ప్రధాన వార్తలు

తమలపాకుతో కొట్టినట్లు.. నెమలీకతో మొట్టినట్లు..!
మొదట్నుంచి చంద్రబాబు తీరే అంత.. రకరకాల హామీలు.. రంగురంగుల అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి ఉన్నంత ఆరాటం.. ఆత్రం పాలనలో ఉండదు.. తనకుతాను విజనరీని అనుకుంటూ భ్రమల్లో ఉంటూ విదేశీ విహారాలు.. అంతర్జాతీయ సదస్సులు.. సెలబ్రిటీలతో ఫొటోలతో కాలం గడుపుతూ ఉంటారు.. ఇటు ఎమ్మెల్యేలు దాదాపుగా తమ నియోజకవర్గాలకు సీఎంలుగా భావించుకుంటూ ఏకంగా నియంతలుగా మరి చెలరేగిపోతుంటారు.. ఇది పలుసందర్భాల్లో రుజువైంది.ఇలా ఎమ్మెల్యేలు కట్టుతప్పి మీడియాకు.. ప్రతిపక్షాలకు వార్తంశంగా మారిన ప్రతిసందర్భంలోనూ చంద్రబాబు సీరియస్ గెటప్ వేస్తారు. వెంటనే కళ్ళు పెద్దవి చేస్తూ అందరిమీదా ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. ఎమ్మెల్యేలు భయ పడతారు. సొంత పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో చంద్ర నిప్పులు అంటూ కథనాలు వస్తాయి.. ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయాక మళ్ళీ అందరూ ఎవరి స్టయిల్లో వాళ్ళు జనం మీద స్వారీ చేస్తారు.. మళ్ళీ బాబుగారు ఆగ్రహం నటిస్తారు.. తమలపాకుతో తీవ్రంగా కొడతారు.. నెమలీకలతో మొట్టికాయలు వేస్తారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఆ దెబ్బలకు తాళలేక ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ కుయ్యో మొర్రో.. ఇక ముందు మేం తప్పులు చేయం అని ఎటెన్షన్ లోకి వస్తారు.. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే.తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా తనకుతాను మహరాజులా.. నియోజకవర్గానికి సర్వాంతర్యామిలా మారిపోయి అధికారం చెలాయిస్తున్నారు. సత్యవేడు ఎమ్మెలు ఆదిమూలం , గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వంటివాళ్ళు మహిళలను వేధించే పనుల్లో బిజీ అయ్యారు. వారిమీద సొంతపార్టీ కార్యకర్తలే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అయితే ఏకంగా ప్రభుత్వ సిబ్బందికి రాత్రిపూట ఫోన్లు చేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయన దెబ్బకు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు ప్రయత్నించారు.ఇక నిన్నగాక మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అయితే తగిన మత్తులో ఏకంగా ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ సిబ్బందిని తెలుగుదేశం ఎమ్మెల్యే కొట్టినా అయన చప్పుడు చేయలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక రౌడీ షీటర్ కు పెరోల్ ఇప్పించగా ఆ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఇక ఎచ్చెర్ల జనసేన ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర రావు అయితే నియోజనవర్గంలోని ఏ వ్యాపార సంస్థనూ వదలడం లేదు.. నెలవారీ మామూళ్లు ఇవ్వకుంటే వ్యాపారాలు నడవదు అని బహిరంగ వార్ణింగ్ ఇస్తున్నారు. జమ్మలమడుగులో సిమెంట్ కంపెనీలు నడవాలంటే నా కనుసన్నల్లో ఉండాలి అంటూ చెలరేపోతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఆపేవాళ్లు లేకపోతున్నారు.నిన్నటికి నిన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఏకంగా జూనియర్ ఎన్టీయార్ మీద ఇష్టానుసారం మాట్లాడి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా అభిమానులు హైద్రాబాదులో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే తీరును ఖండించారు. ఇది పార్టీని ఇబ్బంది పెట్టింది. మరోవైపు ఈ రౌడీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇంచార్జి మంత్రులకు అప్పగించాలని చినబాబు లోకేష్ నిర్ణయించారట.ఏకంగా చంద్రబాబు వార్నింగులనే పట్టించుకోని ఈ ముదురు ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రిని లెక్క చేస్తారా? ఆయన మాకన్నా ఏం ఎక్కువ.. అయన చెబితే మేం వినాలా.. అసలు మా జిల్లాలో పక్కజిల్లా మంత్రి పెత్తనం ఏమిటన్న ఉక్రోషంతో ఉన్న ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రి మాటలు ఖాతరు చేస్తారా అని పార్టీ ఇన్సైడర్ టాక్ నడుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కోకిలపూడి శ్రీనివాస్ కూడా గెలిచింది మొదటి సారి కానీ బండెడు ఆరోపణలు.. పుట్టెడు వివాదాలతో తులతూగుతున్నారు.ఇక పరిస్థితి చేయిదాటిపోతుంది జనంలో పార్టీ, ప్రభుత్వం పరువుపోతుందని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన మరుక్షణం చంద్రబాబు సీరియస్ అవుతుంటారు.. ఇలా ఐతే ఉపేక్షించను.. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను.. ఈ విషయంలో ఎవర్నీ క్షమించేది లేదని హెచ్చరిస్తారు.. కాదు కాదు.. హెచ్చరించినట్లు కలరింగ్ ఇస్తారు.. ఇటు ఎమ్మెల్యేలు కూడా బెదిరిపోయినట్లు నటిస్తారు.. అందరూ చాయ్ తాగి సమోసాలు తిని భుజమ్మీద చేతులు వేసుకుంటూ బయటకు వస్తారు.. మళ్లీయే ఎవరి దందాలు వాళ్ళవి. ఇలా ఉంటుంది బాబుగారి ఆగ్రహం.-సిమ్మాదిరప్పన్న

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ను వదిలేసిన హనుమ విహారి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ని ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి వదిలేశారు. త్రిపుర రాష్ట్రానికి ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. 2025-26 కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న విహారి.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్తో విసిగి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. సీనియర్ ప్లేయర్ అయిన తనకి అవకాశాలు ఇవ్వటం లేదని.. మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్నా కానీ అవకాశం ఇవ్వట్లేదని హనుమ విహారి ఆవేదన వ్యక్తం చేశారు.ఇండియా జట్టులో సైతం ఆడి తన ప్రతిభ కనబర్చిన విహారికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఏపీని వదిలి కొత్త వాతావరణంలో ఆడాలని ఆయన నిర్ణయించారు. క్రీడల్లో కూడా కూటమి సర్కార్ రాజకీయాన్ని చొప్పించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జమ్మూకశ్మీర్: విరిగిపడిన కొండచరియలు.. ఐదుగురి మృతి
జమ్మూకశ్మీర్ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఐదుగురు మృతి చెందగా.. 14 మందికి గాయపడ్డారు. వైష్ణోదేవి యాత్ర మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపేశారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.పలు రైళ్లను కూడా రద్దు చేశారు. కత్రా నుండి బయలుదేరే దాదాపు 10 రైళ్లు రద్దయ్యాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై చందర్కోట్, కేలా మోర్, బ్యాటరీ చెష్మా వద్ద వాహనాలను నిలిపివేశారు. ఉధంపూర్, కాజిగుండ్ వద్ద కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిష్త్వార్, రాంనగర్-ఉధంపూర్, జంగల్వార్-థత్రి మార్గాలు దెబ్బతిన్నాయి.కథువా జిల్లాలో సహార్ ఖడ్ నదిపై వంతెన దెబ్బతింది. దీంతో జమ్మూ-పఠాన్కోట్ హైవేపై రవాణా నిలిచిపోయింది. నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. మొధోపూర్ బ్యారేజ్ ఒక లక్ష క్యూసెక్కుల నీటిని దాటి పోయింది. ఉధంపూర్లో తావి నది 20 అడుగుల ప్రమాద స్థాయిని దాటి పోయింది. చెనాబ్ నది 899.3 మీటర్లకు చేరింది. ఆగస్టు 27 వరకు జమ్మూ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కాశ్మీర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.⚠️ Heavy rains trigger landslide on Vaishno Devi Yatra Route Near Adhkwari➡️ 5 pilgrims dead, 14 injured➡️ Yatra suspended, trains & routes disrupted➡️ Red alert issued,heavy rains to continue for 40 hrsRescue ops & helplines active.#JammuKashmir #VaishnoDevi #jammufloods pic.twitter.com/lGqlw6IYvL— Abheet Sangotra 🇮🇳 (@abheet20) August 26, 2025

మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?
భారతదేశంలో ఎన్నో సామాజిక వర్గాలకు చెందినవారు వ్యాపారాలు సాగిస్తున్నారు. అందులో చాలామంది విజయం సాధిస్తున్నారు. అయితే మార్వాడీ సామాజిక వర్గానికి మాత్రం వ్యాపారం చేయడంలో, అందులో విజయం సాధించడంలో ప్రత్యేక స్థానం ఉంది. వారి ఆర్థిక ఆలోచనా విధానం, వ్యాపార పద్ధతులు కాస్త భిన్నంగా ఉంటాయి. దాంతో వీరు వ్యాపారంలో ముందుంటున్నారనే వాదనలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీసుకురావడంలో ఈ వర్గం ప్రావీణ్యం పొందిందని కొందరు చెబుతుంటారు. అయితే వీరు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం.చిన్నతనం నుంచే...మార్వాడీ కుటుంబాల్లో చిన్నప్పటి నుంచే వ్యాపార అంశాలను పిల్లలకు నేర్పిస్తారు. చాలా షాపులు, వ్యాపారాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే మెలకువలు నేర్పిస్తారు.ఖర్చు చేయడం కన్నా పొదుపు చేయడంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.మార్వాడీలు ఏదైనా వస్తువు కొంటే ధర తగ్గించేందుకు భేరమడడం అలవాటు చేసుకుంటారు. ఇది తమ వ్యాపారాల్లో పెట్టుబడిని తగ్గించి లాభాలకు కారణం అవుతుంది.వ్యాపారంలోని ప్రమాదాలను స్వీకరించి అందుకు అనుగుణంగా ముందుకుసాగేలా సానుకూలతను అలవర్చుకుంటారు.నగదు ప్రవాహంపై ఫోకస్అధిక రుణాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం కంటే సొంత నిధులతో బిజినెస్ నడిపిస్తారు.లాభాలను తిరిగి వ్యాపారంలోకే మళ్లిస్తారు.నగదు ప్రవాహంపైనే ప్రధానంగా దృష్టి పెడుతారు.బిజినెస్ మోడల్స్వ్యాపారం, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.ఎక్కువ రిస్క్ ఉన్న వ్యాపారాల జోలికి వెళ్లరు.దశల వారీగా పెరిగే అవకాశాలున్న వ్యాపారాలనే ఎంచుకుంటారు.కమ్యూనిటీ నెట్వర్క్నమ్మకంతో బిజినెస్ సంబంధాలను పెంపొందించుకుంటారు.అప్పు, పెట్టుబడి, మార్కెట్ యాక్సెస్ కోసం సామాజిక సంబంధాలను ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగించుకుంటారు.తరతరాల సంపద నిర్మాణంవ్యాపార వారసత్వాన్ని జాగ్రత్తగా, ప్రణాళికబద్ధంగా ఉండేలా చూసుకుంటారు.ఆస్తులను, తమ పెట్టుబడులను విభిన్న రంగాలకు విస్తరిస్తారు. రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ మార్కెట్లు వంటి వాటిలో పెట్టుబడి పెడుతారు.ఇదీ చదవండి: అమెజాన్ కొత్తగా మరో 40 ఆశ్రయ్ కేంద్రాలు

వినాయక చవితి పూజ ప్రాముఖ్యత అష్టోత్తరం
పూజ ప్రాముఖ్యతవినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ఏ శుభకార్యం మొదలుపెట్టే ముందు ‘వక్రతుండ మహాకాయ‘ మంత్రంతో ఆయనను ప్రార్థించడం ఆచారం.మొదట గణపతి పూజ చేయడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. జ్ఞానం, బుద్ధి, ధైర్యం ప్రసాదిస్తాడు. భక్తుని మనసులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని విశ్వాసంవినాయకచవితి పండుగ వచ్చిందంటే ఉదయాన్నే మేల్కొని, అభ్యంగన స్నానమాచరించి, పూజా ఏర్పాట్లు మొదలుపెడతాం. ఇంటిని శుభ్రపరచుకొని, అరటిబోదెలతో, పుష్పాలతో మంటపాన్ని అలంకరించి, పైన పాలవెల్లి వ్రేలాడదీసి మండపంలో స్వస్తిక్ పద్మాన్ని లిఖించి, హరిద్రా గణపతిని, మట్టి వినాయకుని స్థాపించి, దీపారాధన గావించి స్వామిని ఆహ్వానిస్తాం. సేకరించిన పత్రి, గరిక (దుర్వాయుగ్మాలు)లతో, అర్కపూలతో, షోడశోపచారాలతో పూజించి, యథాశక్తితో ఉండ్రాళ్లు, చలిమిడి, వడపప్పు తదితర ప్రసాదాలు నివేదించి వినాయక కథ, శమంతకోపాఖ్యానము చదువుకొని లేదా విని అక్షింతలు కొన్ని స్వామి పాదాలవద్ద వుంచి, తమ శిరస్సుపై ధరించాలి.శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవిపూజాద్రవ్యాలు : వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునెయ్యి లేదా నువ్వులనూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశం, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.పూజావస్తువులు : దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/ తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠం.నైవేద్యం : ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, దోసపండు, పిండివంటలు మొదలగునవి.పూజాపత్రి : గరిక, మాచిపత్రి, బలురక్కసి లేక ములక, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ : శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించు కోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో : విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడం శుభఫలదాయకం.గణేశుని పూజ పూజకు ఏర్పాట్లుముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమలతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన : (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘ యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘ దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి : (పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ గణేశాయ నమఃశ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాఃశ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజఃషోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపిఃవిద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనంఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి.గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామముఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనఃఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘సంకల్పం : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, ్జకృష్ణా – గోదావరి నదీ మధ్య ప్రదేశే స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, ఋధవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ................................ (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ : (కలశాన్ని గంధం, పుష్పాలు, అక్షతలతో పూజించి కలశంపై కుడిచేతిని ఉంచి, కింది శ్లోకం చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితఃమూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాఃకుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణఃఅంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాఃగంగేచ యమునేచైవ కృష్ణా గోదావరి సరస్వతి!నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానాంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని కింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను) గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత ఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాధనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను) స్వామికి పుష్పాలతో పూజ(ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి(పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని తిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడిచేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ కింది మంత్రాలు చెప్పుకోవలెను).ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహాశ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ çఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)స్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా ఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురుధ్యానం : స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘విఘ్నాంధ కారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...)ప్రాణ ప్రతిష్ఠః (స్వామి వారికి ప్రాణం పోయుట) ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధివినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్ : స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘ఆసనమ్ : స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘పాద్యమ్ : స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘అర్ఘ్యమ్ : స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్ : స్వామి వారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనాథం నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి.పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ కింద చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు : ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు : ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి : ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార : ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.)వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలను గాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధమ్ : (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.అక్షతలు : (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘సింధూరం : శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘మాల్యం : శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు).సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అథాంగ పూజా : (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి.దూర్వాయుగ్మ పూజ గరికతో లేని పక్షంలో అక్షతలతో పూజించాలిఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక) ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు) ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు) ఓం çహరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు) ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి) ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి) ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు) ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ) ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు) ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం) ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు) ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు) ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్దె) ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు) ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘(21 రకాల ఆకులను కలిపి వేసి నమస్కారం చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఆఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్త దేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

