'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. తాజాగా టీజర్ విడుదల చేసి థియేటర్లలోకి వచ్చే విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.టీజర్ విషయానికొస్తే.. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాషణలతో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం – AK47’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ చమత్కారమైన రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
Hyderabad: గణపయ్య భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లయిన జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా సాగే ఈ రవాణా సౌకర్యాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ ప్రత్యేక బస్సులు జేబీఎస్ నుండి ప్రారంభమై ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐ.ఎస్. సదన్, పిసల్బండ, మిధాని టి.షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ల మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా జేబీఎస్ వద్ద ఉదయం 6:00 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 21:55 గంటల వరకు ప్రతి 40 నుండి 50 నిమిషాల వ్యవధితో నిరంతరాయంగా బస్సులు నడుస్తాయి.అలాగే బాలాపూర్ గణేష్ మండపం నుండి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 23:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గణేష్ ఉత్సవాల వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండీ నాగిరెడ్డి వివరించారు.
టి20ల్లో జోరు కొనసాగించేందుకు...
ఒక వైపు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ప్రాధాన్యత నేపథ్యంలో వరుసగా టెస్టు మ్యాచ్లు... ఏడాది కాలంలో వన్డే వరల్డ్ కప్ ఉండటంతో జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై వ్యూహాలు... వీటి మధ్య ఇప్పుడు కాస్త ఆటవిడుపుగా భారత జట్టు టి20 మ్యాచ్లకు సన్నద్ధమైంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టి20 సిరీస్లు ఆడి వచ్చిన భారత్ ఇప్పుడు స్వదేశంలో అఫ్గానిస్తాన్తో పోరుకు సై అంటోంది. అయితే మూడు మ్యాచ్లకు వేదిక భారత రాజధాని అయినా... అధికారికంగా ఈ సిరీస్కు అఫ్గానిస్తాన్ బోర్డు ఆతిథ్యం ఇస్తోంది. న్యూఢిల్లీ: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు ఫిరోజ్షా కోట్లా మైదానంలో తొలి పోరుకు రంగం సిద్ధమైంది. బలాబలాలను బట్టి చూస్తే ప్రత్యర్థికంటే భారత్ అన్ని విధాలా పటిష్టంగా ఉంది. కెప్టెన్గా రెండు సిరీస్లు కోల్పోయిన తర్వాత జింబాబ్వేతో సిరీస్ విజయాన్ని అందుకున్న శ్రేయస్ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. అన్నింటికి మించి హార్దిక్ పాండ్యా మినహా టీమిండియా రెగ్యులర్ ఆటగాళ్లతో పూర్తి స్థాయి జట్టుగా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా గాయంనుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న బుమ్రాపై అందరి దృష్టీ నిలిచింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడు సంచలనాలతో సత్తా చాటిన అఫ్గాన్ టీమ్ ఇక్కడా తమదైన ముద్ర చూపించాలని పట్టుదలగా ఉంది. పలువురు ఐపీఎల్ ఆటగాళ్లు తమ జట్టులో ఉండటం కూడా అఫ్గాన్కు కొంత సానుకూలాంశం. ఈ సిరీస్లో ఆడుతున్న భారత జట్టే జపాన్లో జరిగే ఆసియా క్రీడలకు కూడా వెళుతుంది. రెండో ఓపెనర్ ఎవరు? ఈ సిరీస్లో ఒకే ఒక ప్రశ్న ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ ముందు నిలిచింది. అభిషేక్ శర్మతో పాటు రెండో ఓపెనర్గా సంజు సామ్సన్, వైభవ్ సూర్యవంశీలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్తో సామ్సన్ 2 మ్యాచ్లు, ఇంగ్లండ్పై తొలి మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని తప్పించి వరుసగా మూడు మ్యాచ్లలో వైభవ్ను ఆడించారు. ఆపై చివరి మ్యాచ్కు మళ్లీ సామ్సన్ జట్టులోకి రాగా... జింబాబ్వేతో సామ్సన్ లేకపోవడంతో వైభవ్ మూడు మ్యాచ్లూ ఆడాడు.ఇప్పుడు ఇద్దరు అందుబాటులో ఉన్నారు.దులీప్ ట్రోఫీలో చెలరేగిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఫార్మాట్కు తగినట్లుగా తమ బ్యాటింగ్ శైలిని మార్చుకొని చెలరేగేందుకు ఉత్సాహంగా ఉన్నారు. బ్యాటింగ్పరంగా జింబాబ్వేలో ఆశించిన ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు రెగ్యులర్ పేసర్లతో బరిలోకి దిగనుండగా, పేస్ ఆల్రౌండర్గా నితీశ్కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు. రషీద్పై ఆశలు... భారత గడ్డపై ఆడటం అఫ్గానిస్తాన్ ఆటగాళ్లకు కొత్త కాదు. ఇక్కడి పరిస్థితులపై వారికి మంచి అంచనా ఉంది. ముఖ్యంగా రషీద్ ఖాన్ ఐపీఎల్లో చూపించిన ప్రభావం అసాధారణం. వన్డేల్లో రషీద్ బౌలింగ్లో పదును కనిపించకపోయినా, టి20ల్లో అతను ఎప్పుడైనా ప్రమాదకారి. గుర్బాజ్, నబీ, అజ్మతుల్లా, ముజీబ్, నూర్, నవీన్, ఫారుఖీ వంటి ఐపీఎల్ ఆటగాళ్లతో జట్టు నిండి ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్పై ఉదాసీనత ప్రదర్శిస్తే టీమిండియాకు ఇబ్బంది ఎదురు కావచ్చు. కొత్త కెప్టెన్ ఇబ్రహీమ్ నాయకత్వంలో టీమ్ ఈ సిరీస్కు సిద్ధమైంది.9 భారత్, అఫ్గానిస్తాన్ మధ్య 9 టి20లు జరగ్గా... భారత్ 7 గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా, మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. అఫ్గాన్ ఇప్పటి వరకు ఓడించని పెద్ద జట్లు భారత్ మాత్రమే.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: శ్రేయస్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్/ వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్, అక్షర్, సుందర్, నితీశ్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్. అఫ్గానిస్తాన్: ఇబ్రహీమ్ (కెప్టెన్), గుర్బాజ్, నైబ్, సాదిఖుల్లా, రసూలీ, అజ్మతుల్లా, నబీ, రషీద్, ముజీబ్, నూర్, ఫారూఖీ/ నవీన్.
పన్నుపై అపోహలొద్దు
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్లో పన్నులపై అపోహలు వద్దని మంత్రి శ్రీధర్బాబు స్పష్టంచేశారు. ప్రతి ఏటా 20 శాతం ఆస్తి పన్నులు పెరుగుతాయనే విషయం వాస్తవం కాదన్నారు. పన్నులు ఎలా అంటే అలా పెంచడానికి వీల్లేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న కంప్యూటేషన్ పద్ధతి ప్రకారమే పన్నులు పెరుగుతాయని, గరిష్టంగా 10 శాతానికి మించి పెరగవన్నారు. అది కూడా కేవలం 0.15 శాతం నివాస, 0.75 శాతం వాణిజ్య సముదాయాల మీద మాత్రమే పడుతుందని వివరించారు. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరపున కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026 (క్యూర్)ను ప్రవేశపెట్టిన శ్రీధర్బాబు చట్టం లక్ష్యాలను వివరించారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలు రాష్ట్ర ఆర్థిక ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించారు. శనివారం మధ్యాహ్నం తర్వాత శ్రీధర్బాబు బిల్లుపై జరిగిన చర్చలో పలు పార్టీల సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. బిల్లులో పెట్టిన 20 శాతాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం మేరకు 10 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. ఔటర్ రింగ్రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ నగరాన్ని పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చైర్మన్గా ప్రత్యేక కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, వరదల నివారణ, చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో వివిధ సంస్థలు, శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. భవిష్యత్లో నగర అవసరాలకు అనుగుణంగా ఈ వ్యవస్థ పనిచేసేలా క్యూర్ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. అనంతరం బిల్లు ఆమోదానికి ప్రతిపాదించిన సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కూడా ఈ అంశాన్ని వివరించారు. పన్నుల పెరుగుదలను 20 నుంచి 10 శాతానికి తగ్గిస్తూ బిల్లులో సవరణ చేయాలని సీఎం చేసిన ప్రతిపాదనను సభ ముందు ఆమోదానికి పెట్టారు. ఈ సవరణతోపాటు క్యూర్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఎంఐఎం, బీజేపీ ఏకాభిప్రాయం పాల్వాయి హరీశ్బాబు (బీజేపీ) లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావిస్తూ కోర్ రీజియన్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసే అపెక్స్ కౌన్సిల్ కేవలం విధాన నిర్ణయాల కోసమేనని, ఈ సమావేశాలకు అవసరమైతే మేయర్లను ఆహ్వానిస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈ కౌన్సిల్ ఏర్పాటు ద్వారా మేయర్లు, కార్పొరేటర్ల స్థానిక అధికారాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వివరించారు. ఇందుకు విభేదించిన హరీశ్బాబు అపెక్స్ కౌన్సిల్కు మేయర్లను రమ్మనకపోతే వారికి ఇంకేం అధికారాలుంటాయని ప్రశ్నించారు. ఎంఐఎం సభ్యుడు జుల్ఫికర్ అలీ జోక్యం చేసుకుంటూ.. అపెక్స్ కౌన్సిల్ సమావేశాలకు మేయర్లను ఆహ్వానించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో పాల్వాయి హరీశ్బాబు బల్లలు చరిచి మరీ అభినందించారు. ఎంఐఎం సభ్యుడు కూడా అదే చెబుతున్నాడంటూ అధికార పక్షానికి చూపెట్టే ప్రయత్నం చేశారు. వెంటనే శ్రీధర్బాబు జోక్యం చేసుకుంటూ... జుల్ఫికర్ అలీని హరీశ్బాబు గైడ్ చేస్తున్నారని, అందుకే ఆయన ఆ కోణంలో మాట్లాడుతున్నారని బదులిచ్చారు. మూడు కార్పొరేషన్లను నియంత్రించేందుకు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం లేదని, ఈ కౌన్సిల్ విశాల దృక్పథంతో పనిచేస్తుందని వివరణ ఇచ్చారు. ప్రజలపై తీవ్ర భారం: అక్బరుద్దీన్ క్యూర్ బిల్లులోని పలు అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. బిల్లు న్యాయస్థానాల్లో నిలవదని, సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. క్యూర్ పరిధిలోని కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల అధికారాలకు కత్తెరేసి కీలక అధికారాలను క్యూర్ అపెక్స్ కౌన్సిల్కు, పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి అప్పజెప్పారని తప్పుబట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అధికారాలు అప్పజెప్పకపోతే ఎన్నికలు నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువకి బదులుగా ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్నులను విధించాలని బిల్లులో పొందుపర్చడం పట్ల అభ్యంతరం తెలిపారు. స్థలం, భవనం మార్కెట్ విలువలను కలిపి ఆస్తి పన్నులు విధిస్తే నగర ప్రజలపై తీవ్ర భారం పడుతుందని తప్పుబట్టారు. ఏటా 20 శాతం ఆస్తి పన్నులు పెంచాలని బిల్లులో ప్రతిపాదించడాన్ని వ్యతిరేకించారు. ఆస్తుల మ్యుటేషన్ చేసుకున్న మాత్రాన వాటిపై హక్కులు రావని బిల్లులో పెట్టారని తప్పుబట్టారు. మరో ఆరు నెలల్లో మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ బిల్లుతో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకి సంబంధించిన రూ.1,400 కోట్లు విలువైన కాంట్రాక్టును ఒకే కంపెనీకి ప్రభుత్వం ఇవ్వడాన్ని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. బిల్లుపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, నవీన్యాదవ్ సైతం మాట్లాడారు. కోర్టుల్లో నిలబడదు: పాల్వాయి హరీశ్ ‘క్యూర్’చట్టం న్యాయస్థానం ముందు నిలబడదని, దానిని ఉపసంహరించుకోవాలని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్బాబు డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే... మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు ఎలాంటి అధికారాలు ఉండవని, సీఎంకు అపరిమిత అధికారాలను కట్టబెడ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు సంబంధించి 4,100 అభ్యంతరాలు వస్తే.. అందులో 3 వేలకు పైగా ఆస్తిపన్ను పెంపుదలపై ఆందోళన వ్యక్తమైందన్నారు. విశ్వనగరం ట్యాగ్ ఉండాలి: కూనంనేని సాంబశివరావు వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు విశ్వనగరం ట్యాగ్ ఉండాలని, అందుకోసం అధికార వికేంద్రీకరణతో మరింత అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు చెప్పారు. విశ్వనగరం ట్యాగ్ వస్తేనే.. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారన్నారు. విస్తీర్ణంలో మూడో స్థానంలో.. జనాభాలో ఏడో స్థానంలో మన రాజధాని ఉందన్నారు. సదుపాయలు కల్పించాలి : దానం ‘క్యూర్’పరిధిలో ప్రజల నుంచి ఏటా 20 శాతం వరకు ఆస్తిపన్ను వసూలు చేయాలనే నిర్ణయం సరికాదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇప్పటికే కోటీ 30 లక్షల జనాభా నివసిస్తున్న హైదరాబాద్ త్వరలోనే 2 కోట్ల జనాభాకు విస్తరించనుందని, వీరందరికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మండలిలో క్యూర్ బిల్లు జిల్లాల విభజన అంతా అశాస్త్రీయమే: శ్రీధర్బాబు సాక్షి, హైదరాబాద్: పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఎలా విభజించారో బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన పూర్తిగా అశాస్త్రీయంగా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే క్యూర్ బిల్లును రూపొందించినట్లు వివరించారు. శాసనమండలిలో ఆయన క్యూర్ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ అత్యంత కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సభ్యులకు ముందస్తుగా ఇవ్వాలని, బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఇస్తే వాటిని చదివేదెప్పుడని ప్రశ్నించారు. అనంతరం సభ్యులు అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరామ్, ఏవీఎన్ రెడ్డి, పింగిలి శ్రీపాల్రెడ్డి తదితరులు మాట్లాడుతూ బిల్లుకు సంబంధించి సూచనలు చేశారు. అనంతరం బిల్లును ఆమోదించినట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. అంతకుముందు శ్రీధర్బాబు తెలంగాణ ప్రజా విశ్వాసం బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు.
రెట్రోతో జాగ్రత్త
ఆరేళ్ల తర్వాత స్టేజ్పై సెలిన్ డియోన్.. అభిమానుల్లో పండగ!
రాబడి రూ.45,169 కోట్లు.. రుణాలు రూ.55,534 కోట్లు
కాకినాడ జీజీహెచ్లో దారుణం
డీఎస్సీపై నిజాయితీ నిరూపించుకోండి
మందు 'బాబుకు పండగ'
ఏపీలో పోలింగ్ ముగిశాక 17.25లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి
వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు
అమ్మేందుకే ఆయుధాలు చోరీ!
ఏఐ భయాలు నిజమేనా? సిలికాన్ వ్యాలీలో భిన్న వాదనలు!
ఒక్కసారే అన్ని కహానీలు ఎందుకు చెప్పార్సార్!!
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
నా భర్త జీవితం సర్వనాశనమైంది : సుమంత్ భార్య
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
బిగ్బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
రెట్రోతో జాగ్రత్త
ఆరేళ్ల తర్వాత స్టేజ్పై సెలిన్ డియోన్.. అభిమానుల్లో పండగ!
రాబడి రూ.45,169 కోట్లు.. రుణాలు రూ.55,534 కోట్లు
కాకినాడ జీజీహెచ్లో దారుణం
డీఎస్సీపై నిజాయితీ నిరూపించుకోండి
మందు 'బాబుకు పండగ'
ఏపీలో పోలింగ్ ముగిశాక 17.25లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి
వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు
అమ్మేందుకే ఆయుధాలు చోరీ!
ఏఐ భయాలు నిజమేనా? సిలికాన్ వ్యాలీలో భిన్న వాదనలు!
ఒక్కసారే అన్ని కహానీలు ఎందుకు చెప్పార్సార్!!
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
నా భర్త జీవితం సర్వనాశనమైంది : సుమంత్ భార్య
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
బిగ్బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఫొటోలు
'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)
విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)
వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)
బేబీ బంప్తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)
'ఎపిక్' షూటింగ్లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)
వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)
సమంత స్టన్నింగ్ లుక్స్ అదుర్స్ (ఫొటోలు)
ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)
‘ది ప్యారడైజ్’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
సినిమా
నవ్వులు పూయిస్తున్న ‘హ్యాపీ జర్నీ’ ట్రైలర్
అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన్యతనిస్తూ రూపొందుతోంది. ఈ సినిమా సెప్టెంబరు 18న విడుదల కానుంది. ఈమేకు ఈ చిత్రం నుంచి ట్రైలర్ శనివారం విడుదల చేశారు. వయసుతో సంబంధంలేకుండా అన్నపూర్ణమ్మ చేసిన యాక్టింగ్ ఆకట్టుకుంటోది. కామిడీ పంచ్లు కూడా బాగా పేలాయి. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రంల్లో నటిస్తున్నారు.
సినిమాల్లో అవకాశం అంటూ మోసం.. రోడ్డెక్కిన బాధితులు
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్షల్లో వసూలు చేసి మోసానికి ఒడిగట్టిన ఘటన హైదరాబాద్లో కలకలం సృష్టించింది. ఈమేరకు తమకు న్యాయం చేయాలంటూ భాదితులు అంబర్పేట్ శివం రోడ్డులోని సినిమా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంతమేర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.సినిమాలో అవకాశం ఇప్పిస్తామంటూ తమ దగ్గర రూ.లక్షల్లో డబ్బులు వసూళు చేసినట్లు బాధితులు తెలిపారు. తీరా అడిగే సరికి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని వారంతా వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇప్పించాలని వారంతా కోరారు. శివకుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: డీ10 విన్నర్ రాజు పై కేసు.. Victims protest at the residence of film distributor Shivakumar Goud.They alleged that Shivakumar had collected lakhs of rupees from several individuals by promising to secure film offers for them. pic.twitter.com/sQCOa6f0IC— Shakeel Yasar Ullah (@yasarullah) September 12, 2026
టీవీ షో డీ10 విన్నర్ రాజు పై కేసు.. యువతిని వేధించాడంటూ ఆరోపణలు
డీ10 టీవీ షో విన్నర్ రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ యువతిని లైంగికంగా వేధించాడంటూ ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఈ నెల 9న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు రాజును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే రాజుపై కేసు నమోదు చేసిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్నిరోజులుగా గోప్యంగా ఉంచినట్లు సమాచారం.డీ10 టీవీ షో ద్వారా రాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షో విన్నర్గా నిలిచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
బిగ్బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్
బిగ్బాస్ సీజన్10లో అగ్ని పరీక్ష తర్వాత మొదలవుతుంది అసలైన మహాపరీక్ష అని ముందే చెప్పినట్టుగానే బిగ్బాస్ హౌస్లో ఇప్పుడు అసలు ఆట మొదలైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టగా.. కేవలం ముగ్గురు మాత్రమే హౌస్మేట్స్గా మారారు. మరో ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్లో కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!అయితే ఎలిమినేట్ అయిన ఇద్దరినీ బిగ్బాస్ ఇంకా సీక్రెట్ రూమ్లోనే ఉంచాడని పలువురు కంటెస్టెంట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున.. చరణ్, చైత్రలతో ఫోన్లో మాట్లాడి.. వాళ్లు తమ ఇంటి దగ్గరే ఉన్నారని కన్ఫామ్ చేయించారు. దీంతో ఇక ఎలిమినేషన్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని వారికి క్లారిటీ ఇచ్చారు. కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్..ఈ క్రమంలో నాగార్జున కూడాడఇచ్చాడు. ఆటలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. గేమ్లో ఎవరు నిర్లక్ష్యం చేసినా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో 11 మంది రిస్క్లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు తమ గేమ్ను మరింత పదును పెడతారో చూడాలి.
క్రీడలు
జ్వెరెవ్ X షెల్టన్
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో కొత్త విజేత ఎవరో నేడు తేలనుంది. తొలి టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్న టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 8వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) నేడు జరిగే ఫైనల్ పోరులో తలపడనున్నారు. జ్వెరెవ్ ఫైనల్ చేరడం ఇది రెండో సారి. 2020లో ఆఖరి మెట్టుపై అతని డొమినిక్ థీమ్ చేతిలో ఓడి రన్నరప్గా నిలవగా, షెల్టన్ ఫైనల్కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి, వింబుల్డన్ ఫైనల్లో ఓడిన జ్వెరెవ్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో జ్వెరెవ్ 6–3, 7–6 (9/7), 7–6 (8/6) స్కోరుతో కరెన్ ఖచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. ఆ తర్వాత జరిగిన రెండో సెమీస్లో షెల్టన్ 4–6, 6–3, 6–3, 7–5తో అమెరికాకే చెందిన ఫ్రాన్సిస్ టియాఫోను ఓడించాడు. సెమీస్ మ్యాచ్కు ముందు ఖచనోవ్తో ఆడిన 9 మ్యాచ్లలో 6–3తో ఆధిక్యంలో ఉన్న జ్వెరెన్ ఈ సారి కూడా తన పైచేయిని ప్రదర్శించాడు. తొలి సెట్లో 3–3 తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మరో గేమ్ కూడా అలవోకగా జ్వెరెవ్ ఖాతాలో చేరింది. తర్వాతి రెండు సెట్లలో మాత్రం టాప్ సీడ్కు గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరూ హోరాహోరీగా పోరాడటంతో స్కోరు టైబ్రేక్కు చేరింది. ఈ దశలో ఖచనోవ్ పైచేయి సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయాడు. మూడో సెట్ కూడా దాదాపు ఇదే తరహాలో సాగింది. టైబ్రేక్లో 2–5తో వెనుకబడినా జ్వెరెవ్ పట్టుదలగా తన స్థాయికి తగ్గ ఆటతీరుతో మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. జ్వెరెవ్ 15 ఏస్లతో విరుచుకుపడటం విశేషం. టియాఫోతో జరిగిన రెండో సెమీస్లో షెల్టన్ తొలి సెట్ చేజార్చుకున్నా... కోలుకొని ఆ తర్వాత ప్రత్యర్థిపై చెలరేగుతూ దూసుకుపోయాడు. ఈ సెట్లో ఏకంగా 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన షెల్టన్ సహచర అమెరికన్కు అవకాశం కల్పించాడు. రెండో సెట్లో ఎనిమిదో గేమ్ను బ్రేక్ చేసి ముందంజ వేసిన షెల్టన్ సునాయాసంగా సెట్ను ముగించాడు. మూడో సెట్ కూడా అతని నియంత్రణలోనే సాగింది. ఈ సెట్లోనే అతను 12 విన్నర్స్ కొట్టడం షెల్టన్ ఆధిపత్యాన్ని చూపించింది. 1972 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి నల్లజాతి అమెరికన్గా షెల్టన్ గుర్తింపు పొందాడు. అతను గెలిస్తే ఆండీ రాడిక్ (2003) తర్వాత గ్రాండ్స్లామ్ నెగ్గిన మొదటి అమెరికా ఆటగాడిగా నిలుస్తాడు.
ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్
ఆఫ్ఘనిస్తాన్తో రేపు జరుగబోయే తొలి టీ20కి ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మ్యాచ్కు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాలపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు.దులీప్ ట్రోఫీ ఫైనల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్లు (270, 80) ఆడటం వల్ల ఇషాన్ కొంత అలసటకు గురయ్యాడని, ప్రస్తుతం అతడు సౌకర్యంగానే ఉన్నాడని ఆయన చెప్పాడు. ఇషాన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ స్వల్ప గాయానికి గురయ్యాడు. దీంతో అతడు తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్కు కూడా దూరంగా ఉన్నాడు.ఇషాన్ ఆడకపోతే సంజూకు అవకాశం?ఒకవేళ ఇషాన్ కిషన్ పూర్తిగా కోలుకోకపోతే తొలి టీ20లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు.ఇషాన్ స్థానంలో ఒకవేళ ఆల్రౌండర్ను తీసుకోవాలని భావిస్తే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి టీ20 రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్దే మూడో టెస్టు.. పాకిస్తాన్ క్లీన్స్వీప్
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో పాకిస్తాన్ వైట్వాష్కు గురైంది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పాకిస్తాన్పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 24.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లిద్దరు డకౌట్ అయినప్పటికీ, జోర్డాన్ కాక్స్ (59 నాటౌట్), కెప్టెన్ జో రూట్ (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 453 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (75), జేమీ స్మిత్ (69), డాన్ లారెన్స్ (65), ఎమిలో గే (60), ఓలీ రాబిన్సన్ (50) అర్థసెంచరీలు సాధించారు. అయితే ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 133 పరుగులకే కుప్పకూలింది. జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫాలోఆన్ ఆడిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 449 పరుగులకు ఆలౌటైంది. షాన్ మసూద్ (95), బాబర్ ఆజం (76), రజాఉల్లాహ్ (81), అజన్ అవైస్ (59) అర్థసెంచరీలు సాధించారు. డాన్ లారెన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.సంక్షిప్త స్కోర్లుపాకిస్తాన్ 133 & 449ఇంగ్లండ్ 453 & 130/2👉టెస్టుల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ వైట్వాష్కు గురవ్వడం ఇది రెండోసారి. 2022-23లో పాక్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్ను కూడా ఇంగ్లండ్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక ఇంగ్లండ్కు టెస్టుల్లో ప్రత్యర్థిపై ఇది 15వ క్లీన్స్వీప్. అదే సమయంలో పాకిస్తాన్ టెస్టుల్లో వైట్వాష్కు గురవ్వడం ఇది పదకొండోసారి.👉ఇంగ్లండ్ గడ్డపై ఒక మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఒక్క సెంచరీ నమోదు కాకపోవడం ఇది రెండోసారి కాగా, గతంలో 1888 యాషెస్ సిరీస్లోనూ ఒక్క సెంచరీ నమోదు కాలేదు. ఇక ఓవరాల్గా టెస్టు క్రికెట్లో ఒక టెస్టు సిరీస్లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం ఇది ఎనిమిదోసారి.3-0 SERIES SWEEP! 💪 pic.twitter.com/TTCM4ZHvWb— England Cricket (@englandcricket) September 12, 2026ఇదీ చదవండి: #80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్!
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక అర్ద సెంచరీలు చేసిన బ్యాటర్గా అవతరించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు.టెస్టుల్లో అత్యధిక అర్ధశతకాలు69* - జో రూట్68 - సచిన్ టెండూల్కర్66 - ఎస్. చందర్పాల్63 - అలెన్ బోర్డర్63 - రాహుల్ ద్రవిడ్62 - రికీ పాంటింగ్రూట్ (62 నాటౌట్)తో పాటు జోర్డన్ కాక్స్(59 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో మూడో టెస్ట్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. ఫలితంగా స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.ఈ మ్యాచ్లో పాక్ తొలి ఇన్నింగ్స్లో 133 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 449 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 453, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఇదీ చదవండి: #80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్!
న్యూస్ పాడ్కాస్ట్
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
బిజినెస్
ఊహకందని బంగారం ధరలు.. వారం రోజుల్లో ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఊహకందని రీతిలో మారిపోతున్నాయి. ఉదయం భారీగా తగ్గిన రేటు, సాయంత్రానికి పెరిగిపోతోంది. దీంతో పసిడి ప్రియులలో ఒకింత ఆందోళన మొదలైపోయింది. ఈ కథనంలో వారం (సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు) రోజుల్లో బంగారం ధరల్లో జరిగిన మార్పులు ఏమిటి?, ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సెప్టెంబర్ 06న హైదరాబాద్, విజయవాడలలో రూ.1,54,800 వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రేటు, సెప్టెంబర్ 12న రూ.1,54,580 వద్దకు చేరింది. అంటే.. వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ తగ్గుతూ రూ.16 వేలకు చేరువవుతోందని తెలుస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,900 నుంచి రూ.1,41,700 వద్దకు చేరింది.చెన్నైలో గత ఆదివారం (సెప్టెంబర్ 06) రూ.1,54,800 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, శనివారం (సెప్టెంబర్ 12) నాటికి 1,54,580 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 1,41,900 నుంచి రూ.141700 వద్దకు చేరింది. వారం మధ్యలో ధరల్లో చాలా మార్పు వచ్చినప్పటికీ.. వారాంతం నాటికి కొంత పెరిగినట్లు తెలుస్తోంది.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు వచ్చాయి. వారం ప్రారంభంలో రూ.1,54,950 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, వారాంతానికి 1,54,730 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,050 నుంచి రూ.1,41,850 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఒకేరోజు 20 లక్షల ట్రైన్ టికెట్స్ బుకింగ్!
AI రేసులో భారత్.. పెట్టుబడుల్లో భారీ వృద్ధి!
భారతదేశంలో ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. పలు కంపెనీలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. సర్వీస్నౌ విడుదల చేసిన ఎంటర్ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్ 2026 ప్రకారం.. దేశీయ సంస్థల్లో AIపై పెట్టుబడులు ఒక్క సంవత్సరంలోనే 119 శాతం పెరిగాయని తెలుస్తోంది.2027 నాటికి 21.3 శాతం!ప్రస్తుతం ఇండియన్ కంపెనీలు తమ ఐటీ బడ్జెట్లో సగటున 16.6 శాతం ఏఐ కోసం ఖర్చు చేస్తున్నాయి. 2027 నాటికి ఇది 21.3 శాతానికి చేరుతుందని అంచనా. దీనివల్ల భారతదేశం ఏఐ రంగంలో ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది.ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ.. దానిని సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన గవర్నెన్స్ మాత్రం ఆ స్థాయిలో లేదు. భారతదేశంలోని కేవలం 22 శాతం సంస్థలకే ఏఐ టెస్టింగ్, ఆడిటింగ్, రిస్క్ అసెస్మెంట్ వంటి విధానాలు ఉన్నాయి. 54 శాతం సంస్థలు ఏఐ ఏజెంట్ను ఉపయోగిస్తున్నప్పటికీ, కేవలం 11 శాతం మాత్రమే అటానమస్ వర్క్ఫ్లోను అమలు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ వల్ల వచ్చే సమస్యలపై సంస్థలకు ఉన్న ఆందోళనలు. కాబట్టి ఏఐను వేగంగా ఉపయోగించడం మాత్రమే కాకుండా, దాన్ని బాధ్యతాయుతంగా నియంత్రించడం కూడా చాలా అవసరం.ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే..ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే మంచి డేటా, సిస్టమ్స్ అవసరం. అయితే.. భారతీయ సంస్థల్లో ఇది ఇంకా ఒక పెద్ద సవాలుగానే ఉంది. 74 శాతం కంపెనీలు.. డేటా అక్యురసీ, యాక్సెస్, మేనేజ్మెంట్ వంటి వాటిన మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.కాగా మరో 56 శాతం సంస్థలు లెగసీ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ప్రధాన సమస్యగా గుర్తించాయి. కేవలం 18 శాతం కంపెనీలు మాత్రమే విడివిడిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్స్కు భర్తీ చేశాయి. వివిధ విభాగాల డేటా ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకపోతే ఏఐకు పూర్తి సమాచారం అందదు. అందువల్ల ఏఐ అభివృద్ధితో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా బలోపేతం చేయాలి.ప్రభుత్వం చర్యలుఏఐ విషయంలో భారత ప్రభుత్వం కూడా కొన్ని ముఖ్యమైన చర్యలు చేపడుతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ యాక్ట్, డీపీడీపీ రూల్స్, ఏఐ గవర్నెన్స్ గైడ్లైన్స్, ఇండియాఏఐ మిషన్, ఇండియాఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ వంటి కార్యక్రమాలు ఏఐ ఇన్నోవేషన్తో పాటు ప్రైవసీ, సేఫ్టీ, అకౌంటబిలిటీ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తోంది.ఇదే విధంగా సంస్థలు కూడా తమ ఇంటర్నల్ గవర్నెన్స్ సిస్టంను బలపరచాలి. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లకు ఎంతవరకు డేటా, సిస్టమ్స్ యాక్సెస్ ఇవ్వాలి, ఎక్కడ హ్యూమన్ సూపర్ విజన్ అవసరం అనే విషయాలను స్పష్టంగా నిర్ణయించాలి. ఏఐపై ప్రజలకు, సంస్థలకు నమ్మకం ఏర్పడాలంటే ఈ గవర్నెన్స్ చాలా కీలకం. మొత్తం మీద.. భారతదేశం ఏఐలో పెట్టుబడులు పెట్టడంలో వేగంగా ముందుకు సాగుతోంది, కానీ గవర్నెన్స్ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారంలో పెట్టుబడి.. రూ.1 లక్షకు రూ.3.64 లక్షలు!
మొబైల్ డేటాపై పన్నుకు బ్రేక్!
దేశంలో మొబైల్ డేటా వినియోగంపై ప్రత్యేక పన్ను (డేటా టాక్స్) విధించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవడానికి కేంద్ర టెలికాం శాఖ (డాట్) సన్నాహాలు చేస్తోంది. ఈ పన్ను అమలులో ఎదురయ్యే సాంకేతిక చిక్కులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణపై పడే ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం.నేపథ్యం.. ప్రతిపాదనప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో భాగంగా డేటా వినియోగం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు చిన్నారుల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడమే లక్ష్యంగా డేటాపై పన్ను ప్రతిపాదనను పరిశీలించాలని డాట్ని ఆదేశించారు. గిగాబైట్కు(జీబీ) రూ.1 చొప్పున పన్ను విధించే మోడల్ను సెప్టెంబర్ 30 నాటికి రూపొందించాలని తొలుత భావించారు.ఎదురైన సవాళ్లుడేటా పన్ను అమల్లో ప్రాథమికంగా కొన్ని సమస్యలు గుర్తించారు. ప్రతి వినియోగదారుడి డేటా వాడకాన్ని సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. ఒకవేళ రీఛార్జ్ ప్యాక్లపై నేరుగా పన్ను వేస్తే తక్కువగా వినియోగించే వారికి కూడా అదనపు భారం పడుతుంది. యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, ఆరోగ్య సేవలు, ఈ-కామర్స్ వంటి నిత్య జీవితంలో డేటా అత్యవసరంగా మారింది. ఉత్పత్తికి ఉపయోగపడే డేటా, ఎంటర్టైన్మెంట్ డేటాను వేరు చేయడం వీలుపడదు. ఇప్పటికే రీఛార్జ్లపై 18% జీఎస్టీ చెల్లిస్తున్న వినియోగదారులపై మరింత భారం మోపడం డిజిటల్ ఇండియా ఆశయాలకు విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.డేటా వినియోగ గణాంకాలుడాట్ అధికారిక డేటా ప్రకారం, భారతదేశంలో మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2025లోని 229 బిలియన్ జీబీతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం 2026 నాటికి డేటా వినియోగం 24.5% పెరిగి 285 బిలియన్ జీబీకి చేరుకుంది. డిజిటల్ వ్యసనం, చిన్నారుల్లో స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు పన్నులు విధించడం సరికాదని నిపుణులు స్పష్టం చేశారు. వయస్సు నిర్ధారణ ప్రక్రియ, పేరెంటల్ కంట్రోల్స్, కంటెంట్ నియంత్రణ వంటి సాంకేతిక చర్యల ద్వారా మాత్రమే ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ
భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన మరోసారి ఆయన ప్రత్యేక భద్రతా ఏర్పాట్లపై ఆసక్తిని పెంచింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి చేరుకున్న పుతిన్ వెంట భారీ భద్రతా కాన్వాయ్ కూడా వచ్చింది. ఆయన ప్రయాణించే ప్రత్యేక అధ్యక్ష విమానంతో పాటు, అత్యంత భద్రతతో కూడిన ఆరస్ సెనాట్ (Aurus Senat) లిమోసిన్ కూడా విదేశీ పర్యటనలకు తరలించడం రష్యా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థలో కీలక భాగంగా మారింది.ప్రపంచ దేశాల అధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు స్థానికంగా ఏర్పాటు చేసిన అధికారిక వాహనాలను ఉపయోగించడం సాధారణం. అయితే పుతిన్ మాత్రం విదేశీ పర్యటనల్లోనూ తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆరస్ సెనాట్ వాహనాన్నే వినియోగిస్తారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో కూడిన ఈ లిమోసిన్ను అందుకే ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా అభివర్ణిస్తుంటారు.పుతిన్ కారు ప్రత్యేకత ఏంటి?పుతిన్ కాన్వాయ్లో సాధారణంగా భారీ సంఖ్యలో వాహనాలు ఉంటాయి. విదేశీ పర్యటనల సమయంలో మాత్రం ఆయన ప్రయాణించే ఆరస్ సెనాట్కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్, పేలుళ్లను తట్టుకునే సామర్థ్యం వంటి రక్షణ వ్యవస్థలతో ఈ కారును రూపొందించినట్లు తెలుస్తోంది.ఆరస్ సెనాట్ను రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ అభివృద్ధి చేసింది. రష్యన్ స్టేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నామి, సోలర్స్ జేఎస్సీ, యూఏఈకి చెందిన తవాజున్ హోల్డింగ్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రష్యా ప్రభుత్వం దేశీయంగా అత్యాధునిక లగ్జరీ, రక్షణ వాహనాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘కోర్టెజ్’ ప్రాజెక్టులో భాగంగా సెనాట్ రూపొందింది. 2018లో ఈ మోడల్ను పరిచయం చేశారు. దీని డిజైన్కు సోవియట్ కాలం నాటి ZIS-110 లిమోసిన్ నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతారు.ఇంజిన్.. వేగంపుతిన్ ఉపయోగించే ఆరస్ సెనాట్లో 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్, హైబ్రిడ్ వ్యవస్థతో కలిపి పనిచేస్తుంది. ఇది సుమారు 598 హార్స్పవర్, 880 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో ఈ కారు పనిచేస్తుంది.సెనాట్ పొడవు సుమారు 5,630 మిల్లీమీటర్లు, వెడల్పు 2,000 మిల్లీమీటర్లు, ఎత్తు 1,700 మిల్లీమీటర్లుగా ఉంటుంది. గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ లిమోసిన్.. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారు 9 సెకన్లలో చేరగలదని సమాచారం.భద్రతకు పెద్దపీటరష్యా అధ్యక్షుడి కోసం రూపొందించిన ఈ ప్రత్యేక వాహనంలో అత్యున్నత స్థాయి భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ రక్షణతో పాటు పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించినట్లు సమాచారం. యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.భద్రతతో పాటు సౌకర్యాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అధిక నాణ్యత కలిగిన లెదర్, వుడ్ ట్రిమ్, ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థలతో కారు ఇంటీరియర్ను రూపొందించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా ఈ వాహనాన్ని తీర్చిదిద్దినట్లు సమాచారం.మూమూలు ప్రజలూ వాడొచ్చు!ఆరస్ సెనాట్కు సాధారణ పౌరుల కోసం ప్రత్యేక వెర్షన్ కూడా ఉంది. అయితే దీని ఉత్పత్తిని పరిమిత సంఖ్యలోనే చేపడుతున్నట్లు సమాచారం. పౌర వెర్షన్ ధర సుమారు 18 మిలియన్ రూబిళ్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.2.5 కోట్లు.అయితే పుతిన్ ఉపయోగించే ప్రత్యేక అధ్యక్ష వెర్షన్ ధర, రక్షణ స్థాయి వంటి వివరాలు సాధారణంగా బహిరంగంగా వెల్లడించరు.గత ఏడాది చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్తో కలిసి ఇదే ఆరస్ సెనాట్లో ప్రయాణించడం కూడా అప్పట్లో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. దీంతో రష్యా అధ్యక్షుడి ప్రత్యేక లిమోసిన్పై ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆసక్తి పెరిగింది.
ఫ్యామిలీ
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
‘‘మా ‘అత్తమ్మ’, మా ‘నాన్న’... మా ఇంటికి పిల్లర్స్’’ అంటున్నారు రష్మికా మందన్నా. మామగారిని నాన్న అని పిలుస్తారామె. ‘దేవరకొండ’ ఇంటి కోడలిగా రష్మిక తొలి వినాయక చవితి పండగని జరుపుకోనున్నారు. మరి... పండగ ప్లాన్ ఏంటి? అంటే... ‘‘మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలను కుంటున్నాను’’ అన్నారు రష్మిక. ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన పలు వేడుకల్లో రష్మిక పాల్గొన్నారు. ఇప్పుడు ‘దేవరకొండ రష్మిక’గా పండగ చేసుకోవడం ఓ స్పెషల్ ఫీలింగ్ అన్నారామె. వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ‘దేవరకొండ రష్మిక’ చెప్పిన విశేషాలు...→ మీ ఇంట్లో పండగ ప్లాన్లో ఎవరి భాగం ఎక్కువ?అంతా మా అత్తమ్మే. ఇంట్లో ప్రతిదీ తనే ప్లాన్ చేస్తారు. నేను ఆమె చేసేవన్నీ జస్ట్ అలా ఎంజాయ్ చేస్తాను. నేననే కాదు... ఇంట్లో మేం అందరం బాధ్యత అంతా పూర్తిగా అత్తమ్మకే వదిలేస్తాం. అయితే డైట్ విషయంలో మేమంతా చాలా జాగ్రత్తగా ఉంటాం. బహుశా పండగ రోజు కూడా డైట్ నియమాలను పాటిస్తామేమో. మేం డైట్ పాటించినా, పాటించకపోయినా, ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా... ఇంట్లో ఏమేం చేయాలో అన్నీ మా అత్తమ్మే చూసుకుంటారు. → మీరు, మీ భర్త... మీ ఇద్దరిలో ఎవరికి భక్తి ఎక్కువ? ఇద్దరికీ... నేను ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు వర్క్ మీద వెళ్లేటప్పుడు పూజ చేసుకుని వెళతాను. విజయ్ కూడా చేస్తుంటారు. మేం ఇద్దరం గుడికి కూడా బాగా వెళుతుంటాం. భక్తి తాలూకు ఆ అనుభూతిని ఇద్దరం ఆస్వాదిస్తాం. → పండగకు ఇంటిని అలంకరించే విషయం కూడా మీ అత్తమ్మ చెప్పినట్లేనా? అంతే... ఇంట్లో ఎలాంటి సందడి నెలకొన్నా మా అత్తమ్మకే థ్యాంక్స్ చె΄్పాలి. మా అత్తమ్మ మా ఇంటికి ‘సూర్య రశ్మి’లాంటివారు. ఇంటిని అలంకరించడం, పిండి వంటలు చేయడం నుంచి పూజ చేయడం వరకూ అన్నీ ఆమే చేస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు మేం ఎంజాయ్ చేస్తాం. → మరి... పండగ వేడుకల్లో మీ మామయ్యగారు, మరిది (ఆనంద్ దేవరకొండ) భాగస్వామ్యమో? విజ్జు (విజయ్ దేవరకొండ), నాన్న, నా, ఆనంద్... మా అందరి భాగస్వామ్యం ఈక్వల్గా ఉంటుంది.. అయితే ఇంటి సారథి మాత్రం కచ్చితంగా అత్తమ్మే. మేం నలుగురం ఆమె మాట వింటాం... చెప్పినది చెప్పినట్లు నిజాయితీగా చేస్తాం. ఎందుకంటే మేం మా పనుల్లో మునిగిపోతాం... ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటాం. సో... ఇంట్లో మమ్మల్ని నిలకడగా ఉంచేది మా అత్తమ్మే. అసలు ఆవిడ పనులను ఎంత బాగా చేస్తారంటే... మెచ్చుకోవాలనిపిస్తుంటుంది. అంత బాధ్యతగా ఇంటిని పట్టించుకుంటారు కాబట్టే అత్తమ్మ ఏం చెబితే అది నమ్మి చేసేస్తాం. → ఇప్పుడు దేవరకొండ ఇంటి కోడలిగా పండగలో పాలుపంచుకోబోతున్నారు... ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు ఆ ఇంటి పూజల్లో పాల్గొన్నారా? పండగలప్పుడు, పూజలప్పుడు మా అత్తమ్మ దగ్గరవాళ్లందర్నీ పిలుస్తారు. ఈ ఇంటి ఆనవాయితీ అది. అలా నన్ను కూడా పిలిచేవారు. నన్ను సొంత మనిషిలా అనుకునేవారు. సో... ‘రష్మిక’లా ఈ ఇంటి వేడుకల్లో నేను చాలాసార్లు పాల్గొన్నాను. → ‘మిస్ రష్మిక’గా వెళ్లినప్పుడు ఇప్పుడు ‘మిసెస్ విజయ్’గా ఆ ఇంట్లో ఉంటున్న మీకు కనిపించిన తేడా? నిజాయితీగా చె΄్పాలంటే... ఏ తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదు. ఒప్పుడు ఓ ఫ్రెండ్లా నన్ను ఇంటికి పిలిచేవారు. ఇప్పుడు విజ్జు భార్యగా ఆ ఇంట్లో ఉన్నాను. వ్యక్తులుగా మాలో ఏ మార్పూ లేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే... ఆ కుటుంబ సభ్యురాలిగా ఉండటం అనే అనుభూతి వేరు. ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో దక్కే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం.→ ఎప్పుడైనా వినాయకుడి బొమ్మను గీశారా?నాకు బొమ్మలు గీయడం అస్సలు రాదు, కానీ రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. వినాయకుడి బొమ్మ గీసే అవకాశం ఎప్పుడూ రాలేదు. నాక్కూడా గీయాలనిపించలేదు. ఎందుకంటే నేను ఆ రూపానికి న్యాయం చేయలేనని నా ఫీలింగ్. అందుకే అసలు ప్రయత్నం కూడా చేయకూడదనుకున్నాను. కానీ రెండు సంవత్సరాల క్రితం ఎవరో నన్ను మట్టితో వినాయకుణ్ణి తయారు చేయమని అడిగితే కాదన లేక ప్రయత్నం చేశాను. నాకు చేతనైనంతలో బాగానే చేశాను.→ పెళ్లి వేడుకల్లో మీరు కట్టుకున్న చీరలన్నీ బాగున్నాయి... మరి... పండగ రోజు ఏం ప్లాన్ చేస్తున్నారు? కచ్చితంగా చీర కట్టుకుంటాను. ఈ పండగ జరుపుకోవడానికి వర్క్ నుంచి నాకు కొన్ని గంటలైనా బ్రేక్ దొరికితే బాగుండు అను కుంటున్నాను. ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ మెటీరియల్ శారీ కట్టుకోవాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలా ఉన్నాయి... అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది కట్టుకుంటాను.→ ఇటీవల విజయ్ ‘సీడ్ గణేశా’కి ప్రాధాన్యం ఇవ్వాలంటూ మట్టి వినాయకుడితో దిగిన ఫొటో బయటకు వచ్చింది... అవును... మా ఇంట్లో మేం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం. రాబోయే తరాలకు సుర క్షితమైన పర్యావరణం ఉండాలి కదా. అందుకు మా వంతు కృషి చేస్తాం. అందుకే ‘ఎకో ఫ్రెండ్లీ’ వినాయకుడిని ఇంటికి తీసుకు వస్తున్నాం. మేమే కాదు... అందరం ఎకో ఫ్రెండ్లీగా పండగ చేసుకుందాం.– డి.జి. భవాని
ఏనుగు బొజ్జ.. చిన్న ఎలుక.. ఇందులో ఇంత పెద్ద తత్త్వమా?
మొన్న ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర రోడ్డు పక్కన రెండు మూడు కిలోమీటర్ల ΄÷డుగునా గణేష్ విగ్రహాలు కనిపించాయి. గణపతుల గణాలు భూమ్మీదకి దిగినట్టుగా ఉంది. అలా ఆ విగ్రహాల్ని చూస్తూ ముందుకు పోతుండగా అక్కడొకచోట ఒకాయన కనిపించాడు. ‘ఇదేమిటి! ఇక్కడ ఈ గ్రీకు పెద్దమనిషి కనిపిస్తున్నాడు’ అని కళ్ళు నులుముకుని చూసాను. సందేహం లేదు.. అతనే... పుస్తకాల్లో చూసిన ముఖమే.ఎపిక్టెటస్!‘మనల్ని బాధపెట్టేది జరిగే సంఘటనలు కాదు, ఆ సంఘటనల గురించి మనం ఏమనుకుంటున్నామో అది’ అని చెప్పిన గొప్ప తత్త్వవేత్త. ఒకప్పుడు బానిసగా బతికిన రోజుల్లో, అతడి యజమాని ఒకసారి అతడి మీద కోపంతో అతడి కాలు విరిచేసాడు. అందుకని ఇప్పుడు ఆ కాలున్నవైపు కొద్దిగా వాలి ఉన్నాడు. కానీ మార్కస్ అరీలియస్ లాంటి చక్రవర్తికే దారి చూపించిన వాడు. ‘మీరేమిటిక్కడ?’ అనడిగి, ‘నాకింకా నమ్మశక్యం కాకుండా ఉంది. లేకపోతే ఒకటో శతాబ్దపు రోమ్ ఎక్కడ? ఈ ΄ాత బోయిన్పల్లి ఎక్కడ?’ అన్నాను.‘నువ్వేకదా నన్ను తలుచుకుంటూ ఉన్నది’ అన్నాడు ఎపిక్టెటస్ నా వైపు చూపు తిప్పకుండానే. ఆయన ఆ గణేష్ మూర్తుల్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు.అప్పుడు తట్టింది, అప్పటికి రెండు మూడు రోజులుగా నేను ఆయన పుస్తకాలే చదువుతున్నానని. ‘అంటే మీరు ఎవరు తలుచుకుంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతారా?’ అనడిగాను.‘అవును. నిన్ననే, పుణేలో ఎవరో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ΄ాఠాలు చెప్తూ నా మాటలు పదే పదే చెప్తూ ఉంటే అక్కడికి పోక తప్పింది కాదు’ అని అంటూ ‘ఈయనేమిటి? ఇలా ఉన్నాడు... ఏథెన్సులోనూ, రోములోనూ నేనిలాంటి శిల్పాలు ఎప్పుడూ చూడలేదు’ అని అన్నాడు ఆశ్చర్యపోతూ.‘ఈయన వినాయకుడు, విఘ్నాధిపతి. మావాళ్ళు చెప్పేదేమంటే ఆయన మొదట్లో రైతుల దేవుడని, ప్రకృతి దేవుడని, పర్యావరణానికి దేవుడని. ఆ చెవులు చేటలు, ఆ బొజ్జ సుభిక్షానికి గుర్తు, ఆ ఎలుక రైతుల విరోధి కదా, అందుకని లొంగదీసుకున్నాడంటారు..’ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎపిక్టెటస్ నా వైపు తిరిగి నన్ను పరిశీలనగా చూసాడు.‘కాదు కాదు... నువ్వు ఆ అవయవాల్ని వర్ణిస్తున్నావు. అవి అలా ఎందుకున్నాయో వివరిస్తున్నావు. నేను ఆలోచిస్తున్నది అది కాదు. నిన్న ట్రయినింగ్ క్లాసులో అంతా పిల్లలు... వాళ్ళ మాటలే ఇంకా నా చెవుల్లో వినబడుతున్నాయి. అందులో ఒకమ్మాయి ఆ ఫాకల్టీని అడుగుతోంది... నన్నంతా లావుగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటున్నారు, డైటింగ్ చెయ్యాలంటారు, యోగా చెయ్యాలంటారు... నాకు చాలా ఆందోళనగా ఉంది. నేనేం చెయ్యాలో చెప్పండి అని.కానీ, చూడు మిత్రమా.. బాడీ షేమింగ్ని పూర్తిగా జయించినవాడు ఇలా ఉంటాడు. ఎంత అన్ అ΄÷లొజిటిక్గా ఉన్నాడు. అచ్చం మా సోక్రటీసులాగా ఉన్నాడు. లోకం పెట్టుకునే ఏ కొలతలకీ లొంగిపోకుండా తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉన్నాడు. తను తనుగా. అలా ఉండాలంటే ముందు కావలసింది అటువంటి ఆత్మనిశ్చయత, అటువంటి ఆత్మనిర్భరత. ముందు నిన్ను నువ్వు అంగీకరిస్తే అప్పుడు తక్కిన లోకమంతా నిన్ను గౌరవించి తీరుతుంది. అవునూ, ఆ దంతమెందుకు విరిగి పోయింది?’ అనడిగాడు.‘అదా.. వ్యాసుడు భారతం చెప్తూ ఉంటే ఈయన రాయడానికి కూర్చున్నాడు. మధ్యలో గంటం విరిగిపోయింది. కాని రాత ఆపకూడదని నియమం. అందుకని తన దంతం తనే విరుచుకుని దాంతో రాయడం మొదలుపెట్టాడంటారు’ అన్నాను.‘ఆహా! ఆ వ్యక్తిత్వం నేనూహించినట్టే ఉంది. అలాంటి వాళ్ళు ఒక పనికి పూనుకున్నారనుకో. వెనక్కి తగ్గరు. దేనికైనా సిద్ధపడతారు. తమ ఆత్మలోంచి కొంత ధారపోసి అయినా సరే ముందుకు నడుస్తారు. మనకి చూడటానికి వాళ్ళు గాయపడ్డారనిపిస్తుంది. కాని గాయాన్ని గేయంగా మార్చుకుంటారు. అందం కాదు, ఆర్భాటం కాదు, పదిమందీ ఏమనుకుంటారన్న ఆత్రుత కాదు, అన్నిటికన్నా ముందు తాము ఒప్పుకున్న పని ఆగిపోకుండా ముందుకు నడిచిందా లేదా. అంతే. అదే వాళ్ళకి నిజమైన అలంకారం’ అని అన్నాడు వెలుగు చిమ్ముతున్న చూపుల్తో.‘అలా అయితే ఆ ఎలక సంగతేమిటి?’ అనడిగాను. ‘ఇందాకా నువ్వు ఈయన్ని రైతుల దేవుడని చె΄్పావు. ఒక్క రైతులకే ఎందుకు? ఈయన మనుషులందరికీ దేవుడని ఆ ఒక్క ఎలకని బట్టి చె΄÷్పచ్చు. ఎలక చూడు. ఎంత రెస్ట్లెస్గా ఉంటుంది! నిలకడ లేని జీవి. ఊరికే పరుగెట్టుకుంటూ పోతుంది. కాని ఆయన దాన్ని వాహనంగా మార్చుకున్నాడు. అంత పెద్ద శరీరం, అంత చిన్న వాహనం. ఎవరేనా తమ యాంగ్జయిటీని అదుపు చేసుకోగలిగితే అలానే ఉంటుంది, చిన్న ఎలక మీద ఏనుగు వూరేగినట్టు. అద్భుతం కదా’ అని అన్నాడు.‘మరి ఆ చెవుల సంగతేమిటి?’ అనడిగాను. ఈలోపు ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది. ఒకటే హారన్లు. ఎపిక్టెటస్ ఆ ట్రాఫిక్ కేసి చూసాడు. ‘ఇప్పుడు కాదులే, మరోసారి మాట్లాడుకుందాం, ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటి కాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్. అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను.కానీ ఊరికే ఆందోళన పడిపోకు. నువ్వెలా బతకాలో నీ స్క్రిప్టు నువ్వే రాసుకో. అవసరమైతే నీలో ఒక భాగాన్ని తుంచెయ్యవలసి వస్తే తుంచెయ్యి. ఒక్క భాగమేమిటి? నీకు అప్పగించిన పనికి అవసరమైతే నిన్ను నువ్వే మూల్యంగా చెల్లించుకోడానికి సిద్ధపడు. గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ముందు నీకు నువ్వే ఒక పెద్ద అడ్డంకి. నిన్ను నువ్వు జయించుకున్నావా! నీకు తిరుగులేదు’ అని అంటూ వడివడిగా నడుచుకుంటూ ఆ జన సందోహంలో కలిసిపోయాడు, ఆ మహాతత్త్వవేత్త ఎపిక్టెటస్.– వాడ్రేవు చినవీరభద్రుడుఇదీ చదవండి: 1980ల నాటి వినాయక చవితి ఓ జ్ఞాపకం కదా!
1980ల నాటి వినాయక చవితి ఓ జ్ఞాపకం కదా!
‘కుడుమిస్తే పండగ’ అని సామెత. పిల్లలకు కుడుములు తెచ్చే వినాయక చవితి వస్తే ఇక పండగే. ‘ఓ బొజ్జ గణపయ్య... నీ బంటు నేనయ్యా... ఉండ్రాళ్లు చవిచూడవయ్యా’ అని పాటలు పాడతాం కానీ ఆ కుడుములు గణేశుడు తినడు పాపం... మాకే ఇచ్చేస్తాడు. బొజ్జ గణపయ్యకు పిల్లలంటే ఇష్టం కదా మరి.బాలగణేశుడు తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ తిరిగి అదే లోక ప్రదక్షిణగా గణనాయకుడైపోయాడు. ఆయన కేవలం తల్లిదండ్రుల చుట్టే తిరిగాడు. మేమైతే తల్లిదండ్రులు చెప్పిన స్కూళ్ళు, పుస్తకాలు, ట్యూషన్ల చుట్టూ తిరుగుతూ వినాయక చవితిరోజు మాకు బాగా మార్కులు రావాలని పుస్తకాలన్నీ తెచ్చి వినాయకుని విగ్రహం దగ్గర పెట్టేవాళ్లం. నూరు ఇవ్వకపోయినా గట్టున పడేసేవాడు.అప్పట్లో డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని? రూపాయి రూపాయికి అందరూ వెతుక్కోవడమే. మరి దేవుణ్ణి పెట్టాలంటే డబ్బు ఏదీ? అందుకే చందాలు మొదలయ్యాయి. ఇంటింటికీ తిరిగి రూపాయి, అర్ధ చందాలు వసూలు చేసి దేవుడి విగ్రహం పెట్టేవాళ్లు. ఇప్పటిలా వీధి వీధినా ఒకటి లేదనుకోండి. ఊరికి ఒకటి. అదీ మూడు రోజులే.ఇక ఇళ్లల్లో వినాయక చవితికి మట్టి ప్రతిమలే. ఇవి ఎలా చేస్తారో చూద్దామని పండగరోజు ఉదయాన్నే బజారుకు నాన్నతో పాటు వెళ్లేవాళ్లం. వినాయకుని విగ్రహాలు అమ్మేవాళ్లు ఆ ముందురోజు రాత్రే ఊళ్లోకి దిగి బంకమన్ను, నీళ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ల దగ్గర అచ్చులు పెట్టుకుని ఉండేవాళ్లు. బంకమన్ను కలిపి, నూనె రాసిన అచ్చులో అదిమి, అచ్చును పేపర్ మీద తిరగేస్తే వినాయకుని బొమ్మ రెడీ. అదే పేపర్లో దానిని చుట్టి ఇంటికి తెచ్చుకునేవాళ్లం. మా చిన్నప్పుడు వినాయకునికి గొడుగు తప్పనిసరి. అవి విడిగా అమ్మేవారు. రంగు కాగితాల గొడుగు కొనుక్కొని వచ్చి వినాయకుణ్ణి ప్రతిష్టించాక గొడుగు వెనుక గుచ్చేవాళ్లం.చవితిరోజు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయని పెద్దవాళ్లు చంద్రుణ్ణి చూడొద్దని ముందే వార్నింగ్ ఇచ్చేవాళ్లు. శమంతకమణి కథలో శ్రీకృష్ణుడిపై మణి దొంగతనం నింద పడటానికి కారణం చవితి చంద్రుణ్ణి చూడటమే అని చెబుతారు. అందుకే చాలా భయం వేసేది. చంద్రుణ్ణి చూడకుండానే పెన్ను కొట్టేశామనో, నోట్సు చింపేశామనో మన మీద నిందలు పడుతూనే ఉంటాయి. చూస్తే ఇంకేమైనా ఉందా?వినాయక చవితి రోజు ఉదయం పూట బజార్లన్నీ ఏవో గడ్డి మైదానాల్లా ఉంటాయి. పత్రి అమ్మేవారు వరుసగా కూచుని కిటకిటలాడుతూ ఉంటారు. అన్నిరకాల పత్రి ఒకరి దగ్గర ఉండదు. కొందరు మారేడు, గరిక అమ్మితే కొందరు ఉమ్మెత్త, మాచీపత్రం అమ్ముతారు. కొందరి దగ్గర జిల్లేడు దొరికితే, కొందరి దగ్గర వావిలి దొరుకుతుంది. ఇక కొన్నిరకాల పత్రి మనమే ఊరి బయటకు వెళ్లి, ΄÷లాల వెంట తిరిగి తెచ్చుకోవాలి. మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రితో పూజ చేయాలని శాస్త్రం. అన్నీ ఔషధ గుణాలున్న ఆకులే.అమ్మ ఉదయాన్నే లేచి వినాయకుడికి పెట్టాల్సిన ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం తయారు చేస్తే నాన్న దూలానికి ‘పాలవెల్లి’ కట్టి దానికి మొక్కజొన్న ΄÷త్తులు, వెలగపండ్లు, సీతాఫలాలు వేలాడదీసేవారు. తొమ్మిదీ తొమ్మిదిన్నరకు పూజ మొదలయ్యేది. పూజ కొంచెం ఎక్కువసేపు జరిగినట్టు అనిపించినా, కుదురు లేనట్టుగా కూచున్నా అయ్యే వరకూ లేవడం అసాధ్యం. లేస్తే తిట్లే. పూజ అయ్యాక వినాయకుడి ముందు గుంజిళ్లు తీసి, చెంపలు వేసుకొని, చదువు బాగా రావాలని మొక్కుకునేవాళ్లం.ఆ సాయంత్రం ఊళ్లో పిల్లలందరికీ ఒకటే ఆటలు. పల్లేరుకాయలతో కొట్టుకునే ఆట ఉండేది. భలే దెబ్బ తగిలేది. తర్వాత మానేశారు అలా కొట్టుకోవడం. తర్వాత మంటపం దగ్గర కూచుంటే స్పీకర్లలో ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాటలు తెగ వినిపించేవి. ప్రసాదం దక్కేది. వీలుంటే పాటకచ్చేరీ కూడా ఉండేది.మూడు రోజులు వినాయకుణ్ణి ఇంట్లో ఉంచుకున్నాక ఇక నిమజ్జనం చేసేవాళ్లం. ఈనాటిలా పెద్దపెద్ద లారీలు, క్రేన్లు అప్పట్లో లేవు. వీధిలోని కుర్రాళ్లంతా కలిసి వీధిలోని మట్టి విగ్రహాలన్నీ ఒక చిన్న బండి మీదో లేదా చేతుల మీదుగానో మోసుకుంటూ ‘గణపతి బొ΄్పా మోరియా’ అంటూ కాలువకో, చెరువుకో లేదా సముద్ర తీరానికో ఊరేగింపుగా తీసుకెళ్లేవాళ్లం. తీరానికి వెళ్ళాక మట్టి వినాయకుడు నీటిలో కరిగిపోతుంటే, ‘వచ్చే ఏడాది త్వరగా రా తండ్రీ’ అని చేతులు ముడిచి దండం పెట్టేవాళ్లం.ఆ రోజుల్లో వినాయక చవితి నిరాడంబరంగా, హోరు లేకుండా ఉండేది. ఆకుపచ్చగా ఉండేది. సహజంగా ఉండేది. పండగ అంతరార్థం తెలుసుకుంటే పర్యావరణంతో పాటుగానే పండుగ చేసుకోమని గణేశుడు చెప్తున్నట్టే ఉంటుంది. ప్రకృతిగణాలకు నాయకుడైన గణేశుడు ప్రకృతిని కాపాడి వానలు, పంటలు ఇవ్వాలని కోరుకుందాం. – కెఇదీ చదవండి: వినాయక చవితి.. పత్రి
‘ఫెన్సింగ్’ ఆట ఎలా ఆడతారో తెలుసా?
పిల్లలూ! పాత కాలం సినిమాల్లో రాజులు కత్తులతో యుద్ధాలు చేయడం చూశారు కదా! ఆధునిక కాలంలో ఇది ఒలింపిక్స్లో ఒక అద్భుతమైన ఆటగా మారిపోయింది. దీనినే ‘ఫెన్సింగ్’ (Fencing) లేదా మన భాషలో ‘కత్తియుద్ధం’ అంటారు. ఇక్కడ మన దేశానికి చెందిన జోయ్స్ అషితా స్టాలిన్రాజ్(Joys Ashitha Stalinraj) పంజాబ్లోని పాటియాలాలో శిక్షణ తీసుకుంటూ ఇలా కత్తి తిప్పుతోంది. జపాన్లో జరగబోయే ’ఏషియన్ గేమ్స్–2026’లో భారతదేశం తరఫున మెడల్ గెలవడమే ఆమె లక్ష్యం.ఇంతకీ ఆ కత్తిని ఏమంటారు? ఆట ఆడే విధానాన్ని బట్టి కత్తులను మూడు రకాలుగా పిలుస్తారు. అవి... ‘ఫాయిల్’ (Foil), ‘ఎపే’ (epee), ‘సేబర్’ (Sabre). ఇవి చాలా తేలికగా, వంగుతూ ఉంటాయి. వీటి చివర మొన ఉండదు కాబట్టి అస్సలు గాయాలు అవ్వవు. కత్తి తాకితే సెన్సర్స్ను బట్టి నోట్ అయ్యి పాయింట్స్ వస్తాయి. ఫెన్సింగ్లో ‘డాలు’ (Shield) వాడరు. ప్రత్యర్థి కత్తిని మన కత్తితోనే అడ్డుకోవాలి.ఈ క్రీడలో ప్రపంచంలో అత్యధికంగా మెడల్స్ సాధించి టాప్లో ఉన్న దేశం ఏదో తెలుసా? ఇటలీ. ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉంది. మన దేశం నుండి కూడా మహిళలు ఇలాంటి అరుదైన ఆటల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం నిజంగా మనకందరికీ ఎంతో గర్వకారణం!ఇదీ చదవండి: 'పతకం తెస్తా.. నాన్నకు బహుమతిగా ఇస్తా'
అంతర్జాతీయం
9/11కు 25 ఏళ్లు.. అల్ఖైదా సంచలన వీడియో!
అమెరికా సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ అల్ఖైదా విడుదల చేసిన ఓ వీడియో సంచలనం రేపుతోంది. ఆ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు లాడెన్ కొడుకు హమ్జా అందులో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏడేళ్ల కిందటే.. అమెరికా ఆపరేషన్లో అతను హతమైనట్లు ఇంతకాలం అంతా భావించారు. అయితే ఇప్పుడు వీడియో ద్వారా అల్ఖైదా ఏం సందేశం ఇచ్చిందనే దానిపై ఆసక్తి నెలకొంది.అల్ఖైదా మీడియా విభాగం ‘అస్-సహాబ్’ 50 నిమిషాల వీడియో రిలీజ్ చేసింది. అందులో హమ్జా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఏడేళ్ల క్రితం ముగిసిందనుకున్న అతడి కథపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ‘ఎ క్వార్టర్ సెంచరీ ఆఫ్ ది 11 సెప్టెంబర్ రైడ్స్’ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో హమ్జా బిన్ లాడెన్తో పాటు 2022లో అమెరికా ఆపరేషన్లో హతమైన అల్ఖైదా చీఫ్ అయ్మన్ అల్-జవహిరి దృశ్యాలు కూడా ఉన్నారు.వీడియోలో హమ్జా తెల్లటి తలపాగా ధరించి, పక్కనే తుపాకీ ఉండగా మట్టి గోడ ముందు కూర్చుని కనిపిస్తాడు. అతడిని ఒసామా బిన్ లాడెన్ వారసుడిగా చూపించేలా ఈ దృశ్యాలను రూపొందించినట్లు భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బిన్ లాడెన్ పేరును ఉపయోగించుకోవడం ద్వారా అల్ఖైదా తన భావజాలాన్ని ప్రచారం చేయడంతోపాటు కొత్తగా మద్దతుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.Al-Qaeda Releases New Video Featuring Hamza Bin Laden On 9/11 AnniversaryAl-Qaeda’s media arm, As-Sahab, has released a 52-minute propaganda video marking the 25th anniversary of the September 11 attacks, featuring previously unseen footage of Hamza bin Laden, the son of…1️⃣ pic.twitter.com/7uL3VYjKEx— Aamaj News English (@aamajnews_EN) September 11, 20262019లో ఏం జరిగింది?ఒసామా బిన్ లాడెన్ కుమారుడైన హమ్జా.. అల్ఖైదా భవిష్యత్ నాయకుడిగా ఎదుగుతున్నాడని అప్పట్లో అమెరికా నిఘా వర్గాలు భావించాయి. తండ్రి మరణం తర్వాత అల్ఖైదా ప్రచార వీడియోలు, ఆడియో సందేశాల్లో అతడి పేరు తరచూ వినిపించింది. దీంతో అతడు సంస్థకు కీలక నేతగా మారే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి.అయితే 2019 ఫిబ్రవరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. అదే ఏడాది.. అనూహ్యంగా ఓ ఆపరేషన్లో అతను మరణించినట్లు అమెరికా ప్రకటించింది. అయితే హమ్జా మృతిని అల్ఖైదా అధికారికంగా ప్రకటించకపోవడం అప్పట్లోనే ఆసక్తి రేపింది. సాధారణంగా కీలక నేతలు మరణించినప్పుడు సంతాప ప్రకటనలు చేసే సంస్థ.. హమ్జా విషయంలో అలాంటి ప్రకటన చేయలేదు.తాజాగా విడుదలైన వీడియోలో హమ్జా కనిపించడం అతడు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడా? అనేది నిర్ధారణ కాలేదు. పైగా ఆ ఫుటేజ్ ఎప్పుడు చిత్రీకరించారన్నది తెలియదు. అతడి మరణానికి ముందు తీసిన పాత దృశ్యాలను ఇప్పుడు ప్రచార వీడియోలో ఉపయోగించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. 2025లోనూ హమ్జా బతికే ఉన్నాడంటూ కొన్ని నివేదికలు వెలువడ్డాయి.కరాచీ దాడి దృశ్యాలతో మొదలువీడియో ఫుటేజీలో.. 2014లో పాకిస్థాన్లోని కరాచీ నేవల్ డాక్యార్డ్పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలతో ప్రారంభమైనట్లు సమాచారం. అనంతరం హమ్జా పలుమార్లు కనిపిస్తాడు. పాకిస్థాన్ కేంద్రంగా అల్ఖైదా కార్యకలాపాలు, ప్రచార వ్యవస్థకు ఉన్న సంబంధాన్ని నొక్కిచెప్పేలా ఈ ఫుటేజ్ను ఎంచుకున్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. హమ్జా పేరును మళ్లీ తెరపైకి తీసుకురావడం వెనుక అల్ఖైదా వ్యూహం కూడా ఇదేనని విశ్లేషిస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ వారసుడిగా అతడికి ఉన్న పాత ఇమేజ్ను ఉపయోగించి సంస్థ భావజాలాన్ని కొత్త తరానికి చేరవేసే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు.ముఖ్యంగా 9/11 దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలోనే ఈ వీడియో విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పావు శతాబ్దం తర్వాత కూడా ఆ సంస్థ తన పాత నాయకులు, వారి వారసత్వాన్ని ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: షరీఫ్ ఇంట పెళ్లి సందడి.. పాక్ జనాల్లో కొత్త భయాలు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. షరీఫ్ ఇంట శుభకార్యం
పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ కుమార్తె మహ్నూర్ సఫ్దార్ శనివారం పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తితో ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. షరీఫ్ కుటుంబంలో పెళ్లి సందడి మొదలవుతుండగా.. పాకిస్థాన్ ప్రజల్లో మాత్రం మరో ఆందోళన మొదలైంది. నవాజ్ మనవరాలు మహ్నూర్ సఫ్దార్(22) రాజకీయాల్లోగానీ, ప్రజాజీవితంలోగానీ క్రియాశీలంగా లేరు. దీంతో ఆమె వివాహాన్ని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగానే నిర్వహించాలని కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన వివరాలను కూడా పెద్దగా బయటకు వెల్లడించలేదు. ఎంగేజ్మెంట్ వివరాలను కూడా బయటకు పొక్కనివ్వలేదు. అయితే షరీఫ్ కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత, గతంలో జరిగిన భారీ వేడుకల నేపథ్యంలో ఈ పెళ్లి ఇప్పుడు పాకిస్థాన్లో చర్చనీయాంశంగా మారింది.కొడుకు పెళ్లి వివాదంలో..మరియం నవాజ్ కుమారుడు జునైద్ సఫ్దార్ వివాహం గతంలో పాకిస్థాన్లో పెద్ద చర్చకే దారితీసింది. పెళ్లి వైభవం, వధువు దుస్తులు, మరియం నవాజ్ లుక్.. ఇలా వేడుకకు సంబంధించిన ప్రతి అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షరీఫ్ కుటుంబం నిర్వహించే కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయో అప్పట్లో ఆ పెళ్లి చూపించింది. ఇప్పుడు మహ్నూర్ వివాహం కూడా అదే స్థాయిలో ఘనంగా జరుగుతుందా? అనే ఆసక్తి ఒకవైపు ఉండగా.. “మళ్లీ ఆ ఖర్చుల భారం సామాన్యులపై పడుతుందా?” అన్న సందేహం మరోవైపు పాక్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.లండన్ పర్యటనతో మొదలైన వివాదంఈ చర్చకు తాజాగా మరో కారణం కూడా తోడైంది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మరియం నవాజ్ ఇటీవల లండన్ వెళ్లారు. ఈ పర్యటనకు ప్రభుత్వ విమానాన్ని వ్యక్తిగత కార్యక్రమం కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఈ ఆరోపణలపై పంజాబ్ మంత్రి అజ్మా బుఖారీ స్పందించారు. మరియం ప్రయాణానికి సంబంధించిన ఖర్చులన్నింటినీ ఆమె వ్యక్తిగతంగానే భరించారని, ప్రభుత్వ ఖజానాపై భారం పడలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఆ వివాదం పాకిస్థాన్లో ఇంకా చర్చలో ఉండగానే మహ్నూర్ పెళ్లి వార్త రావడం ఆసక్తిని పెంచింది.ఖజానాపై అప్పుల భారంప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి సామాన్యులకు అంత సులభంగా లేదు. దేశం భారీ అప్పుల భారంతో సతమతమవుతోంది. 2025 జూన్ నాటికి పాక్ ప్రజా రుణభారం జీడీపీలో దాదాపు 70.7 శాతంగా నమోదైంది. ఇక 2026–27 బడ్జెట్లో అప్పులపై వడ్డీ చెల్లింపులకే రూ.8.05 ట్రిలియన్ కేటాయించడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ధరల పెరుగుదల, జీవన వ్యయ భారం, ఉపాధి సమస్యలు, విద్యుత్ బిల్లులు వంటి అంశాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ బడ్జెట్లు ఒత్తిడిలో ఉన్న సమయంలో.. పాలక కుటుంబాల విలాసవంతమైన వేడుకల వార్తలు సహజంగానే సామాన్యుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పెళ్లిని పాకిస్థానీయులు కేవలం ఓ కుటుంబ వేడుకగా చూడటం లేదు. అది ప్రభుత్వ ఖజానాకు భారంగా మారకూడదన్నదే వారి ప్రధాన ఆవేదనపాక్ రాజకీయాల్లో షరీఫ్ కుటుంబంపాకిస్థాన్ రాజకీయాల్లో షరీఫ్ కుటుంబం అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాల్లో ఒకటి. నవాజ్ షరీఫ్ దేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. ఆయన తమ్ముడు షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం పాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. మరో సోదరుడు అబ్బాస్ షరీఫ్ వ్యాపారవేత్తగా, రాజకీయంగానూ వ్యవహరించారు. నవాజ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక షెహబాజ్ కుమారుడు హమ్జా షెహబాజ్ గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేయడంతోపాటు పలు కీలక రాజకీయ పదవులు చేపట్టారు. మరో కుమారుడు సులేమాన్ షెహబాజ్ కూడా కుటుంబ వ్యాపారాల్లో కీలకంగా ఉన్నారు. ఇలా షరీఫ్ కుటుంబానికి చెందిన పలువురు తరతరాలుగా పాక్ రాజకీయాలతో పాటు వ్యాపార రంగాల్లో ప్రభావం చూపుతున్నారు.ఇదీ చదవండి: తప్పుడు పనితో జైలు పాలైన భారతీయుడు
జపాన్ సముద్రం వైపు దూసుకెళ్లిన ఉత్తర కొరియా క్షిపణి
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా తాజాగా శనివారం (సెప్టెంబరు 12) జపాన్ సముద్రం వైపు గుర్తుతెలియని క్షిపణిని ప్రయోగించింది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు ముగిసిన మరుసటి రోజే ఈ ప్రయోగం జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5.20 గంటల సమయంలో ప్రయోగాన్ని గుర్తించారు. అది సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించింది. కొరియన్లు తూర్పు సముద్రంగా పిలిచే ప్రాంతం వైపు దూసుకెళ్లినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్) వెల్లడించింది.ప్రయోగం అనంతరం దక్షిణ కొరియా జాతీయ భద్రతా కార్యాలయం అత్యవసర సమావేశం నిర్వహించింది. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను వెంటనే నిలిపివేయాలని ఉత్తర కొరియాను కోరింది. ఇలాంటి చర్యలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘన అని పేర్కొంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ ఐదు రోజుల పాటు నిర్వహించిన ‘ఫ్రీడం ఎడ్జ్’ సంయుక్త సముద్ర విన్యాసాలు శుక్రవారం ముగిశాయి. దక్షిణ కొరియా తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ విన్యాసాలు జరిగాయి. వీటిని ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకించింది.తమ దేశంతో పాటు ప్రాంతీయ దేశాలకు ఇవి ముప్పుగా అభివర్ణించింది. అధికారం పరంగా బలమైన ప్రతిచర్యలు తీసుకునే సామర్థ్యం తమకు ఉందని ఉత్తర కొరియా రక్షణ మంత్రి కిమ్ సాంగ్ గి హెచ్చరించారు. అమెరికా పసిఫిక్ కమాండ్ స్పందిస్తూ.. ప్రయోగం గురించి తమకు సమాచారం ఉందని తెలిపింది. ప్రస్తుత అంచనాల ప్రకారం అమెరికా సిబ్బంది, భూభాగం, మిత్రదేశాలకు తక్షణ ముప్పు లేదని స్పష్టం చేసింది. అయితే మిత్రదేశాలతో సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో సమావేశం కావాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి?
‘మరో దారి లేదు..’ ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై తమ సైనిక చర్యను ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆయన అభివర్ణించారు. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నామని.. వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభంపై పూటకో ప్రకటన చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.9/11 దాడులకు పాతికేళ్లు పూర్తైన సందర్భంగా వాషింగ్టన్లోని పెంటగాన్లో జరిగిన స్మారక కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2001 నాటి ఉగ్రదాడులను గుర్తుచేసుకుంటూ.. పెంటగాన్పై దూసుకొచ్చిన హైజాక్ విమానంలో 64 మంది, భవనంలో 125 మంది మరణించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. ‘వార్ ఆన్ టెర్రర్’లో సేవలందించిన అమెరికా సైనికులకు నివాళులర్పించిన ఆయన.. ప్రస్తుతం ఇరాన్పై జరుగుతున్న సైనిక చర్యను కూడా ప్రస్తావించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకుండా అమెరికా సైనికులు పనిచేస్తున్నారని చెప్పారు.9/11 విషాదాన్ని, ఇరాన్పై యుద్ధాన్ని నేరుగా ముడిపెడుతూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఎప్పటికీ, ఎప్పటికీ మర్చిపోం. అందుకే ఈరోజు పోరాడుతున్నాం. మనకు మరో మార్గం లేదు. విజయం తప్ప మరోటి ఉండదు. మేం గట్టిగా పోరాడతాం. గెలవడానికి పోరాడతాం’’ అని ట్రంప్ అన్నారు.ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఆరు నెలలకు పైగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. వరుస సైనిక దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికాలోనూ ఈ యుద్ధంపై రాజకీయంగా తీవ్ర చర్చ, వ్యతిరేకత కొనసాగుతోంది.ట్రంప్ తీరుపై విమర్శలు9/11 వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్లోని గ్రౌండ్ జీరోలో జరిగే ప్రధాన స్మారక కార్యక్రమానికి ట్రంప్ హాజరుకాకుండా వాషింగ్టన్లోనే ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ న్యూయార్క్ వెళ్లి వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.పెంటగాన్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. అమెరికా ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికా ఈరోజు పరీక్షను ఎదుర్కొంటోంది. ఆ పరీక్షలో మనం ఘనంగా విజయం సాధిస్తున్నాం’’ అని చెప్పారు. అయితే 9/11 దాడుల సమయంలో, అనంతరం అమెరికాకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాల సహకారాన్ని ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.‘ఇరాన్ రక్షణ వ్యవస్థలు కుప్పకూలాయి’అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా పెంటగాన్ కార్యక్రమంలో ఇరాన్పై కఠిన వ్యాఖ్యలు చేశారు. దాదాపు అర్ధ శతాబ్దంగా అమెరికా నాశనాన్ని కోరుకుంటున్న ‘‘ఇస్లామిక్ థియోక్రసీ’’గా ఇరాన్ను అభివర్ణించారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కూలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ‘‘మేం ఇప్పటికీ ఉగ్రవాదులను వారు చేరాల్సిన చోటుకు పంపుతున్నాం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూస్తున్నాం. ఆర్థిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది’’ అని హెగ్సెత్ అన్నారు. 9/11 తర్వాత మొదలైన ‘‘చెడుపై పోరాటం’’ ఇంకా కొనసాగుతోందని, అది ‘‘జడ్జ్మెంట్ డే’’ వరకు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.అమెరికాలోనూ ముప్పు పొంచి ఉందని హెగ్సెత్ హెచ్చరించారు. విదేశాల్లో, దేశంలో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులతో పాటు అమెరికా శక్తిని బలహీనపర్చాలని, అమెరికన్లను చంపాలని చూస్తున్న శత్రువులపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రంప్ నాయకత్వంలో ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నామని చెప్పిన ఆయన.. దేశ సేవకు సిద్ధంగా ఉండే ‘‘బలమైన, ధైర్యవంతమైన యోధుల’’ కొత్త తరం అవసరమని పేర్కొన్నారు.సౌదీ అరేబియాపై చర్యకు డిమాండ్మరోవైపు న్యూయార్క్లో జరిగిన 9/11 స్మారక కార్యక్రమంలో బాధిత కుటుంబాల తరఫున టెర్రీ స్ట్రాడా అమెరికా ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. 9/11 బాధితురాలి భర్త అయిన ఆమె.. దాడులతో సౌదీ అరేబియాకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆ దేశాన్ని బాధ్యులను చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ఒక్కొక్కటిగా మాకు ద్రోహాలు ఎదురవుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ దాన్ని మార్చగలరు’’ అని స్ట్రాడా అన్నారు. అమెరికాతో స్నేహం కోరుకుంటే 9/11 ఉగ్రవాదులతో సంబంధాలపై సౌదీ అరేబియా చేస్తున్న నిరాకరణలను ఆపేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.సాధారణంగా 9/11 వార్షికోత్సవ కార్యక్రమాలు 2001లో మరణించిన దాదాపు 3,000 మందిని స్మరించుకోవడానికే పరిమితమవుతాయి. అయితే 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని సమర్థించేందుకు కూడా ఈ వేదిక ఉపయోగపడింది.ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్.. ట్రంప్ వారసుడెవరు?
జాతీయం
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ
ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు వివాదాలు, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. భారత్తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమన్నారు. అభివృద్ధి అంశాలపైన కలిసి పని చేయాలని.. తరచుగా సమావేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ప్రపంచ శాంతికి భారత్ చైనా సంబంధాల బలోపేతం అవసరం. ఇండియా, చైనా దీర్ఘకాలిక సంబంధాలపైన దృష్టి సారించాలి. ప్రపంచశాంతికి భారత్- చైనా సంబంధాల బలోపేతం అవసరం. మన దేశాల బలబలలు అందరికీ తెలుసునని జిన్పింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమన్నారు. విస్తృతమైన అంశాల పైన ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న మోదీ.. బ్రిక్స్ అధ్యక్షతకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.తొలి రోజు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఢిల్లీ డిక్లరేషన్ను “బ్రిక్స్” శిఖరాగ్ర సదస్సు ఆమోదించింది. శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నట్లు సంయుక్త ప్రకటన చేశాయి. యుద్ధాలు, ఘర్షణలు, సమస్యల మూలాలను పరిష్కరించాలన్న బ్రిక్స్ దేశాలు.. ఏకపక్షంగా సుంకాల విధింపు పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని బ్రిక్స్ దేశాల కూటమి పిలుపునిచ్చాయి.ఇదీ చదవండి: భారత్కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?
గూగుల్ సీఈఓకు సన్యాసి షాక్.. ఒక్క మాటతో దిమ్మతిరిగే సమాధానం
యవ్వనంలో ఉన్నప్పుడు ఒకే దారిలో నడిచిన ఇద్దరు వ్యక్తులు.. ఒకరు ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరితే, మరొకరు పూర్తిగా భిన్నమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. వీరిద్దరూ ఎదురుపడినప్పుడు జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి ఈ ఘటన గతంలోనే జరిగినప్పటికీ ఇటీవల కృష్ణాష్టమి జరగడంతో ఇది ఇళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ 1993లో ఐఐటీ పూర్తి చేశారు. సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్పూర్లో చదవగా.. గౌరంగ దాస్ ఐఐటీ బాంబేలో చదివారు. ఇద్దరూ ఒకే సంవత్సరం ఐఐటీలో పట్టభద్రులైనా.. తర్వాత వారి జీవిత ప్రయాణాలు పూర్తిగా భిన్నంగా సాగాయి.సుందర్ పిచాయ్ 1993లో ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మెటీరియల్స్ సైన్స్, ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ పాఠశాలలో ఎంబీఏ పూర్తి చేశారు. 2004లో గూగుల్లో చేరిన పిచాయ్.. గూగుల్ క్రోమ్, క్రోమ్ ఓఎస్ వంటి ఉత్పత్తులపై పనిచేశారు. 2015 ఆగస్టులో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబరులో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా నియమితుడయ్యారు.మరోవైపు గౌరంగ దాస్ ఐఐటీ బాంబేలో చదువు పూర్తి చేసిన తర్వాత భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కార్పొరేట్ జీవితాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు. అనంతరం సన్యాసిగా మారి ఇస్కాన్లో సీనియర్ నాయకుడిగా ఎదిగారు. ఆధ్యాత్మిక విద్య, సామాజిక కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పనిచేస్తున్నారు.ఏళ్ల తర్వాత సుందర్ పిచాయ్, గౌరంగ దాస్ 2019లో ఆకాశ్ అంబానీ వివాహ వేడుకలో కలుసుకున్నట్లు దాస్ తెలిపారు. ఆ సమావేశం గురించి 2025 జూన్లో లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరమ్ కార్యక్రమంలో గౌరంగ దాస్ మాట్లాడారు. పిచాయ్ తనను చూసి ‘‘నాకంటే నువ్వు చిన్నవాడిలా కనిపిస్తున్నావు’’ అని చెప్పినట్లు దాస్ గుర్తుచేసుకున్నారు.దానికి గౌరంగ దాస్ స్పందిస్తూ.. ‘‘మీ వ్యవహారం అంతా గూగుల్తో ఉంటుంది.. అది ఒత్తిడిని సృష్టిస్తుంది. నా వ్యవహారం అంతా దేవుడితో ఉంటుంది.. ఆయన ఒత్తిడిని తొలగిస్తాడు’’ అని చెప్పినట్లు తెలిపారు. వారి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇద్దరి జీవన మార్గాల మధ్య ఉన్న తేడాను ప్రతిబింబించింది.
బ్రిక్స్ ప్రారంభోపన్యాసంలో మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: బ్రిక్స్ సదస్సులో తీసుకునే నిర్ణయాల అమలు కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్నే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో భరతమండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వచ్చే 20ఏళ్ల కాలానికి అవసరమైన ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణీత గడువులోగా నిర్ణయాల అమలు కోసం వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.మోదీ మాట్లాడుతూ.. "ప్రస్తుతం గ్లోబల్ సౌత్ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని ప్రజల మేలు కోసం దేశాలన్నీ కలిసి పని చేయాల్సి ఉంది ప్రపంచ పరిపాలన మరింత మెరుగుపడాల్సి ఉంది. పరస్పరం గౌరవం, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం" అని మోదీ అన్నారు. అయితే అంతకుముందు ప్రధాని మోదీ అబూదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయద్ అలీ నహియాన్తో హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతలు మలేషియా, ఇథీయోపియా దేశాధినేతలతో రక్షణ రంగంలో సహకారం అంశంపై చర్చలు జరిపారు.కాగా మరికోద్దిసేపట్లో సాయంత్రం 5:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా జిన్పింగ్ భారత్ లో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడితో ఆ దేశానికి చెందిన వ్యాపార ,అధికార ప్రతినిధి బృందంతో ఢిల్లీకి చేరుకుంది. గతంతో పోలిస్తే ఈ సారి పెద్ద మెుత్తంలో అధికార బృందం జిన్పింగ్తో ఉంది. భారత్తో ఆర్థిక వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని చైనా భావిస్తోన్నట్లు సమాచారం.
భారత్కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?
ఒకేలా కనిపించే రెండు విమానాలు.. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విమానంలో ఉన్నారో ఎవరికీ తెలియదు.. అత్యాధునిక భద్రతా వ్యవస్థలు.. రహస్య కమ్యూనికేషన్ టెక్నాలజీ, అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ కమాండ్ సెంటర్గా మారే సామర్థ్యం.. ఇవన్నీ కలగలిసిన పుతిన్ ‘డూమ్స్డే ప్లేన్’ ఇప్పుడు భారత్లో హాట్ టాపిక్గా మారింది. బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి చేరుకోవడంతో అసలు ఈ ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’లో ఏముంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం విస్తరణపై చర్చించారు. ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకులలో ఒకరైన రష్యా అధ్యక్షుడు కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణించే విమాన శ్రేణిలో ఒకేలా ఉండే రెండు విమానాలు ఉంటాయి. వాటిలో ఒకటి 'డికాయ్'.. అత్యంత సురక్షితమైన ప్రత్యేక అధ్యక్ష విమానం('ఇల్యుషిన్ IL-96-300PU). దీనినే ఫ్లయింగ్ క్రెమ్లిన్ లేదా డూమ్స్డే ప్లేన్ అని కూడా పిలుస్తారు.రష్యా అధ్యక్షుడు ప్రయాణించేందుకు ఒకేలా ఉండే రెండు ఇల్యుషిన్ IL-96-300PU విమానాలను ఉపయోగిస్తారు. రష్యా అధ్యక్షుడు ఏ విమానంలో ఎక్కారనేది ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఈ రెండు విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగురుతాయి. మాస్కోకు ఈ డబుల్-షీల్డ్ భద్రత కొత్త వ్యూహం కాదు. అదనపు భద్రత కోసం పుతిన్ గతంలో కూడా ఇతర దేశాలకు ఇలాగే ప్రయాణించారు.1980లలో ఇల్యుషిన్ డిజైన్ బ్యూరో చేత అభివృద్ధి చేయబడిన ఈ విమానం.. రష్యా అధ్యక్షుడికి అత్యంత సురక్షితమైన కమాండ్ సెంటర్గా పనిచేస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లగల నాలుగు ఇంజిన్ల రష్యన్ విమానం ఇది. అత్యంత ప్రమాద పరిస్థితుల నుంచి రష్యా అగ్ర నాయకత్వాన్ని రక్షించేలా దీనిని రూపకల్పన చేశారు. సుదూర ప్రయాణాలు చేసే IL-96 ప్లాట్ఫారమ్పై నిర్మించిన ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్"లో అవిాద్విగటెల్ PS-90A టర్బోఫాన్ ఇంజిన్లు ఉన్నాయి. ఇది ఒకేసారికీ సుమారు 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలలో పదే పదే ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. ఈ విమానం పొడవు 55.35 మీటర్లు కాగా.. దీని రెక్కల వెడల్పు 60.12 మీటర్లు. అధ్యక్షుడి ప్రయాణాలన్నింటినీ పర్యవేక్షించే రష్యా ప్రత్యేక విమాన స్క్యాడ్రన్ దీనిని నడుపుతుంది.జాతీయ అత్యవసర పరిస్థితుల్లో IL-96-300PU పూర్తి స్థాయి మొబైల్ కమాండ్ సెంటర్గా పనిచేయగలదు. ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సైనిక, నిఘా, ప్రభుత్వ నెట్వర్క్లను సురక్షితంగా సంప్రదించగల ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ విమానంలో రాడార్-జామింగ్ సాంకేతికత ఉంది. అంతేకాకుండా ఇది అధునాతన రక్షణాత్మక వ్యవస్థలను కలిగి ఉంటుంది. అంతరాయం లేని, సురక్షితమైన సంభాషణను కొనసాగించడానికి శాటిలైట్ లింక్లు, రక్షిత రేడియో, డేటా ఛానెల్లను కూడా ఇది కలిగి ఉంది.భద్రతతో పాటు, ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్" విలాసవంతంగా కూడా రూపుదిద్దుకుంది. ఇందులో బెడ్రూమ్లతో కూడిన ప్రైవేట్ ప్రెసిడెన్షియల్ సూట్, విలాసవంతమైన బాత్రూమ్లు, ప్రైవేట్ కిచెన్, డైనింగ్ ఏరియాలు, బోర్డ్రూమ్ సీటింగ్తో కూడిన పెద్ద సమావేశ మందిరం ఉన్నాయి. ఇవి కాకుండా ఈ విమానంలో బంగారంతో పూత పూసిన ఫిట్టింగ్లు, ఆకర్షణీయమైన కలప, ప్రీమియం లెదర్, అప్హోల్స్టరీ తదితర విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ
ఎన్ఆర్ఐ
వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల
మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ జర్మనీ విభాగం కన్వీనర్ కృష్ణ తేజా రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో మ్యూనిక్ నగరంలో వైఎస్సార్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతగా నిలిచిన డార్మ్ స్టడ్ అప్లయిడ్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యార్ధి శిబి శ్రీనివాస్ చెమికలకు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగ కోర్డినేటర్ విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల ట్రోఫీని అందజేశారు. జర్మనీ వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి సూర్య చౌదరి నేలకుర్తి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.(చదవండి: జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి)
కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్!
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం పట్టుకుంది. ఈ కేసులో ఓ కువైట్ పౌరుడితో పాటు భారతీయులు సహా 40 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న కొందరు బస్సులు, లారీలను ‘అంగర్’ ప్రాంతంలోని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డీజిల్ చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇలా సేకరించిన డీజిల్ను ఇతర ట్యాంకర్లలోకి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ అక్రమ దందా కోసం ట్యాంకర్లను నెలకు 1,600 కువైటీ దినార్లకు అద్దెకు ఇచ్చింది అరెస్టైన కువైట్ పౌరుడేనని విచారణలో తేలింది. చాలాకాలంగా నిఘా పెట్టిన అధికారులు డీజిల్ చోరీ చేస్తున్న సమయంలో ప్రధాన నిందితులను పట్టుకున్నారు. అనంతరం దొంగిలించిన డీజిల్ కొనుగోలు చేసేందుకు వచ్చిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే, డీజిల్ దొంగతనం, విక్రయం, కొనుగోలులో భాగమైన మొత్తం 41 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ముఠా ఉపయోగించిన 38 ట్రక్కులు, బస్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు, ఆర్థిక నష్టాన్ని అరికట్టడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇవీ చదవండి: లెబనాన్పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్.. 11 మంది మృతి
పౌరసత్వం రద్దయిన వారికి కువైట్ గుడ్న్యూస్
కువైట్ సిటీ: కువైట్లో పౌరసత్వాన్ని కోల్పోయిన వారికి దేశంలో కొనసాగేందుకు కొత్త నివాస అనుమతి నిబంధనను తీసుకురావడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో పౌరసత్వం రద్దు చేసినా లేదా వెనక్కి తీసుకున్నా, కొన్ని షరతులతో గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు కువైట్లో నివసించేందుకు అనుమతి లభించనుంది.పౌరసత్వం కోల్పోయిన తర్వాత తమ పాత విదేశీ పౌరసత్వాన్ని తిరిగి పొందిన వారు లేదా మరో దేశ పౌరసత్వం పొందిన వారు ఈ కొత్త నిబంధన కింద సాధారణ నివాస అనుమతికి అర్హులవుతారు. అయితే ఈ అనుమతి గరిష్ఠంగా 10 సంవత్సరాల కాలానికి మాత్రమే ఉండనుందని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, నివాస అనుమతి మంజూరు చేయడం, దాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు, నియంత్రణలను రెసిడెన్సీ అఫైర్స్ విభాగం డైరెక్టర్ జనరల్ నిర్ణయించనున్నారు. ఈ నిబంధనల ప్రకారం నివాస అనుమతి పొందిన వారు కువైట్లో ఉద్యోగం చేసేందుకు పాటించాల్సిన నిబంధనలను కూడా అధికారులు నిర్ణయించనున్నారు.అలాగే, సవరించిన నిబంధనలను అధికారిక గెజిట్లో ప్రచురించిన తర్వాత ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీంతో పౌరసత్వం కోల్పోయినప్పటికీ ఇతర దేశ పౌరసత్వం పొందిన వారికి కువైట్లో చట్టబద్ధంగా నివసించే అవకాశం లభించనుంది.ఇవి కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!
ప్రయాణికులకు గుడ్న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!
మనామా: బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా లైసెన్స్ పొందిన ట్యాక్సీలు నేరుగా ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించేందుకు అనుమతి లభించింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ సేవలు తాజాగా అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.బహ్రెయిన్, సౌదీ అరేబియా రవాణా అధికారులు పరస్పర సమన్వయంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల పౌరులు, నివాసితులు, పర్యాటకులు ఇకపై సొంత వాహనాలపై ఆధారపడకుండా ట్యాక్సీల ద్వారా నేరుగా ప్రయాణించే అవకాశం ఏర్పడింది. అలాగే, రెండు దేశాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు.అయితే కాజ్వే మీదుగా నడిచే ట్యాక్సీలకు కొన్ని నిబంధనలు విధించారు. నిర్దేశించిన సాంకేతిక, భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించే లైసెన్స్ పొందిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ట్యాక్సీ వాహనం ఐదేళ్లకు మించి పాతది కాకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే, కొత్త సేవలు అందుబాటులోకి రావడంతో కింగ్ ఫహద్ కాజ్వేపై ప్రయాణికుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. దీంతో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం, ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.ఇరు దేశాల మధ్య ట్యాక్సీ రాకపోకలు పెరగడం వల్ల వాణిజ్యం, రిటైల్ వ్యాపారం, పర్యాటకం, ఎగ్జిబిషన్ రంగాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని బహ్రెయిన్ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా సొంత వాహనం లేని వారు బహ్రెయిన్ నుంచి సౌదీకి, అక్కడి నుంచి తిరిగి బహ్రెయిన్కు సులభంగా ప్రయాణించేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది.
క్రైమ్
నాలుగేళ్లుగా ప్రైవేట్ హోటల్స్లో గడిపారు!
హైదరాబాద్: స్నాప్చాట్లో పరిచయం ప్రేమగా మారింది. ఏకాంతంగా నాలుగేళ్లుగా ప్రైవేట్ హోటల్స్లో గడిపారు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తేవడంతో అతను ముఖం చాటేశాడు. ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. నాగాపూర్కు చెందిన యువతి(22) హైదరాబాద్ శాలిబండకు చెందిన యువకుడితో(24) స్నాప్ చాట్ 2022వ సంవత్సరంలో పరిచయమయ్యారు.పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ప్రేమించిన యువకుడి కోసం నాగాపూర్ నుంచి యువతి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుండేది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ రెసిడెన్షియల్లో గదిని అద్దెకు తీసుకొని గడిపేవారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో యువకుడు ముఖం చాటేశాడు. మరొక అమ్మాయిని ప్రేమించానంటూ బాధిత యువతిని మోసం చేశాడు. దీంతో బాధితురాలు గురువారం నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి
నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్
సాక్షి,ముంబై : బాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమీషా పటేల్ తల్లిదండ్రుల చర్చిగేట్ (ముంబై) నివాసం నుండి , బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంటి పనిమనిషే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నటి తల్లి ఆశా పటేల్ ఫిర్యాదు మేరకు నిందితురాలు సీమా ఘాటేను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం జనవరి 2026లో ఒక గాజు చోరీకి గురైంది. దీనిపై సీమాను అనుమానించిన ఆశా పటేల్, తప్పు ఒప్పుకుని, పోయిన ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరారు.అయితే, ఆ గాజును తిరిగి ఇవ్వకపోవడంతో, ఆశా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.దీంతో పాలఘర్కు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటే అనే ఇంటి పనిమనిషిని మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ 5 లక్షలకు పైమాటే. వీటిల్లో డైమండ్గాజులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో గృహ కార్మికురాలిగా పని చేస్తోంది.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్దీనిపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్, పనిమనిషి ఘాటేపై అనుమానం వ్యక్తం చేస్తూ మెరైన్ డ్రైవ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు విరార్లో ఘాటేను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు.నిందితురాలు సీమ నేర చరిత్ర, సహచరులు ప్రాతను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు సెప్టెంబర్ 15 వరకు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!
మంచిర్యాల: పోర్న్ వీడియోలు చూస్తున్న ఐదుగురిపై కేసు!
స్మార్ట్ఫోన్ యుగంలో పోర్నోగ్రఫీ సైట్లతో అశ్లీలత చేతుల్లోకి చేరింది. మైనర్ల నుంచి మొదలుకొని నడివయస్సు వరకు చాలామంది పోర్నోగ్రఫీకి బానిసగా మారుతున్నారు. కొందరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తూ జైలు పాలవుతున్నారు. ఈ ఏడాది మంచిర్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చైల్డ్పోర్నోగ్రఫీ వీడియోలు చూసి, ఇతరులకు షేర్ చేసినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. - మంచిర్యాల జిల్లాఅశ్లీల వెబ్సైట్లపై ప్రత్యేక నిఘా..అశ్లీల వెబ్సైట్లు, టెలిగ్రామ్, సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలపై అమెరికాకు చెందిన యూనైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్సీఎంఈసీ), నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్ర్డన్ అనే ప్రత్యేక విభాగం ప్రత్యేక నిఘా పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై జరిగే అశ్లీల దాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫొటోలు ఎవరు చూస్తున్నారు, ఎవరు షేర్ చేస్తున్నారో గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసులకు సమచారం అందిస్తోంది. స్థానిక పోలీస్స్టేషన్లకు పోర్నోగ్రఫీ వీడియోలు చూసిన, షేర్ చేసిన వారి వివరాలు అందించి కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. చట్ట ప్రకారం ప్రైవేటుగా చూడడం నేరం కాకపోయిన, చూసి ఇతరులకు షేర్ చేయడం ఐటీ యాక్ట్ 67 ప్రకారం నేరమవుతుంది. ఒకవేళ ఆ వీడియోల్లో మైనర్లు ఉంటే అది ఐటీ యాక్ట్ 67–బీ, పోక్సో చట్టం ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.యువత పక్కదారి..విద్యార్థి దశలోనే అరచేతిలో ఉన్న సెల్ఫోన్ వారిని నేరాల్లోకి నెడుతోంది. తాజాగా జిల్లా కేంద్రంలో ఆండాలమ్మ కాలనికి చెందిన ఓ మైనర్ బాలుడు ఫోర్న్ వీడియోలు చూసి మరో మైనర్ బాలికను వేధించినందుకు సదరు బాలిక దగ్గరి బంధువు బాలుడిని మందలించాడు. దీంతో బాలుడు మద్యం మత్తులో మందలించిన వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సెల్ఫోన్లలో లైంగిక, హింసాత్మక ఆంశాలు కౌమర దశలో ఉన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీడియోలు చూస్తే ఎవరికి తెలుస్తుందిలే అన్న భ్రమలో యువత ఉంటున్నారు. కానీ పోర్నోగ్రఫీ వెబ్సైట్లు ఎవరు చూస్తున్నారు.. ఎవరికి షేర్ చేస్తున్నారు.. ఎవరు డౌన్లోడ్ చేస్తున్నారో ఎన్సీఎంఈసీ ఇట్టే పట్టేస్తోంది. తమ పిల్లలు సెల్ఫోన్లో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేయాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.సర్వర్లు బ్లాక్.. పోర్న్ వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు చేర్చి మరో వెబ్సైట్ను ప్రారంభిస్తున్నారు. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉన్నవే కావడంతో వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండడం లేదని ఓ పోలీస్ అధికారి చెప్పడం గమనార్హం.వెంటనే తెలిసిపోతుంది..పోర్నోగ్రఫీ వీడియోలు చూడడం నేరమని తెలియక యువత చూస్తున్నారు. కేంద్రం నుంచి అందించిన సమాచారం ఆధారంగా వీడియోలు చూస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఐదు కేసులు నమోదు కాగా అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. అశ్లీల వెబ్సైట్లపై పూర్తి స్థాయి నిఘా ఉంది.– ప్రమోద్రావు, సీఐ, మంచిర్యాలఇటీవల నమోదైన కేసులు..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్రోడ్కు చెందిన ఓ యువకడు యూట్యూబ్, పోర్న్ వెబ్సైట్లు చూడడమే కాకుండా తనకు తెలిసిన వారికి షేర్ చేశాడు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రెన్ ప్రత్యేక విభాగం స్థానిక పోలీసులకు యువకుడి వివరాలు పంపించి కేసు నమోదుకు ఆదేశించింది. పోలీసులు యువకుడి ఇంటికి వెళ్లి కేసు నమోదు చేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవంతం వాడకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు తరచూ చూస్తుండేవాడు. చూడడమే కాకుండా ఇతరులకు షేర్ చేశాడు. దీంతో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయింటెడ్ చిల్డ్రెన్ ప్రత్యేక విభాగం అతడిని గుర్తించి సదరు యువకుని అడ్రస్తో సహా స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించింది.నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మదీన కాలనీకి చెందిన ఓ వ్యక్తి పిల్లల అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతనిపై ఈనెల 5న కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని(కె) గ్రామానికి చెందిన తౌడు శ్రావణ్ పిల్లల అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోర్న్ ఫొటోలు, వీడియోలు బ్రౌజ్ చేసి డౌన్లోడ్, అప్లోడ్ చేసినందుకు అతడిపై ఈనె 5న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి
ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి
గుంటూరు: రాజధాని పరిధిలోని పెనుమాక అమరావతి రోడ్డులో కృష్ణాయపాలెం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై అమానుషంగా దాడిచేసిన ఘటనపై తాడేపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అమరావతి నుంచి విజయవాడ బస్సు వెళ్తోంది. ఆ డ్రైవర్ను తలమల ఏసురాజు నడుపుతున్నాడు. బస్సు ముందు బైక్పై వెళ్తున్న పెనుమాకకు చెందిన దుర్గాప్రసాద్, బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం డ్రైవర్పై దాడిచేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 3వ తేదీన డ్రైవర్ తలమల ఏసురాజు బస్సులో ఉన్న ప్రయాణికులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. డ్రైవర్ ఏసురాజును కొట్టిన దుర్గాప్రసాద్ వీడియో ఫేస్బుక్ల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆలస్యంగా ఇప్పుడు కేసు నమోదు చేసి దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేసి, నోటీసులు జారీ చేశారు. ఏపీలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి.విధుల్లో ఉండగానే దాడి⚡ విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ విధులకు ఆటంకం కలిగించి, అతడిపైనే తీవ్రంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.#AndhraPradesh #RTCDriver #Attack #APNews pic.twitter.com/Io5z3XUoOQ— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) September 11, 2026ఇదీ చదవండి: చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి
వీడియోలు
నాతో పెట్టుకోకు వైభవ్ కు చుక్కలు చూపించిన బుమ్రా
నీకే డబ్బులు పడలేదా.. అందరి ముందు TDP నేత పరువు తీసిన కేతిరెడ్డి
అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారు బాబుపై TJR సుధాకర్ బాబు షాకింగ్ కామెంట్స్
ప్రభుత్వ ఉద్యోగులంటే మీకెందుకు ఇంత చిన్న చూపు
జగన్ వెంట లక్షలాది సైనికులు.. YSRCPని ఎవరూ కదిలించలేరు
ధరణి పేరుతో ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు
లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
50 ఏళ్ల MAPను ఎందుకు మార్చారు? మనం చూసిన వరల్డ్ మ్యాప్ నిజం కాదా?
వైస్ కెప్టెన్ పదవి వచ్చినా హ్యాపీగా లేను.. తిలక్ వర్మ షాకింగ్ కామెంట్స్
భారీగా పెరిగిన బంగారం ధరలు

