Bihar: ముఖ్యమంత్రి ఎవరు?
పట్నా: బిహార్లో ఎన్డీయే సీట్ల సునామీ సృష్టించింది. ఇక ముఖ్యమంత్రి ఎవరన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారా? లేక మరో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే.. మళ్లీ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అంటూ సోషల్ మీడియాలో జేడీ(యూ) పోస్టు చేసింది. కొద్దిసేపటికే దాన్ని తొలగించడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. నితీశ్ను మరోసారి సీఎంను చేయడం బీజేపీకి ఇష్టంలేదని ప్రచారం సాగుతోంది. నితీశ్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి, బీజేపీ నాయకుడినే గద్దెనెక్కిస్తారని అంచనా వేస్తున్నారు. నిజానికి తమ కూటమి గెలిస్తే నితీశ్ కుమారే సీఎం అంటూ ఎన్నికల ముందు బీజేపీ పరోక్షంగా సంకేతాలిచి్చంది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. నితీశ్ సైతం మళ్లీ కుర్చి ఎక్కాలని ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన భావిస్తున్నారు. శుక్రవారం రాజధాని పటా్నలో భారీగా పోస్టర్లు, బోర్డులు వెలిశాయి. ‘‘25 నుంచి 30.. మళ్లీ నితీశ్’’ అంటూ అభిమానులు వాటిని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర తరహా ప్రయోగం బిహార్ ఎన్నికల్లో బీజేపీ తన బలం చాటుకుంది. ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(యూ)పై ఆధారపడాల్సిన అవసరం చాలావరకు తగ్గిపోయింది. జేడీ(యూ)ను పక్కనపెట్టి, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్)తో పొత్తు కొనసాగిస్తే బీజేపీ సొంతంగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం తేలికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం జేడీ(యూ) అండతో మనుగడ సాగిస్తోంది. కాబట్టి జేడీ(యూ) స్నేహాన్ని వదులుకొనే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగా, బిహార్లో మహారాష్ట్ర తరహా ప్రయోగం చేసే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్రలో 2024 ఎన్నికల్లో శివసేన(షిండే) నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కలిసి పోటీ చేసి అత్యధిక స్థానాలు గెల్చుకున్న బీజేపీ చివరకు తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్కే సీఎంగా కిరీటం అప్పగించింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సమీకరణాలు కలిసొస్తే ఆయన బిహార్ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. బిహార్ ఎన్డీయేలో పెద్దన్న జేడీ(యూ). ఈసారి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జేడీ (యూ)తో సమానంగా సీట్లు పంచుకుంది. రెండు పక్షాలు 101 సీట్ల చొప్పున తీసుకున్నాయి. ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు నెగ్గి, జేడీ(యూ)పై స్పష్టమైన ఆధిపత్యం సాధించింది. ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది.
ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)
హారర్ సఫారీ!.. చిరుత భయంకర దాడి
సాధారణంగా సఫారీ అంటే అద్భుతమైన అనుభూతి.. కానీ, బెంగళూరులోని బన్నేరుఘట్ట జాతీయ పార్కుకు వెళ్లిన ఒక చెన్నై మహిళకు మాత్రం అది భయంకరమైన పీడకలగా మిగిలిపోయింది. అడవి జంతువుల్ని చూసేందుకు ఆమె ఉత్సాహంగా సఫారీ బస్సులో ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి ఓ చిరుత ఒక్కసారిగా బస్సుపైకి దూకి, రక్షణ కోసం ఏర్పాటు చేసిన జాలీలోంచి ఆమె చేతిపై పంజా విసిరింది..బస్సుపైకి దూకిన చిరుత.. చెన్నైకి చెందిన 56 ఏళ్ల వహితా భాను అనే మహిళ గురువారం మధ్యాహ్నం 1 గంట స మయంలో బన్నేరుఘట్ట జాతీయ పార్కులో చిరుత సఫారీ ట్రిప్లో పాల్గొన్నారు. ఆమె కదలికలను గమనిస్తున్న చిరుత ఒక్కసారిగా బస్సు పైకప్పు పైకి లంఘించింది. అద్దం పక్కనే ఉన్న జాలీ ద్వారా లోపలికి పంజా విసిరి మహిళను గాయపరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. బస్సుపైకి చిరుత ఎక్కి, కిటికీ గుండా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. చిరుత పంజా దాడి లో వహితా భాను చేతికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం జిగానిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.A 50-year-old woman from Chennai suffered injuries to her hand after a leopard at Bannerghatta Biological Park leapt onto a safari bus and clawed her. She was immediately rushed to a hospital in Jigani and is currently stable.Following the incident, the park authorities have… pic.twitter.com/QStkaAVBxK— India Today NE (@IndiaTodayNE) November 14, 2025 భద్రత ప్రశ్నార్థకం సాధారణంగా, జంతువులు, సందర్శకుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నివారించడానికి సఫారీ బస్సులకు కిటికీలు, ఇతర రంధ్రాలపై లోహపు వైర్ మెష్ (జాలీ) అమర్చుతారు. అయితే, ఈ చిరుత ఆ జాలీలోని చిన్న ఖాళీ గుండా లోపలికి పంజా విసిరి మహిళను రక్కగలిగింది. ‘మహిళ చేతికి గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు’.. అని ఒక అధికారి వెల్లడించారు.తాత్కాలికంగా సఫారీ నిలిపివేత గతంలో కూడా చిరుత దాడి జరిగిన నేపథ్యంలో.. బస్సుల భద్రతను పూర్తిగా అంచనా వేసే వరకు, నాన్–ఏసీ బస్సు సఫారీని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘సమస్య పరిష్కారమయ్యే వరకు వాహనాల పూర్తి భద్రతను అంచనా వేస్తాం. సందర్శకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’.. అని పేర్కొన్నారు. బన్నేరుఘట్ట జాతీయ పార్కులో జరిగిన ఈ ఘటన సఫారీ వాహనాల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కనీస రక్షణ ఏర్పాట్ల విషయంలో ఏ మాత్రం చిన్న లోపం ఉన్నా.. ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఈ సంఘటన రుజువు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
దేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పతనమయ్యాయి. క్రితం రోజున భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు అంతకు మించి దిగొచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) భారీగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కూడా అమాంతం దిగివచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఉద్యోగ సంక్షోభానికి ఏఐ ముప్పు
ప్రభాస్ కొత్త సినిమా.. టెన్షన్లో ఫ్యాన్స్!
ఒక్క ఛాన్స్ ప్లీజ్: గిల్ను బతిమిలాడిన సిరాజ్.. కట్ చేస్తే..
చికెన్ పెప్పర్ రసం చేయడం వచ్చా..
రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి: 39వేల కార్లపై ఎఫెక్ట్!
దానికంటే ముందు చాలా సినిమాలు రిజెక్ట్ చేశా!
ఘోర పరాభవంపై ఆర్జేడీ ఫస్ట్ రియాక్షన్
జైలులో ఉండి ఎమ్మెల్యేగా విక్టరీ.. బిహార్ లో అసెంబ్లీ రౌడీ సీన్ రిపీట్
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ కేసులో కీలక పరిణామం
'కాంత' సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
వామ్మో.. కోబ్రా ఫ్యామిలీ రౌండప్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
ముఖ్యంగా పాలిటిక్స్లో లేరనిపిస్తోంది!
భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ..
హెచ్–1బీ పూర్తిగా బంద్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలలో లాభాలు
బిహార్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ కూటమికి షాక్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
ఓటీటీ ప్రియులకు మరో దీపావళి.. ఒక్క రోజే 20 సినిమాలు స్ట్రీమింగ్!
మరో గోల్డ్ బాండ్.. రిడంప్షన్ రేటు ప్రకటించిన ఆర్బీఐ
ఉద్యోగ సంక్షోభానికి ఏఐ ముప్పు
ప్రభాస్ కొత్త సినిమా.. టెన్షన్లో ఫ్యాన్స్!
ఒక్క ఛాన్స్ ప్లీజ్: గిల్ను బతిమిలాడిన సిరాజ్.. కట్ చేస్తే..
చికెన్ పెప్పర్ రసం చేయడం వచ్చా..
రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి: 39వేల కార్లపై ఎఫెక్ట్!
దానికంటే ముందు చాలా సినిమాలు రిజెక్ట్ చేశా!
ఘోర పరాభవంపై ఆర్జేడీ ఫస్ట్ రియాక్షన్
జైలులో ఉండి ఎమ్మెల్యేగా విక్టరీ.. బిహార్ లో అసెంబ్లీ రౌడీ సీన్ రిపీట్
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ కేసులో కీలక పరిణామం
'కాంత' సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
ముఖ్యంగా పాలిటిక్స్లో లేరనిపిస్తోంది!
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
హెచ్–1బీ పూర్తిగా బంద్
ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలలో లాభాలు
బిహార్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ కూటమికి షాక్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
ఓటీటీ ప్రియులకు మరో దీపావళి.. ఒక్క రోజే 20 సినిమాలు స్ట్రీమింగ్!
మరో గోల్డ్ బాండ్.. రిడంప్షన్ రేటు ప్రకటించిన ఆర్బీఐ
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
సినిమా
‘లవ్ ఓటీపీ’ మూవీ రివ్యూ
కన్నడ నటీనటులు అనీష్, జాన్విక, ఆరోహి నారాయణ్ మెయిన్ లీడ్స్ లో మన రాజీవ్ కనకాల, ప్రమోదిని.. పలువురు ముఖ్యపాత్రల్లో కన్నడ - తెలుగు బైలింగ్వల్ లో తెరకెక్కిన సినిమా ‘లవ్ ఓటీపీ’. పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ ఎం రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. కన్నడ, తెలుగు భాషల్లో ఈ లవ్ ఓటీపీ సినిమా నవంబర్ 14న రిలీజయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ(Love OTP Review)లో చూద్దాం.కథేంటంటే.. కాలేజీలో క్రికెటర్ అవ్వాలి అనే గోల్ తో ఉన్న స్టూడెంట్ అక్షయ్(అనీష్)ని చూసి సన(ఆరోహి నారాయణ్) ప్రేమలో పడుతుంది. అనీష్ తో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని ట్రై చేస్తుంది. కానీ అక్షయ్ తండ్రి(రాజీవ్ కనకాల) పోలీసాఫీసర్. అతనికి లవ్ అంటే అస్సలు పడదు. దీంతో అక్షయ్ లవ్ చేయడానికి భయపడతాడు. కానీ సన మొదట ఫ్రెండ్షిప్ అని అక్షయ్ లైఫ్ లోకి వచ్చి దగ్గరయి ప్రపోజ్ చేస్తుంది. ఒప్పుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరిస్తోంది. దీంతో అక్షయ్ సనని లవ్ చేయాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా సన ఎక్కడ చనిపోతుందో అని ఆమె టార్చర్ భరిస్తూ ఉంటాడు అక్షయ్. ఓ సారి క్రికెట్ లో తనకు దెబ్బ తగిలినప్ప్పుడు ఫిజియోథెరఫిస్ట్ నక్షత్ర(జాన్విక)పరిచయం అవుతుంది. నక్షత్రతో ప్రేమలో పడతాడు అక్షయ్. సనతో లవ్ స్టోరీ ఆమెకు చెప్పడంతో నక్షత్ర అర్ధం చేసుకొని ఆమె కూడా అక్షయ్ ని ప్రేమిస్తుంది. మరి నక్షత్ర - అక్షయ్ ప్రేమ సనకు తెలుస్తుందా? అక్షయ్ తండ్రికి తెలుస్తుందా? సన ఏం చేసింది? అసలు సనతో అక్షయ్ పడ్డ ఇబ్బందులు ఏంటి? చివరకు అక్షయ్ ఎవరితో ఉంటాడు? లైఫ్ లో క్రికెటర్ అవుతాడా తెలియాలంటే లవ్ OTP సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. గర్ల్ ఫ్రెండ్ టార్చర్ చేయడం అనేది వల్లభ లాంటి పలు సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో అది చాలా కామెడీగా చూపించారు. తండ్రి అంటే భయం ఉన్న ఓ అబ్బాయి అనుకోకుండా ఓ అమ్మాయిని లవ్ చేయాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు అని సిట్యువేషనల్ కామెడీతో చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా సన - అక్షయ్ లవ్ స్టోరీతో నవ్వించి ఇంటర్వెల్ కు ముందు నక్షత్రతో ప్రేమాయణం, ఆమె గురించి సనకు తెలియడంతో ఏం చేస్తుంది అని సెకండ్ హాఫ్ కి తగ్గ బ్యాంగ్ ఇచ్చారు. అయితే ఫస్ హాఫ్ అంతా నవ్వించి సెకండ్ హాఫ్ ఎమోషనల్ సైడ్ కి మార్చేశారు. సెకండ్ హాఫ్ లో అక్షయ్ ఇద్దరి మధ్య నలిగిపోవడం, సన ఏమో అక్షయ్ కావలనడం.. ఇలా ముక్కోణపు ప్రేమకథగా ఎమోషనల్ గా సాగుతుంది. ఫాదర్ ఎమోషన్ కూడా సెకండ్ హాఫె లో బాగానే వర్కౌట్ చేసారు. కానీ సెకండ్ హాఫె కొంచెం సాగదీశారు. కథ అయిపోయింది హ్యాపీ ఎండింగ్ వచ్చేస్తుంది అనుకునేలోపు ఇంకా సాగదీసి మళ్ళీ బాధాకరమైన ముగింపు ఇచ్చారు. మరి అలా ఎందుకు ముగించారో దర్శకుడికే తెలియాలి. టైటిల్ లవ్ ఓటీపీలో ఓటీపీ అంటే ఓవర్ – టార్చర్ – ప్రెజర్ అని పెట్టి టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చేలా చూసారు. ఈ సినిమా కన్నడలో తెరకెక్కించి తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. ఈ క్రమంలో చాలా డైలాగ్స్ కన్నడలోనే ఉంటాయి. కథ కూడా అంతా బెంగుళూరులోనే జరుగుతుంది. దీంతో ఒకానొక సమయంలో కన్నడ సినిమా చుస్తున్నామా అనే ఫీలింగ్ రావడం ఖాయం. ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమా సరదాగా చూడొచ్చు. ఎవరెలా చేశారంటే..అనీష్ ఓ పక్క దర్శకుడిగా సినిమాని తెరకెక్కిస్తూ నటనలో కూడా బాగా మేనేజ్ చేసాడు. టార్చర్ పెట్టె గర్ల్ ఫ్రెండ్ పాత్రలో ఆరోహి నారాయణ్ హైపర్ యాక్టివ్ గా నటించి నవ్వించింది. చివర్లో ఎమోషనల్ కూడా మెప్పించింది. మరో హీరోయిన్ జాన్విక కూడా క్యూట్ గా అలరిస్తూనే ఎమోషనల్ గా పర్వాలేదనిపించింది. రాజీవ్ కనకాలకు మంచి కామెడీ పాత్ర పడింది. చివర్లో నాన్న ఎమోషన్ కూడా బాగానే పండించారు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నాట్యరంగా నవ్విస్తాడు. ప్రమోదిని.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బెంగుళూరులో చాలా వరకు రియల్ లొకేషన్స్ లో న్యాచురల్ గా తెరకెక్కించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ పాటలు యావరేజ్. సెకండ్ హాఫ్ లో కొంత ఎడిటింగ్ చేసి సాగదీత తగ్గిస్తే బాగుండేది. గర్ల్ ఫ్రెండ్ పెట్టె టార్చర్ అనే పాయింట్ తీసుకొని ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిన అబ్బాయి పాత్రలో కామెడీగా ఎమోషనల్ గా బాగానే రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.-రేటింగ్: 2.75/5
నటుడికి మహిళ వేధింపులు.. అందరిముందే చొక్కాలాగి..
అభిమానం హద్దులు దాటకూడదు. అవతలి వ్యక్తికి ఇబ్బంది కాకూడదు. కానీ ఓ మహిళ మాత్రం మలయాళ బుల్లితెర నటుడు రాయ్జన్ రాజన్ను ఆరేళ్లుగా ఇబ్బందిపడుతోంది. తను చెప్పింది చేయకపోతే చంపుతానని బెదిరిస్తోంది. రాజన్తో కలిసి సీరియల్ చేస్తున్న నటి మృదుల విజయ్ ఈ వేధింపుల వ్యవహారాన్ని బయటపెట్టింది.అశ్లీల మెసేజ్లుమృదుల మాట్లాడుతూ.. ఆరేళ్లుగా ఓ అమ్మాయి రాజన్కు అసభ్యకర మెసేజ్లు చేస్తోంది. తను ఒక జూనియర్ ఆర్టిస్ట్.. అప్పుడప్పుడు సెట్కు సైతం వచ్చేది. ఆమె మెసేజ్లకు రాజన్ స్పందించకపోతే పిచ్చిపట్టినట్లే ప్రవర్తించేది. వేరేవేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి దుర్భాషలాడేది. తర్వాత తనే క్షమాపణలు చెప్పేది. ఆ తర్వాత ఎప్పటిలాగే మళ్లీ అశ్లీల మెసేజ్లు చేసేది. మూడేళ్ల నుంచి ఇది మరీ ఎక్కువైంది.అందుకే మౌనంగా..ఆరేళ్లుగా ఇంత జరుగుతున్నా రాజన్ స్పందించకపోవడానికి కారణం ఉంది. అమ్మాయి బయటకు వచ్చి ఏదైనా చెప్తే నిజానిజాలు తెలుసుకోకుండా అందరూ తనకే సపోర్ట్ చేస్తారు. అబ్బాయి చెప్పేదాన్ని నమ్మడానికి ఎవరూ ఇష్టపడరు. అతడికి ఎవరూ అండగా నిలబడరు. కానీ, రాజన్కు ఓపిక నశించి ఎందుకిలా హింసిస్తున్నావ్? అని ఓరోజు ఎదురుప్రశ్నించాడు. అందుకామె తానే తప్పూ చేయలేదని దబాయించింది. చొక్కా పట్టుకుని లాగి..ఒకసారి సెట్కు వచ్చి రాజన్తో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆయన సైలెంట్గా వెళ్లిపోతుంటే అతడి చొక్కా పట్టుకుని లాగింది. మరోసారి తనను సెట్లోకి రానివ్వరని తెలిసి బురఖా వేసుకుని లొకేషన్కు వచ్చింది. రాజన్తో బలవంతంగా చాక్లెట్ తినిపించాలని చూసింది. నన్ను లెక్కచేయకపోతే బీర్ బాటిల్తో తల పగలగొడతా అని అతడ్ని బెదిరించింది. సీరియల్స్ఈరోజు చాక్లెట్తో వచ్చిన ఆమె రేపు యాసిడ్తో రావొచ్చేమో! ఎవరికి తెలుసు? అతడిపై వేధింపులకు పాల్పడ్డ తనపై పోలీసులు కేసు నమోదు చేశారు అని తెలిపింది. రాజన్.. మకల్, ఆత్మసాక్షి, ప్రియపెట్టవల్, తింకల్ కలమాన్, భావన, ఇష్టం మంత్రం అనే మలయాళ సీరియల్స్ చేశాడు. జానీ జానీ ఎస్ అప్పా సినిమాలోనూ యాక్ట్ చేశాడు.చదవండి: కడుపులో ఉండగా వదిలించుకోవాలని చూశారు: ఇమ్మూ కంటతడి
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
తెలుగు సినీ నటి పింకీ సుదీప (Pinky Sudeepa) తల్లిగా ప్రమోషన్ పొందింది. తనకు కొడుకు పుట్టాడన్న శుభవార్తను ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా బాబు బారసాల ఫంక్షన్ ఘనంగా చేసింది. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో బాబును నవమోసాలు మోసిన సుదీప పొట్టను ఆమె భర్త శ్రీరంగనాథ్ ఆప్యాయంగా ముద్దాడాడు. తర్వాత దంపతులిద్దరూ బాబును ఎత్తుకుని చూపించారు. ఇది చూసిన అభిమానులు ఆమెకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాసుదీప.. 1994లో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు, బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో నటించింది. నువ్వు నాకు నచ్చావ్ మూవీతో పింకీగా పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొంది. షోలో ఉన్నప్పుడు... తనకు గర్భ స్రావం అయిన విషయాన్ని చెప్తూ ఎమోషనలైంది. తాను 2015లో తొలిసారి గర్భం దాల్చానని, కానీ థైరాయిడ్ ఎక్కువవడం వల్ల బిడ్డను కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Pinky Sudeepa (@pinky_sudeepaofficial) చదవండి: పెళ్లిరోజే గుడ్న్యూస్ చెప్పిన బాలీవుడ్ హీరో
'ఐ-బొమ్మ' నిర్వాహకుడు అరెస్ట్
సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ (i-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కరేబియన్ దీవుల్లో ఉంటూనే ఐబొమ్మ వెబ్సైట్ను రవి నిర్వహిస్తున్నట్లు వారు గుర్తించారు. ఫ్రాన్స్ నుంచి తాజాగా అతను హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు సమాచారం రావడంతో పక్కా ప్లాన్తో కూకట్పల్లిలో రవిని అదుపులో తీసుకున్నారు. భార్యతో విడాకులు తీసుకుని ఇమ్మడి రవి ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.సినీ పరిశ్రమకు సుమారు రూ. 3 వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చేకూర్చిన రవి అకౌంట్లో ఉన్న రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ కాపీని ఐబొమ్మలో రిలీజ్ చేయడంతో సినీ పరిశ్రమ భారీగా నష్టపోతుందని నిర్మాతలు వాపోయిన విషయం తెలిసిందే.సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్ను పైరసీ చేస్తున్న ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు గట్టిగానే కొనసాగించారు. కొద్దిరోజుల క్రితం థియేటర్లో సినిమాను రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న కొందరిని అరెస్టు చేశారు. అయితే, పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఐబొమ్మ వెబ్సైట్పై కూడా దృష్టి పెట్టారు. దీంతో ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
న్యూస్ పాడ్కాస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
క్రీడలు
IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్..
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడపట్టేయడం (Neck Sprain)తో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ 35 ఓవర్ వేసిన సైమన్ హార్మర్ బౌలింగ్లో రెండో బంతిని సుందర్ ఔటయ్యాక గిల్ క్రీజులోకి వచ్చాడు. అదే ఓవర్లో ఐదో బంతికి స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. ఈ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ మెడ పట్టేసింది. దీంతో గిల్ నొప్పితో విల్లవిల్లాడు. అతడు మెడను పూర్తిగా కదల్చలేని విధంగా కనిపించాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి గిల్ మాత్రం కాస్త ఆసౌకర్యంగానే కన్పించాడు.ఈ క్రమంలో ఫిజియో సాయంతో గిల్ మైదానాన్ని వీడాడు. గిల్ బ్యాటింగ్కు తిరిగి వస్తాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టీమిండియా సఫారీల కంటే ఇంకా 21 పరుగుల వెనకంజలో ఉంది. కాగా అంతకుముందు పర్యాటక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలింది. కాగా గిల్ గాయంపై బీసీసీఐ తాజాగా అప్డేట్ ఇచ్చింది. గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. గిల్ రికవరీ బట్టి ఈ రోజు ఆటలో పాల్గొనడంపై నిర్ణయం తీసుకోబడుతుంది అని బీసీసీఐ ఎక్స్లో రాసుకొచ్చింది.చదవండి: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
తడబడుతున్న భారత బ్యాటర్లు.. లంచ్ బ్రేక్కు స్కోరెంతంటే?
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు సైతం తడబడుతున్నారు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం రవీంద్ర జడేజా(11), ధ్రువ్ జురెల్(4) ఉన్నారు.37-1 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 ఓవర్ల తర్వాత వాషింగ్టన్ సుందర్(29) వికెట్ కోల్పోయింది. ఆచితూచి ఆడిన సుందర్ సఫారీ స్పిన్నర్ హార్మర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చి కెప్టెన్ శుభ్మన్ గిల్(4) మెడ పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులో నిలదొక్కుకున్న కేఎల్ రాహుల్(39), రిషబ్ పంత్(27) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇప్పటివరకు జానెసన్, బాష్, హార్మర్, మహారాజ్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 21 పరుగుల వెనకంజలో ఉంది.తుది జట్లుదక్షిణాఫ్రికా : ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్భారత్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
సీఎస్కేలోకి శాంసన్, రాజస్తాన్లోకి జడేజా..
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య స్వాప్ ట్రేడ్ డీల్ అధికారికంగా పూర్తి అయింది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ను సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా సీఎస్కే స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్లను రాజస్తాన్కు పంపింది.గత సీజన్కు ముందు జడేజాను రూ.18 కోట్ల భారీ వెచ్చించి సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జడేజా ధరను రూ.14 కోట్లకు తగ్గించి రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రవీంద్ర జడేజా రూ.14 కోట్లు అందుకోబోతున్నాడు. సామ్ కుర్రాన్ను మాత్రం రూ. 2.4 కోట్ల ప్రస్తుత ధరకే రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది. అయితే సంజూ శాంసన్ మాత్రం ధర మారలేదు. అతడు సీఎస్కే నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. ఈ ట్రేడ్ డీల్ను సీఎస్కే సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. తమ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించినందుకు సీఎస్కే యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. జడేజా 12 సీజన్ల పాటు సీఎస్కే తరపున ఆడాడు.లక్నోకి సచిన్ తనయుడు..ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నేడే ఆఖరి రోజు కావడంతో మరికొన్ని ముఖ్యమైన ట్రేడ్ డీల్స్ జరిగాయి. సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది.అదేవిధంగా లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను కోల్కతా నైట్రైడర్స్ నుంచి ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల బెస్ప్రైస్కు ట్రేడ్ చేసుకుంది. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను అతడి ధర రూ.30 లక్షలకు లక్నో ట్రేడ్ చేసుకుంది.Aaj rumour nahi, headline likhna. Ravindra 𝑻𝒉𝒂𝒍𝒂𝒑𝒂𝒕𝒉𝒚 Jadeja is coming home ⚔️🔥 pic.twitter.com/XJT5b5plCy— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2025ఇప్పటివరకు జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..1.రవీంద్ర జడేజా- చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్ 2. సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ టూ చెన్నై సూపర్ కింగ్స్3. సామ్ కుర్రాన్ -చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్4. మహ్మద్ షమీ- సన్రైజర్స్ హైదరాబాద్ టూ లక్నో సూపర్ జెయింట్స్5. నితీష్ రాణా- రాజస్థాన్ రాయల్స్ టూ ఢిల్లీ క్యాపిటల్స్ 6.అర్జున్ టెండూల్కర్- ముంబై ఇండియన్స్ టూ లక్నో సూపర్ జెయింట్స్ 7. మయాంక్ మార్కండే- కోల్కతా నైట్ రైడర్స్ టూ ముంబై ఇండియన్స్8. డోనోవన్ ఫెరీరా - ఢిల్లీ క్యాపిటల్స్ టూ రాజస్థాన్ రాయల్స్9. శార్దూల్ ఠాకూర్ - లక్నో సూపర్ జెయింట్స్ టూ ముంబై ఇండియన్స్
యాషెస్ తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్కు సమయం అసన్నమవుతోంది. నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందుకు ఆతిథ్య ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.హాజిల్వుడ్ ప్రస్తుతం తొడ కండరాల(హ్యామ్స్ట్రింగ్) గాయంతో బాధపడుతున్నాడు. ఆసీస్ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్లో విక్టోరియాతో జరిగిన మ్యాచ్లో జోష్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే మైదానం నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత అతడిని స్కాన్ కోసం అస్పత్రి తరలించారు. అయితే అతడిది తీవ్రమైన గాయం కానప్పటికి కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి టెస్టుకు అతడు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీకరించింది. ఆసీస్ సెలక్టర్లు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మైకేల్ నేసర్ జట్టులోకి చేర్చారు. హేజిల్వుడ్ గాయం కారణంగా, ఫాస్ట్ బౌలర్ బ్రెండన్ డాగెట్ ఆసీస్ తరపున టెస్టు అరంగేట్రం చేసే అవకాశముంది.తొలి టెస్టుకు ఆస్ట్రేలియా అప్డేటడ్ స్క్వాడ్స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్చదవండి: IPL 2026: కావ్య మారన్ సంచలన నిర్ణయం..?
బిజినెస్
ఇప్పుడు డిమాండంతా ఇలాంటి ఇళ్లకే..
కరోనా మహమ్మారి తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,300 చ.అ.ల్లోని 2 బీహెచ్కే, 1,500 చ.అ. నుంచి 2,500 చ.అ.ల్లోని 3 బీహెచ్కే అపార్ట్మెంట్లకు డిమాండ్ ఏర్పడిందని ఓ సంస్థ తన సర్వేలో వెల్లడించింది.నానక్రాంగూడ, కోకాపేట, నార్సింగి, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పాజెక్ట్ల గురించి విచారణ పెరిగింది. అలాగే ఆ ఏరియాల్లోనే కొత్త ప్రాజెక్ట్లు ఎక్కువగా లాంచింగ్స్ జరుగుతున్నాయి. మణికొండ, కూకట్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.చందానగర్లో అద్దెల వృద్ధి 3.54 శాతం, టోలిచౌకీలో 3.42 శాతం, మియాపూర్లో 3.10 శాతం, మణికొండలో 3.34 శాతం, కూకట్పల్లిలో 3.04 శాతం, గచ్చిబౌలిలో 2.98 శాతం, కొండాపూర్లో 3.11 శాతం, హైటెక్సిటీలో 3.15 శాతంగా ఉంది. హైదరాబాద్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 12 వేల ఇన్వెంటరీ ఉంది. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో గృహాల ధరలు పెరిగాయి.
జీసీసీల్లో 40 లక్షల కొత్త కొలువులు
ముంబై: దేశీయంగా భారీగా ఏర్పాటవుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హైరింగ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. 2029–30 నాటికి కొత్తగా 28 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని టీమ్లీజ్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం భారత్లో 1,800 జీసీసీలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్న జీసీసీల్లో ఇది 55 శాతం. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వీటిలో 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉండగా, ఎగుమతులపరంగా 64.6 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించాయి. సంఘటిత ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధికి భారత జీసీసీ వ్యవస్థ మూలస్తంభంగా ఎదుగుతోందని టీమ్లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. కొత్త రిక్రూట్స్లో 14–22 శాతం మంది ఏఐ, క్లౌడ్, డేటా ఇంజినీరింగ్లాంటి డిజిటల్ నైపుణ్యాలు గల ఫ్రెషర్స్ ఉండబోతున్నారని పేర్కొన్నారు. మిగతా 76–86 శాతం మంది మధ్య స్థాయి ప్రొఫెషనల్స్ ఉంటారని వివరించారు. కఠినతరమైన చట్టాలు.. వేగంగా విస్తరిస్తున్న జీసీసీలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలో ఏటా 2,000కు పైగా లీగల్ నిబంధనలను పాటించాల్సి ఉంటోంది. కారి్మక, ట్యాక్స్, పర్యావరణ చట్టాలు మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. వీటికి అనుగుణంగా జీసీసీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాల్సి ఉంటుందని టీమ్లీజ్ రెగ్టెక్ సహ వ్యవస్థాపకుడు రిషి అగర్వాల్ తెలిపారు. తదుపరి విధానకర్తలు, పరిశ్రమ, విద్యారంగం ఏ విధంగా డిజిటల్ నైపుణ్యాలు గల, నిబంధనలకు అనుగుణంగా పని చేయగలిగే సిబ్బందిని తయారు చేసుకుంటాయనే దానిపైనే జీసీసీల విస్తరణ అనేది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
నిధుల వేటలో క్విక్ కామర్స్..
క్విక్ కామర్స్ విభాగంలో పోటీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కార్యకలాపాల విస్తరణ కోసం కంపెనీలు నిధుల వేటలో పడ్డాయి. క్విప్ (క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్) ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించుకునే ప్రతిపాదనకు స్విగ్గీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ నిధుల సమీకరణతో పాటు ర్యాపిడోలో వాటాల విక్రయం రూపంలో మరో రూ. 2,400 కోట్లు కూడా లభిస్తే స్విగ్గీ దగ్గర నిధుల నిల్వలు సుమారు రూ. 17,000 కోట్లకు చేరతాయనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు, జెప్టో కూడా జోరుగా నిధులను సమీకరించుకుంటోంది. గత రెండేళ్లలో దాదాపు 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 17,000 కోట్లు) సేకరించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ పెన్షన్ ఫండ్స్లో ఒకటైన కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టం ఏకంగా 450 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. దేశీ క్విక్ కామర్స్ మోడల్ సామర్థ్యాలపై సంస్థాగత ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అటు మరో సంస్థ జొమాటో 2024లో క్విప్ రూపంలో రూ. 8,500 కోట్లు సమీకరించింది. బ్లింకిట్ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులు ఉపయోగపడ్డాయి.రిలయన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటాకి చెందిన బిగ్బాస్కెట్ లాంటి సమృద్ధిగా నిధులున్న దిగ్గజాలు రంగంలోకి దూకుడుగా దిగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నిధుల సమీకరణ అనేది రాబోయే రోజుల్లో పోటీ మరింత తీవ్రమైతే దీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని భావిస్తున్న కంపెనీల వ్యూహాలకు సంకేతాలని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బడా కంపెనీలు బరిలోకి దిగడంతో బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించి మరీ దక్కించుకున్న ప్రస్తుత మార్కెట్ వాటాను నిలబెట్టుకోవడం అంకుర సంస్థలకు కష్టమవుతుందని వివరించాయి. దీంతో రాబోయే రెండేళ్లలో కొత్త మార్కెట్లు, కొత్త మౌలిక సదుపాయాలు, కొత్త ఉత్పత్తులపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. దిగ్గజాల వ్యూహాలు.. క్విక్ కామర్స్ విభాగంలోకి బడా కంపెనీలు కాస్త లేటుగా ప్రవేశించినా, లేటెస్ట్ వ్యూహాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ 2024 ఆగస్టులో మినిట్స్ పేరిట డార్క్ స్టోర్స్ను ప్రారంభించింది. ఏడాది కూడా తిరగకుండానే 2025 ఏప్రిల్ నాటికి వీటి సంఖ్యను మూడు రెట్లు పెంచింది. ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని 800కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అమెజాన్ నెమ్మదిగా బెంగళూరులో కార్యకలాపాలు ప్రారంభించి ఢిల్లీ, ముంబైకి విస్తరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి 300 డార్క్ స్టోర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. అటు జియోమార్ట్ సొంత గ్రూప్నకు చెందిన 3,000 పైచిలుకు రిలయన్స్ రిటైల్ స్టోర్స్తోనే క్విక్ కామర్స్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే 600 పైచిలుకు డార్క్స్టోర్స్ ఏర్పాటు చేసింది. అరగంటలో డెలివరీలు అందించేందుకు సొంత నెట్వర్క్ని ఉపయోగించుకోవడంతో పాటు స్థానిక కిరాణా దుకాణాలతో కూడా చేతులు కలిపింది. లాభదాయకత అంతంతే..క్విక్ కామర్స్ అంకురాలు భారీగా నిధులు సమీకరిస్తున్నప్పటికీ అవన్నీ కార్యకలాపాల విస్తరణకు, కస్టమర్లను దక్కించుకోవడానికి ఖర్చయిపోతున్నాయే తప్ప లాభదాయకతనేదేమీ పెద్దగా కనిపించడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లోనూ మార్కెట్ వాటాను దక్కించుకోవడానికి మరింతగా ఖర్చు చేయాల్సి రానుంది కాబట్టి ఇదే ధోరణి మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉందని వివరించాయి. 2026 తొలి రెండు త్రైమాసికాల్లో వ్యయాలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చని పేర్కొన్నాయి. ఇన్వెస్టర్ల ఆకాంక్షల మేరకు ఆ తర్వాత లాభదాయకతపై తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సి వస్తుందని వివరించాయి. స్విగ్గీలాంటి సంస్థలు లిస్టయి ఏడాది దాటినా స్టాక్లో పెద్దగా మార్పు లేకపోవడంపై ఇన్వెస్టర్లు అసంతృప్తిగా ఉన్నారని తెలిపాయి. లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నప్పటికీ తాజాగా మళ్లీ ఎందుకు నిధులను సమీకరించాల్సి వస్తోందనేది లిస్టెడ్ కంపెనీలుగా చెప్పాల్సిన బాధ్యత వాటిపై ఉంటుందని విశ్లేషకులు తెలిపారు. క్విక్ కామర్స్ తొలినాళ్లతో పోలిస్తే అర్థరహితంగా చేసే వ్యయాలను ఇన్వెస్టర్లు సహించే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఉదయం గరిష్టంగా రూ. 770 తగ్గింది. అయితే సాయంత్రానికి మరో 810 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు (శుక్రవారం) గోల్డ్ రేటు 1580 రూపాయలు తగ్గిందన్నమాట. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 1,27,040 వద్దకు చేరింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.118400 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,16,450 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 1450 తగ్గిందన్న మాట. (ఉదయం 700 రూపాయలు మాత్రమే తగ్గింది, ఇప్పడు మరో 750 రూపాయలు తగ్గి.. మొత్తం రూ. 1450 తగ్గింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1580 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ. 127040 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 770 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో 810 రూపాయలు తగ్గడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1580 తగ్గింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1580 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ. 127190 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1450 తగ్గి.. 1,16,600 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1750 తగ్గడంతో రూ. 128070 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1600 తగ్గి.. 117400 రూపాయల వద్దకు చేరింది.ఇదీ చదవండి: సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!: రాబర్ట్ కియోసాకి
ఫ్యామిలీ
చిల్డ్రన్స్ డే: బాలతారల ఇంటర్వ్యూలు
నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన కొందరు బాలతారల ఇంటర్వ్యూలు, సిక్స్ ఇయర్స్ ఏజ్లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, సిక్స్టీన్లోకి అడుగు పెట్టి, యువ హీరో కావడానికి రెడీగా ఉన్న ర్యాన్ జాయ్తో మాటామంతీ!చిన్నప్పటి మహేశ్ని!ఆరేళ్ల వయసులోనే బాల నటుడిగా కెరీర్ స్టార్ చేసి, ఇప్పుడు స్వీట్ సిక్స్టీన్లో ఉన్నాడు ర్యాన్. కొంచెం మహేశ్బాబు పోలికలతో కనిపించే ర్యాన్ చిన్నప్పటి మహేశ్గా రెండు సినిమాల్లో నటించాడు. ఆ విశేషాలతో పాటు మరిన్ని విశేషాలు ఈ విధంగా పంచుకున్నాడు ర్యాన్ జాయ్.→ మా నాన్నగారి వృత్తిరీత్యా మేం చిన్నప్పుడు ముంబైలో ఉండేవాళ్లం. నేను అక్కడే పుట్టాను. నాకు సిక్స్ ఇయర్స్ అప్పుడు మా అమ్మ నన్ను ఆడిషన్స్కి తీసుకెళ్లేవారు. ఆ క్యారెక్టర్లకు కావల్సిన ఏజ్ లేదని సెలక్ట్ చేసేవాళ్లు కాదు. ఫైనల్లీ ‘హైదరాబాద్ లవ్స్టోరీ’లో చాన్స్ వచ్చింది. తెలుగులో నా కెరీర్ ఆ సినిమాతో మొదలై, ఈ మధ్య చేసిన ‘జయమ్మ పంచాయతీ’ వరకూ సక్సెస్ఫుల్గా సాగుతోంది.→ నా ఫీచర్స్ మహేశ్ సార్కి దగ్గరగా ఉండటంవల్లే ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ చిత్రాల్లో చిన్నప్పటి మహేశ్బాబుగా యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. అయితే మహేశ్ సార్తో నా కాంబినేషన్ సీన్స్ ఉండవు కాబట్టి, ఆయన్ను కలవలేదు. ఒకే ఒక్కసారి ‘మహర్షి’ సెట్స్లో ఆయన ఉన్నప్పుడు ఆ దగ్గర్లోనే నేను ఉన్నాను. ఫొటో కావాలని అడిగితే, అప్పుడు ఎమోషనల్ సీన్స్ చేస్తున్నారు. ఆయన కళ్లనిండా నీళ్లు ఉన్నాయి. కొంచెం ఆగమన్నారు. చాలా టైమ్ పట్టింది. ఇక వెళ్లిపోతుంటే, ఆయనే పిలిచి ఫొటో దిగే చాన్స్ ఇచ్చారు.→ ఇప్పటివరకూ చైల్డ్ ఆర్టిస్ట్గా 20కి పైగా సినిమాలు చేశాను. వాటిలో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘నేల టికెట్టు’ వంటి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్గారు హీరోగా చేస్తున్న ఒక సినిమాలో లెంగ్తీ రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 16 కాబట్టి... అటు చైల్డ్ ఆర్టిస్ట్గా చేయలేను... ఇటు నా వయసున్న క్యారెక్టర్లు తక్కువ ఉంటాయి. సో... కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. → నేను హీరో అవాలనుకుంటున్నాను కాబట్టి... బాడీ బిల్డింగ్, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటి మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. చిన్నప్పుడు కరాటే నేర్చుకున్నాను. అలాగే థియేటర్ క్లాసెస్ తీసుకుందామనుకుంటున్నాను. హీరో అనిపించుకోవడానికి ఏమేం కావాలో అన్నీ నేర్చుకుంటాను. నాకు ఏదైనా బిజినెస్ చేయాలని కూడా ఉంది. మెయిన్ టార్గెట్ హీరో అయినప్పటికీ ఫ్యూచర్లో బిజినెస్ మీద కూడా ఫోకస్ పెడతాను. → ఒక కంప్లీట్ యాక్టర్గా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. ఆమిర్ ఖాన్లా అన్నమాట. ఆయన చేసే సినిమాలు ఒకదానికి ఒకటి పోలిక ఉండవు. వెరైటీగా ఉంటూ ట్రూగా ఉంటాయి. అలా నిజాయతీకి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నాను. సినిమా...నాటిక‘ఒక్క క్షణం, కేజీఎఫ్ 2, తండేల్, కింగ్డమ్, కిష్కింధపురి, లవ్స్టోరీ, సరిలేరు నీకెవ్వరు’.. వంటి మూవీస్తో గుర్తింపు తెచ్చుకున్న భానుప్రకాశ్ చెప్పిన విశేషాలు.→ అన్నమయ్య జిల్లా సోమల మండలం నెల్లిమంద గ్రామం ఎగువపల్లి మా ఊరు. మా నాన్న సురేశ్ అమసగారు. చిన్నప్పుడే మా తాతయ్య హైదరాబాద్కి వచ్చేశారు. మా నాన్న ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ కాంట్రాక్టర్గా చేస్తున్నారు. మా నాన్నకి డైరెక్టర్ కావాలని లక్ష్యం. అయితే ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో నిర్మాతగా సుమారు 30కి పైగా షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు నాన్న. అలా మా నాన్న నిర్మిస్తున్న ‘నీ కొరకు నేను వేచి ఉంటాను’ షార్ట్ ఫిల్మ్లో ఒక పాత్రకి ఓ అబ్బాయి కావాల్సి వచ్చింది. ఎవరూ సెట్ కాలేదు.. ‘నువ్వు చేస్తావా? అని నాన్న అడగడంతో చేశాను. అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అల్లు శిరీష్ సార్ హీరోగా నటించిన ‘ఒక్క క్షణం’ (2017) బాల నటుడిగా నా ఫస్ట్ మూవీ. → నేను హైదరాబాద్లో పుట్టి, పెరిగాను. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు నేను సెట్స్కి బుక్స్ తీసుకెళతాను. ఆ రోజు జరిగిన క్లాస్ నోట్స్ని నా ఫ్రెండ్స్ని అడిగి, షూటింగ్ గ్యాప్లో రాసుకుంటాను. చాలా సందర్భాల్లో ఒకే సమయంలో ఇటు ఎగ్జామ్స్, అటు షూటింగ్స్ వచ్చాయి. అయితే షూటింగ్స్ షెడ్యూల్ సడెన్ గా ఫిక్స్ అవుతుంటాయి కాబట్టి వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎఫ్ఏ 1, ఎఫ్ఏ 2 వంటి పరీక్షలుంటే టీచర్స్ నా కోసం మళ్లీ కండక్ట్ చేస్తారు. → నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంత తోపు, తురుం అయినా కానీ ఫ్రెండ్స్ వద్ద నేను జస్ట్ భానుప్రకాశ్ అంతే... నేను నటించిన ఏదైనా సినిమా చూసినప్పుడు నా నటన గురించి టీచర్లు, ఫ్రెండ్స్ మాట్లాడతారు. వాళ్లందరికీ నేను నటించిన ఓ మంచి సినిమా చూపించాలని కోరిక. మా బంధువులు నేను నటించిన సినిమా చూస్తున్నప్పుడు ‘హే.. భాను వచ్చాడు...’ అంటూ బాగా ఎగ్జయిట్ అవుతారు. → ప్రస్తుత పరిస్థితుల్లో నాటకాలు అంతరించిపోతున్నాయి. వాటికి ఆదరణ దక్కడం లేదు. నేను ‘అమ్మ చెక్కిన బొమ్మ’ అనే నాటికలో నటించాను. ఈ ఏడాది మార్చి 28న తొలి ప్రదర్శన ఇచ్చాను. ఇప్పటివరకూ పద్దెనిమది ప్రదర్శనలు ఇచ్చాను. ఆ నాటిక ఎక్కడ వేసినా శశి అనే నా పాత్రకు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తోంది. సినిమా పుట్టకముందు నుంచి నాటకరంగం ఉంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ ఉన్న నాలాంటి చైల్ట్ ఆర్టిస్ట్స్కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు కానీ, బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదు. కానీ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటకం ఎక్కడ ప్రదర్శించినా ఉత్తమ నటుడిగా నాకు అవార్డు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. హిందీలో, గుజరాతీలోనూ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక వేశాం. పేరెంట్స్కి గిఫ్ట్స్‘‘భవిష్యత్లో నేను ఒక మంచి ఆర్టిస్టును అవ్వాలనుకుంటున్నాను. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే రోల్స్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నాను. యాడ్స్ కూడా చేస్తున్నాను. వేటికవే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్’’ అని చెప్పాడు ఉజ్వల్ తేజ్. ‘భైరవం, ఆయ్’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో పాటు ‘గాలివాన, పరంపర’ వంటి వెబ్ సిరీస్లోనూ మెరిశాడు ఉజ్వల్ తేజ్. ‘నిండు నూరేళ్ళ సావాసం’, ‘పాపే మా జీవనజ్యోతి’ వంటి సీరియల్స్తో బిజీగా ఉంటున్న ఉజ్వల్ పంచుకున్న కొన్ని విషయాలు...→ మా స్వస్థలం కర్నూలు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాం. 8వ క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పట్నుంచి యాక్టింగ్, డ్యాన్స్ ఇష్టం. వాటిలో నాకున్న స్కిల్ని మా పేరెంట్స్ గమనించి, డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయించారు. అక్కడ మా పేరెంట్స్ ఫ్రెండ్ ఒకరి సలహాతో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్లో పోటీ చేశాను. తమిళనాడులో తెలంగాణ స్టేట్ను, దుబాయ్లో ఇండియానూ రిప్రజెంట్ చేసి, విజేతగా నిలిచాను.→ నా తొలి సినిమా పేరు ‘నా సినిమా ఆగిపోయింది’. ఈ చిత్రంలో యాక్ట్ చేసేప్పుడు నాకు సరిగ్గా యాక్టింగ్ రాదు. కానీ ఆ సినిమా డైరెక్టర్ ప్రోత్సాహంతో బాగా నటించగలిగాను. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుంది. దీనికన్నా ముందు నేను యానీ మాస్టర్తో ఓ యాడ్ చేశాను.ఏ ఒక వైపు యాక్టింగ్... మరోవైపు స్టడీస్... ఈ రెంటినీ ఎలా బ్యాలన్స్ చేస్తున్నానంటే.. షూటింగ్ స్పాట్కి బుక్స్ తీసుకు వెళ్తాను. షూటింగ్లో నాకు ఖాళీ దొరికినప్పుడల్లా మా అమ్మగారు నా చేత చదివిస్తుంటారు. నేను ఏవైనా క్లాసులు మిస్ అయితే నా టీచర్స్ నాకు రీ క్యాప్ చేస్తారు. నా ఫ్రెండ్స్ నోట్స్లు ఇస్తారు. → మా స్కూల్లో చిల్డ్రన్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక చిల్డ్రన్స్ డేకి మా స్కూల్లో ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. కానీ అదే రోజు నేను షూటింగ్లో పాల్గొనాలి... అయితే అనుకోకుండా నేను ఆ షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఇది తెలిసి మా ప్రిన్సిపాల్ మేడమ్ నన్ను పిలిపించి, అప్పటికప్పుడు నాతో డ్యాన్స్ చేయించారు. అది నాకో హ్యాపీ మూమెంట్. కొన్నిసార్లు నాకు షూటింగ్ ఉన్న రోజే ఎగ్జామ్స్ కూడా ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో నేను సినిమా యూనిట్ దగ్గర అనుమతి తీసుకుని, ఎగ్జామ్స్ రాసేవాడిని. ఇలా కుదరకపోతే మా ప్రిన్సిపాల్ నాకు సపోర్ట్ చేస్తారు.ఏ నా తొలి సంపాదనతో మా అమ్మానాన్నలకు బహుమతులు ఇవ్వడం నాకెంతో సంతృప్తినిచ్చింది. నా మూవీస్ ‘బ్రిలియంట్ బాబు’, ‘స్మాల్ టౌన్ బాయ్స్’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. సుద్దపూసని కాదు‘‘హ్యాష్టాగ్ 90స్’ వెబ్ సిరీస్లోలాగా నేను చదువులో సుద్దపూసని కాదు. నాకెప్పుడూ 90కి పైగా మార్కులు వస్తుంటాయి. నాకు పరీక్షలు ఉన్నప్పుడు ఏవైనా షూటింగ్స్ ఉంటే అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే ఫస్ట్ చదువుకే ప్రియారిటీ.. ఆ తర్వాతే ఏదైనా. అందుకే ఏ పరీక్షనూ ఇప్పటివరకు మిస్ అవలేదు’’ అని రోహన్ రాయ్ తెలిపాడు. ‘వినయ విధేయరామ, రాజుగారి గది 2, రంగుల రాట్నం, మిస్టర్ మజ్ను, చెక్, సూపర్ మచ్చి, గుడ్లక్ సఖి..’ వంటి పలు సినిమాలతో పాటు సీరియల్స్లో, ‘హ్యాష్టాగ్ 90స్’ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించిన రోహన్ రాయ్ చెప్పిన విశేషాలు.మా నాన్న సుబ్బారాయుడుగారు (చీరాల) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు. అమ్మ రాధామాధవి బేసికల్గా నా మేనేజర్ కూడా. నా కోసం తన పని వదులుకుంది. నా డేట్స్ చూసుకోవడంతో పాటు షూటింగ్స్కి నా వెంట వస్తుంటుంది. → చిన్నప్పుడు ఇంట్లో టీవీ బాగా చూసేవాణ్ణి. నా వయస్సు ఐదేళ్లున్నప్పుడే ఎవరైనా మా ఇంటికి వచ్చి వెళ్లాక వాళ్లని ఇమిటేట్ చేసేవాణ్ణి. వాళ్లు కూర్చునే, నడిచే విధానాన్ని కూడా. అప్పుడు నాకు, మా కుటుంబ సభ్యులకు అర్థమైంది నాకు నటన అంటే ఇష్టం అని. టీవీలో స్క్రోలింగ్ చూసి ‘డ్రామా జూనియర్స్’ ఆడిషన్స్కి నన్ను తీసుకెళ్లింది అమ్మ. అందులో నేనే ఫస్ట్ కంటెస్టెంట్. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 4 చేశాను. ‘డ్రామా జూనియర్స్’లో నా నటన చూసి డైరెక్టర్ బోయపాటి శ్రీనుగారు ఆడిషన్ చేసి, ‘వినయ విధేయ రామ’ సినిమాకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఓంకార్గారు ‘రాజుగారి గది 2’లో చాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి నా ప్రయాణం కొనసాగుతోంది. → హీరోలు నానీగారిని, నవీన్ పొలిశెట్టిగారిని చూసినప్పుడు నేను కూడా వారిలా కావాలనిపించేది. తెరపై వాళ్లు నటిస్తున్నట్లు ఉండదు... వారిద్దరూ నేచురల్ యాక్టర్స్. కథ, పాత్రల్ని ఎంపిక చేసుకునే విధానంలో వాళ్లిద్దర్నీ స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటాను. నానీగారు హీరో కాదు.. ఆర్టిస్ట్. కథ నచ్చితే ఆయన ఏదైనా చేయగలరు.→ నా జీవితంలో మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘హ్యాష్టాగ్ 90స్’ వెబ్ సిరీస్. దాని తర్వాత వెంట వెంటనే సినిమాలు రావడం, మంచి పాత్రలు ఎంచుకుని చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరువీర్గారు హీరోగా రాహుల్ శ్రీనివాస్గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈ నెల 7న విడుదలైంది. ఈ చిత్రంలో నేను చేసిన రాము పాత్రకి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం శివాజీగారితో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే సినిమా చేశాను. త్వరలో విడుదల కానుంది. → షూటింగ్ ఉన్నప్పుడు క్లాసులు మిస్ అవుతాను. నైట్ లేదా షూటింగ్ గ్యాప్లో చదువుకోవడం, రాసుకోవడం చేస్తుంటాను. యూట్యూబ్, గూగుల్ తల్లి కూడా ఉంది. వాటి నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాను. రాత్రిళ్లు మేలుకుని నోట్స్ రాసుకుంటాను. ఈ విషయంలో మా ఫ్రెండ్స్, టీచర్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అప్పులు తీర్చాను‘కిష్కింధపురి, పరాక్రమం’ చిత్రాల్లో బాలనటుడిగా ప్రేక్షకులను మెప్పించాడు అర్షిత్. చిరంజీవి, నాగార్జునలను స్ఫూర్తిగా తీసుకుని, భవిష్యత్లో పెద్ద నటుడు కావాలనుకుంటున్న అర్షిత్ పంచుకున్న కొన్ని విషయాలు....→ స్వస్థలం గోదావరి ఖని. హైదరాబాద్లో ఉంటున్నాం. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. నాకు నటన అంటే ఆసక్తి కలగడానికి మా అక్క కారణం. అలాగే ‘పిల్లలు పిడుగులు’ టీవీ షో నుండి ‘డ్రామా జూనియర్స్’ వరకు... నేను ఇండస్ట్రీలోకి రావడానికి చాలామంది స్ఫూర్తిగా నిలిచారు. షూటింగ్ సమయంలో ఎగ్జామ్స్ ఉంటే ముందుగా షూటింగ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను పరీక్షలకు హాజరు కాకపోయినా వాళ్ళు నాకు విడిగా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. నా క్లాస్లో నేనే టాపర్ని. షూటింగ్ గ్యాప్లో చదువుకుంటాను. నా ట్విన్ సిస్టర్ స్టడీ సిలబస్లో నాకు సహాయం చేస్తుంది. ఇంట్లో కూడా అమ్మానాన్నలు నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు.→ సినిమాల్లో నటిస్తూ, సిల్వర్ స్క్రీన్ పై కనిపించినంత మాత్రాన నన్ను క్లాస్లో ప్రత్యేకంగా ఏం చూడరు. క్లాస్లో అందరిలానే నేనూ ఓ సాధారణ అబ్బాయిని. అయితే మా బంధువులు నన్ను చూసి గర్వపడుతుంటారు. పెద్ద హీరోలతో పని చేయడం నాకు స్ఫూర్తినిస్తుంది. సెట్స్లో వారి కష్టాన్ని గమనిస్తుంటాను. వాళ్ల కష్టాన్ని చూసి, నేను చాలా నేర్చుకుంటుంటాను. హీరోలతో కలిసి పని చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.→ చైల్డ్ ఆర్టిస్టుగా నా మొదటి సినిమా ‘సర్కిల్’. ఈ చిత్రంలో నటించినందుకు రూ. 1000 పారితోషికం ఇచ్చారు. నా తొలి సంపాదనను మా తల్లిదండ్రులకు ఇచ్చేశాను. అలాగే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించగా, నేను యాక్ట్ చేసిన ‘పచ్చిపులుసు’ షార్ట్ ఫిల్మ్కి, రూ. 15 లక్షల ప్రైజ్ మనీ బహుమతిగా లభించింది. ఆ తర్వాత మా అప్పులు కొన్ని తీర్చేశాను. ‘కిష్కింధపురి’ సినిమా తర్వాత నాకు మంచి గుర్తింపు లభిస్తోంది. నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఒక మంచి యాక్టర్గా ప్రేక్షకుల చేత గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం.యాక్టింగ్... చారిటీ బాల నటుడిగా 25కి పైగా సినిమాల్లో నటించాడు నాగచైతన్య వర్మ. ‘అమీర్పేటలో, నారప్ప, నా సామిరంగా, జటాధర, పేకమేడలు, లగ్గం’ వంటి పలు సినిమాలతో పాటు ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్తో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న నాగచైతన్య వర్మ తన ఫ్యూచర్ ప్లాన్స్ని ఇలా పంచుకున్నాడు... → మాది అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చమర్తివాండ్ల పల్లి. నటుడు కావాలనే నా ఆకాంక్షను మా అమ్మానాన్న వరలక్ష్మి దేవి, నాగార్జున రాజు ప్రోత్సహించారు. ‘అమీర్పేటలో’ సినిమాతో నటుడిగా నా జర్నీ మొదలైంది. ప్రస్తుతం ఎయిత్ క్లాస్ చదువుతున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు స్కూల్కి సెలవు పెడతాను కదా... అప్పుడు ఫ్రెండ్స్ని అడిగి నోట్స్ రాసుకుంటాను. స్కూల్ వాళ్లు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. నా ఫస్ట్ ప్రియారిటీ ఎగ్జామ్స్కే. ఎగ్జామ్స్లో నాకు 80 శాతంపైన మార్కులు వస్తుంటాయి. టాప్ 5 ర్యాంక్స్లో కచ్చితంగా నేను ఉంటాను.→ నా సినిమాలు చూసినప్పుడు ‘బాగా నటించావ్.. ఇలాగే ముందుకెళ్లు’ అని టీచర్లు, నా స్నేహితులు చెబుతుంటారు.. ఈ ఆగస్టులో విడుదలైన ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్లో అవసరాల శ్రీనివాస్గారి చిన్నప్పటి పాత్రలో నెగటివ్ రోల్ చేశాను. నా నటన బాగుందని చాలా మంది అభినందించారు. ఈ నెల 7న విడుదలైన ‘జటాధర’ సినిమాలో హీరో సుధీర్ బాబు చిన్నప్పటి పాత్ర చేశాను. మంచి మూవీ చేశానని పొగిడారు.→ నేను నటించడం మా బంధువులకు, ఇరుగు పొరుగు వాళ్లకి చాలా ఇష్టం. ‘నువ్వు ఇంకా బాగా నటించి, మంచి స్థాయికి వెళ్లాలి’ అని అంటుంటారు. నా సినిమా చూసి బాగా చేశావని చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. తెలుగు సినిమా వేదిక మా తెలుగు తల్లి, కళావారధి సౌజన్యంతో 2023లో నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో ఉత్తమ బాలనటుడిగా ఆర్. నారాయణమూర్తి సార్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. → జూలై 28న నా పుట్టినరోజు సందర్భంగా కడపలోని బాలల అనాథాశ్రమానికి నా పారితోషికంలో నుంచి ప్రతి ఏడాదీ నగదు సాయం చేయడం నాకెంతో సంతృప్తినిస్తుంది.ఏ ప్రస్తుతం ప్రభాస్గారి ‘ఫౌజి’తోపాటు ‘హే భగవాన్, యుఫోరియా, సహకుటుంబానాం, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, బ్యాచ్ మేట్స్, అర్జునుడి గీతోపదేశం’ సినిమాలు చేస్తున్నాను. ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోవాలనుకుంటున్నా. ఏడేళ్లు...మూడు గంటలు...ఏడు రికార్డులు∙నృత్య ప్రతిభకళ పట్ల ప్రేమ ఉంటే ఏ వయసు అయినా వండర్స్ సృష్టించవచ్చు అనడానికి నిదర్శనం శర్నీథా దత్త రచ్చ. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉంటున్న ఈ చిన్నారి వయసు ఏడేళ్లు. ఇటీవల రంగప్రవేశం (సోలో అరంగేట్రం)తో ఏకధాటిగా మూడు గంటల పాటు కూచిపూడి నృత్యం చేసిన అరుదైన గుర్తింపుతో పాటు ఏడు రికార్డులను సొంతం చేసుకుంది. అతి పిన్న వయస్కురాలైన కళాకారిణి గా శర్నీథ వార్తల్లో నిలిచింది.శర్నీథా దత్త రచ్చ రెండవ తరగతి చదువుతోంది. రెండేళ్లక్రితం శాస్త్రీయ నృత్యంలో ఓనమాలు దిద్దిన శర్నీథ ఇటీవల సంక్లిష్టమైన నాట్య భంగిమలను, తిల్లానాలను అత్యద్భుతంగా ప్రదర్శించి ఎంతోమంది ప్రశంసలను అందుకుంది.సాధనమున రికార్డులు... శర్నీథా నృత్యాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్, డైమండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. చూసి శర్నీథ ప్రతిభను గుర్తించాయి. అసాధారణమైన ఈ ప్రతిభకు శారద కళాక్షేత్రం నుంచి ’నాట్యమయూరి’ అవార్డును గురువు భావన పెద్రపోలు నుంచి అందుకున్నది. అలసట ఎరగని తపన... శర్నీథా తల్లిదండ్రులు రచ్చ హరి వినోద్, నరీనా దేవి కూతురి మూడేళ్ల వయసు నుంచి శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. ‘నృత్యం అంటే శర్నీథకు ప్రాణం. ప్రాక్టీస్ అంటే చాలు సాధన చేస్తూనే ఉంటుంది. నృత్యాంగేట్రం చేయడానికి ఎనిమిది నెలలు ప్రాక్టీస్ చేసింది. వారణాసి లో అసి ఘాట్, అయోధ్య రామమందిరం లోపల, చిదంబరం గర్భగుడి దగ్గర, బాసరలో... నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ సబ్ జూనియర్లో పాల్గొని, ఐదవ స్థానంలో నిలిచింది. శర్నీథ నృత్యసాధనలో చూపే భక్తి, శ్రద్ధ ప్రముఖ నృత్యకారులను కూడా మెప్పిస్తుంది. అభినయంలో చిన్న వయస్సులోనే చూపే ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను సమ్మోహ పరుస్తుంది. – నిర్మలారెడ్డి
కలలకు రంగులు
పిల్లలూ! ఇవాళ బాలల దినోత్సవం. అంటే చాచా నెహ్రూ పుట్టినరోజు. ఆయన మన దేశానికి మొదటి ప్రధాని. ఆయనకు చిన్నారులంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు ‘బాలల దినోత్సవం’ జరుపుకుంటాం. ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా చాచా నెహ్రూ మెచ్చే పది రకాల థీమ్స్తో మీకు నచ్చిన బొమ్మలు గీసి ఇంట్లో, స్కూల్లో పెడితే ఎలా ఉంటుంది? వాటిని మీకు నచ్చిన వారికి బహుమతిగా ఇస్తే చాలా బాగుంటుంది కదా? మరెందుకు ఆలస్యం? వెంటనే బొమ్మలు గీయడం మొదలుపెట్టండి. ఈ 10 థీమ్స్ మీకోసమే. → చిన్నారులు–చాచా నెహ్రూ: ఇవాళ్టి బాలల చేతుల్లోనే రేపటి దేశభవిత ఉంటుంది. అందుకే చాచా నెహ్రూ బాలల గురించి ఆలోచించేవారు. తన ప్రతి నిర్ణయం రాబోయే తరాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలుసుకునేవారు. అటువంటి చాచా నెహ్రూ ఇవాళ ఉంటే ఎలా ఉండేది? ఈ కాలం చిన్నారుల్ని చూసి ఆయన ఎలా మురిసిపోయేవారు? వారితో కలిసి ఎలా ఆడిపాడేవారు? ఇవన్నీ ఊహించుకొని ఓ చక్కని బొమ్మ గీయండి. మీరు గీసే ఆ బొమ్మ భవితకు మార్గదర్శకంగా మారి, అందరి మనసుల్లో నిలిచిపోతుంది. → అందరికీ విద్య: మీరందరూ చక్కగా బడికెళ్లి చదువుకుంటారు. ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. మరి మీలాంటి చిన్నారులు చాలామంది బడికి దూరంగా ఉన్నారన్న విషయం తెలుసా? వారంతా రోజు కూలి చేసి పొట్టపోసుకుంటున్నారన్న సంగతి తెలుసా? అలాంటి వారి బాధల్ని మీరు మీ చిత్రాల్లో చూపండి. వారిని చదువుకు చేరువ చేసే మార్గాలు ఆలోచించమనేలా మెసేజ్ ఇవ్వండి.→ పర్యావరణం ముఖ్యం: పచ్చని చెట్లు, చెంగుచెంగున గెంతే సాధుజంతువులు, సెలయేళ్లు, జలపాతాలు... ఇవన్నీ మీకు ఇష్టం కదా? వాటిని రంగుల్లో చిత్రించడం మీకెంతో సరదా కదా? అయితే అనేక కారణాలతో పర్యావరణం ప్రమాదంలో ఉంది. కాలుష్యం కోరల్లో పడి నలిగిపోతోంది. దీనివల్ల జనం అనేక సమస్యలతో బాధపడుతున్నారు. రానురాను పరిస్థితులు మరింత దారుణమవుతాయి. వాటికి అడ్డుకట్ట వేయడం మీ బాధ్యత కూడా. పర్యావరణాన్ని కాపాడుకుందామనే సందేశంతో బొమ్మ గీసి పెట్టండి. → టెక్నాలజీ– మంచీచెడూ: ప్రస్తుతం అందరికీ టెక్నాలజీ చేరువయ్యింది. ఏఐ రాకతో సరికొత్త టెక్నాలజీకి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి వాడకంపై అందరికీ అవగాహన కావాలి. ఆ టెక్నాలజీని చెడు కోసం కాకుండా మంచి పనుల కోసం వాడేలా మీరు చిత్రాల ద్వారా సందేశం ఇవ్వండి.→ భిన్నత్వంలో ఏకత్వం: మన దేశం అనేక సంస్కృతులకు, సంప్రదాయాలకు ఆలవాలం. ఒక్కోచోట ఒక్కో భాష, ఒక్కో పద్ధతి... అయినా అందరం ఒకే దేశంగా కలిసి ఉంటున్నాం. దీన్నే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిత్రాలు గీయండి. అన్నీ కలిసిన భారతదేశాన్ని చూపించండి. → కలలు కనండి..సాధించండి: ‘కలలు కనండి.. సాధించండి’ అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. మీకూ ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి. పెద్దయ్యాక మీరేం అవ్వాలనుకుంటున్నారో ఆలోచించి, ఇప్పుడే ఓ చిత్రం గీయండి. అందులో మీరెలా ఉండబోతున్నారో ఊహించుకోండి. అది మీకు స్ఫూర్తిని ఇస్తుంది.→ ఆనందాల హరివిల్లు: చిన్నారుల ఆనందమే కుటుంబం ఆనందం కదా? మీరు ఆనందంగా ఉండేందుకు చేసే పనులేమిటి? ఆడుకోవడం, సైకిల్ తొక్కడం, టీవీ చూడటం, పాటలు వినడం.. ఇలా అనేక పనులు ఉంటాయి. వాటన్నింటినీ కలిపి బొమ్మలుగా గీయండి. వాటిని చూసినప్పుడల్లా మీకు ఆనందాన్ని అందిస్తాయి. → బాలల హక్కులు: మీది ఈ దేశం. అందరికీ ఉన్నట్టే, ఈ దేశంలో మీకూ హక్కులు ఉన్నాయి. ఆ హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదు. విద్య, వైద్యం, చదువు, ఆహ్లాదకర వాతావరణం.. ఇవన్నీ మీకు దక్కాల్సిన హక్కులు. వాటి గురించి తెలుసుకొని, అవే బొమ్మలుగా గీయండి. వాటి గురించి ఇతరులకు తెలియజెప్పండి. → అంతరిక్ష వికాసం: మన దేశం అంతరిక్ష ప్రయోగాల్లో ముందంజలో ఉంది. మంగళయాన్, చంద్రయాన్... అలాగే బాహుబలి శాటిలైట్... ఇలా మనం గొప్పగా ప్రగతి సాధిస్తున్నాం. ఇస్రోలో మన సైంటిస్ట్లు ఎన్నో ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలో మన దేశ వికాసం ఎలా ఉందో బొమ్మల్లో చూపి క్లాస్రూమ్లో డిస్ప్లే చేయండి.→ భావిభారత్: మరో 20 ఏళ్లలో భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? భారత్లో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు ఊహిస్తున్నారు? ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇవన్నీ ఆలోచించి బొమ్మలు గీయండి. వాటిని అందరికీ చూపించండి. భావిభారత్ను మీ చిత్రాల్లో చూడటం అందరికీ ముచ్చటగా ఉంటుంది.
లేటు వయసులో వెయిట్ లాస్ జర్నీ..! గుర్తుపట్టలేనంత స్లిమ్గా బామ్మ..
బరువు తగ్గడం అనే ప్రక్రియ కాస్త యంగ్ ఏజ్లోనే ప్రారంభిస్తాం. అది వాళ్ల ఆహార్యం, హెల్త్ సమస్యల రీత్యా ఇంకాస్త మందు లేదా 40 నుంచి 50,60ల వయసులో మొదలు పెడతారు. అంతకుమించి మరీ లేటు వయసులో..అది కూడా విశ్రాంతి తీసుకునే వయసులో ఎవ్వరూ మొదలుపెట్టే సాహసం చేయరు. కానీ ఈ బామ్మ అలా కాదు. ఏడు పదలు వయసులో బరువు తగ్గాలనుకోవడమే కాదు, ఆ వయసులో కష్టతరమైన కసరత్తులు చేసి గుర్తుపట్టలేనంత నాజూకుగా మారిపోయింది. పైగా ఫిట్నెస్ టిప్స్ చెప్పేస్తోంది.కెనడాలోని ఒంటారియాకు చెందిన 79 ఏళ్ల జోన్ మెక్డొనాల్డ్ అసాధారణమైన సాహాసానికి పూనుకుని బరువు తగ్గాలనే ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచారామె. వయసు కేవలం నెంబరేనని ప్రూవ్చేసింది. అంతేగాదు 70 ఏళ్ల వయసులో జిమ్లో వర్కౌట్లు చేసి ఔరా అనిపించుకుంది. దాదాపు ఎనిమిదేళ్లుగా అధిక బరువుతో ఉండేదాన్ని అని ఇన్స్టా వేదికగా తన వెయిట్ లాస్ స్టోరీ షేర్ చేసుకుందామె. తాను ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా కేర్ తీసుకున్నట్లు తెలిపింది. బరువు తగ్గడం అనేది ఎప్పుడూ కష్టతరమైన ప్రక్రియ కాదు. కూరగాయలు, ఫైబర్పై ఫోకస్ పెడుతూ..కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామాలు చేస్తే చాలంటోంది ఈ బామ్మ జోన్. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా ఎలాంటి వర్కౌట్లు చేస్తే బెటర్ అనేది తెలుసుకున్నానని వివరించింది. అందుకోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలిపింది. వార్మప్ నుంచి మొదలుపెట్టి..వేగవంతంగా చేసే వ్యాయామాలు దాదాపు 60 నుంచి 70 నిమిషాలు కొనసాగేవని చెప్పుకొచ్చింది. అంతేగాదు ప్రతి నెల తనలో వస్తున్న పరివర్తనను గమనించానని, అదీగాక తాను మరింత బలంగా ఫిట్గా ఉన్నట్లు అనిపించిందని వెల్లడించింది. ఇక వర్కౌట్ల పరంగా బామ్మ వారానికి రెండు లెగ్ సెషన్లు, రెండు అప్పర్ బాడీ, ఒక గ్లూట్-ఫోకస్డ్ సెషన్ తప్పనిసరిగా చేసేదాన్ని అని అంటోదంది ఈ బామ్మ. ఏ వయసులో వెయిట్లాస్ ప్రక్రియ ప్రారంభించినా..డెడికేషన్ మస్ట్ అప్పుడే సత్ఫలితాలు పొందగలరని చెప్పకనే చెప్పింది కదూ ఈ బామ్మ జోన్. View this post on Instagram A post shared by Joan MacDonald (@trainwithjoan) (చదవండి: పెళ్లి వేడుకలో కిరణ్ మజుందార్ షా, సుధామూర్తిల స్టెప్పులు..!)
పెళ్లి వేడుకలో కిరణ్ మజుందార్ షా, సుధామూర్తిల స్టెప్పులు..!
ఆనందానికి వయసుతో సంబంధమే లేదు. అందులోనూ సంతోషభరితమైన సమయాల్లో మనసులోని భావోద్వేగాన్ని చాలామంది డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. అందుకు చిన్న పెద్ద అతీతం కాదు. అలానే ఇక్కడ ఇద్దరు దిగ్గజ మహిళలు చిన్న పిల్లలా మారిపోయి ఎలా స్టెప్పులు వేశారో చూడండి. వారి నృత్యం చూస్తే..పదిల పరుచుకునే మధుర క్షణాలను మధురమైన జ్ఞాపకంగా ఎలా మలుచుకోవాలో చెబుతున్నట్లు ఉంది.ఇన్ఫోసిస్ ఫౌండేసన్ చైర్పర్సన్,రాజ్యసభ సభ్యురాలు, సుధామూర్తి, పిల్లల రచయిత్రి, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాలు ఒక వివాహ వేడుకలో ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారంటే.. ఆ వేడుక ఒక్కసారిగా కన్నుల పండుగగా మారిపోయింది. డెబైల వయసులో చాలా ఉత్సాహభరితంగా నృత్యం చేసి అక్కడి వాతావరణాన్నే ఆహ్లాదభరితంగా మార్చేశారు ఈ శక్తిమంతమైన దిగ్గజాలు. ధోల్ బీట్లకు అందంగా నృత్యం ఈ వివాహ వేడుకకు వచ్చిన అతిధులందరి మనసులను దోచుకున్నారు. కేవలం కెరీర్ పరంగానే గాదు ఎంజాయ్ చేయడంలోనూ మాకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా చిందులేశారు ఆ ఇద్దరూ. అందుకు సంబంధిచిన వీడియోని రాజకీయ నాయకుడు, వ్యవస్థాపకుడు అనిల్ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్గా మారింది. దశాబ్దాలుగా ఈ ఇద్దరు మహిళలు వృత్తిపరమైన విజయాల తోపాటు దాతృత్వం, తెలివితేటల పరంగా అందరికీ ప్రీతిపాత్రమైన వ్యక్తులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ అరుదైన ఘటనతో మరోసారి ఇద్దరి పేరు మారుమ్రోగిపోవడమే కాదు..ఆనందాన్ని గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేయడం ఎలానో చేసి చూపించారు.ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదంటే..కిరణ్ మజుందార్ షా మేనల్లుడు ఎరిక్ మజుందార్ వివాహ వేడుక ఇది. ఎరిక్ ఆష్లే పౌర్ణిమను వివాహ చేసుకున్నారు. ఈ జంట ఇటీవలే బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్లో వివాహ రిసెప్షన్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా, ఎరిక్ యూఎస్లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)లో కంప్యూటింగ్, మ్యాథమెటికల్ సైన్సెస్ అండ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తునన్నారు. అలాగే ఆయన బయోకాన్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా. ఇక వధువు ఆష్లే పౌర్ణమ్ వైద్యురాలిగా, కంప్యూటేషనల్ బయాలజిస్ట్గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Anil Shetty (@anilshetty87) (చదవండి: ఐఏఎస్ అవ్వాలని ఎంతలా ప్రయత్నించాడంటే..! ఏకంగా 12 సార్లు..)
ఫొటోలు
‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
#KrithiShetty : క్యూట్ లూక్స్తో కృతి శెట్టి (ఫొటోలు)
‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)
ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)
హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)
ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)
తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్కప్ విన్నర్ శ్రీచరణి (ఫొటోలు)
మృణాల్ 'డకాయిట్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అంతర్జాతీయం
‘బంగ్లా’లో మళ్లీ హింస.. భయం గుప్పిట్లో ఢాకా
ఢాకా: పొరుగుదేశం బంగ్లాదేశ్ బాంబులతో దద్దరిల్లుతోంది. పదవీచ్యుతురాలైన ప్రధాని షేక్ హసీనాపై నేడు (గురువారం) కోర్టు నుంచి కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగ్లాదేశ్.. కాల్పులు, దేశీయ బాంబు దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇది 2024లో చోటుచేసుకున్న విద్యార్థి నిరసనలను తలపించింది. నాడు జరిగిన హింసాకాండలో 500 మందికి పైగా విద్యార్థులు, ప్రజలు మృతిచెందారు.రాజధాని ఢాకా గురువారం పటిష్టమైన కోటగా మాదిరిగా మారింది. హసీనాకు చెందిన ‘అవామీ లీగ్ ’ ఢాకా లాక్డౌన్కు పిలుపునివ్వడంతో అటు పోలీసులు, ఇటు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) సభ్యులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఢాకా ఎంట్రీ పాయింట్ల వద్ద బహుళ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రజా రవాణాను అణువణువునా తనిఖీ చేస్తున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఢాకాలోని రద్దీగా ఉండే రోడ్లలో నిశ్శబ్దం నెలకొంది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా, ఆమె సహాయకులపై మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాల కేసులో నేడు (నవంబర్ 13)న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) తీర్పు వెలువరించనుంది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత ఏడాది ఆగస్టులో భారతదేశానికి చేరుకున్న హసీనా పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వాటిలో హత్య, కుట్రతో పాటు పలు ఆరోపణలున్నాయి.కాగా తాజాగా జరిగిన అల్లర్లలో నిరసనకారులు బ్రహ్మన్బారియాలోని ఒక గ్రామీణ బ్యాంకు శాఖకు నిప్పంటించి, అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పేదలకు మైక్రో క్రెడిట్ అందించడానికి 1983లో ముహమ్మద్ యూనస్ ఈ గ్రామీణ బ్యాంకును స్థాపించారు. నిరసనకారులు రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో పలు బస్సులను తగులబెట్టారు. ఢాకా పరిధిలో 17 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయని, ముగ్గురు గాయపడ్డారని పలు నివేదికలు చెబుతున్నాయి.రాజకీయ కార్యకలాపాల నుంచి నిషేధించిన హసీనా ‘అవామీ లీగ్’కు చెందిన 44 మంది సభ్యులను అరెస్టు చేసినట్లు ఢాకా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నారాయణగంజ్లో, పార్టీకి చెందిన మరో 29 మంది నేతలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢాకాలోని ఒక ఇంటి నుండి పెద్ద మొత్తంలో ముడి బాంబులు, పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: Bihar Election: నితీష్ ఇంటి ముందు ‘టైగర్’ పోస్టర్
అమెరికాలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది: ఫోర్డ్ సీఈఓ
ప్రఖ్యాత ఆటోమెుబైల్ సంస్థ ఫోర్డ్ లో ఉద్యోగాల కొరత ఏర్పడినట్లు ఆ సంస్థ సీఈఓ జిమ్ ఫార్లీ పేర్కొన్నట్లు ఫార్చ్యూన్ నివేదిక తెలిపింది. ఫోర్డ్ సంస్థలో 5వేల మంది మెకానిక్ లు అవసరమున్న ఆనైపుణ్యం గల వ్యక్తులు లేరన్నారు. ఈ సమస్య కేవలం ఫోర్డు కంపెనీకి చెందింది మాత్రమే కాదని ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులే తయారి రంగంలో అమెరికా వ్యాప్తంగా ఏర్పడ్డాయని జిమ్ ఫార్లీ పేర్కొన్నారు.అమెరికాలో స్కిల్డ్ లేబర్స్ కొరత ఏర్పడినట్లు ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫర్లీ తెలిపినట్లు ఫార్చ్యూన్ నివేదిక పేర్కొంది. యూఎస్ స్కిల్డ్ లేబర్ మార్కెట్ లో పది లక్షలకు పైగా జాబులు ఖాళీగా ఉన్నాయని పలు నివేదికలు తెలుపుతున్నాయి. అత్యవసర సర్వీసులైన, ప్లంబర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్, ఎలక్ట్రిషన్స్, ట్రక్ డ్రైవర్స్ ఉద్యోగాలలో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీచేసే నిపుణుల కొరత తీవ్రంగా ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. బ్యురో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ డేటా ఆగస్టు రిపోర్టు ప్రకారం కేవలం తయారిరంగంలో 4 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశంలో నిరుద్యోగిత రేటు 4.3 ఉన్నప్పటికీ ఈ రంగంలో ఉద్యోగాల ఖాళీలు అధికంగా ఉన్నాయన్నారు.ఫోర్డ్ కంపెనీ మెకానిక్ జాబులకు వార్షిక వేతనం లక్ష 20 వేల డాలర్లు ఇస్తుందని, ఈ ప్యాకెజీ అమెరిన్స్ తలసరి ఆదాయం కంటేఇది రెట్టింపని తెలిపారు. ఇంత మంచి ప్యాకెేజ్ ఉన్నప్పటికీ మెకానిక్ ల భర్తీ జరగడం లేదన్నారు. 2024లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లో అవసరమున్న ఉద్యోగాలలో సగం మందిని నియమించుకోవడం చాలా కష్టమని ఒకవేళ వారి భర్తీ చేపట్టిన వారు ఎక్కువ కాలం ఈ జాబులలో ఉండడం లేదని సర్వే తెలిపిందని పేర్కొన్నారు. దేశ అధ్యక్షుడు ట్రంప్ తయారీరంగాన్ని అమెరికాకు తీసుకొస్తున్నానని ప్రకటిస్తున్నారని అయితే పరిస్థితులు చూస్తుంటే అమెరికన్స్ ఆ రంగంలో ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని ఫోర్ట్ సీఈఓ జిమ్ ఫర్లీ తెలిపినట్లు ఫార్చ్యూన్ నివేదిక పేర్కొంది.
బంపర్ ఆఫర్: పిల్లలను కంటే రూ. 30 లక్షలు
రోమ్: ఆధునిక యువత పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడాన్ని భారంగా భావిస్తోంది. దీనికి ఆర్థిక అంశాలతో పాటు, ఉరుకులు పరుగుల జీవితం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. ఇటువంటి నేపధ్యంలో జననాల రేటు తగ్గుతున్నదనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిని గుర్తించిన ఒక దేశం పరిష్కార మార్గాన్ని కనుగొంది. పెళ్లి చేసుకునే యువతకు భారీ నగదు బహమతులు, గ్రాంట్లను ప్రకటించింది.ఇటలీ అసాధారణ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ ఏకీకరణ (1861) తర్వాత 2024లో కేవలం 370,000 జననాలతో అత్యల్ప సంఖ్యను నమోదు చేసింది. ప్రతి మహిళకు జనన రేటు రికార్డు స్థాయిలో 1.13కి పడిపోయింది. నిపుణులు దీనిని ‘జనాభా శీతాకాలం’(తక్కువ సంతానోత్పత్తి రేట్లు, వృద్ధాప్య జనాభా, పెరిగిన మరణాల రేటుతో ఏర్పడిన పరిస్థితి) గా అభివర్ణిస్తున్నారు.ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న జీవన వ్యయాలు, పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా యువ ఇటాలియన్లు వివాహం చేసుకునేందుకు, పిల్లలను కనేందుకు ఆలస్యం చేస్తున్నారు. ఇది ఇటలీ ఆర్థిక, సామాజిక స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. యువతలో ఉన్న ఈ ధోరణిని తిప్పికొట్టేందుకు, జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు తక్షణమే చర్యలకు ఇటలీ ప్రభుత్వం ఉపక్రమించింది.తగ్గుతున్న జననాల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇటాలియన్ ప్రభుత్వం యువతకు విస్తృతమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనిలో గ్రామీణ పునరావాస గ్రాంట్ ఒకటి. దీని కింద గ్రామాలలో వదిలివేసిన ఇళ్లను కొనుగోలు చేసి,వాటిని పునరుద్ధరించే వారికి €30,000(రూ.30 లక్షలు) వరకు అందించనున్నారు. పుగ్లియాలోని ప్రెసిస్-అక్వారికా తదితర చిన్న పట్టణాల్లో నివాస స్థిరత్వం కోసం అక్కడి ప్రజలకు నెలవారీ స్టైపెండ్లు, వ్యాపార మద్దతును అందిస్తున్నారు. ఈ పథకం ముఖ్యంగా ఇటలీలో ఖాళీ అవుతున్న చిన్న,చారిత్రక పట్టణాలకు ఊపిరి పోయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అక్కడి జనాభా పెరిగేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.అలాగే దేశంలో జనాభా పెరిగేందుకు దోహదపడేలా పన్ను వ్యవస్థలో ముఖ్యమైన రాయితీలను ప్రవేశపెట్టింది. ఉద్యోగాల కోసం ఇటలీకి తరలివచ్చే నిపుణుల కోసం, ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల వారికి పదేళ్ల వరకూ వరకు వారి ఆదాయంలో 70 శాతం నుండి 90 శాతం వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిస్తున్నారు. దీనికితోడు విదేశీ కార్మికులు స్థానికంగా నివసించేందుకు, ఆర్థిక వ్యవస్థకు దోహదపడటానికి అనుమతించే డిజిటల్ నోమాడ్ వీసాను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రోత్సాహకాలు జనాభా క్షీణతను తిప్పికొట్టందుకు సరిపోకపోవచ్చని విశ్లేషకులు సూచిస్తునన్నారు. పిల్లల సంరక్షణ, కుటుంబ జీవితాన్ని ప్రోత్సహించేందుకు సాంస్కృతిక ప్రచారాలు వంటి నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని వారు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘యూనస్ ఉగ్రవాదుల ఫ్రంట్మన్’.. హసీనా ఆగ్రహం
హెచ్-1బీ పాలసీ.. ట్రంప్ సీక్రెట్ అదేనా?
విదేశీ కార్మికులు అవసరం తమ దేశానికి ఉందని ట్రంప్ ప్రకటన చేసి 24 గంటలైనా గడవక ముందే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ ట్రంప్ హెచ్-1బీ వీసా కొత్త విధానం ఉద్దేశ్యం బయటపెట్టారు. అమెరికా పౌరులను ఉన్నతమైన ఉద్యోగాలలో నియమించేందుకు విదేశాల నుంచి వలస కార్మికులు తాత్కాలికంగా అమెరికా వచ్చి ఆ దేశ పౌరులకు శిక్షణ ఇచ్చి తిరిగి తమ దేశాలకు వెళ్లాలన్నారు. తద్వారా అమెరికన్స్ ఉన్నతమైన ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ట్రంప్ హెచ్-1బీ వీసా విధానం ఉద్దేశ్యం ఇదే అయిండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దేశంలో తాత్కాలికంగా స్థిరపడిన విదేశీయులు, చదువుకోసం అమెరికాకెళ్లిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ సమయంలో తమను దేశం వదిలి వెళ్లమంటారో అని కంగారుపడుతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల ఆ దేశం ఆమోందిచిన హెచ్-1బీ వీసా బిల్లు దానికి మరింత బలాన్ని చేకూర్చింది. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్షడాలర్లకు పెంచి ఆ దేశంలోకి వచ్చేవారి అవకాశాలను మరింత కఠినతరం చేశారు. అయితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్యూలో ట్రంప్ హెచ్-1బీ పాలసీ వ్యూహం బహిర్గతం చేశారు. అమెరికన్స్ గత 20-30 ఏళ్లుగా తయారీరంగంలోని ఉన్నతమైన ఉద్యోగాలలో లేరు, ఓడలు, సెమీకండక్టర్స్ నిర్మించలేదు. ఆ రంగాలలో వారికి తగినంత ప్రతిభ లేదు. కనుక విదేశాలనుంచి నైపుణ్యత కలిగిన కార్మికులు అమెరికాకు వచ్చి రెండు, ఐదు, ఏడు సంవత్సారాలపాటు అమెరికాలో ఉండి ఆ దేశ కార్మికులకు శిక్షణ ఇచ్చి వెళ్లాలని.. ట్రంప్ నూతన పాలసీ విధానం ఉద్దేశ్యం ఇదే అయి ఉండవచ్చని బీసెంట్ అన్నారు.అలా శిక్షణ పొందిన అనంతరం తిరిగి ఆ ఉద్యోగాలను టేకాఫ్ చేసుకుంటారని అన్నారు. వలస కార్మికులు ఆ దేశంలో ఉండడంతో ఒక్క అమెరికన్ ఉద్యోగం పొందలేకపోతున్నారని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ల క్షేమం కొరకే పనిచేస్తుందని లక్ష డాలర్లు లోపల ఆదాయం ఉన్న కుటుంబాలకు పన్నులో రెండువేల డాలర్లు రాయితీ ఇచ్చే అంశం చర్చిస్తున్నామన్నారు. కాగా నిన్న ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ అమెరికన్లకు మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లో తగినంత నైపుణ్యత లేదని ఆ రంగాలలో విదేశీయులను నియమించుకునే అవసరముందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
జాతీయం
Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల ప్రహసనంలో ఐదుగురు అభ్యర్థులు అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది ఓట్ల లెక్కింపు సమయంలో ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఆ అభ్యర్థులు వీరే..1. రాధా చరణ్ సాహ్ (జేడీయూ)సందేశ్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత స్వల్ప తేడాతో విజయం సాధించిన రికార్డును నమోదు చేసింది. జేడీయూ అభ్యర్థి రాధా చరణ్ సాహ్ తన ప్రత్యర్థి, ఆర్జేడీకి చెందిన దిపు సింగ్ను కేవలం 27 ఓట్ల తేడాతో ఓడించారు. సాహ్ 80,598 ఓట్లు (43.99%) సాధించగా, సింగ్ 80,571 ఓట్లు (43.97%) దక్కించుకున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థుల తుది రౌండ్ లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఓటును అత్యంత జాగ్రత్తగా లెక్కించారు.2. సతీష్ కుమార్ సింగ్ యాదవ్ (బీఎస్పీ)రామ్గఢ్లో బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు. యాదవ్ 72,689 ఓట్లు (37.29%) సాధించగా, సింగ్ 72,659 ఓట్లు (37.29%) పొందారు. పోలింగ్ శాతంలో కూడా వీరి మధ్య స్వల్ప తేడానే ఉంది. ఇది బీఎస్పీకి బీహార్లో ఏకైక విజయంగా నిలిచింది. ఇది ఆ పార్టీకి ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది. ఈ ఫలితం ఆఖరి వరకు ఉత్కంఠను రేకెత్తించింది.3. మహేష్ పాస్వాన్ (బీజేపీ)అగియాన్ నుంచి ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసిన బీజేపీపీ అభ్యర్థి మహేష్ పాస్వాన్, సీపీఐ(ఎంఎల్)కు చెందిన శివ ప్రకాష్ రంజన్పై కేవలం 95 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. పాస్వాన్ 69,412 ఓట్లు (45.2%) పొందగా, రంజన్ 69,317 ఓట్లు (45.14%) సాధించారు. ఈ నియోజకవర్గంలో వామపక్ష పార్టీ అభ్యర్థి నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఈ స్థానంలో లెక్కింపు పారదర్శకంగా ఉన్నప్పటికీ, స్వల్ప తేడా కారణంగా తుది ప్రకటన కోసం కొంత సమయం పట్టింది.4. ఫైసల్ రెహమాన్ (ఆర్జేడీ)ఢాకా నియోజక వర్గం ఆర్జేడీ అభ్యర్థి ఫైసల్ రెహమాన్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన పవన్ కుమార్ జైస్వాల్ను 178 ఓట్ల తేడాతో ఓడించగలిగారు. రెహమాన్ 1,12,727 ఓట్లు (45.72%) సాధించగా, జైస్వాల్ 1,12,549 ఓట్లు (45.64%) పొందారు. స్వల్ప తేడా ఉన్నప్పటికీ, మహాకూటమి తరపున ఆర్జేడీకి ఈ విజయం ముఖ్యమైనదిగా మారింది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు దాదాపు సమాన సంఖ్యలో ఓట్లను పొందడం చర్చనీయాంశంగా మారింది,5. మనోజ్ బిశ్వాస్ (కాంగ్రెస్)ఫోర్బ్స్గంజ్ కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ బిశ్వాస్ బీజేపీకి చెందిన విద్యా సాగర్ కేషారీని 221 ఓట్ల స్వల్ప తేడాతో ఓడించారు. బిశ్వాస్ 120,114 ఓట్లు (47.77%) సాధించగా, కేషారీ 1,19,893 ఓట్లు (47.68%) పొందారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఉత్కంఠభరిత విజయాలలో ఒకటి. ఇది కూడా చదవండి: Sweden: జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి
హారర్ సఫారీ!.. చిరుత భయంకర దాడి
సాధారణంగా సఫారీ అంటే అద్భుతమైన అనుభూతి.. కానీ, బెంగళూరులోని బన్నేరుఘట్ట జాతీయ పార్కుకు వెళ్లిన ఒక చెన్నై మహిళకు మాత్రం అది భయంకరమైన పీడకలగా మిగిలిపోయింది. అడవి జంతువుల్ని చూసేందుకు ఆమె ఉత్సాహంగా సఫారీ బస్సులో ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి ఓ చిరుత ఒక్కసారిగా బస్సుపైకి దూకి, రక్షణ కోసం ఏర్పాటు చేసిన జాలీలోంచి ఆమె చేతిపై పంజా విసిరింది..బస్సుపైకి దూకిన చిరుత.. చెన్నైకి చెందిన 56 ఏళ్ల వహితా భాను అనే మహిళ గురువారం మధ్యాహ్నం 1 గంట స మయంలో బన్నేరుఘట్ట జాతీయ పార్కులో చిరుత సఫారీ ట్రిప్లో పాల్గొన్నారు. ఆమె కదలికలను గమనిస్తున్న చిరుత ఒక్కసారిగా బస్సు పైకప్పు పైకి లంఘించింది. అద్దం పక్కనే ఉన్న జాలీ ద్వారా లోపలికి పంజా విసిరి మహిళను గాయపరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. బస్సుపైకి చిరుత ఎక్కి, కిటికీ గుండా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. చిరుత పంజా దాడి లో వహితా భాను చేతికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం జిగానిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.A 50-year-old woman from Chennai suffered injuries to her hand after a leopard at Bannerghatta Biological Park leapt onto a safari bus and clawed her. She was immediately rushed to a hospital in Jigani and is currently stable.Following the incident, the park authorities have… pic.twitter.com/QStkaAVBxK— India Today NE (@IndiaTodayNE) November 14, 2025 భద్రత ప్రశ్నార్థకం సాధారణంగా, జంతువులు, సందర్శకుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నివారించడానికి సఫారీ బస్సులకు కిటికీలు, ఇతర రంధ్రాలపై లోహపు వైర్ మెష్ (జాలీ) అమర్చుతారు. అయితే, ఈ చిరుత ఆ జాలీలోని చిన్న ఖాళీ గుండా లోపలికి పంజా విసిరి మహిళను రక్కగలిగింది. ‘మహిళ చేతికి గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు’.. అని ఒక అధికారి వెల్లడించారు.తాత్కాలికంగా సఫారీ నిలిపివేత గతంలో కూడా చిరుత దాడి జరిగిన నేపథ్యంలో.. బస్సుల భద్రతను పూర్తిగా అంచనా వేసే వరకు, నాన్–ఏసీ బస్సు సఫారీని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘సమస్య పరిష్కారమయ్యే వరకు వాహనాల పూర్తి భద్రతను అంచనా వేస్తాం. సందర్శకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’.. అని పేర్కొన్నారు. బన్నేరుఘట్ట జాతీయ పార్కులో జరిగిన ఈ ఘటన సఫారీ వాహనాల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కనీస రక్షణ ఏర్పాట్ల విషయంలో ఏ మాత్రం చిన్న లోపం ఉన్నా.. ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఈ సంఘటన రుజువు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్
బిహార్లో కాంగ్రెస్ కనుమరుగు!!
న్యూఢిల్లీ: సరిగ్గా 40 ఏళ్ల క్రితం బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కుపైగా స్థానాల్లో విజయపతాక ఎగరేసింది. శుక్రవారం వెలువడిన ఎన్నికల్లో కేవలం ఆరు చోట్ల గెలిచింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. 1952 ఎన్నికల్లో 41.38 శాతం ఓట్లను ఒడిసిపట్టిన కాంగ్రెస్ ప్రభ 1990వ దశకం నుంచి తగ్గుతూ వస్తోంది. ఈసారి 50కిపైగా స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్.. అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం, జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం)ల స్థాయికి పడిపోయింది. ఎంఐఎం, హెచ్ఏఎంలు చెరో 5 చోట్ల గెలిచాయి. 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు షేరు కాస్తంత పెరిగింది. 2010లో పోలైన ఓట్లలో కాంగ్రెస్కు 8.17 శాతం ఓట్లు పడితే ఈసారి కాస్తంత ఎక్కువగా 8.75 శాతం ఓట్లు పడ్డాయి. తిరుగుబాటు నేతలను దారి తెచ్చుకోవడం, కీలక నేతల మధ్య సమన్వయం పెంచడం, ఓడిన స్థానాల్లో తిరిగి పట్టుసాధించి విజయం సాధించే క్రమంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతోంది. 1985లో వందకుపైగా సీట్లు గెలిచిన పార్టీ తర్వాత 1990లో కేవలం 71 స్థానాలకు పరిమితమైంది. అప్పటి నుంచి గెలుపు కోత మొదలైంది. 1995లో 29 చోట్ల, 2000లో 23 చోట్ల గెలిచింది. ఇక 2005లో పదంటే పది చోట్ల విజయం సాధించింది. శుక్రవారం ఫలితాలను చూస్తే హెచ్ఏఎం(సెక్యులర్) నేత చేతిలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్కుమార్ సైతం ఓడిపోయారు. ‘కుటుంబ’నియోజకవర్గంలో హెచ్ఏఎం అభ్యర్థి లలన్రామ్ .. రాజేశ్ కంటే 21,525 ఓట్లు ఎక్కువ సాధించారు. రాహుల్గాంధీ తలకెత్తుకున్న ఓటు చోరీ నినాదం బిహార్లో ఏమాత్రం పనిచేయలేదు. రాహల్ చేసిన ఓటర్ అధికార్ యాత్ర, ఓటర్లజాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై విమర్శలు, ప్రజాస్వామ్యాన్ని జెన్ జెడ్ యువతరం కాపాడాలన్న పిలుపులకు ఓటర్ల నుంచి ఎలాంటి స్పందనాలేదు. గతంతో పోలిస్తే బిహార్లో మౌలికవసతుల అభివృద్ధి వేగంగా జరగడంతో ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గుచూపడంతో కాంగ్రెస్ ఓటమి రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యరి్థని నిలపలేకపోవడం, ఉన్న కొన్ని ఓట్లను కొత్తగా వచ్చిన జనసురాజ్ పార్టీ చీల్చడంతో మరికొన్ని స్థానాలు కాంగ్రెస్ చేతుల్లోంచి జారిపోయాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం విప్లవాత్మకంగా సంస్థాగత సంస్కరణలకు తెగించకపోతే అధికారాలను కోల్పోయే పరంపర కొనసాగుతుందని రాజకీయ పండితులు విశ్లేíÙంచారు.
షాకిచ్చిన ఉప ఫలితాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లోని 8 నియోజకవర్గాలకు ఈనెల 11వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగింటిని అధికార పక్షాలు దక్కించుకున్నాయి. బీజేపీ పాలిత రాజస్తాన్లో కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకోగా, జమ్మూకశ్మీర్లోని బుద్గాం స్థానం అధికార నేషనల్ కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారిగా ఓటమి పాలైంది. ఇక్కడ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ)అభ్యర్థి విజయం సాధించారు. జమ్మూకశ్మీర్లోని నగ్రోటా సీటును బీజేపీ నిలబెట్టుకుంది. మిజోరంలో ప్రధాన ప్రతిపక్షం మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) డంపా సీటును, పంజాబ్లోని తరన్తరన్ స్థానాన్ని ఆప్, జార్ఖండ్లోని ఘట్శిలా స్థానాన్ని జేఎంఎం నిలబెట్టుకున్నాయి. అదేవిధంగా, తెలంగాణలోని జుబ్లీహిల్స్ స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. ఒడిశాలోని నౌపడ స్థానాన్ని బీజేపీ భారీ మెజార్టీతో తిరిగి గెలుచుకుంది. ఉప ఎన్నిక ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులకు విజయం అందించిన జమ్మూకశ్మీర్లోని నగ్రటా, ఒడిశాలోని నౌపడ నియోజకవర్గాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎమ్మెల్యేలైన దేవయాని రాణా, ధొలాకియాలను ఆయన అభినందించారు. వీరి గెలుపునకు అహరి్నశలు కృషి చేసిన కార్యకర్తలకు ఎక్స్లో ధన్యవాదాలు తెలిపారు. కంచుకోటలో ఎన్సీ ఓటమి బుద్గాం నియోజకవర్గం అబ్దుల్లాల కుటుంబానికి కంచుకోటగా ఉంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అగ్రనేత ఒమర్ అబ్దుల్లా బుద్గాంతోపాటు గండేర్బల్ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, సీఎం అయ్యాక బుద్గాంకు రాజీనామా చేశారు. దీంతో, 11న ఉప ఎన్నిక జరిగింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఇక్కడ ప్రతిపక్ష పీడీపీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ విజయం సాధించారు. ఎన్సీ అభ్యర్థి ఆగా సయ్యద్ మెహ్మూద్పై ముంతజీర్ 4,478 ఓట్ల తేడాతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. 1957లో మొదటిసారిగా ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఓటమి ఎరుగని ఎన్సీకి మొట్టమొదటి పరాజయమిది. డిపాజిట్ కోల్పోయిన ఎన్సీ జమ్మూకశ్మీర్లోని నగ్రోటా స్థానాన్ని బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా గెలుచుకున్నారు. జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ(జేకేఎన్పీపీ)కి చెందిన హర్‡్ష దేవ్ సింగ్పై 24,647 ఓట్ల తేడాతో దేవయాని గెలిచారు. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యరి్థని షమీమ్ బేగం డిపాజిట్ కోల్పోయారు. ఆమెకు కేవలం 10,872 ఓట్లు మాత్రమే దక్కాయి. దివంగత ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా కుమార్తె దేవయాని. దేవేందర్ మరణంతో ఉప ఎన్నిక జరిగింది. నౌపడలో బీజేపీ భారీ మెజార్టీ ఒడిశాలోని నౌపడ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి జే ధొలాకియా గెలుచుకున్నారు. సమీప ప్రత్యరి్థ, కాంగ్రెస్కు చెందిన ఘాసీ రామ్ మాఝిపై 83,748 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దివంగత బీజేడీ ఎమ్మెల్యే రాజేంద్ర ధొలాకియా కుమారుడు జె. రాజేంద్ర మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీకి ఎదురుదెబ్బ రాజస్తాన్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అంటా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది. బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్పై కాంగ్రెస్ నేత ప్రమోద్ జైన్ భయా 15,612 ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనా ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో అనర్హత వేటు పడింది. దీంతో, ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. సీటు నిలుపుకున్న ఆప్ పంజాబ్లోని తరన్ తరన్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు తన సమీప ప్రత్యరి్థ, శిరోమణి అకాలీదళ్కు చెందిన సుఖ్వీందర్ కౌర్ రణ్ధవాపై 12,091 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆప్ ఎమ్మెల్యే కశ్మీర్ సింగ్ సొహాల్ జూన్లో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిపారు.జార్ఖండ్లో బీజేపీ ఓటమి జార్ఖండ్లోని ఘట్శిలా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన సోమేశ్ చంద్ర సోరెన్, సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన బాబూలాల్ సోరెన్ను 38,500 ఓట్ల తేడాతో ఓడించారు. జేఎంఎం ఎమ్మెల్యే రాందాస్ సోరెన్ కుమారుడే సోమేశ్. రాందాస్ ఆగస్ట్ 15వ తేదీన హఠాన్మరణం చెందగా ఉప ఎన్నిక చేపట్టారు. స్వల్ప తేడాతో విజయం అధికార జొరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) అభ్యర్థి వన్లాల్ సైలోవా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనపై ఎంఎన్ఎఫ్ అభ్యర్థి ఆర్.లాల్థంగ్లియా 562 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎంఎన్ఎఫ్కు చెందిన డంపా శాసనసభ్యుడు లాల్రిన్ట్లువాంగా సైలో జూలైలో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు.
ఎన్ఆర్ఐ
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
నా కొడుకును కొట్టి చంపేశారు!
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల: ట్రిపుల్ ఐటీ విద్యార్థి మరణంతో ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎంపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు మూడు వేల మంది విద్యార్థుల ధర్నాలు, నినాదాలతో హోరెత్తింది. తోటి విద్యార్థి సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో ఇన్నాళ్లు వారిలో దాగి ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ మంచి విద్యార్థిని అన్యాయంగా చంపేశారనే భావన వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో కొన్నేళ్లుగా కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు చేస్తున్న ఆగడాలు బట్టబయలవ్వడమే కాక కళాశాలలో ఇన్నాళ్లు గుట్టుగా జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమీ తెలియదట.. విద్యార్థి సృజన్ను రాత్రంగా సీనియర్లు కొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా.. మరుసటి రోజు ఉదయం సృజన్ ఆత్మహత్య చేసుకున్నా అంబులెన్సు వస్తే గానీ తనకు తెలియదని క్యాంపస్ డైరెక్టర్ చెప్పడం అక్కడి యాజమాన్య నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. గతంలోనూ ఆత్మహత్య ఘటనలు జరగడంతో పోలీసుల సాయంతో ఈ సారి కూడా గొడవను సద్దుమణిగేలా చేద్దామని యాజమాన్యం తీవ్రంగా ప్రయతి్నంచింది. కానీ విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనల ముందు ఇటు పోలీసులు, అటు కళాశాల యాజమాన్యం తలొగ్గక తప్పలేదు. కుటుంబసభ్యులు, విద్యార్థులు ఆ రాత్రి కొట్టింది తొమ్మిది మంది అని చెప్పినప్పటికీ పోలీసులు ఎట్టకేలకు 8 మందిని అదుపులోకి తీసుకోవడంతో కాస్త శాంతించి వెనుదిరిగారు. బుధవారం రాత్రే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించినా.. శుక్రవారం విద్యార్థులు, సృజన్ కుటుంబీకుల ఆందోళనలు సద్దుమణిగాకే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు ఘటనకు బాధ్యులైన ఎనిమిది మంది విద్యార్థులు వై.అమిత్, ఎస్కే అనీష్ అహ్మద్, బి.అభిష్క్, జె.చిన్నబాబు, షేక్ అజీల్, ఎస్కే మస్తాన్, ఎస్కే సమీర్, ఎ.భానుప్రకాష్లను సస్పెండ్ చేశారు. తప్పుడు ప్రచారంపై మండిపాటు.. యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య ధోరణి కనిపించడం.. మీడియా ముందు వాస్తవాలు చెప్పేందుకు కూడా ఆంక్షలు పెట్టడంతో విద్యార్థులు తట్టుకోలేకపోయారు. దీనికితోడు ‘సృజన్ బ్యాక్లాగ్స్ ఉంచేశాడు.. కళాశాలలో ఉన్న అమ్మాయితో చెడుగా ప్రవర్తించాడు.. అమ్మాయి సోదరుడు ఒక్కరే రెండు చెంపదెబ్బలు కొట్టాడు..’ వంటి తప్పుడు వదంతులు సృష్టించారంటూ మండిపడ్డారు. ఉదయం నుంచే ధర్నా.. సృజన్ తల్లిదండ్రులు, కుటుంబీకులు గురువారం ఉదయం 6 గంటలకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పక ముందే డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు రెండు బృందాలుగా విడిపోయి ధర్నాకు దిగారు. తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని సృజన్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ లోగా కళాశాల యాజమాన్యం సమక్షంలో సృజన్ తల్లిదండ్రులతో డీస్పీ వివేకానంద, సీఐ అవతారంలు చర్చించారు. విద్యార్థుల ఆందోళనను విరమించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకోవడం, సృజన్ తల్లిదండ్రులు సైతం విజ్ఞప్తి చేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.అవన్నీ అబద్ధాలే.. సృజన్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బ్యాక్లాగ్స్ ఉంచేశాడని, మంచివాడు కాడని, చదువు వల్ల చనిపోయాడన్నది నిజం కాదు. సీనియర్స్ దాడి చేశారన్నది నిజం. ముందు రోజు సృజన్పై దాడి ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకున్నాక తప్పుగా పోలీసులకు వెళ్లింది. 11వ తేదీ రాత్రి 11 నుంచి 3 గంటల వరకు సీనియర్లు 9 మంది కొట్టి వేధించారు. తెల్లవారేసరికి అంతా పరీక్షలకు వెళ్లాం. సృజన్ రాలేదు. వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సృజన్ జూనియర్ విద్యారి్థనిని చెల్లి అని పిలుస్తాడు. అదే భావంతో ఉంటాడు. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యారి్థని కజిన్కు ఈ విషయం నచ్చేది కాది. సృజన్ను హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ సృజన్ చనిపోయే ముందు అమ్మాయి పిలిచి మాట్లాడటం వేరే వాళ్ల ద్వారా వారికి తెలిసింది. అందుకే ఇలా జరిగింది. – సృజన్ క్లాస్మేట్స్ ఏం ప్రయోజనం.. ఎంతమంది ధర్నాలు చేస్తే ఏంటి.? ఎంతమంది పోలీసులు వస్తే ఏంటి..? చెట్టంత కొడుకుపోయాడు. – జ్యోతి, సృజన్ తల్లి చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు.. మా మేనల్లుడు సృజన్ కుర్చీ వేసుకుని ఫ్యాన్కు ఉరేసుకున్నాడన్నారు. అది నిజం కాదు. వాడి ఎత్తు 5.9 అడుగులు. ఫ్యాన్ కూడా అందేస్తుంది. రాత్రి 11 నుంచి 3 వరకు హింసించి, కొట్టి చంపేశారు. అలా తెచ్చి ఫ్యాన్కు ఉరేసినట్లు కట్టారు. – చుక్కా శంకరరావు, మేనమామ కొట్టి చంపేశారు... నేను ఆటోడ్రైవర్ను. ఇంటర్ నుంచి ఇదే కళాశాలలో సృజన్ను చదివిస్తున్నాను. కుమారుడిని అన్యాయంగా కొట్టి చంపేశారు. కొట్టినవారిలో ఐదారుసార్లు డిబార్ అయినవారు కూడా ఉన్నారు. మీ సృజన్ అటువంటి వాడు కాదని, కావాలనే చెడు వ్యక్తిగా చిత్రీకరించారని 2వేల మందికి పైగా విద్యార్థులు అంటున్నారంటే మావాడు ఏమీ తప్పు చేయలేదని గ్రహించాలి. పోలీసులు న్యాయం చేయాలి. – శివకృష్ణ ప్రసాద్, సృజన్ తండ్రి
Hyderabad: అశ్లీల ఫొటోలు పంపి మహిళకు వేధింపులు
హైదరాబాద్: ఓ మహిళకు వాట్సాప్లో అశ్లీల ఫొటోలు పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. మార్గదర్శికాలనీ విజయలక్ష్మి అనెక్స్ అపార్టుమెంటులో ఓ మహిళ (41) నివాసముంటోంది. అదే అపార్టుమెంటులో ఉండే నాగిరెడ్డి నాగసుబ్బారెడ్డి (32) కొద్ది రోజులుగా ఆమె ఫోన్కు అశ్లీల చిత్రాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మందలించి పంపించారు. అయితే సుబ్బారెడ్డి బాధితురాలికి ఫోన్ చేసి ఇక ముందు అశ్లీల ఫొటోలు పంపించకుండా ఉండాలంటే తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. మరోసారి బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని వీహెచ్పీ నాయకులు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జరిగిన సంఘటనపై పూర్తి విచారణ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
అత్యాచార కేసులో 35 ఏళ్ల జైలు
శాంతినగర్/ ఎర్రవల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రవికుమార్ సంచలన తీర్పులు వెలువరించారు. ఇద్దరు బాలికల అత్యాచార కేసులకు సంబంధించి నిందితులకు 35, 25 ఏళ్ల జైలుశిక్ష, జరిమానా విధించారు. వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లికి చెందిన ఓ బాలికకు ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్కు చెందిన వడ్డె వెంకటరమణ అలియాస్ లక్కీ (23)తో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి హిందూపూర్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లి గతేడాది అక్టోబర్ 10న శాంతినగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు విన్న మేజి్రస్టేట్... వెంకటరమణ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి 25 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.40 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఘటనలో.. జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని గార్లపాడుకు చెందిన చాకలి హరిచంద్ర 2017లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కోదండాపురం పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ యాదగిరి విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను విన్న జడ్జి రవికుమార్ నేరస్తుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానాతోపాటు బా ధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాల ని తీర్పు వెలువరించారు. నిందితులకు శిక్ష ప డేలా కృషిచేసిన డీఎస్పీ, ఎస్ఐలు, న్యాయవా దులు, కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
నడిరోడ్డుపై భార్యను కిరాతకంగా..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచాడు. మెడపై పొడిచి పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్.. భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సరస్వతి దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 14న విజయ్, సర్వసతీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరస్వతి.. వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్గా పని చేస్తుండగా.. భర్త విజయ్.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారి పట్టపగలే భార్యను విజయ్ దారుణంగా హత్య చేశాడు. భార్య సరస్వతి రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివాసం ఉంటుందిప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?కాగా, ప్రత్యక్ష సాక్షి బాలయ్య సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతిని విజయ్ కత్తితో పొడిచిన సమయంలో తాను ఆపే ప్రయత్నం చేశానని తెలిపారు. ‘‘దగ్గరకి వెళ్తే.. మీకు దీని గురించి తెలియదు నన్ను అపకండంటూ విజయ్ గట్టిగా అరిచాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. జైలుకి పంపించింది అందుకే చంపేస్తున్నా అంటూ అరిచాడు. వద్దని వారించిన మెడపై కత్తి తో పొడిచాడు.. పీక కోసి రాక్షసుడిలా బిహేవ్ చేశాడు. ఆసుపత్రిలో సరస్వతి డ్యూటీ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. అప్పుడే కత్తితో దాడి చేశాడు‘‘ అని బాలయ్య వివరించారు.
వీడియోలు
లులూ మాల్ లో గోమాంసం.. టీడీపీ MOUపై పవన్ సీరియస్
క్లాస్ దారి పట్టిన మాస్ రాజా
విశాఖ అభివృద్ధిపై YS జగన్ మోహన్ రెడ్డి మార్క్
కోటి సంతకాల సేకరణలో అన్నా రాంబాబు
నితీష్ ఇంటికి చిరాగ్ పాశ్వాన్.. బీహార్ లో కొత్త సీఎం..
ఫొటోలకే తప్ప పావలాకి కూడా పనికిరాని డిప్యూటీ సీఎం
స్టూడెంట్స్ చస్తున్నా.. నో యాక్షన్.. నో రియాక్షన్
Chirla Jaggireddy: చంద్రబాబుని చూసి కుక్కలు కూడా భయపడటం లేదు
హైదరాబాద్ బిర్యానీ పై బాబు కామెంట్స్ జక్కంపూడి విజయలక్ష్మి సెటైర్లు
మాగంటి సునీత ఇంటికి కేటీఆర్
