Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSRCP Legislative Party Meeting Updates1
అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదు: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వంపై ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందని తెలిపారు. అసలు రాష్ట్రంలోప్రభుత్వం ఉందా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు.శాసనసభలో తాము మాట్లాడేలా తగిన సమయం కేటాయించడం ఇష్టం లేకనే, వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. మొత్తం సభ్యులతో కలిపి, కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే ఇచ్చే అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ఆయన ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న ఆయన, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు అవసరమైన పూర్తి మెటేరియల్‌ సిద్ధంగా ఉందని, కానీ మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు కాబట్టే.. సభకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం:రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఏడు త్రైమాసికాలు పెండింగ్‌. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు. గత ఏడాది ఎన్నికల ముందు.. 2024 జనవరి–మార్చి మొదలు ఈ ఏడాది సెప్టెంబరు వరకు చూస్తే.. మొత్తం ఏడు క్వార్టర్లు.. అంటే దాదాపు రూ.4900 కోట్లు బకాయి. అయితే ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.900 కోట్లు మాత్రమే. అంటే ఇంకా దాదాపు లా రూ.4 వేల కోట్లు బకాయి. వసతి దీవెన గత ఏడాది రెండు దఫాలు. ఈ ఏడాది మరో దఫా పెండింగ్‌. అలా మొత్తం రూ.4200 కోట్లు బకాయి.వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు బకాయి పడ్డారు. అలా ఈ రెండు పథకాలకే రూ.6,200 కోట్లు బకాయి పడ్డారు. కాలేజీలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయి. స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నాశనం అయ్యింది. ట్యాబులిచ్చే కార్యక్రమం ఆగిపోయింది. సీబీఎస్‌ఈని రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ గాలికి ఎగిరిపోయింది. స్కూళ్లలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు పని చేయకపోవడం కూడా ఆగిపోయింది. ఇంకా పిల్లలకు ఇచ్చే చిక్కీలు కూడా ఆపేశారు. ఇక వైద్య రంగం పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా ఉంది. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఆరోగ్య శ్రీకి రూ.3500 కోట్లకు పైగా బకాయి పడ్డారు. దీంతో పథకంలో వైద్యం చేయలేమని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టేస్తున్నారు. ఇంకా ఆరోగ్య ఆసరా కింద రూ.600 కోట్ల బకాయి పడ్డారు.ఇవీ మెడికల్‌ కాలేజీల ప్రయోజనాలు:మన ప్రభుత్వంలో ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఏడు కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్‌ కాలేజీ అనేది కేవలం కాలేజీ మాత్రమే కాదు. దాంతో టీచింగ్‌ హాస్పిటల్‌ ఉంటుంది. మంచి వైద్య సేవలందుతాయి. అది ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు నడపకపోతే.. ఆయా రంగాల్లో ప్రై వేటు దోపిడిని అరికట్టగలుగుతారా? అందుకే ఎక్కడైనా, వాటిని ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వహిస్తుంది.మనం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ పనులు మొదలుపెట్టాం. దాని వల్ల అక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలందుతాయి. ఒక మెడికల్‌ కాలేజీ ఉంటే, సీనియర్‌ వైద్యులు, స్పెషలిస్టులు, నర్సులు అందరూ అందుబాటులోకి వస్తారు. వైద్య సేవలందిస్తారు. అలా ప్రజలకు మంచి వైద్యం అందడమే కాకుండా, మన పిల్లలకు.. ముఖ్యంగా నిరుపేద పిల్లలకు మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి.వ్యవసాయ రంగం పరిస్థితి దారుణం:రైతులకు యూరియా కూడా సప్లై చేయని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మొత్తం బ్లాక్‌ మార్కెట్‌ను నడిపిస్తున్నారు. ఇంకా ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఏ పంటకు ఎంత ధర ఇవ్వాలన్న దానిపై నాడు మనం ప్రతి గ్రామంలోనూ పోస్టర్‌ ఇచ్చే వాళ్లం. సీఎం యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రైతులకు తోడుగా నిలబడే వాళ్లం. మార్కెట్‌ జోక్యంతో మంచి ధరలకు పంటలు కొన్నాం. అందుకు రూ.7800 కోట్లు ఖర్చు చేశాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు. ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు. అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. వ్యవసాయం చేయడానికి రైతులు భయపడుతున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ పూర్తిగా తిరోగమనమే.ఎక్కడికక్కడ దోపిడి. నీకింత.. నాకింత:శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యవస్థల్లో ఇంత లంచాలు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి వసూళ్లు చేస్తున్నారు. పెదబాబుకు ఇంత, చిన బాబుకు ఇంత అని పంచుతున్నారు. లిక్కర్‌ను ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అక్రమంగా పర్మిట్‌ రూమ్‌లు నడుపుతున్నారు. ఉచిత ఇసుక అన్నారు. అది లేదు. ఇంకా క్వార్ట్‌›్జ, సిలికా.. దేన్నీ వదిలిపెట్టడం లేదు. చివరకు ఫ్లైయాష్‌ కూడా అమ్మేసుకుంటున్నారు.అన్నింటా విఫలమైనా నిస్సిగ్గుగా సూపర్‌హిట్‌!:అన్నింటా దారుణంగా విఫలమైనా, ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోయినా, ఇటీవల సూపర్‌సిక్స్‌.. సూపర్‌హిట్‌ పేరుతో కార్యక్రమం చేశారు. ఆ సభ సందర్భంగా ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్, ఎన్నికల నాటి యాడ్‌తో చూస్తే పూర్తిగా మారిపోయింది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు. 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్‌ రూ.4 వేలు లేవు. పథకాలు కూడా మారిపోయాయి. ఇదీ ఈ ప్రభుత్వ నిర్వాకం.ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు:అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాలన్న తపన, ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. నాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు, టీడీపీ నుంచి వారంలోనే 5గురు మనవైపు వచ్చి కూర్చున్నారు. అలా ఇంకొందరిని లాక్కుని, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేద్దామని చాలా మంది సలహా ఇస్తే, నేను వద్దన్నాను. విపక్షం గొంతు వినాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆమేరకు వారికి అవకాశాలు ఇచ్చాం. సభలో వారు చెప్పేది విన్నాం. కానీ, ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షం లేకుండా ఉండాలని కోరుతోంది. అందుకే మనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వద్దని అనుకుంటోంది. అందుకే మనల్ని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో మూడు అంశాలపై గంటన్నర మాట్లాడాను. అలా మనకు అసెంబ్లీలో కూడా అవకాశం ఇస్తేనే, ప్రజా సమస్యలు ప్రస్తావించగలం. అలా కాకుండా ఒక ఎమ్మెల్యే మాదిరిగా కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఇస్తే, ఏం మాట్లాడగలం?ఉన్నదే ఏకైక విపక్షం.. అయినా..!:నిజానికి సభలో ఉన్నవి నాలుగే నాలుగు పార్టీలు. అందులో మూడు కూటమిగా అధికారంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఒకేఒక విపక్షం. అటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూటమి. ఇక్కడ మనది ఒకేఒక విపక్షం. కానీ దాన్ని గుర్తించబోమని చెబుతోంది. ఎందుకంటే సభలో ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అందుకే సభకు వెళ్లకుండా ఇక్కడ ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం.గట్టిగా నిలబడండి. నిలదీయండి:కానీ, మనకు కౌన్సిల్‌లో మంచి బలం ఉంది. రాజకీయంగా ఎదగడానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు ఇది మంచి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. మిగిలింది మరో రెండున్నర ఏళ్లు మాత్రమే. మరో అసెంబ్లీ సెషన్‌ తర్వాత.. చూస్తుండగానే మరో ఏడాది గడుస్తుంది. కాబట్టి, మీరు కౌన్సిల్‌లో గట్టిగా నిలబడండి. గట్టిగా మాట్లాడండి. ప్రజా సమస్యలు లేవనెత్తండి. ప్రభుత్వాన్ని నిలదీయండి.వీటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీయండి:సూపర్‌ సిక్స్‌. సూపర్‌ సెవెన్‌ వైఫల్యం..రీ వెరిఫికేషన్‌ పేరిట దివ్యాంగులకు ఇబ్బందులు..పెన్షన్‌ కోతలు..ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన బకాయిలు..యూరియా సహా ఎరువుల కొరత, రైతుల అగచాట్లు..పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం..రైతుల ఆత్మహత్యలు..కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ..వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ఇంటి స్థలాలు లాక్కోవడం..ఆరోగ్య శ్రీ బంద్‌..విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ..ప్రభుత్వంలో అవినీతి దోపిడీ..ఉద్యోగస్తుల సమస్యలు, డీఏలు, పీఆర్సీలు, ఐఆర్, సరెండర్‌ లీవ్స్‌ తదితర బకాయిలు, వారిపై వేధింపులు..పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ..అమరావతిలో తొలివిడత రైతులకు ఏమీ చేయకుండానే రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌..అసైన్డ్‌ అన్న పదయం తీసేయడం. మళ్లీ బినామీల పేర్లతో కొనుగోలు..రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం..15 నెలల్లోనే రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల బాదుడు..రాష్ట్ర ఆదాయానికి దారుణంగా గండి:రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. అదంతా అధికార పార్టీ నేతల జేబుల్లోకి పోతోంది. ఇసుక అమ్మకం ద్వారా మన హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాగా, ఇప్పుడు అది రావడం లేదు. మద్యం ఆదాయం మన హయాంలో ప్రభుత్వానికి వచ్చేది. కానీ, ఇప్పుడేం జరుగుతోంది?. వీళ్లే బెల్టు షాప్‌లు పెట్టించి, ఎక్కువ రేట్లకు అమ్మి అంతా జేబుల్లోకి వేసుకుంటున్నారు. లాటరైట్, క్వార్ట్‌›్జ తవ్వుకుంటున్నారు. అమ్ముకుంటున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. హార్బర్లలో వాళ్లే పెట్రోల్, డీజిల్‌ అమ్ముతున్నారు. ప్రభుత్వానికి పైసా ఆదాయం రావడం లేదు. మండలిలో మనకు మంచి బలం ఉంది. కాబట్టి మండలి సభ్యులు పోరాట పటిమ చూపాలి. ప్రజలకోసం గట్టిగా పోరాటం చేయాలి.అధికార పక్షం.. డబుల్‌ యాక్షన్‌:అసెంబ్లీలో అధికారపక్షం డబుల్‌ యాక్షన్‌ చేయాలనుకుంటోంది. ‘నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా’ అన్నరీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఇంకా.. ‘ప్రజల్ని ఏడిపించేది ప్రభుత్వమే. వారిని ఏడిపించి, మళ్లీ వారు ఏడుస్తున్నారని, వారి తరఫను తామే ఏడుస్తామంటూ ప్రభుత్వం డబుల్‌ రోల్‌ ప్లే చేస్తానంటోంది. అలా రెండు వైపులా యాక్షన్‌ చేస్తోంది’. నిజం చెప్పాలంటే వారు ఏడ్చినట్లు నటించిన మాత్రాన ప్రజల్లో సానుభూతి రాదు. విపక్షంగా మేము ప్రజా సమస్యలు లేవనెత్తితేనే, అందులో నిజాయితీ ఉంటుంది.నాడు చంద్రబాబు డ్రామాలు:నాడు చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదు. ఆయన్ను ఎవరూ ఏమీ అనకున్నా.. బయటకు వెళ్లి ఏడ్చాడు. నేను రికార్డులన్నీ చూశాను. మన సభ్యులు ఎవరూ ఏమీ అనలేదు. అయినా అబద్ధాలు చెప్పి, సభకు రాలేదు. అదే మనం జాయింట్‌ సెషన్‌లో గవర్నర్‌ అడ్రస్‌ సమయంలో అటెండ్‌ అయ్యాం. ఏటా అలా వెళ్తున్నాం. గవర్నర్‌ ఎదుట మన సమస్య ప్రస్తావించి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాంమెడికల్‌ కాలేజీలు కాపాడుకోవాలి:మెడికల్‌ కాలేజీలు అన్నవి తరతరాల ఆస్తి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడు. పైగా అందులో ఫీజులు దారుణంగా ఏకంగా రూ.57 లక్షలకు పెంచేస్తున్నాడు. ఆ కాలేజీలు తన అత్తగారి సొత్తు అన్నట్టుగా అమ్మేస్తున్నాడు. అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలి. ప్రజలకు అత్యంత నష్టం కలిగిస్తున్న ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్నిరకాల మార్గాలను అన్వేషించాలి. చంద్రబాబు తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు పొడిస్తే సహించేది లేదు

