ఇక్కడ నుంచి వెళ్లిపోండి.. మంత్రికే షాకిచ్చిన మహిళ
ముంబై: నగరంలో ఓ మహిళ.. ఏకంగా మంత్రిని నడిరోడ్డుపై నిలదీసిన ఘటన సంచలనం రేపింది. వర్లీ ప్రాంతంలో రాజకీయ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ మహిళా.. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్, స్థానిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు.సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని నినాదాలు చేశారు. వర్లీలోని జంబోరి మైదాన్ నుండి డోమ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తన బిడ్డను స్కూలు నుండి తీసుకురావడానికి కారులో వెళ్తున్న ఒక స్థానిక మహిళ.. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ.. తన వాహనం దిగి నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మంత్రి మహాజన్తో వాగ్వాదానికి దిగారు. రాజకీయ ర్యాలీల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యంపై ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి!" అంటూ ప్రదర్శనకారులపై అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.Mumbai woman, who taught Maharashtra minister Girish Mahajan a lesson in civics sense, also lashed out at a cop who tried to shut her down. In reply, a chilling "Shut up" reverberated. https://t.co/fHwlntCQoJ pic.twitter.com/Dr4ZXX8YJl— Piyush Rai (@Benarasiyaa) April 22, 2026సమీపంలో ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ వందలాది మంది వేచి చూస్తున్నారు. అక్కడ ఖాళీ మైదానం ఉంది కదా! అంటూ మంత్రిపై ఆ మహిళ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆమె ముంబై పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె ఒక పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. సీనియర్ అధికారులతో మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ వాగ్వాదం తర్వాత, పోలీసులు ఆమెను రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆమె సమస్యను వినే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇరాన్లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్ చేసేశారా?
టెహ్రాన్: ఇరాన్ అంతర్గత అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్పై అమెరికా యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై ఓ వైపు సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. ఆయన్ని కాదని ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చాపకింద నీరులా ప్రభుత్వంపై పట్టు బిగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ అంతర్గత పోరాటం కారణంగా పాకిస్థాన్లో జరగాల్సిన అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్’ అన్న చందంగా ఇరాన్ వ్యవహారం మారింది. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో హాట్టాపిక్గా మారి, అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అమెరికా సైతం చర్చలు విఫలమవడానికి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ ఇరాన్లో ఏం జరుగుతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.ఆరు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన గొంతు వినలేదు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కీలక నేతలను కోల్పోవడం వల్ల భయాందోళనలో ఉన్నారని సమాచారం.అమెరికా మీడియా నివేదికల ప్రకారం, మొజ్తాబా ప్రత్యక్ష నిర్ణయాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పెరిగాయి. అణు కార్యక్రమంపై చర్చల్లో ఇరాన్ ప్రతినిధులకు ఎంత అధికారం ఇవ్వాలో స్పష్టత లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 440 కిలోల నిల్వ ఉంది. ఇది 90 శాతం ఆయుధ స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, ఎనిమిది నుంచి పన్నెండు అణు బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్కి చెందిన అలీ వాయేజ్ ప్రకారం, మొజ్తాబా స్వయంగా చర్చలు జరిపే స్థితిలో లేరు. ఆయన కేవలం విస్తృత నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారని, చర్చల వ్యూహాల్లో ఆయన పాత్ర లేదని చెప్పారు. ఆయన గైర్హాజరీని ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపిస్తోందని, ఇది అంతర్గత విమర్శల నుంచి రక్షణగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం ఇరాన్ పాలనకు సవాలుగా మారింది. ఆయన పేరుతో టీవీల్లో వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలతో సందేశాలు పంపడం ఆయన ఆరోగ్యంపై, ఆయన ఎక్కడున్నారనే అనుమానాలను మరింత పెంచుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. మరోవైపు, రాయిటర్స్ ప్రకారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధం, అమెరికాతో చర్చల వంటి ప్రధాన అంశాలపై నిర్ణయాల్లో పాల్గొంటున్నారని సమాచారం.ఇరాన్ ప్రభుత్వంలో కుమ్ములాటఇరాన్లో ప్రస్తుతం పెద్ద రాజకీయ కుమ్ములాట జరుగుతోంది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రభుత్వంపై పట్టు బిగించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ నియామకాలను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించడాన్ని నిరోధించడం ద్వారా అధ్యక్షుడిని పూర్తిగా పక్కకు పెట్టిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఐఆర్జీసీ మరింత ఆధిపత్యం సాధించింది. ఆయన చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులకు ఆయనను కలిసే అవకాశం లేకుండా చేసింది. దీంతో పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలస్యమవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఐఆర్జీసీ ఆధిపత్యం పెరగడం వల్లే శాంతి చర్చలు నిలిచిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు
హర్ముజ్లో మళ్లీ టెన్షన్: భారత నౌకను దిగ్బంధించి..
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అలాగే భారత్కు చెందిన నౌకను సైతం దిగ్బంధించినట్లు సమాచారం అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ఇరాన్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్లో వెళ్తున్న కంటైనర్ షిప్లపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్ని బ్రిటన్ ఆర్మీ ధృవీకరించింది. మొత్తం మూడు నౌకలపై దాడులు జరిగాయని.. గ్రీక్, పనామా, లైబీరియా రిజిస్ట్రేషన్ నౌకలుగా వాటిని గుర్తించారు. తొలుత.. ఈ ఉదయం గ్రీక్ ఆపరేటెడ్ కంటైనర్ షిప్పై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో నౌక పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. సిబ్బంది క్షేమంగానే ఉన్నారని సమాచారం. ఆ వెంటనే పనామా, లైబీరియా షిప్లపై దాడి జరిగింది. దాడులను ధృవీకరించిన ఇరాన్ మీడియా.. హర్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేసింది.భారత నౌకపై కూడా.. భారత్కు చెందిన నౌకలకు స్వేచ్ఛా రవాణా ఉంటుందని ఇరాన్ పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాటి పరిణామాలు మరోలా ఉన్నాయి. గుజరాత్ వైపు వస్తున్న ఓ నౌకను ఇరాన్ అడ్డగించింది. దిగ్బంధించిన ఆ నౌక పరిస్థితి.. సిబ్బంది క్షేమసమాచారాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొన్నీమధ్య కూడా హర్ముజ్లో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. ఏప్రిల్ 18న ఐఆర్జీసీ రెండు భారత-పతాక నౌకలపై కాల్పులు జరిపింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు, కానీ నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత నౌకల భద్రత విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ కోరింది.ప్రపంచ వర్తక వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి కీలకమన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రూట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే.. కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్లో తమ బ్లాకేడ్(దిగ్బంధం) కొనసాగుతుందని అమెరికా అంటోంది. ఈ క్రమంలో టౌసా అనే వాణిజ్య నౌకను సీజ్ చేసింది. ఇది యుద్ధ చర్యేనంటున్న ఇరాన్.. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రతరంగా మార్చే అవకాశం లేకపోలేదు.
'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా'గా డాక్టర్ స్తుతి ఖరే శుక్లా గుర్తింపు
శాస్త్రీయ ఆధారాలు, వినూత్న విధానాలతో జుట్టు రాలడం (హెయిర్ లాస్) చికిత్సలో కొత్త దారులు చూపుతున్నారు. నాన్-సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా లక్షలాది మందికి నమ్మకాన్ని కలిగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా రోగులకు అందుబాటులో ఉన్న ఆధునిక పరిష్కారాలు అందిస్తున్నారు. జుట్టు రాలడం అనేది అన్ని వయస్సులు, అన్ని ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేసే అత్యంత సాధారణమైన అంశం. అయినా, మానసికంగా బాధ కలిగించే సమస్యలలో ఒకటిగా ఉంది. వైద్య శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నా శస్త్రచికిత్స, ఎక్కువ కాలం విశ్రాంతి అవసరమయ్యే చికిత్సకు చాలా మంది సంకోచిస్తున్నారు. ఈ సమస్యకు శాస్త్రాన్ని, సౌకర్యాన్ని కలిపి పరిష్కారం చూపుతున్న వైద్యురాలు డాక్టర్ స్తుతి ఖరే శుక్లా. ఆమెను భారతదేశంలోని ప్రముఖ చర్మ వైద్య నిపుణురాలిగా మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హెయిర్ స్పెషలిస్టుగా గుర్తిస్తారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా జుట్టు పెరుగుదలలో అద్భుత ఫలితాలు అందిస్తున్నందుకు రోగులు ఆమెను ప్రేమతో 'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు.అమెరికాలో శిక్షణ పొందిన డెర్మటాలజిస్ట్, డెర్మాటో-సర్జన్, కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ స్తుతి ఖరే శుక్లా ప్రస్తుతం ఎలిమెంట్స్ ఆఫ్ ఏస్తెటిక్స్ క్లినిక్ల చైన్కు చీఫ్ డెర్మటాలజిస్ట్, మెడికల్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ క్లినిక్లు ముంబై, హైదరాబాద్, నాగపూర్, జబల్పూర్, బాలాఘాట్ నగరాల్లో ఉన్నాయి. ఇటీవల ఆమె ఫెమినా మిస్ ఇండియా 2026 పోటీలో హెయిర్ కేర్ నిపుణురాలు, జ్యూరీ సభ్యురాలిగా సేవలందించారు. శస్త్రచికిత్స లేకుండా జుట్టు పునరుద్ధరణలో ఆమె చేసిన కృషి వల్ల దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించింది. హెయిర్ లాస్ చికిత్స విధానం వైద్య పరిశోధన, అంతర్జాతీయ అనుభవంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో డెర్మటాలజీలో పీజీ పూర్తి చేసిన తర్వాత, ఆమె అమెరికా, సింగపూర్, బ్యాంకాక్లలో అధునాతన సూపర్ స్పెషాలిటీ ఫెలోషిప్లు చేశారు. ఈ అంతర్జాతీయ శిక్షణ వల్ల వివిధ దేశాల ప్రజల్లో కనిపించే జుట్టు సమస్యలు, చికిత్స పద్ధతులు, సాంకేతికతను లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభించింది.ఆమెకు ఉన్న ఈ అంతర్జాతీయ అనుభవమే తర్వత ప్రత్యేక చికిత్స విధానం అభివృద్ధికి పునాది అయింది. అదే హెయిర్ గ్రోత్ బూస్టర్. శస్త్రచికిత్స అవసరం లేని, సుమారు ఐదు నిమిషాల్లో పూర్తయ్యే హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ ఇది. శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఇష్టపడని, అర్హత లేని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించినది ఈ చికిత్స. నొప్పి లేకుండా, తక్కువ సమయంలో పూర్తయ్యే విధంగా ఉండటం వల్ల ఆదరణ పొందింది. ఈరోజుల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విధానాలు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో శస్త్రచికిత్స అవసరం లేని ప్రత్యామ్నాయాలపై మళ్లీ దృష్టిని ఆకర్షించింది. ఆమె చికిత్స విధానం శస్త్రచికిత్స చేయకుండా, శాస్త్రీయంగా రూపొందించిన పద్ధతుల ద్వారా నిద్రలో ఉన్న హెయిర్ ఫాలికల్స్ను ప్రేరేపించడంపై కేంద్రీకృతమై ఉంటుంది. అందువల్ల ఇది ప్రారంభ దశలో ఉన్న వారికి అనగా జుట్టు ఊడిపోవడం, ఒత్తిడి కారణంగా వచ్చే హెయిర్ లాస్, జుట్టు పలుచబడే సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.గ్లోబల్ పరిధిని మరింత విస్తరించిన అంశం ఏమిటంటే, ఆమె రూపొందించిన వ్యవస్థీకృత ఆన్లైన్ కన్సల్టేషన్ మోడల్. పురుషులలో కనిపించే ప్యాటర్న్ బాల్డ్నెస్, మహిళలలో వచ్చే హెయిర్ లాస్, అలోపేషియా వంటి సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు ఆమె వర్చువల్ కన్సల్టేషన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల భౌగోళిక పరిమితులు లేకుండా నిపుణుల సేవలను అందుకోవడం సాధ్యమవుతుంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన చికిత్స ప్రణాళికలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని రోగులు తమ ఇళ్ల నుంచే పొందగలుగుతున్నారు. ఈ విధంగా ఆధునిక హెయిర్ రీస్టోరేషన్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.అనేక మంది రోగుల అనుభవాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, అమెరికాలోని చికాగో నగరానికి చెందిన నెల్సన్ జోసెఫ్ అనేక సంవత్సరాలుగా జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఇతర చోట్ల ఎన్నో చికిత్సలు చేయించినా ఫలితం లేకపోవడంతో, ఆయన ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా డాక్టర్ స్తుతిని సంప్రదించారు. ఆమె సూచించిన చికిత్సను అనుసరించిన తర్వాత, ఆయన జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పు కనిపించిందని, ఆ ఫలితాలు జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు.క్లినికల్ ప్రాక్టీస్కు మాత్రమే పరిమితం కాకుండా, డాక్టర్ స్తుతి పరిశోధన రంగంలో కూడా చురుకుగా ఉన్నారు. హెయిర్, స్కాల్ప్ విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికతలు ఉపయోగించే పారిస్లోని ప్రముఖ ప్రయోగశాలతో కలిసి పని చేస్తున్నారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో కలిసి చికిత్స పద్ధతులను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు. ఆమె చేసిన పరిశోధనలు ప్రముఖ అమెరికన్ వైద్య జర్నల్స్లో కూడా ప్రచురితమయ్యాయి. ఒక లక్షకు పైగా విజయవంతమైన హెయిర్ గ్రోత్ కేసులు ఉన్నాయి. వైద్య నైతికత ఆధారంగా బలమైన అంతర్జాతీయ రోగుల వర్గాన్ని నిర్మించారు. ఆమె చేసిన పని ఏస్థెటిక్ మెడిసిన్ రంగంలో ఒక ముఖ్యమైన మార్పును ప్రతిబింబిస్తుంది. అది అధిక శస్త్రచికిత్సల కంటే భద్రత, శాస్త్రీయ ఆధారాలు, రోగుల సౌకర్యాన్ని ప్రాధాన్యంగా చూసే విధానం. శస్త్రచికిత్స అవసరం లేని చికిత్సలపై అవగాహన పెరుగుతున్న ఈ సమయంలో డాక్టర్ స్తుతి సేవలు ఒక ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. శాస్త్రీయ ఆధారాలు, అంతర్జాతీయ అనుభవంతో కూడిన నవీన ఆవిష్కరణలు ఎలా హెయిర్ లాస్ చికిత్సను ప్రపంచవ్యాప్తంగా మారుస్తాయో ఆమె నిరూపిస్తున్నారు.మరిన్ని వివరాలకు..వాట్సాప్ నంబర్ : +91 6261 967 835ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/dr.stutikhareshukla?
డిఫరెంట్ మూవీతో వస్తోన్న కమిటీ కుర్రోళ్లు బ్యూటీ.. మరో హిట్ కొట్టేనా?
148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం
శారీలో హీరోయిన్ కృతి శెట్టి అందాలు.. ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ లుక్..!
శుక్రవారం నాటికి ‘శుభవార్త’.. ట్రంప్ కీలక ప్రకటన
'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'
ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు ప్రమోషన్లు
'మా ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే': అభిషేక్ బచ్చన్
ఇరాన్లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్ చేసేశారా?
రాయలసీమ లిఫ్టును పూర్తి చేయాల్సిందే
టిమ్ కుక్పై ట్రంప్ ప్రశంసల జల్లు
హైదరాబాద్కు గుడ్బై.. షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్!
మీతో పని ఉంది సార్.. రాత్రి ఇంటికి రండి!
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’
ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్.. స్పందించిన అరవింద్
అతని టార్గెట్ బంజారాహిల్స్ అమ్మాయిలే..!
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
గరికపాటికి లీగల్ నోటీసు
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్కి గుడ్బై?
సార్ మనమిప్పుడు తమిళనాడులో ఉన్నాము!
'సారీ చరణ్.. మగధీర సినిమాలో చేయొద్దని చెప్పా'
ఓటుకు నోటు ‘బంధం’ వీడడం లేదు మరి!
ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!
‘మన చంద్రన్న’ పుస్తకంలో ‘అప్పులు’ అంశం ఏ పేజీలో ఉంది సార్!
హార్మూజ్పై ఇరాన్ భారీ ట్విస్ట్.. దిమ్మ తిరిగే ప్లాన్!
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
చైనాలో రివర్స్ మైగ్రేషన్..
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఈ 8 మంది అమ్మాయిలను వదిలేయండి: ట్రంప్
డిఫరెంట్ మూవీతో వస్తోన్న కమిటీ కుర్రోళ్లు బ్యూటీ.. మరో హిట్ కొట్టేనా?
148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం
శారీలో హీరోయిన్ కృతి శెట్టి అందాలు.. ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ లుక్..!
శుక్రవారం నాటికి ‘శుభవార్త’.. ట్రంప్ కీలక ప్రకటన
'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'
ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు ప్రమోషన్లు
'మా ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే': అభిషేక్ బచ్చన్
ఇరాన్లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్ చేసేశారా?
రాయలసీమ లిఫ్టును పూర్తి చేయాల్సిందే
టిమ్ కుక్పై ట్రంప్ ప్రశంసల జల్లు
హైదరాబాద్కు గుడ్బై.. షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్!
మీతో పని ఉంది సార్.. రాత్రి ఇంటికి రండి!
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’
ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్.. స్పందించిన అరవింద్
అతని టార్గెట్ బంజారాహిల్స్ అమ్మాయిలే..!
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
గరికపాటికి లీగల్ నోటీసు
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్కి గుడ్బై?
సార్ మనమిప్పుడు తమిళనాడులో ఉన్నాము!
'సారీ చరణ్.. మగధీర సినిమాలో చేయొద్దని చెప్పా'
ఓటుకు నోటు ‘బంధం’ వీడడం లేదు మరి!
ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!
‘మన చంద్రన్న’ పుస్తకంలో ‘అప్పులు’ అంశం ఏ పేజీలో ఉంది సార్!
హార్మూజ్పై ఇరాన్ భారీ ట్విస్ట్.. దిమ్మ తిరిగే ప్లాన్!
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
చైనాలో రివర్స్ మైగ్రేషన్..
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఈ 8 మంది అమ్మాయిలను వదిలేయండి: ట్రంప్
ఫొటోలు
రెడ్ రోజ్లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)
రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. భారీగా జన సందోహం (ఫొటోలు)
ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)
హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)
తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్గా ఉందేంటి! (ఫొటోలు)
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
నేటి నుండి కేదార్నాథ్ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)
'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫోటోలు)
సినిమా
నెల రోజులైనా తగ్గేదేలే.. దురంధర్-2 మరో రికార్డ్
నెల రోజులు దాటినా కూడా దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా రిలీజైన 34 రోజుల్లోనే అరుదైన రికార్డ్ సాధించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మూవీ పఠాన్ రికార్డ్ను అధిగమించింది. తాజా వసూళ్లతో యూకేలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా దురంధర్-2 నిలిచింది.రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ మూవీ యూకేలో 34 రోజుల్లోనే రూ. 55.55 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే గతంలో ఉన్న పఠాన్ మూవీ రికార్డ్ను(రూ.55.40 కోట్లు) దాటేసింది. ఆ తర్వాత వరుసగా జవాన్, సైయారా, రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ, దిల్వాలే, పద్మావత్, చెన్నై ఎక్స్ప్రెస్ ఈ జాబితాలో ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే దురంధర్-2 అంతర్జాతీయంగా రూ. 422 కోట్లకు పైగా వసూలు చేసింది. చైనా మినహా పలు దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,761.88 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కంటే బాహుబలి-2, దంగల్ చిత్రాలు మాత్రమే ముందున్నాయి.కాగా.. ఈ ఏడాది మార్చి 19న విడుదలైన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్లో రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచిన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు.
వాచ్మెన్గా పనిచేశా.. బిచ్చగాడిగా కూడా సెట్ కాదన్నారు: నటుడు
సినిమా నటులు అనగానే కోట్ల సంపాదన, లగ్జరీ లైఫ్ అనుకుంటారు. నిజమే అలానే బతుకుతారు. కానీ వాళ్లు ఆ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడతారు. ఇప్పుడు స్టార్స్గా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించి వచ్చినవాళ్లే. అలాంటి వాళ్లలో బాలీవుడ్ నటుడు వినోద్ సూర్యవంశీ ఒకరు. అక్షయ్ కుమార్ ‘ఎల్ఎల్బి 3’, పంచాయత్ లాంటి సిరీస్తో బాలీవుడ్లో మంచి గుర్తించు తెచ్చకున్న ఈ నటుడు.. ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడట. రూ. 500 కోసం సినిమాల్లోకి వచ్చి.. ఇప్పుడు బాలీవుడ్లో మంచి నటుడిగా స్థిరపడిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోద్ తన సినిమా జర్నీ ఎలా మొదలైందో వివరించాడు.(చదవండి: ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు)వాచ్ మెన్గా పనిచేశా..చిన్నప్పుడు నా జీవితం చాలా ఘోరంగా ఉండేది. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. పండగలు వస్తే.. భయపడిపోయేవాళ్లం. అమ్మ-నాన్నల కష్టం చూడలేక.. కొన్నాళ్ల పాటు లిఫ్ట్ మ్యాన్గా పని చేశారు. ఆ తర్వాత వాచ్మెన్గా చేశా. ఆ సమయంలో దాదాపు 12 గంటల పాటు నిలబడి ఉండేవాడిని. వర్షం వస్తే.. షూలోకి నీళ్లుపోయి..తీవ్రమైన నొప్పి వచ్చేవి.రూ. 500 కోసం.. నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. వాచ్మెన్గా చేస్తున్న సమయంలో నా స్నేహితుడు ఒకడు వచ్చి షూటింగ్లో నిలబడితే రూ. 500 ఇస్తారని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. అలా జూనియర్ ఆర్టిస్ట్గా నా కెరీర్ ప్రారంభం అయింది. అప్పట్లో రోజుకు రూ. 500 ఇచ్చేవాళ్లు. టిఫిన్, లంచ్ పెట్టేవాళ్లు. అప్పటికే అది నాకు చాలా గొప్పది. వాన్మెన్గా 12 గంటలు పని చేస్తే నెలకు రూ. 8000 మాత్రమే వచ్చేవి. కానీ జూనియర్ ఆర్టిస్ట్గా రూ. 12000 సంపాదించా.తింటుంటే లేపేశారుఅలా అని జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ గొప్పగా ఉంటుందని నేను చెప్పను. వాళ్లకు కనీస గౌరవం కూడా ఇవ్వరు. జూనియర్ ఆర్టిస్ట్గా పని చేస్తున్నప్పుడు ఓ సారి నేను సెట్లో భోజం చేస్తున్నాను. కొంతమంది వచ్చి..నన్ను పక్కకు వెళ్లమన్నారు. దూరంలోని నిలబడి తనమన్నారు. ఎందుకంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ని అని. అప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నా. నన్ను గౌరవించాలంటే.. నేను కూడా యాక్టర్ని కావాలనుకున్నా. చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా.బిచ్చగాడి పాత్రకు కూడా సెట్ కాదన్నారుకెరీర్ ప్రారంభంలో నేను చాలా కష్టాలు అనుభవించా. చాలా పాత్రలకు నన్ను రిజెక్ట్ చేశారు. కొన్ని పాత్రలు అయితే షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆగిపోయాయి. సెట్లోకి వెళ్లిన తర్వాత.. నల్లగా ఉన్నావని చెప్పి రిజెక్ట్ చెశారు. చివరకు బిచ్చగాడి పాత్రకి కూడా రిచ్ లుక్ లేదని నన్ను పక్కన పెట్టారు. ఇలా మొదట్లో నాకు చాలా అవమానాలు జరిగాయి’ అని సూర్య చెప్పుకొచ్చాడు.
'నా సోనును కోల్పోయా'.. బిగ్బాస్ అశ్విని ఎమోషనల్ పోస్ట్
బిగ్బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అశ్విని శ్రీ. బిగ్బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్తో హౌస్లో అలరించింది. ఈ షో ద్వారా టాలీవుడ్లో మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉంటోంది.తాజాగా బిగ్బాస్ అశ్విని శ్రీ కన్నీటి పర్యంతమైంది. తాను ఎంతగానో ప్రేమించే సోను(పెట్ డాగ్) చనిపోయిన విషాద వార్తను సోషల మీడియాలో షేర్ చేసింది. ఈ బాధ తనకు భరించలేనిదంటూ ఫుల్ ఎమోషనలైంది. సోనుకు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్లే చనిపోయాడని అశ్విని శ్రీ తెలిపింది. అశ్విని శ్రీ తన ఇన్స్టాలో రాస్తూ..'నేను నా సోను బాయ్ని కోల్పోయా.. ఈ బాధ భరించరానిది. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దయచేసి మీకు కుక్క ఉంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించండి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. దానికి ఏదైనా సమస్య ఉన్నా అవి మనకు చెప్పలేవు. బయటకు సాధారణంగానే కనిపించేది. లోపల తీవ్రమైన సమస్య కావచ్చు. ముందస్తు పరీక్షలు మాత్రమే వాటి ప్రాణాలను కాపాడగలవు' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree)
అల్లు అర్జున్ షిఫ్ట్.. ముంబైకి కాదు.. ఎక్కడో తెలుసా?
టాలీవుడ్లో ఇప్పుడంతా అల్లు అర్జున్ టాపిక్ నడుస్తోంది. ఆయన త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. రాకా మూవీ షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటారని రాసుకొస్తున్నారు. వీటిపై అల్లు అర్జున్ తండ్రి అరవింద్ సైతం స్పందించారు. కేవలం సినిమా షూట్ కోసమే ముంబైలో ఎక్కువగా ఉంటున్నారని.. అక్కడే సెటిలయ్యే ఉద్దేశం బన్నీకి లేదని క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది. హైదరాబాద్లోని మాదాపూర్లో ప్రస్తుతం బన్నీ ఉంటున్నారు. అయితే నగరంలోనే మరో ఇంటిని ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ ఇంటికి సమీపంలోనే జూబ్లీహిల్స్లో ఓ ఖరీదైన ఇంటిని నిర్మిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ ఇంటిని దాదాపు నాలుగు వేల చదరపు అడుగుల గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ లగ్జరీ హోమ్ కోసం దాదాపు రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
క్రీడలు
‘అందుకే రోహిత్ను పక్కన పెట్టాల్సి వచ్చింది’
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అతడి సారథ్యంలోనే భారత్ గెలుచుకుంది. దిగ్గజ కెప్టెన్గా ఎదిగిన రోహిత్కు.. కెరీర్ ఆరంభంలో ఒకానొకనాడు జట్టులో చోటే కరువైంది.ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్కప్ సమయంలో సెలక్టర్లు రోహిత్ శర్మను పక్కనపెట్టారు. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాడు రోహిత్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు వెల్లడిస్తూ.. అతడిని క్షమాపణలు కోరాడు. బాధపడుతూనే ఉన్నాను‘‘ప్రతి ఇంటర్వ్యూలో తాను 2011 వరల్డ్కప్ ఆడటం మిస్సయ్యానని రోహిత్ చెబుతూ ఉన్నాడు. నిజంగా అతడి విషయంలో ఆరోజు జరిగిన దానిపట్ల నేటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. గతేడాది అతడిని కలిసి.. ‘సారీ బాస్.. ఆనాడు మేము ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు’ అని చెప్పాను.అప్పుడు మేము ఆల్రౌండ్ ప్రతిభ గల వాళ్లకే పెద్దపీట వేయాలని భావించాము. 1983 మాదిరే ఈ టోర్నీలో ఆడించాలనే ఆలోచనతో ఉన్నాము. మేము ఊహించినట్లుగానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నిలిచాడు.అందుకే రోహిత్ను పక్కనపె ట్టాల్సి వచ్చిందికొన్ని మ్యాచ్లలో హాఫ్ ఆల్రౌండర్లు కూడా రాణించారు. సెహ్వాగ్, సచిన్, సురేశ్ రైనా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశారు. యూసఫ్ పఠాన్ సైతం హాఫ్ ఆల్రౌండరే. ఈ హాఫ్ ఆల్రౌండర్ కాన్సెప్టులో పడి రోహిత్ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది.పాపం అతడికి జట్టులో చోటు దక్కలేదు. నిజానికి 2011 వరల్డ్కప్ టోర్నీలో ఆడేందుకు అతడు అర్హుడే. కానీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడిని ఎంపిక చేయలేకపోయాము’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా 2011లో ధోని సారథ్యంలో టీమిండియా టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత
సన్రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్?
ఐపీఎల్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు అదిరిపోయే వార్త అందింది. ఏప్రిల్ 25న జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బరిలోకి దిగనున్నాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తన బాధ్యతలను కమ్మిన్స్కు అప్పగించనున్నాడు.కమ్మిన్స్ వెన్ను గాయం కారణంగా ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఆడిన ఏడు మ్యాచ్లకు అందుబాటులో లేడు. అతడు ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఎస్ఆర్హెచ్ క్యాంప్లో చేరాడు. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లోనే కమ్మిన్స్ ఆడుతాడని అంతా భావించారు.కానీ కాస్త ఆసౌకర్యంగా ఉండడంతో టీమ్ సెలెక్షన్ అందుబాటులేకపోయాడు. అయితే రాజస్తాన్తో మ్యాచ్లో మాత్రం కమ్మిన్స్ ఆడడం దాదాపు ఖాయమైంది. అతడు ఇప్పటికే తన ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టాడు. కాగా కమ్మిన్స్ గైర్హజారీలో ఇషాన్ జట్టును అద్భుతంగా నడిపించాడు.అతడి కెప్టెన్సీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ నాలుగింట విజయం సాధించింది. సన్రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. కమ్మిన్స్ సారథిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా ఆకట్టుకుంటున్నాడు. కిషన్ 7 మ్యాచ్లలో 238 పరుగులు చేశాడు. అయితే కమ్మిన్స్ జట్టులోకి వచ్చినప్పటికి ఇషాన్ కిషన్నే కెప్టెన్గా కొనసాగించాలని సంజయ్ బంగర్, హార్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: ధోనికి ఆ హోదా ఇవ్వడం మొదట్లో నచ్చలేదు: మాజీ లెఫ్టినెంట్ జనరల్
సన్రైజర్స్కు వరంలా మారిన సాకిబ్ హుస్సేన్
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా పుంజుకుంది. ఆరంభ మ్యాచ్ల్లో తడబడినా, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఎస్ఆర్హెచ్ జోరు చూస్తేంటే ఈ సీజన్ టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.సీజన్ ప్రారంభంలో బౌలింగ్లో చాలా ఇబ్బంది పడిన ఈ జట్టు యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ రాకతో ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్గా మారిపోయింది. సాకిబ్ తొలి మ్యాచ్లోనే అబ్బురపరిచే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఆ మ్యాచ్లో సాకిబ్ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.అనంతరం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ సాకిబ్ సత్తా చాటాడు. 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. తాజాగా (ఏప్రిల్ 21) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సాకిబ్ మరోసారి జూలు విదిల్చాడు. 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలింగ్ చేసే 21 ఏళ్ల సకీబ్ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతూ ఎస్ఆర్హెచ్ పాలిట వరంలా మారాడు. అతను ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 6 వికెట్లు తీసి సన్రైజర్స్ గెలుపుయాత్రలో ప్రధాన భాగమయ్యాడు. సాకిబ్ ఆడిన 3 మ్యాచ్ల్లో సన్రైజర్స్ గెలిచింది. అలాగే సాకిబ్ 3 మ్యాచ్లు ఆడినా ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు. ఇదే అతన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. సకీబ్ ఇప్పటివరకు వేసిన 72 బంతుల్లో కేవలం 85 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పిసినారి బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా సకీబ్ రాక సన్రైజర్స్ ఫేట్ను మార్చేసింది. ఇతను ఇదే జోరును కొనసాగిస్తే, ఈ సీజన్లో సన్రైజర్స్ను టైటిల్ గెలవకుండా ఆపడం కష్టం.సకీబ్కు మరో యువ పేసర్ ప్రఫుల్ హింగే కూడా తోడయ్యాడు. అతను కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అతను సకీబ్ లాగా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్లో సకిబ్తో పాటు అద్భుత ప్రదర్శన (4-34) చేసిన హింగే ఆతర్వాతి మ్యాచ్లో ధారాళంగా (1-60) పరుగులు సమర్పించుకున్నాడు. సకీబ్, ప్రఫుల్ మాత్రమే కాకుండా ఈ సీజన్లో మరో ఇద్దరు సన్రైజర్స్ బౌలర్లు సత్తా చాటుతున్నారు. శ్రీలంకకు చెందిన పేసర్ ఎషాన్ మలింగ, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ అద్భుతంగా రాణిస్తూ సన్రైజర్స్ విజయాల్లో ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్కు బౌలింగే ప్రధాన సమస్యగా ఉండేది. రెగ్యులర్ కెప్టెన్, జట్టు ప్రధాన పేసర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా సగం సీజన్కు దూరమయ్యాడు. సీనియర్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇలాంటి తరుణంలో ప్రఫుల్, సకీబ్, శివాంగ్ లాంటి దేశీయ బౌలర్లు వచ్చి సన్రైజర్స్ ఫేట్నే మార్చేశారు. త్వరలో కమిన్స్ కూడా వీరికి జత కలిస్తే సన్రైజర్స్ను ఆపడం చాలా కష్టమవుతుంది. ఈ జట్టు బ్యాటింగ్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ ఈ జట్టు సొంతం. ఫీల్డింగ్లో కాస్త మెరుగుపడితే ఈ సీజన్లో సన్రైజర్స్ గెలుపు తధ్యం.
బంగ్లాదేశ్కు షాకిచ్చిన ఐసీసీ!
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. న్యూజిలాండ్తో రెండో వన్డేలో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున.. మ్యాచ్ ఫీజులో కోత విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న తొలి వన్డే జరుగగా కివీస్ గెలుపొందింది.198 పరుగులకు ఆలౌట్ఈ క్రమంలో సోమవారం రెండో వన్డే జరుగగా బంగ్లాదేశ్ జయభేరి మోగించింది. యువ పేసర్ నహీద్ రాణా (5/32) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో చెలరేగి బంగ్లాకు విజయం అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి.. 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. చెలరేగిన నహీద్ఓపెనర్ నిక్ కెల్లీ (102 బంతుల్లో 83; 14 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ టామ్ లాథమ్ (14), హెన్రీ నికోల్స్ (13), విల్ యంగ్ (2), మొహమ్మద్ అబ్బాస్ (19), డీన్ ఫోక్స్ క్రాఫ్ట్ (15), క్లార్క్సన్ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు చేరారు. తన్జిద్, షంటో హాఫ్ సెంచరీలుబంగ్లా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నహీద్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో షరీఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.3 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. తన్జిద్ హసన్ (58 బంతుల్లో 76; 10 ఫోర్లు, 4 సిక్స్లు), నజ్ముల్ హసన్ షంటో (71 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. సైఫ్ హసన్ (8), సౌమ్య సర్కార్ (8), లిటన్ దాస్ (7) విఫలమైనా... లక్ష్యం చిన్నది కావడంతో బంగ్లాదేశ్కు ఎక్కువ ఇబ్బంది కాలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో జైడన్ లెనాక్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది.ఫీజులో 10 శాతం కోతఅయితే, న్యూజిలాండ్తో రెండో వన్డేలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందున ఐసీసీ బంగ్లాకు షాకిచ్చింది. బంగ్లా జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనుందన ఈ మేరకు శిక్ష వేసింది. కాగా బంగ్లాదేశ్- న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే గురువారం జరగనుంది. చట్టోగ్రామ్ ఇందుకు వేదిక.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డుpic.twitter.com/3kSqC7iEUy 🚨 BANGLADESH WIN 🚨BAN vs NZ — 2nd ODI | Sher-e-Bangla, DhakaBangladesh chase down 199 with 6 wickets in hand!The heroes of the win:-Nahid Rana — 5 wickets, dismantled the NZ batting lineup-Tanzid Hasan Tamim — 76 off 58 balls, set the chase on…— Suresh N (@TheDugoutStats) April 20, 2026
న్యూస్ పాడ్కాస్ట్
‘ఉపాధి’పై ఇంత నిర్లక్ష్యమా?. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా... అమెరికా నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న పాపం ప్రతిపక్షాలదే... భ్రూణ హత్యతో పాపం మూటగట్టుకున్నాయి... ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
లోక్సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
బిజినెస్
అక్రమంగా అధిక ఛార్జీ వసూలు!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీ సంస్థలను దెబ్బతీసేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై యూకేలో దాఖలైన ‘క్లాస్ యాక్షన్’ దావాను విచారించేందుకు లండన్ కోర్టు పచ్చజెండా ఊపింది. ఈ కేసులో మైక్రోసాఫ్ట్ ఓడిపోతే సుమారు 1.7 బిలియన్ యూరోలు (సుమారు రూ.18,700 కోట్లు) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ఏమిటీ వివాదం?మైక్రోసాఫ్ట్ తన విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించే వ్యాపార సంస్థల నుంచి అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. తన మార్కెట్ శక్తిని ఉపయోగించుకుని ఇతర క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్లకుండా వినియోగదారులను నియంత్రించిందని హక్కుదారులు వాదిస్తున్నారు.సుమారు 59,000 బ్రిటీష్ వ్యాపార సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ దావా పరిధిలోకి వస్తాయి. లండన్లోని కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (సీఏటీ) న్యాయమూర్తులు ఈ దావాలో పిటిషన్దారుల విజయానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.నియంత్రణ సంస్థల నిఘా నీడలో..కేవలం ఈ ప్రైవేట్ దావా మాత్రమే కాకుండా యూకే యాంటీట్రస్ట్ సీఎంఏ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వ్యాపార పద్ధతులపై లోతైన దర్యాప్తు చేస్తోంది. వర్డ్, ఎక్సెల్ వంటి ప్రసిద్ధ అప్లికేషన్లతో పాటు ఏఐ ఆధారిత కోపైలట్ వంటి ఉత్పత్తుల లైసెన్సింగ్ నిబంధనలు పోటీని అణచివేస్తున్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. సీఏంఏ దర్యాప్తులో సాక్ష్యాలు మైక్రోసాఫ్ట్ తన లైసెన్సింగ్ విధానాల ద్వారా పోటీని వక్రీకరించిందని నిరూపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.మైక్రోసాఫ్ట్ వాదనఈ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ అసహనం వ్యక్తం చేసింది. కంపెనీ ప్రతినిధి బుధవారం మాట్లాడుతూ, తాము ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ రోజు వెలువడిన నిర్ణయం కంపెనీపై వస్తున్న ఆరోపణలపై తుది తీర్పు కాదని నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
మసులుతున్న భూమి.. మగ్గుతున్న ఆహార వ్యవస్థ!
ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. దాంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని, అది ఆహార ధరలను పెంచుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన రెండు కీలక సంస్థలు ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా విడుదల చేసిన ఉమ్మడి నివేదికలో హెచ్చరికలు జారీ చేశాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు ప్రపంచ ఆహార వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, దీనివల్ల వంద కోట్ల మంది ప్రజల జీవనోపాధి, ఆరోగ్యం ప్రమాదంలో పడ్డాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.గ్లోబల్ వార్మింగ్వాతావరణ మార్పుల ధాటికి పంటలు, పశువులు, మత్స్య సంపద, అడవులు విలవిలలాడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వేగవంతం కావడంతో 2025వ సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి కలిగిన మొదటి మూడు సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది.నివేదికలోని అంశాలు..ప్రధాన పంటల దిగుబడిపై ఉష్ణోగ్రత ప్రభావం తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్లు దాటితే మొక్కల ఎదుగుదల మందగిస్తుంది.ప్రపంచ సగటు ఉష్ణోగ్రతపై పెరిగే ప్రతి ఒక డిగ్రీ సెల్సియస్ మన ప్రధాన ఆహార వనరులైన మొక్కజొన్న, వరి, సోయా, గోధుమల దిగుబడిని దాదాపు 6% మేర తగ్గిస్తుంది.మొరాకో ఉదాహరణ: ఆరేళ్ల కరువు తర్వాత అక్కడ సంభవించిన వడగాల్పుల వల్ల తృణధాన్యాల దిగుబడి 40% పడిపోయింది. ఆలివ్, సిట్రస్ తోటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.సముద్రాల్లో సెగలునేల మీద మాత్రమే కాదు, సముద్ర గర్భంలోనూ వేడి సెగలు పుడుతున్నాయి. 2024లో ప్రపంచ మహాసముద్రాల్లో 91% భాగానికి పైగా కనీసం ఒక్కసారైనా మెరైన్ హీట్ వేవ్(సముద్రపు వడగాల్పులు) సంభవించింది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి చేపల నిల్వలు క్షీణిస్తున్నాయి. ఇది మత్స్యకారుల పాలిట శాపంగా మారుతోంది.పరిష్కారం ఏమిటి?వాతావరణ మార్పుల సమాచారాన్ని నేరుగా రైతుల చేతుల్లోకి (మొబైల్స్ ద్వారా) చేరవేయాలి. తద్వారా పంటలు వేసే సమయాన్ని, కోత సమయాన్ని సర్దుబాటు చేసుకోగలరు.ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు.కేవలం తాత్కాలిక సర్దుబాట్లు సరిపోవని, గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నివేదిక నొక్కి చెప్పింది.అన్నదాత ఆవేదన, ప్రకృతి ఆగ్రహం కలిసి ప్రపంచ ఆహార భద్రతను అంచుకు నెట్టేస్తున్నాయి. మనం ఇప్పుడే మేల్కొని పర్యావరణ హితమైన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఆహార కొరత తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరికల సారాంశం.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
కియోసాకి కొత్త వార్నింగ్.. ఈవీలపై కీలక కామెంట్స్
ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ఆర్థిక విషయాలపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే రాబర్ట్ కియోసాకి.. మరోసారి ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుత ప్రపంచ గందరగోళ పరిస్థితులపై ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.ప్రపంచం పిచ్చెక్కిపోతోంది!ప్రస్తుత గ్లోబల్ మార్కెట్, ఆర్థిక అనిశ్చితిని ఉద్దేశిస్తూ... "ఈ ప్రపంచం పిచ్చెక్కిపోతోంది" (The World is Nuts) అంటూ కియోసాకి వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, ద్రవ్యోల్బణం లేదా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.ఈవీపై ఆసక్తికర వ్యాఖ్యఇదే క్రమంలో తన వద్ద ఉన్న వాహనాల గురించి ప్రస్తావిస్తూ.. "నా దగ్గర ఉన్న కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అయినందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు. సాంప్రదాయ ఇంధన ధరల పెరుగుదల లేదా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన పరోక్షంగా వెల్లడించారు.రాబర్ట్ కియోసాకి వద్ద ఫెరారీ, రోల్స్-రాయిస్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అయితే ఈ కార్ల కోసం వ్యక్తిగత ఆదాయాన్ని ఉపయోగించకూడదని, ఆస్తుల నుండి వచ్చే ఆదాయంలో ఖర్చులన్నీ పోయాక మాత్రమే విలాసవంతమైన కార్లను కొనాలని ఆయన సూచిస్తారు.ఎప్పుడూ బంగారం, వెండి, బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని సూచించే కియోసాకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై పాజిటివ్గా స్పందించడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని గత కొంతకాలంగా ఆయన హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.THE WORLD IS NUTS: Glad one of my cars is an EV.— Robert Kiyosaki (@theRealKiyosaki) April 22, 2026
ఓఎన్జీసీ ‘జాక్-అప్ రిగ్’ టెండర్ రద్దు!
ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్జీసీ సముద్ర గర్భంలో చమురు అన్వేషణ కోసం నిర్వహించిన జాక్-అప్ రిగ్(సముద్ర తీర ప్రాంతాల్లో చమురు బావులను తవ్వడానికి ఉపయోగించే తేలియాడే ప్లాట్ఫామ్) టెండర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బిడ్డింగ్ ప్రక్రియలో ధరల అసాధారణ పెరుగుదల, గుత్తాధిపత్య ధోరణులు కనిపిస్తున్నాయనే అనుమానాల నేపథ్యంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.ధరల పెరుగుదలపై అనుమానాలుఈ టెండర్ ప్రక్రియను నిశితంగా పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని ఓఎన్జీసీ తెలిపింది. ‘కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే బిడ్డింగ్ ధరలు సుమారు 60% మేర పెరిగాయి. గతంలో రోజుకు 35,606 డాలర్లుగా ఉన్న రేటు తాజా బిడ్డింగ్లో ఏకంగా 56,195 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, అంచనాలతో పోల్చి చూస్తే ఈ స్థాయి పెరుగుదల ఏమాత్రం సహేతుకం కాదని, ఇది ఆరోగ్యకరమైన పోటీ మార్కెట్ పరిమితులను మించి ఉందని సంస్థ స్పష్టం చేసింది.కుట్ర కోణంపై ఆందోళనటెండర్లలో పాల్గొన్న సంస్థల మధ్య కుట్ర పద్ధతులు ఉండవచ్చనే ఓఎన్జీసీ ఆందోళన వ్యక్తం చేసింది. బిడ్ల నమూనాను విశ్లేషించగా సంస్థల మధ్య రహస్య ఒప్పందాలు ఉండవచ్చని, తద్వారా కృత్రిమంగా ధరలను పెంచే ప్రయత్నం జరిగిందని సంస్థ భావిస్తోంది. ‘ప్రజా సేకరణ నిబంధనలకు కట్టుబడి ఉండటం, ప్రభుత్వ నిధులను వివేకవంతంగా వినియోగించడం మా బాధ్యత. ఈ టెండర్ ప్రక్రియలో సమగ్రత లోపించిందని భావించినందుకే రద్దు నిర్ణయం తీసుకున్నాం’ అని ఓఎన్జీసీ అధికారిక ప్రకటనలో తెలిపింది.పారదర్శకతకే ప్రాధాన్యతమీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన ఓఎన్జీసీ తమ నిర్ణయం పూర్తిగా సంస్థాగత ప్రయోజనాలు, పారదర్శకతపై ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. ‘ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి బాహ్య ఒత్తిళ్లు లేవు. ప్రభుత్వ సేకరణ సూత్రాలను కచ్చితంగా పాటిస్తూ అక్రమాలకు తావులేకుండా చూడటమే లక్ష్యం. పరిశ్రమలో గుత్తాధిపత్యాన్ని లేదా సిండికేట్గా ఏర్పడి ధరలను శాసించే ధోరణులను అడ్డుకుంటాం’ అని కంపెనీ తెలిపింది.భవిష్యత్తు కార్యాచరణపరిశ్రమ వర్గాలతో పారదర్శకమైన, నిర్మాణాత్మకమైన సంబంధాలను కొనసాగిస్తామని ఓఎన్జీసీ తెలిపింది. భవిష్యత్తులో నిర్వహించే బిడ్ల సేకరణ ప్రక్రియల్లో న్యాయమైన, పోటీతత్వంతో కూడిన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని తద్వారా ప్రాజెక్టుల వ్యయం పెరగకుండా జాగ్రత్త పడతామని సీనియర్ అధికారులు వెల్లడించారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
ఫ్యామిలీ
బహుభాషావేత్త... సోలో ట్రావెలర్ అందం బహుముఖం
ముప్పై రాష్ట్రాల అందాల ప్రతినిధులతో భువనేశ్వర్లో జరిగిన ‘మిస్ ఇండియా వరల్డ్ 2026’ పోటీలో విజేతగా నిలిచిన గోవా అమ్మాయి సాధ్వీ సతీష్ విశేషాలు తెలుసుకునేకొద్దీ ఆశ్చర్యపోతున్నారు అంతా. ఆమె రెండు చేతులతోనూ రాస్తుంది. చాలా స్పీడ్గా కారు నడుపుతుంది. ఏడు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. కెనెడాలో ఎకనామిక్స్ చదివి సోలో ట్రావెలర్గా దేశాలు తిరుగుతుంది. ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలిచి, గోవా ఘనతను చాటింది. ఈ కాలపు అమ్మాయంటే సాధ్వీ సతీషే.‘చిన్నప్పటి నుంచి నేను కొంచెం తేడా. నలుగురితో పెద్దగా కలిసే దాన్ని కాదు. చిన్నప్పుడు ఖాళీ టైమ్ దొరికితే రెండు చేతులతో ఒకేసారి రాయడం ప్రాక్టీసు చేసేదాన్ని’ అంటోంది గోవా అందాల బరిణె సాధ్వీ సతీష్. గోవా ఇసుక తీరాల్లో ఆడుకున్న ఈ అమ్మాయి ‘మిస్ ఇండియా 2026 వరల్డ్’ టైటిల్ గెలుచుకొని 2027లో జరగనున్న ‘మిస్ వరల్డ్’ పోటీలలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.→ మొదటి గోవా అమ్మాయిభువనేశ్వర్లోని ‘కె.ఐ.ఐ.టి. విశ్వవిద్యాలయం’లో ఏప్రిల్ 18న వైభవంగా జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026’ ఫైనల్స్లో 25 ఏళ్ల సాధ్వీ సతీష్ విజేతగా గెలిస్తే, మొదటి రన్నరప్గా మహారాష్ట్రకు చెందిన రజ్నందిని పవార్, రెండో రన్నరప్గా జమ్మూ కశ్మీర్కు చెందిన శ్రీఅద్వైత నిలిచారు. న్యాయనిర్ణేతలుగా జీనత్ అమన్, నేహా ధూపియా, మధుర్ భండార్కర్, ఒలింపిక్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. సాధ్వీ సతీష్ ఈ టైటిల్ను గెలవడం వల్ల ‘మిస్ వరల్డ్’కు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న తోలి గోవా అమ్మాయి అయ్యింది. స్వాధ్వీ సతీష్ కర్ణాటకలోని కార్వార్లో పుట్టినా తను పెరిగిన గోవానే∙ఊపిరిగా భావిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి గోవా సంస్కృతి, సముద్రం ఇష్టం. బెంగళూరులోని అమృత విద్యాలయంలో చదివి, ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డబుల్ మేజర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్లో ప్రవేశించి అందాల పోటీ వరకూ ఎదిగింది.→ నాన్న ప్రోత్సాహంఅమ్మా నాన్నల ప్రోత్సాహం లేకుండా పిల్లలకు ఏ విజయమూ సిద్ధించదు. సాధ్వీ సతీష్ విజయం వెనుక తండ్రి సతీష్ కృష్ణ సెయిల్, తల్లి ప్రియాంక సెయిల్ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి సతీష్ కూతురి కలలకు రెక్కలు తొడిగిన వ్యక్తి. ‘ఆడపిల్ల అయినా ప్రపంచం చుట్టి రావాలి’ అని కెనడా చదువుకు, సోలో ట్రావెలింగ్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లి ప్రియాంక గోవా సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను సాధ్వీలో నింపింది. ‘నాన్న నన్ను ఆకాశానికి ఎగిరేలా చేశారు. అమ్మ నా కాళ్లు నేల మీద ఉంచింది. మిస్ ఇండియా కిరీటం నాది కాదు, మా అమ్మా నాన్నలది’ అంది సాధ్వీ.→ సోలో ట్రావెలర్‘కెనెడాలో చదువు పూర్తయ్యాక మెక్సికోకు మొదటి సోలో ట్రావెల్ చేశాను’ అని తెలిపింది సా«ధ్వీ. లోకం చూడటానికి ఇష్టపడే సాధ్వీ మూడేళ్లలో పది దేశాలు ఒంటరిగా తిరిగింది. కొత్త సంస్కృతులు, కొత్త మనుషులు, కొత్త సవాళ్లు అన్నింటినీ ఆహ్వానించింది. ఈ ప్రయాణాలే తనకు స్వతంత్రంగా ఆలోచించడం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పాయి అంటుందామె. మరో విశేషం ఏమిటంటే సాధ్వీకి తేనెటీగలంటే విపరీతమైన భయం. ఫోబియా. ఆ ఫోబియాను జయించడానికి సర్టిఫైడ్ బీకీపర్గా శిక్షణ తీసుకుంది. భయాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే.→ బ్యూటీ విత్ ఏ పర్పస్మిస్ ఇండియా పోటీకి కేవలం మూడు నెలల ముందే సిద్ధమైన సాధ్వీ క్రమశిక్షణతో పది కిలోలకు పైగా బరువు తగ్గి ‘టాప్ 5 బెస్ట్ బాడీ’లో నిలిచింది. తర్వాత కిరీటం గెలుచుకుంది. కానీ ఆమె లక్ష్యం కిరీటం కంటే పెద్దది. వినికిడి, మాటల లోపం ఉన్న పిల్లలకు మెరుగైన పోషకాహారం, సమాన అవకాశాలు కల్పించడం ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్. టాంజానియా వేదిక కానున్న ‘మిస్ వరల్డ్ 2027’ పోటీలో భారత్ తరపున ఇలాగే విజయం సాధించాలని కోరుకుందాం.
పాపులర్ వెయిట్ లాస్ మందులు, షాకింగ్ స్టడీ
జనాదరణ పొందిన బరువు తగ్గించే మందుల వల్ల కండరాలు మరింత క్షీణించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి (UNC) చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బరువు తగ్గడానికి ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన సెమాగ్లుటైడ్ (Semaglutide) మరియు తిర్జెపాటైడ్ (Tirzepatide) వంటి ఇంక్రిటిన్ ఆధారిత మందుల వల్ల ఆశించిన దానికంటే ఎక్కువగా కండరాల క్షీణత (Muscle Loss) జరుగుతున్నట్లు ఈ పరిశోధన తేల్చింది.ఈ మందులు టైప్ 2 డయాబెటిస్ , ఊబకాయం తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, కండరాల నష్టం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో, బరువు తగ్గే ఇంక్రిటిన్ ఆధారిత మందుల వల్ల, ఊహించిన దానికంటే ఎక్కువ కండరాల క్షీణతకు దారితీస్తుందని తేలింది. ఈ అధ్యయనం 'అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' అనే జర్నల్లో ప్రచురితమైనాయి. దీనికి యూఎన్సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు యూఎన్సీ గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఊబకాయం మరియు పోషణ నిపుణుడైన డాక్టర్ జాన్ ఎ. బాట్సిస్ నాయకత్వం వహించారు.ఈ అధ్యయనం ప్రకారం ఈ మందులు వాడుతున్న వారిలో తగ్గుతున్న మొత్తం బరువులో దాదాపు 35శాతం కండరాలకు సంబంధించిందే అని తేలింది. సాధారణంగా ఆహార నియమాల ద్వారా బరువు తగ్గితే కండరాల నష్టం 2-10శాతం మాత్రమే ఉంటుంది, కానీ ఈ మందుల వల్ల అది చాలా ఎక్కువగా ఉంది.ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్, ఎవరీ దుర్గా శక్తి?కండరాల నష్టం ఎందుకు జరుగుతుంది?మనం కేలరీలను తక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి కోసం కండరాల ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ కొత్త మందులు ఆకలిని 16-39% వరకు తగ్గిస్తాయి. దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు, కానీ తగినంత వ్యాయామం (Resistance training) లేకపోతే కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోతాయి.ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకికండరాల క్షీణత, నష్టాలుమెటబాలిజం మందగిస్తుంది. కండరాలు విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను ఖర్చు చేస్తాయి. అవి తగ్గితే మెటబాలిక్ రేటు తగ్గి, భవిష్యత్తులో బరువు పెరగడం సులభం అవుతుంది. అలాగే దైనందిన పనులు (మెట్లు ఎక్కడం, బరువులు మోయడం) చేసుకోవడం కష్టమవుతుంది. త్వరగా అలసట వస్తుంది. కండరాలు బలహీనపడితే శరీర సమతుల్యత దెబ్బతిని, కింద పడటం మరియు ఎముకలు విరగడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. రికవరీ ఆలస్యమవుతుంది. గాయాలు త్వరగా మానవు. వ్యాయామం తర్వాత వచ్చే నొప్పులు ఎక్కువ కాలం వేధిస్తాయి. ముఖ్యంగా వృద్ధులలోఈ ప్రమాదం ఎక్కువ అని తేల్చారు. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇది మరింత ప్రమాదకరం. ఇది వారిని ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది.ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూతదీన్ని ఎలా అరికట్టవచ్చుబరువు తగ్గే ప్రక్రియలో కండరాలను కాపాడుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు కండరాల మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్లను అధికంగా తీసుకోవాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవసరం. అంటే బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల కండరాల సాంద్రత పెరిగి, అవి కరిగిపోకుండా ఉంటాయి. బరువు తగ్గే క్రమంలో కేవలం మెషిన్ మీద అంకెలను మాత్రమే కాకుండా, శరీరంలోని 'లీన్ మాస్'ఎంత ఉందో నిరంతరం గమనిస్తూ ఉండాలి.
అత్తారింట్లో కూతురి నిర్వాకం..చితకబాదిన అమ్మ
ఇటీవల కాలంలో కోడళ్లు ఎలా ఉంటున్నారో తెలిసిందే. ఆధునిక కాలం అత్తలకు కోడళ్లు దడవడం లేదు. కోడళ్లే అత్తలను భయపెట్టే రేంజ్లో ఉంటున్నారు. పైగా ఏ మాత్రం తేడా వచ్చినా..వేరు కాపురం, ఆస్తులు కావాలని డిమాండ్ ఒకటి కాదు..రెండు కాదు ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. అత్తలకు భయపడే కోడళ్ల కాలం చెల్లినదిగా మారిపోయింది. అంత వరకు ఓకేగానీ కనీసం అత్తమామలను స్నేహితుల్లా లేదా సాటి మనిషిగా చూడకుండా నానాయాతను పెడుతున్నారు నేటితరం కొందరు కోడళ్లు. దానికి పుట్టింటివాళ్లు వత్తాసు పలికి పెళ్లిని మూణ్ణాళ్ల ముచ్చటలా మార్చేస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి కాలంలో నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఘటన అత్యంత అరుదైనది , రికార్డు ఘటనగా చెప్పొచ్చు.ఇంతకీ ఏం జరిగిందంటే..కోడలు తన అత్తమామల కోసం వంట చేయలేదు. ఆ విషయం తెలుసుకున్న తల్లి అక్కడకు చేరుకుని నేరుగా కూతరు వద్దకు పోయి చితకబాదింది. అంతేగాదు అత్తమామలకు భోజనం వడ్డించమని ఆదేశించింది. ఇటీవలకాలంలో ఇది అత్యంత అరుదైన ఘటన అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.The daughter in-law did not cook food for her in- laws. Her mother arrived at the scene, gave her daughter a thrashing, and immediately instructed her to serve her in lawsThis is rarest of rare case in India in recent history, you know what i mean. pic.twitter.com/5h1VdYtYh1— Woke Eminent (@WokePandemic) April 19, 2026 (చదవండి: కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్చేస్తే..)
కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్చేస్తే..
చదివే అవకాశంలోని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా..వెనకడుగు వేయలేదు. ఫీజు చెల్లించే పరిస్థితి లేకపోయినా..కూరగాయలు అమ్ముతూ చదువు సాగించాడు. అలా దేశ సేవ చేయాలని ఆర్మీలో చేరాడు. రిటైర్ అయ్యాక కూడా చదవాలనే కోరికను కొనసాగించాడు. ఆ ఆసక్తితో ఎన్ని డిగ్రీలు పూర్తి చేశాడో తెలిస్తే విస్తుపోతారు. పైగా అన్ని డిగ్రీలు పూర్తి చేసి ఎన్ని రికార్డులు నెలకొల్పాడో తెలిస్తే 'జయహో సైనికుడా' అని ప్రశంసించకుండా ఉండలేరు.అతడే రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లాలోని ఖిరోడ్ గ్రామానికి చెందిన దశరథ్ సింగ్. తన కుటుంబంలో అంతగా విద్యకు ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఎందుకంటే పూటగడవడమే కష్టం కావడంతో ఆ ఆలోచనే వచ్చేది కాదు. అయినా సరే ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ చదువు సాగించాడు. కానీ కాలేజీ చదువులకు ఫీజులు చెల్లించలేక స్వస్తి పలకాల్సి వచ్చింది. అయినా కూడా ఆశను వదులకోలేదు. పొలంలో పండిన కూరగాయలు అమ్మేందుకు ఏకంగా 13 కిలోమీటర్లు నడిచి మరి చదువుకి నిధులు సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరి పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో పోస్టింగ్తో సహా 16 ఏళ్లు పనిచేశాడు. సర్వీస్లో ఉన్నప్పుడు కూడా తన వార్షిక సెలవులను చదువు కోసం ఉపయోగించేవాడు. సైనిక విధులతో పాటు నిశ్శబ్దంగా బలమైన విద్యా పునాదిని నిర్మిచుకున్నాడు దశరథ్ సింగ్. ఇక 2004లో పదవీ విరమణతో సింగ్ తన చిరకాల ఆశయం నిజం చేసుకునే దిశగా అడుగులు వేసి..ఎవ్వరూ ఊహించన విధంగా వందలకొద్దీ డిగ్రీలు పూర్తి చేశాడు. మొత్తం తన జీవితాన్ని చదువుకే అంకితం చేశాడు. సుమారు 138 డిగ్రీలు పూర్తి చేశాడు. తన విద్యా విజయాలు కారణంగా మొత్తం 11 ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి సంస్థల నుంచి గుర్తింపు పొందాడు. వీటిలో చాలామటుకు డిగ్రీలు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వంటి గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేశారు. చదవడానికి వయసుతో సంబంధం లేదని నిరంతర కృషి, అచంచలమైన పట్టుదల ఉంటే..నిరంతరాయంగా కొనసాగించవచ్చు అనడానికి ఈ మాజీ సైనికుడే ఉదాహరణ. (చదవండి: ఆలయాన్ని తలపించే కేఫ్..! ఏకంగా ప్రపంచంలోనే..)
అంతర్జాతీయం
Earth Day 2026: అవని అంతం?.. మోగిన ‘కోడ్ రెడ్’!
‘మనమంతా పేలడానికి సిద్ధంగా ఉన్న పర్యావరణ టైమ్ బాంబ్ మీద కూర్చున్నాం’.. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న మంచు పలకలు, అంతుచిక్కని ప్రకృతి వైపరీత్యాలు.. ఇవన్నీ భూమి మనకు పంపుతున్న ఆఖరి హెచ్చరికలు. ఈ విపత్తు నుంచి మన గ్రహాన్ని కాపాడుకునేందుకు మనకు మిగిలి ఉన్న సమయం చాలా తక్కువని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎర్త్ డే’ ప్రాముఖ్యతను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత.‘సమితి’ తీవ్ర హెచ్చరికలివే..ఈరోజు ఏప్రిల్ 22, 2026.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే నేడు ధరిత్రీ దినోత్సవం (ఎర్త్ డే) జరుపుకుంటున్నాం. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, భయపెడుతున్న గ్లోబల్ వార్మింగ్ పరిణామాల నేపథ్యంలో మానవాళికి ఐక్యరాజ్యసమితి ‘కోడ్ రెడ్’ హెచ్చరికలు జారీ చేసింది. దీని అర్థం తక్షణమే గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను.. అంటే భూ వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులను తగ్గించాలి. పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో పర్యావరణం కోలుకోలేని స్థితికి చేరుకుంటుందని సమితి హెచ్చరించింది.మన చేతుల్లోనే పరిష్కారంఇలాంటి విపత్కర సమయంలో, ఈ భూమిని కాపాడుకునే అపారమైన శక్తి మనందరి చేతుల్లోనే ఉందనే వాస్తవాన్ని ఈ ఎర్త్ డే మనకు గుర్తుచేస్తోంది. 1970లో ఒక చిన్న పర్యావరణ నిరసనగా మొదలైన ఈ కార్యక్రమం, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి పైగా ప్రజలను ఏకం చేసే ఒక మహా ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ తీవ్ర సంక్షోభం నుంచి మన గ్రహాన్ని రక్షించుకోవడానికి మనం ఆచరించాల్సిన మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పర్యావరణ పోరాటం1970ల నాటి రోజుల్లో స్వచ్ఛమైన గాలి (క్లీన్ ఎయిర్ యాక్ట్), నీరు (క్లీన్ వాటర్ యాక్ట్) కోసం ఎలాంటి చట్టాలు, పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీలు ఏవీ లేవు. అయితే 1962లో రాచెల్ కార్సన్ రచించిన ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకం రసాయనాల వల్ల జరిగే అనర్థాలను తెలియజేసింది. 1969లో కుయహోగా నదిలో చమురు లీకై చెలరేగిన మంటలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ పరిణామాలతో పర్యావరణవేత్త, నాటి అమెరికా సెనేటర్ గేలార్డ్ నెల్సన్ వియత్నాం యుద్ధ వ్యతిరేక నిరసనల స్ఫూర్తితో ఏప్రిల్ 22, 1970న తొలి ‘ఎర్త్ డే’కు శ్రీకారం చుట్టారు.ఒక మహా ఉద్యమంలా మారిందిలా..ఆ ఒక్క రోజే దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు (నాటి జనాభాలో 10%) స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి చరిత్ర సృష్టించారు. నాటి ఆ సంచలన స్పందన నేడు 192 దేశాల్లో, 1,50,000 కు పైగా భాగస్వామ్య సంస్థలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమంగా మారింది. అయితే, ప్రస్తుత పరిస్థితులు మరింత విషమంగా ఉన్నాయని, ప్రపంచ పర్యావరణ సంస్థలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమిష్టిగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని 60 ఏళ్లుగా చింపాంజీలపై పరిశోధనలు చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జేన్ గూడాల్ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.2026 థీమ్: ‘మన శక్తి, మన గ్రహం’ఈ ఏడాది 2026 ఎర్త్ డే అధికారిక థీమ్ (ఇతివృత్తం) - ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ (మన శక్తి, మన గ్రహం). ఈ నినాదం ఒక స్పష్టమైన, అత్యంత శక్తివంతమైన వాస్తవాన్ని తెలియజేస్తోంది. పర్యావరణంలో ఆశించిన మార్పు కేవలం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై మాత్రమే ఆధారపడి లేదు.. అది సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో తీసుకునే చర్యల ద్వారానే సాధ్యమవుతుందని ఈ థీమ్ నొక్కి చెబుతోంది. సమిష్టి కృషిని ఈ క్యాంపెయిన్ ప్రోత్సహిస్తోంది. పాఠశాలలు, వ్యాపార సంస్థలు, కమ్యూనిటీలు, ప్రతి పౌరుడు తాము నివసిస్తున్న పరిసరాల పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆచరణాత్మకమైన అడుగులు వేయాలని ఈ 2026 ఎర్త్ డే థీమ్ ప్రపంచానికి పిలుపునిస్తోంది.ధరిత్రిని కాపాడే బాధ్యత అందరిదీ..భూమిని రక్షించే ఈ మహా కార్యక్రమంలో సామాన్యులు సైతం పాలుపంచుకోవడం చాలా సులభం. EARTHDAY.ORG అధికారిక వెబ్సైట్ ద్వారా ఎవరైనా వాలంటీర్గా తమపేరు నమోదు చేసుకోవచ్చు లేదా మీ స్వంతంగా ఒక ఎర్త్ డే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) కూడా ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక అద్భుతమైన ‘ఎర్త్ డే టూల్కిట్’ను రూపొందించింది. ఇందులో ఏదైనా కమ్యూనిటీలో లేదా ఇంటి వద్దే సులభంగా చేయగలిగే ఎన్నో కార్యకలాపాలు ఉన్నాయి. అలాగే ‘ది ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్’ సూచనల ప్రకారం పరాగసంపర్కం చేసే తేనెటీగలు, సీతాకోకచిలుకలను ఆకర్షించేలా పూల మొక్కలు పెంచడం, ఇంటి తోటల్లో హానికరమైన రసాయన పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయడం, నీటి వినియోగాన్ని పొదుపుగా నిర్వహించడం వంటి 10 రకాల చిన్నపాటి రోజువారీ మార్పుల ద్వారా కూడా ఈ పర్యావరణ యజ్ఞంలో భాగస్వములు కావచ్చు. ఇది కూడా చదవండి: 51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ముస్తాబు
గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్తో శాంతి చర్చలు కోసం తపిస్తున్నారు. యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ ఎలాగైనా దానిని ముగించే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సీజ్ఫైర్ని మరోసారి పొడిగిస్తూ ప్రకటన చేశారు. ఇరాన్తో ఏకీకృత ఒప్పందం వచ్చే వరకూ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్స్ మరోసారి గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై దాడి చేయడానికి అమెరికాకు సహకరిస్తే చమురు ఉత్పత్తి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాలు సీజ్ఫైర్ ఒప్పందాన్ని పాటిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం గల్ఫ్ దేశాల పాలిట శాపంగా మారింది. అమెరికా ఎయిర్బేస్లకు సహకరిస్తున్నారని నెపంతో ఇరాన్ గల్ఫ్ దేశాల టార్గెట్గా దాడులు జరిపింది. అయితే ప్రస్తుతం సీజ్ఫైర్ నడుస్తున్న నేపథ్యంలో అమెరికా గల్ఫ్ దేశాల్లోని తన స్థావరాలను మరింత బలోపేతం చేస్తుందేమోనని ఇరాన్ అనుమానిస్తోంది. దీంతో ఆ దేశాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో "ఇరాన్ దేశంపై దాడి చేయడానికి శత్రువుల పక్కన చేరి దేశ భూభాగాన్ని, సౌకర్యాలని వారు ఉపయోగించుకునేలా సహకరిస్తే దక్షిణ పొరుగు దేశాలు చమురు ఉత్పత్తికి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుందని తెలుసుకోవాలి " అని గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజీద్ మౌసావి పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి.అయితే ఇది వరకూ యుద్ధంలో ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ స్థావరాలే లక్షంగా దాడి చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ (UAE), కువైట్, బహ్రెయిన్, ఖతార్లలోని చమురు నిల్వ ఉంచిన డిపోలు, రిఫైనరీలు, మరియు గ్యాస్ ఫెసిలిటీలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్నింగ్ ఇచ్చింది.
కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని తెలిపారు.ఇరాన్ తమతో ఏకీకృత ఒప్పందానికి వచ్చే వరకు, శాంతి చర్చలు ముగిసేవరకు కాల్పుల విమరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ల నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతో కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ల అభ్యర్థన మేరకు ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు, చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం యాథావిధిగా ఉంటుంది. ఇప్పటికే దీనిపై అప్రమత్తంగా ఉండాలని మా సైన్యాన్ని ఆదేశించాను’ అని తెలిపారు. అయితే ఇస్లామాబాద్లో ఏర్పాటు చేసిన రెండో విడత శాంతి చర్చలకు వచ్చేందుకు ఇరాన్ విముఖత చూపడంతో ట్రంప్ మంగళవారం సీఎన్బీసీ ‘స్వాక్బాక్స్’ కార్యక్రమంలో ఇరాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘ఇరాన్ మాతో ఒప్పందానికి రావడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం.కాల్పుల విరమణ గడువు పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారంతో ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ గడువు ముగియనుంది. అయితే ఇంతలో ట్రంప్ కాల్పుల విరమణపై యూటర్న్ తీసుకోవడంతో కొంతమేర ఉపశమనం లభించినట్లయింది.ఫలించిన పాక్ ప్రయత్నం..హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన దౌత్యప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఒక మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్కు హితబోధ చేస్తోంది. కనీసం కాల్పుల విరమణ గడువును అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పాక్ అభ్యర్థనపై ఒక అడుగు ముందుకేసి కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు.
కెనడా కొత్త నిబంధనలు.. భారతీయులకు షాక్!
కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. అక్కడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'బిల్ సి-12' చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల కెనడాలో స్థిరపడాలని చూస్తున్న వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే బిల్ సి-12 భారతీయులకు షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతీయుల్లో చాలా మంది అమెరికా తర్వాత అత్యంత ఎక్కువగా వెళ్లే దేశం కెనడానే. కొత్త నిబంధనల ప్రకారం.. కెనడాలోకి ప్రవేశించిన ఒక ఏడాది లోపు మాత్రమే రిఫ్యూజీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ గడువు దాటితే దరఖాస్తును స్వీకరించరు. గతంలో ఏండ్లు గడిచినా పీఆర్ రాకపోతే చివరి అవకాశంగా రిఫ్యూజీ క్లెయిమ్ చేసేవారు. ఇకపై అది సాధ్యపడదు. ఈ చట్టం కేవలం కొత్తవారికి మాత్రమే కాదు, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సుమారు 19వేల దరఖాస్తులపై కూడా ప్రభావం చూపనుంది. దీనివల్ల వేల సంఖ్యలో భారతీయ దరఖాస్తుదారులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కెనడా ప్రభుత్వం ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తినో కాకుండా, ఒకేసారి పెద్ద సంఖ్యలో వీసాలను లేదా ఇమ్మిగ్రేషన్ పత్రాలను రద్దు చేసే అధికారాన్ని పొందింది. దీని కోసం ప్రతి కేసును విడివిడిగా విచారించాల్సిన అవసరం లేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది. శరణార్థుల దరఖాస్తుల విచారణను వేగవంతం చేయడం, ఇతర దేశాలతో సమాచారాన్ని పంచుకోవడం ఈ చట్టంతో సులభతరం అవుతుంది. అయితే మానవ హక్కుల సంఘాలు, ఇమ్మిగ్రేషన్ లాయర్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు దీనిని శరణార్థుల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటున్నాయి. సరైన విచారణ లేకుండానే వీసాలు రద్దు చేయడం వల్ల విదేశీయులను బలవంతంగా వెనక్కి పంపే ముప్పు పెరుగుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కెనడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి ఇది అవసరమని ప్రభుత్వం చెబుతోంది. మోసపూరిత దరఖాస్తులను అడ్డుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. కెనడాలో భారతీయ విద్యార్థులు, వర్క్ పర్మిట్ హోల్డర్లు లక్షల్లో ఉన్నారు. పీఆర్ దక్కని వారు చాలామంది రిఫ్యూజీ దరఖాస్తుల మీద ఆధారపడుతుంటారు. కొత్త చట్టం వల్ల పాత కేసులు రీ-ఓపెన్ అవ్వడం లేదా వేగంగా తిరస్కరణకు గురవ్వడం జరిగితే.. భారతీయులు పెద్ద సంఖ్యలో డిపోర్టేషన్ ఎదుర్కొనే అవకాశాలున్నాయి.
జాతీయం
తమిళనాడు అభ్యర్థులు.. వందలమందిపై క్రిమినల్ కేసులు
తమిళనాడులో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారం పూర్తి చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో దాదాపు 404 మందికి పైగా అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని నివేదిక తెలిపింది.తమిళనాడు ఎన్నికలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, టీన్యూ ప్రకటించిన సర్వే వివరాలు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మెుత్తంగా 4,023 మంది ఉండగా వారిలో 3,992 మంది అఫిడవిట్లు పరిశీలించబడ్డాయి. అందులో తీవ్రమైన కేసులు ఉన్నవారు 404 మందిపై తీవ్రమైన కేసులున్నట్లు తేలింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అయ్యిందని నివేదిక పేర్కొంది.722 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వీరిలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. . వీరిలో దాదాపు 18% అభ్యర్థులు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించకపోవడం వల్ల టికెట్లు పొందినట్లు తెలిపింది. 58% స్థానాల్లో వివిధ అభ్యర్థులు క్రిమినల్ కేసులు కలిగి ఉండటంతో వాటిని ఆయా నియోజకవర్గాలను 'రెడ్ అలర్ట్'గా గుర్తించారు. ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 3,992 మంది అభ్యర్థుల ప్రకటించిన ఆస్తుల విలువ రూ. 20,678 కోట్లు. అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ మూడు రెట్లు పెరిగి రూ. 5.17 కోట్లకు చేరుకుంది. వీరిలో ఇది వరకే 981 మంది కోటీశ్వరులని తెలిపారు. మరి కొంతమందికైతే ఏకంగా వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారుఅత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థుల జాబితాAIADMK అభ్యర్థి లీమా రోజ్ మార్టిన్ – ₹5,863 కోట్లు.TVK నాయకుడు సి. జోసెఫ్ విజయ్ – ₹648 కోట్లు.TVK అభ్యర్థి ఆథవ్ అర్జున – ₹534 కోట్లు. ఎన్నికల ఎదుట ఈ నివేదిక ప్రజలను కొంత ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రేమ.. ఎంత పని చేసింది?
ప్రేమలో అనుమానం ఎంత ఘోర పరిణామానికి దారి తీస్తుందో తెలియజేసే ఘటనే ఇది. ఓ యువతి తన ప్రియుడ్ని ఇంటికి పిలిచి ఘాతుకానికి పాల్పడింది. తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో అతన్ని సజీవదహనం చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం అసలు వివరాల్లోకి వెళ్తే.. ప్రేరణ, కిరణ్ ఇద్దరూ ఓ టెలికాం స్టోర్లో జాబ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా. అయితే కొంత కాలంగా అతను ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని.. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె అనుమానించింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించింది. మంగళవారం దక్షిణ బెంగళూరులో ఉన్న తన ఇంటికి రావాలంటూ పిలిచింది. వెరైటీ ప్రపోజ్ ప్లాన్ గురించి చెప్పింది. దానికి తొలుత అతను ఒప్పుకోలేదు. అయితే ఫారిన్లో ఇదంతా కామన్ అని బలవంతం చేసేసరికి సరే అన్నాడు. కిరణ్ను ఓ కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది. కళ్లకు గంతలు కట్టేసింది. అతను నిజంగానే ఆమె ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతోందని ఆశపడ్డాడు. కానీ.. ఇంట్లో అప్పటికే దాచిన కిరోసిన్ను తెచ్చి అతని మీద పోసి నిప్పంటించి దూరం నుంచి ఫోన్లో వీడియో తీయసాగింది. కిరణ్ ఆరుపులు విని స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే అతను మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో.. తనను పెళ్లి చేసుకోడనే అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియోను ఆమె ఫోన్ నుంచి స్వాధీనపర్చుకున్నారు. కిరణ్-ప్రేరణల మధ్య స్నేహం గురించి తమకు తెలుసని.. వాళ్లు ఒప్పుకుంటే వివాహం కూడా జరిపించాలని తాము భావించామని ఇరువైపులా పెద్దలు చెబుతున్నారు. ప్రేమ అనేది నమ్మకం.. కానీ అనుమానం ప్రాణాలు తీసింది అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు.
‘తలొంచం.. తరిమికొడతాం’: ‘పహల్గామ్’పై ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలోని పహల్గామ్లో జరిగిన నరమేథానికి ఏడాది గడిచింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఆ మారణకాండ దేశ ప్రజల మనసులను ఇంకా తొలిచివేస్తూనే ఉంది. ఆ చీకటి రోజును స్మరించుకుంటూ, ఉగ్రవాదం ముందు భారత్ ఎన్నటికీ తలొంచబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నేరస్తులకు శిక్ష ఖాయమంటూ, తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని భారత సైన్యం ఉగ్రమూకలకు మరోమారు హెచ్చరికలు జారీ చేసింది.కన్నీటి నివాళి.. చెరగని జ్ఞాపకంఏప్రిల్ 22, 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది పర్యాటకులతో పాటు స్థానిక పోనీ హ్యాండ్లర్ ఆదిల్ షాలకు దేశం ఘనంగా నివాళులర్పించింది. ‘ఆ అమాయకులను ఎన్నటికీ మరువం. ఉగ్రవాదం ముందు దేశం ఎన్నటికీ తలొగ్గదు’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా లిడ్డర్ నది ఒడ్డున నల్లరాతితో నిర్మించిన స్మారక స్థూపం ఆ 26 మంది మృతుల పేర్లతో వారి విషాద స్మృతికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.As a nation, we stand united in grief and resolve. India will never bow to…— Narendra Modi (@narendramodi) April 22, 2026ఆపరేషన్ సింధూర్.. ఉగ్రస్థావరాలపై ఉక్కుపాదంపహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. మే 7, 2025న పీవోకే, పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా సైన్యం విరుచుకుపడింది. లష్కరే తొయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన తొమ్మిది భారీ లాంచ్ప్యాడ్లను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య డ్రోన్ దాడులు, షెల్లింగ్ లాంటి ఘటనలతో నాలుగు రోజుల పాటు భీకర పోరు జరిగి, చివరకు మే 10న మిలిటరీ డైరెక్టర్ జనరల్స్ చర్చలతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.ఆపరేషన్ మహాదేవ్.. ముష్కరుల వేట‘భారత్పై జరిగే దాడులకు ప్రతికారం కచ్చితంగా తీర్చుకుంటాం, న్యాయం జరిగి తీరుతుంది’ అని సైన్యం తేల్చిచెప్పింది. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరిట 93 రోజుల పాటు అలుపెరగని వేట కొనసాగించింది. జూలై 28న ఎలైట్ పారా (స్పెషల్ ఫోర్సెస్) కమాండోలు అత్యంత దట్టమైన అటవీ ప్రాంతంలో 10 గంటల పాటు సుమారు మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, అత్యంత రహస్యంగా దాడులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో బైసరన్ లోయ దాడికి కారణమైన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది.ఇది కూడా చదవండి: TN Election: విజయ్ పొలిటికల్ థ్రిల్లర్.. ఇన్వెస్టర్లలో గుబులు!
శంభో శివశంభో స్మరణతో కేదారినాథ్
ఈ రోజు (బుధవారం) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారినాథ్ క్షేత్రం తెరుచుకుంది.దీంతో ఆలయ పరిసరాలన్నీ శివనామాస్మరణతో మార్మోగుతున్నాయి. ఆ పరమేశ్వరుని దర్శించుకొని తమ జన్మధన్యం చేసుకోవాలని భక్తులంతా ఎంతో భక్తి నిష్టలతో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేదారినాథ్ యాత్రపై సమగ్రమైన సమాచారం తెలుసుకోండి.స్థలపురాణంఇతిహాసాల ప్రకారం.. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత, పాండవులు "గోత్ర హత్తి", "బ్రహ్మ హత్తి" పాపాల నుండి విముక్తి పొందడానికి పరమేశ్వరుని కోసం కఠిన తపస్సు చేస్తారు. శివుని దర్శనం అనంతరం ఆప్రాంతంలో మొదట పాండవులు ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించారని స్థలపురాణం చెబుతుంది. అనంతరం 8వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రస్తుతం ఉన్న అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మించారని ప్రతీతి. అయితే మాములుగా శివలింగాలు గుండ్రంగా ఉంటాయి, కానీ కేదారినాథ్లో శివలింగం త్రిభుజాకారంలో ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత.ఇంజినీర్లనే ఆశ్చర్యపరిచిన ఆలయ నిర్మాణం ఈ ఆలయాన్ని నిర్మించిన విధానం ఇప్పటికీ ఇంజనీర్లను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయ నిర్మాణానికి వాడిన రాళ్లు టన్నుల కొద్దీ బరువు ఉంటాయి. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో, ఆ కాలంలో ఎటువంటి యంత్రాలు లేకుండా ఆ రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. ఈ ఆలయ నిర్మాణానికి ఇంటర్ లాకింగ్ టెక్నిక్ వాడారు. రాళ్లను అతికించడానికి ఎటువంటి సిమెంట్ లేదా మట్టిని వాడలేదు. ఒక రాయిలో మరొకటి సరిగ్గా సరిపోయేలా అమర్చారు. అందుకే వందల సంవత్సరాల మంచు తుఫానులు ఈ ఆలయాన్ని కనీసం తాకలేకపోయాయి. భీమశిల 2013లో ఉత్తరఖండ్లో మహాప్రళయం వచ్చింది. ఆసమయంలో ఆలయ పరిసరాల్ని పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి. అప్పుడు ఓ అద్భుతం జరిగింది. ఒక పెద్దరాయి ఆలయ వెనుకభాగంలో వచ్చే ఆగింది. దీంతో వరదల ఆలయాన్ని కనీసం తాకలేకుండా చీలుకుంటూ వెళ్లింది. అంత పెద్ద భారీ జల ప్రళయం సైతం ఆలయాన్ని తాకలేకపోయింది. దీంతో భక్తులంతా ఆ భీమసేనుడే శిల రూపంలో వచ్చి ఈ ఆలయాన్ని రక్షించాడని అంటారు. అందుకే ఆ రాయిని ఇప్పటికీ "భీమ శిల" పేరుతో కొలుస్తారు.చార్ధామ్ యాత్ర భక్తులంతా ఎక్కువగా ఛార్దామ్ యాత్రలో భాగంగా కేదారినాథ్ దర్శనం చేసుకుంటారు. కేదారినాథ్,బద్రినాథ్,యమునోత్రి, గంగోత్రి క్షేత్రాలను కలిపి ఛార్దామ్ యాత్రగా పిలుస్తారు. యమునోత్రి & గంగోత్రి యాత్ర ఏప్రిల్ 19, 2026 అక్షయ తృతీయ రోజున ప్రారంభం కాగా కేదారినాథ్ ఈ రోజు తెరుచుకోనుంది. రేపు బద్రీనాథ్ ఆలయాన్ని భక్తుల దర్శనం నిమిత్తం తెరుస్తారు.ఆరు నెలలు మాత్రమే దర్శనం ఛార్ దామ్ యాత్ర సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంటుంది. సముద్రమట్టానికి సుమారు 11,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. నవంబర్ - ఏప్రిల్ సమయంలో ఉష్ణోగ్రతలు -15°C నుండి -20°C కి పడిపోతాయి ఆలయ పరిసర ప్రాంతాలు దాదాపు 10 నుండి 15 అడుగుల మేర మంచుతో పూర్తిగా కప్పబడిపోతాయి. శీతాకాలంలో కురిసే భారీ మంచు వల్ల కేదారినాథ్కు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటం వల్ల ప్రయాణం ప్రాణాపాయంగా మారుతుంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా యాత్రను నిలిపివేస్తారు.అద్భుతం పురాణాల ప్రకారం, ఆలయ ద్వారాలు మూసి ఉన్న ఆరు నెలల కాలంలో మనుషులు కాకుండా దేవతలు స్వామివారికి పూజలు చేస్తారని నమ్మకం. ద్వారాలు మూసే రోజున ఆలయంలో ఒక పెద్ద దీపాన్ని (అఖండ జ్యోతి) వెలిగిస్తారు. ఆశ్చర్యకరంగా, ఆరు నెలల తర్వాత మళ్ళీ తలుపులు తీసినప్పుడు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది.దీంతో భక్తులు భక్తిపారవశ్యంతో పులకించి పోతారు.ఎలా చేరుకోవాలి?అయితే కేదారినాథ్ ఆలయం ప్రయాణం కొంత కష్టంతో కూడుకున్నది. సాధారణ రవాణా మార్గాలు కేవలం గౌరీకుండ్ వరకే చేరుకుంటాయి. అక్కడి నుంచి ఆలయం వరకూ సూమారు 16 - 18 కిలోమీటర్ల కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది. దీనికి దాదాపుగా 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. నడకమార్గం మెుత్తం కొండలు కావడంతో ట్రెక్కింగ్ కొంత కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు గాలిలో ఆక్సిజన్ స్థాయిు తగ్గుతాయి. దీనివల్ల త్వరగా అలసిపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. యాత్రకు ప్రారంభించే సమయంలో సైతం అక్కడి వైద్య సిబ్బంది మన ఆరోగ్య వివరాలను తనిఖీ చేస్తారు.అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం, కాబట్టి ఉన్ని దుస్తులు , రెయిన్ కోట్ వెంట ఉంచుకోవడం తప్పనిసరి.మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే అక్కడ ఉన్న ఆక్సిజన్ సపోర్ట్ అందించేలా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ నడవలేని వారి కోసం గుర్రాలు లేదా డోలీలు అందుబాటులో ఉంటాయి.దారి పొడవునా ప్రతి కొన్ని కిలోమీటర్లకు ప్రథమ చికిత్స కేంద్రాలు ఉంటాయి.హెలికాప్టర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. కానీ దీనికి ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలి.కేదారినాథ్కు రికార్డు స్థాయిలో రిజిష్ట్రేషన్లుఈ సారి చార్ ధామ్ యాత్రకోసం రికార్డు స్థాయిలో భక్తులు రిజిష్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 14.5 లక్షల మంది రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఒక్క కేవలం కేదారినాథ్ దర్శనం కోసమే 4,95,173 మంది రిజిష్ట్రేషన్లు చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రోజుకు కేవలం 15 వేలమంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించినున్నట్లు కమిటీ ప్రకటించింది.
ఎన్ఆర్ఐ
టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ
జపాన్లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు. ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
క్రైమ్
లంచం డిమాండ్.. ఏసీబీ వలలో సీఐ, ఎస్ఐ!
అనంతగిరి: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్ఐ రాణి ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఇర్షాద్ భార్య కుటుంబ గొడవల విషయంపై మహిళా పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఇర్షాద్తో పాటు అతని కుటుంబసభ్యులు ఐదుగురిపై కేసు నమోదైంది. దీదీనిపై నోటీసులు తీసుకోవాలంటూ మార్చి 15న పోలీసులు ఇర్షాద్కు ఫోన్ చేశారు. దీంతో అమ్మానాన్న, తమ్ముడిని తీసుకుని 16న పీఎస్కు వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లు రాలేదు. కేసులో ఉన్న ఆరుగురికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్ఐ డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నారు. మార్చి 23వ తేదీన రూ.20 వేల నగదుతో వెళ్లిన ఇర్షాద్ సీఐ సమక్షంలో ఎస్ఐకి డబ్బులు అందజేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ మహిళా పీఎస్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సీఐ, ఎస్ఐని విచారించారు. వీరి ఇళ్లతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా 9440446106కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం.. తాండూరు: పట్టణానికి చెందిన కౌన్సిలర్ షేక్ ఇర్షాద్ అవినీతి అధికారుపై పోరాటం చేస్తున్నారు. ఓ భూమికి సంబంధించిన సేల్ డీడ్ రద్దు చేయాలని కోరుతూ 2022 డిసెంబర్లో తాండూరు సబ్ రిజిస్ట్రార్ జమీరొద్దీన్ను కలవగా రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన ఇర్షాద్ డిసెంబర్ 5న డబ్బులు ఇస్తూ సబ్ రిజి్రస్టార్తో పాటు అతని అసిస్టెంట్ను పట్టించాడు. 2025లో ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ ఉద్యోగి రమేశ్ను ఏసీబీకి పట్టించాడు. దంపతుల మధ్య నెలకొన్న గొడవ విషయంలో ఇర్షాద్ భార్య మహిళా పీఎస్లో ఫిర్యాదు చేయగా, స్టేషన్ బెయిల్కు లంచం డిమాండ్ చేసిన పోలీసు అధికారులను ఏసీబీకి పట్టించడం చర్చనీయాంశమైంది.
నాకు నలుగురు అమ్మాయిలతో ఎఫైర్ ఉంది..!
కడప అర్బన్: చుక్కలాంటి అమ్మాయికి.. చక్కనైన అబ్బాయికి ఆర్భాటంగా నిశ్చితార్థం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ మధ్యలోనే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరుగా తెలుసుకునేందుకు సెల్ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్లు చేసుకున్నారు. ఏమైందో ఏమో సదరు యువకుడు ఉన్నట్లుండి తనకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఇప్పటికే నలుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 20 తేదీన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్లో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పటేల్ రోడ్డుకు చెందిన రెహనా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి నాదెళ్ల రాజా మధ్యవర్తుల ద్వారా ప్రొద్దుటూరుకు చెందిన వీర కుమారుడు షాజహాన్తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఇందిరానగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం వేడుక జరిగింది. ఆగస్టులో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో షాజహాన్ పెళ్లి ఇష్టం లేదంటూ యువతికి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి నాదెండ్ల రాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు.
మురుగన్ మళ్లీ చిక్కెన్!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్లోని బనాస్కంత ప్రాంతంలో అపహరణకు గురైన నాలుగేళ్ల చిన్నారి దేవ్ను రెస్క్యూ చేయడంతో మొదలైన ఆపరేషన్లో భారీ శిశువుల అక్రమ రవాణా, విక్రయాల ముఠా గుట్టురట్టు అయింది. సూత్రధారులుగా ఉన్న తెలంగాణకు చెందిన ముగ్గురిని సోమవారం అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ ముఠాలో కింగ్పిన్గా ఉన్న తెలంగాణకు చెందిన మురుగన్ గత ఏడాది చైతన్యపురి ఠాణాలో నమోదైన శిశువుల అక్రమ రవాణా కేసులోనూ కీలక నిందితుడిగా ఉన్నాడు. దేవ్ కిడ్నాప్నకు పాల్పడిన గుజరాత్లోని డాంత ప్రాంతానికి చెందిన శైలేష్ గామర్, బాబు భగోరాలను పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో... ‘మురుగన్ గ్యాంగ్’నెట్వర్క్ను ఛేదించేందుకు బనస్కాంత పోలీసులు దాదాపు 70 నుంచి 80 ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను సేకరించడంతోపాటు తమ వద్ద ఉన్న ఆధారాలను ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ సాయంతో విశ్లేషించారు. తెలంగాణకు చెందిన బోదాశు నాగరాజే మురుగన్ అని, అతడిపై గతంలోనూ కేసులు ఉన్నాయని గుర్తించారు. ఇతడి కోసం గాలించిన స్పెషల్ టీమ్ సోమవారం కాగజ్నగర్లో పట్టుకుంది. మురుగన్ ఇచ్చి న సమాచారంతో కరీంనగర్ జిల్లా సిరికొండకు చెందిన కాసరపు తిరుపతి, కాసరపు మల్లయ్య, కేలేటి గంగాధర్ గంగరాజన్లను పట్టుకున్నారు. దాదాపు నాలుగేళ్లుగా శిశువుల అక్రమ రవాణా దందాలో ఉన్న మురుగన్ 2025 మార్చి 19న చైతన్యపురి పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టై మూడు నెలలు చర్లపల్లి జైల్లో ఉన్నాడు. మూడు రాష్ట్రాల్లో ఎనిమిది మంది విక్రయం... మురుగన్ భార్యకు కూడా మహారాష్ట్రలో నమోదైన శిశువుల అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్నట్లు బనస్కాంత పోలీసులు అనుమానిస్తున్నారు. మురుగన్ గ్యాంగ్ ఇప్పటి వరకు ఎనిమిది మంది నవజాత శిశువుల్ని అపహరించి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లోని మూడు ఐవీఎఫ్ కేంద్రాలు ఈ శిశు విక్రయాలకు అడ్డాలుగా ఉన్నట్లు బనస్కాంత అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, కూకట్పల్లి కేంద్రాలుగా పనిచేస్తున్న వాటిపై చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. గిరిజనుల బిడ్డలే ఎక్కువగా... మురుగన్ గ్యాంగ్ గిరిజన ప్రాంతాల్లోని నిరుపేద దంపతులతో ఒప్పందాలు చేసుకుని శిశువు పుట్టిన 24 నుంచి 48 గంటల్లోనే ఖరీదు చేస్తోంది. రూ.ఐదు లక్షలు చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన సోము, అమూల్య, మల్లేష్, శివరాణి, వెంకటరామారావులతోపాటు విజయవాడకు చెందిన సరోజ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
రూ.కోటిన్నర బంగారం కొట్టేసింది కూతురే..!
చైతన్యపురి: ఓ వ్యాపారి ఇంట్లో కిలో బంగారు ఆభరణాలు చోరీకి గురై సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే వాటిని కొట్టేసింది అతడి కుమార్తె అని పోలీసుల విచారణలో తేలింది. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు... కొత్తపేట గ్రీన్హిల్స్ కాలనీలో నివసించే దీపక్ పటేల్ టైల్స్ వ్యాపారి. జనవరి 28న భార్య వింధ్య పటేల్తో కలిసి ఇంట్లోని నగల బాక్సులను బెడ్ కింద ఉన్న లాకర్లో పెట్టి తాళం వేశారు. తాళం చెవులను బీరువా లాకర్లో భద్రపరిచారు. గత శనివారం ఆభరణాల కోసం లాకర్ తెరిచి చూడగా ఖాళీ బాక్సులు దర్శనమిచ్చాయి. అవి చోరీకి గురై ఉంటాయని భావించి దీపక్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన డీఐ గురుస్వామి దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులను విచారించగా ఈ ఘటనలో ఫిర్యాదుదారుడి కుమార్తె రియా హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఎంబీఏ చదువుతోంది. నమ్మకంగా ఉంటూ దీపక్ పటేల్ దగ్గర మేనేజర్గా పనిచేసే సాగర్(34)కు రియా ఆ ఆభరణాలను ఇచ్చినట్లు విచారణలో తేలింది. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్కు డబ్బులు అవసరమని అతడు నమ్మించి నగలు తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో కుటుంబం పరువు పోతుందని భావించిన ఫిర్యాదుదారుడు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి కేసు వాపస్ తీసుకుంటానని అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. అనుమానితులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామని కొంత నగదు, బంగారం స్వా«దీనం చేసుకున్నామని చైతన్యపురి పోలీసులు తెలిపారు.
వీడియోలు
సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు
మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్
అక్షయ తృతీయ: ఒక్క రోజే రూ.20,000 కోట్ల బంగారం కొనుగోలు
5000 ఎకరాల దేవుడి భూమి స్వాహా చేసిన దేవాదాయ శాఖ కమిషనర్
బాబు పాలనపై బుగ్గన సెటైర్లు పెద్దిరెడ్డి నవ్వులు..
రాయలసీమ ఎత్తిపోతల ఆపేసి.. మన డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు
ఏ స్కూల్ మనది.. బుర్ర ఉందా కొల్లు రవీంద్ర ని ఏకిపారేసిన పేర్ని కిట్టు
గెలిపించిన మమ్మల్నే కొడతారా పిఠాపురం వర్మ ఫైర్
చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
హనీ ట్రాప్ కలకలం పోలీసులే దగ్గరుండి.. సంచలన ఆడియో లీక్



