వైభవ్కు బ్రాడ్మన్తో పోలిక
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో మెరిసి, భారత్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ను ఉతప్ప ఏకంగా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్తో పోల్చాడు. సొంత యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఉతప్ప ఇలా అన్నాడు."వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్ డాన్ బ్రాడ్మన్ను గుర్తు చేస్తుంది. బ్రాడ్మన్ చాలా అరుదుగా ఎల్బీడబ్ల్యూ అయ్యేవాడు. వైభవ్ కూడా అదే తరహా టెక్నిక్తో ఆడుతున్నాడు"పోలికకు కారణంబ్రాడ్మన్ తన టెస్ట్ కెరీర్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే LBW అయ్యాడు. వైభవ్ ఇప్పటివరకు ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ కలిపి ఒక్కసారి మాత్రమే LBWగా ఔటయ్యాడు. అతని ఓపెన్ స్టాన్స్, హై బ్యాక్లిఫ్ట్ కారణంగా బంతి లైన్లోకి త్వరగా రావడం వల్ల LBW అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.జింబాబ్వే సిరీస్లో అదరగొట్టిన వైభవ్ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన వైభవ్.. జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల్లో అద్భుతంగా ఆడాడు. 3 ఇన్నింగ్స్ల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 151 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.పోలికలపై జాగ్రత్త అవసరంఇదిలా ఉంటే, వైభవ్ను ఇప్పుడే డాన్ బ్రాడ్మన్ వంటి దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. అతను ఇప్పుడే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఇలాంటి పోలికలు యువ ఆటగాడిపై అనవసరమైన అంచనాలు, ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ప్రస్తుతం వైభవ్ అసాధారణ ప్రతిభను చూపిస్తున్నా, అతని నిజమైన స్థాయిని నిర్ణయించడానికి ఇంకా అనేక సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ అవసరం.
శభాష్.. బాలికను కాపాడిన టీజీఎస్ ఆర్టీసీ ‘అన్నలు’!
హైదరాబాద్: ఈ రోజుల్లో పక్కవారు ఏమైపోతే మనకెందుకులే అనే స్వభావం చాలామందిలో ఉంటుంది. కానీ మిధాని డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ శేఖర్, డ్రైవర్ జె.ఎస్.కుమార్లు అలా అనుకోలేదు. బస్సు ఎక్కిన విద్యార్థిని ఆందోళనలో ఉన్న విషయాన్ని గ్రహించి ఆమెపై నిఘా ఉంచారు. వారు అనుకున్నదే జరిగింది. ఆ మైనర్ బాలిక వేగంగా వెళుతున్న బస్సులోంచి దిగిపోవడానికి యత్నించింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన వారు ప్రయాణికుల సాయంతో సదరు బాలికను రక్షించారు. అసలేం జరిగిందంటే.. పటాన్ చెరువులో తెలంగాణ మైనారిటీ గురుకులం విద్యార్థిని అనూహ్యంగా పటాన్ చెరువు వద్ద ఆర్టీసీ బస్సు (నెం.218) ఎక్కింది. కానీ ఆమె ఏదో ఆందోళనలో ఉంది.. అదే సమయంలో ఆమె చేతిలో పది రూపాయలు తప్ప కాళ్లకు చెప్పులు కూడా లేవు. కండక్టర్ టికెట్ అడిగినప్పుడు దీనంగా అదో రీతిలో చూసింది. ఆ విద్యార్థిని పట్ల కండక్టర్ శేఖర్కు అనుమానం వచ్చింది. అదే విషయాన్ని డ్రైవర్ కుమార్తో చెప్పాడు. వారిద్దరూ ఆ విద్యార్థిని తీరు పట్ల నిఘా ఉంచారు. ఈలోపు ఆమె పక్కనే ఉన్న ప్యాసింజర్ వద్ద ఫోన్ తీసుకుని ఎవరితోనూ మాట్లాడటాన్ని గమనించారు.ఆ నంబర్ ఆధారంగా ఆఅమ్మాయి మైనారిటీ గురుకులం విద్యార్థిగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పక్కనే ఉన్న ప్రయాణికులకు చెప్పి వారిని కూడా అప్రమత్తం చేశాడు కండక్టర్. ఆ విద్యార్థిని మానసిక ఆందోళనలో ఉందని, కాస్త గమనించమని చెప్పాడు. దాంతో ప్రయాణికుల కూడా అప్రమత్తంగానే ఉన్నారు. కండక్టర్ ఊహించింది నిజమైంది. ఆ అమ్మాయి కదులుతున్న బస్సు నుంచి దిగిపోవడానికి ప్రయత్నించింది. దాంతో ఆ అమ్మాయిని విషయం తెలిసిన తోటి ప్రయాణికులు ఆమెను వెనక్కి లాగారు. ఆమెకు నచ్చచెప్పి చివరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఈఉదంతంలో తెలంగాణ ఆర్టీసీ అన్నలు చూపిన చొరవ అభినందనీయమని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by PonnamPrabhakar (@ponnamprabhakar)
కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. కంగనా వ్యాఖ్యలను ఆమె పార్టీ కూడా సీరియస్గా తీసుకోదని సౌరవ్ దాస్ అన్నారు. నేతలు ఉపయోగించే భాష గౌరవప్రదంగా ఉండాలని కోరారు. దేశ ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా జెన్జీ చేసింది.అంతకుముందు సీజేపీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసన వీడియోలు వాంతి వచ్చేలా ఉన్నాయని సోషల్ మీడియా పోస్టులో అన్నారు. కాక్రోచెస్ మాట్లాడే విధానం,వాడుతున్న భాష అసభ్యంగా ఉన్నాయి. 75ఏళ్ల ప్రధాని, ఆయన తల్లిపైనా నోరుపారేసుకున్నారు. అలా మాట్లాడే వారిని ఏ కోణంలో విద్యార్థులుగా చూడాలి’అని పోస్టులో పేర్కొంది. కంగనా చేసిన వ్యాఖ్యలపై సీజేపీ పైవిధంగా స్పందించింది.
ఇలాగైతే త్వరలోనే భారీ నిరసనతో స్పందిస్తాం: అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన భారీ నిరసన తర్వాత ప్రభుత్వం విద్యార్థులపై తీసుకుంటున్న చర్యలు, జరుగుతున్న పరిణామాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. ‘‘విద్యార్థులను పోలీసులు వేధించడం కొనసాగితే, కాక్రోచ్ జనతా పార్టీ త్వరలో భారీ శాంతియుత నిరసనతో స్పందిస్తుంది. ప్రభుత్వం విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం, వేధింపుల వేట కొనసాగించడాన్ని వెంటనే ఆపాలి’’ అంటూ ట్వీట్ చేశారు.మరోవైపు, తమ పోరాటం ఇంకా పూర్తికాలేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు స్పష్టం చేశారు. ఆందోళన విరమించడం అంటే ఉద్యమం ముగిసినట్టుకాదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇంతకుముందే తెలిపారు.సీజేపీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, ఈ నిరసన ముగింపు "కేవలం ఆరంభం మాత్రమే" అని పేర్కొన్నారు.కేసులను వెనక్కి తీసుకోవాల్సిందే.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను విమర్శించారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎక్స్లో చేసిన పోస్టులో సౌరవ్ దాస్ స్పందిస్తూ... ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్ఐఆర్లు ఉపసంహరించకుండా ఉండేందుకు సాకుగా ఉపయోగించే అవకాశం ఉందని అన్నారు. నిరసనకారులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకోవడం సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటని గుర్తుచేశారు.అస్సాం, బిహార్ వంటి ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కేంద్రం సీజేపీకి ఇచ్చిన హామీని గౌరవిస్తూ ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కోర్టు పోలీసు చర్యలు కొనసాగించాలని ఎక్కడా ఆదేశించలేదని చెప్పారు. మంగళవారాన్నే ఎఫ్ఐఆర్ల ఉపసంహరణకు గడువుగా పేర్కొంటూ, డిమాండ్ నెరవేరకపోతే సీజేపీ మళ్లీ ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.జూలై 25న కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీ ప్రకారం ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవాలని, శాంతియుత ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ లక్ష్యంగా చేసుకోబోమని చెప్పిందని సౌరవ్ దాస్ తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు ఆ హామీకి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.కేంద్రం తరఫున వాదించిన న్యాయవాదులు కూడా ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీ ఆధారంగానే సీజేపీ దేశవ్యాప్త నిరసనను విరమించుకుందని చెప్పారు.
అల్లు అర్జున్ మూవీ నేనే చేయాల్సింది.. కానీ: సుమంత్
నిరసనలకు ‘సుప్రీం’ ఛత్రం!
రణ్బీర్ కపూర్ రామాయణ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
పట్టువదలని ట్యారిఫ్ విక్రమార్కుడు
మహిళకు లైంగిక వేధింపులు.. సీఐ సస్పెండ్
నెటిజన్ల ఫైర్.. ఎన్టీఆర్ గాయాలపై స్పందించని బాబు, లోకేశ్
పోలీసుల వైఫల్యం.. సింహాచలంలో భక్తుల తీవ్ర ఇబ్బందులు
దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ రిలీజ్
‘రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదు’
ఇలాగైతే త్వరలోనే భారీ నిరసనతో స్పందిస్తాం: అభిజీత్ దీప్కే
జియో రీచార్జ్.. కొత్త రూ.200 ప్లాన్
‘మా’ ఆధ్వర్యంలో పావలా శ్యామల అంత్యక్రియలు
మన టార్గెట్ రీచ్ అయ్యాం!
సడెన్గా నా కార్వ్యాన్లోకి వచ్చి బట్టలిప్పేసాడు.!
ఎడాపెడా యుద్ధాలు చేస్తున్నాం కదా.. ఆయుధాలు అడుగంటాయ్ సార్!! విరామం పొడిగిద్దాం!!
భార్య జైనాబ్పై ట్రోలింగ్.. అఖిల్ స్పందన
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సాక్షి కార్టూన్: 28-07-2026
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడికి ఈ-కేవైసీ తప్పనిసరి
ఎప్స్టీన్ కోట్ల సంపదకు ఏకైక వారసురాలు ఈమె!
జంతర్మంతర్ .. ఢిల్లీలో మునిగితే ముస్సోరిలో తేలాడు
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్!
మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా వివరణ
కరుగుతోన్న బంగారు కొండ!
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
చావనైనా చస్తాం.. 'భూములు ఇవ్వం'
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
ఓటీటీలో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
అల్లు అర్జున్ మూవీ నేనే చేయాల్సింది.. కానీ: సుమంత్
నిరసనలకు ‘సుప్రీం’ ఛత్రం!
రణ్బీర్ కపూర్ రామాయణ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
పట్టువదలని ట్యారిఫ్ విక్రమార్కుడు
మహిళకు లైంగిక వేధింపులు.. సీఐ సస్పెండ్
నెటిజన్ల ఫైర్.. ఎన్టీఆర్ గాయాలపై స్పందించని బాబు, లోకేశ్
పోలీసుల వైఫల్యం.. సింహాచలంలో భక్తుల తీవ్ర ఇబ్బందులు
దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ రిలీజ్
‘రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదు’
ఇలాగైతే త్వరలోనే భారీ నిరసనతో స్పందిస్తాం: అభిజీత్ దీప్కే
జియో రీచార్జ్.. కొత్త రూ.200 ప్లాన్
‘మా’ ఆధ్వర్యంలో పావలా శ్యామల అంత్యక్రియలు
మన టార్గెట్ రీచ్ అయ్యాం!
సడెన్గా నా కార్వ్యాన్లోకి వచ్చి బట్టలిప్పేసాడు.!
ఎడాపెడా యుద్ధాలు చేస్తున్నాం కదా.. ఆయుధాలు అడుగంటాయ్ సార్!! విరామం పొడిగిద్దాం!!
భార్య జైనాబ్పై ట్రోలింగ్.. అఖిల్ స్పందన
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సాక్షి కార్టూన్: 28-07-2026
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడికి ఈ-కేవైసీ తప్పనిసరి
ఎప్స్టీన్ కోట్ల సంపదకు ఏకైక వారసురాలు ఈమె!
జంతర్మంతర్ .. ఢిల్లీలో మునిగితే ముస్సోరిలో తేలాడు
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్!
మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా వివరణ
కరుగుతోన్న బంగారు కొండ!
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
చావనైనా చస్తాం.. 'భూములు ఇవ్వం'
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
ఓటీటీలో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
ఫొటోలు
ప్రభాస్ పెద్దమ్మ, చెల్లి లండన్ ట్రిప్ (ఫొటోలు)
శ్రీదేవి విజయ్ కుమార్ శ్రీలంక ట్రిప్ (ఫొటోలు)
మల్లెపూలు.. వడ్డాణంతో అందంగా రుక్మిణి (ఫొటోలు)
'కొరియన్ కనకరాజు' బ్యూటీ.. అచ్చం అలానే ఉందే! (ఫొటోలు)
చాక్లెట్ కలర్ డ్రస్లో పూజా హెగ్డే (ఫొటోలు)
దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దంపతులు (ఫొటోలు)
‘చంద్రముఖి’ సినిమాలో నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫొటోలు)
‘శ్రీనివాస మంగాపురం’ సినిమా HD స్టిల్స్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేడుకగా శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
సినిమా
ఓటీటీలోకి బ్లాక్బస్టర్ 'మైఖేల్'.. అధికారిక ప్రకటన
పాప్ సాంగ్స్ అనగానే చాలామంది మైఖేల్ జాక్సన్ గుర్తొస్తాడు. 90ల్లో తనదైన గొంతుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 2009లో చనిపోయాడు. ఇకపోతే ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీశారు. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లలో రిలీజై అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్ల కోసమా అన్నట్లు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: అఫిషియల్ : నెలలోలోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్’)ప్రపంచ ప్రఖ్యాత పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథతో తీసిన సినిమాకు 'మైఖేల్ అని పేరు పెట్టారు. ఇందులో ఇతడి మేనల్లుడు జాఫర్ జాక్సన్.. టైటిల్ రోల్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 24న బిగ్ స్క్రీన్స్పై రిలీజైంది. కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చలేదు. ఏదైతేనేం దాదాపు రూ.10 వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మన దేశంలో అయితే రూ.54 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ మార్క్ని దాటిన తొలి హాలీవుడ్ బయోపిక్గానూ రికార్డు సృష్టించింది.ఇకపోతే గత నెల 9నే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ, బుక్ మై షో లాంటి ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా.. ఆగస్టు 29 నుంచి హాట్స్టార్లో ఉచితంగానే స్ట్రీమింగ్ కానుంది. కాకపోతే ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ కానుందని ప్రకటించారు.'మైఖేల్' విషయానికొస్తే.. అమెరికాలోని ఇండియానా గ్యారీలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మైఖేల్ జాక్సన్ (జాఫర్ జాక్సన్) తన తల్లి ప్రోత్సాహంతో, సోదరులతో కలిసి 'జాక్సన్ 5' బ్యాండ్తో తన ప్రతిభని చాటుకుంటాడు. అయితే తన తండ్రి జోసెఫ్ జాక్సన్ (కోల్మన్ డొమింగో) కఠినమైన ప్రవర్తన మైకేల్ని మానసిక వేదనకు గురిచేస్తుంది. ఆ భయం నీడలోనే ఒంటరిగా కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు? తన బాల్యాన్ని వెతుక్కుంటూ అతడు నిర్మించుకున్న 'నెవర్ ల్యాండ్' వెనుక ఉన్న ఎమోషన్ ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
నచ్చలేదా వదిలేయ్... రూ.1 కూడా ఖర్చు పెట్టకు: అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్ ప్రతి ఏడాది నిర్వహించే ఫ్యాన్స్ మీట్.. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేశాడు. అభిమానులతో కలిసి ముచ్చటించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రోల్స్ గురించి తమని విమర్శించే వారి గురించి స్పందించాడు. నచ్చలేదా వదిలేయ్ అని చెప్పుకొచ్చాడు.'టైమ్ అనుకోండి ఎనర్జీ అనుకోండి ఏమైనా అనుకోండి. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ప్రతిరోజు మనం 100 శాతం ఛార్జింగ్ అవుతాం. అదే రోజు ఆ ఛార్జింగ్ అంతా అయిపోతుంది. దీనిని నువ్వు ఏమైనా అనుకో. నువ్వు అది దేనికి వాడతావ్ అనేది నీ ఇష్టం. ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మీ సమయం, ఎనర్జీని మీకు నచ్చిన పనిపైనే పెట్టండి. నచ్చని విషయాల కోసం ఒక్క శాతం ఖర్చు పెట్టొద్దు. నచ్చలేదా వదిలేయ్. కనీసం నీకు నచ్చిన అమ్మాయి ఇంటి బయట నిల్చో. కనీసం నువ్వైనా ఎంజాయ్ చేస్తావు' అని అల్లు అర్జున్ చెప్పాడు.'పుష్ప' సినిమాల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న బన్నీ.. తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో 'రాకా' చేస్తున్నాడు. అలానే లోకేశ్ కనగరాజ్తో మరో మూవీ చేస్తున్నాడు. ఇవి వచ్చే ఏడాది లేదంటే 2028లో థియేటర్లలోకి రావొచ్చు.Appreciating #AlluArjun for staying connected with his fans through regular interactive sessions.Every actor should remember who made them stars without expecting anything in return.Being accessible through fan associations is the least one can do. pic.twitter.com/hcTiKfsIRZ— Movies4u Official (@Movies4u_Officl) July 28, 2026
అఫిషియల్ : నెల లోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్’
సత్యదేవ్ కలల ప్రాజెక్టు, ఎంతో కష్టపడి నటించిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకట్ మాహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. సత్యదేవ్ నటనపై ప్రతిఒక్కరు ప్రశంసలు కురిపించారు కానీ.. కథ, కథనంపై మాత్రం పెదవి విరిచారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఈచిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. థియేటర్స్లో రిలీజై నెల కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.కథేంటంటే...1991 నేపథ్యంలో ఈ కథనం సాగుతుది. భువన వంశానికి చెందిన రామప్పరావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. నాలుగు నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు గానీ ఏడాది దాటిపోయినా సరే రామప్ప అలానే ఉంటాడు. పైపెచ్చు రోజూ తాగుతూ బతికేస్తుంటాడు. నిద్రలో నుంచి లేచి అప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు కుసుమప్ప. వీడు తనకు పుట్టలేదని రామప్ప 'అనుమానం'. ఇదే విషయాన్ని చెబుతూ తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) బుర్ర తినేస్తూ ఉంటాడు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప ఎందుకు ఎలా చనిపోయాడు? ఈ కథలో రామప్ప భార్య రేణుక (దీపా థామస్) సంగతేంటి? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.Samajika nibandhanalatho mee burrani kadagadaniki Rao Bahadur osthunnadu! 😎👑 pic.twitter.com/A97zYKYU8i— Netflix India South (@Netflix_INSouth) July 28, 2026
లుక్ మార్చిన రాశీఖన్నా.. తనూజ గ్లామరస్ యాంగిల్
మినీ వ్యాన్లో శ్రీలీల క్రేజీ పోజులులుక్ మార్చి గ్లామర్ చూపిస్తున్న తనూజఎర్ర చీరలో అందంగా హీరోయిన్ అనుపమజపాన్ ట్రిప్ వీడియో షేర్ చేసిన ఆషికబ్లాక్ డ్రస్లో గ్లామరస్గా రాశీఖన్నాక్యూట్ పోజులతో దిశా పటానీ మాయ View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa)
క్రీడలు
మరోసారి పాక్ చిత్తు.. సిరీస్ శ్రీలంక వశం
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను పర్యాటక పాకిస్తాన్ జట్టు 1-2 తేడాతో కోల్పోయింది. హంబన్తోట వేదికగా ఇవాళ (జులై 28) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 40 ఓవర్లలో 187 పరుగులకే చాపచుట్టేయగా.. శ్రీలంక 37.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పాక్ గెలవగా.. రెండు, మూడు మ్యాచ్లను గెలిచిన శ్రీలంక సిరీస్ను సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జులై 31, ఆగస్ట్ 2, 4 తేదీల్లో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.చెలరేగిన లంక బౌలర్లుటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక పాక్ను స్వల్ప స్కోర్కే మట్టికరిపించింది. చేతన విముక్తి (3-36), కెప్టెన్ చమారీ (3-27), కవిష దిల్హరి (3-27) చెలరేగి బౌలింగ్ చేశారు. పాక ఇన్నింగ్స్లో 41 పరుగులు చేసిన ఫాతిమా సనా టాప్ స్కోరర్గా నిలిచింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా (40), మునీబా అలీ (34), నజిహా అల్వి (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు కూడా సత్తా చాటారు. చమారీ ఆటపట్టు (52), హాసిని పెరీరా (50 నాటౌట్), హర్షిత సమరవిక్రమ (71 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి, తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరి ఇన్నింగ్స్లో విష్మి గౌతమ్ (12) మాత్రమే తక్కువ స్కోర్కు ఔటైంది.
వైభవ్కు బ్రాడ్మన్తో పోలిక
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో మెరిసి, భారత్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ను ఉతప్ప ఏకంగా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్తో పోల్చాడు. సొంత యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఉతప్ప ఇలా అన్నాడు."వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్ డాన్ బ్రాడ్మన్ను గుర్తు చేస్తుంది. బ్రాడ్మన్ చాలా అరుదుగా ఎల్బీడబ్ల్యూ అయ్యేవాడు. వైభవ్ కూడా అదే తరహా టెక్నిక్తో ఆడుతున్నాడు"పోలికకు కారణంబ్రాడ్మన్ తన టెస్ట్ కెరీర్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే LBW అయ్యాడు. వైభవ్ ఇప్పటివరకు ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ కలిపి ఒక్కసారి మాత్రమే LBWగా ఔటయ్యాడు. అతని ఓపెన్ స్టాన్స్, హై బ్యాక్లిఫ్ట్ కారణంగా బంతి లైన్లోకి త్వరగా రావడం వల్ల LBW అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.జింబాబ్వే సిరీస్లో అదరగొట్టిన వైభవ్ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన వైభవ్.. జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల్లో అద్భుతంగా ఆడాడు. 3 ఇన్నింగ్స్ల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 151 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.పోలికలపై జాగ్రత్త అవసరంఇదిలా ఉంటే, వైభవ్ను ఇప్పుడే డాన్ బ్రాడ్మన్ వంటి దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. అతను ఇప్పుడే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఇలాంటి పోలికలు యువ ఆటగాడిపై అనవసరమైన అంచనాలు, ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ప్రస్తుతం వైభవ్ అసాధారణ ప్రతిభను చూపిస్తున్నా, అతని నిజమైన స్థాయిని నిర్ణయించడానికి ఇంకా అనేక సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ అవసరం.
పాక్ ప్లేయర్ చారిత్రక శతకం
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. మూడో రోజు మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన మసూద్ 163 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ శతకం అతని టెస్ట్ కెరీర్లో 7వది. వెస్టిండీస్పై తొలి టెస్ట్ సెంచరీ.చారిత్రక శతకంటరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ వేదికపై టెస్ట్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా షాన్ మసూద్ చరిత్ర సృష్టించాడు. 2025 జనవరిలో దక్షిణాఫ్రికాపై శతకం తర్వాత దాదాపు 18 నెలల విరామం అనంతరం మసూద్ చేసిన సెంచరీ ఇది.బ్యాట్తో సమాధానంఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) షాన్ మసూద్ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ స్థానంలో బాబర్ ఆజంను మళ్లీ కెప్టెన్గా నియమించింది. కెప్టెన్సీ కోల్పోయిన వెంటనే మసూద్ బ్యాట్తో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.కెప్టెన్సీ ఎందుకు తొలగించారంటే..?2023లో టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన మసూద్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేదు.* ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఓటమి* దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓటమి* బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలో, వారి దేశంలో టెస్ట్ సిరీస్ పరాజయాలుఈ ఫలితాల నేపథ్యంలో నాయకత్వంలో మార్పు అవసరమని భావించిన PCB, మసూద్ను తప్పించి బాబర్ ఆజంను మళ్లీ టెస్ట్ కెప్టెన్గా నియమించింది.మ్యాచ్ విషయానికొస్తే.. హోరాహోరీగా సాగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు చేయగా.. జస్టిన్ గ్రీవ్స్ (11-6-27-5) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులకే చాపచుట్టేసింది. మసూద్ (109) సెంచరీ చేయడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్, పాక్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్లో పర్యటిస్తుంది.
బాబర్ ఆజం వరల్డ్ రికార్డు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టెస్ట్ కెప్టెన్గా తిరిగి బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 23 పరుగులు చేసిన అతడు.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ 4500కిపైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో మరే ఆటగాడు సాధించలేదు.బాబర్ మూడు ఫార్మాట్లలో పరుగులు* టెస్టులు: 4504 పరుగులు* వన్డేలు: 6626 పరుగులు* టీ20 అంతర్జాతీయాలు: 4596 పరుగులుఅంతర్జాతీయ కెరీర్ గణాంకాలు2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్, అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో కలిపి 15726 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని కంటే ఎక్కువ పరుగులు చేసిన వారు కేవలం ఇద్దరే.* జో రూట్: 18575 పరుగులు* విరాట్ కోహ్లీ: 18303 పరుగులు* బాబర్ ఆజం: 15726 పరుగులుఇటీవలి ఫామ్ ఆందోళనకరంవ్యక్తిగత రికార్డు సాధించినప్పటికీ, బాబర్ ఇటీవలి కాలంలో టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.2023 ప్రారంభం నుంచి టెస్టుల్లో: * 32 ఇన్నింగ్స్ * 859 పరుగులు * సగటు: 26.84 * ఒక్క సెంచరీ కూడా లేదు.వన్డేలు, టీ20ల్లో కూడా పరుగులు చేసినప్పటికీ, అతని స్ట్రైక్రేట్పై విమర్శలు వస్తున్నాయి.విండీస్-పాక్ తొలి టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు చేయగా.. జస్టిన్ గ్రీవ్స్ (11-6-27-5) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులకే చాపచుట్టేసింది. తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ (109) సెంచరీ చేయడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్, పాక్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్లో పర్యటిస్తుంది.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అక్రమాలపై విచారణ. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రెండేళ్ల బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం... ‘కాగ్’ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం
ప్రశ్నపత్రాల లీకేజీ దోషులకు పదేళ్ల జైలుశిక్ష.. పది కోట్ల రూపాయల జరిమానా... ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కృష్ణా, గోదావరి డెల్టాలో వరి వేయొద్దని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
చంద్రబాబు సర్కారును నిద్ర లేపుతాం... పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడుతాం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన
ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించిన ప్రతిపక్షాలు..
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
రామాయపట్నంలో భారీ స్కామ్... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తా... సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్
నంబర్ 1 నుంచి నేలచూపులే... నీతి ఆయోగ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారీగా పతనం
బిజినెస్
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 69.86 పాయింట్లు లేదా 0.091 శాతం నష్టంతో 76,765.92 వద్ద, నిఫ్టీ 10.60 పాయింట్లు లేదా 0.044 శాతం నష్టంతో 23,985.35 వద్ద నిలిచాయి.అశికా గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, రాడాన్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఎక్స్టిగ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, నీల్కమల్ లిమిటెడ్, అఫ్లే 3ఐ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎస్.కె.ఎం. ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ (ఇండియా) లిమిటెడ్, ఆరియన్ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
బేబీ పౌడర్ వివాదం.. రూ.52 వేలకోట్ల పరిహారం!
అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ (Johnson & Johnson) టాల్కం పౌడర్కు సంబంధించిన కేసుల కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీ తయారు చేసిన టాల్కం పౌడర్ వినియోగం వల్ల అండాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని, వేలాది మంది కోర్టులను ఆశ్రయించారు. ఈ వివాదం చాన్నాళ్లుగా కొనసాగుతూనే ఉంది. దీనికి ముగింపు పలకడానికి సంస్థ భారీ మొత్తంలో పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది.జాన్సన్ & జాన్సన్ సంస్థ దాదాపు 76,000 కేసులను పరిష్కరించడానికి 5.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.52 వేలకోట్లు) చెల్లించాలని ప్రతిపాదించింది. చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరాటం వల్ల కంపెనీ ప్రతిష్ఠ చాలా వరకు దెబ్బతింది. ఇది సంస్థ ఆర్ధిక పరిస్థితి మీద కూడా ప్రభావం చూపింది. ఈ కారణంగానే.. సంస్థ ఈ వివాదాన్ని శాశ్వతంగా ముగించాలని నిర్ణయించింది.క్యాన్సర్కు కారణమయ్యే అస్బెస్టాస్జాన్సన్ & జాన్సన్ తయారు చేసిన టాల్కం బేబీ పౌడర్ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల..తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు అండాశయ క్యాన్సర్ లేదా మెసోథెలియోమా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. టాల్కం పౌడర్లో క్యాన్సర్కు కారణమయ్యే అస్బెస్టాస్ అనే పదార్థం ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు.బేబీ పౌడర్ అమ్మకాల నిలిపివేతఈ ఆరోపణలను జాన్సన్ & జాన్సన్ కంపెనీ పూర్తిగా తిరస్కరిస్తోంది. తమ ఉత్పత్తులు క్యాన్సర్కు కారణమవుతాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సంస్థ స్పష్టం చేసింది. అయినప్పటికీ.. వినియోగదారుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, 2020లో అమెరికాలో మాత్రమే కాకుండా కెనడాలో కూడా టాల్కం ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది. కాగా ఇప్పుడు వివాదానికి ముగింపు పలకడానికి పరిహారం చెల్లించేందుకు సన్నద్ధమైంది.ఇదీ చదవండి: అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్!
తర్వాతి హైడ్రోజన్ రైలు రూట్లు ఇవే..
పర్యావరణహిత రవాణా వ్యవస్థే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’లో భాగంగా ప్రవేశపెట్టిన దేశపు తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు ఇటీవలే విజయవంతంగా పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్-సోనెపట్ మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన రైలు ఇప్పటికే 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఈ విజయవంతమైన ట్రయల్స్ ఆధారంగా త్వరలోనే ఢిల్లీ రూట్తో పాటు చారిత్రాత్మక కాల్కా-శిమ్లా, ఇతర పర్వత ప్రాంతాల (హెరిటేజ్ రూట్లు) వైపు ఈ సేవలను విస్తరించేందుకు భారతీయ రైల్వే వేగంగా అడుగులు వేస్తోంది.జింద్ - సోనెపట్ సక్సెస్తొలి విడతగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ హైడ్రోజన్ రైలు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందించింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడమే కాకుండా, పర్యావరణానికి ఎంతో మేలు చేసింది.3,200+ లీటర్ల డీజిల్ పొదుపు: కేవలం 1,200 కి.మీల ప్రయాణంలోనే దాదాపు 3,200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ వాడకాన్ని తగ్గించింది.జీరో కార్బన్ ఉద్గారాలు: ఈ రైలు నుంచి విషపూరిత పొగ లేదా కార్బన్ డై ఆక్సైడ్ వెలువడదు. రసాయన ప్రక్రియ ద్వారా కేవలం నీటి ఆవిరి, స్వచ్ఛమైన గాలి మాత్రమే ఉపఉత్పత్తిగా బయటకు వస్తాయి.శబ్ద రహిత ప్రయాణం: సాంప్రదాయ డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే శబ్ద కాలుష్యం దాదాపు శూన్యం.ఢిల్లీ, కాల్కా-శిమ్లా హెరిటేజ్ రూట్లకు విస్తరణజింద్-సోనెపట్ రూట్లో విజయం సాధించడంతో రైల్వే శాఖ తదుపరి దశ పరీక్షలకు సిద్ధమైంది. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఢిల్లీ మార్గంలో ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు. ప్రకృతి అందాలకు నిలయమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాల్కా-శిమ్లా నారోగేజ్ ట్రాక్పై ఈ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, మాథేరాన్ హిల్ రైల్వే, కాంగ్రా వ్యాలీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో డీజిల్ రైళ్ల స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ రైళ్లను తీసుకురానున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!
సీఈఓ ముందే ఉద్యోగుల నినాదాలు!
భారత ఐటీ రంగంలో గత కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా రగులుతున్న వేతనాల అసంతృప్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. చెన్నై వేదికగా జరిగిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ అంతర్గత వార్షిక కార్యక్రమంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటన ఇప్పుడు దేశీయ టెక్ రంగంలో చర్చనీయాంశమైంది. కంపెనీ సీఈఓ సి.విజయకుమార్ వేదికపైకి రాగానే సభలో పాల్గొన్న వందలాది మంది ఉద్యోగులు ఒకేసారి ‘మాకు జీతాల పెంపు కావాలి’ అంటూ నినాదాలు చేయడం, దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ కావడం ఐటీ వర్గాల్లో కలకలం రేపింది.లాభాల పంట.. వేతనాల్లో కోత!ఈ సంఘటన కేవలం ఒక కంపెనీకి చెందిన తాత్కాలిక నిరసనగా చూడలేం. కరోనా అనంతర కాలంలో గ్లోబల్ టెక్ రంగం కేవలం ఆర్థిక మందగమనాన్ని మాత్రమే ఎదుర్కొవడం లేదు.. తీవ్రమైన మానవ వనరుల సంక్షోభాన్ని కూడా మోస్తోంది. హెచ్సీఎల్తో పాటు పలు ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజాలు ఆరోగ్యకరమైన త్రైమాసిక లాభాలను నమోదు చేస్తున్నప్పటికీ అప్రైజల్స్ (జీతాల పెంపు) విషయంలో తీవ్ర ఆలస్యం వహిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రాజెక్టుల తగ్గింపు, వ్యయ నియంత్రణ పేరుతో మేనేజ్మెంట్లు తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయి ఇంజినీర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలు పెరగకపోవడం, పదోన్నతులు నిలిచిపోవడంతో ఉద్యోగుల్లో సహనం నశించిందనడానికి ఈ ఘటనే నిదర్శనం.కార్పొరేట్ సంస్కృతిలో మార్పుసాధారణంగా భారతీయ ఐటీ ఉద్యోగులు క్రమశిక్షణకు, అంతర్గత నిబంధనలకు కట్టుబడి ఉంటారు. తమ నిరసనలను అధికారిక ఈ-మెయిల్స్ లేదా హెచ్ఆర్ సమావేశాలకే పరిమితం చేస్తారు. అయితే, ఏకంగా కంపెనీ అత్యున్నత నాయకత్వం (సీఈఓ) కళ్ల ముందే బహిరంగంగా నినాదాలు చేశారంటే ఉద్యోగుల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కార్పొరేట్ కమ్యూనికేషన్ వ్యవస్థల వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపుతోంది.When the CEO of HCL came on stage, employees started chanting, "We want a hike!" pic.twitter.com/hty1tNGp26— Nandkishor (@devops_nk) July 27, 2026పరిశ్రమకు హెచ్చరికఈ చెన్నై ఘటన ఐటీ యాజమాన్యాలకు ఒక బలమైన హెచ్చరిక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ, రీ-స్కిల్లింగ్ సవాళ్ల మధ్య ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తే అది కంపెనీ ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. మేనేజ్మెంట్లు ఇప్పటికైనా ప్రాజెక్టు లాభాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా పారదర్శకమైన వేతన విధానాలను అమలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!
ఫ్యామిలీ
జస్ట్ రూ. 5వేలు, మొబైల్ ఫోన్తో.. రూ. 50 కోట్ల వ్యాపారం!
వ్యాపారం అనేది వినయోగదారుల అవసరం, నమ్మకం నుంచే పుడతాయని అంటారు పారిశ్రామిక నిపుణులు. ఏ బ్రాండ్ అయినా మొదట్లో చిన్నగా మొదలవుతుంది. అశేష ప్రజాదరణతోనే బ్రాండ్గా స్థిరపడుతుందని అంటారు. అచ్చం అలానే చాలామంది ఎదుర్కొనే, పెదవివిప్పని సమస్యను పరిష్కారం చూపుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది ఓ నటి. అంతేగాదు కేవలం చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టి..కోట్లలో డబ్బులు ఆర్జిస్తూ..ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గొప్ప వ్యాపార సూత్రాలను చెబుతోందామె. ఆ నటి ఎవరంటే..నటిగా కెరీర్ ప్రారంభించి, వ్యాపారవేత్తగా అవతరించిన పరుల్ గులాటికి తన బిజినెస్ జర్నీ ఎలా మొదలైందో ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. చాలామంది బహిరంగంగా చర్చించడానికి సిగ్గుపడే సమస్యను పరిష్కరించి..అత్యంత గుర్తింపు పొందిన నిష్ హెయిర్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా మారింది. తాను దీన్ని కేవలం రూ. 5 వేలు పెట్టుబడితో మొదలుపెట్టి..ఇవాళ ఏకంగా రూ. 50 వేల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీగా మార్చినట్లు వెల్లడించింది. ఆమె ప్రస్థానం మొదలైందిలా..తాను నటిగా పనిచేస్తూ, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నప్పుడు వ్యాపారం ప్రారంభించాలనే కోరిక తనలో పుట్టిందని వెల్లడించింది పరుల్. ఆ రోజు నుంచి తనకంటూ వ్యాపారం ఉండాలని నిశ్చయించుకుని..హెయిర్ ఎక్స్ టెన్షన్లపై దృష్టిసారించినట్లు తెలిపింది. ఆమె కేవలం జుట్టు సమస్యలకు పరిష్కారాలను అందరికీ అందుబాటులో, సరసమైన ధరలలో, ఆన్లైన్లో లభించేలా చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. అలా ఆమె కేవలం రూ. 5 వేలతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. నిజానికి 2017లో 'నిష్ హెయిర్' ప్రారంభమైనప్పుడు, క్రియేటర్ ఎకానమీ ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నేటిలా అభివృద్ధి చెందలేదు, అలాగే పరుల్ తన కొత్త బ్రాండ్ కోసం సెలబ్రిటీల ప్రచారాన్ని ఇష్టపడలేదు. బదులుగా ఆమెనే స్వయంగా కంపెనీ ప్రతినిధిగా మారింది. ఇది తాత్కాలికమేనని, ఆ తర్వాత ప్రముఖ తారలనే అంబాసిడర్లుగా నియమించుకోవాల్సిందేనని అనుకుంది. అప్పటి వరకు ఆమె తన ఫోన్లో వీడియోలను రికార్డు చేసి..క్రమం తప్పకుండా కంటెంట్ను పోస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఆ తర్వాత బ్రాండ్ వృద్ధికి అతిపెద్ద కారణాలలో ఒకటిగా నిలిచింది. అలా ఆమె ఉదయం రాత్రి అని భేదం లేకుండా చాలా పోస్టులు చేసినట్లు తెలిపింది. చివరికి తాను నిష్ హెయిర్ మార్కెటింగ్ విభాగంగా మిగిలిపోయానని అంటోంది. వాళ్లకి తాను బడ్జెట్ని ఇవ్వనని, కేవలం రీల్స్ మాత్రమే చేస్తానని అన్నారు. ఎలా సక్సెస్ అయ్యిందంటే..ఆమె తరచుగా టెలివిజన్ వాణిజ్య ప్రకటనల ఆడిషన్లకు హాజరయ్యేది, అక్కడ డజన్ల కొద్దీ మోడళ్లు వెయిటింగ్ రూములలో కలిసి కూర్చునేవారు. అక్కడ, ఆమె ఉద్దేశపూర్వకంగా ప్రజల ముందు తన హెయిర్ ఎక్స్టెన్షన్ను తీసివేసి, వారిలో ఉత్సుకతను, సంభాషణను రేకెత్తించేది. ఆ వ్యూహం ఫలించి..త్వరలోనే, తోటి నటీనటులు, మోడళ్లు ఆ ఉత్పత్తి ఎక్కడ నుంచి వచ్చిందని, తాము కొనుగోలు చేయగలమా అని అడగడం ప్రారంభించారు. అలా మొదటి కస్టమర్ని సంపాదించుకుంది. అయితే ఈ ఉత్తత్తులు ప్రారంభ ధరే రూ. 10 వేలు నుంచి రూ. 12 వేలు మధ్య ఉంటుంది. కానీ ఆమె పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి సహాయపడుతుందన్న ఉద్దేశ్యంతో రూ. 5,000కే అమ్మడానికి అంగీకరించింది. అంతేగాతు తన మొదటి అమ్మకం జరగడానికే నెల పట్టిందని అంటోంది. సోషల్మీడియాని ఉపయోగించుకోవడాని కంటే ముందు..పరుల్ వారాంతాల్లో ఫ్లీ మార్కెట్లలో గడుపుతూ, చాలామంది అంతకుముందెన్నడూ చూడని ఒక ఉత్పత్తిని వినియోగదారులకు పరిచయం చేసేది. అంతేగాదు కొనుగోలుదారులను కలసి..ఆ హెయిర్ ఎక్స్టెన్షన్లను ప్రయత్నించమని ప్రోత్సహించేది. ముఖ్యంగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నంపై ఫోకస్ పెట్టేది. ఈ వ్యూహం అమ్మకాలను పెంచేందుకు, అవగాహన కల్పించడానికి ఉపయోగ పడింది. అలా వివిధ నగరాల్లో సుమారు 12 ఫ్లీ మార్కెట్ ఈవెంట్లను పూర్తి చేసే సమయానికి, వ్యాపారం గణనీయమైన సామర్థ్యాన్ని చూపించడం ప్రారంభించింది. ఆ విధంగా పరుల్ అహ్మదాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష రూపాయలు సంపాదించిన విషయాన్ని వెల్లడించింది. అంతేగాదు వైరల్ అయిన ప్రతీది అమ్మకాలను తీసుకు రాదు. అందుకు ప్రభావవంతమైన కంటెంట్ కావాలి. వీటన్నింటి తోపాటు అత్యంత ప్రభావవంతమైన కంటెంట్ వ్యూహం, కాబోయే కస్టమర్లకు ఉత్పత్తిని కొన్ని సెకన్లలోనే అర్థమయ్యేలా చేయడం అని చెబుతోంది. బ్రాండ్ వాల్యూ పెరిగే కొద్దీ..మార్కెటింగ్ చేసే విధానం మారాలి..బ్రాండ్ పెరిగేకొద్దీ, పరుల్ దానిని మార్కెట్ చేయడానికి అసాధారణమైన మార్గాలను అన్వేషించారు. అందుకోసం నిష్ హెయిర్ సరఫరా చేసిన నిజమైన మానవ జుట్టుతో తయారు చేసిన దుస్తులు ధరించి ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేగాదు ప్రతి వ్యవస్థాపకుడు తనకు సాధ్యమైన చోటల్లా తన ఉత్పత్తిని ప్రోత్సహించేలా నమ్మకాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. చివరగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మిమ్మల్ని పూర్తిగా నమ్మండి, అలాగే మీ ఆలోచనను పదిమందితో పంచుకోండి అని చెబుతున్నారు. అంతేగాదు తన విజయం అనేది నిధుల సమీకరణతోనో లేదా ప్రకటనల బడ్జెట్లతోనో ప్రారంభం కాదు, నిజమైన సమస్యను పరిష్కరించడంతోనూ, ఉత్పత్తిని నమ్మడంతోనూ, అలాగే రోజు కెమెరా ముందు నిలబడటానికి సిద్ధంగా ఉండటంతో మొదలైందని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పరుల్. View this post on Instagram A post shared by Parul Gulati 🤍 (@gulati06) (చదవండి: ప్లాస్టిక్ కవర్లలో పట్టు చీరలను పెడుతున్నారా..? జానపద గాయని శారీ టిప్స్..)
ప్లాస్టిక్ కవర్లలో పట్టు చీరలను పెడుతున్నారా..?
పట్టు చీర అనేది భారతీయ కుటుంబాల్లో అదొక శారీ మాత్రమే కాదు..ఎన్నో జ్ఞాపకాల మూట. అది మా అమ్మది, నానమ్మది.. అంటూ వాళ్లతో ముడివేసిన బంధాన్ని గుర్తుచేసేది. వారసత్వంగా భద్రపర్చుకునే గొప్ప జ్ఞాపకం. కుటుంబ చరిత్ర నింపుకున్న చీర. అలాంటి ఏళ్ల నాటి చీరలను రక్షించడం కోసం ఉపయోగించే పద్ధతులే వాటిని పాడైపోయేలా చేస్తున్నాయని అంటున్నారు ప్రముఖ జానపద గాయని, సాంస్కృతిక చిహ్నం మాలినీ అవస్థి. తాను 40 ఏళ్లు పైబడినా..తన సొంత పట్టు చీరలను ఎలా చెక్కుచెదరకుండా ఉంచారో వెల్లడించారు. వారసత్వ పట్టుచీరలను కాపాడుకోవడం అనేది ఏమి కష్టమైనది, ఖరీదైనది కాదు అంటూ పట్టుచీరలను సురక్షితంగా ఉంచుకునే చిట్కాలు పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్లాస్టిక్ కవర్లలో ఉంచొద్దు..ప్లాస్టిక్ కవర్లలో చీరలు ఉంచితో ఏదోరకంగా గాలి వెళ్లిపోతుంది తద్వారా తేమ చీరల్లోకి చేరిపోతుంది. కానీ వాటిలో ఉన్న సమస్య ఏంటంటే ఒకసారి తేమ ప్రవేశించినా..బయటకు వెళ్లడానికి ఛాన్స్ ఉండదు. అది ఘనీభవించి బట్టపై మచ్చలుగా పేరుకుపోతుంది. అది పట్టు లేదా జరీని ఆక్సీకరణం చేసి తిరిగి మార్చలేని విధంగా పాడు చేస్తుంది. పట్టు చీరలను భద్రపర్చడానికి మస్లిన్ వంటి సహజమైన వస్త్రాలతో, గాలి ఆడే గార్మెంట్ బ్యాగులలో భద్రపర్చాలి. చీరలను దుమ్ము, కీటకాల నుంచి కాపాడుతూనే గాలి ప్రసరణకు అనుమతివ్వాలి. అందువల్ల ప్లాస్టిక్ సంచులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అవి తేమను బంధించి త్వరితగతిన పాడేయ్యేందుకు కారణమువుతుంది.నాఫ్తలీన్ బిళ్లలు వద్దు..నాఫ్తలీన్ బిళ్లలు కీటకాల నుంచి రక్షిస్తాయని భావించి ఆ చీరల మధ్యలో ఉంచుతారు. అది కొంతవరకు నిజమే అయినా..పట్టు లేదా జరీకి ఆ నాఫ్తలీన్ బిళ్లలు నేరుగా తగలగానే అది వస్త్రంతో చర్య జరిపి..సున్నితమైన దారాల రంగు మారి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వేపాకులు లేదా లవంగాలు ఉంచితే చాలని. అవి సురక్షితంగా ఉంచడమే గాక ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం అని అంటున్నారు.వస్త్రంలో చుట్టాల్సిందే..గాయని మాలినీ అవస్థి ఉపయోగించే పద్ధతి సాంప్రదాయబద్ధమైనది, వస్త్ర నిపుణులచే పూర్తిగా ఆమోదించబడింది. ప్రతి చీరను నిల్వచేసే ముందు విడివిడిగా ఒక శుభ్రమైన పత్తి వస్త్రంలో చుట్టండి. చీరలను చుట్టేటప్పుడు, దుమ్ము లేదా తేమ లోపలికి రాకుండా గాలి ప్రసరించేలా పత్తి లేదా మస్లిన్తో చేసిన మృదువైన వస్త్రాన్ని ఉపయోగించండి. ప్లాస్టిక్లా కాకుండా, గాలి ప్రసరించే వస్త్రం చీరను దుమ్ము, కీటకాల నుండి రక్షిస్తూ తాజాగా ఉంచుతుంది.అలాగే మడతలను క్రమం తప్పకుండా మార్చండి. ఒక చీర నెలలు లేదా సంవత్సరాల పాటు ఒకే స్థితిలో మడతపెట్టి ఉంటే..బలహీనపడుతుంది. అందువల్ల ప్రతి రెండు నెలలకు ఒకసారి చీరలను మళ్లీ మడతపెట్టడం మంచిదని అంటున్నారామె. అలాగే పట్టుచీరలను చెక్కపెట్టెలు లేదా ట్రంకులలో నిల్వ చేసే సంప్రదాయ పద్ధతే మంచిదని అంటున్నారు. పెట్టె అడుగ భాగంలో శుభ్రమైన పత్తి వస్త్రాన్ని పరచాలి..ఆ వస్త్రంపై చీరలను ఉంచి ఆ పై నుంచి మరో వస్త్రం కప్పాలి.అలాగే చీరలను చీకటి అల్మారాల్లోనే భద్రపర్చాలి. చల్లని పొడి ప్రదేశాన్నే ఎంచుకోవాలివీటి తోపాటు భద్రపర్చిన చీరలు గాలికి తగలడం కూడా అవసరం. అందువల్ల పట్టు చీరలను అప్పుడప్పుడు స్వచ్ఛమైన గాలి తగిలేలా ఉంచడం వల్ల మేలు జరుగుతుంది. ప్రతి కొన్ని నెలలకొకసారి వాటిని బయటకు తీసి, మెల్లగా గాల్లో విప్పండి, కొన్ని గంటలపాటు నీడలో ఆరబెట్టి తిరిగి పెట్టే ముందు వేర్వేరు వరుసలో మడతపెట్టండి. ఇలా చేస్తే ఎన్నాళ్లైనా పట్టు చీరలు రంగుతో సహా పాడవ్వకుండా సురక్షితంగా ఉంటాయి. ఇవన్నీ మన నానమ్మల కాలం నాటి చిట్కాలేనని అంటున్నారు మాలినీ అవస్థి. View this post on Instagram A post shared by HAUTERRFLY | A Fork Media Group Co. (@hauterrfly) (చదవండి: స్లిమ్గా అర్జున్ రణతుంగ..! ఊబకాయులకు ఇదే సరైనదా?)
ఈ 5 ప్రదేశాలకు మీరు ఎప్పటికీ వెళ్లలేరు!
ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు గూగుల్లో కనిపిస్తాయి, డాక్యుమెంటరీల్లో ఉంటాయి. కానీ రియల్ లైఫ్లో ఈ ప్రదేశాలకు డైరక్టుగా వెళ్లడం దాదాపు అసాధ్యం. కొన్ని ప్రదేశాలను వాటి నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి, కొన్ని తెగల గిరిజనుల మనుగడను కాపాడేందుకు, మరికొన్ని ప్రాంతాను మిలిటరీ రహస్యాల వల్ల సాధారణ ప్రజలకు దూరంగా ఉంచారు. మరి ఆ మిస్టరీ ప్రదేశాలు ఇవే..నార్త్ సెంటినల్ ఐలాండ్భారతదేశంలో ఉన్న అండమాన్ ద్వీప సమూహంలో ఈ చిన్న ద్వీపంలోనికి బయటి ప్రపంచం నుంచి ఎవరూ వెళ్లేందుకు అనుమతి లేదు. ఇక్కడ సెంటినెలీజ్ అనే ప్రపంచంతో సంబంధం లేని ప్రజలు ఉంటారు. వాళ్లను అంటువ్యాధుల నుంచి దూరంగా ఉంచేందుకు భారత ప్రభుత్వం ఈ ఐలాండ్ చుట్టూ స్ట్రిక్ట్గా నో–ఎంట్రీ జోన్ మెయింటైన్ చేస్తోంది.ఏరియా 51ఏలియెన్స్ ఉన్నారా? సీక్రెట్ వెపన్స్ తయారు చేస్తున్నారా? ఇలాంటి ఎన్నో పుకార్లకు కేరాఫ్ చిరునామాగా మారింది అమెరికాలోని ఏరియా 51 అనే ప్రాంతం. నిజం ఏంటి అనే విషయం కాస్త పక్కన పెడితేం ఇది అమెరికా మిలిటరీకి చెందిన హై–సెక్యూరిటీ జోన్ లేదా బేస్. సాధారణ ప్రజలు ఇక్కడికి వెళ్లడం పూర్తిగా నిషేధం.స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్దీనినే ప్రపంచ బ్యాకప్ లాకర్ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో లక్షలాది మొక్కల విత్తనాలను సంరక్షిస్తారు. భవిష్యత్తులో ఏదైనా తెలియని విపత్తు వచ్చినా కూడా వ్యవసాయం మళ్లీ ప్రారంభించేందుకు ఇది ప్రపంచానికి ఇన్సూరెన్స్ పాలసీలా పని చేస్తుంది. అందుకే సాధారణ ప్రజలను ఇక్కడికి వెళ్లేందుకు అనుమతించరు.లాస్కాక్స్17,000 ఏళ్ల నాటి పురాతనమైన పెయింటింగ్స్ ఉన్న ఈ గుహల్లోకి ఒకప్పుడు సందర్శకులు వెళ్లేవారు. అయితే కాల క్రమేన మనుషుల శరీరం నుంచి వెలువడే ఉష్ణోగ్రత, బయటి ప్రపంచం నుంచి వచ్చే కాలుష్యం వల్ల పెయింటింగ్స్కు డ్యామేజ్ అవ్వడం మొదలైంది.దీంతో కంప్లీట్గా పర్యాటకులను బ్యాన్ చేసేశారు.వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్శతాబ్దాల నాటి పురాతనమైన, అత్యంత రహస్యాత్మక డాక్యుమెంట్స్, రాజపత్రాలు, చారిత్రాత్మక రికార్డులు అన్నీ కూడా ఇక్కడే దాచి పెడతారు. ప్రత్యేక అనుమతి తీసుకుని వెళ్లే పరిశోధకులకు త΄్పా ఇతరులకు ఎవరికీ ఇక్కడికి వెళ్లేందుకు పర్మిషన్ లభించదు.నిజానికి ప్రతీ అందమైన ప్రదేశం మనం విజిట్ చేయడానికి కాదు. కొన్ని ప్రదేశాలకు రహస్యమే అందం. ఇలా సీక్రెట్గా ఉండటం వల్లే వాటి ప్రత్యేకత అలాగే కంటిన్యూ అవుతుంది. ట్రావెల్ అంటే చెక్లిస్ట్ పూర్తి చేయడం కాదుం వెళ్లిన ప్రతీ ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను గౌరవించడం. అలాగే వెళ్లకూడని ప్రదేశాలను అలా ఏకాంతంగా వదిలేయడం కూడా వాటిని గౌరవించడమే అవుతుంది.
స్లిమ్గా అర్జున్ రణతుంగ..! ఊబకాయులకు ఇదే సరైనదా?
సెలబ్రిటీలు, ప్రముఖులు, సాధారణ వ్యక్తుల అసాధారణ వెయిట్లాస్ జర్నీలు గురించి విన్నాం. కానీ ఊబకాయంతో బాధపడే వారు..డైట్లు, వర్కౌట్లు చేసినా..అంత సులభంగా బరువు తగ్గక ఇబ్బంది పడుతుండే వారికి ఉపయుక్తమైన ఓ క్రికెటర్ వెయిట్లాస్ స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఇది నిజంగానే ఊబకాయులకు అద్భుతమైన వరమా? అనే చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఎవరీ వెయిట్లాస్ జర్నీ అంటే..ఆయనే శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ అర్జున్ రణతుంగా. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్, కొలంబోలో జరిగిన తొలి కొలంబో సాహిత్య ఉత్సవానికి హాజరైన సందర్భంగా, రణతుంగతో కలిసి దిగిన ఒక ఫోటోను నెట్టింట షేర్ చేయడతో..ఒక్కసారిగా ఆ క్రికెటర్ స్మార్ట్ లుక్పై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. శశిథరూర్ ఆ ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. ఆయన అద్భుతమైన మార్పు కారణంగా, ప్రపంచ కప్ గెలిచిన ఈ మాజీ కెప్టెన్ను చాలా మంది క్రికెట్ అభిమానులు గుర్తించలేకపోవచ్చు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసున్న రణతుంగ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారని, అప్పటి నుంచి ఆయన చాలా స్లిమ్గా మారారని వెల్లడించారు. అంతేగాదు క్రికెట్ దిగ్గజం రణతుంగా క్రికెట్ ఆడే రోజుల్లో మూడు ఓవర్లకే అలిసిపోయేవాడినని, కానీ ఇప్పుడు ఛారిటీ మ్యాచ్లలో మూడు గంటల పాటు సునాయాసంగా బ్యాటింగ్ చేయగలనని సరదా అన్నారు. ఇక్కడ రణతుంగా శరీరాకృతి ఊబకాయంతో బాధపడుతున్న వారికి బేరియాట్రిక్ సర్జరీ, దాని ఆరోగ్య ప్రయోజనాలపై దృష్టిసారించేలా చేసింది.బేరియాట్రిక్ సర్జరీ అంటే?బేరియాట్రిక్ సర్జరీ అనేది శాశ్వత బరువు తగ్గడానికి సహాయపడే వెయిట్లాస్ సర్జరీల్లో ఒకటి. ఈ ఆపరేషన్లో కడుపు పరిమాణాన్ని తగ్గించడం, అలాగే చిన్న ప్రేగు పోషకాలను గ్రహించే విధానాన్ని మార్చేలా.. జీర్ణవ్యవస్థను సవరిస్తాయి.ఈ విధానం సాధారణంగా తీవ్రమైన ఊబకాయం ఉన్నవారికి, ముఖ్యంగా ఆహారం, వ్యాయామం, మందులు వంటి జీవనశైలి మార్పులు శాశ్వత ఫలితాలను ఇవ్వడంలో విఫలమైనప్పుడు సిఫార్సు చేయబడుతుంది.బేరియాట్రిక్ సర్జరీ రకాలు:గ్యాస్ట్రిక్ స్లీవ్ (స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ): కడుపులోని పెద్ద భాగాన్ని తొలగించి, ఆహార తీసుకోవడాన్ని పరిమితం చేస్తుంది.గ్యాస్ట్రిక్ బైపాస్ (రౌక్స్-ఎన్-వై గ్యాస్ట్రిక్ బైపాస్): ఒక చిన్న కడుపు సంచిని సృష్టించి, చిన్న ప్రేగులోని కొంత భాగాన్ని దారి మళ్లిస్తుంది.వ్యక్తిగత ఆరోగ్య అవసరాలను బట్టి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, ఇతర జీవక్రియ విధానాలను కూడా పరిగణించవచ్చు.బరువు తగ్గడంకి మించి ఆరోగ్య ప్రయోజనాలు..బేరియాట్రిక్ సర్జరీ అనేది సౌందర్య విధానం కాదని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఊబకాయ సంబంధిత సమస్యలను తగ్గించే మెరుగైన ఆరోగ్య విధానం. బారియాట్రిక్ సర్జరీ ఈ క్రింది విషయాలలో సహాయపడుతుందని పరిశోధనలో తేలిందిటైప్ 2 మధుమేహాన్ని మెరుగుపరచడం లేదా పూర్తిగా నయం చేయడంఅధిక రక్తపోటును తగ్గించడంగుండె జబ్బులు, పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించడంస్లీప్ అప్నియాను మెరుగుపరచడంమోకాళ్లు, తుంటిపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా కీళ్ల నొప్పులను తగ్గించడంఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంచలనశీలత, ఓర్పు మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడంశస్త్రచికిత్స తర్వాత రణతుంగ గంటల తరబడి బ్యాటింగ్ చేయగలగడం అనేది, రోగులు తరచుగా నివేదించే అత్యంత గుర్తించదగిన ప్రయోజనాలలో ఒకటైన - పెరిగిన శారీరక ఓర్పు, మెరుగైన ఫిట్నెస్ను ప్రతిబింబిస్తుంది.ఎవరికి మంచిదంటే..నిపుణుల ప్రకారం, బారియాట్రిక్ సర్జరీ సాధారణంగా ఈ క్రింది లక్షణాలు ఉన్న పెద్దలకు సిఫార్సు చేస్తారు.బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 40 లేదా అంతకంటే ఎక్కువBMI 35 లేదా అంతకంటే ఎక్కువ ఉండి, మధుమేహం, అధిక రక్తపోటు లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి ఊబకాయ సంబంధిత సమస్యలు ఉన్నవారుశస్త్రచికిత్సకు ముందు, ఈ ప్రక్రియ సరైనదేనా అని నిర్ధారించడానికి రోగులకు వివరణాత్మక వైద్య, పోషకాహార మానసిక అంచనాలు నిర్వహిస్తారు.ముమ్మాటికీ షార్ట్కట్ కాదుబారియాట్రిక్ సర్జరీని ఎప్పుడూ తక్షణ పరిష్కారంగా చూడకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక విజయం అనేది శాశ్వత జీవనశైలి మార్పులపై ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా సమతుల్యమైన, అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం, వైద్యులు సూచించిన విటమిన్, మినరల్ సప్లిమెంట్లు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, జీవితాంతం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వంటివి ఉంటాయి.ఈ మార్పులు చేయకపోతే, రోగులు తిరిగి బరువు పెరగవచ్చు, పోషకాహార లోపాలు ఏర్పడవచ్చు. ఇక్కడ రణతుంగ రూపాంతరం ఊబకాయం అనేది కేవలం రూపానికి సంబంధించిన విషయం కాదని, అది ఒక దీర్ఘకాలిక వైద్య సమస్య అని వెల్లడైంది. అలాంటప్పుడు సమర్థవంతమైన చికిత్స అనేది ఆరోగ్యం, జీవననాణ్యతను గణనీయంగా మెరుపరుస్తుందని ఈ క్రికెటర్ వెయిట్లాస్ జర్నీ తెలుపుతోంది. అలాగే ఇది ఊబకాయాన్ని చక్కగా నిర్వహిస్తూనే ఆరోగ్యంగా ఉండే చికిత్స విధానాలపై అవగాహన కల్పిస్తోందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అంతర్జాతీయం
అతనింకా బ్రిటన్లోనే ఎందుకు? భారత్కు పంపరా?
ప్రముఖ గుజరాత్ వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణం కేసు నిందితుడు నీరవ్ మోదీ వ్యవహారం మరోసారి భారత్–బ్రిటన్ సంబంధాల్లో చర్చకు వచ్చింది. నీరవ్ మోదీని భారత్కు అప్పగించడంలో జరుగుతున్న జాప్యంపై బ్రిటన్ మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఇప్పటికీ బ్రిటన్లో ఉండటంపై తాను ‘‘ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురయ్యాను’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. బ్రిటన్కు చెందిన ‘ది డైలీ టెలిగ్రాఫ్’ నిర్వహించిన ‘ది డైమండ్ కింగ్’ పాడ్కాస్ట్లో మాట్లాడిన ప్రీతి పటేల్.. నీరవ్ మోదీ అప్పగింత ఆలస్యంపై స్పందించారు. బ్రిటన్ న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రక్రియలు పూర్తయిన తర్వాత కూడా అతను ఇంకా అక్కడే ఉండటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘అతను భారత్లో చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొని, అక్కడే జైలు శిక్ష అనుభవించాలి. అప్పగింత ఒప్పందాల ఉద్దేశం కూడా అదే’’ అని ప్రీతి పటేల్ పేర్కొన్నారు. నీరవ్ మోదీ కేసులో జరుగుతున్న జాప్యం బ్రిటన్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని.. ఈ వ్యవహారం కారణంగా భారత్ ప్రభుత్వం బ్రిటన్తో సహకరించే విషయంలో నిరుత్సాహానికి గురై ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు.2021లోనే ఆమోదం.. అయినా ఆలస్యంనీరవ్ మోదీ అప్పగింత వ్యవహారం ఎన్నో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో కొనసాగుతోంది. భారత్ అభ్యర్థన మేరకు బ్రిటన్ కోర్టులు ఈ కేసును విచారించాయి. బ్రిటన్ కోర్టు నీరవ్ మోదీపై విచారణ కొనసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని (prima facie case) గుర్తించిన తర్వాత.. అప్పటి హోంమంత్రి ప్రీతి పటేల్ 2021లో అతడి అప్పగింత ఉత్తర్వులపై సంతకం చేశారు. అయితే మానవ హక్కుల అంశాలు, న్యాయపరమైన అప్పీళ్లు, ఇతర చట్టపరమైన ప్రయత్నాల కారణంగా ప్రక్రియ ఆలస్యమైంది.భారత్–బ్రిటన్ వలస చర్చలపైనా ప్రభావంనీరవ్ మోదీ వ్యవహారం కేవలం ఒక న్యాయపరమైన కేసుగా మాత్రమే మిగలలేదని ప్రీతి పటేల్ వ్యాఖ్యానించారు. ఇది భారత్–బ్రిటన్ మధ్య వలసల అంశంపై జరుగుతున్న చర్చలపైనా ప్రభావం చూపిందని తెలిపారు. 2019 నుంచి 2022 వరకు బ్రిటన్ హోంమంత్రిగా ఉన్న సమయంలో.. బ్రిటన్లో అక్రమంగా ఉంటున్న భారతీయులు, తిరిగి పంపించాల్సిన శరణార్థుల విషయంలో భారత్ నుంచి సహకారం పొందడం కష్టంగా మారిందని ఆమె చెప్పారు. నీరవ్ మోదీ వంటి కీలక కేసుల్లో పురోగతి కనిపించకపోవడం భారత్కు అసంతృప్తిని కలిగించిందని, ఆ అంశం చర్చల్లో ప్రభావం చూపిందని ఆమె అభిప్రాయపడ్డారు.అసలు నీరవ్ మోదీ కేసు ఏమిటి?నీరవ్ మోదీ పేరు 2018లో వెలుగులోకి వచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. పీఎన్బీలో సుమారు రూ.13 వేల కోట్లకు పైగా విలువైన అక్రమ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ వ్యవహారంలో నీరవ్ మోదీపై ప్రధానంగా మూడు కేసులు ఉన్నాయి.సీబీఐ కేసు: పీఎన్బీకి జరిగిన మోసానికి సంబంధించి.ఈడీ కేసు: మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి.మూడో కేసు: సాక్ష్యాలు, సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణలపై. కుంభకోణం బయటపడిన తర్వాత నీరవ్ మోదీ భారత్ విడిచి వెళ్లిపోయారు.2019లో లండన్లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.అప్పగింతకు చివరి అడ్డంకులు తొలగినట్టేనా?నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లోని జైలులో ఉన్నారు. భారత్కు అప్పగించకుండా ఉండేందుకు ఆయన పలు న్యాయపరమైన మార్గాలను ప్రయత్నించారు. మానవ హక్కుల అంశాలను ప్రస్తావిస్తూ చేసిన అప్పీళ్లను బ్రిటన్ కోర్టులు పరిశీలించాయి. చివరకు ఆయనకు అనుకూలంగా నిర్ణయం రాలేదు. దీంతో అప్పగింత ప్రక్రియ చివరి దశకు చేరుకుందని భావిస్తున్నారు. అయితే నీరవ్ మోదీ భారత్కు ఎప్పుడు తీసుకురాబడతారన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఓ బ్యాంకింగ్ కుంభకోణం కేసుగా కాకుండా.. భారత్–బ్రిటన్ సంబంధాల్లోనూ ప్రాధాన్యం సంతరించుకున్న అంశంగా మారింది. ప్రీతి పటేల్ తాజా వ్యాఖ్యలతో మరోసారి ఈ కేసు అంతర్జాతీయ చర్చల్లోకి వచ్చింది.
కోర్టులో సాక్ష్యానికి ఏఐ సాయం .. చివరికి ఏమైందంటే?
లండన్: న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్బాట్ను ఆశ్రయించిన ఒక మహిళకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై మాజీ ప్రియుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బ్రిటన్ కోర్టును ఆశ్రయించిన బాధితురాలు.. ఆ రాత్రి జరిగిన సంఘటనలు, శారీరక సాక్ష్యాలు వంటి కీలక అంశాలను స్వయంగా వివరించకుండా ఏఐ సాయంతో తన సాక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో న్యాయమూర్తి ఆ కేసును కొట్టివేశారు.బాధితురాలిగా పేర్కొంటున్న ‘సి’ అనే మహిళ, తాగుబోతు స్థితిలో ఉన్నప్పుడు తన మాజీ ప్రియుడు ‘ఆర్’ తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, ఆ సమయంలో తాను సమ్మతి తెలిపే స్థితిలో లేనందున అది అత్యాచారమేనని ఆరోపించింది. అయితే, విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది.. ఆమె కోర్టులో చెప్పాల్సిన సమాధానాలు, వాంగ్మూలాన్ని ఏఐ టూల్ ద్వారా తయారు చేసుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమె సాక్ష్యం ఎంతవరకు నిజమైనదో స్పష్టంగా తేల్చడం అసాధ్యమని, ఇది నిష్పక్షపాత విచారణకు విఘాతం కలిగిస్తుందని వాదించారు.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బ్రిటన్ అప్పీల్ కోర్టు.. కోర్టు విచారణకు ఏఐని ఉపయోగించడం ‘సాక్షులకు శిక్షణ ఇవ్వడం’ (విట్నెస్ కోచింగ్) కిందకు వస్తుందని, ఇది దేశంలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టం చేసింది. సాక్షులు ఎవరైనా ఏఐని ఉపయోగించి ఆధారాలు సిద్ధం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోర్టు అభిప్రాయపడింది. నిజాయితీపరులైన సాక్షులు తాము గుర్తుంచుకున్న విషయాలను ఏఐ ప్రభావంతో మార్చుకునే ప్రమాదం ఉందని, అలాగే అసత్య సాక్షులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ కేసుకు సంబంధించి పునర్విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో న్యాయ వ్యవస్థలో వాటి వాడకంపై నైతిక, చట్టపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇది కూడా చదవండి: పాక్లో వైద్య సంక్షోభం.. ప్రాణాలొదులుతున్న బాధితులు!
పాక్లో వైద్య సంక్షోభం.. ప్రాణాలొదులుతున్న బాధితులు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూ)పూర్తిగా నిండిపోవడంతో తీవ్రమైన వైద్య ఆరోగ్య సంక్షోభం తలెత్తింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ఈ దుస్థితి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది.జనాభా భారీగా పెరిగినా.. మౌలిక వసతులు శూన్యంఇస్లామాబాద్లోని ప్రముఖ పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్) ఆస్పత్రిని కేవలం 5 లక్షల మంది జనాభా కోసం ప్రారంభించారు. కానీ నేడు సుమారు 50 లక్షల మందికి పైగా ప్రజల వైద్య అవసరాలను ఈ ఒక్క ఆసుపత్రే తీర్చాల్సివస్తోంది. జనాభా పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, నిపుణులైన వైద్య సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదు. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులపై తీవ్రమైన భారం పడుతోంది.సీనియర్ జర్నలిస్ట్ మరణంతో..పాక్కు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అబిద్ రజా కజ్మీకి పక్షవాతం రావడంతో వైద్యులు వెంటనే వెంటిలేటర్పై ఉంచాలని సూచించారు. కానీ పిమ్స్ ఆసుపత్రిలోని 12 ఐసీయూ వెంటిలేటర్లు అప్పటికే పూర్తిగా నిండిపోయాయి. కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గం మధ్యలోనే ఆయన మరణించారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్లో నెలకొన్న ఆరోగ్య సంక్షోభం అసలు స్వరూపాన్ని దేశం ముందుంచింది.అందని ద్రాక్షలా వెంటిలేటర్లుపిమ్స్ ఆస్పత్రిలో సుమారు 90కి పైగా వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చే తీవ్రమైన రోగులకు అవి వెంటనే దొరకడం లేదు. న్యూరాలజీ, పల్మోనాలజీ విభాగాల్లో చేరిన రోగులు కొన్నిసార్లు 15 నుంచి 20 రోజుల పాటు వెంటిలేటర్పైనే ఉండాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రాణరక్షక పరికరాలు నిరంతరం వినియోగంలో ఉండి, అత్యవసర సమయాల్లో ఖాళీగా ఉండటం లేదు.‘నో రిఫ్యూజల్' విధానంతో..ఎలాంటి తీవ్రమైన రోగితోనైనా సరే చికిత్సను తిరస్కరించకూడదనే కఠినమైన నిబంధన పిమ్స్ ఆస్పత్రిలో అమలవుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులను కూడా ఈ విధానం వల్ల వెనక్కి పంపకుండా చేర్చుకుంటున్నారు. పడకలు ఖాళీ లేకపోయినా స్ట్రెచర్లపైనే చికిత్స అందించాల్సి వస్తోంది. ఇది మానవతా దృక్పథంతో మంచిదే అయినప్పటికీ, పరిమిత వనరుల మధ్య ఆసుపత్రిపై అంతులేని ఒత్తిడిని పెంచుతోంది.కేవలం కొత్త యంత్రాలు కొంటే సరిపోతుందా?ప్రభుత్వం కేవలం పెద్ద సంఖ్యలో కొత్త వెంటిలేటర్లను కొనుగోలు చేయడం వల్ల మాత్రమే ఈ సంక్షోభం సమసిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి వెంటిలేటర్ను సరిగ్గా ఆపరేట్ చేయడానికి శిక్షణ పొందిన ఎనస్థీషియస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులు, నర్సులు, టెక్నీషియన్లు అత్యవసరం. కానీ పాకిస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఇటువంటి నిపుణులైన మానవ వనరుల కొరత చాలా తీవ్రంగా ఉంది.గగనంగా మారిన ప్రైవేట్ వైద్యం.. పాకిస్థాన్లో ప్రైవేట్ ఆసుపత్రులలో ఐసీయూ వైద్యం సామాన్యులకు అందనంత ఖరీదైనదిగా మారింది. ఒక్కో రోగికి రోజువారీగా సుమారు 3 లక్షల పాకిస్థానీ రూపాయల వరకు ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. అంత భారీ మొత్తాన్ని భరించే ఆర్థిక స్థోమత లేకపోవడం కారణంగా మధ్యతరగతి, పేద ప్రజలు పూర్తిగా ప్రభుత్వ ఆస్పత్రులపైనే ఆధారపడవలసి వస్తోంది.ప్రాథమిక వైద్య రంగం విఫలందేశంలోని జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరైన సేవలు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. స్థానిక స్థాయిలోనే నయం కావాల్సిన చిన్నపాటి రోగాలతో కూడిన రోగులు కూడా నేరుగా పెద్ద ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా పెద్ద ఆస్పత్రులపై అనవసరమైన భారం పడి, నిజమైన అత్యవసర రోగులకు వైద్యం దక్కని పరిస్థితి ఏర్పడుతున్నది.ఇది కూడా చదవండి: నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తపరిచిన అభ్యంతరాలను స్పష్టంగా తోసిపుచ్చారు. అమెరికా రక్షణ సామగ్రి విక్రయాలను ఏ విదేశీ నాయకుడూ శాసించలేరని ఆయన తేల్చిచెప్పారు. సోమవారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ, వాషింగ్టన్ రక్షణ రంగ విక్రయాలపై ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘మేము ఏది విక్రయించాలో ఎవరూ మాకు చెప్పలేరు’ అని స్పష్టం చేశారు.టర్కీ ఒక అద్భుతమైన మిత్రదేశమని, సిరియాతో సహా ప్రాంతీయ వ్యవహారాలలో అంకారా పాత్ర ఎంతో కీలకమని ట్రంప్ ప్రశంసించారు. టర్కీ, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు లేనప్పటికీ, అమెరికా-టర్కీ బంధం బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అధునాతన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలను టర్కీకి అందించడం వల్ల మధ్యప్రాచ్యంలో అధికార సమీకరణాలు మారుతాయని, ఆ దేశానికి ఈ సాంకేతికత ఇస్తే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని నెతన్యాహు ఇటీవల సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో హెచ్చరించిన విషయం తెలిసిందే. టర్కీకి దురాక్రమణ పూరిత ఆశయాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన కారణంగా, ట్రంప్ మొదటి హయాంలోనే 2019లో టర్కీని ఎఫ్-35 ఉమ్మడి ప్రాజెక్ట్ నుంచి అమెరికా తప్పించింది. నాటో భద్రతా ఆందోళనల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, తాజా పరిణామాలు అంకారాతో రక్షణ రంగ సహకారాన్ని పునరుద్ధరించడానికి ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ భయాందోళనలను పక్కనపెట్టి, అమెరికా అధ్యక్షుడి ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఇది కూడా చదవండి: అస్సాం: నీటిలో 631 గ్రామాలు.. 4.45 లక్షల మంది విలవిల
జాతీయం
ప్రధానికి మాజీ ఐఏఎస్ వింత విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వ సేవలో తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచలేకపోతున్నానంటూ ఏడేళ్ల క్రితం రాజీనామా సమర్పించిన మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపినాథన్ దానిని వెంటనే ఆమోదించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరోసారి కోరారు. ‘ఎక్స్’ వేదికగా ప్రధానిని ట్యాగ్ చేస్తూ ఆయన ఈ అభ్యర్థన చేశారు. ‘ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ గారూ.. మీరు ఇప్పుడు రాజీనామాలు ఆమోదించడం ప్రారంభించారు కాబట్టి, దయచేసి నా రాజీనామాను కూడా ఆమోదించండి. దీనికి ఇప్పటికే ఏడేళ్లు పూర్తయ్యాయి’ అని ఆయన పేర్కొన్నారు.జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన ఆర్టికల్ 370 పరిణామాల నేపథ్యంలో, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 2012 బ్యాచ్కు చెందిన ఏజీఎండీయూటీ కేడర్ ఐఏఎస్ అధికారి గోపినాథన్ 2019లో తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఇన్నేళ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వం ఆయన రాజీనామాను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో ఆయన.. తనకు గత ఏడేళ్లుగా ఎలాంటి జీతం అందలేదని, సస్పెన్షన్కు గురికాలేదని, కేవలం తన ఫైల్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెట్టిందని విమర్శించారు.గతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తనకు నోటీసులు జారీ చేస్తూ.. సర్వీస్లో ఉండగానే ప్రభుత్వాన్ని విమర్శించినందున మీ పే-స్కేల్ తగ్గిస్తామని తెలిపిందని, కానీ తనకు ఎటువంటి జీతం అందనప్పుడు పే-స్కేల్ కోత ఎలా వర్తిస్తుందని ఆయన గతంలో ప్రశ్నించారు. ఇదే సమయంలో రాజీనామా చేసిన పలువురు అధికారుల రాజీనామాలు ఇప్పటికే ఆమోదం పొందగా, తన ఫైల్ మాత్రం హోంశాఖ వద్దే పెండింగ్లో ఉండటం గమనార్హంమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.
జంతర్ మంతర్ లాఠీఛార్జిపై సీజేఐ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆందోళనకారులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన అత్యున్నత న్యాయస్థానం.. ఇలాంటి ఘటనల్లో బాధ్యతను నిర్ధారించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.“ఎవరు అతిగా బలప్రయోగం చేశారో తేల్చాలి. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేస్తుంది. బాధ్యతను నిర్ణయించకుండా చేసే దర్యాప్తునకు అర్థం లేదు” అని మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉందిప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని సుప్రీంకోర్టు సీజేపీ ధర్మాసనం గుర్తు చేసింది. ఆందోళనలను ఎదుర్కొనే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధానాల్లో మార్పులు అవసరమని పేర్కొంది. పోలీసులు గతంలో కోర్టులు సూచించిన మార్గదర్శకాలను పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. నిరసనల సమయంలో పోలీసుల వ్యవహారశైలికి సంబంధించి కొత్త ప్రొటోకాల్ అవసరమని సూచించింది. 2018లో ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. టియర్ గ్యాస్, లాఠీచార్జి, నియంత్ర పద్ధతులపై సమగ్ర విధానం రూపొందించాలి అని పేర్కొంది. జులై 20న ఉద్రిక్తతలుజులై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా(చలో సంసద్) వెళ్లేందుకు CJP నేతృత్వంలో నిరసనకారులు ప్రయత్నించిన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీలు ఉపయోగించారు. ఈ క్రమంలో ఘర్షణలు చోటుచేసుకుని పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పెల్లెట్ గన్స్ వాడకంపై ఆగ్రహంపోలీసుల దాడిలో ఓ యువకుడు కంటి చూపు కోల్పోయిన ఘటనను పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు, చిన్నారులపై కూడా లాఠీచార్జి జరిగిందని.. యూనిఫాంలో లేకుండా సివిల్ డ్రెసులో ఉన్నవాళ్లూ దాడులు చేశారని.. ఎలక్ట్రిక బ్యాటన్లు, ఎలక్ట్రిక్ షీల్డ్లు వాడారని తెలిపారు. ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల చర్యల్లో అతిగా బలప్రయోగం జరిగిందా? అనే అంశంపై పూర్తి స్థాయి విచారణ అవసరమని తెలిపారు. మాజీ న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు?ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించింది. జంతర్ మంతర్ ఘటనలో ఎవరి తప్పు ఎంత ఉందో బయటకు రావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పోలీసులకు కీలక సందేశంనిరసనలు, ఆందోళనలు ప్రజాస్వామ్యంలో భాగమని గుర్తు చేసిన సుప్రీంకోర్టు.. వాటిని నియంత్రించే క్రమంలో పోలీసులు చట్టపరమైన పరిమితులు దాటకూడదని సూచించింది. జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం వ్యాఖ్యలు.. నిరసనల నిర్వహణ, పోలీసుల వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి.
CJP సంబరాలపై వాంగ్చుక్ రియాక్షన్ ఇదే..
నీట్ ఉద్యమం నేపథ్యంలో తెరపైకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల సంబరాల వీడియోలపై ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ స్పందించారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా ఆయన 26 రోజులపాటు దీక్ష కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాక CJP సభ్యులు పార్టీ చేసుకున్న వీడియోలు వైరల్గా మారిన వేళ.. వాంగ్చుక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.సీజేపీ పార్టీ సంబురాలపై వాంగ్చుక్ స్పందించారు. విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని గౌరవం, నియంత్రణ, బాధ్యతతో స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “విజయానికి వినయం తోడవ్వాలి” (Victory must be accompanied by humility) అని సోనమ్ వాంగ్చుక్ పేర్కొన్నారు. CJP నిర్వహించిన నెల రోజులకుపైగా సాగిన నీట్ నిరసనల అనంతరం ఈ సంబరాలు జరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ వేడుకలపై విమర్శలు చేయగా.. మరికొందరు ఇది యువత నిరసన వ్యక్తీకరణలో భాగమని సమర్థించారు.సోనమ్ వాంగ్చుక్ పాత్రఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమానికి సోనమ్ వాంగ్చుక్ మద్దతుగా నిలిచారు. నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. పోలీసులు ఆసుపత్రికి తరలించే వరకు నిరసనకారులతోనే ఉన్నారు. అనంతరం ప్రభుత్వం నుంచి హామీలు రావడంతో 26 రోజుల దీక్షను విరమించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై నమోదైన కేసులు, బాధిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై జరిగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన దీక్ష విరమణను స్వాగతిస్తూనే.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్షతో తమకు సంబంధం లేదని.. తమ డిమాండ్లు నెరవేరే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. అదే సమయంలో.. Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026CJP సంబరాలపై విమర్శలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాతి దీప్కే ప్రసంగంలో సోనమ్ వాంగ్చుక్ పేరు ప్రస్తావనకు రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. ఎక్స్ ఖాతా నుంచి సోనమ్ వాంగ్చుక్ సపోర్ట్గా వేసిన డీపీని దీప్కే తొలగించగా.. అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు అలాగే కొనసాగించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై ఢిల్లీలోని అభిజిత్ దీప్కే నివాసానికి సమీపంలోని ఓ హోటల్లో CJP సభ్యులు డ్యాన్స్లు చేస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యమం వెనుక విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యల విషాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వేడుకలు సరైన సందేశం ఇవ్వవని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం కొత్త తరం పోరాట విధానంలో ఉత్సాహం, సృజనాత్మకత కూడా భాగమేనని పేర్కొన్నారు.“ఇదే జెన్ జీ స్టైల్”.. విమర్శలపై CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ.. తమ వేడుకలు యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అంతేకాదు పోరాటంలో పాల్గొన్న ఎవరీని తాము విస్మరించలేదని.. వలంటీర్ల గౌరవార్థమే ఈ పార్టీ ఇచ్చామని చెప్పారు. “ఎంతకాలమైనా రోడ్డుపై కూర్చొని పోరాడగలం.. అదే సమయంలో పాటలు పాడుతూ నిరసన చేయగలం. కాఫీ తాగుతూ ఉద్యమాన్ని నిర్వహించగలం. ఇదే కొత్త తరం శైలి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజకీయ విమర్శకులను అంకుల్స్, ఆంటీస్ అంటూ ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ ఆరోపణలుసంబరాల వీడియోలపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ.. CJP నాయకత్వం ఫైవ్ స్టార్ హోటల్లో విజయోత్సవం చేసుకుందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఖర్చులు ఎవరు భరించారంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలను సౌరవ్ దాస్ ఖండించారు. అది ఖరీదైన వేడుక కాదని, సాధారణ హాల్లో జరిగిన కార్యక్రమమని తెలిపారు. వాంగ్చుక్ వ్యాఖ్యలతో కొత్త చర్చCJP సంబరాలపై కొనసాగుతున్న వివాదం మధ్య సోనమ్ వాంగ్చుక్ చేసిన “విజయానికి వినయం తోడవ్వాలి” అనే వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇది విమర్శలా? లేదంటే ఉద్యమానికి ఇచ్చిన సూచనా? అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీచార్జ్ : ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి దిగారనే ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. లాఠీ చార్జి ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించి కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సి కీలక వ్యాఖ్యలు చేసింది. జూలై 25న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఎన్హెచ్ఆర్సి ఢిల్లీ పోలీస్ కమిషనర్కు నోటీసులు పంపుతూ, దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ప్రజా నిరసనల సమయంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణపై ఈ ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కమిషన్ సుమోటోగా స్వీకరిస్తోందని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది.శాంతియుత నిరసన ప్రాథమిక హక్కు, శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని సహేతుక పరిమితులు మాత్రమే విధించాలి కానీ, నిరసనకారులపై మితిమీరిన బలప్రయోగం కూడదని కమిషన్ వ్యాఖ్యానించింది. లాఠీచార్జి అనంతరం వారికి అందించిన వైద్య సహాయం తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈఘటనపై సీసీటీవీ ఫుటేజ్ రికార్డు అందజేయాలని కూడా ఆదేశించింది. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాల ప్రకారం భారత్ పాటించాల్సిన బాధ్యతలకు విరుద్ధం" అని ఆర్డర్లో పేర్కొంది. జులై 20వ తేదీన జరిగిన ఘటనపై రెండు వారాల్లో సవివర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులిచ్చింది.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్కు హ్యాట్సాఫ్నిరసనకారులకు అయిన గాయాల వివరాలతోపాటు, గాయపడిన విద్యార్థులకు వైద్య సహాయం అందిందో లేదో తెలిపే సమాచారం. నిరసన సమయంలో గుంపును అదుపు చేయడానికి అనుసరించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలు, ఇంకా ఉపయోగించిన బలప్రయోగం సమర్థనీయమైనదా మరియు పరిమితులకు లోబడి ఉందా అనినిర్ధారించడానికి ఏమైనా విచారణ ప్రారంభించారా అనే వివరాలు కూడా సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.కాగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలపై అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీఇచ్చిన పిలుపుతో జూన్ నెలలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జూలై 20న పార్లమెంట్కు "సంసద్ చలో" పిలుపు తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీనికి ఎలాంటి అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ , ఇతర బలప్రయోగ చర్యలకు దిగారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గామారడంతో కమిషన్ స్పందించింది. ఇదీ చదవండి: రైల్వే ప్లాట్ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!
ఎన్ఆర్ఐ
వీడియో కాల్స్లో కాదు : ఆరేళ్ల కెనడా జీవితాన్ని వీడి ఇండియాకు
ఉన్నత చదువులకోసం విదేశాలకు ఎగిరిపోవడం, వేల డాలర్లు సంపాదిస్తూ అక్కడే సెటిల్ అయిపోవడం సర్వసాధారణం. అలాగే వృద్ధులైన తల్లి దండ్రులను సైతం పట్టించుకోకుండా, వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం లాంటి హృదయవిదారకమైన కథనాలను చాలా చదివాం. కానీ విదేశాల్లోని సౌకర్యవంతమైన జీవితం కంటే, తల్లిదండ్రులకు భౌతికంగా దగ్గరగా ఉండటమే ముఖ్యం అని భావించి, కెనడా నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చిన కొడుకు గురించి విన్నారా?పదండి వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో. కెనడాలో ఉన్నత ఉద్యోగాన్ని వీడి, వయోవృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్కు తిరిగి వచ్చేశారు టెకీ రమేష్ ఎన్.ఎన్. ఈయన ప్రస్తుతం బెంగళూరులోని 'కోర్సెంట్రిక్' (Corcentric) ఐటీ సంస్థలో ఇంజనీరింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వేల కిలోమీటర్లు దూరంలో ఉంటూ వీడియో కాల్స్ ద్వారా చూస్తూ కాలం గడపడం కంటే, కుటుంబంతో రోజూ గడిపే క్షణాలు ఎంతో విలువైనవని, కుటుంబంతో గడిపే సమయాన్ని ఎప్పటికీ వాయిదా వేయలేమని ఆయన తన లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్లో పంచుకున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. విదేశాలలోని సౌకర్యాలు, ఊహించదగిన జీవితం వదులుకోవడం, ఇక్కడి మౌలిక వసతులకు మళ్లీ అలవాటు పడటం కొంత కష్టంగా అనిపించినా, కుటుంబం ఇచ్చే తృప్తి ముందు అవేవీ పెద్ద కష్టంగా అనిపించలేదని రమేష్ చెప్పుకొచ్చారు. అలాగే భారత్కు రావడం కెరీర్కు ఎటువంటి ఆటంకం కలిగించలేదని, పైగా బెంగళూరులోని టెక్నాలజీ, స్టార్టప్ వాతావరణం, ప్రతిభా వంతులైన నెట్వర్క్ తనకు మరింత ఉత్తేజాన్నిచ్చాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలిఈ పోస్ట్పై సోషల్ మీడియాలో నెటిజన్లు విశేషంగా స్పందించారు. విదేశాల్లో జీవితం, సంపాదన కాదు, మనం కుటుంబంతో పెంచుకునే అనుబంధాలే నిజమైన విజయానికి నిర్వచనమని నెటిజన్లు వ్యాఖ్యానించారు. మొదటి ఏడాది సర్దుబాటు కావడం కష్టంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఇక్కడి జీవితంతో చాలా ప్రశాంతత లభించిందని 2015లో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన మరొక టెకీ స్పందించడం విశేషం.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్10 వేల మెట్లు, నలుగురు మనుషులు : భారీ కాయుడి డోలీ వీడియో వైరల్
నన్ను టార్చర్ చేస్తున్నారు.. స్వదేశానికి తీసుకెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ పహాడీషరీఫ్ నుంచి బతుకుతెరువు కోసం ఒమన్ వెళ్లిన మహిళ షబ్నం బేగంకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏజెంట్ చెప్పినట్లు అక్కడ జరగకపోవడంతో పాటు పగలూ రాత్రీ తేడా లేకుండా పని, హింస ఎదుర్కొంది. దీంతో యజమాని నుంచి తప్పించుకుని అక్కడి భారత ఎంబసీకి చేరిన షబ్నంబేగం తనను రక్షించాలంటూ నగరానికి చెందిన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్కు సెల్ఫీ వీడియో పంపింది. దీన్ని ఆయన తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఒమన్లోని భారత ఎంబసీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షబ్నం సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. ‘నా పేరు షబ్నంబేగం. మార్చి 26న ఏజెంట్ ద్వారా ఒమన్ వచ్చా. ఉద్యోగం పేరుతో ఇక్కడకు పంపాడు. ఇక్కడ పగలు–రాత్రి పని చేయిస్తున్నారు. మూడు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కనీసం మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో ఉండనీయట్లేదు. నాకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా చిన్న పిల్లలు. ఇక్కడ నా యజమానులు చాలా టార్చర్ చేస్తున్నారు. సరిగా తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారు. తరచూ కొడుతుండటంతో తట్టుకోలేక పారిపోయి ఒమన్లోని ఇండియన్ ఎంబసీకి వచ్చి ఎనిమిది రోజులుగా తలదాచుకున్నా. ఇక్కడ ఇలా 130 మంది మహిళలం ఉన్నాం. ఏజెంట్ నా పాస్పోర్టు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లండి’ అంటూ వేడుకున్నారు. షబ్నం బేగంను వెంటనే హైదరాబాద్కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ కోరారు. మాయ మాటలతో మోసం చేసిన ఏజెంట్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తాత వారసత్వం.. అమెరికాలో మెరిసిన మనవడు కార్తీక్!
తల్లిదండ్రులు పుట్టింది భారత దేశంలో.. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కాకినాడకు చెందిన తాతయ్య పద్మనాభానికి క్రీడలంటే ఎంతో మక్కువ. జిల్లాలో సీనియర్ క్రీడాకారుడిగా, ఒలింపిక్ సంఘ కార్యదర్శిగా క్రీడారంగానికి ఎనలేని సేవలు అందించారు. తాతయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మనుమడు కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం అమెరికా దేశంలోని శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో క్రీడలపరంగా గుర్తింపు తెచ్చుకుని తండ్రి పురిటి గడ్డ కీర్తిని ప్రవాసాంధ్రుడిగా రెపరెపలాడిస్తున్నారు. అమెరికా నుంచి కాకినాడకు ఇటీవల వచ్చిన కార్తీక్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.. కాకినాడకు చెందిన కె.పద్మనాభం, యమునలకు జన్మించిన సంతానం రామకృష్ణ. సాఫ్ట్వేర్ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు పద్మజతో వివాహం జరిగింది. రామకృష్ణ, పద్మజలకు 2005లో కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం జన్మించాడు. చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ పెంచుకోవడంతో అమెరికాలో తల్లిదండ్రులు స్విమ్మింగ్, బాస్కెట్బాల్లో శిక్షణ ఇప్పించారు. అనతి కాలంలోనే స్విమ్మింగ్, బాస్కెట్బాల్లో ప్రావీణ్యం సంపాదించి శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రానికి కార్తీక్ ప్రాతినిధ్యం వహించి పోటీల్లో పతకాలు కైవసం చేసుకున్నాడు. పదేళ్ల వయసులో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన మినీ ఒలింపియాడ్ ర్యాలీలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నాడు. అమెరికాలో స్విమ్మింగ్లో శిక్షణ పొందుతున్న కృష్ణస్వామి కార్తీక్ బాస్కెట్బాల్, స్విమ్మింగ్తో పాటు టెన్నిస్లో కూడా క్రీడా ఓనమాలు కాకినాడలోనే కార్తీక్ నేర్చుకున్నాడు. అమెరికాలో 9 నుంచి 12వ తరగతి వరకు మేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెయింట్ లూయిస్ కంట్రీ డే స్కూల్లో చదవి అక్కడే బాస్కెట్బాల్ మెరుగైన శిక్షణను కోచ్ ట్రవీస్ వ్యాలీస్ వద్ద తీసుకున్నాడు. తొలిసారి కార్తీక్ సారథ్యంలో ఇంటర్ స్కూల్ స్టేట్ పోటీల్లో చాంపియన్ షిప్ను సాధించారు. తాతయ్య జాతీయస్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారుడు కావడం, మనవడు క్రీడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రీడల్లో రాణిస్తుండడంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎంఎస్సీ కర్రి పద్మశ్రీ, రెడ్క్రాస్ చైర్మన్, మాజీ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు వైడీ రామారావులు ఇటీవల కార్తీక్ను అభినందించారు. నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ)
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడి
అమెరికాలోని ఓ షాపింగ్ మాల్లో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడితో చేశారు. హైదరాబాద్ టౌలిచౌకికి చెందిన సయ్యద్ సోహైల్పై ఓ దుండగుడు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దాడి ఘటన జులై 13న జరగ్గా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ సోహైల్.. వెస్ట్ వ్యాలీ సిటీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 37 ఏళ్ల సయ్యద్ సోహైల్.. గత రెండున్నరేళ్లుగా ఆ షాపింగ్ మాల్లో చిన్న వ్యాపార దుకాణం నిర్వహిస్తున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోకముందే, మాల్లోని కొందరు వ్యక్తులు దాడి చేసిన వ్యక్తిని నిలువరించి.. అతని చేతిలోని కత్తిని లాక్కున్నారు. నిందితుడిని పీటర్ మైఖేల్ లార్సెన్గా గుర్తించారు.ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు విన్నవిస్తూ.. ఈ సమస్యను అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. తాము అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ దాడి గురించి తెలిసి.. సోహైల్ భార్య అమ్రీన్ ఫిర్దౌస్ స్పృహతప్పి పడిపోయారు. ఈ దంపతులకు ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.Indian stabbed in US over his religionA 37-year-old Indian national Syed Sohailuddin was st*bbed more than 15 times at a kiosk inside Valley Fair Mall in West Valley City, Utah. Suspect Peter Michael Larsen, 48, allegedly told police he targeted the Muslim victim and intended… pic.twitter.com/6rso7E03XX— Piyush Rai (@Benarasiyaa) July 16, 2026
క్రైమ్
గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్కు హ్యాట్సాఫ్
పారిస్లోని పోర్ట్ డి క్లిచీ సమీపంలో ఒక దుండగుడు వీరంగం సృష్టించాడు. రెండు పొడవైన కత్తులతో ముగ్గురు మహిళలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే డ్యూటీ పోలీస్ అధికారి చాకచక్యంగా అతడిని బంధించి, అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. ఈ ఘటన 'పోర్ట్ డి క్లిచీ' ప్రాంతం సమీపంలో జరిగింది. ఫ్రాన్స్ రక్షణ మంత్రి లారెంట్ నునెజ్ తెలిపిన వివరాల ప్రకారం,నిందితుడు రెండు వంటగది కత్తులతో 19, 24, 36 ఏళ్ల వయస్సున్న మహిళలపై దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఒకరు గర్భిణి. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. డ్యూటీలో ఉన్న పోలీసు బాటసారులతో కలిసి అడ్డుకుని నిందితుడిని ఆ టకట్టించడం ప్రశంసలందుకుంటోంది. గుర్తుతెలియని ఆ నిందితుడు, తానీ నేరం చేయడానికి "అల్లాహ్" ఆజ్ఞాపించాడని పేర్కొన్నాడు. పారిస్ వీధిలో ఆ వ్యక్తి కత్తితో దాడికి దిగిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి స్నాప్చాట్లో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో నిజమైనదేనని రాయిటర్స్ వార్తా సంస్థ ధృవీకరించింది.Pregnant woman among two people rushed to hospital after mass stabbing in Paris.Suspect shouted: "It's Allah who made me do it"! pic.twitter.com/APe5MSPBzD— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) July 27, 2026 > ఆ వీడియోలో పొడవాటి నల్లని జుట్టు, క్రీమ్ రంగు ట్రాక్సూట్ ధరించిన ఒక వ్యక్తి రెండు చేతుల్లో పెద్ద కత్తులు పట్టుకుని, ఒక యువతిపై దాడి చేసి పొడవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే అదే వ్యక్తి నేలపై పడిపోగా, బాటసారులు అతడిని కదలకుండా పట్టుకున్నారు. నేలపై పడి ఉన్న ఆ వ్యక్తి "నన్ను ఇలా చేయమని అల్లాహ్ ఆజ్ఞాపించాడు" అని అనడం వీడియోలో వినిపిస్తోంది. ఇదీ చదవండి: రైల్వే ప్లాట్ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!ఎలా పట్టుకున్నారంటే..నిందితుడు ఒక మహిళ వెనుక భాగంలో పొడవడం చూసి, 'రండి, అతడిని ఆపుదాం!' అని గట్టిగా అరిచాడు పోలీసు అధికారి. వెంటనే పలువురు ముందుకు వచ్చారు. ఇంతలో మరో వ్యక్తి అతనిపైకి సూట్కేస్ను విసిరాడు. దాంతో అతని చేతిలో కింత పడిపోయాయి.. ఆ సమయంలో పోలీసు అతడిని స్వాధీనంలోకి తీసుకున్నారు. సమయస్ఫూర్తితో నిందితుడిని బంధించిన ఆఫ్ డ్యూటీ పోలీస్ అధికారిని మంత్రి నునెజ్ ప్రశంసించారు.ఈ దాడికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని నునెజ్ తెలిపారు. నిందితుడి వివరాలను నిర్ధారించలేదు. ఈ ఘటనపై తీవ్రవాద నిరోధక విచారణ చేపట్టాలా వద్దా అనే కోణంలో ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూటర్ కార్యాలయం పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది
రెండు సార్లు గర్భవతి.. పెళ్లి పేరుతో సర్పంచ్ మోసం
బోధన్టౌన్(బోధన్): ప్రేమ పేరు చెప్పి సహజీవనం చేసి, మోసం చేశాడని, నాకు న్యాయం చేయండని బాధిత మహిళ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బోధన్లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి «ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. పోతంగల్ మండలంలోని జల్లాపల్లి గ్రామ సర్పంచ్ దస్తగిరి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లు సహజీవనం చేశాడన్నారు. వివాహం చేసుకుంటానని పలుమార్లు వాయిదా వేయడంతోపాటు, తను వేరే వారిని పెళ్లి చేసుకుంటే విడాకులు ఇప్పించాడన్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకుందామని నమ్మించి బోధన్లో అద్దె ఇంట్లో ఉంచి నాలుగేళ్లు సహజీవనం చేశాడన్నారు. తనకు రెండు సార్లు అబార్షన్ చేయించాడని పేర్కొంది. సర్పంచ్తోపాటు అబార్షన్ చేసిన ఆర్ఎంపీ ఇలియాస్పై పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. విషయం తెలిసిన సర్పంచ్, ఆర్ఎంపీ డాక్టర్ ఇద్దరు పారిపోయారని, సర్పంచ్ కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
షేవింగ్ బ్లేడ్తో భర్తను చంపిన భార్య రేవతి..!
తిరుపతి: ప్రియుడు ప్రేరేపించడంతోనే భార్య తన భర్త గొంతు కోసినట్లు అంగీకరించిందని ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం స్థానిక పోలీసు స్టేషన్లో ముద్దాయిలను అరెస్టు చేసి, విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని నీర్పాకోటలోని పల్లం దళితవాడకు చెందిన భీమయ్య (42), రేవతి (29)కి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. భీమయ్య బెల్దూరి మేస్త్రీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. భార్య రేవతి గతంలో శ్రీసిటీలోని అపాచీ కంపెనీలో పనిచేసేది. ఆ సమయంలో తొట్టంబేడు మండలం, పొయ్యి గ్రామానికి చెందిన నాగరాజుతో ఆమెకు పరిచయమై, వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి భీమయ్య భార్యపై అనుమానం పెంచుకుని కంపెనీకి వెళ్లకుండా పని మాని్పంచాడు. ఆరు నెలలుగా రేవతి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 24వ తేదీ భీమయ్య మద్యం మత్తులో భార్యతో గొడవపడగా బంధువులు సర్దిచెప్పారు. ఆ సమయంలో ప్రియుడు నాగరాజుకు రేవతి ఫోన్ చేసి తన భర్తను చంపాలని నిర్ణయింది. అతని సలహా మేరకు రాత్రికి భీమయ్య గొంతు బ్లేడుతో కోసేయాలని రేవతిని ప్రేరేంపించాడు. భీమయ్య నిద్రపోతుండగా అర్ధరాత్రి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో భార్య రేవతి షేవింగ్ బ్లేడ్తో భర్త భీమయ్య గొంతు కోసింది. ఆ తర్వాత బంధువులకు ఫోన్ చేసి ఎవరో తన భర్త గొంతు కోశారని నమ్మబలికింది. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం తేలింది. భర్తను తానే బ్లేడుతో కోశానని అంగీకరించింది. ప్రస్తుతం భీమయ్య రేణిగుంట సమీపంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ మేరకు 307 సేక్షన్ కింద రేవతి, ఆమె ప్రియుడు నాగరాజుపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు.
అమ్మా నాన్నా.. సారీ!
సూసైడ్ నోట్లో సారాంశం అమ్మా నన్ను క్షమించు.. నా కోసం చాలా కష్టపడ్డావ్.. డాడీ నీ డ్రీమ్ నిలబెట్టలేకపోతున్నా.. నా డ్రీమ్ కూడా పూర్తిచేయలేకపోతున్నా.. అమ్మా నాన్నా నాకు బతకాలని ఉంది. కానీ, బతకడానికి చాలా సిగ్గుగా ఉంది. అమ్మా నీ కోసం నేనేం చెయ్యలేదు. నాన్న నేను నీకు ఏదైనా సాధించి చూపించాలని ఉంది. కానీ నేను ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నా.. ఈ బాధ ఒక్కదానిని మోయడం నా వల్ల కావట్లేదు. నేను చనిపోయాక నాపై ఎవరూ కోప్పడకండి. డాడీ నన్ను మీరు ఎప్పుడూ లవ్ చేస్తూ ఉండండి. అమ్మా బై.. అమ్మమ్మ జాగ్రత్త. అన్నయ్య డాడీ మాట విని జాగ్రత్తగా ఉండు. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ ఎప్పటికైనా కలవండి, ద్వేషించుకోకండి.. ఇక ఉంటా.. రంపచోడవరం: ఆ చిన్నారి తల్లడిల్లిపోయింది.. గుండె నిండా బాధతో, బరువెక్కిన హృదయంతో బలవన్మరణానికి పాల్పడింది.. గిరిసీమలో ఓ విద్యాకుసుమం నేలకొరిగింది.. ఇటీవల మెగా పేరెంట్స్, టీచర్స్ సభలో తన ప్రసంగంతో మెప్పించి, సీఎం చంద్రబాబు సైతం అబ్బురపడి తన పక్కన కూర్చోబెట్టుకుని మరీ సెల్ఫీ తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో షైనింగ్ స్టార్గా మెరిసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పతకం, ప్రశంసా పత్రాన్ని అందుకున్న శివాని అనుకోని విధంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఏజెన్సీలో విషాదం అలముకొంది. ఇర్లపల్లిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ముర్రం శివాని రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లి సౌభాగ్యవతి, తండ్రి వరప్రసాద్లు నాలుగేళ్ల క్రితమే విడిపోయారు. దీంతో శివాని అప్పుడప్పుడూ గోకవరం మండలం బావాజీపేటలో తండ్రి వద్దకు వెళ్లి వస్తూండేది. ఆదివారం పుట్టిన రోజు కావడంతో తండ్రి వద్దకు వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు ఇర్లపల్లిలో ఇంటికి వచ్చింది. తల్లి సౌభాగ్యవతి వెదురుపాకలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. ఒక్కోసారి ఆమె అక్కడే ఉంటుంటారు. తల్లి లేని సమయంలో శివాని, అమ్మమ్మ బాలమ్మలు ఇద్దరే ఇంటి వద్ద ఉంటారు. బావాజీపేటలో తండ్రి వద్దకు వెళ్లి తిరిగి ఆరు గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి రాసుకుంటానని అమ్మమ్మకు చెప్పింది. సోమవారం ఉదయం అమ్మమ్మ ఆ గది తలుపు తీసి చూసేసరికి ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ ఉండడంతో కేకలు వేయడంతో, చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కిందకు దింపారు. అప్పటికే శివాని మృతిచెంది ఉండడంతో ఆదివారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. డాడీ ఇంటికెళ్లిపోయా.. అదే చివరి మాట తన కుమార్తె శివాని మృతి తండ్రి వరప్రసాద్ను కలిచివేసింది. ఆదివారం సెలవు డాడీ వస్తానని చెప్పిందని, రా తల్లీ అన్నానని ఆయన వివరించారు. నేను గోకవరం సమీపంలోని అష్టలక్ష్మి గుడి సమీపంలోని బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాను.. సాయంత్రం వరకూ తన దగ్గరే ఉంది. నా చిట్టి తల్లి ముఖంలో ఎటువంటి బాధ కనిపించలేదు. పచ్చకామెర్లు వచ్చి తగ్గడంతో ఉత్తి బిర్యానీ తినమని చెప్పాను.. అదే తింది. సీఎంతో ఫొటో తీయించుకున్నావు, బాగా మాట్లాడవు అన్నాను. డాడీ నీ పరువు నిలబెడతానని చెప్పింది. చీకటి పడుతుంది ఉండిపో తల్లీ అన్నాను. వెళ్లిపోతానని చెప్పింది. మా చిన్నోడు బన్నీతో కలసి గోకవరం బస్ కాంప్లెక్స్లో దింపాను. గోకవరంలో చాక్లెట్ కావాలంది. కొనుక్కోమని డబ్బులు ఇచ్చాను. మధ్యలో ఫోన్ చేశాను దారిలో ఉన్నాను డాడీ అని చెప్పింది. తరువాత ఇంటికి వచ్చానని చెప్పింది. అవే చివరి మాటలని తండ్రి వరప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏ బాధ ఉండో చెప్పలేదు, ఏ కష్టం ఉందో చెప్పలేదు.. ఎందుకు చనిపోయిందో తెలియడం లేదు. బాధతో చనిపోయింది.. ఇప్పుడు నా ప్రాణమే పోయిందని వరప్రసాద్ రోదించారు. లోపం ఎక్కడుంది? పసిపిల్లల్లో.. బలవన్మరణానికి చాలా ధైర్యం కావాలి. ఏం సాధించలేక పోతున్నాననే ఆలోచన ఆ పసి మనసులో, ఆ వయసులోనే రావడం అంటే... అది మన వ్యవస్థలోనే లోపం ఉన్నట్టు కాదా..! మన విద్యా వ్యవస్థ, ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకొనే వారికి... ఎలాగైనా బతికగలం అన్న నమ్మకాన్ని ఎందుకు ఇవ్వలేక పోతోంది... చదువు అంటే... ర్యాంకులు, గ్రేడ్లు, మార్కులు మాత్రమే కాదు.. అనే అంశాన్ని ఆ పసి మనసులకు అర్థమయ్యేలా ఎందుకు వివరించలేకపోతోంది..? లోపం ఎవరిది...? ఎక్కడుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తాం: కలెక్టర్ రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని బలవన్మరణం అత్యంత బాధాకరమని కలెక్టర్ కె. దినేష్ కుమార్ అన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో శివాని మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.స్వాతి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అశ్రఫ్ అలీతో కలసి శివాని మృతికి సంబంధించిన పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలపై సమీక్ష నిర్వహించారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మంచి భవిష్యత్తు ఉన్న విద్యారి్థని ఇలా మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. బాలిక మృతిపై కేసు నమోదు శివాని ఆత్మహత్యపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రమేష్ తెలిపారు. సంఘటన స్థలంలో సూసైట్ నోట్, సెల్ఫోన్ స్వాదీనం చేసుకున్నామని అన్నారు. తల్లి బంధువుల ఫంక్షన్కు వెళ్లడంతో అమ్మమ్మ, బాలిక మాత్రమే ఇంటి వద్ద ఉన్నారన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు తెలియాల్సి ఉందని వివరించారు. కుటుంబ కలహాలు ఏమీ లేవని అన్నారు.విద్యార్థిని మృతి బాధాకరం ఇర్లపల్లి గ్రామానికి చెందిన ముర్రం శివాని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఇర్లపల్లి ఆర్అండ్ఆర్ కాలనీకి వెళ్లి శివాని మృతదేహానికి పూలమాలు వేసి నివాళులరి్పంచి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పండా వెంకటలక్షి్మ, ఎంపీపీ బంధం శ్రీదేవి, మండల పార్టీ అధ్యక్షుడు జల్లేపల్లి రామన్నదొర, పండా రామకృష్ణదొర, మాజీ సర్పంచ్లు మంగా బొజ్జయ్య, రమేష్ దొర, బొజ్జయ్య, ఆనందరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు బొబ్బా శేఖర్, డొక్కులూరి రత్నరాజు తదితరలు ఉన్నారు.
వీడియోలు
త్రివిక్రమ్ AK 47 లోడింగ్ సినిమాలో ట్విస్ట్ రివీల్.!
బంగారం ధర ఒక్కసారిగా భారీగా పడిపోయింది..!
శోభిత బేబీ బంప్ వైరల్..!
గిరిబాబును MP చేయాలని అనుకున్నాం.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు!
DSC స్కాంపై సీబీఐ విచారణ..? లోకేష్ రాజీనామా..? ఏపీలో వేడెక్కిన రాజకీయం!
రాజీనామా చేసే వరకు.. తరిమితరిమి కొడతాం లోకేష్ కు యువజన విభాగం వార్నింగ్
రాజమండ్రిలో హైటెన్షన్.. YSRCP ర్యాలీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత
జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హై అలర్ట్..!
మోదీకి మెటా క్షమాపణలు.. మోదీ వీడియో డిలీట్.. అసలు కారణమిదే!
రోడ్డు కోసం బురదలో పొర్లు దండాలు... గిరిజన యువత వినూత్న నిరసన..!