New pre-feasibility report for Pranahita Chevella project2
ప్రాణహిత–చేవెళ్ల.. రూ.35 వేల కోట్లు!

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలు సవరిస్తూ కొత్త ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్‌ఆర్‌) సిద్ధమవుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన 1, 2, 3, 4, 5, 23, 24, 25, 26 ప్యాకేజీల పనులను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రీ ఫీజబిలిటీ నివేదికను సిద్ధం చేయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కసరత్తు ప్రారంభించిన అధికారులు..పెరిగిన ధరల ప్రకారం ఈ 9 ప్యాకేజీల పనుల అంచనాలను సవరిస్తే, ప్రాజెక్టు వ్యయం ఐదారు రెట్లు పెరిగి రూ.35 వేల కోట్లకు చేరే అవకాశం ఉందనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. మూడు కాంపొనెంట్లుగా విభజన: ఈ 9 ప్యాకేజీల పనులను మూడు విభాగాలుగా పీఎఫ్‌ఆర్‌లో ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మాణం, బరాజ్‌ నుంచి గ్రావిటీ ద్వారా 20 టీఎంసీలను ఆదిలాబాద్‌ జిల్లాకు తరలించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ నుంచి రంగారెడ్డి జిల్లాలో 2.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పనులను ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. ప్యాకేజీలు–1, 2, 3, 4, 5 పూర్తైతే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూరు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందనుంది. ప్యాకేజీలు–23, 24, 25, 26 పూర్తైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకర్గాల్లోని మొత్తం 2.47లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రంగారెడ్డి జిల్లాలోని హాల్దీ, మూసీ నదులకు, చేవెళ్ల చెరువుకు తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు సరఫరా కానున్నాయి. త్వరలో మహారాష్ట్రకు రాష్ట్ర బృందం మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపి 150 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మాణానికి అంగీకారం తీసుకోవాలని కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి వద్ద నుంచి 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా మొత్తం 80 టీఎంసీల నీళ్ల తరలింపును పీఎఫ్‌ఆర్‌లో ప్రతిపాదిస్తున్నారు. గోదావరి జలాల్లో రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల కేటాయింపులకు లోబడే ఈ ప్రతిపాదనలు చేస్తున్నారు. త్వరలో నీటిపారుదల శాఖ అధికారుల బృందం తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరపనుంది. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందని గతంలో సీడబ్ల్యూసీ తేల్చింది. రీ ఇంజనీరింగ్‌లో ఈ ప్యాకేజీలు తొలగింపు ఉమ్మడి ఏపీలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ ప్రకారం.. గోదావరిపై ఆదిలాబాద్‌ జిల్లా కౌతాల మడంలం తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మించి 165 టీఎంసీల నీళ్లను తరలించడం ద్వారా మొత్తం 16.4 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ను చేపట్టింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు మార్పులు చేర్పులతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. తొలి ప్రాజెక్టులో ప్యాకేజీలు–1, 2, 3,4, 5, 23, 24, 25, 26 కింద ప్రతిపాదించిన పనులను తొలగించి మిగతా పనులను కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టింది. ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్‌ నిర్మించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతిపాదించిన 2 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదించిన 2.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా కలగానే మిగిలిపోయింది. ప్యాకేజీ–3 కింద తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్, ప్యాకేజీ–1, 2, 4 కింద తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 71.5 కి.మీల ప్రధాన కాల్వ, ప్యాకేజీ–5 కింద మైలారం వద్ద పంప్‌హౌస్‌తో పాటు అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నీళ్లను తీసుకెళ్లే కాల్వను నిర్మించాల్సి ఉంది. ఈ ఐదు ప్యాకేజీల పనులకు తొలుత రూ.3,084.13 కోట్లతో అంచనాలు రూపొందించగా, తర్వాత రూ.4,204 కోట్లకు సవరించారు. కాగా రీ ఇంజనీరింగ్‌కు ముందే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం రూ.11,150 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 71.5 కి.మీల కాల్వ నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి.

US May Remove 25percent Penal Tariff On India3
భారత్‌కు గుడ్‌న్యూస్‌.. టారిఫ్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ యూటర్న్‌?!

న్యూఢిల్లీ: భారత్‌పై 50శాతం టారిఫ్‌ విధింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 30 తర్వాత భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై అందుబాటులోకి రానున్న 50శాతం టారిఫ్‌లో 25 శాతం పెనాల్టీ టారిఫ్‌ను రద్దు చేయనున్నట్లు సమాచారంరష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని.. ఫలితంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోందంటూ భారత్‌పై ట్రంప్‌ టారిఫ్‌తో పాటు పెనాల్టీ టారిఫ్‌ 25శాతం విధించారు. ఆ పెనాల్టీ టారిఫ్‌ విషయంలో భారత్‌-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చలు సఫలమై.. పెనాల్టీ టారిఫ్‌ను తొలగించే అవకాశం ఉందంటూ కేంద్ర చీఫ్‌ ఎకనమిక్స్‌ అడ్వైజర్‌ (సీఈఏ)వీ అనంత నాగేశ్వరన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.గురువారం కోల్‌కతా మర్చంట్స్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎంసీసీఐ)సమావేశంలో వీ. అనంత నాగేశ్వరన్‌ మాట్లాడారు. మనదేశం నుంచి ఎగుమతయ్యే పలు ఉత్పత్తులపై 25శాతం ప్రతీకార సుంకం చెల్లించడంతో పాటు పెనాల్టీ కింద మరో 25శాతం.. మొత్తంగా 50శాతం టారిఫ్‌ చెల్లించేందుకు సిద్ధపడ్డాం. కానీ ఇకపై మనకు ఆ అవసరం ఉండదని నేను భావిస్తున్నాను.25 శాతం పెనాల్టీ సుంకానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు కారణం. కానీ గత రెండు వారాలలో జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ 30 తర్వాత 25శాతం జరిమానా సుంకం ఉండదని నేను నమ్ముతున్నాను. రాబోయే రెండు నెలల్లో ప్రతీకార సుంకంతో పాటు జరిమానా పరస్పర సుంకాలపై పరిష్కారం లభిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో భారత్‌పై టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌ యూటర్న్‌ తీసుకునే అవకాశం ఉందంటూ ఆర్ధిక నిపుణుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1977లో రూపొందించిన ఇంటర్నేషనల్‌ ఎమర్జెన్సీ ఎకనామిక్స్‌ పవర్‌ యాక్ట్‌ (ఐఈఈపీఏ) చట్టాన్ని ప్రస్తావిస్తూ, విదేశీ అత్యవసర పరిస్థితుల సమయంలో ఆర్థిక నియంత్రణలు, శిక్షలు విధించేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించారు. ఈ చట్టం ఆధారంగా మనదేశంపై మొదట 25శాతం టారిఫ్‌లు విధించగా, ఇప్పుడు వాటిని 50శాతానికి పెంచారు.

Rasi Phalalu: Daily Horoscope On 19-09-2025 In Telugu4
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.త్రయోదశి రా.11.43 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: ఆశ్లేష ఉ.8.52 వరకు, తదుపరి మఖ,వర్జ్యం: రా.9.01 నుండి 10.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.19 నుండి 1.07 వరకు,అమృత ఘడియలు: ఉ.7.14 నుండి 8.50 వరకు.సూర్యోదయం : 5.52సూర్యాస్తమయం : 5.58రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... రుణదాతల నుంచి ఒత్తిడులు. పనుల్లో జాప్యం. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు.వృషభం... కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు.మిథునం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.కర్కాటకం... బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.సింహం.... సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.కన్య... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. ఆస్తి విభేదాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయితుల.... పనులు చకచకా పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో సత్సంబంధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.వృశ్చికం..... ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు. బాకీలు వసూలవుతాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.ధనుస్సు... పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.మకరం.... ఆస్తి వివాదాలు. పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.కుంభం.. మిత్రులతో విభేదాలు పరిష్కారం. శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వస్తులాభాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.మీనం.... దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

Asia Cup 2025: Sri Lanka Won Afghanistan by Six Wickets5
Asia Cup 2025: అఫ్గానిస్తాన్‌పై గెలుపుతో ‘సూపర్‌–4’కు శ్రీలంక

అబుదాబి: ఆసియా కప్‌ టి20 టోర్నీలో గ్రూప్‌ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌ ‘సూపర్‌–4’ దశకు అర్హత సాధించాయి. గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ గ్రూప్‌లో మూడు విజయాలతో లంక, రెండు విజయాలతో బంగ్లాదేశ్‌ ముందంజ వేయగా... అఫ్గానిస్తాన్‌ టోర్నీ నుంచి నిష్రమించింది. ‘సూపర్‌–4’ దశకు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో... టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మొహమ్మద్‌ నబీ (22 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. వెలలాగే వేసిన చివరి ఓవర్లో నబీ ఏకంగా 5 సిక్స్‌లు కొట్టడం బాదడం విశేషం. ఈ ఓవర్లో అతను వరుసగా 6, 6, 6, (నోబాల్‌), 6, 6 బాదాడు. ఇతర బ్యాటర్లలో రషీద్‌ ఖాన్‌ (24), ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (24) కొన్ని పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో నువాన్‌ తుషార 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం లంక 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ (52 బంతుల్లో 74 నాటౌట్‌; 10 ఫోర్లు) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించగా... కుశాల్‌ పెరీరా (28), కమిందు మెండిస్‌ (26 నాటౌట్‌) రాణించాడు. శనివారం జరిగే తొలి సూపర్‌–4 మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలపడతాయి.

Mixed weather in Hyderabad Rain and Heat6
ఉక్కపోత.. కుండపోత

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఒకేరోజు మిశ్రమ వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు భానుడు ప్రతాపం చూపగా.... ఆ తర్వాత ఒకేసారి ఆకాశం మేఘావృతమై వరుణ దేవుడు విశ్వరూపం ప్రదర్శించాడు. భారీ వర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలమైంది. గురువారం గంటన్నర పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర జీవనం కకావికలమైంది. ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం పడింది. అత్యధికంగా పాతబస్తీ బహదూర్‌పురాలోని జూపార్క్‌ వద్ద 8.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బస్తీల్లోని నివాసాల్లో వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం వేళ విద్యాసంస్థలు వదలడంతో విద్యార్ధులు, డ్యూటీలు ముగించుకొని ఇంటి దారి పట్టిన ఉద్యోగులు ట్రాఫిక్‌లో గంటల కొద్దీ నరక యాతన పడ్డారు. వరద ఉధృతికి రోడ్లపై అడుగు పెడితే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పక్కన నిలిపిన ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకొని పోయాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు, హైడ్రా బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నాలుగు దిక్కులా చక్ర బంధం భారీ వర్షానికి హైదరాబాద్‌ నలుదిక్కులా చక్రబంధంగా ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. నాంపల్లి నుంచి మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్‌ నుంచి ఖైరతాబాద్, సోమాజిగూడ నుంచి మియాపూర్, సచివాలయం నుంచి ట్యాంక్‌బండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్, మెహిదీపట్నం నుంచి రాయదుర్గం, చాంద్రాయణ గుట్ట నుంచి మలక్‌పేట, ఎల్‌బీనగర్‌ నుంచి ఉప్పల్‌ తదితర మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గంటల కొద్దీ వాహనదారులు నరకయాతన పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం మూడు రోజుల్లో పడాల్సిన వర్షం 30 నిమిషాల్లోనే కుంభవృష్టిగా కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Sakshi Guest Column On PM Narendra Modi for Technology7
సాంకేతిక సమానత్వ యోధుడు

ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం పొందడమనే ఓ సుదీర్ఘ ప్రక్రియ మీకు గుర్తుందా? పదేపదే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, కొండవీటి చాంతాడులా బారులు తీరిన జనాలు, అడపాదడపా రుసుముల చెల్లింపులు... ఇప్పుడివన్నీ మాయమై, మీ అరచేతిలోని ఫోన్లో సాక్షాత్తూ ప్రపంచమే ఇమిడిపోయింది. ఇది ఎంతమాత్రం ఆకస్మిక పరిణామం కాదు.ప్రధానమంత్రి మోదీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశపు సమానత్వ ఆయుధంగా మలిచారు. కార్పొరేట్‌ ప్రపంచంలోని ఓ ఉన్నతాధికారి తరహాలో ముంబయిలోని ఒక వీధి వ్యాపారి కూడా నేడు అదే యూపీఐ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించగలడు. ఈ పరిణామం మోదీ అనుసరించే అంత్యోదయ సూత్రం కీలక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టే, వరుసలో చివరి వ్యక్తికీ సాంకేతికత చేరువైంది.బీజం పడింది అక్కడే!మోదీ ముఖ్యమంత్రి హోదాలో తొలుత సాంకేతికత, ఆవిష్క రణల వినియోగం ద్వారా గుజరాత్‌ రూపాంతరీకరణకు కృషి చేశారు. ‘జ్యోతిగ్రామ్‌’ పేరిట ఆయన 2003లో ప్రారంభించిన పథకం ‘ఫీడర్‌ సెపరేషన్‌ టెక్నాలజీ’ని విజయవంతంగా ఉపయో గించింది. తద్వారా నిర్దిష్ట సమయం ప్రకారం వ్యవసాయ విద్యుత్‌ సరఫరాతో భూగర్భ జల క్షీణత అదుపులోకి వచ్చింది. మరోవైపు 24 గంటల విద్యుత్‌ సౌకర్యం గ్రామీణ పరిశ్రమలకు ఉత్తేజమిచ్చింది. చిన్న వ్యాపారాల విస్తృతితో వలసలు తగ్గాయి. ఒక అధ్యయనం ప్రకారం ఈ పథకంపై పెట్టిన రూ.1,115 కోట్ల పెట్టుబడి కేవలం రెండున్నరేళ్లలో తిరిగి వచ్చింది.నర్మదా నది కాలువపై 2012లో సౌర ఫలకాల ఏర్పాటుకు ఆయన నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 16,000 ఇళ్లకు ఏటా 1.6 కోట్ల యూనిట్ల విద్యుదుత్పాదన సాధ్యమైంది. మరోవైపు కాలువలో నీరు ఆవిరయ్యే ప్రక్రియ మందగించి, రైతులకు నీటి లభ్యత పెరిగింది. సాంకేతికతపై మోదీ దార్శనికతకు ఈ జోడు ప్రయోజ నాల విధానమే నిదర్శం. ఇక ‘ఇ–ధర’ వ్యవస్థ ద్వారా భూ రికార్డుల డిజిటలీకరణ చేపట్టారు. ‘స్వాగత్‌’ పేరిట పౌరులకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ముఖ్యమంత్రితో నేరుగా ముచ్చటించే వీలు కలిగింది. ఆన్‌లైన్‌ టెండర్లతో అవినీతి అంతమైంది.జాతీయ యవనికపై...గుజరాత్‌లో సముపార్జించిన అనుభవాన్ని, ఆచరణాత్మక విధా నాలను ఆయన 2014లో ఢిల్లీకి తెచ్చారు. అనతి కాలంలోనే డిజిటల్‌ సార్వజనీన మౌలిక సదుపాయాలతో ‘ఇండియా స్టాక్‌’ రూపు దిద్దుకుంది. జన్‌ధన్, ఆధార్, మొబైల్‌ త్రయమే వీటికి పునాది.దేశవ్యాప్తంగా 53 కోట్ల మందికిపైగా ప్రజలను జన్‌ధన్‌ ఖాతాలు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తెచ్చాయి. వీధి వ్యాపారులు, రోజుకూలీలు సహా పూర్తిగా నగదు లావాదేవీలు నిర్వహించే గ్రామీణులకూ ఇవాళ బ్యాంకు ఖాతాలున్నాయి. ఆధార్‌ పౌరులకు డిజిటల్‌ గుర్తింపునిచ్చింది. ఇప్పటివరకు 142 కోట్ల ప్రజలు దానికింద నమోదు చేసుకున్నారు. ఆధార్‌ ద్వారా ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా మధ్యవర్తుల జోక్యం తొలగి, నిధులు పక్కదారి పట్టడం తగ్గింది. డీబీటీని అవలంబించడం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది.యూపీఐ ద్వారా దేశంలో చెల్లింపుల తీరులో సమూల మార్పు లొచ్చాయి. ఇది ప్రారంభించినప్పటి నుంచి 55 కోట్లకు పైగా వినియోగదారులు లావాదేవీలు నిర్వహించారు. ఒక్క 2025 ఆగస్టులోనే 20 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ. 24.85 లక్షల కోట్లు. నేడు ప్రపంచవ్యాప్తంగా రియల్‌ టైమ్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో సగం భారత్‌లోనే జరుగుతున్నాయి. డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించాల్సిందిగా కోవిడ్‌ సమయంలో ఆయన కోరిన వేళ, ఆర్థిక వ్యవ స్థలో ఆ దిశగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వీసా కన్నా యూపీఐ ఎక్కువ లావాదేవీ లను ప్రాసెస్‌ చేస్తోంది. ఇప్పుడొక చిన్న మొబైల్‌ ఫోనే ఓ బ్యాంకు. సాంకేతికత అందరిదీ!సాంకేతికత వల్ల వ్యవసాయం, ఆరోగ్య రక్షణ రంగాల్లో సమూ లమైన మార్పులు వచ్చాయి. హరియాణాలో ఉండే ఓ రైతు జగదేవ్‌ సింగ్‌ విషయమే తీసుకోండి! ఆయనిప్పుడు ఏఐ యాప్‌లను ఉపయోగించి పంట సంబంధిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని, భూసారా నికి సంబంధించిన డేటాను తన ఫోన్‌ లోనే తెలుసుకుంటున్నారు.పీఎం–కిసాన్‌ పథకం 11 కోట్ల రైతులకు డిజిటల్‌ పద్ధతిలో నేరుగా ఆర్థిక చేయూతను అందిస్తోంది. డిజి లాకర్‌కు ఇప్పుడు 57 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. 967 కోట్ల పత్రాలు అందులో డిజిటల్‌గా నిల్వ అయి ఉన్నాయి. మీ డ్రైవింగ్‌ లైసెన్సు, డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్, ఇతర అధికారిక పత్రాలు భద్రంగా మీ ఫోన్‌ లోనే ఉంటాయి. ఇకపై రోడ్డు మీద పోలీసు తనిఖీల్లో భౌతిక పత్రాల కోసం తడబడాల్సిన అవసరం లేదు. డిజి లాకర్‌ నుంచి మీ డిజిటల్‌ లైసెన్సును చూపించండి చాలు. తక్షణ ఆధార్‌ ధ్రువీకరణ ద్వారా... ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సులభతరమైంది.అసాధ్యం అనిపించిన దానిని భారతదేశం సాధించింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని... అది కూడా హాలీవుడ్‌ సినిమా కంటే తక్కువ బడ్జెట్‌తో చేరుకుంది. ప్రపంచ స్థాయి ఫలితాలను అందిస్తూ భారతీయ ఇంజినీరింగ్‌ సామర్థ్యాన్ని నిరూ పించిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ పై చేసిన వ్యయం రూ. 450 కోట్లు మాత్రమే. చంద్రయాన్‌–3 భూ ఉపగ్రహంపై దిగిన నాలుగో దేశంగా భారత్‌ను నిలబెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్‌ చరిత్రకెక్కించింది. ఒకే మిషన్‌ లో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది. భారతదేశ రాకెట్లు ఇప్పుడు 34 దేశాల ఉపగ్ర హాలను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాయి. ‘గగన్‌ యాన్‌’ మిషన్‌తో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్షంలోకి మాన వులను పంపిన నాలుగో దేశంగా కూడా భారత్‌ నిలవనుంది. పీఎం గతిశక్తి పోర్టల్‌ అపూర్వమైన స్థాయిలో జీఐఎస్‌ టెక్నా లజీని ఉపయోగిస్తోంది. ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టునూ డిజిటల్‌గా మ్యాప్‌ చేస్తారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడ రేవులన్నీ కలిసి సమన్వయ ప్రణాళికగా రూపొందిస్తారు. ఇకపై సమన్వయ లోపం వల్ల జరిగే ఆలస్యం ఉండదు.ఇండియా ఏఐ మిషన్‌ ద్వారా, 38,000 జీపీయూలు మూడింట ఒక వంతు ప్రపంచ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇది స్టార్టప్‌ లకు, పరిశోధకులకు, విద్యార్థులకు సిలికాన్‌ వ్యాలీ స్థాయి కంప్యూ టింగ్‌ను గంటకు సగటున రూ. 67 రేటుతో అందించింది.మానవ అనుసంధానంప్రధాని మోదీకి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసు. కానీ ఆయన ప్రజలను మరింత బాగా అర్థం చేసుకున్నారు. అంత్యో దయకు సంబంధించి ఆయన దార్శనికత ప్రతి ఒక్క డిజిటల్‌ కార్య క్రమాన్నీ ముందుకు నడిపిస్తోంది. యూపీఐ బహుళ భాషల్లో అందు బాటులో ఉంది. అత్యంత ధనిక పారిశ్రామికవేత్తతో సమానమైన డిజిటల్‌ గుర్తింపును నిరుపేద రైతు కూడా కలిగి ఉన్నాడు.సింగపూర్‌ నుంచి ఫ్రాన్స్‌ వరకు ఎన్నో దేశాలు యూపీఐతో అనుసంధానమైనాయి. సమ్మిళిత వృద్ధికి డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ అవసరమని జీ20 ఆమోదించింది. దీనికి జపాన్‌ పేటెంట్‌ మంజూరు చేసింది. భారత్‌ పరిష్కారంగా ప్రారంభమైన యూపీఐ డిజిటల్‌ ప్రజాస్వామ్యానికి ప్రపంచ నమూనాగా మారింది.గుజరాత్‌లో మోదీ చేసిన ప్రారంభ ప్రయోగాల నుంచి డిజిటల్‌ ఇండియా వరకు... ఈ ప్రయాణం జీవితాలను మార్చే సాంకేతిక పరిజ్ఞాన శక్తిని ప్రదర్శిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన తన పాలన సారాంశంగా మార్చారు. పాలకులు మానవీయ కోణంలో సాంకేతికతను స్వీకరించినప్పుడు, మొత్తం దేశాలు భవిష్యత్తులోకి దూసుకెళ్లగలవని ఆయన నిరూపించారు.అశ్వినీ వైష్ణవ్‌వ్యాసకర్త కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సమాచార – ప్రసార శాఖ మంత్రి

Sakshi Editorial On Donald Trump8
ట్రంప్‌తో బ్రిటన్‌కు మేలేనా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల బ్రిటన్‌ పర్యటన గురువారం పూర్తయింది. ఇరు దేశాల మధ్యా సుదీర్ఘకాలంగా ఎంతో గాఢమైన అనుబంధం ఉన్నదని, ట్రంప్‌ హయాంలో అది మరింత విస్తరించిందని ఉమ్మడి మీడియా సమావేశంలో బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ కొనియాడారు. అది నిజమే. ఎందుకంటే వేరేచోట పెట్టుబడులు పెట్టొద్దని తమ దిగ్గజ సంస్థల్ని డిమాండు చేస్తున్న ట్రంప్‌ బ్రిటన్‌లో దాదాపు 15,000 కోట్ల పౌండ్ల విలువైన పెట్టుబడులకు సిద్ధపడ్డారు. ఇందుకు సంబంధించిన ఒప్పందా లపై ఇరు దేశాల మధ్యా సంతకాలయ్యాయి. అలాగే రక్షణ సాంకేతిక ఒప్పందం కూడా కుదిరింది. బ్రిటన్‌ తన డిమాండ్లన్నిటికీ తలొగ్గి అందరి కన్నా ముందు మొన్న ఫిబ్రవరి లోనే వాణిజ్యం ఒప్పందానికి సై అనటం, మరో మూడు నెలల్లో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవటం ట్రంప్‌కు నచ్చింది. దానికితోడు ప్రధాని కీర్‌ స్టార్మర్‌ అమెరికా వెళ్లినప్పుడు అధికారిక పర్యటనకు రావాలంటూ బ్రిటన్‌ రాజు చార్లెస్‌... స్టార్మర్‌ ద్వారా ఆహ్వానం పంపటం ఆయన్ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసివుంటుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిని రాజసౌధం రెండోసారి అధికారిక పర్యటనకు ఆహ్వానించటం, ఘనమైన విందునీ యటం ఇదే తొలిసారి. గత ఏలుబడిలో ట్రంప్‌ 2019లో బ్రిటన్‌లో అధికారిక పర్యటన జరిపారు. జార్జి డబ్ల్యూ బుష్, ఒబామాలకు ఆ అదృష్టం మొదటి దఫాలో మాత్రమే దక్కింది. రెండోసారి నాటి బ్రిటిష్‌ రాణి నుంచి విందు ఆహ్వానాలు మాత్రమే అందాయి.కానీ ట్రంప్‌ షరతులన్నిటికీ తలొగ్గటం ద్వారా బ్రిటన్‌ ప్రయోజనాలను స్టార్మర్‌ దెబ్బతీశారని జనం ఆగ్రహించారు. వాణిజ్య ఒప్పందంలో అమెరికా సరుకులపై 10 శాతం మించి సుంకాలు విధించబోమని ఒప్పుకుని, తమ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే స్టీల్, అల్యూమినియంలపై మాత్రం 25 శాతం సుంకాలు విధించినా మౌనంగా ఉండిపోయారని ఆ విమర్శల సారాంశం. దీన్ని పునఃపరిశీలించాలని బ్రిటన్‌ కోరినా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పటం తప్ప 25 శాతం సుంకాలపై ట్రంప్‌ మరే హామీ ఇవ్వలేదు. బహుశా ఆయన దృష్టిలో ఆదుకోవటమంటే 15,000 కోట్ల పౌండ్ల పెట్టుబడులు పెట్టడం కావొచ్చు. వీటి ద్వారా దేశంలో 7,600 ఉద్యోగాలు వస్తాయని బ్రిటన్‌ ఆశిస్తోంది. ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నాటో, ఉక్రెయిన్, పశ్చిమాసియా, చైనా తదితర అంశాల్లో రెండు దేశాలకూ ఏకీభావం ఉన్నా విభేదాలు కూడా ఉన్నాయి. లోగడ స్టార్మర్‌ ప్రకటించిన ప్రకారం వచ్చేవారం పాలస్తీనాను బ్రిటన్‌ గుర్తించాల్సి ఉంది. ఆ పనిచేస్తే హమాస్‌ ఉగ్రవాదానికి మద్దతు పలికినట్టే అవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇటీవల హెచ్చరించారు. ట్రంప్‌ పర్యటనలో కూడా దీనిపై ఇరు దేశాధినేతల మధ్యా చర్చ జరిగింది. ఈ విషయంలో విభేదాలున్నాయని ఇద్దరూ అంగీకరించారు. బ్రిటన్‌ తాజా నిర్ణయమేమి టన్నది చూడాల్సి ఉంది. రెండు దేశాలూ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించేవి. ప్రపంచ సమస్యల పరిష్కార బాధ్యత భారం తమదేనని భావించేవి. కనీసం అలా చెప్పుకొనేవి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అవి సమష్టిగా పనిచేశాయి. ధిక్కరించిన దేశాలపై నాటో మాటున దాడులు కూడా చేశాయి. ప్రపంచంలోనే చైనా రెండో శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగాక పరిస్థితి తలకిందులైంది. పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచమంతటా ఎటుచూసినా విధ్వంసం, నిరాశా నిస్పృహలు ఆవరించాయి. యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, వలసదా రులపై ఆంక్షలు, ప్రజాస్వామ్య దేశాల్లో నియంతల హవా తదితరాలు వర్తమాన దుఃస్థితికి అద్దం పడుతున్నాయి. సమస్యలొస్తే ఇప్పుడెవరూ అమెరికా, బ్రిటన్‌ల వైపు చూడటం లేదు. అవి చక్కదిద్దుతాయన్న భ్రమలేవీ లేకపోగా... చాలా సమస్యలకు అమె రికా కారణమైతే, బ్రిటన్‌ వైఖరి కూడా అందుకు దోహదపడుతోందన్న అభిప్రాయమే అనేకుల్లో ఉంది. పైగా నిలకడ లేని ట్రంప్‌కు విశ్వసనీయత తక్కువ. భారత్‌ తమకు అత్యంత సన్నిహితమని, ప్రధాని మోదీ కావాల్సినవారనీ మీడియా సమావేశంలో చెప్పిన ట్రంప్‌... ఉక్రెయిన్‌ విషయంలో ఆ దేశంతో కఠినంగా ఉండక తప్పడంలేదని గొప్పగా చెప్పుకొన్నారు. ఇలా మాట్లాడేవారిని ఏ దేశ ప్రజలైనా విశ్వసిస్తారా? మొత్తానికి ట్రంప్‌ తాజా పర్యటన వల్ల బ్రిటన్‌కు లాభించేది అంతంత మాత్రమేనని చెప్పాలి.

Pakistan nuclear weapons to Saudi Arabia9
అద్దెకు అణుబాంబు! సౌదీకి పాక్ అణ్వాయుధాలు?

రక్షణ ఒప్పందంపై షరీఫ్, సల్మాన్ సంతకాలు. ‘ఇస్లామిక్ నాటో’ దిశగా ముందడుగు? భావి విపరిణామాలపై భారత్ అధ్యయనం. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాల్లో మారనున్న సమీకరణాలు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) తమ ఇరు దేశాల మధ్య ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ (ఎస్ఎండీఏ) కుదుర్చుకున్నారు. ఇది ‘నాటో’ కూటమి నిబంధనల్లోని ఆర్టికల్ 5 లాంటిదే. పాక్, సౌదీ... ఈ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై ఎవరు దాడికి దిగినా ఆ రెండు దేశాలపై దాడికి పాల్పడినట్టే. సౌదీపై ఏ దేశమైనా దాడికి తెగబడితే పాకిస్థాన్ మీదా దండెత్తినట్టే. పాక్ మీద ఏ దేశమైనా దాడికి దిగితే సౌదీపైనా యుద్ధం ప్రకటించినట్టే. సౌదీ అరేబియాతో పాక్ తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం సారాంశమిదే. ఇరాన్ కనుక అణ్వాయుధం తయారుచేస్తే, తాము కూడా సాధ్యమైనత త్వరలో అణుబాంబు రూపొందిస్తామని 2018లో ‘సీబీఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ప్రకటించడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన ప్రకటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఇరాన్-సౌదీ అరేబియా నడుమ శతృత్వం ఉంది. అటు ఇజ్రాయెల్-ఇరాన్ నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదే సమయంలో ఇరుగుపొరుగు దేశాలైన భారత్-పాక్ దాయాదులనే అంశాన్ని విస్మరించకూడదు. పాక్-సౌదీ తాజా ఒప్పందాన్ని పరిశీలిస్తే... ‘భవిష్యత్తులో ఆపరేషన్ సిందూర్’ లాంటి సందర్భాల్లో పాక్ కు సౌదీ సాయం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పాక్-సౌదీ తాజా ఒప్పందం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అధ్యయనం చేసే పనిలో భారత్ పడింది. మొత్తంమీద ఈ పరిణామం అటు మధ్యప్రాచ్యంలో, ఇటు దక్షిణాసియాలో మిలిటరీ సమీకరణాలపై ప్రభావం చూపిస్తుందనే చెప్పాలి. పాక్-సౌదీ ‘అణు’బంధం ఏనాటిదో! సౌదీ అరేబియాకు అణ్వాయుధాలను గానీ, అణు పరిజ్ఞానాన్ని గానీ పాక్ బదిలీ చేసినట్టు ఆధారాలు లేకపోయినప్పటికీ ... అందుకు గల అవకాశాలపై మాత్రం రక్షణ వర్గాల్లో దశాబ్దాలుగా చర్చ సాగుతోంది. సౌదీ-ఇరాన్ వైరం, మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం భౌగోళికంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్, ఇరాక్ వంటి శత్రుదేశాలు సౌదీ చుట్టూ మోహరించాయి. మరోవైపు సౌదీ కూడా ఏదైనా సున్నీ ముస్లిం దేశపు గట్టి భాగస్వామ్యం కోసం నిరీక్షిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతో శాంతి, సామరస్యాల కోసం ఇటీవల మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలు చేసినప్పటికీ 2023 అక్టోబరు నుంచి గాజాలో మొదలైన యుద్ధం, అమెరికా మళ్లీ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం వంటివి మధ్యప్రాచ్యంలో పెను మార్పులకు దోహదం చేశాయి. నిఘా సమాచారం పంచుకోవడం, సైబర్ సెక్యూరిటీ పరంగా సహకారం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ వంటి అంశాలు పాక్-సౌదీ తాజా ఒప్పందంలో ఉన్నాయి. అణ్వాయుధాల ప్రస్తావన ఒప్పందంలో లేకున్నప్పటికీ భవిష్యత్తులో ప్రాంతీయంగా ముప్పు తలెత్తితే అది అణు సహకారానికి కూడా దారితీయవచ్చనేది విశ్లేషకుల భావన. అంటే తమకు ముప్పు వాటిల్లే పక్షంలో రక్షణార్థం అమెరికా యుద్ధనౌకల కోసం సౌదీ ఎదురుచూడాల్సిన అగత్యం ఉండబోదు. తనకంటూ తన చేతిలో ఓ ఆయుధాన్ని సౌదీ సిద్ధం చేసుకునే ప్రయత్నమే ఇది. ట్రంప్ పాలనా యంత్రాంగానికి ఇది ఎదురుదెబ్బ మాత్రమే కాదు... చెంపపెట్టు కూడా! చారిత్రకంగా చూస్తే పాక్-సౌదీ నడుమ 1970ల నుంచే సత్సంబంధాలు ఉన్నాయి. పాక్ కు ఆర్థిక సాయం, చౌకగా చమురు, సైనిక తోడ్పాటును సౌదీ అరేబియా అందించింది. ప్రతిగా పాక్ వేలాదిగా తమ సైనిక బలగాలను సౌదీలో మోహరించి ఆ దేశ సైనికులకు శిక్షణ ఇచ్చింది. మక్కా, మదీనా పరిరక్షణ కోసం తమ జవాన్లను తరలించింది. పాక్ రక్షణ రంగంలో సౌదీ భారీగా పెట్టుబడులు పెట్టింది. పాక్ అణు కార్యక్రమానికి వంద కోట్ల డాలర్ల పైగా నిధులను సౌదీ సమకూర్చినట్టు సీఐఏ అధికారి ఒకరు 1980లలో పేర్కొన్నారు. 1980ల నుంచి పాకిస్థాన్ ఆర్థిక, సైనిక రంగాలకు 30 బిలియన్ డాలర్లకు పైగా సౌదీ సాయం చేసినట్టు ‘ది యూరేషియన్ టైమ్స్’ వెల్లడించింది. ఆయుధాలు, ప్రాజెక్టుల రూపేణా 5-10 బిలియన్ డాలర్ల మేర సౌదీ అరేబియా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని, 100 బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిన పాక్ కు ఇది ఉపశమనం కలిగించవచ్చని అంచనా. అలాగని ఇది సౌదీ సాయం చేసినట్టేమీ కాదు! పాక్ నియంత్రణ సౌదీ చేతిలోనే ఉంటుంది. కారుకు ఇంధనం నింపి తాళంచెవిని సౌదీ తన చేతిలో పెట్టుకోవడం లాంటిది ఇది! ఇటు పాక్ వైపు నుంచి కూడా పోయేదేమీ లేదు. దాని వైమానిక దళానికి సౌదీ సాంకేతికత అందుతుంది. ప్రమాదాలను గుర్తించేలా రాడార్స్ అమర్చిన విమానాలు, సరిహద్దుల్లో తాలిబాన్ గ్రూపులకు సంబంధించిన నిఘా సమాచారం లభిస్తాయి. పాక్ వైమానిక బలహీనతలను భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో సౌదీతో సరికొత్త చెలిమి దానికి బలం కల్పించేదే. ఇక్కడ కేవలం విశ్వసనీయతే కాదు... డబ్బు అంశమూ ముడిపడివుంది. ఒకవేళ సౌదీ అరేబియాపై ఇజ్రాయెల్ దాడి చేసిందనుకుందాం. అప్పుడు సౌదీకి మద్దతుగా పాక్ ఎంత దీటుగా పోరాడుతుందనేది సౌదీ నుంచి ఆ దేశానికి పారే ‘నిధుల ప్రవాహం’పై ఆధారపడి ఉంటుంది! సౌదీకి పాక్ అణు కవచం!భవిష్యత్తులో తనకు అవసరమైతే పాక్ నుంచి అణ్వాయుధాలను పొందేలా సౌదీకి రహస్య ఒప్పందం ఉందన్న ఊహాగానాలు ఈనాటివి కావు. 2003లో అప్పటి సౌదీ యువరాజు అబ్దుల్లా పాక్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రహస్య అణు ఒప్పందంపై చర్చలు సాగినట్టు పాక్ వర్గాలు 2003లో వెల్లడించాయి. ‘సౌదీకి పాక్ అణ్వాయుధాలు- బదులుగా పాక్ కు సౌదీ చమురు’… ఆ చర్చల ప్రధానాంశమని నాడు వార్తలు వెలువడ్డాయి. అయితే తమ మధ్య అలాంటి ఒప్పందమేదీ కుదరలేదని రెండు దేశాలు స్పష్టీకరించాయి. శాంతియుత ప్రయోజనాల కోసమే తమకు అణుశక్తి అవసరమని సౌదీ చెబుతూ వస్తోంది. 16 అణు రియాక్టర్లు నిర్మించాలన్న తన ప్రణాళికలను అది 2010లో ప్రకటించింది. అయితే ఈ అంశంలో పెద్ద పురోగతి లేదు. విశేషమేమిటంటే... ‘అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (న్యూక్లియర్ నాన్-ప్రాలిఫరేషన్ ట్రీటీ- ఎన్పీటీ) అడిషనల్ ప్రొటోకాల్ మీద సౌదీ అరేబియా నేటి వరకు సంతకాలు చేయలేదు. దీని ప్రకారం కట్టుదిట్టమైన అంతర్జాతీయ తనిఖీలు ఎదుర్కోవాల్సివుంటుంది. చైనా సహకారంతో యురేనియం వెలికితీత కేంద్రాన్ని సౌదీ అరేబియా నిర్మించినట్టు 2020లో ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ వార్తాకథనం ప్రచురించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ చర్య అనుమతించదగ్గదే అయినప్పటికీ ఇది ‘రెండు రకాల ప్రయోజనాల’ (అణు విద్యుదుత్పత్తి, అణ్వాయుధాల తయారీ) కోసం ఉద్దేశించినదన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. అవసరమైతే పాక్ అణు వార్ హెడ్లను మోసుకెళ్లే విధంగానే తమ క్షిపణులను సౌదీ సిద్ధం చేస్తున్నట్టు 1988 నాటి పత్రాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగిన అతి కొద్ది ముస్లిం దేశాల్లో పాక్ ఒకటి. ఉత్తర కొరియా, ఇరాన్, లిబియాలతో పాక్ కు చెందిన ‘అబ్దుల్ ఖదీర్ ఖాన్ నెట్వర్క్’ అణు సంబంధాలు నెరపినట్టు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇరాన్ కనుక అణ్వాయుధాలను తయారుచేసే పక్షంలో సౌదీ అరేబియా కూడా పాక్ నుంచి ‘అణు వార్ హెడ్స్’ను కొనుగోలు చేయడమో, వాటిని ‘అప్పు/అద్దె ప్రాతిపదికన తీసుకోవడమో’ చేస్తుందని నిపుణుల అంచనా. ‘ముస్లిం దేశాల రక్షణకర్త’ పాత్రను పాక్ రక్తి కట్టిస్తోందా? పాక్ నేతృత్వంలోని ‘ఇస్లామిక్ నాటో’ కూటమిలో చేరిన తొలి సభ్యదేశంగా సౌదీ అరేబియాను చూడవచ్చా?! - జమ్ముల శ్రీకాంత్ (Source: The EurAsian Times, WION).

My Restaurant Made Rs 50 said Kangana Ranaut to Flood Victims10
‘నా రోజువారి సంపాదన రూ.50’.. వరద బాధితులతో కంగనా రనౌత్ ఆవేదన

ధర్మస్థల: నా రోజువారి ఆదాయం కేవలం రూ.50 మాత్రమే. కానీ నెలకు రూ.15 లక్షల జీతాలు చెల్లించాల్సి వస్తోంది. నా బాధను అర్థం చేసుకోండి," అంటూ బాలీవుడ్‌ క్వీన్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ మాన్సూన్‌ సీజన్‌లో కుండపోత వర్షాలు, క్లౌడ్‌బరస్ట్‌లు హిమాచల్‌ను అతలాకుతలం చేశాయి. జూన్ 20 నుంచి ప్రారంభమైన వర్షాల కారణంగా ఇప్పటివరకు 419 మంది మరణించారు. వీరిలో 237 మంది వరదలు, కొండచరియలు, నీటి ప్రవాహం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ఇటీవల జరిగిన క్లౌడ్‌బరస్ట్‌ దాటికి రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గమైన మండి జిల్లాలో పర్యటించిన కంగనా, వరద బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో మనాలీలో ప్రారంభించిన ‘ది మౌంటెన్‌ స్టోరీ’ రెస్టారెంట్‌ వరదల కారణంగా పర్యాటకులు తగ్గిపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది.‘నిన్న నా రెస్టారెంట్‌ ఆదాయం కేవలం రూ.50 మాత్రమే. కానీ నెలకు రూ.15 లక్షల జీతాలు చెల్లించాలి. నా బాధను అర్థం చేసుకోండి. నేనూ హిమాచలీనే’ అని ఆమె అన్నారు.సోలాంగ్‌, పల్చన్‌ ప్రాంతాల్లో పర్యటించిన కంగనాకు స్థానికులు 15–16 ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయని వివరించారు. బియాస్‌ నది కొండచరియలు విరిగిపడి గ్రామాలను ప్రమాదంలోకి నెట్టాయని చెప్పారు. అందుకే బియాస్‌ నది ప్రవాహాన్ని మళ్లించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు సూచించారు.MP Kangana Ranaut listens to a flood victim in Himachal, but responds by complaining about her own restaurant’s poor earnings — "only ₹50" made.#KanganaRanaut #HimachalFloods #Controversy@KanganaTeam pic.twitter.com/iANqskVacm— Atulkrishan (@iAtulKrishan1) September 18, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement