Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

KSR Comment: How Kutami Prabhutvam Increase YS Jagan Charisma1
జగన్‌ చరిష్మాను మరింత పెంచుతున్న కూటమి సర్కారు!

మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించినట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత.. కచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లుంది. బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ద దేనిమీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డ్‌కు వెళుతున్నారే! ఈ సమస్య ప్రజలలోకి బాగా వెళ్లిపోతుందే! అన్న గొడవ తప్ప, రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు!. పైగా జగన్ టూర్‌ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రూ.260 కోట్లు ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక, ధరలు దారుణంగా పడిపోయి రెండు నెలలుగా రైతులు నానా బాధలు పడుతున్నారు. మామిడి పండ్లతో రైతులు రోజుల కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా!. ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?. కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలకు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక, పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా?అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోంది. టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని, జగన్నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ, తమ అక్కసు తీర్చుకున్నాయి. జగన్‌కు మద్దతుగా కాని, తమ బాధలు చెప్పుకోవడానికి గాని రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం. టమోటాలు, ఇతర ఉత్పత్తులకు సరిగా ధర లేకపోతే రైతులు పలు సందర్భాల్లో కింద పారబోసి నిరసనలు తెలిపిన ఘటనలు ఎన్ని జరగలేదు? అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది! ఎన్ని ఆంక్షలు పెట్టింది!.. ఎక్కడైనా ఇంతమందే రావాలని చెబుతారా? ఒకవేళ స్థలాభావం ఉంటే దానిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, ఐదుగురితోనే మాట్లాడాలని, రైతులను ఆటోలలో ఎక్కించుకోకూడదని, మోటార్ బైక్‌లకు పెట్రోల్ పోయరాదని.. ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున మూడు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. సుమారు రెండువేల మందిని నియమించారట. వీరు జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా, ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాట్లు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా పాతిక చెక్ పోస్టులు పెట్టారట. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనపర్తి వద్ద భద్రతాకారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోకపోతే, మద్దతు దారులను వెంట బెట్టుకుని నడుచుకుంటూ వెళ్లారే? అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే! చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు. అదే.. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే, డ్రైవరుతోపాటు జగన్‌, ఇతర ప్రయాణీకులపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందింది. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించి జగన్‌కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా! జగన్నాధ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా? అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడినదని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలో డబుల్ టాక్ చేయడం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏమి విలువ పెరుగుతుందో తెలియదు. బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పోలీసులు లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతనిని పరామర్శకు కూడా జగన్‌ కారు దిగడానికి పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో రూ.16లకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే, ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా? అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు రూ.నాలుగు సబ్సిడీని కేంద్రం భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప, వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వెళ్లుతున్నారు అన్నప్పుడుగాని వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్‌గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా! ఇదే కదా ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా, తన వెంట జనం ఉన్నారని జగన్ పదే, పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. కాని ప్రజాస్వామ్యంలో అణచివేత విధానాల వల్ల ఉపయోగం ఉండదని అనుభవ పూర్వకంగా తెలియ చేసినట్లయింది. బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే, అంతే వేగంగా అది పైకి లేస్తుందన్న సంగతి మరోసారి స్పష్టమైంది. పోలీసులు మెయిన్ రోడ్డుపై ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు, గుట్టలు దాటుకుంటూ, అడవుల గుండా కూడా తరలిరావడం కనిపించింది. కొందరు యువకులు మోటార్ సైకిళ్తపై చిన్న, చిన్న డొంకల ద్వారా తరలివచ్చిన తీరుకు సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షించాయి. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అదే తీరుగా ఉంది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికలలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావన. అందుకే కూటమి సూపర్ సిక్స్‌తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకు రావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. వైయస్సార్‌సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలి. జగన్‌కు టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను ప్రభుత్వమే రోజురోజుకు మరింతగా పెంచుతున్నందుకు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Prakasam Ongole Kid Lakshit Incident Mystery Still Continue2
Ongole: పాపం పసివాడు

చిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్‌ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్‌ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్‌దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్‌ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్‌ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్‌ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.అయ్యో లక్షిత్‌లక్షిత్‌ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే.. ఎవరి పని?బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్‌ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్‌ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్‌వాడీ టీచర్లపైనే లక్షిత్‌ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విషాదంలో రెండు ఊర్లుకంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్‌ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్‌ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్షిత్‌ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్‌ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Video Goes Viral Maha Minister Seen With Bag Allegedly Full Of Cash3
‘మహా’ మంత్రి వీడియో వైరల్‌..

ముంబై: మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. మంత్రి సంజయ్‌ శిర్‌సాత్‌ ఇప్పుడు ఆ వీడియోతో ఒక్కసారిగా వైరల్‌గా మారారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. మంత్రి సంజయ్‌ శిర్‌సాత్‌ మంచంపై కూర్చొని సిగరెట్‌ కాల్చుకుంటూ ఫోన్‌లో మాట్లాడున్న సమయంలో పక్కనే ఒక బ్యాగ్‌ ఉంది. అయితే ఆ బ్యాగ్‌లో భారీ నగదు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. ఈ క్రమంలోనే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ప్రధానంగా ఆయన గత ఐదేళ్లలో ఆర్థికంగా ఎదిగిన తీరుపై అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. సదరు మంత్రి పైసా తీసుకోకుండా ఏ పని చేయ్యడనే ఆరోపణలు కూడా చుట్టుముట్టిన తరుణంలో ఐటీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తనకు ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు అందిన విషయాన్ని మంత్రి సంజయ్‌ శిర్‌సాత్‌ కూడా అంగీకరించారు. దీనిపై స్పందిస్తానని, తనపై అనవసర ఆరోపణలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తన పక్కన సూట్‌కేసులో భారీగా డబ్బులున్నాయనే విషయంపై కూడా ఆయన స్పందించారు. ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెబుతూనే, ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో వివరణ ఇస్తానని చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఆయన ఆస్తులు 2019 నుంచి 2024 మధ్య కాలంలో భారీగా పెరగడం కూడా అనుమానాలకు దారి తీసింది. Shindes men on radar. Shiv Sena minister Sanjay Shirsat’s video surfaced where half opened bag with bundle of notes lying near his bed. Shirsat confirmed the authenticity of this video. Shirsat also facing inquiry in purchase of hotel at Rs 65 Cr against mkt rate of Rs120 Cr. pic.twitter.com/KW5CeiPMeu— Sudhir Suryawanshi (@ss_suryawanshi) July 11, 2025 ఈ క్రమంలోనే మంత్రిపై పలువురు వ్యక్తులు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారని, ఆ క్రమంలోనే తాను నోటీసు కూడా అందుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించడానికి తనకు తగినంత సమయం కావాలని మంత్రి వేడుకుంటున్నారు. మంత్రి సంజయ్‌ శిర్‌సాత్‌.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌(వెస్ట్‌) నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండ్‌ శివసేన పార్టీకి చెందిన శిర్‌సాత్‌ ఆస్తులు గత ఐదేళ్లలో గణనీయంగా ఎలా పెరిగాయనే దానిపై వివరణ ఇవ్వాలని ఐటీ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు ఇచ్చింది.

Perni Nani Asks Kutami Prabhutvam Over Farmers Issue 4
ఒక్క కూటమి ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించాడా?

రైతులను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్‌ జగన్‌ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్‌ జగన్‌ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్‌ రైతులను పట్టించుకోవడం లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు నిలదీస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారు?. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైన మాట్లాడారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా?. జగన్‌ వెళ్తుటే మాత్రం అడ్డుకుంటున్నారు.. .. వైస్‌ జగన్‌ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా?. పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా?. బంగారుపాళ్యం మార్కెట్‌కు 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్‌కు పర్మిషన్‌ ఇచ్చారా?. ఎల్లో మీడియాలో వైఎస్‌ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కొంతమందికి కూలీ ఇచ్చి జగన్‌ను తిట్టిస్తున్నారు.... మామిడి కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తలో మాట చెబుతున్నారు. ఏది నిజం? అసలు మామిడి కొనుగోళ్లకు సంబంధించిన రూ. 260 కోట్లకు జీవో వచ్చిందా?. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది అని పేర్ని నాని కూటమి సర్కార్‌పై మండిపడ్డారు.

Joe Root creates all-time record in Tests vs India 5
చరిత్ర సృష్టించిన జో రూట్‌..

లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన సెంచరీతో సాధించాడు. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో తొలి బంతికే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.రూట్‌కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం విశేషం. తొలి రోజు ఆట మొదటి సెషన్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్‌.. తన అద్బుత ప్రదర్శనతో స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజోలో పాతుకుపోయిన ఈ ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఓలీ పోప్‌, బెన్ స్టోక్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలను రూట్ నెలకొల్పాడు. రూట్‌ ఓవరాల్‌గా 104 పరుగులు చేసి ఔటయ్యాడు.ద్రవిడ్‌ రికార్డు బ్రేక్‌..ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రూట్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా రూట్‌(36) రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌, స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉండేది.వీరిద్దరూ 35 టెస్టు సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరిని రూట్ అధిగమించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌(51) అగ్రస్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రూట్‌నే టాప్‌లో ఉన్నాడు.అదేవిధంగా టెస్టుల్లో భార‌త్‌పై అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా స్మిత్ రికార్డును స‌మం చేశాడు. స్మిత్ ఇప్ప‌టివ‌ర‌కు 11 సెంచ‌రీలు చేయ‌గా.. రూట్ కూడా స‌రిగ్గా 11 టెస్టు సెంచ‌రీలు చేశాడు.బుమ్‌ బుమ్‌ బుమ్రా..రెండో రోజులో టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌(44), జో రూట్‌(104) అద్బుతమైన బంతులతో పెవిలియన్‌కు పంపాడు. 87 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.భార‌త్‌పై అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్లుజో రూట్ (ఇంగ్లండ్‌)- 11స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 11గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 8వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 8రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 8అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్లు..సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) 51జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) 45రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 41కుమార్ సంగక్కర (శ్రీలంక) 38జో రూట్ (ఇంగ్లాండ్) 37చదవండి: కావాలనే క్వాడ్రపుల్‌ సెంచరీ (400) మిస్‌.. లారా రియాక్షన్‌ ఇదే

Top 10 richest Indians in the US 2025 Jay Chaudhry, Vinod Khosla Sundar Pichai6
అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..

విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్‌ 2025 ర్యాంకింగ్స్‌లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్‌ కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్‌.. ఇజ్రాయెల్, తైవాన్‌లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్‌లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్‌వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు.

Oh Bhama Ayyo Rama Movie Review And Rating In Telugu7
‘ఓ భామ అయ్యో రామా’ మూవీ రివ్యూ

టైటిల్‌: ఓ భామ అయ్యో రామనటీనటులు: సుహాస్, మాళవిక మనోజ్, అనిత హంసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి తదితరులునిర్మాణ సంస్థ: వీ ఆర్ట్స్‌నిర్మాతలు : హరీష్‌ నల్లరచన, దర్శకత్వం: రామ్‌ గోదలసంగీతం: రథన్‌సినిమాటోగ్రఫీ : ఎస్‌ మణికందన్‌ఎడిటర్‌: భవిన్‌ ఎం షావిడుదల తేది: జులై 11, 2025యంగ్‌ హీరో సుహాస్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు కాన్సెప్ట్‌ కథలతో అలరిస్తూనే మరోవైపు కామెడీ చిత్రాలతోనూ నవ్విస్తున్నాడు. ఈ టాలెంటెడ్‌ హీరో నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో 'ఓ భామ అయ్యో రామ'పై హైప్‌ క్రియేట్‌ అయింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(జులై 11) ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రామ్‌ (సుహాస్‌) చిన్నప్పుడే తల్లి(అనిత హంసానందిని)చనిపోతుంది. మేనమామ(అలీ)నే అన్ని తానై పెంచుతాడు. పెద్ద చదువుల కోసం పారెన్‌ వెళ్లాలనేది తన లక్ష్యం. స్నేహితులంతా సినిమాకు వెళ్తే..మనోడు మాత్రం థియేటర్‌ బయట నుంచే విని.. సినిమా హిట్టో ఫట్టో చెప్పేస్తాడు. మామ, స్నేహితులే ప్రపంచంగా బతుకుతున్న రామ్‌ జీవితంలోకి అనుకోకుండా సత్యభామ(మాళవిక మనోజ్‌) వచ్చేస్తుంది. బడా వ్యాపారవేత్త(పృథ్వీరాజ్) ఏకైక కూతురే ఈ సత్యభామ. ఆమెకు ఎవరైనా నచ్చితే.. వారికోసం ఏదైనా చేసేస్తుంది. రామ్‌ని ఇష్టపడమే కాకుండా అతన్ని సినిమా డైరెక్టర్‌ని చేయాలని ఫిక్సవుతుంది. అతనికి ఇష్టం లేకపోయినా.. స్టార్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాత మూడేళ్ల వరకు మనం కలువొద్దని కండీషన్‌ పెట్టి.. అతనికి దూరంగా వెళ్లిపోతుంది. ఆ మూడేళ్లలో రామ్‌ జీవితం ఎలా మారింది? సత్యభామ.. రామ్‌కి దూరంగా ఎందుకు వెళ్లింది? రామ్‌ తండ్రి ఎవరు? సినిమాలు అంటేనే నచ్చని రామ్‌ని దర్శకుడిగా చేయాలని సత్యభామ ఎందుకు ప్రయత్నించింది. రామ్‌ దర్శకుడుగా సక్సెస్‌ అయ్యాడా లేదా? చివరకు రామ్‌, సత్యభామ కలిశారా లేదా అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘తెలుగు సినిమా అంటే లవ్‌, ఎమోషన్‌, డ్రామా.. ఇవన్నీ ఉండాలి’ అని ఓ సీన్‌లో హీరో సుహాస్‌ అంటాడు. ఆ డైలాగ్‌కు తగ్గట్టే ఓ భామ అయ్యో రామ సినిమా కథ ఉంది. అయితే వాటిని సరిగా వాడుకోవడంలోనే దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఓ యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీకి మదర్‌ సెంటిమెంట్‌ని యాడ్‌ చేసి ఫన్‌వేలో కథనాన్ని నడించారు. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. లవ్‌స్టోరీ రొటీన్‌గానే ఉన్నా.. ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇక ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. హీరో తల్లి చనిపోయే ఎమోషనల్‌ సీన్‌తో కథని ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశం కాస్త కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు కలిసిన తర్వాత కథనం ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరో ఎక్కడ ఉంటే అక్కడికి హీరోయిన్‌ వెల్లడం.. బయటకు తీసుకెళ్లి.. కథ చెబుతూ విసిగించడం మొదట్లో బాగున్నా.. ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్‌ కావడం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ బాగా ప్లాన్‌ చేశారు. సెకండాఫ్‌లో వచ్చే హీరో మదర్‌ ఎపిసోడ్‌ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్‌ పెళ్లి ఎపిసోడ్‌ కామెడీగా ప్లాన్‌ చేసినా..అది వర్కౌట్‌ కాలేదు. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌ చేసే అల్లరి పనులన్నింటికి.. సెకండాఫ్‌లో మంచి జస్టిఫికేషన్‌ ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. అయితే కథను మరింత బలంగా రాసుకొని.. ఫస్టాఫ్‌ విషయంలో ఇంకాస్త కేర్‌ తీసుకొని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రామ్‌ పాత్రలో సుహాస్‌ ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్లలో చక్కగా నటించాడు. ఇక హీరోయిన్‌ మాళవిక మనోజ్‌కి ఇది తొలి తెలుగు సినిమా. సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది. కథనం మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అనిత హంసానందిని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించింది. హీరో తల్లిగా పాత్రలో నటించి అందర్ని సర్‌ప్రైజ్‌ చేసింది. మదర్‌ సెంటిమెంట్‌ సీన్ల ఈ సినిమాకు హైలెట్‌. ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మణికందన్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్రధాన బలం. ప్రతీ సీన్‌ తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. రథన్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. బ్రహ్మకడలి ఆర్ట్‌వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడ తగ్గలేదని సినిమా చూస్తే అర్థం అవుతుంది. హీరో మార్కెట్‌, కథని మించి ఖర్చు చేశారు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

JP Nadda accepted resignation of MLA Raja Singh8
రాజాసింగ్‌ రాజీనామాకు బీజేపీ ఆమోదం

సాక్షి,న్యూఢిల్లీ: ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజా సింగ్‌కు లేఖ రూపంలో తెలియజేశారు. మీ రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు పార్టీ పని విధానం , సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. మీరు లేవనెత్తి అంశాలు అసందర్భం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో మీ రాజీనామాను ఆమోదిస్తున్నాం అని అరుణ్‌ లేఖలో తెలియజేశారు. ప్రస్తుతం రాజాసింగ్‌ అమర్‌నాథ్‌ యాత్రలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచందర్‌రావు ఎన్నికను వ్యతిరేకిస్తూ గోషామహల్‌(హైదరాబాద్‌) ఎమ్మెల్యే రాజాసింగ్‌ బీజేపీకి జూన్‌ 30వ తేదీన రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాపై వివరణ ఇవ్వమని హైకమాండ్‌ కోరితే అందుకు తాను సిద్ధమని చెప్పారాయన. కానీ, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే ఇప్పుడు రాజీనామాకు అధిష్టానం ఆమోదం తెలపడం గమనార్హం.

Pak Balochistan Province Bus Passengers Incident9
బలూచిస్తాన్‌: ఐడీ కార్డు చూసి ప్రయాణికుల్ని కాల్చేశారు!

బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. బస్సుల్లో వెళ్తున్న కొందరిని తుపాకులతో వచ్చిన దుండగులు అపహరించారు. ఆపై సమీపంలోని కొండల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు తనిఖీలు చేసి మరీ కిరాతకంగా కాల్చి చంపారు.బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో దారుణం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పలు బస్సుల నుంచి ప్రయాణికులను తుపాకులు చూపించి బెదిరించి ఎత్తుకెళ్లారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు పరిశీలించి కాల్చి చంపారు. శరీరం నిండా తుట్లతో 9 మంది ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారి ఒకరు ప్రకటించారు. ఘటనకు కారకులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. పాక్‌ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది. దుండగుల కోసం భద్రతాల బలగాలు రంగంలోకి దిగాయి.ఇదిలా ఉంటే.. బలూచ్‌ వేర్పాటువాద మిలిటెంట్‌ గ్రూపులు గతంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాయి. ఇందులో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(BLA) అత్యంత బలమైంది. అఫ్గనిస్తాన్‌-ఇరాన్‌ సరిహద్దుల గుండా ఇది స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే పాక్‌ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. Pakistan Bus Attack: Gunmen Kill 9 Punjabi Passengers in Balochistan After Checking ID Cards#Balochistan #Pakistan https://t.co/seQhPWzqLJTo get epaper daily on your whatsapp click here: https://t.co/Y9UVm2LHAx— Free Press Journal (@fpjindia) July 11, 2025బలూచిస్తాన్‌ అత్యంత అరుదైన ఖనిజాలకు మూలం. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ వనరులను పంజాబ్‌ ప్రావిన్స్‌కు దోచిపెడుతోందని బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌ ప్రావిన్స్‌ నుంచి వాహనాలను, ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తూ వస్తోంది.గత కొన్ని నెలలుగా బలూచిస్తాన్‌లో వరుస హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ గురైంది. బొలాన్ జిల్లాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ సుమారు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును హైజాక్‌ చేసింది. అందులో 30 మందిని కాల్చి చంపింది. మరో 215 మందిని బందీలుగా తీసుకుంది. బందీలలో ఎక్కువ మంది సైనికులు, పోలీసు, ISI, యాంటీ టెర్రరిజం ఫోర్స్ సభ్యులుగా ఉండడం గమనార్హం. పాక్ సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి.. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా దాడులు జరిపింది. అంతకు ముందు.. 2024 ఆగస్టులో ముసాఖేల్ జిల్లాలో 23 మంది ప్రయాణికులను ఐడెంటిటీ కార్డులు అడిగి కాల్చి చంపింది బీఎల్‌ఏ.

UPI impact India now makes faster payments than any other country says IMF10
యూపీఐతో చెల్లింపుల్లో మనమే సూపర్‌ఫాస్ట్‌

యూపీఐ దన్నుతో, మిగతా ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారత్‌లో చెల్లింపుల విధానం అత్యంత వేగవంతంగా ఉంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ విధానం చాలా వేగంగా వినియోగంలోకి వచ్చిందని ఫిన్‌టెక్‌ నోట్‌లో పేర్కొంది. అదే సమయంలో నగదుకు ప్రత్యామ్నాయాలైన డెబిట్, క్రెడిట్‌ కార్డుల్లాంటి ఇతరత్రా సాధనాల వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించింది.ప్రస్తుతం యూపీఐ ప్రతి నెలా 1,800 కోట్ల లావాదేవీలు ప్రాసెస్‌ చేస్తోందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. వివిధ పేమెంట్‌ ప్రొవైడర్స్‌ సేవలు ఉపయోగించుకునే యూజర్ల మధ్య నిరాటంకంగా చెల్లింపు లావాదేవీలను ప్రాసెస్‌ చేసేందుకు క్లోజ్డ్‌ లూప్‌ సిస్టమ్‌లతో పోలిస్తే యూపీఐలాంటి ఇంటర్‌ఆపరబుల్‌ పేమెంట్‌ సిస్టమ్‌లు సమర్ధవంతంగా ఉంటాయని తెలిపింది. అయితే, ఇది మరింత వినియోగంలోకి వచ్చే కొద్దీ ప్రైవేట్‌ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి కూడా దారి తీయొచ్చని, అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement