలోకి ఉక్రెయిన్ రహస్యంగా డ్రోన్లను తరలించినట్లే ఇజ్రాయెల్ సైతం ఇరాన్లోకి రహస్యంగా డ్రోన్లను తరలించి గగనతల రక్షణవ్యవస్థల వద్దకు చేర్చింది. అదనుచూసి ఎస్–300 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లాంఛర్లను, రాడార్ వ్యవస్థలను డ్రోన్లతో పేల్చేసింది. రాడార్లులేకపోవడంతో సులభంగా ఇజ్రాయెల్ ఫైటర్జెట్లు ఇరాన్ ప్రధానభూభాగందాకా వచ్చి భీకరస్థాయిలో బాంబులు జారవిడిచి వినాశనం సృష్టించాయి. అర్ధరాత్రి దాడి తాలూకు వీడియో ఫుటేజీని ఇజ్రాయెల్నిఘా విభాగం మొస్సాద్ శనివారం విడుదలచేసింది. ఇలాంటి వీడియోలను మొస్సాద్ విడుదలచేయడం అత్యంత అరుదు. విమానాలను కూల్చేసే లాంఛర్లపై ఇజ్రాయెల్ ఆత్మాహుతి డ్రోన్లు ల్యాండ్ అయి పేలిపోవడం ఆ దృశ్యాల్లో కనిపించింది. ‘‘మావైపుగా క్షిపణులు ప్రయోగించడం మానకుంటే టెహ్రాన్ను అగ్నికి ఆహుతిచేస్తాం. మరుభూమిగా మార్చేస్తాం. మా పౌరులకు హాని తలపెడితే మిమ్మల్ని మసిచేస్తాం. టెహ్రాన్పై మరోదఫా దాడులకు మా యుద్దవిమానాలు సదా సిద్ధంగా ఉన్నాయి’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’అన్నారు. ఈయన పేరులో దేశంపేరూ ఉండటం విశేషం. ‘‘ముప్పును సమూలంగా తొలగించేదాకా దాడులు ఆపబోం. దాడులు రోజులతరబడి కొనసాగొచ్చు’’అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు.ఇరాన్ ‘అణు’కల చెదిరింది యురేనియంను అత్యంత శుద్ధిచేసి అణుబాంబును తయారుచేయాలన్న ఇరాన్ కల చెదిరిపోయిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అణుకేంద్రం ధ్వంసంకావడం, అందులో కీలక వ్యవస్థలు కూలిపోవడంతోపాటు అత్యంత కీలకమైన 9 మంది అణుశాస్త్రవేత్తలు చనిపోయిన నేపథ్యంలో ఇరాన్ ఇప్పట్లో అణుబాంబును తయారుచేయడం అసాధ్యమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అణువిద్యుత్ కేంద్రానికి సరిపడా యురేనియంను శుద్ధిచేసేందుకు ఇరాన్కు అనుమతి ఉండగా అదనపు యురేనియంను శుద్ధిచేస్తోందని చాన్నాళ్ల నుంచి ఆరోపణలురావడం తెల్సిందే. శుక్రవారంనాటి దాడుల్లో అణువిద్యుత్కేంద్రం బ్యాకప్ ఇంధన శక్తివ్యవస్థను ఇజ్రాయెల్ నాశనంచేసింది. దీంతో కరెంట్ కష్టాలు సైతం పెరగనున్నట్లు తెలుస్తోంది.అణు చర్చలు అర్థ్ధరహితంఅమెరికా ఓవైపు మాపై యుద్ధానికి ఇజ్రాయెల్ను ఎగదోస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడటం అర్థ్ధరహితమని అగ్రరాజ్యంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అణుచర్చల కోసం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఐదుసార్లు చర్చలు జరగ్గా ఆరోసారి ఆదివారం ఒమన్లో జరగనున్నాయి. ఇజ్రాయెల్ను మాతో యుద్దానికి దించి అమెరికా మరోదఫా చర్చలకు అర్థంలేకుండాచేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయిల్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్కు మద్దతిస్తే పశ్చిమాసియాలోని మీ స్థావరాలపై దాడులుచేస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లను ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఆదివారం జరగబోయే చర్చలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, ఇజ్రాయెల్ వైపుగా వెళ్తున్న కొన్ని ఇరాన్ క్షిపణులను తాము ఎయిర్డిఫెన్స్ వ్యవస్థలతో కూల్చేశామని అమెరికా అధికారి ఒకరు వెల్లడించడం గమనార్హం. కశ్మీర్ ‘పోస్ట్’పై ఇజ్రాయెల్ క్షమాపణలుటెహ్రాన్పై వైమానిక దాడులు చేశామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) శుక్రవారం తమ ‘ఎక్స్’ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ భారత్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘‘ఇరాన్ అనేది ప్రపంచం మొత్తానికి పెనుముప్పుగా మారింది. ఇది ఇజ్రాయెల్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. త్వరలో అన్ని దేశాలతోనూ ఇది ఇలాగే వ్యవహరిస్తుంది. అందుకే దాడులు చేయడం మినహా మాకు మరోదారి కనిపించలేదు’’అని ఐడీఎఫ్ శుక్రవారం ఒక మ్యాప్ను పోస్ట్పెట్టింది. అయితే ఈ మ్యాప్లో జమ్మూకశీ్మర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించింది. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే తప్పు తెల్సుకున్న ఇజ్రాయెల్ శనివారం క్షమాపణలు చెప్పింది. ‘‘ఈ ప్రాంత భూభాగాన్ని చూపుతూ ఊహాత్మకంగా గీసిన మ్యాప్ అది. సరిహద్దులను కచ్చితంగా సూచించడంలో ఈ మ్యాప్ విఫలమైంది. మ్యాప్ కారణంగా మేం ఏదైనా నేరానికి పాల్పడినట్లు భారత్ భావిస్తే సారీ’అని ఐడీఎఫ్ శనివారం ఒ పోస్ట్ పెట్టింది.

Indian Students: మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి.. !
ఇజ్రాయిల్ నిన్న(శుక్రవారం) చేసిన దాడుల తర్వాత ఇరాన్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒక్కసారిగా ఇజ్రాయిల్ విరుచుకుపడటంతో ఇరాన్లో భారీ నష్టమే వాటిల్లింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించిన తర్వాత ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భీకర దాడుల్లో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. అయితే దీనికి ప్రతిగా ఇజ్రాయిల్పై ఈరోజు(శనివారం) ఇరాన్ మెరుపు దాడులు చేసింది. ఇరాన్ చేసిన క్షిపణి దాడులతో ఇజ్రాయిల్లో సైతం భారీ నష్టమే వాటిల్లినట్లే తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్లో ఉన్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. ఏ సమయంలో ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ వేడుకుంటున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతం ఇక్కడ అంతా బాగానే ఉందని, మీరంతా సురక్షితంగా ఉన్నారనే భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ భారత విద్యార్థులు మాత్రం ఈ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని, తమకు ఒకానొక సమయంలో భారీగా భూమి కంపించినట్లు అనిపించిందని, సురక్షిత ప్రాంతాలకు తరలించే యత్నం చేయాలని విన్నవిస్తున్నారు. ఈ యుద్ధ సమయంలో ఏది సురక్షిత ప్రాంతమనేది కూడా ఆ యూనివర్శిటీ అధికారులు చెప్పలేకపోతున్నారు. తమకు ఫలానా ప్రాంతం సురక్షితమైనదనే సమాచారం ఏదీ లేదని, మీరు దయచేసి సంయమనం పాటించాలని అంటున్నారు. ‘ మనమంతా సేఫ్ ప్లేస్లో ఉన్నాం. దయచేసి మీరు కామ్గా ఉండండి’ అంటూ టెహ్రాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టీయూఎంఎస్) అధికారులు చెప్పినట్లు కశ్మీర్ నుంచి వెళ్లి అక్కడ ఎంబీబీఎస్ రెండో ఏడాది చదువుతున్న తబియా జహ్రా పేర్కొన్నారు.ఉత్తర్ ప్రదేశ్ నుంచి వెళ్లిన అలిషా రిజ్వీ మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం మా డేటాను అధికారులు సేకరిస్తున్నారు. మా ఈ మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. ఒకవేళ మమ్మల్ని తరలించే అవసరం ఏర్పడితే అందుకు ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’ ని ఆమె పేర్కొన్నారు. వీరిద్దరి 5.5 ఎంబీఎస్ ప్రోగ్రామ్లో భాగంగా ఇరాన్లోని టెహ్రాన్కు 2023లో రాగా, ఇప్పటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇదే తరహాలో చాలామంది విద్యార్థులు ఇరాన్లోని ప్రస్తుత పరిస్థితుల నడుమ భయాందోళనలతో ఉన్నారు. ఇదిలా ఉంచితే, జమ్మూ కశ్మీర్ విద్యార్థి సంఘం.. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ను కలిసింది. భారత స్టూడెంట్లు అక్కడ ప్రస్తుత భయానక పరిస్ధితుల్లో ఉన్నారని, వారికి పదేపదే యుద్ధ సైరన్లు వినిపించడంతో వారు బెంబేలెత్తిపోతున్నారని జై శంకర్కు సదరు అసోసియేషన్ పెద్దలు విజ్తిప్తి చేశారు. ఈ మేరకు భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇరాన్లో చదువుతున్న తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మరొకవైపు ఇరాన్లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఇప్పుడు తాము ఉన్న ప్రదేశంలో ఉండలేకపోతున్నామనే ఆందోళన భారత విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.

Iron Dome: రక్షణ కవచాన్ని చీల్చుకుని మరీ..
దాడులు చేయడమే తప్ప.. దెబ్బ తినడం తెలియని ఇజ్రాయెల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఐరన్ డోమ్(Iron dome). నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది. అలాంటిది ఆ వ్యవస్థ మరోసారి విఫలమైందనే చర్చ నడుస్తోంది. ఇరాన్ అణు ముప్పును తప్పించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు శుక్రవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్పై 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ సైన్యం(IDF). ప్రతిగా ఇరాన్ కూడా దాడులు జరిపింది. డ్రోన్లతో జరిపిన దాడులను ఐడీఎఫ్ తిప్పికొట్టగలిగింది కానీ.. క్షిపణుల దాడిలో మాత్రం దెబ్బ తింది. ఏకంగా రాజధాని టెల్ అవీవ్లో.. అదీ రక్షణ ప్రధాన కార్యాలయంపై దాడి జరగ్గా.. ఏ రక్షణ వ్యవస్థ అడ్డ్డుకోలేకపోయింది.#BreakingNews Iron Dome Blasts Iranian Drone Out Of The Sky#Israel #Iran #IsraeliranWar #israil #Tehran #Teheran #TelAviv #deathtoamerica #irannucleardeal #AsadabadRegion #IronDome pic.twitter.com/wEV5FsM2qD— Shekhar Pujari (@ShekharPujari2) June 14, 2025ఆకాశంలో క్షిపణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్ ప్రజలు ఏమాత్రం వణికిపోకుండా తమ పని తాము చేసుకుంటారు. ఎందుకంటే ఐరన్ డోమ్ ఉందనే ధైర్యం. కానీ, శనివారం భీకర యుద్ధంలో ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. ఈ క్రమంలో రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను చీల్చుకుంటూ మరి మిస్సైల్స్ దూసుకెళ్లాయి. Last night strike on Tel aviv.Follow us for for all latest updates #middleeast #riyadh #jeddah #IranNuclearSecrets #USA #Israel #SaudiArabia #UAE #iran #tehran #tahran #russia #ukraine#telAviv #MissileAttack #Irondome pic.twitter.com/sRvxNzvXPy— Bharat - As it is (@NewBharatVoice) June 14, 2025పెద్ద శబ్దంతో.. దూసుకొచ్చిన మిస్సైల్ సెకన్ల వ్యవధిలోనే భవనాన్ని తాకింది. ది టైమ్స్ ఈ 19 సెకన్ల వీడియోను ధృవీకరించింది. బ్యాక్గ్రౌండ్లో టెల్ అవీవ్కు తలమానికంగా భావించే కీర్యా ప్రాంతంను చూడొచ్చు. ఇరాన్ మిస్సైల్స్ను ఐరన్ డోమ్ అడ్డుకుంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. మిస్సైల్ నేరుగా రక్షణ కార్యాలయాన్ని ఢీ కొట్టింది. అయితే అక్కడ జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగిస్తే రాడార్ వ్యవస్థ దాన్ని అధ్యయనం చేస్తుంది. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్ను అడ్డుకుంటాయి. అయితే శనివారం నాడు నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ఇరాన్ ప్రయోగించింది. కానీ, వాటిని అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ పవిఫలమైంది. ఐరన్ డోమ్ ఉండేది అక్కడే..ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఒకే దశలో ఉండదు. ఇందులో మూడు దశలు ఉంటాయి. యారో-2, యారో-3 సిస్టమ్స్ను బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఇవి ఆకాశంలోనే బాలిస్టిక్ క్షిపణులను పేల్చేసి.. వాటి శకలాల నుంచి ముప్పును దూరం చేస్తాయి. ఆపై డేవిడ్ స్లింగ్ మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. 100-200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి వాడతారు. అంతేకాదు.. యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చేయడంలోనూ దీనిదే కీలక పాత్ర.ఇక.. చిట్టచివరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. దీనిని ఇజ్రాయెల్ విస్తృతంగా వాడుతుంది. హమాస్, హెజ్బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్కు అసలైన రక్షణ కవచంగా నిలిచింది. దూసుకొచ్చే ఒక్కో ముప్పును పేల్చేయడానికి రెండు క్షిపణులను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50 వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. పని చేసేది ఎలాగంటే..ఐరన్ డోమ్ను స్థానికంగా కిప్పాట్ బర్జెల్గా వ్యవహరిస్తారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. దీనిలో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ ఉంటాయి. రాడార్ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే.. వదిలేస్తుంది. అదే జనావాసాలు అయితే మాత్రం. రాకెట్ను ప్రయోగించి దానిని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టమ్, రఫెల్ సంస్థలు పనిచేశాయి.సక్సెస్ రేటుపై అనుమానాలా?2006లో హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. నాడు వేల రాకెట్లను ఆ సంస్థ టెల్ అవీవ్ పై ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొంది. దీంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు తయారీకి నిర్ణయించింది. దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. 2008 నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011 నాటికి అందుబాటులోకి తెచ్చింది. ఐరన్ డోమ్ సక్సెస్ రేటు 90శాతానికి పైగానే ఉంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఇదో అద్భుతం. అయితే 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులను, తాజా ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ తడబడింది.

LA Protests: వెనక్కి తగ్గిన ట్రంప్?
అమెరికావ్యాప్తంగా అక్రమ వలసదారుల కోసం కొనసాగుతున్న తనిఖీలు.. అరెస్టులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ విషయంలో కోర్టు పరోక్షంగా ప్రభుత్వ చర్యలకు మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ లాస్ ఏంజెల్స్ నిరసనలతోనే(LA Protests) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.అక్రమ వలసదారుల్ని గుర్తించి వెనక్కి పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో బలవంతపు తనిఖీలు, అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామంతో లాస్ ఏంజెల్స్లో ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. క్రమంగా అవి మిగతా ప్రాంతాలకు విస్తరించాయి. అయితే తాజాగా.. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో సోదాలను ఆపేయాలంటూ ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ICE)కి ఆదేశాలు వెళ్లాయి.ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించగా.. ముగ్గురు ఉన్నత అధికారులు సైతం ధృవీకరించారు. అంతకు ముందు.. ట్రంప్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘‘వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా త్వరలోనే ఓ ఉత్తర్వును జారీ చేస్తాను’’ అన్నారు. ఈ నేపథ్యంలో లాస్ఏంజెలెస్ ప్రాంతంలోని వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టరంట్లలో సోదాలు నిలిపివేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు ఐసీఈ అధికారులు గత శుక్రవారం లాస్ఏంజెల్స్లోని డౌన్టౌన్లో సోదాలు ప్రారంభించడంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. క్రమంగా దేశమంతటా విస్తరిస్తుండడంతో .. లాస్ఏంజెల్స్లో భారీస్థాయిలో నేషనల్ గార్డ్లను మోహరింపునకు ట్రంప్ ఆదేశించారు. దీంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులను అడ్డుకునేందుకు మరో 2వేల మంది నేషనల్ గార్డులను మోహరించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ చర్యలను కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్తోపాటు స్థానిక పోలీసు అధికారులు వ్యతిరేకించారు. గవిన్ దీనిపై ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అధ్యక్షుడి ఆదేశాలు చెల్లవని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అయితే.. ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును తొమ్మిదో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయానికి పరోక్షంగా మద్దతు పలికింది. కోర్టు నిర్ణయంతో నేషనల్ గార్డు సిబ్బందికి అడ్డంకి తొలగిపోగా.. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆపై ఈ నిర్ణయానికి తాత్కాలిక బ్రేక్ వేస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయం

మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
లక్నో: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉత్తర ప్రదేశ్ నుంచి కోల్కతా బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది ప్రయాణాన్ని నిలిపివేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం (జూన్15)న ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని హిండన్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియాకు చెందిన ఎయిరిండియా (IX 1511) విమానం కోల్కతాకు బయల్దేరాల్సి ఉంది.అయితే,ఎయిర్పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉండగా.. సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపంపై సమాచారం అందుకున్న ఇంజినీర్లు విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించే పనిలోపడ్డారు. ఫలితంగా, భద్రతా కారణాల దృష్ట్యా టేకాఫ్ వాయిదా పడింది. తిరిగి విమాన కార్యకలాపాలపై అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానం కోసం పడిగాపులు కాస్తున్నారు.

Air India plane crash: దొరికిన మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతికఖాయం
గాంధీ నగర్: భారత విమానయాన రంగంలో అత్యంత ఘోర విషాదం నింపిన అహ్మదాబాద్ ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India plane crash) విమాన ప్రమాద మృతులు వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆదివారం ఒంటిగంట సమయంలో గుజరాత్ బీజేపీ సీనియర్ నేత మాజీ సీఎం విజయ్ రుపానీ (Vijay Rupani) భౌతికకాయాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా రూపానీ భౌతికకాయాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజ్ కోట్లో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన AI171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. అందులో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. మృతుల్లో 68 ఏళ్ల రూపానీ ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోని కూలిపోయింది. విమానాశ్రయ రన్వే నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మేఘానీ నగరం ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణికులు సహా, మెడికల్ కాలేజీలో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులు,డాక్టర్లు,క్యాంటిన్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.Confirmed: Former Gujarat CM Vijay Rupani lost his life in the tragic Air India crash in Ahmedabad on June 12.At around 11:10 AM today, his DNA matched with the recovered remains.A huge loss for Gujarat and the nation.#VijayRupani #AirIndiaCrash #Ahmedabad pic.twitter.com/KlKsoZAgIp— AISHVARYA JAIN (@aishvaryjain) June 15, 2025

Air India Plane Crashed: వీరంతా మృత్యువును తప్పించుకున్నారిలా..
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం చరిత్రలో పెను విషాదంగా నిలిచిపోనుంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతి చెందారు. విశ్వాస్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రం ప్రమాదం నుంచి బయపడ్డారు. అయితే తల్లి మాట కారణంగా యమన్ వ్యాస్, సరైన పత్రాలు లేక జామిని, ప్రియా పటేల్, ట్రాఫిక్లో చిక్కుకుపోయి భూమి చౌహాన్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ప్రమాదం జరిగిన జూన్ 12న గుజరాత్కు చెందిన యమన్ వ్యాస్ అదే విమానంలో ఎక్కేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. కుమారునికి వీడ్కోలు పలికే సమయంలో వ్యాస్ తల్లి భావోద్వేగానికి లోనయ్యింది. ‘కొన్ని రోజులు ఇక్కడే ఉండవచ్చు కదా’ అని అడిగింది. అంతే తల్లి ప్రేమకు తలొగ్గిన వ్యాస్ వెంటనే తన విమాన టికెట్ను రద్దు చేసుకున్నాడు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకెన్లకే నేల కూలింది. విమాన ప్రమాదం వార్త వినగానే యమన్ దిగ్బ్రాంతికి లోనయ్యారు. తన తల్లే తనను కాపాడిందని ఆయన మీడియాకు తెలిపారు.యమన్ వ్యాస్ కొన్నేళ్లుగా యూకేలో పనిచేస్తున్నారు. రెండేళ్ల తర్వాత వడోదర వచ్చారు. తన కుటుంబంతో కొన్ని రోజులు ఉన్నాక, తిరిగి లండన్కు బయలుదేరారు. అయితే అతని తల్లి పట్టుబట్టడంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అహ్మదాబాద్లోని చంద్లోడియాకు చెందిన జామిని, ప్రియా పటేల్ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరు తమ స్నేహితుని ఆహ్వానం మేరకు ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరు విజిటర్ వీసాపై ప్రయాణానికి బయలుదేరారు. అయితే వీరి దగ్గర కొన్ని పత్రాలు లేని కారణంగా, విమానం ఎక్కేందుకు అనుమతి లభించలేదు. దీంతో నిరాశగా ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విమాన ప్రమాదం గురించి వారికి తెలిసింది. ఇదేవిధంగా భారత్కు వచ్చిన బ్రిటన్ నివాసి భూమి చౌహాన్ అహ్మదాబాద్లో భారీ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. దీంతో ఆమె విమానాశ్రయానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో ఆమె విమానం ఎక్కలేకపోయారు. ఇది కూడా చదవండి: Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్ఏ పరీక్షలు ముమ్మరం

Varanasi: నిషేధిత జోన్లో తేజ్ ప్రతాప్.. విచారణకు ఆదేశాలు
వారణాసి: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ మరోమారు వార్తల్లో నిలిచారు. వారణాసిలోని విశ్వనాథుని ఆలయంలోని నిషేధిత ‘రెడ్ జోన్’ లోపలికి తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాశీ విశ్వనాథ ఆలయ పరిపాలన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హై-సెక్యూరిటీ జోన్లో కాశీ విశ్వనాథ్ కారిడార్లోని గర్భగుడి ప్రాంగణం కూడా ఉంది. ఇక్కడికి అనధికారిక ప్రవేశాన్ని నిషేధించారు. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ జోన్లలో తిరుగాడుతున్నట్లు ఉన్న వీడియో గురువారం సోషల్ మీడియాలో కనిపించింది. बाबा विश्वनाथ का आशीर्वाद हो,माँ गंगा का निर्मल पवित्र घाट हो,पूरी दुनिया को मैं भूल जाऊं औरबनारस में मेरा भोला मुझे याद हो हर हर महादेव बोलना ही होगा। ...#Varanasi pic.twitter.com/Uq5tS32evB— Tej Pratap Yadav (@TejYadav14) June 13, 2025దీనిపై కాశీ విశ్వనాథ ఆలయ సీఈవో విశ్వ భూషణ్ మిశ్రా మాట్లాడుతూ ఆన్లైన్లో కనిపించిన ఈ వీడియోను ఆలయ అధికారులు గమనించారని అన్నారు. వారు దీనిని కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)తో స్థానిక పోలీసులకు తెలియజేశారన్నారు. వారు సమగ్ర దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇటీవలి కాలంలో తేజ్ ప్రతాప్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. మే 25న అతని తండ్రి లాలూ ప్రసాద్ అతన్ని రాష్ట్రీయ జనతాదళ్ నుండి బహిష్కరించారు. అతనికి తమ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మరోవైపు తేజ్ ప్రతాప్ విడాకులపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అలాగే తేజ్ ప్రతాప్ 12 ఏళ్లుగా ఒక మహిళతో సంబంధంలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. #WATCH | Ghaziabad, UP | On Tej Pratap Yadav's viral reel from the Kashi Vishwanath Temple premises, CEO of Kashi Vishwanath Temple, Vishwa Bhushan Mishra, says, "The area inside the temple is a restricted area. One cannot take a mobile phone or a camera there. However, we… pic.twitter.com/qatUGV0NDL— ANI (@ANI) June 14, 2025ఇది కూడా చదవండి: Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్ఏ పరీక్షలు ముమ్మరం
ఎన్ఆర్ఐ

NRI News : వెన్నుపోటు దినం యూకేలో ఎన్ఆర్ఐల నిరసన
జూన్ 4 వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా వైస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో UK లోని ఈస్ట్ లండన్ మరియు లెస్టర్ నుంచి నిరసన తెలియజేసారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అనేక సంక్షేమ పథకాలనుతుంగలోకి వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి కిషోర్ రెడ్డి , చల్లా మధుసూదన్ యాదవ్ , ప్రణయ్ గడిమే ఆనంద్ అక్కిదాసు, రామిరెడ్డి జయచంద్రా రెడ్డి , చలపతి గుర్రం,యశ్వంత్ గరికపాటి,సాయి ప్రదీప్ పాల్గన్నారు.ఒకరికి ముగ్గురు చొప్పున( చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురందరేశ్వరి ) చెప్పిన అబద్దాన్ని పదే పదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టిన ఏపీ సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విద్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

న్యూయార్క్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ వేడుకలతో పాటు బాలోత్సవ్ ను నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గసభ్యులు మంచి ఏర్పాట్లు చేయటంలో వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగాయి. అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు. సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు మరింత ఊపును తెచ్చారు. బాలోత్సవ్లో భాగంగా ప్రవాసుల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి అల్లరి చేశారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నైటా తరపున బహుమతులు అందించారు.కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: న్యూజిలాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్
క్రైమ్

ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...
నెహ్రూసెంటర్: భర్త మరణం భార్యకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివాహ వార్షికోత్సవం తర్వాత రోజే విద్యుత్ ప్రమాదరూపంలో మృత్యువాత పడడంతో ఆ కుటుంబ విషాదంలో మునిగిపోయింది. మరోచోట కరెంట్ షాక్తో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న క్రాంతికుమార్ (32) ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తూ శనివారం విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు తీసుకురాగా అప్పటికే మృతిచెందాడు. క్రాంతికుమార్ మృతితో భార్య, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.సంతోషం.. మరునాడే విషాదంమృతుడు క్రాంతికుమార్ దంపతులు శుక్రవారం పెళ్లిరోజు వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన కాంత్రి మరుసటి రోజే మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తమను సంతోషంగా చూసుకుంటాడనుకున్న భర్త మృతితో భార్య రోదనలు మిన్నంటాయి.ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...క్రాంతికుమార్కు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నేడు అందరూ ఫాదర్స్ డే జరుపుకుంటుండగా చిన్నారులకు మాత్రం కన్నతండ్రి దూరమైన పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆ చిన్నారులు తమ తండ్రి చనిపోయిన విషయాన్ని సైతం తెలుసుకునే వయస్సులో లేకపోవడం కలిచివేస్తుంది.ఇనుగుర్తిలో ఘటన...జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. డోర్నకల్లో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇనుగుర్తి శివారు వీరారెడ్డిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అదే గ్రామానికి చెందిన బూర్గుల అంబేడ్కర్కు తీవ్ర గాయాలయ్యాయి. జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లో ఆస్పత్రికి తరలించారు.

ఆస్తినంతా ప్రియురాలికి ఇచ్చాడు
కర్ణాటక: వారం రోజుల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో భార్య కారణాలను వెల్లడించింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47) నిద్రపోతుండగా భార్య కవిత (44) పెట్రోలు పోసి తగలబెట్టడంతో చనిపోయాడు.పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారించారు. తమకు పెళ్లి జరిగి 22 ఏళ్లు అయ్యిందని, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారని, తమకు ఆస్తి, డబ్బు, నగలు అన్నీ ఉన్నాయని, కుటుంబంతో బాగానే ఉన్నామని తెలిపింది.అయితే భర్త కూలి పని చేసే చోట మరో మహిళ మంజులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఇంట్లో ఉన్న నగలు మంజులకు అందజేశాడు. ఆస్తిని విక్రయించి ఆమెకు ముట్టజెప్పాడని తెలిపింది. రోజూ తాగి వచ్చి అందంగా లేవని నన్ను దూషించేవాడని, దీంతో హత్య చేశానని చెప్పింది. కాగా తండ్రి మరణించి, తల్లి జైలుకెళ్లి ముగ్గురు పిల్లలు బోరుమని విలపించారు.

ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
సనత్నగర్(హైదరాబాద్): ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏలూరు జిల్లా అడ్డగిద్దల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజు, కొక్కిణి శ్రావణి (30) దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు నడుస్తుండడంతో మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం శ్రావణిని ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్స్లో ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస్, దుర్గాలు తమ వద్దకు తీసుకువచ్చారు. గత ఆరు నెలలుగా తల్లిదండ్రులతో కలిసి ఉంటూ స్థానికంగా హౌస్ కీపింగ్ పనులు చేస్తుంది. మూడు రోజుల క్రితం వీరు ఊరిలో ఉన్న అల్లుడు రాజు వద్దకు వెళ్లి తమ కూతురు కాపురం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒప్పించి అతనిని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపం చెందిన శ్రావణి శనివారం ఉదయం 8.30 గంటలకు జనప్రియా అపార్ట్మెంట్స్ ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త
నెల్లూరు(క్రైమ్): భార్య చీటికి మాటికి గొడవపడుతుండడంతో విసిగిపోయిన భర్త రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన నెల్లూరులో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు బాలాజీనగర్ గౌడహాస్టల్ సమీపంలో ఎల్.విజయ్చంద్ర, శైలజ(46) దంపతులు నివసిస్తున్నారు. వారికి బీటెక్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులున్నారు.విజయ్చంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. శైలజ తండ్రి చెన్నైలో ఉంటూ మృతిచెందారు. ఆయనకు చెందిన ఆస్తులు తమకు రావాలంటే కొంత నగదు ఖర్చు చేయాలని ఆమె భర్తకు చెప్పి అతనిచేత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేయించింది. దీంతో విజయ్చంద్ర అప్పులపాలయ్యాడు.ఈ క్రమంలోనే భర్తపై ఆమె అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టింది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిత్యం భర్తతో గొడవపడుతుండేది. కుమారులు ప్రశి్నస్తే వారితోనూ గొడవపడేది. శనివారం మధ్యాహ్నం విజయ్చంద్ర ఇంట్లోనే ఉన్నారు. కుమారులను భోజనం తీసుకురమ్మని బయటకు పంపించారు. ఈక్రమంలో దంపతుల నడుమ మరోమారు గొడవ జరిగింది.ఆగ్రహానికి గురైన భర్త పక్కనే ఉన్న రోకలిబండతో శైలజ తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పెద్దకుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వీడియోలు


ఆకాశమంత విషాదానికి అసలు కారణం అదేనా?


ఈనెల 18న పల్నాడు జిల్లాకు YS జగన్ మోహన్ రెడ్డి


ఉత్తమ చిత్రంగా కల్కి.. ఈల వేసి రచ్చ చేసిన నాగ్ అశ్విన్ భార్య


కొల్లు రవీంద్రకి పేర్ని కిట్టు స్ట్రాంగ్ వార్నింగ్


గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు


జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటేనే మోసం


నీట్ లో ప్రతిభ చూపిన విద్యార్థిపై రోజా ప్రశంసలు


కూటమి ప్రభుత్వంపై TDP MLA ఫైర్


'హ్యాపీ ఫాదర్స్ డే నాన్న' అంటూ వైఎస్ జగన్ ట్వీట్


ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాఫ్టర్.. ఏడుగురు మృతి