‘నా భర్తను కాపాడండి.. నా చివరి కోరిక తీర్చండి’
సాక్షి,మహబూబ్ నగర్: యశోద అనే మహిళ రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తాను పడుతున్న మనోవేధనను, చివరి కోరికను ఇంట్లో బ్లాక్ బోర్డుపై రాసింది.నా భర్తను కాపాడండి.. రేబిస్ ఉంది. వ్యాక్సిన్కు తగ్గదు. చెట్టు మందు తినిపించండి. మీరు చేయించండిలక్కీని ఆస్పత్రిలో చూపించు వాడికి రేబిస్ ఉంది.నా చివరి కోరి ధారూర్(వికారాబాద్)లో చెట్టు మందు తాగు.. లేట్ చేయకు.. అంటూ బాధితురాలు తన చివరి క్షణాల్లో కుటుంబం గురించి ఆలోచించి తనువు చాలించింది. మహబూబ్ నగర్ జిల్లా మొనప్పగుట్టలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. యశోద అనే మహిళ రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది.పోలీసుల వివరాల మేరకు..యశోద గత జూన్ నెలలో తన ఇంటి ఆవరణలో పల్లీలు,డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టింది. అవే పల్లీలు,డ్రై ఫ్రూట్స్ను వంటకాల్లో వాడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ సభ్యులకు రేబిస్ సోకిందని అనుమానం పెట్టుకుంది.ఆ అనుమానంతోనే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ యాంటీ రేబిస్ ఇంజక్షన్ చేయించింది. నాటు వైద్యం చేయించుకునేలా బలవంతం చేసింది. కుటుంబ సభ్యులందరికీ రేబిస్ సోకిందని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది.ఘటన జరిగిన సమయంలో ఆఫీస్కు వెల్లిన యశోద భర్త.. ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మ బెడ్రూంలోకి వెళ్లి డోర్ తీయడం లేదని చెప్పాడు. దీంతో భయపడిపోయిన నరేష్ పక్కింటి వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో పక్కింటి వారు బెడ్రూం రూమ్ బలవంతంగా ఓపెన్ చేసి చూడగా.. తల్లి,కుమార్తె విగతజీవులుగా కనిపించారు. కాగా, భర్త, కొడుకు మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని ఆత్మహత్య చేసుకునే ముందు యశోద గోడపై రాయడం గమనార్హం. యశోద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మళ్లీ శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్.. ఈసారి సెలెక్టర్లు తప్పించుకోలేరు..!
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో టీఎన్సీఏ ఎలెవెన్పై 114 బంతుల్లో 138 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన అతడు.. హర్యానాతో ఇవాళ (ఆగస్ట్ 26) ప్రారంభమైన మ్యాచ్లో 112 బంతుల్లో 111 పరుగులు (9 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. హర్యానాతో మ్యాచ్లో సర్ఫరాజ్ తన జట్టు కష్టాల్లో (81/3) ఉన్నప్పుడు బరిలోకి దిగి సూపర్ సెంచరీతో మెరిశాడు. హార్దిక్ తామోర్తో కలిసి జట్టు స్కోర్ను 200 పరుగుల మార్కును దాటించాడు. 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. ఆతర్వాత 40 బంతుల్లో శతక మైలురాయిని తాకాడు.టీఎన్సీఏ ఎలెవెన్పై కూడా సర్ఫరాజ్ ఇదే తరహాలో సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కూడా కష్టాల్లో ఉన్న తన జట్టును సెంచరీతో గట్టెక్కించాడు. ఆ ఇన్నింగ్స్లో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చి 36 పరుగులు చేశాడు. అయినా ఆ మ్యాచ్లో ముంబై ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ తర్వాత ముంబై ఆడిన రెండో మ్యాచ్లో (బెంగాల్తో) సర్ఫరాజ్ ఖాన్ ఆడలేదు. తిరిగి మూడో మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చి మరోసారి శతక్కొట్టాడు.27 ఏళ్ల సర్ఫరాజ్ తాజా ప్రదర్శనలతో భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. సర్ఫరాజ్ అద్బుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ సెలెక్టర్లు అతడ్ని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. ఆ పర్యటనలో సర్ఫరాజ్ స్థానంలో అవకాశం దక్కించుకున్న కరుణ్ నాయర్ దారుణంగా విఫలం కావడంతో సెలెక్టర్లు మళ్లీ సర్ఫరాజ్ ఖాన్ వైపు చూసే అవకాశం ఉంది. సర్ఫరాజ్ గతేడాదే స్వదేశంలో ఇంగ్లండ్పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే రెండు హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత న్యూజిలాండ్పై భారీ సెంచరీతో (150) మెరిశాడు. ఈ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో అవకాశాలు దక్కలేదు. కెరీర్లో మొత్తం 6 టెస్ట్లు ఆడిన సర్ఫరాజ్ సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 37.10 సగటున 371 పరుగులు చేశాడు. బుచ్చిబాబు టోర్నీ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ దులీప్ ట్రోఫీ ఆడనున్నాడు. ఆ టోర్నీలో కూడా సర్ఫరాజ్ సెంచరీలు చేస్తే సెలెక్టర్లు అతన్ని తప్పక టెస్ట్ జట్టుకు ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

బాబోయ్ ఇంతమంది నేరస్తులా..!
వందలాది రైళ్లు.. లక్షలాది మంది ప్రయాణికులు.. ఈ క్రమంలో నేరాల సంఖ్యా అదేవిధంగా పెరిగిపోతోంది. ఈ వ్యవహారం రైల్వే పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కళ్లు మూసి తెరిచేలోగా మాయమవుతున్న బ్యాగులు.. చైన్ స్నాచింగ్ గ్యాంగ్లు.. సెల్ఫోన్లు ఎత్తుకెళ్లే ముఠాలు.. అవసరమైతే దాడులకు వెరవని కరుడుగట్టిన నేరగాళ్లు.. ఈ నేపథ్యంలో నేర నియంత్రణ ఎలా..? నేరగాళ్లను కట్టడి చేయడం ఎలా..? అనేది ప్రభుత్వ రైల్వే పోలీసులకు (జీఆర్పీ) పెద్ద టాస్క్గా మారింది. ఇందుకు సీనియర్ అధికారుల సూచనల ఆధారంగా వ్యూహం రచించారు. అసలు నేరాలకు కారణం ఎవరు అనే దానిపై దృష్టి సారించారు. టెక్నాలజీ సాయంతో బృందాలు రంగంలోకి దిగాయి. పని మొదలెట్టాయి. ఆ వ్యూహం పేరే.. ‘జైలు–బెయిలు’.సికింద్రాబాద్: రైళ్లలో పాత నేరస్తులే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అరెస్టయ్యి బెయిలుపై విడుదలైన వారిపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ప్రత్యేక బృందాలు రిమాండ్ ఖైదీలు, బెయిల్ పొంది జనంలో తిరుగుతున్న వారి వివరాలను సేకరించే పనిలో పడింది. ఆ వివరాలతో పాటు వారి కదలికలపై నజర్కు టెక్నాలజీ (Technology) సాయం తీసుకుంటోంది. కళ్లుమూసి తెరిచేలోగా మాయం.. ఇటీవలి కాలంలో సికింద్రాబాద్ జిల్లా పరిధిలో రైళ్లలో నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కారణాలేమైనప్పటికీ అన్ని నేరాలు పోలీస్ స్టేషన్ వరకు రావడం లేదు కూడా.. కదులుతున్న రైళ్లలో సెల్ఫోన్లను లాక్కెళ్లడం.. లగేజీలు దొంగిలించడం.. ఏసీ బోగీల్లో విలువైన వస్తువుల తస్కరణ.. కోచ్లలో దొంగల స్వైర విహారం వంటివి నమోదవుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో అధిక శాతం కేసులు నమోదవుతున్నాయి. నేరాలు జరిగే సమయం చూస్తే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అధికశాతం జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. బాబోయ్ ఇంతమంది నేరస్తులా..!సికింద్రాబాద్ జిల్లా పరిధిలో ఐదేళ్ల నేరాలు పరిశీలిస్తే 149 మంది చైన్స్నాచర్లు.. 694 మంది నేరగాళ్లు దొంగతనం.. దోపిడీ కేసుల్లో అరెస్టయ్యారు. వీరిలో కొందరు జైళ్లలో ఉండగా మరికొందరు బెయిల్పై బయటకొచ్చారు. అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. వీరి నేరాల పథక రచనకు జైళ్లు వేదికలుగా మారుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అందుకే జైలులో ఎందరున్నారు. బెయిల్ (Bail) మీద బయటకొచ్చిందెవరు అనే విషయంపై జీఆర్పీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ట్రాకింగ్ చాలా కష్టమే.. అయినా.. ఓ రకంగా చూస్తే సికింద్రాబాద్ జిల్లా పరిధిలోని నేరస్తులందరినీ ట్రాక్ చేయడం చాలా కష్టమైన పనే. చాలా మంది సిబ్బంది కూడా అవసరం. అదనపు పనిగంటలు కూడా కావాలి. ఓ వైపు రోజు వారీ విధి నిర్వహణ.. రైళ్లలో భద్రత.. రైలు ప్రమాదాల మృతుల గుర్తింపు.. ఇతర విధులకే సరిపడా సిబ్బంది లేరు. సికింద్రాబాద్ జిల్లాలో తీసుకుంటే 12 రైల్వే పోలీస్ స్టేషన్లు.. 17 అవుట్పోస్టులు ఉన్నాయి. వీటిలో నేరాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్న సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్ల పరిధిలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ (RPF) పోలీసులు 667 మంది అవసరం ఉండగా ప్రస్తుతం 364 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. రైలు ప్రమాద ఘటనల్లో మృతుల దర్యాప్తు కోసయే సమయం వృథా అవుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. చదవండి: డ్రైవర్ ఆవలిస్తే అలర్ట్ చేస్తుంది..! టెక్నాలజీ సాయంతో...సమస్యలన్నింటినీ పక్కన పెట్టి.. నేర నియంత్రణ కోసం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చందనాదీప్తి (Chandana Deepti) నేతృత్వంలో సీనియర్ అధికారుల సూచనలతో పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు కదిలేందుకు నిర్ణయించుకున్నారు. టెక్నాలజీ సాయంతోనేరగాళ్ల మొబైల్ నెంబర్లు, ఆధార్, చిరునామాలు ఇలాంటి ప్రాథమిక అంశాల ఆధారంగా వారి కదలికలపై దృష్టి సారించేలా ప్రయత్నిస్తున్నారు. వారు ఏ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. వారు తిరుగుతున్న వ్యక్తులు ఎవరు? రాష్ట్రం దాటి వెళ్తున్నారా.. రైలు ప్రయాణాల్లో ఉంటున్నారా..? స్రత్పవర్తన ఉందా ఇలాంటి అంశాల ఆధారంగా వారిని ట్రాక్ చేస్తున్నారు.

కొత్త చట్టం అధికారపార్టీకి చుట్టమైతే?
నాగుపామును ఆడించే మంత్రగాడు అదే పాము కాటుకు గురయ్యాడని సామెత. మన రాజకీయ నేతలు చేసే కొన్ని విన్యాసాలు భవిష్యత్తులో వారికే తలనొప్పిగా మారతాయన్నది వారు విస్మరిస్తుంటారు. తాజాగా కేంద్రం తీసుకు వస్తున్న చట్టం కూడా అదే తరహాలో ఉందా అనిపిస్తోంది. వినడానికి మాత్రం ఇది బాగుందే అనిపించవచ్చు. కాని పరిశీలిస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న సంగతి అర్థమవుతుంది.ప్రధాని లేదా ముఖ్యమంత్రి, లేదా మంత్రులు ఎవరైనా ముప్పై రోజులు జైలులో ఉండవలసి వస్తే వారి పదవి ఆటోమాటిక్గా పోయే విధంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చట్టం తీసుకువస్తోంది. ఈ చట్టాన్ని సడన్గా ఎందుకు తీసుకు వస్తున్నారన్న దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీయేతర పక్షాలు ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించి ప్రభుత్వాలను అస్థిర పరచడానికి ఇది ఒక ఆయుధం అవుతుందన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. తమ మిత్రపక్షాలలో ఎవరైనా తోక ఝాడిస్తున్నారన్న అనుమానం వచ్చినా వారిపై కూడా ఈ అస్త్రం ప్రయోగించవచ్చన్న అభిప్రాయాన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.ప్రత్యేకించి కేంద్రంలో పూర్తి మెజార్టీ లేని నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్లను కట్టడి చేయడానికి కూడా దీన్ని వాడవచ్చని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ బిల్లుపై టీడీపీ, జేడీ(యూ)లు కూడా మథన పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ చట్టాన్ని కేంద్రం చిత్తశుద్దితోనే చేస్తుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు.కాని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటీవలికాలంలో పెడదోరణులు ప్రబలిపోయాయి.తమ ప్రత్యర్దులను ఎలాగైనా అణచివేయాలని, తద్వారా శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలన్న తాపత్రాయం మన నాయకులలో అధికంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎంతకాలం పాలనలో ఉన్నా ఫర్వాలేదు. అలా కాకుండా నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుండడమే ఇబ్బందిగా మారుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైనా ప్రజాప్రతినిధి రెండేళ్లు జైలు శిక్షకు గురైతే వెంటనే అతను పదవికి అనర్హుడవుతాయన్నది దాని సారాంశం. దానివల్ల అనర్థాలు రావచ్చని తలంచిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ తీర్పును రివర్స్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.కానీ అప్పట్లో రాహుల్ గాంధీ అవగాహనా రాహిత్యంతో ఆ ఆర్డినెన్స్ కాపీని బహిరంగంగానే చించివేశారు. ఒక రకంగా ఇది తన ప్రభుత్వాన్ని తానే అవమానించుకున్నట్లు కాదా! పైగా ఆనాటి ప్రదాని మన్మోహన్ సింగ్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో వచ్చిన ఆ ఆర్డినెన్స్ పూర్వాపరాలు ఆలోచించకుండా అనుచితంగా ప్రవర్తించడంతో ఆ తీర్పు అమలులోనే ఉంది. దాని ఫలితంగా కొందరు తమ పదవులు కోల్పోయారు. ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్కు శిక్ష పడడంతో రాజ్యసభ సభ పదవి పోయింది. ఆ తర్వాత కాలంలో రాహుల్ గాంధీనే ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్షకు గురి కావడం, ఆ తర్వాత ఆయన లోక్సభ సభ్యత్వం రద్దు కావడం జరిగిపోయింది. తదుపరి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి పునరుద్దరించుకోగలిగారు. అది వేరే సంగతి.రాహుల్ ఈ ఉదంతంలో తాను చేసిన తప్పుకు తానే బలైనట్లే కదా! ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రయోగం చేస్తోందా? ఒకవేళ వేరే ప్రభుత్వం కేంద్రంలో వస్తే ,అప్పుడు ఇదే చట్టం బీజేపీ ప్రభుత్వాల మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వారు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నది వాస్తవం. ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో మాట్లాడుతూ నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా? అని ప్రశ్నించారు. కొంతకాలం క్రితం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంంటూ హడావుడి చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను, కొందరు మంత్రులను అరెస్టు చేశారు. డిల్లీలో పోలీస్ వ్యవస్థ కేంద్రం చేతిలోనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకుండా జైలులో ఉంటూనే ప్రభుత్వ విషయాలపై ఆదేశాలు ఇస్తుండేవారు. అలాగే తమిళనాడుకు చెందిన ఒక మంత్రిని ఈడి అరెస్టు చేసింది. ఆయన కూడా పదవికి రాజీనామా చేయకుండా కేబినెట్లో కొనసాగారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి అనుకూలంగా లేనివి. ఢిల్లీలో ఎన్నికలకు ముందు ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ నాయకత్వం లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ ను జైలులో పెట్టిందని అప్పట్లో ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించేది. ఇలా కొద్దిమందిని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టం తెస్తుండడం కరెక్టేనా అన్న చర్చ ఉంది.నిజంగానే మోడీకి అవినీతి వ్యవహారాలపై చిత్తశుద్ది ఉంటే ఏపీలో టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మోడీని అవినీతిపరుడని, టెర్రరిస్టు అని.. ఇంకా చాలాచాలా మాటలు టీడీపీ అధినేత, 2019 ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శించేవారు. మోడీ స్వయంగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే చంద్రబాబు దానిని తనకు ఏటీఎం గా మార్చుకున్నారని ఆరోపించారు. ఎన్నికలలో చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన పీఎస్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరపగా వివిధ కాంట్రాక్టు వ్యవహారాలలో రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని తేలినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే కాదు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడ్డారని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది.అప్పటికే కేంద్రానికి చెందిన ఈడీ అదే కేసులో పలువురిని అరెస్టు చేసింది. చంద్రబాబు వరకు కేసును ఈడీ తీసుకు రాలేదు.ఈలోగా టీడీపీతో మళ్లీ బీజేపీ జత కట్టింది. మరి ఇప్పుడు ఆ ఆరోపణలు సంగతేమిటి? అసలు ఆ కేసులలో నిజానిజాలు ఏమిటి? అన్యాయంగా చంద్రబాబు మీద ఆ ఆరోపణలు చేశారా?లేక వాస్తవం ఉందా? అన్నది ప్రజలకు తెలియనవసరం లేదా? తన ప్రభుత్వ ఓటమి తర్వాత చంద్రబాబు ఈ పరిణామాలను ఊహించే తెలివిగా బీజేపీ పెద్దలతో రాజీ చేసుకున్నారన్నది చాలా మంది భావన. ఆ తర్వాత బతిమలాడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారన్నది బహిరంగ రహస్యమే.ఇలాంటివాటి గురించి మోడీ జవాబు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి, తమ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీ(యూ)లను తమ అదుపులో ఉంచుకోవడానికి ఇలాంటి చట్టం తెస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.దానికి తగినట్లుగానే టీడీపీ లోక్సభ పక్ష నేత లావు కృష్ణదేవరాయలు ఈ బిల్లును సమర్థిస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లోపాలను సరిదిద్దాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చ జరుగుతుందని అన్నారు. అంటే ఈ బిల్లుపై వారు లోపల భయపడుతున్నట్లు తెలుస్తూనే ఉంది. జేడీ(యూ) నేత త్యాగి కూడా అదే తరహాలో స్పందించారు. కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలలో నిజం ఉన్నా, లేకపోయినా, చంద్రబాబు విషయంలో బీజేపీ అనుసరించిన ద్వంద్వ విధానం సహజంగానే ఈ సందేహాలకు తావిస్తుంది.ఇండియా కూటమి లోనే అవినీతిపరులు ఉన్నట్లు తమ పక్షంలో ఎవరూ లేనట్లు మోడీ మాట్లాడినా జనం ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అవినీతి ఆరోపణలు వచ్చినా ఎందరిపై కేసులు పెడుతున్నారు? దేశ ప్రధాని మీద కేసు పెట్టే పరిస్థితి ఉందా? అలాగే ముఖ్యమంత్రి మీద కూడా రాష్ట్ర స్థాయిలో కేసులు పెట్టడం తేలిక కాదు. కాకపోతే న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని కేంద్రం లోని అధికార పార్టీ తమ వ్యతిరేక పార్టీల సీఎం లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు.మరో ఉదాహరణ చూద్దాం. దశాబ్దాల కిందట కేంద్రం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది. అయినా దాని అమలు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇదే మోడీ ప్రభుత్వం ఇందులో ద్వంద ప్రమాణాలు పాటించడం లేదా? సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ జేడీ(యూ) పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ) కోరింది.దానిని ఆఘమేఘాల మీద ఆమోదించి అనర్హత వేటు వేసేశారు. తమ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడిని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ స్పీకర్ ను కోరింది. మొత్తం టర్మ్ పూర్తయ్యింది కాని, ఆ పిటిషన్ను తేల్చలేదు. ఇంకా పలు ఉదాహరణలు ఇలాంటివి ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 2014-19 మధ్యకాలంలో ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్లోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అటు శాసన వ్యవస్థలోను, ఇటు న్యాయ వ్యవస్థలోను పోరాడుతోంది. ఇంతవరకు అదేమీ తేలలేదు. అలాగే అంతకుముందు టర్మ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీఆర్ఎస్లోకి ఫిరాయించారు. వారిపై అప్పటి స్పీకర్ చర్య తీసుకోలేదు.పైగా వారంతా బీఆర్ఎస్లో విలీనమైనట్లు ప్రకటించారు. కేంద్రంలోను, వివిధ రాష్ట్రాలలోను పరిస్థితులు ఇలాఉంటే ఇప్పుడు కేంద్రం తీసుకువస్తున్న ఈ కొత్త చట్టం ఎలాంటి దుష్పరిణామాలకు దారి తీస్తుందా అన్న భయం అందరిలో ఉంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

విజయ్తో సినిమా.. ఆస్తులన్నీ అమ్ముకున్నా: నిర్మాత
దళపతి విజయ్(Vijay)పై ఆయన మాజీ మేనేజర్, ‘పులి’ నిర్మాత పీటీ సెల్వకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పులి’ సినిమాతో తాను భారీగా నష్టపోతే.. ఆయన రెమ్యునరేషన్ మాత్రం డబుల్ అయిందన్నారు. సినిమా కోసం ఆస్తులన్నీ అమ్ముకున్న తనకు.. ఈ రోజు వరకు విజయ్ నుంచి ఓదార్పు మాట రాలేదన్నారు. విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో 2015లో పులి అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ కే టీ స్టూడియోస్ బ్యానర్ పై శిబు తమీన్స్, పీటీ సెల్వకుమార్ నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన తమిళ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు. విజయ్ తో పాటు కిచ్చా సుదీప్, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై..తొలి రోజే డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. దీంతో నిర్మాలతకు, బయ్యర్లుకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత నిర్మాత సెల్వకుమార్ ఈ సినిమాపై స్పందించారు.రిలీజ్కి ముందే కుట్ర..ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని సినిమాను విడుదల చేశాం. రిలీజ్కి ఒక్క రోజు ముందు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేశారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. నా పక్కన ఉన్నవారే కుట్ర చేశారు. సినిమా విడుదల కాదనే వార్తలను వ్యాప్తి చేశారు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న అవమానం, ఒత్తిడి వర్ణనాతీతం. నా 27 ఏళ్ల కష్టార్జితం మొత్తం ఈ ఒక్క సినిమా కోసమే ఖర్చు చేశా. నా కలలతో ముందుకు సాగాలని కోరుకున్నాను. కానీ ఆ కష్టార్జితం నాశనమైంది.మధ్యలో బయటకు వచ్చేశారుఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమాను థియేటర్స్కి తీసుకొచ్చాం. తొలి రోజు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. స్టోరీ, గ్రాఫిక్స్ వర్క్పై ఫ్యాన్స్ సైతం ఫైర్ అయ్యారు. తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లడం కళ్లారా చూశాను. అప్పుడు నా స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునే వాళ్లు.విజయ్ దూరం పెట్టాడు.. సినిమా అపజయం చెందడంతో విజయ్ నన్ను దూరం పెట్టేశాడు. సినిమా రిలీజ్ తర్వాత ఐదారు రోజుల పాటు విజయ్తో మాట్లాడే అవకాశం రాలేదు. ఈ అపజయం విజయ్ కెరీర్పై కొంచెం కూడా పడలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన పారితోషికం డబుల్ అయింది. పులి చిత్రానికి రూ. 25 కోట్లు తీసుకున్న విజయ్.. ఆ తర్వాత చిత్రానికి రూ. 45 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడు. కానీ వాళ్లు మాత్రం నన్ను దేశ ద్రోహిగా, వైఫల్యం చెందిన వ్యక్తిగానే చూశారు. కొన్ని విషయాలను బయటపెట్టలేను కానీ.. పులి సినిమాతో నా 27 ఏళ్ల కల, కృషి నాశనం అయ్యాయి’ అని ఓ ఈవెంట్లో సెల్వకుమార్ ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు.
రేపు వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ను వదిలేసిన హనుమ విహారి
నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్.. బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు
తెలుగు ప్రేక్షకుల ముందుకు 'కొత్త లోక'.. ఆసక్తిగా ట్రైలర్!
ద్విచక్ర వాహన విక్రయాలు పెరగొచ్చు.. ఇక్రా అంచనా
వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
'సందర్భం లేకుండా అడగొద్దు.. మీడియాపై ప్రముఖ నటి అసహనం'!
విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. వీడియో
టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్ర.. భారీ మార్జిన్కు 'పచ్చ' స్కెచ్
వొడాఫోన్ ఐడియాకు ఉపశమనంపై స్పష్టత
నారీమణులతో.. ఒకే ఒక్కడు.. ఫోటో వైరల్
ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు క్యాష్లెస్ సేవలు బంద్
ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన: బంగారం ధరల్లో ఊహించని మార్పు!
సామాన్యుడు విసిరిన సవాల్!
జీవిత కోసం రాజశేఖర్ ఓవరాక్టింగ్.. కావాలనే గొడవ : డైరెక్టర్
Dharmasthala: ధర్మస్థళ ‘చిన్నయ్య’.. మామూలోడు కాదు
ప్రియురాలితో కలిసి తిరుమలలో కనిపించిన స్టార్ హీరో (ఫొటోలు)
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
'బుల్డోజర్ న్యాయం'పై సుప్రీం కోర్టు ఆగ్రహం
వరలక్ష్మీ వ్రతం చేసిన హీరోహీరోయిన్ జోడీ (ఫొటోలు)
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..
ఈ రాశి వారికి భూలాభాలు.. పలుకుబడి పెరుగుతుంది
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
..ధనిక సీఎం అని తెలియగానే పేదలందరూ దత్తత తీసుకోమని వెంటపడుతున్నారు!
యూఎస్లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది?
ట్రాఫిక్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. పనుల్లో విజయం
టీమిండియా వైపు మరోసారి దూసుకొస్తున్న పృథ్వీ షా.. వరుసగా రెండో మ్యాచ్లో..!
మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్
జాబితాలో భారతీయులు తప్ప అన్ని దేశాల వారున్నారని అడుగుతున్నార్సార్!
రేపు వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ను వదిలేసిన హనుమ విహారి
నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్.. బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు
తెలుగు ప్రేక్షకుల ముందుకు 'కొత్త లోక'.. ఆసక్తిగా ట్రైలర్!
ద్విచక్ర వాహన విక్రయాలు పెరగొచ్చు.. ఇక్రా అంచనా
వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
'సందర్భం లేకుండా అడగొద్దు.. మీడియాపై ప్రముఖ నటి అసహనం'!
విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. వీడియో
టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్ర.. భారీ మార్జిన్కు 'పచ్చ' స్కెచ్
వొడాఫోన్ ఐడియాకు ఉపశమనంపై స్పష్టత
నారీమణులతో.. ఒకే ఒక్కడు.. ఫోటో వైరల్
ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు క్యాష్లెస్ సేవలు బంద్
ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన: బంగారం ధరల్లో ఊహించని మార్పు!
సామాన్యుడు విసిరిన సవాల్!
జీవిత కోసం రాజశేఖర్ ఓవరాక్టింగ్.. కావాలనే గొడవ : డైరెక్టర్
Dharmasthala: ధర్మస్థళ ‘చిన్నయ్య’.. మామూలోడు కాదు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
'బుల్డోజర్ న్యాయం'పై సుప్రీం కోర్టు ఆగ్రహం
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..
ఈ రాశి వారికి భూలాభాలు.. పలుకుబడి పెరుగుతుంది
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
యూఎస్లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది?
..ధనిక సీఎం అని తెలియగానే పేదలందరూ దత్తత తీసుకోమని వెంటపడుతున్నారు!
ట్రాఫిక్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. పనుల్లో విజయం
టీమిండియా వైపు మరోసారి దూసుకొస్తున్న పృథ్వీ షా.. వరుసగా రెండో మ్యాచ్లో..!
మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్
జాబితాలో భారతీయులు తప్ప అన్ని దేశాల వారున్నారని అడుగుతున్నార్సార్!
ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ ఓవరాక్షన్
భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్బాస్లో ఛాన్స్, మా వాళ్లే వెనక్కులాగారు!
సినిమా

ది రాజాసాబ్ బ్యూటీ కొత్త సినిమా.. ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం హృదయపూర్వం. ఈ చిత్రంలో ది రాజాసాబ్ బ్యూటీ మాళవికా మోహనన్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించగా.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు.ఈ నేపథ్యంలోనే హృదయపూర్వం ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సంగీత, సిద్ధిక్, నిషాన్, బాబురాజ్, లాలూ అలెక్స్, జనార్దనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు.

తెలుగు ప్రేక్షకుల ముందుకు 'కొత్త లోక'.. ఆసక్తిగా ట్రైలర్!
ఈ వారం సినీ ప్రియులను అలరించేందుకు మరో ఆసక్తికర మూవీ రానుంది. మలయాళ చిత్రం కొత్త లోక తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఫాంటసీ థ్రిల్లర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ ఫాంటసీ థ్రిల్లర్లో కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతమందించారు.

బాలీవుడ్ స్టార్స్ 'భగ్న' ప్రేమకథ!
టాలీవుడ్లో చాలా తక్కువ గానీ బాలీవుడ్లో మాత్రం హీరోహీరోయిన్ల ప్రేమ, రిలేషన్, పెళ్లి, బ్రేకప్ లాంటివి కాస్త ఎక్కువే. కలిసి నటించిన వాళ్లు చాలామంది ఉంటారు. అదే టైంలో గాఢంగా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోని వాళ్లు కూడా కాస్త ఎక్కువగానే ఉంటారు. అలాంటి వాళ్ల లిస్ట్ తీస్తే గత కొన్నేళ్లలో చూసుకుంటే స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది ఉంటారు. వారిలో కొందరు గురించి మీకోసం.అభిషేక్ - కరిష్మా కపూర్అమితాబ్ బచ్చన్ కొడుకుగా అభిషేక్ అందరికీ పరిచయమే. 2000ల్లో హీరోయిన్ కరిష్మా కపూర్తో అభిషేక్ కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశాడు. దీంతో వీళ్లిద్దరికీ పెద్దలు నిశ్చితార్థం కూడా చేశారు. కానీ 2003 టైంలో కారణాలేం చెప్పకుండా దీన్ని రద్దు చేసుకున్నారు. తర్వాత అభిషేక్.. ఐశ్వర్యారాయ్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఆరాధ్య అనే అమ్మాయి కూడా పుట్టింది.అక్షయ్ కుమార్-రవీనా-శిల్పాశెట్టి90ల్లో అక్షయ్ కుమార్ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. అలా రవీనా టండన్తో కలిసి 'మోహ్రా' అనే సినిమా చేశాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరి డేటింగ్ కూడా చేశారు. మరి ఏమైందో ఏమో గానీ 2001లో అలా విడిపోయారు. అనంతరం కొన్నాళ్లకు రవీనా.. అనిల్ తడానిని వివాహం చేసుకుంది.ఇదే అక్షయ్ కుమార్.. 90ల్లో శిల్పాశెట్టితోనూ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. 'మైన్ ఖిలాడీ తు అనారీ' సినిమా టైంలో ప్రేమ మొదలైందని మాట్లాడుకున్నారు. అలాంటిది వీళ్లిద్దరూ కూడా విడిపోయారు. అలా రవీనా, శిల్పా శెట్టితో విడిపోయిన అక్షయ్.. ట్వింకిల్ ఖన్నాని పెళ్లి చేసుకున్నాడు.రణ్బీర్-దీపిక-కత్రినా కైఫ్రణ్బీర్ కపూర్ పేరు చెప్పగానే అతడి సినిమాలతో పాటు డేటింగ్ స్టోరీలే గుర్తొస్తాయి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపినట్లు మాట్లాడుకున్నారు. కానీ దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ పేర్లు మాత్రం కాస్త ఎక్కువగా వినిపించాయి. కలిసి సినిమాలు చేసిన రణ్బీర్-దీపిక.. రెండు మూడేళ్లపాటు డేటింగ్ చేసుకున్నారు. కానీ 2009లో విడిపోయారు. ఇది జరిగి ఎన్నాళ్లు కాలేదు. రణ్బీర్-కత్రినా కైఫ్ డేటింగ్ రూమర్స్ వినిపించాయి. దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. తర్వాత ఈమె నుంచి కూడా రణ్బీర్ విడిపోయాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా వేర్వేరుగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్-కత్రినా కైఫ్బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఇతడు.. గతంలో ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్తో 1990-2000 వరకు ప్రేమ-డేటింగ్లో ఉన్నారని అప్పట్లో ఇండస్ట్రీలో తెగ మాట్లాడుకున్నారు. కానీ సల్మాన్ ప్రవర్తన కారణంగా ఐశ్వర్య ఇతడిని 2002 నుంచి దూరం పెట్టేసిందట. ఈమె తర్వాత కత్రినా కైఫ్తో కొన్నేళ్ల పాటు సల్మాన్ రిలేషన్షిప్ మెంటైన్ చేశాడు. కానీ ఈమెతోనే బ్రేకప్ అయిపోయింది. ఐశ్వర్య, కత్రినా వేర్వేరుగా పెళ్లి చేసుకున్నారు గానీ సల్మాన్ మాత్రం ఒంటరిగానే ఉండిపోయాడు.షాహిద్ కపూర్-కరీనా కపూర్-ప్రియాంక చోప్రామిలీయనల్స్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న షాహిద్ కపూర్.. 2004-07 టైంలో కరీనా కపూర్తో డేటింగ్ చేశాడు. కలిసి సినిమాలు చేస్తున్నప్పుడే వీళ్ల మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కానీ 'జబ్ ఉయ్ మెట్' అనే మూవీ చేస్తున్న టైంలో బ్రేకప్ చెప్పుకొన్నారు. కానీ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈమె తర్వాత ప్రియాంక చోప్రాతోనూ షాహిద్ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి కానీ ఎక్కడా వీళ్లు దీన్ని ధ్రువీకరించలేదు. కొన్ని రూమర్స్ మాత్రం వినిపించాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు ఎవరికి వాళ్లు వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నారు.రణ్దీప్ హుడా-సుస్మితా సేన్మిస్ యూనివర్స్ సుస్మితా సేన్.. నటుడు రణ్దీప్ హుడాతో 2000 టైంలో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. కానీ ఇది కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. తర్వాత కాలంలో రణ్దీప్.. నటి లిన్ లైస్రామ్ని పెళ్లి చేసుకోగా.. సుస్మితా మాత్రం ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఇద్దరు అమ్మాయిల్ని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇలా బాలీవుడ్లో చాలానే 'భగ్న' ప్రేమకథలు ఉన్నాయి!

రాజమౌళి 'బాహుబలి ది ఎపిక్'.. టీజర్ వచ్చేసింది!
బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాజమౌళి టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు మేకర్స్. ప్రభాస్, అనుష్క, రానా, రాజమౌళి సైతం ప్రమోషన్లలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.Here’s the Teaser of @ssrajamouli’s #BaahubaliTheEpic… In cinemas worldwide Oct 31, 2025. https://t.co/KSuKxSwZI9#Prabhas@RanaDaggubati @MsAnushkaShetty @tamannaahspeaks @Shobu_ #PrasadDevineni #Baahubali #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/EXQsQGFoZ8— Baahubali (@BaahubaliMovie) August 26, 2025
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు, అర్జీలు.

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఠా బార్ల దందా... టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా అన్ని బార్లను కట్టబెట్టే కుట్ర

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం... చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’ పేరిట ప్రతిఏటా 350 కోట్ల రూపాయల ప్రజాధనానికి టెండర్... కుప్పంలో ప్రారంభమైన పైలెట్ ప్రాజెక్టు

పెద్దల కోసం పేదల భూములు... ‘నాలా’ చట్టం రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపడంపై సర్వత్రా ఆందోళన

నింద మాటున ప్రభుత్వాలను కూల్చేస్తారా?... ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై లోక్సభలో విపక్షాల ఆగ్రహం

దివ్యాంగుల జీవితాల్లో పింఛను చిచ్చు... అనర్హులని పేర్కొంటూ పింఛను నిలిపివేస్తున్నట్టు ఏపీలో కూటమి ప్రభుత్వం నోటీసులు

మాతోనే బేరసారాలా?. మద్యం కేసులో ప్రాసిక్యూషన్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ

ఆంధ్రప్రదేశ్లో కారుచౌకగా భూముల విక్రయాలు.. ఎంత భూమైనా 99 పైసలకే.. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్..

ఏపీలో విద్యుత్ కొనుగోలులో మరో కనికట్టు... అధిక ధరకు సోలార్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం
క్రీడలు

పాపం పడిక్కల్.. వెంట్రుక వాసిలో సెంచరీ మిస్సయ్యాడు..!
కర్ణాటకలో జరుగుతున్న మహారాజా ట్రోఫీలో ఆర్సీబీ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో హుబ్లీ టైగర్స్కు ప్రాతినిథ్యం వహిస్తూ లీడింగ్ రన్ స్కోరర్గా (11 మ్యాచ్ల్లో 439 పరుగులు, 5 అర్ద సెంచరీలు) కొనసాగుతున్న అతడు.. ఇవాళ (ఆగస్ట్ 26) మంగళూరు డ్రాగన్స్తో జరుగుతున్న మ్యాచ్లో వెంట్రుక వాసిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 98 పరుగుల వద్ద పడిక్కల్కు సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ చేజార్చుకున్నాడు. 19వ ఓవర్ ఐదో బంతికి సింగిల్ మాత్రమే తీసి 99 పరుగుల వద్ద ఆగిపోయాడు. పడిక్కల్ ఆ బంతికి సింగిల్ తీయకుండా ఉండి, చివరి బంతిని ఎదుర్కొని ఉంటే సెంచరీ పూర్తి చేసకునే అవకాశం ఉండేది. అయితే సింగిల్తో సంతృప్తి చెందిన అతడు.. 99 పరుగుల వద్ద నాటౌట్గా నిలిచిపోయాడు. చివరి బంతిని ఎదుర్కొన్న మన్వంత్ కుమార్ సిక్సర్ బాది టైగర్స్ ఇన్నింగ్స్ను ముగించాడు. ఈ ఇన్నింగ్స్లో 64 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్ 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. పడిక్కల్ రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. టైగర్స్ ఇన్నింగ్స్లో పడిక్కల్తో పాటు సన్రైజర్స్ ఆటగాడు అభినవ్ మనోహర్ కూడా చెలరేగాడు. మనోహర్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. పడిక్కల్తో పాటు ఓపెనర్గా బరిలోకి దిగిన మొహమ్మద్ తాహా 28 బంతుల్లో 37, మన్వంత్ కుమార్ 6 బంతుల్లో 16 పరుగులు చేశారు.మంగళూరు బౌలర్లలో రోనిత్ మోరే, క్రాంతి కుమార్ తలో వికెట్ తీశారు.కాగా, ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన పడిక్కల్ తొడ కండరాల సమస్య కారణంగా సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన అతడు.. 150కి పైగా స్ట్రయిక్రేట్తో 247 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఆ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడంలో పడిక్కల్ కీలకపాత్ర పోషించాడు. పడిక్కల్ వైదొలగడంతో ఆర్సీబీ అతని స్థానాన్ని మరో కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్తో భర్తీ చేసింది.

మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు ఆర్దిక చేయూత
భారత క్రికెటర్స్ అసోసియేషన్ (ICA) కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు రూ. లక్ష గ్రాంట్ను ప్రకటించింది. ఈ మొత్తాన్ని అర్హులైన వితంతువులకు ఒక్కసారిగా చెల్లిస్తారు. ఈ స్కీమ్ తొలి దఫాలో దాదాపు 50 మందికి లబ్ది చేకూరే అవకాశం ఉంది. మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఈ స్కీమ్ను ప్రవేశపెట్టినట్లు ICA తెలిపింది.ఈ పథకానికి ప్రస్తుతం ఆమల్లో ఉన్న మిగతా పథకాలతో సంబంధం లేదు. అవి కొనసాగుతుండగానే, ఈ కొత్త పథకం అమల్లోకి వస్తుంది. ICA ఇప్పటికే మరణించిన భారత మాజీ టెస్ట్ క్రికెటర్ల భార్యలకు నెలసరి పెన్షన్ ఇస్తుంది. కొత్త పథకానికి ICA వార్షిక సంవత్సర రెండో బోర్డు మీటింగ్లో ఆమోదం లభించింది.కాగా, మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండంగా నిలవడమే ధ్యేయంగా ICA ఏర్పాటు చేయబడింది. దీన్ని 2019లో స్థాపించారు. ICAలో 1750కు పైగా భారత మాజీ క్రికెటర్లు సభ్యులుగా ఉన్నారు. ICA ఇప్పటికే 60 దాటి, పెన్షన్ లభించని మాజీ క్రికెటర్లకు సీనియర్ మెంబర్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ కింద రూ. లక్ష ఆర్దిక సాయం చేస్తుంది. అలాగే సభ్యుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వీటికి అదనంగా ప్రతి సభ్యుడికి ఏడాదికోసారి కంప్లీట్ బాడీ చెకప్ ప్రోగ్రామ్ను కూడా చేపడుతుంది.

మరోసారి విధ్వంసం సృష్టించిన సంజూ శాంసన్.. ఆసియా కప్కు ముందు మహోగ్రరూపం
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. తన సొంత రాష్ట్రం కేరళలో జరుగుతున్న టీ20 లీగ్లో వరుస విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగిపోతున్నాడు.ఈ టోర్నీలో తానాడిన తొలి మ్యాచ్లోనే మెరుపు శతకంతో (అరైస్ కొల్లాం సైలర్స్పై 51 బంతుల్లో 121; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) బీభత్సం సృష్టించిన సంజూ.. తాజాగా రెండో మ్యాచ్లోనూ అదే తరహా విధ్వంసం కొనసాగించాడు.ఈ టోర్నీలో కొచ్చి బ్లూ టైగర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంజూ.. ఇవాళ (ఆగస్ట్ 26) త్రిస్సూర్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో 46 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.సంజూ ఔట్ కాగానే టైగర్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతోంది. త్రిస్సూర్ బౌలర్ కే అజినాస్ సంజూను ఔట్ చేసిన తర్వాత వరుసగా మరో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. సంజూ క్రీజ్లో ఉన్నంత సేపు 200 దిశగా సాగిన టైగర్స్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది. 18 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 167/7గా ఉంది. టైగర్స్ ఇన్నింగ్స్లో సంజూతో పాటు అతడి అన్న సాలీ శాంసన్ (6 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఇదిలా ఉంటే, ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసన్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే తుది జట్టులో అతని స్థానంపై మాత్రం అనుమానాలు నెలకొన్నాయి. రెగ్యులర్ ఓపెనర్గా శుభ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడమే ఇందుకు కారణం. గిల్.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడని టీమిండియా మేనేజ్మెంట్ సంకేతాలిచ్చింది.ఒకవేళ సంజూను తుది జట్టులో తీసుకున్నా మిడిలార్డర్లో బ్యాటింగ్కు పంపే అవకాశం ఉంది. అయితే మిడిలార్డర్లో అతడికి అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. కేరళ లీగ్లో ఓపెనర్గా సంజూ భీకర ఫామ్ను చూసిన తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ మనసు మార్చుకుంటుందేమో చూడాలి.

న్యూజిలాండ్ క్రికెట్కు బిగ్ షాక్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో ఆటగాడు కూడా ఈ జాబితాలో చేరాడు. ఫాస్ట్ బౌలర్ విలియమ్ ఓరూర్కీ (William O'Rourke) ఆటకు మూడు నెలల పాటు దూరంగా ఉండనున్నాడు.ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఈనెలలో జింబాబ్వే పర్యటనలో భాగంగా తొలి టెస్టు సందర్భంగా 24 ఏళ్ల విలియమ్ గాయపడ్డాడు. అతడి వెన్ను నొప్పి దిగువ భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పరీక్షలు చేయించుకున్నాడు.కనీసం మూడు నెలలపాటు విశ్రాంతిఈ క్రమంలో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. కనీసం మూడు నెలలపాటు విలియమ్కు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. కాగా అక్టోబరులో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్లతో కూడా తలపడాల్సి ఉంది.గ్లెన్, ఫిన్ కూడా అవుట్ఈ మూడు ప్రధాన సిరీస్లకు విలియమ్ ఓరూర్కీ దూరం కానున్నాడు. మరోవైపు.. ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Philps) గజ్జల్లో గాయం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ కూడా కుడికాలి పాదం నొప్పితో కనీసం మూడు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి.సారథికీ గాయంఇదిలా ఉంటే.. కివీస్ వన్డే, టీ20 క్రికెట్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కూడా గాయపడటం గమనార్హం. గజ్జల్లో నొప్పి కారణంగా అతడు ఇటీవలే ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చాడు. ది హండ్రెడ్ లీగ్ నుంచి అర్ధరంతంగా తప్పుకొన్నాడు. సాంట్నర్ కూడా నెలరోజుల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. అయితే, ఆసీస్తో టీ20 సిరీస్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.అతడొక వరల్డ్ క్లాస్ప్లేయర్.. జట్టులో ఉంటాడుఈ విషయాల గురించి న్యూజిలాండ్ హెడ్కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘విలియమ్ పరిస్థితి బాధాకరంగా ఉంది. అతడు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. గ్లెన్, ఫిన్ కూడా ఇప్పటికే దూరమయ్యారు. ఇటీవలి కాలంలో వీరిద్దరు టీ20 జట్టులో కీలక బ్యాటర్లుగా మారిపోయారు. కానీ దురదృష్టవశాత్తూ గాయాలు వారిని వెంటాడుతున్నాయి. మిచెల్ సాంట్నర్ ఓ వరల్డ్క్లాస్ ప్లేయర్. ఆటగాడిగా, కెప్టెన్గా అతడి నైపుణ్యాలు అమోఘం. జట్టులో అతడు ఉంటాడు. అయితే, సర్జరీ తర్వాత ఫిట్నెస్ ఆధారంగా మ్యాచ్ ఆడతాడా? లేదా? అన్నది తేలుతుంది’’ అని తెలిపాడు. మరోవైపు.. పేస్ బౌలర్ బెన్ సీర్స్ రూపంలో కివీస్కు శుభవార్త అందింది. పక్కటెముకల నొప్పి నుంచి అతడు కోలుకున్నాడు. కాగా గాయం వల్ల ఈ పేస్ బౌలర్ జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: ఒక్క సిక్స్తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్
బిజినెస్

రెండు నెలలుగా పాకిస్థాన్కు ఎగుమతులు బంద్
భారత్ నుంచి పాకిస్థాన్కు చేసే ఫార్మా ఎగుమతులు రెండు నెలలుగా కస్టమ్స్ వద్ద నిలిచిపోవడంతో భారత ఔషధ ఎగుమతిదారులు అనిశ్చితితో సతమతమవుతున్నారు. ఫార్ములేషన్లు, వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ)తో సహా పాకిస్థాన్కు ఏటా 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఫార్మా ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది. పాకిస్థాన్తో భారతదేశం 2025 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతుల్లో 18% వృద్ధిని నమోదు చేసింది. అయితే 2025 మే తర్వాత కస్టమ్స్ అనుమతులు నిలిపివేయడంతో దేశీయ ఎగుమతిదారులు ఆందోళన చెబుతున్నారు.కశ్మీర్లో పర్యాటకులపై దాయాది దేశం ఉగ్రదాడి, ఆ తర్వాత సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రతిస్పందనగా భారత్ అధికారికంగా పాకిస్థాన్తో అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. సస్పెన్షన్ తర్వాత కూడా ఫార్మా ఎగుమతులు కొంతకాలం కొనసాగినప్పటికీ, అధికారిక వివరణ లేకుండా ఫార్మా ఎగుమతులు కొద్దికాలంలోనే నిలిచిపోయాయి. పాకిస్థాన్తో ట్రేడ్ సస్పెన్షన్ తర్వాత కొన్ని వారాల పాటు ఎగుమతులను కొనసాగించామని, సాధారణంగా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుందని భావిస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కానీ కస్టమ్స్ క్లియరెన్స్ అకస్మాత్తుగా ఆగిపోయిందని, ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదని చెప్పారు.‘ఔషధ ఎగుమతులపై నిషేధాన్ని సాధారణంగా మానవతా ప్రాతిపదికన ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక ఆంక్షల నుంచి మినహాయిస్తారు. అయితే ఇప్పటివరకు బహిరంగంగా ఎటువంటి అధికారిక నిషేధం లేదా నోటిఫికేషన్ జారీ చేయలేదు. దాంతో ఎగుమతుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ సహా కీలక ఫార్మా హబ్ల్లో ఎగుమతిదారులు ఆర్థిక, కాంట్రాక్టు చిక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు’ అని సీనియర్ అధికారి చెప్పారు.ఈ సమస్యకు పరిష్కారంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) గత నెలలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(డీజీఎఫ్టీ)కి అధికారిక వినతిపత్రాన్ని సమర్పించింది. పాకిస్థాన్కు ఔషధ ఎగుమతులను నిషేధించడం లేదా పరిమితం చేయడంపై ఏదైనా అధికారిక నోటిఫికేషన్ ఉందా?.. ఉంటే కంపెనీలకు స్పష్టమైన కటాఫ్ తేదీ వివరాలు ఏవైనా ఉన్నాయా అని వివరణ కోరింది. దీనిపై డీజీఎప్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉందని ఫార్మెక్సిల్ ప్రతినిధి తెలిపారు. ఇదీ చదవండి: బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు

బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు
బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపర్టర్లు నిర్వహిస్తున్న ఏటీఎంల్లో తప్పకుండా రూ.100, రూ.200 నోట్లు ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్ల డినామినేషన్కు సంబంధించి ఇప్పటికే చాలా ఏటీఎంల్లో ప్రత్యేక సదుపాయాలు, సామర్థ్యం ఉన్నందున ఇతర మార్పులు అవసరం లేదని చెప్పింది.ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. వినియోగదారులు, చిరు వ్యాపారాలను ప్రభావితం చేసే ఈ డినామినేషన్ నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్లు విరివిగా అందుబాటులోకి రానున్నాయి. అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ డినామినేషన్లను కనీసం ఒక క్యాసెట్ ద్వారా పంపిణీ చేయాలని ఆర్బీఐ ఆదేశాల్లో తెలిపింది.ఇదీ చదవండి: రైల్వే ట్రాక్పై సోలార్ ఎనర్జీ తయారీ!2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలు, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలు ఈ నోట్లను పంపిణీ చేయాలి. ఈ నోట్ల డినామినేషన్ల కోసం బ్యాంకులు కొత్తగా యంత్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఏటీఎంలకు సర్దుబాట్లు చేస్తే సరిపోతుందని చెప్పింది.

భారత్లో రూ.70 వేలకోట్ల పెట్టుబడి!.. సుజుకి మోటార్ ప్రెసిడెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్లోని హన్సల్పూర్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించడంతో మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచి ఒనో, సుజుకి మోటార్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి.. కంపెనీకి చెందిన ఇతర కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.మారుతి సుజుకి ఈ-విటారా ఉత్పత్తి ప్రారంభం తర్వాత.. సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో మాట్లాడుతూ.. జపాన్ తయారీదారు రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో భారతదేశంలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా.. భారతదేశంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాము. భారతదేశంతో మేము భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. భారతదేశం దార్శినికతకు మద్దతు ఇవ్వడానికి.. వికసిత్ భారత్కు దోహదపడటానికి మేము కట్టుబడి ఉన్నామని తోషిహిరో సుజుకి అన్నారు.సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తన ప్రసంగంలో.. కొత్తగా ప్రారంభించిన గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారుతుందని, భారతదేశంలోని వినియోగదారులకు సేవలందిస్తుందని అన్నారు. ఈ ప్లాంట్ 1 మిలియన్ యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్ నుంచి 100 దేశాలకు!.. ఈ-విటారా ప్రారంభించిన మోదీఈ ప్లాంట్లో ఉత్పత్తి చేసిన మొదటి వాహనం మారుతి సుజుకి ఇ-విటారా, ఇది బ్రాండ్ మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం కూడా. ఈ ఎలక్ట్రిక్ కారును జపాన్.. యూరప్తో సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మొట్టమొదటి లిథియం-అయాన్ బ్యాటరీ.. ఎలక్ట్రోడ్ స్థాయి స్థానికీకరణతో కూడిన సెల్ ఉత్పత్తి ప్రారంభాన్ని కూడా తోషిహిరో సుజుకి ప్రస్తావించారు.

కేవలం రూ. 181కే.. హోమ్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: ఫిన్టెక్ సంస్థ ఫోన్పే కొత్తగా గృహ బీమా పాలసీలను ప్రకటించింది. అగ్ని, వరదలు, భూకంపాలు సహా 20 రిస్కులకు కవరేజీ అందించేలా పాలసీలను ప్రకటించింది. రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 కోట్ల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు.ప్రీమియంలు కవరేజీని బట్టి వార్షికంగా రూ. 181 నుంచి (జీఎస్టీ కూడా కలిపి) ప్రారంభమవుతాయి. గృహ రుణాలకు సంబంధించి ఈ పాలసీలకు అన్ని బ్యాంకులు, రుణ సంస్థల్లో ఆమోదయోగ్యత ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫోన్పే యాప్ ద్వారా యూజర్లు దీన్ని పొందవచ్చు.
ఫ్యామిలీ

గణేష్ విగ్రహాలకు కేరాఫ్ వీరాపురం, పాతికేళ్లుగా!
సాక్షి,బళ్లారి: లోకంలో తొలి పూజలు అందుకునే గణనాథుల పండుగ అంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, పండగను ఆచరించడం అనాదిగా వస్తోంది. ఏడాదికి ఒకసారి భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగను కులమతాలకతీతంగా, ఇంటింటా, వాడవాడలా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం చూస్తుంటాం. అలాంటి వినాయక విగ్రహాలను తయారు చేసి గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల్లో కూడా అమ్మకాలు సాగిస్తుంటారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు గత 25 ఏళ్లుగా వినాయక విగ్రహాలు తయారు చేయడంలో పేరుగాంచింది ఎస్కేఎస్ ఆర్ట్స్ సంస్థ. బళ్లారి తాలూకా వీరాపురం గ్రామంలో ఎస్పీఎస్(శ్రీకాంత్, పురుషోత్తం, శిల్పా) ఆర్ట్స్ అనే సంస్థ పేరుతో సదరు కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది వరకు వినాయక విగ్రహాలను తయారు చేస్తూ జీవిస్తున్నారు. తమ అద్భుత ప్రతిభతో వివిధ రకాల, ఆకృతుల గణనాథుల విగ్రహాలను తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి కొనుగోలు బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్రల నుంచి కూడా వినాయకుని విగ్రహాలు తీసుకెళ్లేందుకు వీరాపురం వచ్చి కొనుగోలు చేస్తున్నారంటే ఇక్కడ ఎంతటి అద్భుతమైన, ఆకట్టుకునే విధంగా గణనాథులను తయారు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాక్షితో మాట్లాడుతూ తాము గత 25 ఏళ్లుగా గణనాథులను తయారు చేస్తున్నామన్నారు. ఒక్కో గణపతి విగ్రహానికి రూ.1500 నుంచి రూ.లక్షా 50 వేలకు పైగా ధరలు ఉంటాయని, ఇతర ప్రాంతాల్లో తయారు చేసే గణనాథుల కంటే ఎంతో అద్భుతంగా తయారు చేస్తుంటామన్నారు. ఆరు నెలలుగా విగ్రహాల తయారీపై కసరత్తు దీపావళి పండుగ నుంచి వినాయక విగ్రహాలు తయారు చేయడం ప్రారంభిస్తామని తెలిపారు. ఆరు నెలలుగా వినాయక విగ్రహాలు తయారు చేయడంపై కసరత్తు చేస్తామన్నారు. ఆరు నెలల్లో 500 గణనాథులను తయారు చేస్తామని, వీటిలో కనీసం 300 నుంచి 400 వరకు గణనాథుల విగ్రహాల అమ్మకాలు జరుగుతుంటాయన్నారు. కొన్ని డ్యామేజ్ కావడం వల్ల నష్టాలు కూడా వస్తుంటాయన్నారు. గత ఆరు నెలల నుంచి తయారు చేసిన గణనాథులను షెడ్లలో భద్రంగా ఉంచుతామన్నారు. మట్టి గణనాథుల విగ్రహాల తయారీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇతర వ్యాపారాల మాదిరిగా గణనాథుల తయారీకి పోటీ పెరిగిందన్నారు. అయితే నమ్మకం, నాణ్యత, మట్టితో తయారు చేసే గణనాథులను తయారు చేయడం వల్ల ఏటేటా తమ వద్దకు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గణనాథుల విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారని అన్నారు.

అబ్బురం అపురూపం..! అరుదైన గణపతి ప్రతిమలు..
ఆ ఇంట్లో ఏమూల చూసినా గణనాధుల ప్రతిమలు కనువిందు చేస్తుంటాయి. విభిన్న రకాల వినాయక విగ్రహాలతో ఆ ఇల్లే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆధ్యాతి్మక సౌరభంతో విరాజిల్లుతుంటాయి. ఆయన తన 12వ ఏట నుంచే అరుదైన సేకరణపై దృష్టిపెట్టారు. అదే వినాయక విగ్రహాలు, ప్రతిమలు, పుస్తకాలు, ఫొటోలు సేకరించడం. ఈ హాబీ ఆయనకు చిన్ననాటి నుంచే అబ్బగా ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రత్యేకత కలిగిన విగ్రహాలు కనిపిస్తే చాలు.. అది ఏ దేశంలో ఉన్నా తన గణపతి మ్యూజియంలోకి చేరాల్సిందే. అంతేకాదు.. విశ్వవినాయక్ పేరుతో వినాయక ఆలయాలపై పుస్తకం కూడా రాస్తున్నారు. ఆయనే వెస్ట్ మారేడ్పల్లికి చెందిన పబ్శెట్టి శేఖర్. ఎస్బీఐలో పనిచేసిన ఆయన ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన హాబీని కొనసాగిస్తున్నారు. అమెరికా, చైనా, నేపాల్, జపాన్, అఫ్గానిస్థాన్, ఈజిప్ట్, శ్రీలంక, బాలి, జర్మనీ, టిబెట్, కంబోడియా, థాయ్లాండ్, యూకే ఇలా సుమారు 39 దేశాల నుంచి పలు ప్రత్యేకతలు కలిగిన గణేశ విగ్రహాలను సేకరించారు. బంగారం, వెండి, ఇత్తడి, రాగి, అల్యూమినియం, మార్బుల్, క్రిస్టల్, చెక్క, రాతి, పంచలోహం, మట్టితో తయారుచేసిన విగ్రహాలతో ఏకంగా ఓ మ్యూజియాన్ని తలపించే సేకరణ ఇక్కడ కొలువుదీరింది. వీటి 32 రూపాల గణేశుడి నుంచి 12 రాశుల గణపతి ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచంలో అత్యధిక గణపతి విగ్రహాలు సేకరించిన వ్యక్తిగా పబ్శెట్టి శేఖర్ గిన్నిస్ రికార్డులోనూ చోటు సంపాదించుకున్నారు. 21,708 గణేశ విగ్రహాలు.. పబ్శెట్టి శేఖర్ ఇప్పటివరకూ తన హాబీలో భాగంగా 21,708 గణేశుడి విగ్రహాలను సేకరించి రికార్డు సృష్టించారు. అంతేకాదు, 19,708 గణేశ పోస్ట్కార్డులు తయారు చేశారు. 15,582 గణేశ ఫొటోలూ ఉన్నాయి. 1,105 గణేశ పోస్టర్లు, 260 గణేశ పురాణాలు, పుస్తకాలు సేకరించారు. 250 గణేశ కీచైన్లు అబ్బురపరుస్తున్నాయి. అరుదైన 205 ఆడియో, వీడియో క్యాసెట్లు సేకరించారు. ఇప్పటి వరకూ ఆయన సేకరించినవన్నీ కలుపుకుని 58,498. ఈ ఒక్క ఏడాదిలోనే 2,060 గణేశ విగ్రహాలను సేకరించి తన హాబీకి మరింత వన్నె తెచ్చాడు. 1973లో ప్రారంభమైన ఈ హాబీ రోజురోజుకూ ముందుకెళ్లడమే కానీ, వెనక్కి తగ్గడం లేదు. లక్ష సేకరించడమే లక్ష్యం.. బొజ్జ గణపయ్యకు సంబంధించి వివిధ రూపాల్లో ఇప్పటివరకూ 50వేలకు పైగా సేకరించారు. మొత్తం లక్ష సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్శెట్టి శేఖర్ చెబుతున్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ముందుగా చూసేది వినాయక విగ్రహాలేనని, తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటానని, ఇప్పటివరకూ 15 వరల్డ్ రికార్డులు రాగా, 2014, 2015లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించానని తెలిపారు. నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్, మిరాకిల్ వరల్డ్ రికార్డు, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డు, కింగ్స్ వరల్డ్ రికార్డు ఇలా ఎన్నో రికార్డులను నమోదు చేసుకున్నారు. ఈ హాబీ తన ప్రాణం ఉన్నంత వరకూ కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు గణపతి దేవాలయాలపై రీసెర్చ్ చేస్తున్నట్లు వివరించారు. (చదవండి: చవితి రుచులు చవిచూడాల్సిందే!)

సీనియర్ సిటిజెమ్స్..! అరవైలోనూ ఇరవైని తలపించేలా
కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు మహా కవి శ్రీశ్రీ.. దీనికి భిన్నంగా ఈ వృద్ధులు ఎప్పటికీ యువకులే.. అన్నట్లు కొందరు నగరవాసులు వయసును లెక్కజేయకుండా అన్నింటా మేము సైతం అన్నట్లు నేటి యువతకు చాలెంజ్ విసురుతున్నారు. అరవైల్లోనూ ఇరవైని తలపించే రీతిలో విభిన్న పోటీల్లో భాగస్వాములవుతూ ఉత్సాహంగా ఆటల నుంచి అందాల పోటీల వరకూ పాలుపంచుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటున్నారు నాటి తరం సీనియర్ సిటి‘జెమ్స్’. రిటైర్మెంట్ అనంతరం కృష్ణా.. రామా.. అంటూ మూలన కూర్చోక.. ఎంచక్కా టూర్లు, ట్రెక్కింగ్స్ అంటూ తమకు నచి్చన రంగంలో సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొండాపూర్లో నివసించే బాబూ రాజేంద్రప్రసాద్ రెడ్డికి 70 ఏళ్లు.. అనితరసాధ్యమైన రీతిలో 12వేల అడుగుల ఎత్తుకు ట్రెక్కింగ్ చేశారు. 72 ఏళ్ల వయసులోనూ ఎన్ఎమ్డీసీ ఫుల్ మారథాన్ అంటే 42.2 కి.మీ పరుగును పూర్తిచేశారు మరో నగరవాసి నాగభూషణరావు. ఇంకా మరిన్ని మారథాన్లలో భాగస్వామ్యం అవుతానంటున్నారు. పోరాట కళల్లో రాణిస్తూ మార్షల్ ఆర్ట్స్లో గిన్నిస్ రికార్డ్ సాధించారు మరో నగరవాసి కిరణ్ ఉనియాల్ (53).. ఇలా వయసుతో ప్రమేయం లేని విజయాలతో ఓల్డేజ్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇస్తూ.. తమ రొటీన్ లైఫ్ని కొత్తగా మార్చేస్తున్నారు. అలాంటి సీనియర్ల హుషారు సరికొత్త యువ తరాన్ని ఆవిష్కరిస్తూ.. కొత్త కొత్త పోటీలకు ఊపునిస్తోంది. అప్పుడే అసలైన జీవితం.. రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతోంది అంటే ఊళ్లు తిరుగుతూ తీర్ధయాత్రలతోనో, ఒళ్లు నలగని పార్ట్ టైమ్ ఉద్యోగాలతోనో, మనవళ్లతోనో.. పార్కుల్లో స్నేహితులతో ముచ్చట్లతోనో కాలం వెళ్లదీసే రోజులు కావివి అంటున్నారు నేటి తరం సీనియర్ సిటిజన్స్. ఓ వైపు ఉద్యోగమో, వ్యాపారమో.. కెరీర్ ముగుస్తుండగానే.. మరోవైపు కొత్త లక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి. ‘నిజం చెప్పాలంటే ఓ వ్యక్తిగా మనకేం కావాలి.. మనమేం చేయగలం.. అనే ఆలోచనలతో అప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది’ అని చెబుతున్నారు నగరానికి చెందిన సాహిల్ గులాటి(65). టాలెంట్, ఆసక్తి ఉండాలేగానీ.. ఇటీవల ఖ్యాల్స్ (కేహెచ్వైఏఏఎల్స్) అనే ఏజ్టెక్ స్టార్టప్, ‘50 ఎబవ్’ అనే పేరుతో టాలెంట్ హంట్ పోటీలు ప్రారంభించింది. ఇది 50 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేకించింది. గానం, ఫొటోగ్రఫీ, వంటలో ప్రావీణ్యం, కవితలు రాయడం, నటన.. ఇలా అదీ ఇదీ అని లేకుండా దాదాపు అన్ని విభాగాలనూ కలుపుకుని ఏకంగా 50 విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తుండడం విశేషం. కళా ప్రతిభ, ట్రావెల్, లైఫ్స్టైల్ వంటి విభాగాల్లో సత్తా ప్రదర్శించే అవకాశం కలి్పస్తోంది.. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పోటీ కోసం 20 నగరాల్లో ఆఫ్లైన్, ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. వయసు సంబంధిత స్టీరియో టైప్ పోటీలకు భిన్నంగా వయోజనుల్లో పోటీ తత్వాన్ని, ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అందం వయసెరగదు అంటున్నారు మిస్టర్ అండ్ మిసెస్ సీనియర్ ఫ్యాషన్ పేజెంట్ ఇండియా నిర్వాహకులు రేఖా దేశాయ్. గత మే నెల్లో 55 ఏళ్లు దాటిన వారి కోసం ఓ పోటీని కొత్తగా ప్రారంభించారామె. స్వయంగా ఆరు పదుల వయసులో ఉన్న రేఖా దేశాయ్.. ‘కలలకు ఎక్స్పైరీ డేట్ లేదు. సీనియర్స్ కళ్లలో మెరుపులు చూడడమే నా కార్యక్రమ లక్ష్యం’ అంటున్నారు. వీరి సంస్థ నిర్వహించే పీచ్ ఈవెంట్స్ తమ మొదటి సీజన్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఆటలకు, పాటలకు సై..సీనియర్స్ కోసం నిర్వహించే ఆటల పోటీలకూ కొదవలేదు. ఈత, గోల్ఫ్ నడక వంటి వాటిలోనూ పోటీలు జరుగుతున్నాయి. అలాగే బోస్, కార్న్హోల్, క్రికెట్ వంటి ఆటలు కూడా అందుబాటులో ఉన్నాయి. అస్సోంకు చెందిన 70ఏళ్ల ఖిరాదా సైకియా కలిత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ గత జూన్లో ధర్మశాలలో జరిగిన నేషనల్ మాస్టర్స్ గేమ్స్లో నాలుగు బంగారు పతకాలు గెలుచుకోవడం ఎందరికో స్ఫూర్తిని అందించింది. అదే విధంగా 60 ఏళ్ల పైబడిన వారి కోసం నిర్వహించే మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్స్, ఏవీటీ చాంపియన్ టూర్స్, పాన్ ఇండియా ఫెడరేషన్ కప్ వంటి ఆటల పోటీల్లోనూ నగరవాసులు చురుకుగా పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. ( చదవండి:

విటమిన్ డి లోపం... ఎన్నో ఆరోగ్య సమస్యలు
స్వాభావికంగానే విటమిన్ ‘డి’ని పొందాలంటే... ముఖం, చేతులు, భుజాలు వంటి శరీర భాగాలను సాధ్యమైనంత వరకు లేత ఎండకూ లేదా హాని చేయనంత సూర్యకాంతికి ఎక్స్΄ోజ్ అయ్యేలా సూర్యోదయ వేళల్లో ఆరుబయట నడవడం మేలు. ఒకవేళ మాత్రలు సరిపడనివారు నేచురల్గానే విటమిన్–డి ని పొందాలని అనుకుంటే తీసుకోవాల్సిన ఆహారాలివి...విటమిన్ ‘డి’లో అనేక రకాలు... ‘విటమిన్ డి’లో విటమిన్ డి1, డి2, డి3...డి7... ఇలా చాలా రకాలు (దాదాపు పది వరకు) ఉన్నాయి. కానీ వాటిల్లో విటమిన్ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్), విటమిన్ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్) చాలా ముఖ్యమైనవి, కీలక మైనవి. విటమిన్–డి లోపాలతో వచ్చే సమస్యలు... విటమిన్–డి లోపాలతో వచ్చే ఆరోగ్య సమస్యల జాబితా చాలా పెద్దదే. అందుకే ఇటీవల సాధారణ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే బాధితుల్లో విటమిన్‘డి’ లోపాన్ని డాక్టర్లు ఎక్కువగా కనుగొంటున్నారు.శరీరంలో ఖనిజలవణాల అసమతౌల్యత (ముఖ్యంగా జింక్, ఐరన్, ఫాస్ఫరస్ వంటివి) హార్మోన్ల అసమతౌల్యత అత్యంత వేగంతో భావోద్వేగాలు మారిపోవడం (మూడ్స్ స్వింగింగ్) మానసిక ఆరోగ్యం దెబ్బతినడం గర్భవతుల్లో పిండం ఎదుగుదలలో లోపాలు ∙మెదడు కణాలైన న్యూరాన్లు (నరాల కనెక్షన్లలో) లోపాలు కండరాల కదలికల్లో సమన్వయ లోపాలు రక్తపోటు ధమనుల్లో రక్తప్రసరణ లోపాలుచక్కెర నియంత్రణలో లోపాలు దంతసంబంధమైన సమస్యలు కణ విభజనలో లోపాలు ఎముకల బలం లోపించడం వ్యాధి నిరోధక శక్తి తగ్గడం రికెట్స్ వ్యాధి ఆస్టియో పోరోసిస్ ఆస్టియోమలేసియా ఒక్కోసారి ఫిట్స్ రావడం మొదలైనవి. వాస్తవానికి ఆహారపదార్థాల ద్వారా లభ్యమయ్యేదాని కంటే సూర్యరశ్మికి తాకినప్పుడు చర్మం కింది పొరలో దీని ఉత్పత్తి ఎక్కువ. అయినప్పటికీ కొద్ది మోతాదుల్లో కొన్ని రకాల ఆహారపదార్థాల నుంచి అది లభిస్తుంది. అవి... ఏయే పదార్థాలలో ఎంతెంత...? ఆహార పదార్థం పరిమాణం (మైక్రోగ్రాముల్లో) కాడ్లివర్ ఆయిల్ 175 షార్క్ లివర్ ఆయిల్ 50 గుడ్లు (పచ్చసొనతో) 1.5 నెయ్యి 2.5 వెన్న 1.0(ఇవన్నీ 100 గ్రాముల ఎడిబుల్ పోర్షన్లో లభించే మోతాదులు)చేపల్లో... చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్ డి సమృద్ధిగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా కాడ్, మాక్రెల్, సొరచేప (షార్క్), సార్డైన్, ట్యూనా వంటి చేపల కాలేయాలలో విటమిన్–డి ఎక్కువ. మాంసాహారాల వంటి యానిమల్ సోర్స్ నుంచి... వేటమాసం, అందులోనూ ప్రత్యేకంగా కాలేయం మాంసంలో; అలాగే వెన్న, నెయ్యి, గుడ్డులోని పచ్చసొనలో ‘విటమిన్–డి’ ఎక్కువ. ఇటీవల చాలామంది పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదంటూ దాన్ని తీసుకోవడం లేదు. కానీ గుడ్డు తాలూకు పచ్చసొనలో కొలెస్ట్రాల్తోపాటు క్యాల్సిటరాల్ అని పిలిచే విటమిన్–డి ఉంటుంది. కాబట్టి విటమిన్–డి పొందాలనుకునే వాళ్లు గుడ్డులోని పచ్చసొన తీసుకోవడం చాలా మంచిది. పచ్చసొన తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు కంటే క్యాల్సిటరాల్ వంటి ఎన్నో పోషకాలను పోగొట్టుకోవడం ద్వారా పొందే నష్టమే ఎక్కువ. అందుకే పరిమిత స్థాయిలో పచ్చసొన తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుందని గుర్తించాలి.మష్రూమ్స్లో... పుట్టగొడుగుల్లో (మష్రూమ్స్లో) విటమిన్–డి2 సమృద్ధిగా దొరుకుతుంది. విటమిన్–డి లోపం ఉన్నవారు పుట్టగొడుగులతో చేసిన రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు ఎండలో నడవటం వల్ల స్వాభావికంగానే విటమిన్–డి2 లభ్యమవుతుంది.ఫోర్టిఫైడ్ ఆహారాల్లో... పాలు, జ్యూస్ వంటి కొన్ని రకాల ఆహారపదార్థాల్లో ఇతర పోషకాలతో మరింత సంతృప్తమయ్యేలా చేస్తారు. ఇలాంటి ఆహారాలను ఫోర్టిఫైడ్ ఆహారాలుగా పేర్కొంటారు. మామూలుగా అయితే పాలలో విటమిన్–డిపాళ్లు తక్కువే. కానీ ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ సోయామిల్క్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్, ఫోర్టిఫైడ్ ఓట్మీల్, ఫోర్టిఫైడ్ సిరేల్స్ (తృణధాన్యాల) వంటి సంతృప్తం చేసిన ఆహార పదార్థాల్లో విటమిన్–డి మోతాదులు ఎక్కువ. విటమిన్ ‘డి’ తాలూకు కొన్ని విశేషాలు... ఎండవేళలోనే విటమిన్–డి తయారవుతుంది. పైగా చర్మాన్ని తాకాక అది కాలేయాన్ని చేరుతుంది. ఇలా విటమిన్–డి తయారీలోనూ, నిక్షిప్తం చేయడంలోనూ కాలేయం కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి... ఎండ తక్కువగా ఉండే చలికాలం నాలుగు నెలల కోసం అవసరమైన విటమిన్–డిని కాలేయం నిల్వ చేసుకుని పెట్టుకుంటుంది. ( నీడ పట్టున వద్దండి. ఇది పెద్ద లోపమం‘డి’)గర్భిణులకు తగినంత విటమిన్ –డి ఇవ్వడం వల్ల వాళ్లకు పుట్టే పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఎదుగుతారు. అన్ని రకాలుగా వాళ్ల వికాసానికి (మైల్ స్టోన్స్కు) విటమిన్–డి ఎంతగానో తోడ్పడుతుంది. ఇదీ చదవండి: Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు జుట్టు ఒత్తుగా పెరగడం కోసంకూడా విటమిన్–డి సహాయపడుతుంది.ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాలు ఉత్తరార్ధ గోళంలోని భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉండే అక్షాంశాల్లో ఉండటంతో ఆయా దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. కాబట్టి... అలాంటి దేశాల్లో విటమిన్ ‘డి’ లోపం చాలా సాధారణం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది అంటే నూరు కోట్ల మంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు అక్కడి బీచ్లలో సన్బాత్ల వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తూ సూర్యకాంతికి తమ దేహం ఎక్స్పోజ్ అయ్యేలా చేసుకుంటూ విటమిన్–డి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల సూర్యకాంతి, ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట్ల కూడా చాలామందిలో విటమిన్ ‘డి’ లోపం విస్తృతంగా కనిపిస్తోంది. మన సమాజంలో చాలావేగంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు పెరిగిపోవడం, ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే అవసరాలు తగ్గడం అన్న అంశమే విటమిన్–డి లోపం పెరగడానికి ప్రధాన కారణం. దాంతో విటమిన్–డి లోపం వల్ల కనిపించే అనర్థాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఫిజీషియన్లు ఈ విటమిన్ను ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.విటమిన్ డి లోపం నిర్ధారణ ఇలా... ఒక రకమైన రక్తపరీక్ష ద్వారా విటమిన్–డి ఉండాల్సిన మోతాదులో ఉన్నదా, లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఇందుకోసం 25 (ఓహెచ్)డీ అనే పరీక్షనూ లేదా 1,25 (ఓహెచ్) డీ3 అనే పరీక్షను చేస్తారు. విటమిన్–డి ఉండాల్సిన మోతాదును తెలుసుకునేందుకు పైన పేర్కొన్న మొదటి పరీక్ష అయిన 25 (ఓహెచ్)డీ బాగా ఉపయోగపడుతుంది. ఇక 25 (ఓహెచ్)డీ పరీక్షనే 25–హైడ్రాక్సీక్యాల్సిఫెరాల్ లేదా 25–హైడ్రాక్సీ విటమిన్– డి అనే మాటకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో విటమిన్ డి మోతాదు 50–65 ఎన్జీ/ఎమ్ఎల్ ఉండాలి. దాని కంటే తక్కువగా ఉంటే డాక్టర్లు విటమిన్–డి టాబ్లెట్స్ ప్రిస్క్రయిబ్ చేస్తారు.క్యాల్షియమ్ సక్రమంగా ఎముకల్లోకి ఇంకిపోవవడంతో పాటు ఎముకల్ని మరింత బలంగా, పటిష్టంగా రూ పొందేలా చేసేందుకు విటమిన్–డి చాలా అవసరం. ఆహారంలోని క్యాల్షియమ్ను శరీరం గ్రహించే ప్రక్రియ మన పేగుల్లోనే జరిగేందుకు విటమిన్–డి సహాయపడుతుంది. -డాక్టర్ శ్రీకృష్ణ ఆర్. బొడ్డుసీనియర్ కన్సల్టెంట్ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్
ఫొటోలు


వినాయక చవితి పూజకుపయోగించే పత్రి పేర్లు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసా?


ఫ్రెండ్స్తో థాయిలాండ్ వెళ్లిన హీరోయిన్ (ఫొటోలు)


నాకు తెలిసిన శక్తిమంతమైన మహిళ: పీవీ సింధు భావోద్వేగం (ఫొటోలు)


టాలీవుడ్ దర్శకులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ (ఫొటోలు)


అయ్యా శివయ్యా.. కొంచెం ఇలా చూడయ్యా! (ఫొటోలు)


జాన్వీ కపూర్ 'పరం సుందరి' మూజ్యిక్ ఈవెంట్ (ఫొటోలు)


కాబోయే సతీమణితో వేడుకలో పాల్గొన్న నారా రోహిత్ (ఫోటోలు)


ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతి..రేపటి నుంచి దర్శనం (ఫొటోలు)


కొండాపూర్ లో సందడి చేసిన జబర్దస్త్ వర్ష (ఫొటోలు)


కర్ణాటకలో అత్యంత ధనవంతులు - టాప్ 10 జాబితా
అంతర్జాతీయం

ఉక్రెయిన్కు 3,350 క్షిపణులు పంపనున్న అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. 850 మిలియన్ డాలర్ల విలువైన 3,350కి పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ఈఆర్ఏఎమ్) క్షిపణులను ఉక్రెయిన్కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఆయుధ ప్యాకేజీకి యురోపియన్దేశాలు నిధులు సమకూరుస్తున్నాయి. ఆరు వారాల్లో ఈ క్షిపణులు కీవ్కు చేరుకుంటాయి. ఇవి ఎప్పుడో ఉక్రెయిన్కు చేరాల్సి ఉండగా.. రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల నేపథ్యంలో కొంత ఆలస్యం అయ్యాయి. వీటిలో 240 నుంచి 450 కి.మీ. పరిధి కలిగిన ఈ ఈ ఆర్ఏఎమ్ క్షిపణులు ఉన్నాయి.

గాజాలో బాంబుల మోత
గాజా సిటీ: ముందుగా ప్రకటించిన విధంగానే గాజా స్ట్రిప్ లోని గాజా నగరాన్ని పూర్తిస్థాయిలో ఆక్రమించుకునే ఇజ్రాయెల్ బలగాలు ప్రయత్నాలను వేగవంతం చేశాయి. గాజా నగరానికి ఉత్తరాన ఉన్న జబాలియాలోని శరణార్థుల శిబిరాలపై రాత్రంతా దాడులు, పేలుళ్లు కొనసాగాయని ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. రఫా మాదిరిగానే జబాలియాను శిథిలాల దిబ్బగా మార్చేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రయత్నిస్తోందని అన్నారు. జెయిటౌన్, షెజాయియా, సబ్రా ప్రాంతాలపైనా రాత్రంగా బాంబు దాడులు కొనసాగాయి. ఈ సైనిక చర్య కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ 60 వేల రిజర్వు బలగాలను త్వరలోనే రంగంలోకి దించుతామని ప్రకటించడం తెల్సిందే. అందుకు వేదికను సిద్ధం చేసేందుకు గాజా నగరానికి సమీపంలోని జబాలియాలోని భవనాలను సైతం ఇజ్రాయెల్ బలగాలు పేల్చి వేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో 24 గంటల వ్యవధిలో కనీసం 64 మంది చనిపోగా సుమారు 300 మంది గాయాలపాలయ్యారని హమాస్ ఆధ్వర్యంలో గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో మరణించిన వారి సంఖ్య 62,686కు, క్షతగాత్రుల సంఖ్య 1.75 లక్షలు దాటిందని వివరించింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులతో గాజా ప్రాంతంలోని ఇళ్లలో 90 శాతంపైగా నేలమట్టం కావడమో ధ్వంసమవడమో జరిగింది. అక్కడి ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింది. మొత్తం 36 ఆస్పత్రులకు గాను 18 ఆస్పత్రులు, అదీ పాక్షికంగా పనిచేస్తున్నాయి. నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. సహాయ కేంద్రాల వద్ద మరో నలుగురు మృతి గాజా నగరంలో ఆదివారం ఆహార పంపిణీ కేంద్రం వద్దకు చేరుకున్న వారిపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నెట్జరిమ్ కారిడార్ వద్ద ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులతో భీతిల్లిన కొందరు పరుగులు తీయగా, గాయపడిన కొందరు నేలపై పడిపోయారన్నారు. ఐరాసతోపాటు ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 2 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా 13,500 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. అదేవిధంగా, పోషకాహార లోపంతో మరో 8 మంది చనిపోగా ఇప్పటి వరకు ఇలా 281 మంది చనిపోయినట్లయిందని వివరించింది. వీరిలో చిన్నారులే 115 మంది వరకు ఉన్నట్లు తెలిపింది. ఇలా ఉండగా, జూలై 21వ తేదీ నుంచి గాజా నుంచి తీసుకెళ్లిన తమ సిబ్బందిని ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం వదిలేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.

రష్యా అణు ప్లాంట్పై దాడి
మాస్కో: రష్యాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన కస్క్ అణు విద్యుత్కేంద్రంపై శనివారం రాత్రి డ్రోన్ దాడి జరిగింది. ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపించింది. దేశవ్యాప్తంగా పలు ఇంధన, విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి దాడులకు దిగిందని మండిపడింది. ‘‘కస్క్ అణు కేంద్రంపై దాడిలో ఒక ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింది. మంటలను వెంటనే ఆర్పేశాం. ఒక రియాక్టర్లో ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. అయితే అణు ధారి్మకత ముప్పేమీ లేదు’’ అని పేర్కొంది. ‘‘ఉస్త్–లుగాలోని ఇంధన ఎగుమతుల టెర్మినల్పై దాడితో మంటలు చెలరేగాయి. అక్కడ 10 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశాం. దేశవ్యాప్తంగా 95 డ్రోన్లు, మిసైళ్లను ధ్వంసం చేశాం. రష్యా ప్రయోగించిన 48 డ్రోన్లను అడ్డుకున్నాం. డొనెట్స్్కలో రెండు గ్రామాలను స్వా«దీనం చేసుకున్నాం. పశ్చిమ ఉక్రెయిన్లో భీకర పోరు కొనసాగుతోంది’’ అని పేర్కొంది. ఓడిపోబోం: జెలెన్స్కీ ‘‘ఉక్రెయిన్ బాధిత దేశం కాదు, పోరాటయోద్ధ. రష్యాతో పోరులో ఇంకా గెలవకున్నా, ఓడిపోయే ప్రసక్తి మాత్రం లేదు’’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. రాజధాని కీవ్లో ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఉక్రెయిన్ స్వాతంత్య్ర పరిరక్షణకు రాజీలేని పోరు కొనసాగిస్తామన్నారు. కెనడా ప్రధాని కార్నీ ఆదివారం కీవ్లో జెలెన్స్కీతో మంతనాలు జరిపారు.త్వరలో భారత్కు జెలెన్స్కీ!ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. శనివారం ఆయనతో ఫోన్ సంభాషణ సందర్భంగా ప్రధాని మోదీ ఈ మేరకు ఆహ్వానించారు. పర్యటన తేదీ త్వరలోనే ఖరారయ్యే అవకాశముందని ఉక్రెయిన్ పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ పర్యటన కీలక మైలురాయిగా మారనుందని అభిప్రాయపడింది.

ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోండి.. భారత్కు నిక్కీ హేలీ సూచన
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితులపై అమెరికా రిపబ్లికన్ నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయం, చమురు కొనుగోళ్లపై లేవనెత్తిన అభ్యంతరాన్ని భారత్ సీరియస్గా తీసుకోవాలని సూచనలు చేశారు. ట్రంప్, మోదీ మధ్య ఇలాంటి పోరాటం దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చైనాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.భారత్కు నిక్కీ హేలీ మంచి మిత్రురాలిగా పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించి భారత్ను అమెరికా దూరం చేసుకోవడంపై నిక్కీ హేలీ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిక్కీ హేలీ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం ఉంది. రష్యా నుంచి చమురు విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్గా తీసుకోవాలి. దాని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా అమెరికాతో కలిసి పనిచేయాలి. వాణిజ్యంలో, రష్యా చమురుపై అభిప్రాయభేదాలు వంటివి పరిష్కరించుకోవడానికి బలమైన చర్చలు, సంప్రదింపులు అవసరం.India must take Trump's point over Russian oil seriously, and work with the White House to find a solution. The sooner the better. Decades of friendship and good will between the world's two largest democracies provide a solid basis to move past the current turbulence.…— Nikki Haley (@NikkiHaley) August 23, 2025ఇక, చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ మిత్రులుగా ఉండాలి అన్న అంశం చాలా ముఖ్యమైంది. దానిని ఏమాత్రం విస్మరించడకూడదు. చైనాను ఎదుర్కోవాలన్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ట్రంప్ నిర్ణయాలు విపత్కరంగా మారాయి. ప్రపంచంలో ఆరోవంతు జనాభాకు కేంద్రం భారత్. అత్యంత యువ జనాభాతో చైనాను దాటేసింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా, భారత్ మధ్య ఘర్షణల వాతావరణం నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య పోరు దురదృష్టకరమని అభివర్ణించారు. భారత్ లాంటి మిత్రదేశాలను ట్రంప్ దూరం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన దౌత్య ప్రయత్నాలు జరగకుండా, అల్టిమేటంలు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. గొప్ప దేశాలు ఎల్లప్పుడూ ప్రజలకు అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించవు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో చర్చలు పరస్పర సహకారం, గౌరవం ద్వారా జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆదేశాలు, ఒత్తిడితో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయం

టారిఫ్ల మోత వేళ.. కీలక భేటీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాను ఏమాత్రం నిలువరించట్లేదని ఆరోపిస్తూ భారత్పై పన్నుల మోత మోగించిన ట్రంప్ సర్కార్ విధించిన ఆగస్ట్ 27 గడువు ముగుస్తుండటంతో ప్రధానమంత్రి కార్యాలయం నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రధానమంత్రి ప్రధానకార్యదర్శి సారథ్యంలో ఈ సమీక్ష సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్పై అమెరికా ప్రభుత్వం తాజాగా విధించిన 50 శాతం దిగుమతి టారిఫ్ ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమల్లోకిరానుంది. ఈ నేపథ్యంలో ఆయా ఎగుమతి సంస్థల లాభాల్లో కోత పడడం, ఆక్వారంగం, లెదర్, వజ్రాభరణాల ఉత్పత్తుల ఎగుమతిపై టారిఫ్ ప్రతికూల ప్రభావం వంటి కీలక అంశాలపై ఆయా రంగాల ప్రతినిధులు, సంస్థలతో ప్రధాని కార్యాలయం సమాలోచనలు జరపనుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతిచేసే సంస్థలతో, ఎగుమతి రంగ నిపుణులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంప్రదింపులు మొదలెట్టింది. అమల్లోకి వచ్చిన 25 శాతం టారిఫ్ కారణంగా తమ లాభాలు పూర్తిగా తగ్గిపోయాయని, నష్టభయాలను ఎదుర్కొంటున్నామని పలువురు కేంద్ర మంత్రిత్వశాఖ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. 50 శాతం టారిఫ్ అమల్లోకి రావడంతో తక్షణం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే వర్గాలను ఆదుకోవాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఎగుమతిదారులు మాత్రం అత్యయిక రుణపరపతి పథకం ద్వారా మూలధనాన్ని అందించాలని, తద్వారా తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే రంగాలవారీగా ఆదుకుంటేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఆప్ మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు మరో 12 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నాయి. ఆస్పత్రుల నిర్మాణ అవకతవకలకు సంబంధించిన నేపథ్యంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.ఆప్ పాలనలో సౌరభ్ భరద్వాజ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆస్పత్రుల నిర్మాణాల్లో అవకతకవలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇదే కేసులో మరో మాజీ మంత్రి సత్యేందర్ జైన్ని సైతం దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. అభియోగాలేంటంటే.. 2018-19లో ఆప్ ప్రభుత్వం రూ. 5,590 కోట్ల విలువైన 24 ఆసుపత్రుల ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల్లో అనేక ఆలస్యాలు, ఖర్చుల పెరుగుదల, మరియు నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ICUలతో కూడిన ఆసుపత్రులు 6 నెలల్లో పూర్తవ్వాల్సి ఉండగా, 3 సంవత్సరాలు గడిచినా 50% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక ఎల్ఎన్జీపీ ఆసుపత్రి ఖర్చు రూ. 488 కోట్ల నుంచి రూ. 1,135 కోట్లకు పెరిగింది, కానీ దాని నిర్మాణంలోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. పైగా అనుమతి లేకుండా కొన్ని ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టడం, అదే సమయంలో కాంట్రాక్టర్ల పాత్రపై అనుమానాలు నెలకొన్నాయి. అలాగే Hospital Information Management System (HIMS) 2016 నుంచి పెండింగ్లో ఉంది, దీన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల నేపథ్యంతో.. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ 2025 జూన్లో సత్యేందర్ జైన్ , సౌరభ్ భరద్వాజ్లపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కేసును ఈడీకి బదలాయించగా.. విచారణ జరుగుతోంది.

కడలిపైకి కదననౌకలు
సాక్షి, విశాఖపట్నం: భారత రక్షణశాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ.. రెండు భారీ యుద్ధనౌకలు మంగళవారం నౌకాదళ అమ్ములపొదిలో చేరనున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో నిరి్మతమైన నీలగిరి క్లాస్లో కీలకమైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధనౌకలు విశాఖపట్నం వేదికగా జాతికి అంకితం కానున్నాయి. అత్యాధునిక ప్రాజెక్ట్–17లో భాగంగా మలీ్ట–మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్లుగా రూపుదిద్దుకున్న వీటిని విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ సర్కార్లో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ త్రిపాఠీ కమిషనింగ్ చేయనున్నారు. ముంబైలోని మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్)లో ఉదయగిరి, కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్–ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ)లో హిమగిరి యుద్ధనౌకలు నిర్మించారు. ఆధునిక కంబైడ్స్ డీజిల్ లేదా గ్యాస్ (సీవోడీవోజీ) ప్రొపల్షన్ ప్లాంట్లు, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్తో పాటు ఇండియన్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ల సూట్స్ ఉన్న ఈ నౌకలకు సముద్రజలాల్లో నిర్దేశిత లక్ష్యాలను నూరుశాతం పూర్తిచేయగల సామర్థ్యం ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా సముద్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు, దేశ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఇవి ముఖ్య భూమిక పోషించనున్నాయి. 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యుద్ధనౌకలు పలు రికార్డులను లిఖించనున్నాయి.ఐఎన్ఎస్ ఉదయగిరి.. నేవీ వార్íÙప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ షిప్. రెండు వేర్వేరు షిప్యార్డ్ల్లో నిర్మించిన రెండు ఫ్రంట్లైన్ సర్ఫేస్ యుద్ధనౌకల్ని ఒకేసారి ప్రారంభించడం నౌకాదళ చరిత్రలో ఇదే తొలిసారి. భారత షిప్యార్డ్లు అవలంబించిన మాడ్యులర్ నిర్మాణ పద్ధతిలో భాగంగా నిరి్మతమై అత్యంత వేగవంతంగా కమిషనింగ్ అవుతున్న యుద్ధనౌక ఉదయగిరి. ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణంలో చైనాను భారత్ అధిగమించింది. చైనా 19 వార్íÙప్స్ నిరి్మస్తుండగా.. భారత్ నిర్మాణ సంఖ్య 20కి చేరుకుంది. ఈ షిప్స్ తయారీలో 200 ఎంఎస్ఎంఈలు పాల్గొన్నాయి. వీటి నిర్మాణం ద్వారా 4 వేలమందికి ప్రత్యక్షంగా, 10 వేలమందికి పరోక్షంగా ఉపాధి లభించింది.

ఉత్తర కొరియాతో పెట్టుకుంటున్న ట్రంప్.. కిమ్ జోంగ్ ఉన్తో భేటీ?
వాషింగ్టన్: ఉత్తరకొరియాతో సత్సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సమక్షంలో కొరియా ద్వీపకల్పంలో శాంతిని తీసుకురావాలనే తన కోరికను అభివ్యక్తం చేశారు. ఇందుకోసం ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్ జోంగ్ ఉన్తో సమావేశం కావాలనుకుంటున్నట్లు తెలిపారు.ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లీని తొలిసారిగా ట్రంప్ వైట్హౌస్కు స్వాగతించారు. ఈ సందర్భంగా ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో తగిన సమయంలో కిమ్ జోంగ్ ఉన్తో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ తనతో మంచిగా వ్యవహరించారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా,దక్షిణ కొరియా సమావేశంలో.. లీ జే మ్యుంగ్ కూడా ట్రంప్ సారధ్యంలో కొరియా ద్వీపకల్పానికి శాంతి చేకూరాలనే అభిలాషను వ్యక్తం చేశారు.ప్రపంచంలో ప్రత్యేక దేశంగా పేరొందిన కొరియా ద్వీపకల్పంలో ట్రంప్ శాంతిని తీసుకురాగలరని ఆశిస్తున్నానని, కిమ్ జోంగ్ ఉన్కు సన్నిహితులు కాగలరని, ఉత్తర కొరియాలో ట్రంప్ ప్రత్యేక ప్రపంచాన్ని (రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్) నిర్మించగలరని లీ జే మ్యుంగ్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఉత్తర కొరియా ఇంకా స్పందించలేదు. అయితే దక్షిణ కొరియాతో యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా మీడియా ప్రత్యేక దృష్టి సారించిందని సమాచారం. కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోవాలనే కాంక్ష అమెరికాలో ఉందనే అభిప్రాయాన్ని ఉత్తర కొరియా వ్యక్తం చేసింది.కాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు వైట్ హౌస్ నుంచి పదేపదే ఆహ్వానాలు అందినప్పటికీ అతను విస్మరిస్తూనే వస్తున్నారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ తన మొదటి పదవీకాలంలోనూ ఉత్తరకొరియాతో దౌత్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. గడచిన జూలైలో ట్రంప్.. కిమ్తో భేటీని కోరుతూ లేఖ రాయగా, దానిని ఉత్తర కొరియా ఐక్యరాజ్యసమితి కార్యాలయ సిబ్బంది తిరస్కరించారని ఉత్తర కొరియా మీడియా తెలిపింది.
ఎన్ఆర్ఐ

టీ ఒక్కటి వెయ్యి రూపాయలా..?
దుబాయ్: భారత్లో ఒక్క టీ ఖరీదు వెయ్యి రూపాయలుందంటూ వ్లాగర్ పరీక్షిత్ బలోచ్ ఆశ్చర్యంతో చేసిన పోస్ట్కు భారీగా స్పందన లభిస్తోంది. దుబాయ్లో ఉంటున్న భారతీయ ట్రావెల్ వ్లాగర్, రేడియో ప్రజెంటేటర్ ఇటీవల ముంబైలో తనకు కలిగిన అనుభవాన్ని ఇన్స్టాలో పంచుకున్నారు. ‘ముంబైలోని ఓ హోటల్లో ఒక కప్పు టీ తాగితే నాకు వెయ్యి రూపాయల బిల్లయింది. అది చూసి షాకయ్యా. సాధారణమైన అవసరాలు సైతం ఇంత ఖరీదుగా మారడం చూసి నమ్మలేకపోయా. దుబాయ్లో ఉంటూ దిర్హామ్లలో సంపాదన కలిగిన నేను భారత్లో ఉండగా ఎన్నడూ పేదవానిగా భావించలేదు. కానీ, టీ బిల్లు చూసి మునుపటిలా కాకుండా, భారత్లో సైతం పరిస్థితులు మారాయని అనిపించింది’అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. దీనికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. భారత్లో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. పలువురు ఇలాంటి అనుభవాల్నే పంచుకున్నారు. ముంబైలాంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ‘నేను ఏటా ముంబై వెళ్తుంటా. కొన్నిటికైతే దుబాయ్ కంటే ముంబైలోనే ఖరీదెక్కువ’అని ఒకరంటే, ‘చివరికి ఏవరో ఒకరు ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. భారత్కు వచ్చాక పేదవానిగా మారింది నేను ఒక్కడినే అని ఇప్పటిదాకా అనుకునేవాణ్ని’అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఇండియా వెళ్లిన ప్రతిసారీ నాకు ఇదే అనుభవం ఎదురవుతోంది. డాలర్లలో సంపాదన కలిగిన నేనే ఇంతగా ఇబ్బంది పడితే, స్థానికంగా ఉండే వారు ఎలా బతుకుతున్నారో ఏమో? ఇంత డబ్బు వారికి ఎలా వస్తుంది? నాకీ విషయం తెలిస్తే, ఇండియాను వదిలేసే వాణ్నే కాదు’అంటూ ఇంకొకరు ముక్తాయింపునిచ్చారు.

అట్లాంటాలో శంకర నేత్రాలయ సేవా దీక్ష..
గ్రామీణ భారత్లో అంధత్వ నిర్మూలన లక్ష్యంతో శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జార్జియాలోని కమ్మింగ్ వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకలో MESU (మొబైల్ ఐ సర్జికల్ యూనిట్) “అడాప్ట్-ఎ-విలేజ్” నేత్ర శస్త్ర చికిత్స శిబిరాలకు మద్దతుగా $1.25 మిలియన్ (రూ.10.4 కోట్లు) నిధులు సమీకరించారు.అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమల్ల మాట్లాడుతూ.. సేవ కోసం అట్లాంటా ప్రజా హృదయం స్పందించిందన్నారు. ఈ సాయంత్రం జీవితాలకు వెలుగునిచ్చే లక్ష్యం కోసం అంతా ఐక్యంగా కృషి చేశామన్నారు. కోశాధికారి మూర్తి రేకపల్లి మాట్లాడుతూ.. ప్రజలు మంచి ఉద్దేశ్యంతో కలిసి వచ్చినప్పుడు దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుందన్నారు. ఈ సాయంత్రం దాతృత్వం, సంస్కృతి చేయి చేయి కలిపి నడవగలవని రుజువు చేసిందన్నారు.శాంతి మెడిచెర్ల, సందీప్ కౌతా, ఉషా మోచెర్ల, జనార్ధన్ పన్నెల, స్రవంతి కెటి, శిల్పా ఉప్పులూరి, శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల వంటి ప్రతిభావంతులైన గాయకులకు ఇదొక గొప్ప వేదికయ్యింది. నీలిమ గడ్డమణుగు సమన్వయం చేసి, వారి కళాత్మకత, సాయంత్రారానికి లోతైన, చిరస్మరణీయమైన కోణాన్ని జోడించి, హాజరైన వారందరి నుండి హృదయపూర్వక ప్రశంసలను పొందారు.ప్రారంభోపన్యాసం తర్వాత, వేదిక అద్భుతమైన శాస్త్రీయ భారతీయ నృత్య ప్రదర్శనలతో సజీవంగా మారింది. అట్లాంటా ప్రాంతం అంతటా నృత్య అకాడమీలు - లాస్య స్కూల్ ఆఫ్ డ్యాన్స్ కు చెందిన గురు.శ్రీదేవి రంజిత్-మోహినీయాట్టం, నాట్యవేద నృత్య అకాడమీకి చెందిన గురు.సోబియా సుదీప్ కిషన్-భరతనాట్యం, కళాక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (KIPA) నుండి గురు. మిటల్ పటేల్-కథక్, మరియు నటరాజ నాట్యాంజలికి చెందిన గురు. నీలిమా గడ్డమణుగు-కూచిపూడి సంప్రదాయం నృత్య ప్రదర్శనలో పాతుకుపోయిన నేపథ్య భాగాలను ప్రదర్శించారు. అధ్యక్షులు బాలరెడ్డి, మాధవి ఇందుర్తి దంపతులు శ్రీ ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, సలహాదారులు SV ఆచార్య, శ్రీమతి నిర్మలా ఆచార్య, శ్రీమతి లీలా కృష్ణమూర్తి, శ్రీమతి నాట్ కృష్ణమూర్తి, డాక్టర్ కిషోర్ చివుకుల, మరియు శంకర నేత్రాలయ అట్లాంటాలోని ప్రధాన బృందం - మూర్తి రేకపల్లి, శ్రీని వంగిమల్ల, రాజ్ ఐలా, రమేష్ చాపరాల, డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లులను సత్కరించి విందును నిర్వహించారు.

నేషనల్ ఇండియా హబ్ గాలా డిన్నర్లో యువీ సందడి
అమెరికాలోని ఇల్లినాయిస్ లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చికాగోలోని నేషనల్ ఇండియా హబ్ ఆధ్వర్యంలో జరిగిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. ఇక ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని నేషనల్ ఇండియా హబ్ నిర్వహించిన గాలా డిన్నర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఈవెంట్ జరిగింది. గాలా డిన్నర్ లో భాగంగా యువరాజ్ సింగ్ తో పలు సంఘాల నాయకులు, ప్రవాసులు భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇండియా హబ్ ఫ్రీ హెల్త్ క్లినిక్ ని యువరాజ్ సింగ్ ప్రారంభించారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేనివారి కోసం ఈ హెల్త్ క్లినిక్ లో ప్రముఖ డాకర్ల సహాకారంతో ఉచిత వైద్య సేవలు అందిచనున్నారు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ చేస్తున్న ఛారిటీ కార్యక్రమాలను పలువురు కొనియాడారు. ఇక యువరాజ్ సింగ్ యొక్క క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ YouWeCan కోసం భవిష్యత్తులో నేషనల్ ఇండియా హబ్ తో కలిసి పనిచేయటానికి ఆయన ఆసక్తి చూపించారు. నేషనల్ ఇండియా హబ్ వార్షిక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఛారిటీ గాలా డిన్నర్ ఈవెంట్ కి విశేష స్పందన రావటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఇండియా హబ్ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు K.K. రెడ్డి, పలువురు ప్రముఖులు, తదితరులు సంస్థ గురించి వివరించారు. అలాగే ఈ హబ్ ను స్థాపించటానికి గల కారణాలు కూడా వెల్లడించారు. నేషనల్ ఇండియా హబ్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, CPR ట్రైనింగ్, ఇమిగ్రేషన్ వంటి ఎన్నో రకాల సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. యువరాజ్ సింగ్ తో గాలా డిన్నర్ ఏర్పాటు చేయటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ ని ఎంతో విజయవంతంగా నిర్వహించిన నేషనల్ ఇండియా హబ్ ను పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా అందరికీ 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని మైమూన్ ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ. 1.75 లక్షలు సహాయం అందించి ఆమెను ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో చదివించారు.రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఆమె నేడు ఇంటర్మీడియెట్ లో ప్రతిభ ప్రదర్శించడంతోపాటు ప్రవేశపరీక్షలో 6,947 ర్యాంక్ సాధించి వెటర్నరీ కాలేజీలో సీటుకు అర్హత సాధించింది. చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలోనే పదవతరగతిలో టాపర్ గా వచ్చిన ఆమె ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మైమూన్ మాట్లాడుతూ, రవి పొట్లూరి గారి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రవి పొట్లూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేఖర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

ఈ తీర్పు సమాజానికి ఓ హెచ్చరిక
సాక్షి నల్లగొండ: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు మహ్మద్ కయ్యుమ్కు 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం నల్లగొండ పోక్సో POCSO కోర్టు ఇన్ఛార్జి రోజారమణి తీర్పు వెల్లడించారు.పోక్సో చట్టం కింద 20 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరో 20 సంవత్సరాలు, కిడ్నాప్ కేసుకుగానూ మరో పదేళ్లు.. మొత్తం 50 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి రోజారమణి ప్రకటించారు.బాలికలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అవసరం. ఈ తీర్పు సమాజానికి హెచ్చరికగా నిలవాలి అని ఆమె అభిప్రాయపడ్డారు.కేసు నేపథ్యం.. బాధిత బాలికపై లైంగిక దాడి జరిగినట్లు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో మహ్మద్ కయ్యుమ్ అనే వ్యక్తి మీద 2021లో కేసు నమోదైంది. 2022 నుంచి నల్లగొండ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది.వాదనలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేల్చారు. ఈ కేసు తెలంగాణలో POCSO చట్టం కింద అత్యధిక శిక్ష విధించిన కేసులలో ఒకటిగా చరిత్రలో నిలిచే అవకాశం కనిపిస్తోంది.

నీకు తెలిసి కూడా నా లవర్ని ఎలా ప్రేమిస్తున్నావు..!
అనంతపురం: ‘నువ్వే మా ప్రేమకు అడ్డు.. నువ్వు లేకపోతే మేం ప్రశాంతంగా ఉంటాం. నువ్వు చనిపోవాల్సిందే’ అంటూ ఓ యువతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేమికులు ప్రేరేపించిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన పూజారి స్వాతి (21) అనంతపురంలోని నలంద డిగ్రీ కళాశాలలో యూజీ మూడో సంవత్సరం చదువుతోంది. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు దీపు రక్త పరీక్ష కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న అరుణ్ కుమార్, మరో టెక్నీషియన్ అయిన యువతితో స్వాతి స్నేహపూర్వకంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో అరుణ్కుమార్, స్వాతి ప్రేమలో పడ్డారు. విషయం తెలుసుకున్న సదరు యువతి సోమవారం ఉదయం స్వాతికి ఫోన్ చేసి మందలించింది. ‘నా ప్రియుడిని ఎలా ప్రేమిస్తున్నావు.. మేమిద్దరమూ ముందు నుంచి ప్రేమలో ఉన్నాం. నీవు అడ్డు వస్తున్నావు. ఈ విషయం ల్యాబ్లో, మీ హాస్టల్లో అందరికీ చెబుతాను’ అని బెదిరించింది. అదే ధోరణిలో అరుణ్కుమార్ కూడా ఆ యువతికి వత్తాసు పలుకుతూ స్వాతిని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన స్వాతి... సోమవారం ఉదయం 7.30 గంటలకు తాను ఉంటున్న బాలాజీ లేడీస్ హాస్టల్లో గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వాతి తండ్రి పూజారి నాగభూషణం ఫిర్యాదు మేరకు అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఆ కన్నీళ్లకు అంతుందా?
మల్కాపురం(విశాఖపట్నం): నగరాలవీధిలో నివసించే సత్యనాల శేఖర్, నారాయణమ్మ దంపతుల జీవితం ఎప్పుడూ నవ్వులు, సంతోషాలతో నిండి ఉండేది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. సమాజం ఆడపిల్లలను చూసే కోణాన్ని పక్కన పెట్టి, వారిని కుమారుల్లా పెంచి పెద్ద చేశారు. ఉన్నత చదువులు చదివించారు. వారి ఆశలన్నీ ఆ ఇద్దరు కుమార్తెల మీదే. పెద్ద కుమార్తె భాగ్యశ్రీ , సీఐ ఫైనల్ ఇయర్. చిన్న కుమార్తె గాయిత్రీ మాధురి మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇదిలావుండగా ఆరు నెలల క్రితం ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పెద్ద కుమార్తె భాగ్యశ్రీ స్నేహితులతో కలిసి యారాడ సముద్ర తీరానికి వెళ్లింది. సముద్రంలో గల్లంతై మృత్యువు ఒడిలోకి చేరుకుంది. కళ్ల ముందే మెరుస్తున్న దీపం ఆరిపోవడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆ బాధను ఎలాగో దిగమింగుకుని.. చిన్న కుమార్తె గాయత్రి మాధురిని కంటికి రెప్పలా చూసుకుంటూ జీవిస్తున్నారు. తమ ఆశలన్నీ ఆమె మీదే పెట్టుకున్నారు. కానీ విధి వారిని మళ్లీ క్రూరంగా చూసింది. మాధురికి పచ్చకామెర్లు వచ్చాయి. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తమ కళ్లెదుటే మెరుస్తున్న వెలుగు మళ్లీ ఆరిపోకూడదని ఆ భగవంతుడిని వేడుకున్నారు. ఆదివారం రాత్రి ఆ దేవుడు వారికి కడుపుకోత మిగిల్చాడు. మాధురి ప్రాణాలు కోల్పోయింది. కన్నవారి కన్నీళ్లకు అంతు లేకుండా పోయింది. కంటికి రెప్పలా చూసుకున్న ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు లేరు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ విషాదకర సంఘటనతో మల్కాపురం ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ తల్లిదండ్రుల కన్నీటి గాథ వింటున్న ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది.

చివరి చూపునకూ నోచుకోకపోతిమి బిడ్డా..
వికారాబాద్ జిల్లా: భర్త చేతిలో కిరాతకంగా హత్యకు గురైన ఐదు నెలల గర్భిణి స్వాతి అంత్యక్రియలను సోమవారం రాత్రి స్వగ్రామంలో నిర్వహించారు. రాత్రి 10:30 గంటలకు అంబులెన్స్లో హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చేరుకున్న స్వాతి మృతదేహాన్ని (శరీరభాగాల మూట) నేరుగా గ్రామంలోని శ్మశానవాటికకు తరలించారు. ఆ మూటను విప్పకుండా అలాగే చితిపై పెట్టి నిప్పంటించారు. తండ్రి రాములు కూతురుకు తలకొరివి పెట్టారు. చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతిమి బిడ్డా.. అంటూ కుటుంబ సభ్యులు చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వాతి అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా నిందితుడు మహేందర్రెడ్డి తరఫు వారెవరూ శ్మశానవాటిక వద్దకు రాలేదు. నిందితుడి ఇంటి వద్ద మృతురాలి బంధువుల ఆందోళన వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతిని కులాంతర ప్రేమ వివాహం చేసుకుని, అనుమానంతో హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో నిందితుడి తల్లిదండ్రులు ఆదివారమే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కాగా, స్వాతి అంత్యక్రియలను మహేందర్రెడ్డి కుటుంబ సభ్యులే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమె బంధువులు నిందితుడి ఇంటి ఎదుట టెంట్ వేసుకుని ఆందోళన చేపట్టారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనలో ఉన్న నిందితుడి తల్లిదండ్రులు గ్రామానికి వచ్చేందుకు భయపడటంతో గ్రామ పెద్దలు కలి్పంచుకుని స్వాతి తల్లిదండ్రులను శాంతింపజేసి.. అంత్యక్రియలు నిర్వహించేలా ఒప్పించారు.స్వాతి శరీర భాగాలకోసం కొనసాగుతున్న గాలింపు మరో పక్క బోడుప్పల్ ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీలో జరిగిన స్వాతి హత్యకేసులో శరీర భాగాల కోసం ప్రతాప సింగారం మూసీకాలువలో రెండో రోజు సోమవారం కూడా డీఆర్ఎఫ్ బృందాలు బోట్లతో గాలింపు కొనసాగించాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర వెతికినా మృతురాలి శరీర భాగాలు దొరకలేదని మేడిపల్లి పోలీసులు తెలిపారు.
వీడియోలు


Gorantla Madhav: నెత్తిన వెంట్రుకలే కాదు బుర్రలో గుజ్జు కూడా లేదు..


Swathi Incident: స్వాతి కేసులో విస్తుపోయే నిజాలు


హన్సల్ పూర్ లో స్వదేశీ ఈవీ ఫెసిలిటీని ప్రారంభించిన మోదీ


నార్కో టెస్టుకు అంగీకరించిన వైష్ణవి కుటుంబసభ్యులు


పేర్ని నానిపై అక్రమ కేసు


అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్, మూవీ రిలీజ్ డేట్ లాక్ ?


మదర్ థెరిసా జయంతి సందర్భంగా జగన్ నివాళులు


వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ముద్రగడ పద్మనాభం లేఖ


రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల ఆందోళన


హైదరాబాద్ మెహదీపట్నం బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం