అంబేద్కర్కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, తాడేపల్లి: భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి నేడు(డిసెంబర్ 6). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వడం అని.. వాటిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడాయన అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నివాళులర్పించారు. నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వడం అని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు. ఆ స్ఫూర్తి తో అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడు అయన. నేడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా… pic.twitter.com/DgzRgrdHnC— YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2025బీఆర్ అంబేద్కర్ను సమానత్వం, సాధికారత, సామాజిక న్యాయంకు ప్రతీకగా భావిస్తూ వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ గౌరవిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్ స్ఫూర్తిని ప్రతిబింబించే విధానాలను ఏపీలో అమలు చేశారు. విజయవాడలో స్వరాజ్ మైదానంలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో ఏకంగా 206 అడుగుల ఎత్తైన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కావడం గమనార్హం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ స్మృతి వనాన్ని నిర్లక్ష్యం చేస్తూ అంబేద్కర్ను అవమానిస్తోంది. నిర్వహణ భారం పేరిట ప్రైవేట్వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తోంది.
ప్రభుత్వ విందు వివాదం: విమర్శలపై థరూర్ ఏమన్నారంటే..
పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన అధికారిక విందు కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానించకపోవడంపై రాజకీయ దుమారం రేగింది. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ అనూహ్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం హాట్ టాపిక్ అయ్యింది.శశిథరూర్ను కేంద్రం ఆహ్వానించడం.. దానిని అంగీకరించి ఆయన హాజరు కావడం కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కలహాలను బయటపెట్టింది. పలువురు సీనియర్లు ఆయన్ని బహిరంగంగానే తప్పుబడుతున్నారు. థరూర్ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని పవన్ ఖేడా, జైరాం రమేష్లాంటి సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే.. థూరూర్ను ఆహ్వానిస్తే కాంగ్రెస్కు వచ్చిన సమస్య ఏంటో అర్థం కావడం లేదని బీజేపీ అంటోంది. ఈ అభ్యంతరాలు.. రాజకీయ విమర్శల దరిమిలా శశిథరూర్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు.తిరువనంతపురం(కేరళ) ఎంపీ శశిథరూర్.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ హోదాలోనే తాను కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చిందని అన్నారాయన. ‘‘20 ఏళ్ల క్రితం నేను జియోపాలిటికల్ అలైన్మెంట్స్ కోసం అన్వయించిన ఓ పదం.. ఇప్పుడు వాస్తవరూపం దాల్చినందుకు సంతోషం. రాష్టప్రతి భవన్లో గతంలో భిన్నమైన వైఖరి ఉండేది. కానీ, ఈసారి ఇతర గళాలను కూడా వినిపించాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. అందుకే నన్ను ఆహ్వానించి ఉంటారు. అలాగే..ఇతర దేశాలతో సంబంధాలు మా కమిటీ పరిధిలోకి వస్తాయి. అందువల్ల అక్కడ జరిగే సంభాషణలు, వాతావరణం గురించి అవగాహన కలగడం మాకూ మంచిదే అని అన్నారాయన. అంతేకాదు.. ప్రభుత్వం ఇచ్చిన ఈ విందును అద్భుతం(Excellent Dinner) అని అభివర్ణించారు.ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో రెండు రోజులు పర్యటించారు. ఆయన కోసం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో శుక్రవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే అధికారిక కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామంపై థరూర్ స్పందిస్తూ.. ఆ విషయం తనకు తెలీదన్నారు. ఏ ప్రతిపాదికన ఆహ్వానాలు పంపారో తనకు అవగాహన లేదన్నారు. అలాగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం కోరారా? అనే ప్రశ్నకు.. రాష్ట్రపతి భవన్ విందుతో దానికి సంబంధం లేదన్నారు. విందు ముందు జరిగిన సంభాషణల్లో తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వ అధికారులతో ప్రస్తావించానని తెలిపారు. “ప్రజల కోసం, ఓటర్ల కోసం పని చేయడం నా రాజకీయ బాధ్యత” అని అన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడంపై స్పందిస్తూ.. కొన్ని విషయాల్లో విభేదాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో ఏకీభవిస్తాం. ఏకీభవించే చోట కలిసి పనిచేయాలి అని వ్యాఖ్యానించారు. థరూర్ గతకొంతకాలంగా ప్రభుత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం.. ఆపరేషన్ సిందూర్ కోసం దూతలా ప్రపంచమంతా తిరగడం కాంగ్రెస్లో అసంతృప్తికి దారి తీసింది తెలిసిందే. ఈ తరుణంలో.. ఆయనకు పార్టీ మారతారా? అనే ప్రశ్నా తాజా ఇంటర్వ్యూలోనూ ఎదురైంది. ‘‘నేను కాంగ్రెస్ ఎంపీని. ఎన్నికల్లో గెలవడానికి చాలా కష్టపడ్డాను. వేరే నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచన అవసరం’’ అంటూ ఆచితూచి స్పందించారాయన.
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోకుండానే.. మరోసారి నాంపల్లి కోర్టును సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఇవాళ్టి నుంచి మూడు రోజలపాటు రవిని విచారణ జరపాల్సి ఉంది.. అయితే.. చంచల్గూడ్ జైలు నుంచి రవిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. కోర్టు ఇచ్చిన మూడు రోజుల సమయం సరిపోదని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మరింత టైం కావాలని కోరుతూ అప్పీల్కు వెళ్లాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్ పోలీసులు. ఈ క్రమంలో.. నాలుగు కేసులకు సంబంధించి కస్టడీకి అనుమతించాలని పిటిషన్ వేశారు. అయితే.. ఇందులో ఒక కేసును తోసిపుచ్చిన కోర్టు.. మిగిలిన మూడు కేసులకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం నుంచి రవిని విచారించాలని ఆదేశించింది. గత విచారణలో రవి నుంచి సైబర్క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్నే సేకరించారు. అయితే కీలకమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. అందుకే మూడో విడత కస్టడీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నిందితుడికి నిరీక్షణ తప్పదా?ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ విచారణ కస్టోడియల్ ఎంక్వైరీ కారణంగానే ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీకి ఆదేశించిన సమయంలోనే నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ విచారణపై స్పష్టత ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో(మూడు రోజుల విచారణ ముగుస్తుంది కాబట్టి) విచారణ జరుపుతామని నిందితుడి తరఫు లాయర్కు స్పష్టం చేసింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయంతో ఈ పిటిషన్ విచారణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. నిందితుడు రవికి షాక్ అనే చెప్పొచ్చు.
ఇండిగో సిబ్బందిని హడలెత్తించిన మహిళ.. వీడియో వైరల్
ఢిల్లీ: భారత్లో విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా ఐదో తీవ్ర అంతరాయం కలిగింది. విమాన సర్వీసుల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులను రద్దు కావడంతో విదేశీయులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ విదేశీ మహిళ.. ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు సిబ్బందితో గొడవకు దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ ఆఫ్రికన్ ప్రయాణికురాలు ఇండిగో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సిబ్బందితో సదరు మహిళ గొడవకు దిగారు. తాను ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో ఇండిగో కౌంటర్పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదం పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేకలు వేసింది. ఆమె తీరు చూసిన ఇండిగో సిబ్బంది దెబ్బకు హడలెత్తిపోయారు. ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.इंडिगो का इश्यू नहीं है ये !ये इश्यू है इस देश के निकम्मे लोगों का !दिल्ली की निकम्मी सरकार का इश्यू है!A stupid father is crying for sanitary Pad, public is paying 200 at airport for an item of 20 Rs but Delhi Government unable to facilitate them. सो रही है दिल्ली की राज्य… pic.twitter.com/1QNIYRthdx— Pooja Tiwari (@PoojaSays_) December 5, 2025మరోవైపు.. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజులు పడుతుందని ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బెర్స్ తెలిపారు. ఇండిగో ప్రకటనపై ప్రయాణికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు సమాచార ఇవ్వలేదని ఫైర్ అవుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఇండిగో సిబ్బందితో గొడవకు దిగారు. పలువురు ప్రయాణికులు వారికి చెక్ఇన్ అయ్యాక విమానాలు రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు విమానాశ్రయాల్లో తిండి, నిద్రలేకపోవడంతో ప్రయాణికులు కన్నీటిపర్యంతమవుతున్నారు.Delhi airport scene hai .The worst thing is the government is sleeping 😴 pic.twitter.com/8Yl7mWorJm— Charu Yadav (@YadavCharu28) December 5, 2025
కార్తి 'అన్నగారు వస్తారు' ట్రైలర్
వదిన, మరిది మధ్య పంచాయతీ పోరు
అయోధ్యలో హై అలర్ట్.. మసీదు కూల్చివేతకు 33 ఏళ్లు..
లగ్జరీ హౌసింగ్ మార్కెట్ రయ్.. రయ్..
పవన్ కల్యాణ్.. బిగ్బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా?
‘పంథా’ పేరుతో పైపూతలు!
చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
ఇంతకీ ఇండిగో ఓనర్ ఎవరో తెలుసా?
బొమ్మ బంద్.. ఇక ‘రుచి’ చూపిస్తా !: ఇమ్మడి రవి
సార్! పాలన రివర్స్ అవుతోంది!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ప్రభుత్వం దగ్గర డబ్బులేదు! మీరే ఈ పత్తిని వాడి స్వయం కృషితో బట్టలు తయారు చేసుకోండి, వేసుకోండీ, అమ్ముకోండి!
రుతు, విరాట్ అద్భుతం.. ఆ రెండే కొంపముంచాయి: కేఎల్ రాహుల్
రోహిత్ శర్మ కీలక నిర్ణయం
అమ్మకానికి పాక్ ఎయిర్లైన్స్.. గుంటనక్క చేతికే!
టెన్త్ పరీక్షల్లో స్వల్ప మార్పులు
టికెట్ టు ఫినాలే: ముగ్గురి మధ్యే పోటీ!
హమ్మయ్య.. బంగారం, వెండిపై గుడ్న్యూస్
వరి వల్ల ఉపయోగం లేదు.. ఆదాయం లేదు
నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
ఏడాది తర్వాత పెళ్లి వీడియోను షేర్ చేసిన 'శోభిత ధూళిపాళ్ల'
పెళ్లి వార్తలపై ఎట్టకేలకు స్పందించిన 'రష్మిక'
దయచేసి అలాంటివాళ్లు ఈ సినిమా చూడొద్దు: బన్నీవాసు
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుంభవృష్టి
ఓటీటీలో 'మిషన్ ఇంపాజిబుల్'.. ఉచితంగానే స్ట్రీమింగ్
విడాకుల నుంచి వివాహం దాకా సమంతను చెక్కిన ‘శిల్పం’, ఆమేనా?
కార్తి 'అన్నగారు వస్తారు' ట్రైలర్
వదిన, మరిది మధ్య పంచాయతీ పోరు
అయోధ్యలో హై అలర్ట్.. మసీదు కూల్చివేతకు 33 ఏళ్లు..
లగ్జరీ హౌసింగ్ మార్కెట్ రయ్.. రయ్..
పవన్ కల్యాణ్.. బిగ్బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా?
‘పంథా’ పేరుతో పైపూతలు!
చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
ఇంతకీ ఇండిగో ఓనర్ ఎవరో తెలుసా?
బొమ్మ బంద్.. ఇక ‘రుచి’ చూపిస్తా !: ఇమ్మడి రవి
సార్! పాలన రివర్స్ అవుతోంది!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ప్రభుత్వం దగ్గర డబ్బులేదు! మీరే ఈ పత్తిని వాడి స్వయం కృషితో బట్టలు తయారు చేసుకోండి, వేసుకోండీ, అమ్ముకోండి!
రుతు, విరాట్ అద్భుతం.. ఆ రెండే కొంపముంచాయి: కేఎల్ రాహుల్
రోహిత్ శర్మ కీలక నిర్ణయం
అమ్మకానికి పాక్ ఎయిర్లైన్స్.. గుంటనక్క చేతికే!
టెన్త్ పరీక్షల్లో స్వల్ప మార్పులు
టికెట్ టు ఫినాలే: ముగ్గురి మధ్యే పోటీ!
హమ్మయ్య.. బంగారం, వెండిపై గుడ్న్యూస్
వరి వల్ల ఉపయోగం లేదు.. ఆదాయం లేదు
నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
ఏడాది తర్వాత పెళ్లి వీడియోను షేర్ చేసిన 'శోభిత ధూళిపాళ్ల'
పెళ్లి వార్తలపై ఎట్టకేలకు స్పందించిన 'రష్మిక'
దయచేసి అలాంటివాళ్లు ఈ సినిమా చూడొద్దు: బన్నీవాసు
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుంభవృష్టి
ఓటీటీలో 'మిషన్ ఇంపాజిబుల్'.. ఉచితంగానే స్ట్రీమింగ్
విడాకుల నుంచి వివాహం దాకా సమంతను చెక్కిన ‘శిల్పం’, ఆమేనా?
ఫొటోలు
#BiggBossTelugu9 ట్రెండింగ్లో 'తనూజ' (ఫోటోలు)
ముంబై : స్వదేశ్ ఫ్లాగ్షిప్ స్టోర్ వేడుకలో నీతా అంబానీతో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
విజయవాడ : ఆకట్టుకుంటున్న ఫల, పుష్ప ప్రదర్శన (ఫొటోలు)
ఎగరని విమానాలు.. ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్యాసింజర్ల కష్టాలు చూశారా?.. (చిత్రాలు)
రూ.350 కోట్ల విలువైన బంగ్లా.. గృహప్రవేశం ఫోటోలు షేర్ చేసిన ఆలియా భట్ (ఫొటోలు)
నేను నా మూడ్ స్వింగ్స్.. చీరలో అనసూయ (ఫొటోలు)
భార్యతో విహారయాత్రకు వెళ్లిన కీరవాణి కొడుకు హీరో సింహా (ఫొటోలు)
ఈ ఏడాది మధుర జ్ఞాపకాలతో మీనాక్షి చౌదరి.. ఫోటోలు
తెలుగు నటి జ్యోతి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
చైతూ- శోభిత పెళ్లి వీడియో.. లవ్లీ మూమెంట్స్ షేర్ చేసిన శోభిత! (ఫొటోలు)
సినిమా
కేథరిన్ థ్రెసాతో స్టార్ హీరో వారసుడు స్టెప్పులు
నటుడు విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తండ్రి బాటలోనే పయనిస్తారని అందరూ భావించారు. జేసన్ సంజయ్ సౌత్ కాలిఫోర్నియాలో నటన, దర్శకత్వం శాఖల్లో శిక్షణ పొందారు. దీంతో ఈయన నటనపై కాకుండా దర్శకత్వంపై మొగ్గు చూపారు. అలా జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఇందులో నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ప్రియా అబ్దుల్లా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో సిగ్మా చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట చోటు చేసుకుంటుందని, దీన్ని ఇటీవల చిత్రీకరించినట్లు సమాచారం. ఈ పాటలో మెడ్రాస్ చిత్రం ఫేమ్ కేథరిన్ థ్రెసా(Catherine Tresa ) నటించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమెతోపాటు దర్శకుడు జేసన్ సంజయ్ కూడా స్టెప్స్ వేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆ పాటలో ఈ వర్ధమాన దర్శకుడు ఇలా వచ్చి అలా కనిపించి వెళ్తారా లేక పూర్తిగా ఆ పాటలో కేథరిన్ థ్రెసాతో కలిసి నటించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై చిత్ర వర్గాల నుంచి క్లారిటీ వచ్చే వరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. అదే విధంగా ఈ చిత్రంలో ఒక్క పాటలో మెరిసే జేసన్ సంజయ్ ఆ తరువాత హీరోగా నటించే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది.
Savitri: వెండి వెన్నెల జాబిలి..
‘వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’... నింగిలోని జాబిలి ఒక్కటి అందరికీ. తెలుగు వారికి మాత్రం నింగిలోనా, వెండి తెరన రెండు జాబిలుల నిండు సోయగాలు. సావిత్రి జన్మించి నేటికి 90 ఏళ్లు. ఆమె నటించింది సరిగా 15 ఏళ్లు. చనిపోయింది 46 సంవత్సరాలకు! కాని తెలుగు వారు ఆమెను తమ ఆడపడుచుగా భావిస్తూనే ఉన్నారు. మహానటిగా కొలుచుకుంటూనే ఉన్నారు. పదే పదే తలుచుకుంటూనే ఉన్నారు. మన ‘పార్వతి‘, మన ‘మధురవాణి’, మన ‘మిస్సమ్మ’, మన ‘శశిరేఖ’... దేవుడు ఏమరపాటులో తెలుగువారికి ఇచ్చిన అపురూపవరం సావిత్రి. ఆమెకు నివాళి. డిసెంబర్ ఎంత వరదాయిని. సావిత్రిని ఇచ్చింది. డిసెంబర్ ఎంత దుఃఖదాయిని. సావిత్రిని తీసుకెళ్లింది. మంచివాళ్లు వేసే శిక్షలు ఉడుంపట్టులా ఉంటాయి. వదలవు. గింజుకోవాలి. పెనుగులాడాలి. అయినా సరే... వదలవు. సావిత్రిని నమ్ముకున్న వాళ్లందరూ బాగుపడ్డారు. తిరిగి వారిని నమ్మిన సావిత్రి తప్ప. బదులుగా వారిని కొట్టలేదు ఆమె. తిట్టలేదు. కొరడా పట్టుకు శిక్షించలేదు. మరేం చేసింది? కోమాలోకి వెళ్లిపోయింది. బతికే ఉంది. కాని బతికి లేదు. ఊపిరితోనే ఉంది. కాని జీవంతో లేదు.మన వల్ల మోసపోయినవారు మన ఇంటి ముందు ధర్నాకు కూచుంటే ఎంత ఇబ్బందో కోమాలోకి వెళ్లిన సావిత్రి– ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు... నెల కాదు... రెండు నెలలు కాదు... 19 నెలల పాటు అలా నిలదీస్తున్నట్టుగా, పాపాలను లెక్కిస్తున్నట్టుగా మృత్యుశయ్యపై ఉండి తనను వంచించిన వారిని దండించింది. చలన చిత్ర తెర మీద క్షణం విరామం లేకుండా జగజ్జేయమానంగా వెలిగిన తారను నిశ్చలన స్థితికి నెట్టడం తెలుగు వారి చరిత్రలో ఒక ‘ఘనత’. సావిత్రి వీడ్కోలు తీసుకునే నాటికి ఆమె వయసు 46. సాధారణంగా– పుట్టిన పిల్లాపాపలు ఎదిగి వారితో స్త్రీలు ఆనందాలు పంచుకోవడం మొదలయే వయసు అది.‘బాలరాజు’ శతదినోత్సవం బెజవాడలో జరుగుతుంటే చూడటానికి వెళ్లి పొంరపాటున మురుక్కాలవలో జారింది సావిత్రి. విధి ఆమెను సరిగ్గానే హెచ్చరించింది– నువ్వు ఎంచుకోబోయే రంగంలో మురుక్కాలవలూ వుంటాయి... మహా జలపాతాలూ ఉంటాయి... భద్రం అని. చిన్నపిల్ల. గ్రహించలేదు. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాక మహా జలపాతం వలే కదిలి, ఉరకలెత్తి, హోరు సృష్టించి, అడ్డులన్నింటినీ కకావికలం చేస్తూ ప్రవహించి... చివరకు కొంత మురుగును ఆమె చూడాల్సే వచ్చింది.చదవడం ఆపండి.. రెండు పాటలు చూడండి..ఒకటి ‘మంచి మనసులు’లో ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. ఆ పాట ప్రిలూడ్ మొదలయ్యాక నాగేశ్వరరావు సరాసరి పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు వద్ద నిలుచుంటాడు. వెనుక ఒక సెకన్ తేడాలో సావిత్రి పరిగెత్తుకుంటూ రావాలి. మామూలుగా కాదు. ప్రిలూడ్కు తగినట్టుగా గంతులేస్తూ వచ్చి, సరిగ్గా పల్లవి మొదలయ్యే సమయానికి గంతులు ముగించి, పల్లవి అందుకోవాలి. అంతేనా? అల్లరిగా నవ్వుతూ కొద్దిగా పెదవి కొరకాలి. ఇవన్నీ మూడు నాలుగు సెకన్లలో చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తున్నారు కదా... ఫోనుందని. ట్రై చేయండి. స్టార్ నటీమణులైనా సరే. జస్ట్ ట్రై చేసి చూడాలి.రెండు– ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ’... ఈ పాటలో నాగేశ్వరరావుకే మాటలుంటాయి. సావిత్రికి ఉత్త హమ్మింగ్. నాగేశ్వరరావు పలికే ప్రతి మాటకు సావిత్రి తన హమ్తో జవాబిస్తూ ఉంటే ఆ ఒక్క ముఖంలో ఇన్నేసి భావాలా? ఆ రెండు కళ్లల్లో ఇన్నిన్ని అర్థాలా? ఆమెలా చేయగలరేమో ప్రయత్నించి చూడండి. చేయగలిగినవారు ఉన్నారేమో గాలించండి. నో. సావిత్రిలా చేయగలిగే దమ్ము సావిత్రికి మాత్రమే ఉంది. ఆమె అతి సులువుగా చేసింది అందరికీ అత్యంత కష్టమైనది.సావిత్రి చిన్నప్పటి నుంచి డాన్సింగ్ స్టార్. ఆ డాన్స్ చూసే ఆమెను నాటకాల్లోకి తీసుకున్నారు. అన్నీ డాన్స్ డ్రామాలే. మగ వేషంలో ఉన్న ఆడపిల్లలతో. రాధా–కృష్ణ, మేనక–విశ్వామిత్ర, నారాయణమ్మ–నాయుడుబావ. స్టేజ్ మీదకు లేడిపిల్ల వచ్చిందా? ఎవరా పిల్ల? సావిత్రి అట గదా. అల్లరిగా చేసినా భలే అందంగా చేస్తుందే! అవును. అల్లరిగానే చేస్తోంది. తండ్రి లేని పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. ఏమంటే తండ్రి లేడన్న విషయం మర్చిపోవడానికి.సావిత్రి (Savitri) బాగా అల్లరి చేసేది. పైకి నాన్–సీరియస్. లోన అగాథం. పెదనాన్న ఉన్నాడు. ఎంత ఉన్నా పెదనాన్న నాన్న కాడు. రక్షకుడు. సావిత్రికి కావాల్సింది అదిలించేవారు కాదు. లాలించేవారు. మగవాళ్లంటే పెదనాన్నలా ఉంటారని అనుకోవడం తప్ప లాలించే మగవాణ్ణి, అనునయంగా మాట్లాడే పురుషుణ్ణి చూడలేదామె.పద్నాలుగేళ్ల వయసులో, ఈడేరిన ప్రాయంలో అలాంటి పురుషుణ్ణి మొదటిసారి చూసిందామె. జెమినీ గణేశన్. ఎదుటివారి తప్పులు మనకు తోవ ఇస్తే మన తప్పులు మరొకరికి దారి ఇస్తాయి. ఈ వృత్తం సావిత్రి జీవితంలో పర్ఫెక్ట్గా పూర్తయ్యింది. ఎలాగంటే భానుమతి (Bhanumati) చేసిన రెండు తప్పులు సావిత్రికి లాభించాయి. డి.ఎల్.నారాయణ ‘దేవదాసు’ తీయడానికి నిశ్చయించుకుని పార్వతి వేషం వేయమని అడగడానికి వెళితే ‘నా దగ్గర ప్రోడక్షన్ మేనేజర్గా పని చేసి నన్నే హీరోయిన్గా బుక్ చేయడానికి వచ్చావా’ అన్నట్టుగా ఆమె అంగీకరించ లేదు. ఆ వేషం సావిత్రికి వెళ్లింది.. సావిత్రి వెలిగింది..‘మిస్సమ్మ’ షూటింగ్ మొదలయ్యి రెండున్నర రీళ్లు తీశాక, షూటింగ్ రోజు వ్రతం పెట్టుకుని ఆ సంగతి సరిగ్గా సమాచారం ఇవ్వక షూటింగ్కు రాకపోవడంతో చక్రపాణికీ, భానుమతికీ పేచీ వచ్చింది. చక్రపాణి ఆమె ఎదుటనే అందాకా తీసిన రీళ్లను కుప్పబోసి నిప్పంటించాడు. భానుమతి చేయాల్సిన మిస్సమ్మ భానుమతికి కాకుండా పోయింది. ఆ వేషం సావిత్రికి దక్కింది. సావిత్రికి తిరుగు లేకుండా పోయింది.మరి కొన్నేళ్లకు సావిత్రి చేసిన రెండు తప్పులు– అధిక తిండి, మద్యపానం ఆమెనూ ఆమె రూపాన్ని మార్చేశాయి. ‘దేవత’ (1965) తీసే నాటికి లాంగ్షాట్లో చూపించాలంటే కెమెరామెన్లు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆప్పటికి ఆమె వయసు కేవలం 30. కొత్త హీరోయిన్లు ఆమె అవకాశాలు తన్నుకుపోయారు. విశేషం ఏమంటే ఆమె కంటే ఒక్క సంవత్సరం తర్వాత పుట్టిన జమున 1975 వరకూ హీరోయిన్గా చెలాయించింది.సావిత్రికి ఒక సమస్య ఉంది. ఏదైనా పాత్ర ఇస్తే ఆ పాత్రను అద్భుతంగా అర్థం చేసుకుంటుంది. ఎదురుగా ఉండబోయే పాత్రలు ఇవే అనంటే వాటినీ అంతే బాగా అనలైజ్ చేసుకుంటుంది. కాని ఇంత తెలిసిన నటి ఎందుచేతనో ఎదుట ఉన్న మనిషిని మాత్రం గుర్తించలేదు. వాళ్లు ఎటువంటి వాళ్లో, వాళ్లు ఏ వేషం కట్టి తన వద్దకు వచ్చారో ఎప్పడూ గ్రహించలేకపోయింది. ఆమెకు తెలిసింది ఒక్కటే. నమ్మడం. నమ్మి చెడ్డవాళ్లలో సావిత్రిది ముందు వరుస. ఆమెకు కల్లబొల్లి మాటలు చెప్పి నగలు దోచుకెళ్లిన వాళ్లు... కొంగు ముడిలో ఉన్న డబ్బు కాజేసినవారు.... తీసుకున్న డబ్బు ఎగ్గొట్టిన వారు... చిల్లరకు ఆస్తులు కొని కొట్టేసిన వాళ్లు.... అందరూ అయినవాళ్లే. నమ్మించిన వాళ్లు.మనిషికి చదువు తోడుండాలి. లేదా చదువుకున్న వారి తోడు ఉండాలి. సావిత్రికి రెండూ లేవు. ఇన్కంటాక్స్ను కట్టాలని, సరిగా కట్టాలని తెలియాల్సిన అవసరం ఉంది. తెలియచేయాల్సిన వారి బాధ్యతా ఉంది. 8లక్షల టాక్స్ బకాయిలు 30 లక్షల వరకూ వెళ్లాయి. ఆమెను దర్శకురాలిని చేద్దామని ఉవ్విళ్లూరిన బృందం హామీ సంతకాలు పెట్టించి పక్కకు తప్పుకుంది. ‘హీరోయిన్’గా చేయడానికి వచ్చిన ‘పరిమితి’ దర్శకురాలిగా అస్తిత్వం చూపమని పోరు పెట్టింది. సొంత నిర్మాణ దర్శకత్వంలో ‘మూగమనసులు’ సినిమాను తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ప్రాప్తం’ గా తీయడం ఒక తొందరపాటైతే, అదే సొంత నిర్మాణ దర్శకత్వంలో చలం హీరోగా ‘వింత సంసారం’ తీయడం గ్రహపాటు. రెండూ ఒకే రోజు 1971 ఏప్రిల్ 14న విడుదలయ్యాయి. ఒక తెలుగు హీరోయిన్ తీసిన రెండు సినిమాలు ఒకేరోజు రెండు భాషల్లో రెండురాష్ట్రాల్లో విడుదల కావడం రికార్డ్. కాని ఆ రికార్డును ఎవరూ గుర్తించలేదు. ఆ సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల సావిత్రికి ఎంత పోయిందో, ఆ ఫ్లాప్లు చూపించి ఎంత లాగవచ్చో మాత్రం గుర్తుంచుకున్నారు. డబ్బు పోతే బాధ నిజమే కానీ మనుషులు కొట్టే దెబ్బకు కలిగే బాధ ఇంకా అధికం. నౌకర్లు, చాకర్లు, మంది మార్బలంతో వెలిగిన తార... కారణాలు ఏవైనా ఆమె ఒక్కతి ఒంటరిగా జీవించే స్థితి రారాదు. డయాబెటిస్ పేషంట్ అయినప్పుడు ఆమెకు ఇన్సులిన్, ఆ వెంటనే సరైన ఆహారం ఇచ్చే సిబ్బంది లేని స్థితిలో ఉండటం సరి కాదు. బాధ్యులెవరో తేలాల్సిన దుర్మార్గం అది. ఫలితంగా ఏమైంది? 1980 మే 11న ఔట్డోర్ కోసం బెంగళూరు వెళ్లి ఇన్సులిన్ తీసుకుని, ఆహారం స్వీకరించకుండా నిద్ర పోవడంతో సావిత్రి కోమాలోకి వెళ్లిపోయింది. ఎలాంటి దేహం ఆమెది? పొంలంలో పని చేసి, స్టేజ్ మీద గెంతి, బలమైన ఆహారం తీసుకుని దృఢంగా పెరిగిన దేహం. కాని మనసు తిన్న ఘాతాలతో స్వయంగా తలపెట్టుకున్న అపకారాలతో ఆ దేహం ధ్వంసమైంది.ఆ మహానటి ఒక తల్లి కూడా. ‘బొమ్మలు కొనిపెడతాలే నాన్నా’... అని పక్కనే ఉన్న కుమారుడితో అన్న మాటను నెరవేర్చకుండానే మరో 19 నెలల తర్వాత కన్నుమూసిందా కన్నతల్లి. గొప్ప ప్రతిభ. దానికి అవకాశం దొరకాలి. దొరకబుచ్చుకునేంత వరకు పోరాడాలి. దొరికాక విజృంభించాలి. ఇది... సావిత్రిని చూసి నేర్చుకోవాలి నేటి జెన్ జి తరం.గొప్ప పురోభివృద్ధి... కాని అప్రమత్తంగా ఉండాలి... ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి... ఆరోగ్య క్రమశిక్షణ ఉండాలి... కుటుంబంలో వచ్చే సమస్యలను శ్రద్ధగా పరిష్కరించుకోవాలి... అప్పుడే అది మరింత గొప్ప విజయం... ఇది కూడా సావిత్రిని చూసి నేర్చుకోవాలి.సావిత్రి ఒక స్కూల్.ఆమె నటన, జీవితం రెండూ తెలుగు వారికి శాశ్వత పాఠాలు.మహానటి టాప్ టెన్ 1953 దేవదాసు –వేదాంతం రాఘవయ్య1955 కన్యాశుల్కం – పి పుల్లయ్య1955 మిస్సమ్య– ఎల్వీ ప్రసాద్1957 మాయాబజార్– కెవిరెడ్డి1957 తోడికోడళ్లు – ఆదుర్తి సుబ్బారావు1959 అప్పుచేసి పప్పుకూడు – ఎల్వీ ప్రసాద్1962 గుండమ్మ కథ – కమలాకర కామేశ్వరరావు1963 నర్తనశాల – కమలాకర కామేశ్వరరావు1964 మూగమనుసలు – ఆదుర్తి సుబ్బారావు1965 పాండవ వనవాసం – కమలాకర కామేశ్వరరావుఆమె నోట సన్నాయి పాట‘నీ లీల పాడెద దేవా’.... సన్నాయితో పోటీ పడి ఎస్.జానకి పాడిన ఈ పాట తమిళ డబ్బింగ్ ‘మురిపించే మువ్వలు’లోనిదని అందరికీ తెలుసు. ఈ పాట పాడే సమయానికి ఎస్.జానకికి అంత పేరు లేదు. దాంతో సావిత్రి ఈ పాటను సుశీల వంటి పెద్ద గాయనితో పాడించాలని కోరింది. అయితే సన్నాయితో పోటీ పడే గళం జానకికి తప్ప మరొకరితో లేదని అందరూ తేల్చి చెప్పాక అభినయించడానికి ఒప్పుకుంది. ‘నీ లీల పాడెద దేవా’ పాటను జెమినీ గణేశన్తో అభినయించడం వల్ల ఒక సూపర్హిట్ పాటను ఆ భార్యాభర్తలు అభినయించినవారు అయ్యారు. సావిత్రికి చక్కని గొంతు ఉంది. ఆమె పాటలు కూడా పాడుతుంది. అంతే కాదు షూటింగ్లు లేనప్పుడు తన సినిమాల పాటల రికార్డింగ్ ఏదైనా జరుగుతూ ఉంటే వెళ్లి కూచునేది. ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన ‘చిన్నారి పాపలు’ కు సంగీత బాధ్యతలు పి.లీలకు అప్పగించిందామె. ఆమె దర్శకత్వంలోని ‘మాతృదేవత’లో ‘మనసే కోవెలగా మమతలు మల్లెలుగా’ పాట పెద్ద హిట్.మీకు మీరే మాకు మేమే...స్వాభావికంగా మంచితనం ఉన్న ఆర్టిస్టులో గొప్ప ఆర్ట్ ఉంటే ఆ ఆర్టిస్టుకు తిరుగు ఉండదు. సావిత్రిని చూస్తే మంచి అమ్మాయి అని టక్కున తెలిసి పోతుంది. ఆ ముఖంలో అసామాన్యమైన ప్రతిభ కూడా కనిపిస్తుంటే జనం ఊ.. అన్నా బ్రహ్మరథం పడతారు. ఆ.. అన్నా బ్రహ్మరథం పడతారు. 1955లో సావిత్రి సినిమాలు ముఖ్యమైనవి మూడు వచ్చాయి. ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘కన్యాశుల్కం’. ఒకదానిలో టీచరమ్మ, మరోదానిలో కూరలమ్మి, ఇంకోదానిలో వేశ్య. ‘మిస్సమ్మ’లో కస్సుబుస్సులాడే సావిత్రిని చూసి ఎమ్టీరావు అనే ఎన్.టి.రామారావు (NT Ramarao) ‘నేను కూడా అంతో ఇంతో మంచివాణ్ణే కదండీ’ అంటాడు బెరుగ్గా. అప్పటికి సావిత్రికి స్టార్ స్టేటస్ రాలేదు. కాని తన నటనతో ఎదురుగా ఉన్నది రామారావు అయినా పాత్రకు తగ్గ పై చేయి సాధించగలిగింది. ‘మీకు మీరే మాకు మేమే’ పాటలో సావిత్రి ఈసునసూయలు ఎంత అందమో అంత చందం.‘దొంగ రాముడు’లో నిజమైన కూరగాయల బుట్టను నెత్తిన పెట్టుకుంటే ‘ఎందుకమ్మా... ఉత్త బుట్ట చాలు’ అని ఎవరో అంటే ‘లేదు సార్.. ఉత్త బుట్ట నడకకీ బరువు బుట్ట నడకకీ తేడా ఉంటుంది’ అని మోసిందామె. ఆమె ఆ బుట్టతో నడుస్తుంటే శరీరం చూసి పురుషులకు చిత్త వికారం కలగదు. సావిత్రి అదే సినిమాలో ఖాళీ బుట్టతో నడక కూడా ఎలా ఉంటుందో చూపుతుంది. రెంటికీ తేడా! ఇక ఆర్.నాగేశ్వర రావుతో సావిత్రి పాడిన ‘రావోయి మా ఇంటికి’ కంటితో వింటూ చెవితో చూడాలి.‘కన్యాశుల్కం’లో మధురవాణిని అర్థం చేసుకుని సాహితీ ప్రమాణాలకు తగినట్టుగా ఆ వయసులో నటించడం సావిత్రి మరో రికార్డు! అందులో ‘లొటిపిట్ట’ జోక్కు మధురవాణి సుదీర్ఘంగా నవ్వే సీన్ ఉంది. అంతసేపు వేరెవరైనా నవ్వితే ప్రేక్షకులు తెర చింపేస్తారు. సావిత్రి కాబట్టి చెల్లింది.సావిత్రి తెలుగులో నటించే వేళకు హిందీలో హీరోయిన్లు స్విమ్సూట్లు వేస్తున్నారు. మోడ్రన్ డ్రస్సులు... హెయిర్ స్టయిల్స్ ఫాలో అవుతున్నారు. వాన పాటల్లో తడుస్తున్నారు. కాని సావిత్రి కేవలం కట్టు, బొట్టులతో తను తనలాగే ఉంటూ ప్రేక్షకులను జయించింది. డాన్స్ బాగా వచ్చినా చాలా కొద్దిగా తప్ప చేయలేదు. క్లోజప్ను కాచుకోగల ఏకైక నటి ఆమె. ఆమె క్లోజప్స్ను ‘మాయాబజార్’లో చూడాలి. తల్లిచాటు శశిరేఖ, ప్రేమిక శశిరేఖ, మాయా శశిరేఖ... ఆ సినిమాలో ఆమె ‘మగాడు’లా నటించింది.‘మూగ మనసులు’ స్క్రిప్ట్ విని ‘నేను గౌరి పాత్ర వేస్తాను’ అన్నదట సావిత్రి. ‘నువ్వు ఆ పాత్ర వేస్తే రాధలా వేసే వారిని ఎక్కణ్ణుంచి తేవాలి’ అన్నారట ఆదుర్తి. అవును... నాగేశ్వరరావును ‘ఒరే’ అనగలిగేది, అంటే ప్రేక్షకులు వినగలిగేది సావిత్రి నుంచే. ‘మంచి మనసులు’లోని సావిత్రి వేసిన పాత్రకు ఎందరో అభిమానులు. ఆమె నాగేశ్వరరావును అల్లరి పెడుతుంటే మురిసిన స్త్రీలు నాగేశ్వరరావు దక్కకపోతే ఆమె కంటే ఎక్కువ దు:ఖపడ్డారు.‘డాక్టర్ చక్రవర్తి’లో ‘నీవు లేక వీణ’ పాట సున్నితమైనది. భర్తను తలుచుకుంటూ విరహంతో శృంగార భావనను చాలా సటిల్గా చూపుతుంది సావిత్రి. ‘పరువము వృధగా బరువుగా సాగే’ లైన్ దగ్గర తన చెంపను తనే నిమురుకుని, రెండు చేతులు దగ్గరకు చేర్చి ఒళ్లు విరుచుకుంటుందామె. అసభ్యత లేని ఆ చేష్ట శృంగారాభినయానికి ఆనవాలు.ఇటువంటి గొప్ప నటి ‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా’ అని తెల్ల వెంట్రుకలతో, బక్క చిక్కి పాడితే, ఎలా ఉన్నా ‘సావిత్రి ఉందట’ అంటూ మహిళా ప్రేక్షకులు పోటెత్తారు. సావిత్రి ఘనతలు చెప్పడం చక్కెరలో పలుకులు లెక్కబెట్టడం. నిరూపణ అక్కర్లేని గొప్పతనం, మహా నటనం సావిత్రిది. అందుకే ఆమె మహానటి సావిత్రి.
షాలిని పాండే బోల్డ్ లుక్.. శారీలో రెజీనా కసాండ్రా ..!
పుష్ప-2 కిస్సిక్ మూడ్లో శ్రీలీల..బ్యూటీఫుల్ లుక్లో షాలిని పాండే..కలర్ఫుల్ శారీలో రెజీనా కసాండ్రా..బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అందాలు.. స్కైలాబ్ జ్ఞాపకాల్లో నిత్యా మీనన్..ప్రేమంటే హీరోయిన్ ఆనంది బ్యూటీఫుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14)
ఆంధ్ర కింగ్ తాలూకా.. రామ్ పాడిన ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగా తాలూకా(Andhra King Taluka Movie). ఈ మూవీకి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కింగ్డమ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. పప్పీ షేమ్ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను హీరో రామ్ ఆలపించడం ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. వివేక్- మెర్విన్ సంగీతం అందించారు. కాగా.. ఈ చిత్రంలో కన్నడ హీరో కీలక పాత్రలో నటించారు.
క్రీడలు
December 6: టీమిండియాకు చాలా ప్రత్యేకమైన రోజు
భారత క్రికెట్కు డిసెంబర్ 6 (December 6) చాలా ప్రత్యేకమైన రోజు. ఇవాళ ముగ్గురు టీమిండియా స్టార్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దిగ్గజ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వేర్వేరు సంవత్సరాల్లో డిసెంబర్ 6న జన్మించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యులుగా ఉన్నారు.ఈ ముగ్గురిలో సీనియర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). ఎడమ చేతి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన జడేజా 1988లో గుజరాత్లోని నవ్గామ్ఘడ్లో జన్మించాడు. 2008 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.2008-09 రంజీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన (42 వికెట్లు, 739 పరుగులు) కారణంగా జడ్డూకు టీమిండియా ఆఫర్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు జడేజా.2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించి, ప్రస్తుతం భారత టెస్ట్, వన్డే జట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.పై ముగ్గురిలో జడ్డూ తర్వాత సీనియర్ బుమ్రా (Jasprit Bumrah). ఈ కుడి చేతి వాటం పేసు గుర్రం 1993లో గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించాడు. విశిష్టమైన బౌలింగ్ శైలి కలిగిన బుమ్రా.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగ్ మరియు పేస్ కలయికతో ప్రపంచ బ్యాటర్లను వణికిస్తున్నాడు.ఐపీఎల్లో సత్తా చాటడం ద్వారా 2016 టీమిండియా తలుపులు తట్టిన బుమ్రా అనతికాలంలో సూపర్ స్టార్ బౌలర్ అయ్యాడు. భారత పేసు గుర్రంగా పేరు తెచ్చుకున్నాడు. బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట. పరిమిత ఓవర్ల క్రికెట్లో చివరి ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యానికి బుమ్రా ప్రసిద్ది చెందాడు.గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న బుమ్రా, టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గతేడాది భారత్ టీ20 ప్రపంచకప్ సాధించడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. విదేశీ పిచ్లు.. ముఖ్యంగా SENA దేశాల్లో ఫాస్ట్ బౌలింగ్ పిచ్లపై బుమ్రాకు ఎవరికీ లేని ట్రాక్ రికార్డు ఉంది.పై ముగ్గురిలో చిన్నవాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). శ్రేయస్ 1994లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్ అయిన శ్రేయస్ 2014 అండర్-19 వరల్డ్కప్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత దేశవాలీ క్రికెట్లో సత్తా చాటి 2017లో టీమిండియా తలుపులు తట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రేయస్ మిడిలార్డర్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి టీమిండియాను చాలా మ్యాచ్ల్లో గెలిపించాడు. జాతీయ జట్టులో పోలిస్తే శ్రేయస్కు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 2024లో కేకేఆర్కు టైటిల్ అందించిన శ్రేయస్ 2025 సీజన్లో పంజాబ్ను.. అంతకుముందు ఢిల్లీని ఫైనల్కు చేర్చాడు. 2023 వరల్డ్కప్లో 500పైగా పరుగులు చేసి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన శ్రేయస్.. టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలోనూ ప్రధానపాత్ర పోషించాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్.. ప్రస్తుతం కోలుకునే క్రమంలో ఉన్నాడు.పై ముగ్గురితో పాటు డిసెంబర్ 6న ఆర్పీ సింగ్, కరుణ్ నాయర్, అన్షుల్ కంబోజ్, హ్యారీ టెక్టార్, గ్లెన్ ఫిలిప్ లాంటి స్టార్ క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో షఫాలీ
దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో నిలిచింది. మహిళల విభాగంలో నవంబర్ నెలలో ఆమె ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తుది జాబితాలో షఫాలీకి చోటు దక్కింది. భారత్ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ గెలుపొందడంలో షఫాలీ కీలకపాత్ర పోషించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆమె 87 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు తీసింది. ప్రతీక రావల్ గాయపడటంతో అనూహ్యంగా సెమీస్, ఫైనల్ ఆడే అవకాశం దక్కగా ఏకంగా ఆల్రౌండ్ షోతో భారత వరల్డ్కప్ స్టార్ అయ్యింది. తాజాగా అవార్డు రేసులోనూ ఉంది. ఆమెతో పాటు ఈ అవార్డు కోసం ఈషా ఒజా (యూఏఈ), తిపత్చా పుతవాంగ్ (థాయ్లాండ్)లు కూడా పోటీ పడుతున్నారు. ఐసీసీ ప్రారంభించిన మహిళల ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీలో (బ్యాంకాక్)లో వీళ్లిద్దరు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక పురుషుల విభాగంలో నవంబర్ నెలకు గాను సఫారీ స్పిన్నర్ హార్మర్, బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లామ్, పాకిస్తాన్ ఆల్రౌండర్ నవాజ్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు రేసులో ఉన్నారు. భారత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా నెగ్గడంలో హార్మర్ కీలక భూమిక పోషించాడు.
‘అవసరమైతే... అధికారిక ఆదేశాలిస్తాం’
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్స్ చాంపియన్షిప్ రేసు రసవత్తరంగా మారింది. 24 రేస్ల సీజన్లో ఇప్పటి వరకు 23 రేసులు ముగియగా... పాయింట్ల పట్టికలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ 408 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 396 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో మెక్లారెన్కే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (392 పాయింట్లు) ఉన్నాడు.సీజన్లో చివరి రేస్ అబుదాబి గ్రాండ్ప్రి ఈ ఆదివారం జరగనుండగా... నోరిస్ పోడియంపై నిలిస్తే అతడికే ఈ ఏడాది టైటిల్ దక్కనుంది. ఈ నేపథ్యంలో... మెక్లారెన్ యాజమాన్యం శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే జట్టు తరఫున ఆదేశాలిస్తామని పేర్కొంది. ‘అవును, తప్పకుండా ప్రయత్నిస్తాం. మేము ఈ డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ గెలవాలని అనుకుంటున్నాం. మా ఇద్దరు డ్రైవర్లు టైటిల్ రేసులో ఉన్నా... ఒకరికి మాత్రమే ఎక్కువ అవకాశాలున్నాయనేది సుస్పష్టం. ఇది జట్టు క్రీడ. చాంపియన్షిప్ సాధించేందుకు చేయగలిగినదంతా చేస్తాం. అలా చేయకపోవడం పిచ్చితనం అవుతుంది’ అని మెక్లారెన్ సీఈవో జాక్ బ్రౌన్ అన్నాడు. వెర్స్టాపెన్ కంటే 12 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న నోరిస్ సీజన్ చివరి రేసులో తొలి మూడు స్థానాల్లో నిలిస్తే చాలు టైటిల్ దక్కనుంది. ఈ నేపథ్యంలో సహచర డ్రైవర్ పియాస్ట్రిని చాంపియన్షిప్ గెలిచేందుకు సహకరించమని అడగలేనని నోరిస్ ఇప్పటికే పేర్కొనగా... తాజాగా జట్టు మేనేజ్మెంట్ మాత్రం టైటిల్ కోసం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటామని వెల్లడించింది. మెక్లారెన్ జట్టు చివరిసారిగా 2008లో డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ నెగ్గింది.
లెబ్రాన్ జేమ్స్బాండ్ 008!
టొరంటో: లెబ్రాన్ జేమ్స్ ఎన్బీఏ బాస్కెట్బాల్ ప్రియులకు చిరపరిచితుడు! హాలీవుడ్లోని ‘జేమ్స్బాండ్ 007’ సిరీస్ సినిమాల్లాగే విజయవంతమైన సూపర్ బాస్కెట్బాలర్ లెబ్రాన్. అరంగేట్రం మొదలు ఇప్పటివరకు ఆడిన 1297 వరుస మ్యాచ్ల్లో అతను ప్రతీసారి కూడా పదుల సంఖ్యని మించే పాయింట్లు సాధించాడు. లెబ్రాన్ జేమ్స్ ఇన్నేళ్ల తర్వాత, వెయ్యిపైచిలుకు మ్యాచ్ల అనంతరం తొలిసారి సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాడు. బాగా ఆడి ఎప్పుడూ వార్తల్లో నిలిచే జేమ్స్... ఈసారి బాగా ఆడలేక కూడా నిలవడమే ఈ వార్తకున్న విశేషం!లాస్ ఏంజెలిస్ లేకర్స్కు ఆడే ఈ అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్బాలర్ టొరంటో రాప్టర్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 8 పాయింట్లే చేశాడు. అయితే ఈ మ్యాచ్లో పాయింట్లు చేయడంలో వెనుకబడినప్పటికీ సహచరులకు పదేపదే స్కోరు చేసేందుకు సాయపడ్డాడు. దీంతో లేకర్స్ 123–120తో టొరంటో రాప్టర్స్పై గెలుపొందింది. 40 ఏళ్ల జేమ్స్ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో అలుపెరగని యోధుడు. 2003లో క్లీవ్లాండ్ కెవలియర్స్ తరఫున ఎన్బీఏలో అరంగేట్రం చేసిన ఈ పవర్ ఫార్వర్డ్ ప్లేయర్ తదనంతరం మయామి హీట్కు మారాడు. 2018 నుంచి లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని కెరీర్ మొత్తం హైలైట్స్ అంటే అతిశయోక్తి కాదు. 2005 నుంచి 2025 వరకు ఏకంగా 21 సార్లు ‘ఎన్బీఏ ఆల్ స్టార్స్’లో నిలిచాడు. 2012, 2013, 2016, 2020 ఈ నాలుగేళ్లు ఎన్బీఏ చాంపియన్గా, ఫైనల్స్లో ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా నిలిచిన ఘనత లెబ్రాన్ జేమ్స్దే! ‘ఫోర్బ్స్’ గణాంకాల ప్రకారం అతని నికర సంపద 1.3 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ. 11, 689 కోట్ల రూపాయలు! లెబ్రాన్ జేమ్స్ కుమారుడు బ్రోనీ జేమ్స్ కూడా బాస్కెట్బాల్ ప్లేయరే. లెబ్రాన్, బ్రోనీ ఇద్దరూ కలిసి గత సీజన్లో లాస్ఏంజెలిస్ లేకర్స్ తరఫున బరిలోకి దిగి ఎన్బీఏ మ్యాచ్ ఆడిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టించారు.
న్యూస్ పాడ్కాస్ట్
ఉన్నత శిఖరాలకు మన బంధం. ఇండియా-రష్యా సదస్సులో సంయుక్త ప్రకటన చేసిన మోదీ, పుతిన్
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సక్రమంగా ఎక్కడ అమలు చేశారు?. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జీవో సాక్షిగా చంద్రబాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు... విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఆ కాలేజీలకు రాష్ట్ర ఖజానా నుంచి వంద కోట్ల రూపాయలు దోచిపెట్టే కుతంత్రం
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధి మాటున భూ దోపిడీ...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంతులేని భూదాహం... రాజధానిలో రెండో విడత కింద ఏడు గ్రామాల్లో 20 వేల 494 ఎకరాలకుపైగా భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో వరి రైతుల పరిస్థితి దయనీయం... ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం... దళారుల కనుసన్నల్లోనే ధాన్యం సేకరణ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం, దళారులతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టికొడుతున్నారు... సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
రేట్ల తగ్గింపు బాటలో బ్యాంకులు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను తగ్గించడంతో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించే పనిలో పడ్డాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెపో ఆధారిత రుణ రేటును 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి ఈ రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది.అటు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ రెపో ఆధారిత రుణ రేటు (ఆర్బీఎల్ఆర్)ను 8.35 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఇటీవలే ఏడాది కాలవ్యవధికి సంబంధించిన ఎంసీఎల్ఆర్ని (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు) 5 బేసిస్ పాయింట్లు కట్ చేసి 8.80 శాతానికి తగ్గించింది.
ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్
అంచనాలను మించిన ఆర్థిక పురోగతికి దన్నుగా రిజర్వ్ బ్యాంక్ తాజాగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను తగ్గించింది. ఆరు నెలల తదుపరి పావు శాతం కోత పెట్టడంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. యూఎస్ టారిఫ్ల సవాళ్ల నేపథ్యంలో ఎకానమీకి జోష్నిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీసింది. వివరాలు చూద్దాం..ముంబై: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా మొగ్గు చూపింది. ఫలితంగా రెపో రేటులో 0.25 శాతం కోత పడింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో తాజాగా 5.25 శాతానికి క్షీణించింది. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మరింత దిగివచ్చేందుకు దారి ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల కొద్ది నెలలుగా యూఎస్ వాణిజ్య టారిఫ్లతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నునిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం ఎంపీసీ వెసులుబాటు కల్పించింది. తాజా పరపతి సమీక్షలో తటస్థ విధానాలు అవలంబించడం ద్వారా భవిష్యత్లోనూ రేట్ల కోతకు వీలున్నట్లు సంకేతాలిచి్చంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్బీఐ నాలుగుసార్లు కోత విధించడం ద్వారా రెపో రేటును 5.25 శాతానికి చేర్చింది. అంటే 2025 ఫిబ్రవరి నుంచి 1.25 శాతంమేర దిగివచి్చంది. ప్రభుత్వ ప్రోత్సాహానికితోడుగా.. ఇప్పటికే యూఎస్ టారిఫ్లతో దేశీ ఎగుమతులు నీరసించగా.. వాణిజ్య లోటు పెరిగింది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి పడిపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లకు చెక్ పెట్టే బాటలో మరింత లిక్విడిటీ ద్వారా రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్బీఐ సంకల్పించింది. తద్వారా సమర్థవంత ఆర్థిక పురోగతికి అండగా నిలిచే నిర్ణయాలను ప్రకటించింది. ఇప్పటికే మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం జీఎస్టీ రేట్లలో సంస్కరణలు, కారి్మక చట్టాలు, ఫైనాన్షియల్ రంగ నిబంధనల సరళీకరణ ద్వారా జీడీపీకి జోష్నిచ్చే చర్యలను చేపట్టింది. వెరసి ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆర్బీఐ నిర్ణయాలు జత కలవనున్నాయి. రూ. లక్ష కోట్లు ఇలా ఓపెన్ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తాజా పాలసీలో పేర్కొంది. రెండు దశలలో అంటే ఈ నెల 11న రూ. 50,000 కోట్లు, 18న మరో రూ. 50,000 కోట్లు విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు దన్నుగా ఈ నెల 16కల్లా 5 బిలియన్ డాలర్ల విలువైన మూడేళ్ల డాలర్–రూపీ కొనుగోళ్లు–అమ్మకాల స్వాప్ను చేపట్టనుంది. సీజనల్గా బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న లిక్విడటీ సమస్యలకు ఈ చర్యలు పరిష్కారం చూపనున్నట్లు ఆర్బీఐ తెలియజేసింది. రూపాయిపై కల్పించుకోం..ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కదలికలపై ఎలాంటి ధరల శ్రేణినీ లక్ష్యంగా పెట్టబోమని మల్హోత్రా తెలియజేశారు. దేశీ కరెన్సీ దిద్దుబాటును అడ్డుకోబోమని స్పష్టం చేశారు. రూపాయికి సరైనస్థాయిని మార్కెట్టే నిర్ణయిస్తుందని తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి 90కు పతనమైన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.బ్యాలన్స్చేస్తూ ఓవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిని సాధిస్తోంది. మరోపక్క అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం భారీగా క్షీణిస్తోంది. దీంతో లక్ష్యానికంటే దిగువకు ధరలు జారుతున్నాయి. వెరసి వృద్ధి– ధరల సమతౌల్యానికి చర్యలు తీసుకుంటున్నాం. వృద్ధి పరిస్థితులను కొనసాగించేందుకు వీలుగా పాలసీ నిర్ణ యాలతో మద్దతిస్తున్నాం. బయటినుంచి సవాళ్లు ఎదు రవుతున్న నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తావించదగ్గస్థాయిలో నిలకడను చూపుతూ వృద్ధి పథంలో ప్రయాణిస్తోంది. ధరలు వెనకడుగు వేయడంతో వృద్ధికి వీలైన చర్యలు తీసుకునేందుకు వీలు చిక్కుతోంది. – సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ఈఎంఐలు తగ్గనున్నాయ్ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్బీఐ నాలుగుసార్లు కీలక వడ్డీ రేటును తగ్గించింది. దీంతో రెపో రేటు 1.25 శాతంమేర దిగివచి్చంది. ఇప్పటికే 1 శాతంవరకూ రెపో తగ్గడంతో ప్రధానంగా గృహ రుణ వినియోగదారులకు భారీగా కలసిరానుంది. ప్రామాణిక రుణ వడ్డీ రేటు(ఈబీఎల్ఆర్) ఆధారిత గృహ రుణాలపై ఈఎంఐ మొత్తం తగ్గనుంది. ఇప్పటికే గృహ రుణ రేట్లు సుమారుగా 9 శాతం నుంచి 7.5 శాతంవరకూ దిగివచ్చాయి. ఇదేస్థాయిలో రేట్లు కొనసాగితే ఉదాహరణకు రూ. 50 లక్షల రుణంపై రూ. 9 లక్షలవరకూ ఆదాకానున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేశాయి. 20 ఏళ్లకాలానికి 8.5 శాతం వడ్డీ రేటులో రూ. 50 లక్షల గృహ రుణం తీసుకుంటే నెలకు రూ. 43,400 చొప్పున ఈఎంఐ చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే తాజా తగ్గింపు పూర్తిగా వర్తిస్తే అంటే 7.25 శాతానికి రుణ రేటులో కోతపడితే ఈఎంఐ చెల్లింపులో దాదాపు మరో రూ. 4,000 తగ్గే వీలుంది. ఇలాకాకుండా రూ. 43,400 చొప్పున చెల్లింపులు కొనసాగిస్తే.. 3 ఏళ్లకుపైగా వాయిదాల మొత్తం తగ్గవచ్చని అభిప్రాయపడ్డాయి.కార్పొరేట్లు సైతం ఖుషీరెపో రేటు దిగిరావడంతో వ్యక్తిగత రుణాలతోపాటు.. కార్పొరేట్ రంగానికీ లబ్ధి చేకూరనుంది. ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు రెపో. వెరసి రెపో తగ్గడంతో బ్యాంకులు ఆమేర తమ కస్టమర్లకు వడ్డీ రేట్ల తగ్గింపును బదిలీ చేయవలసి ఉంటుంది. ఇది ఎంసీఎల్ఆర్, బేస్ రేటు తదితరాల ఆధారంగా తీసుకునే వ్యక్తిగత, వాహన, గృహ, బిజినెస్ రుణాలన్నిటికీ వర్తించనుంది. వెరసి రుణాలు మరింత చౌకకానున్నాయి. ఇది రుణాలకు డిమాండ్ను పెంచడంతో వినియోగం ఊపందుకునే వీలుంది. ఇది ఇండ్రస్టియల్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ రంగాల అమ్మకాలలో వృద్ధికి దారి చూపుతుందని, ఫలితంగా ఉపాధి కల్పన సైతం మెరుగుపడే వీలున్నదని ఆర్థికవేత్తలు వివరించారు. ఆటో రంగ జోరు వడ్డీ రేటు కోత ఇటీవల ఆటో రంగ వృద్ధికి మరింత ఊతమివ్వనుంది. జీఎస్టీ సంస్కరణలతో వడ్డీ రేట్ల తగ్గింపు జత కలవడం ఇందుకు తోడ్పాటునిస్తుంది. అందుబాటులో రుణాలతో వినియోగం బలపడుతుంది. – శైలేష్ చంద్ర, ఆటో పరిశ్రమల అసోసియేషన్(సియామ్) ప్రెసిడెంట్ కొత్తవాళ్లకు పుష్ గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు మరింతమంది ప్రజలు సొంత ఇళ్లవైపు ఆలోచించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. ఇంతవరకూ నిర్ణయం తీసుకోని వ్యక్తులు, కుటుంబాలు గృహ కొనుగోలుకి ముందడుగు వేసే వీలుంది. – రియల్టీ రంగ సమాఖ్యలు క్రెడాయ్, ఎన్ఏఆర్ఈడీసీవో(నరెడ్కో)లక్ష్యాలివీ ఈ ఏడాదికి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఆర్బీఐ తాజాగా 2.6% నుంచి 2 శాతానికి కుదించింది. మరోపక్క జీడీపీ వృద్ధిపై గత అంచనా 6.8 శాతాన్ని 7.3 శాతానికి మెరుగుపరచింది. అరుదుగా ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 2.2 శాతానికి పరిమితంకావడం.. దేశ జీడీపీ 8 శాతం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. ఇలా అరుదుగా జరుగుతుందని తెలియజేశారు.
ఓపెన్ఏఐని మించిపోనున్న గూగుల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.బిజినెస్ ఇన్సైడర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్ ఓపెన్ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్బాట్లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.జెమిని 3, నానో బనానా ప్రోఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం
సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం
దేశ రాజధాని న్యూఢిల్లీలో 100 శాతం ఇథనాల్తో నడిచే పర్యావరణ అనుకూల ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రదర్శిస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. ఈ సాంకేతికత భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన కాలుష్యం తగ్గింపు, రైతుల ఆదాయం పెంపు, ఇంధన దిగుమతుల కోత.. వంటి సమస్యలకు ఒకేసారి పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ‘ఈ కారు పూర్తిగా 100 శాతం ఇథనాల్పై నడుస్తుంది. ఇది పెట్రోల్ కంటే ఆర్థికంగా చాలా భరోసానిస్తుంది. ఇథనాల్ లీటరు ధర సుమారు రూ.65 ఉండగా, పెట్రోల్ ధర రూ.110గా వద్ద ఉంది’ అని తెలిపారు. తాను ప్రదర్శించిన కారు 60 శాతం విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుందని, తద్వారా వాస్తవ ఇంధన ఖర్చు లీటరుకు కేవలం రూ.25 మాత్రమే అవుతుందని చెప్పారు. ‘ఇది సరసమైనదైతేనే ప్రజలు ఇథనాల్ను కొనుగోలు చేస్తారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.రైతులకు లాభం, దేశానికి స్వయం సమృద్ధివ్యవసాయ ఉప ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని మంత్రి గుర్తు చేశారు. దీనివల్ల రైతులకు నేరుగా లాభం చేకూరుతుందని అన్నారు. ‘విరిగిన బియ్యం, మొక్కజొన్న, చెరకు రసం, గడ్డి.. ఇలాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది పూర్తిగా గ్రీన్ ఎనర్జీ, జీరో పొల్యూషన్’ అని గడ్కరీ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల ఆర్థికంగా లాభం కలుగుతుందని ‘వాహనాల్లో ఇథనాల్ వాడితే మన రైతులే లాభపడతారు. శిలాజ ఇంధనాల దిగుమతి ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది. గ్రామీణ ఉపాధి పెరుగుతుంది’ అని హామీ ఇచ్చారు.🚨 "Government-backed studies show no significant performance issues or component damage from using 20% ethanol-blended petrol"- Minister Nitin Gadkari. pic.twitter.com/kZdnmGC5Zl— Indian Tech & Infra (@IndianTechGuide) December 5, 2025ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. దేశంలో దాదాపు 550 ఇథనాల్ డిస్టిలరీలు పనిచేస్తున్నాయని, ఇండియన్ ఆయిల్ ఒక్కటే సుమారు 400 ఇథనాల్ పంపులను నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు.
ఫ్యామిలీ
దత్తజయంతి నాడు ఏమి చేయాలి?
మానవులకు దైవభీతి, గురుభక్తి, ధర్మదీక్ష, పుణ్య కార్యాచరణం, జితేంద్రియత్వం, బ్రహ్మజ్ఞానం మొదలైన సుగుణాలను కలిగించడానికి అనేక రూపాలలో అనేక స్థలాలలో అవతరించిన త్రిమూర్తి స్వరూపుడే దత్తాత్రేయుడు. కలియుగంలో మొదట శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించి కురువపురంలో నివసించారు. ఆ తర్వాత ఆయనే శ్రీ నరసింహ సరస్వతీ యతీంద్రులుగానూ, అక్కల్కోట మహరాజ్గానూ, శ్రీ షిరిడీ సాయి నాథుడిగానూ అవతరించారని ప్రతీతి. నేడు (డిసెంబర్ 4) మార్గశిరపూర్ణిమ, దత్తజయంతి (dattatreya jayanti) సందర్భంగా ఈ వ్యాస కుసుమం ...జన్మసంసార బంధనాలను సులువుగా వదిలించి, జ్ఞానానందాన్ని పంచుతూ, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు వేరుకారని నిరూపించిన అపురూప ఘట్టమే దత్తాత్రేయ ఆవిర్భావం. త్రిమూర్తులే తనకు పుత్రులుగా జన్మించాలంటూ అత్రిమహర్షి–అనసూయ దంపతులు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దూర్వాసుడు (Durvasa) జన్మించగా, విష్ణు అంశతో అవతరించినవాడే దత్తాత్రేయుడు!సకల విద్యాపారంగతుడైన దత్తుడు జ్ఞానసముపార్జనలో ప్రకృతి అణువణువూ తనకు గురువేనని వెల్లడించాడు. ధర్మబద్ధంగా ఇహలోక సుఖాలను కోరుకునేవారికి వాటిని అనుగ్రహిస్తూ, వారిని యోగమార్గంవైపు పయనింపజేసే విశ్వగురు దత్తాత్రేయడు. ఆయన అనుగ్రహిస్తే గురువుతోబాటుగా దైవానుగ్రహమూ లభించినట్లే!ముగ్గురు మూర్తులూ మూడు శిరస్సులుగా...దిక్కులనే అంబరంగా చేసుకుని, భక్తులను ఉద్ధరించేందుకు అనేక రూపాలను ధరించిన దత్తాత్రేయుడి మూడు తలలలో నడిమి శిరస్సు విష్ణువుది కాగా.. కుడివైపున శివుడు సద్గురు స్వరూపంగా, ఎడమవైపు బ్రహ్మదేవుడు పరబ్రహ్మస్వరూపమైన శిరస్సుతో భాసిస్తారు. మధ్యభాగంలో అజ్ఞానాన్ని తొలగించే గురుమూర్తిగా శ్రీదత్తుడు ముల్లోకాలను రక్షిస్తాడు.దత్తావధూతదేహంపై వ్యామోహాన్ని వదిలి, జడ పదార్థంలా ఉండేవారిని అవధూత అంటారు. ఈ పదానికి అసలైన నిర్వచనంగా మారి దత్తావధూత అయ్యాడు. బౌద్ధమతకర్త అయిన బుద్ధుడు, జైనమత స్థాపకుడైన మహావీరుడు వారి శిష్యులైన మహాయోగులు, బోధిసత్వులు, జైనతీర్థంకరులు, షిరిడీ సాయిబాబా వంటి మహనీయులందరూ దత్తాత్రేయుని అంశావతారాలే అవుతారు.పేర్లు వేరైనా పదార్థం ఒక్కటే!ఒక వస్తువును వివిధ భాషలవారు వివిధ పేర్లతో పిలుస్తారు. తెలుగులో మామిడిపండంటే ఆంగ్లంలో ‘మ్యాంగో’ అంటారు. హిందీలో ఆమ్ అంటే సంస్కృతంలో చూతఫలం అంటారు. ఇంకా ఇతర భాషల్లో వేరే పేర్లతో పిలుస్తారు. పేర్లెన్ని ఉన్నా పదార్థం ఒక్కటే కదా! ఆవిరిగా మారినా, మంచులా గడ్డకట్టినా, నీరుగా ఉన్నా అది ఉదకమే కదా! కాబట్టి ఆయన భక్తులకోసం తానే అనేక రూపాలు ధరించి, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతూ, ఆదుకుంటూ ఉంటాడు.అరుదైన రూపంరుద్రాక్షమాల, డమరుకం, చక్రం, శంఖం, త్రిశూలం, కమండలాదులను ఆరుచేతులలో ధరించిన దత్తుని చుట్టూ ఉన్న నాలుగు శునకాలు వేదాలకు ప్రతీకలు. తనను ఆశ్రయించిన వారిని నాలుగువైపులనుండి రక్షిస్తాననే సందేశం కూడా ఇందులో ఉంది. ఆయన వెనకాల కనిపించే గోవును ఉపనిషత్తుల సారంగా చెబుతారు.దత్తజయంతి నాడు ఏమి చేయాలి?అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో మార్గశీర్ష శుద్ధ పౌర్ణమినాడు జన్మించాడు దత్తాత్రేయుడు. ఈ పర్వదినాన ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం శుచిౖయె దత్తాత్రేయులవారి చిత్రాన్ని లేదా ప్రతిమను ముందు ఉంచుకుని షోడశోపచారాలతో, అష్టోత్తర శతనామాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. శారీరక ఉపవాసం కన్నా మానసికంగా చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉండటమే ఆయనకు ఇష్టం.అనంతరం దత్తచరిత్ర, దత్తసహస్రనామావళి, శ్రీగురుచరిత్ర (Shri Guru Charitra) వంటి గ్రంథాలను పారాయణ చేయడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మానసిక, శారీరక వైకల్యాలున్నవారు మార్గశిర పూర్ణిమనాడు దత్తాత్రేయుణ్ణి షోడశోపచారాలతో పూజించి, పంచామృతాలతో అభిషేకిస్తే వారి వైకల్యాలన్నీ తొలగి ఆరోగ్యవంతులవుతారని దత్తచరితం చెబుతోంది.చదవండి: ప్రశాంత జీవన రహస్యమే గీతాసారందత్తుడు ఉదయించిన మార్గశిర పౌర్ణమినే (Margashirsha Purnima) దత్తజయంతిగా జరుపుకుంటారు. ‘దిగంబరా దిగంబరా శ్రీ ΄ాదవల్లభ దిగంబరా’ అంటూ దత్తనామ స్మరణలో గడుపుతారు. దత్తచరిత్ర, అవధూత గీత మొదలైన గ్రంథాల్ని పారాయణ చేస్తారు. భజనలు, సత్సంగాలు నిర్వహిస్తారు. నేడు దత్త స్తవం లేదా దత్తాత్రేయ వజ్రకవచం పఠించడం వలన అన్నిరకాల రక్షణ లభిస్తుంది. దత్తుడి ఆరాధన ఎంతో జటిలమైన పితృదోషాలను సైతం తొలగిస్తుందని ప్రతీతి. అందరికీ ఆ దత్తుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం. జై గురు దేవదత్త– డి.వి.ఆర్.భాస్కర్
ఆందోళనతో కంటికి కునుకే కరువైంది!
నా వయస్సు 72 సంవత్సరాలు. ఉద్యోగం నుంచి రిటైరై దాదాపు 14 ఏళ్లయింది. నేను చాలా సంవత్సరాల నుండి ఒక సమస్యతో బాధపడుతున్నాను. అదేమిటంటే ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం. ఎప్పుడూ మనసులో గందరగోళంగా ఉంటుంది. ఈ ఆలోచన వలన చేసే పనిలో ధ్యాస ఉండదు. రాత్రి పడుకున్న తర్వాత విపరీతంగా కలలు వస్తుంటాయి. దీనివల్ల ప్రశాంతంగా నిద్ర కూడా ఉండడం లేదు. ఈ సమస్య ఎప్పుడు మొదలైందో గుర్తు లేదు కానీ, రిటైర్మెంట్ తర్వాత నన్ను మరింతగా బాధిస్తోంది. నాకు షుగర్, బీపీ కూడా ఉన్నాయి. నా సమస్యకు పరిష్కారం చూడగలరు. –కె.ఎల్.వి ప్రసాద్, హైదరాబాద్మీరు రాసిన లక్షణాలను బట్టి మీకున్న సమస్యను ‘యాంక్సైటీ డిజార్డర్‘ (నిరంతర ఆందోళన రుగ్మత) అంటారు. యాంగై్జటీ లేదా భయం అనేవి ప్రమాదాలనుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రకృతి ఏర్పరచిన, ఒక ర క్షణ వ్యవస్థ. మనుషులతో పాటు జంతువుల్లో కూడా ఈ వ్యవస్థ ఉంటుంది. అయితే కొన్ని సార్లు మెదడు రసాయనాల్లో మార్పులు, చిన్న వయసులో ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల, ఈ రక్షణ వ్యవస్థలో లోపం ఏర్పడుతుంది. ఆ కారణంగానే మెదడు ఆందోళనకు గురవుతూ ఉంటుంది. రోజూవారి వ్యవహారాలు, చిన్నచిన్న సమస్యలని కూడా మెదడు భూతద్దంలో చూస్తూ ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దీని వల్ల ప్రశాంతత ఉండదు. చేసే పని మీద ధ్యాస ఉండదు. ఎప్పుడూ కంగారు కంగారుగా భయంగా ఉంటుంది. రాత్రిపూట కూడా మెదడు ఇలా ఆతిగా ఆలోచనలు చేయడం వల్ల నిద్ర కూడా పట్టదు. ఇది యుక్తవయసులోనే మొదలైతే చాలా సంవత్సరాలు ఇబ్బంది పడవలసి ఉంటుంది. తర్వాతి కాలంలో ఇది తీవ్రమైన డిప్రెషన్కు దారి తీయొచ్చు. దీనికి ఆధునిక వైద్య విధానంలో చక్కని పరిష్కారం ఉంది. కొన్ని ప్రత్యేకమైన మందులు, చికిత్స పద్ధతులను మానసిక వైద్యుల సూచన మేరకు కొంతకాలం వాడాల్సి ఉంటుంది. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ, ఎక్స్΄ోజర్ థెరపీ వంటి కౌన్సెలింగ్ పద్దతుల ద్వారా క్లినికల్ సైకాలజిస్టులు ఈ సమస్య తీవ్రతని తగ్గించగలరు. మీరు దగ్గరలోని మానసిక వైద్యుని కలిసి ఖచ్చితంగా ఈ సమస్య నుండి పూర్తిగా విముక్తి పొందగలరు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
ఆటో ఎక్కి నేపాల్ వెళ్లింది
చెన్నైలో ఎనిమిదేళ్ల క్రితం ఆటో డ్రైవర్గా మారిన మోహన సుందరి (40) ఆ రోజు అనుకొని ఉండదు ‘కమలా భాసిన్ అవార్డ్ 2025’ సాధించి ఖాట్మాండు వెళ్లి మరీ దానిని స్వీకరించగలనని.లింగ సమానత్వం కోసం పోరాడేవారికి ఇచ్చే ఈ అవార్డు ఇటీవల మోహన అందుకుంది.చెన్నైలో మహిళా ఆటోడ్రైవర్ల కోసం ఆమె స్థాపించిన యూనియన్ నేడు 400 మంది సభ్యులకు దిశా నిర్దేశం చేస్తోంది. వారంతా తమ సంఘాన్ని ‘ఇరుంబు కొట్టయి’ (ఇనుప కోట) అని పిలుచుకుంటారు.ప్రతి మహిళా కార్మికురాలికి, ఉద్యోగికి ఉండాల్సిన ఇలాంటి నాయకురాలి గురించి కథనం.‘మాకు ఇప్పటికీ ఆటో స్టాండ్ లేదు. మగవాళ్ల ఆటోలకు స్టాండ్స్ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకంగా ఆటో స్టాండ్ కావాలి. దాని సంగతి చూస్తున్నాం. ఇంకో సమస్య టాయిలెట్స్. ప్రస్తుతానికి పెట్రోలు బంకులే దిక్కవుతున్నాయి. రెస్టరెంట్ల వాళ్లు టాయిలెట్స్ వాడుకోవడానికి మమ్మల్ని రానివ్వడం లేదు. ఆ సమస్యను భవిష్యత్తులో సాల్వ్ చేసుకుంటాం’ అంటోంది మోహన సుందరి కాన్ఫిడెంట్గా.మోహన సుందరి మూడు నాలుగు రోజుల క్రితం ఖాట్మండులో ‘కమలా భాసిన్ అవార్డు 2025’ అందుకుని తిరిగి చెన్నైకి చేరుకుంది. ప్రఖ్యాత ఫెమినిస్ట్ కమలా భాసిన్ మరణానంతరం ఆమె స్మృతిలో భిన్న రంగాల్లో లింగ సమానత్వం కోసం కృషి చేస్తున్న వారికి ఈ అవార్డులు ఇస్తున్నారు. లక్ష రూపాయల నగదు ఉంటుంది. ‘డ్రైవింగ్ ది వరల్డ్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ’ అనే కేటగిరి కింద మోహన సుందరికి అవార్డు ఇచ్చారు. కారణం చెన్నైలో ఎనిమిదేళ్ల క్రితం ఆటో డ్రైవర్గా మొదలైన ఆమె ప్రయాణం ఇవాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. త్వరలో మోహన సుందరీ, ఇతర మహిళా ఆటోడ్రైవర్ల మీద ‘ఆటో క్వీన్స్’ అనే డాక్యుమెంటరీ కూడా విడుదల కానుంది. అది వచ్చాక ఆమె పేరు ఇంకా మార్మోగనుంది.సింగిల్గా పోరాటంచెన్నై అయినవరంకు చెందిన మోహన సుందరి జీవితంలో అనేక ఆటుపోట్లు తిన్నది. కేవరం 8వ తరగతి చదువుకున్న ఆమె బతకడానికి ఎన్నో మార్గాలు వెతికింది. బ్యూటీ క్లీనిక్, టిఫిన్ సెంటర్, చిల్లర అంగడి... అన్నీ దెబ్బ తీశాయి. ఆ సమయంలో ఏనాడో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ గుర్తుకొచ్చింది. ఆటో నడుపుదాం అని నిశ్చయించుకుంది. ఇది తెలిసి ఇతర మగ ఆటోడ్రైవర్లు చాలా హడలగొట్టారు. ‘చాలా కష్టమైన పని వద్దు’ అన్నారు. కాని మోహన సుందరి ఆగలేదు. ఆటో డ్రైవర్గా మారింది. యూనిఫామ్ వేసుకొని రోడ్డు మీద ఆమె తిరుగుతుంటే ఆమె ప్రయాణికులను మాత్రమే గమ్యాన్ని చేరుస్తున్నట్టుగా కాక సామాన్య మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ఒక మార్గాన్ని చూపుతున్నట్టుగా అందరికీ అనిపించింది. ‘పల్లెల్లో ఆడవాళ్ల దగ్గర డబ్బు ఉండక ఇబ్బంది పడతారు. కాని సిటీల్లో కూడా స్త్రీల దగ్గర డబ్బు ఉండదు. స్త్రీలకు సంపాదన ఉంటే వారిని చూసే పద్ధతి మారుతుంది’ అంటుంది మోహన.సాటి మహిళలుచెన్నైలో మోహన సుందరి ఆటో నడిపే సమయానికి చాలా తక్కువమంది మహిళలు డ్రైవర్లుగా ఉన్నారు. కోవిడ్ సమయంలో చాలామంది ఉపాధి అతలాకుతలం అయ్యాక కొత్తగా మహిళలు ఈ రంగంలోకి వచ్చారు. ‘చెన్నైలో ప్రస్తుతం 400 మంది మహిళా ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారిలో సగం మంది సింగిల్ పేరెంట్స్. పిల్లల్ని చూసుకుంటూ సంపాదించాలంటే స్త్రీలకు పెద్ద ఛాలెంజ్’ అంటుంది మోహన. వీరంతా మొదలు వాట్సప్ గ్రూపుల ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వీరి నుంచి స్కూలు పిల్లల గిరాకీ ఉందని, ఇక్కడా అక్కడా నెలవారీ గిరాకీలు ఉన్నాయనే సమాచారం ఒకరికొకరు పంచుకోవడం మొదలుపెట్టాక వీరికి పని గ్యారంటీ వచ్చింది. అదీగాక ఆటో ప్రయాణాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు పంచుకోవడం వల్ల సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోవాలన్న ధైర్యం కూడా వచ్చింది. ఇప్పుడు ఈ మహిళా ఆటోడ్రైవర్లు ఒక బృందంగా బలపడ్డారు.ఇనుప కోట‘ఒక ఆటో డ్రైవర్ మరణిస్తే అతని ముసలి తల్లి చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడటం చూశాక మా మహిళా ఆటోడ్రైవర్లకు సంఘం పెట్టాలనిపించింది’ అంది మోహన సుందరి. ఎన్నో తర్జన భర్జనల తర్వాత సరైన పద్ధతిలో గత సంవత్సరం ‘వీర్ పెంగళ్ మున్నెట్ర సంగం’ (విపిఎంఎస్) రిజిస్టర్ చేశారు. ఇది పెట్టాక మహిళా ఆటో డ్రైవర్లు సభ్యత్వం తీసుకుని తమ సంఘాన్ని ‘ఇనుప కోట’గా పిలుచుకుంటున్నారు. అంటే ఏ సమస్య వచ్చినా కాచుకునేదన్న మాట. నెల నెలా 200 సంఘానికి డ్రైవర్లు కట్టాల్సి ఉంటుంది. ఆ నిధితో సభ్యుల సంక్షేమానికి వినియోగిస్తోంది మోహన. అవి ఏమిటంటే...1. పది లక్షల రూపాయలకు ఇన్సూరెన్సు2. అవసరానికి పది నెలల్లో తీర్చేలా 10 వేల అప్పు3. అనారోగ్యం వల్ల ఆటో వేయలేకపోతే 5 వేలు సాయం4. మహిళా ఆటోడ్రైవర్ ఇంట వృద్ధులు మరణిస్తే అంతిమ క్రియలకు 10 వేలు సాయం.ఇవి గాక ఆటో డ్రైవర్లకు ఉండే ఫైనాన్స్ సమస్యలు, పిల్లల స్కూలు ఫీజులు, ఇతర సపోర్టు ఈ సంఘం ఇస్తోంది. అందుకే మోహన సుందరి చెన్నై ఆటో క్వీన్. ఆమె లాంటి కార్యాచరణ ప్రతి అసంఘటిత రంగంలో ఉంటే మహిళలకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ముందుకెళ్లే ఉపాయాలు దొరుకుతాయి.
సాహో... సాగర ధీర
సముద్రాన్ని జీవితంతో పోలుస్తారు తాత్వికులు. సముద్రంలో మౌనం ఉంటుంది. కల్లోలం ఉంటుంది. పడి లేచిన కెరటాలు ఉంటాయి. సవాళ్ల విషయంలో భారత నావికాదళం కూడా సముద్రంలాంటిదే. ఆ సవాళ్లను అధిగమించి భారత నావికా దళంలో వివిధ కీలక విభాగాల్లో తొలి మహిళలుగా చరిత్ర సృష్టించిన రోల్ మోడల్స్ గురించి...భారత నావికా యుద్ధనౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా కమాండర్గా ప్రేరణ దియోస్థలీ చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన ప్రేరణ ‘జీసస్ అండ్ మేరీ కాన్వెంట్’ స్కూలులో చదువుకుంది. నేవీలో పనిచేయాలనే లక్ష్యానికి స్కూలు రోజుల్లోనే బీజం పడింది. సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రేరణ 2009లో నావికాదళంలో చేరింది. ప్రేరణను స్ఫూర్తిగా తీసుకొని ఆమె తమ్ముడు కూడా నావికా దళంలో పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరిన కొత్తలో ప్రారంభ సమస్యలు ఎదుర్కొంది ప్రేరణ. గోవాలో తన మొదటి ఎన్సీసీ సెయిలింగ్ క్యాంప్లో సెయిల్ బోట్ మూడుసార్లు బోల్తా పడింది. అయినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. పట్టుదలతో సెయిలింగ్లో ప్రావీణ్యం సాధించింది. ఒడిశాలోని చిల్కా సరస్సులో జరిగిన సెయిలింగ్ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. కెరీర్ తొలిరోజుల్లో సముద్ర నిఘా విమానంలో పరిశీలకురాలిగా శిక్షణ పొందింది. 2012లో చైనా వాణిజ్యనౌకపై సోమాలియ దొంగలు దాడికి దిగినప్పుడు, ఆ దాడిని తిప్పి కొడుతూ చేసిన ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ప్రేరణ భారత్ నేవీ విదేశ్ సేవాపతకాన్ని అందుకుంది.నేవీలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్భారత నావికాదళంలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ (క్యూఎఫ్ఐ)గా చరిత్ర సృషించింది కమాండర్ దివ్యశర్మ. డోర్నియర్ పైలట్లుగా పనిచేసిన మొదటి ముగ్గురు మహిళలలో న్యూ దిల్లీకి చెందిన దివ్యశర్మ ఒకరు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా అర్హత సాధించడానికి కఠినమైన శిక్షణ తీసుకుంది. ఫ్రంట్లైన్ కార్యకలాపాల కోసం నావికా ఏవియేటర్లకు శిక్షణ ఇవ్వడంలో ఇన్స్ట్రక్టర్లది కీలక పాత్ర.గతంలో ఫిక్స్డ్–వింగ్ విమానాలను నడిపిన దివ్య ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్లలో పైలట్లకు శిక్షణ ఇచ్చే సర్టిఫికెట్ అందుకుంది. న్యూ దిల్లీలోని మాల్వియానగర్కు చెందిన దివ్య కెరీర్ తొలి రోజుల్లో నుంచే అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ వస్తోంది. డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ (డీవోఎఫ్టీ) కోర్సులో అత్యత్తమ ప్రతిభ చూపింది. కెరీర్ ప్రారంభంలో నైపుణ్యం, అంకితభావానికి గుర్తింపుగా ‘ఫస్ట్ ఇన్ ఫ్లయింగ్’ అవార్డ్ అందుకుంది.నావికా దళంలో నారీశక్తిభారత నావికాదళంలో ఒకప్పుడు మహిళల పాత్ర పరిమితంగా ఉండేది. అయితే కాలక్రమంలో మహిళల శక్తిసామర్థాల్యను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి దారులు తెరిచింది ఇండియన్ నేవీ. ఒకప్పుడు మాండోవి, గోవా బ్రాంచ్లలో ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్... మొదలైన వాటిలో పరిమిత పాత్ర పోషించిన మహిళలు కీలకమైన విభాగాల్లోకి వచ్చి సత్తా చాటుతున్నారు. నేవీలో పైలట్, ఫైటర్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా... ఎన్నో కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు, ప్రిగేట్... మొదలైన ఫ్రంట్లైన్ యుద్ధనౌకలలో మహిళలు విధులు నిర్వహించడం నావికాదళంలో మహిళల పాత్రకు సంబంధించి విప్లవాత్మక అభివృద్ధి. లింగసమానత్వానికి పెద్ద పీట వేయడంలో భారత నావికాదళం ముందు వరుసలో ఉంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం భారత నావికాదళం మహిళా అధికారులకు (వైద్యేతర శాఖలు) మెరిట్ ఆధారంగా పర్మినెంట్ కమిషన్ మంజూరు చేసింది.తొలి మహిళా ఫైటర్ పైలట్భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించింది ఆస్తా పూనియా. ‘మహిళా ఫైటర్ పైలట్తో భారత నౌకాదళంలో కొత్త శకం మొదలైంది’ అన్నారు అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ జనక్ బెల్వీ. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకుంది ఆస్తా పూనియా. నాన్–ఫైటర్ ఆపరేషన్లలో మహిళా అధికారులు ఉన్నప్పటికీ ఫైటర్ స్ట్రీమ్లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని మేరర్కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్ చేసింది. ఎన్నో పరిమితుల కారణంగా నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ చరిత్ర సృష్టించింది. ఎంతోమంది యువతులకు రోల్మోడల్గా నిలిచింది.తొలి మహిళా పైలట్ఉత్తర్ప్రదేశ్లోని తిల్హార్కు చెందిన శుభాంగి స్వరూప్ భారత నావికాదళంలో తొలి మహిళా పైలట్గా చరిత్ర సృష్టించింది. 2017లో కన్నూర్లోని ‘ఇండియన్ నేవల్ అకాడమీ’ నుంచి పట్టభద్రురాలైన మొదటి బ్యాచ్ మహిళా అధికారులలో శుభాంగి ఒకరు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్ చేసింది. హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందింది. నావికా దళంలో పనిచేసిన తండ్రి కమాండర్ జ్ఞాన్స్వరూప్ శుభాంగికి స్ఫూర్తి.‘నేవీలో పనిచేయడం అంటే మాటలు కాదు. తట్టుకుంటావా?’ అని తండ్రి అడిగినప్పుడు ‘యస్’ అని చెప్పింది శుభాంగి. ఆమె నేషనల్ తైక్వాండో ఛాంపియన్ కూడా.ఆమె అమరత్వంవృత్తి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన భారత వైమానిక దళంలోని తొలి మహిళా అధికారి కిరణ్ షెఖావత్. అబ్జర్వర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ 2015 మార్చి 24న గోవా తీరంలో జరిగిన డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదంలో చనిపోయింది. ముంబైలో పుట్టిన కిరణ్ ఆంధ్రా యూనివర్శిటీలో ఫిజిక్స్లో పట్టా పుచ్చుకుంది. ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో చేరడానికి ముందు ఒక ప్రైవేట్బ్యాంకులో పనిచేసింది. తన ఐదు సంవత్సరాల కెరీర్లో దేశంలోని వివిధ నౌకాదళ స్టేషన్లలో విధులు నిర్వహించింది. నేవీలోకి రావాలనుకోవడానికి తండ్రి స్ఫూర్తి. ఆయన నేవీ ఆఫీసర్. రచయిత నికోలస్ స్పార్క్కు కిరణ్ పెద్ద అభిమాని. అతడి అన్నిపుస్తకాలు చదివింది. ఆ పుస్తకాల ఆధారంగా వచ్చిన సినిమాలు చూసింది. కుమార్తె చనిపోయిన తరువాత ఆమె పేరు మీద ‘లెఫ్టినెంట్ కిరణ్ షెఖావత్’ ఫౌండేషన్ స్థాపించాడు తండ్రి. హరియాణాలోని కుర్తాలలో కిరణ్ షెఖావత్ గౌరవార్థం రెండు ఎకరాల భూమిని షహీద్ పార్క్గా అభివృద్ధి చేశారు. ఈ పార్క్లో కిరణ్ విగ్రహం ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయం
అమ్మకానికి పాక్ ఎయిర్లైన్స్.. గుంటనక్క చేతికే!
పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దాన్నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణం కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందుకోసం ఈసారి ఏకంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)ను విక్రయించాలని నిర్ణయించింది. దశాబ్దాలుగా అవినీతి, నిర్వహణ లోపాలు.. ‘పైలట్ లైసెన్స్ కుంభకోణం’తో కుదేలైన పీఐఏను కొనుగోలు చేసేందుకు నలుగురు బిడ్డర్లు అర్హత పొందారు. అయితే ఈ రేసులో వివాదాల సర్వసైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ కూడా ఉండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి $7 బిలియన్ల(రూ. 63,220 కోట్లు) ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు తన జాతీయ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)ని విక్రయించాలని నిర్ణయించుకుంది. రుణాలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గుతూ ఈ నిర్ణయం తీసుకుంది. పీఐఏ విక్రయం అనేది గత రెండు దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నం కానుంది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటన మేరకు.. పీఐఏ బిడ్డింగ్ 2025, డిసెంబర్ 23న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం పీఐఏలోలో 51-100 శాతం వాటాను విక్రయించడం అత్యంత కీలకమైన షరతు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా రూ. 86 బిలియన్ల(రూ. 8,600 కోట్లు) ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి ముహమ్మద్ అలీ తెలిపారు.కన్నింగ్ మునీర్ చేతికి..ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15శాతం ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలినది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నారు.ఈ బిడ్డింగ్కు ముందస్తు అర్హత పొందిన నాలుగు సంస్థలలో.. సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఇది పాకిస్తాన్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్లో భాగం. పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు ఈ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఫౌజీ ఫౌండేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ప్రత్యక్ష స్థానం లేదు. అయితే ఆయన క్వార్టర్మాస్టర్ జనరల్ (క్యూఎంజీ)నియామకం ద్వారా ఆయన ఈ సంస్థపై పరోక్ష ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. దీంతో ఈ విక్రయం అంతా మునీర్ కోసమే జరుగుతోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మునీర్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వాన్ని పక్కన పడేసి తానే నెంబర్1గా, నియంతగా పాక్ను పాలించే యోచనలో ఉన్నాడని పాక్ ప్రజలే మండిపడుతున్నారు. మరోపక్క పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మునీర్ను గుంటనక్కగా అభివర్ణిస్తూ.. పాక్ను నాశనం చేసేదాకా ఊరుకోడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. నిండా ముంచిన పైలట్ లైసెన్స్ కుంభకోణంపీఐఏ పతనానికి అనేక కారణాలున్నాయి. సంవత్సరాల తరబడి జరిగిన ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, 2020లో పైలట్ లైసెన్స్ కుంభకోణం కారణంగా సంస్థ సంక్షోభంలో చిక్కుకుంది. 30 శాతం కంటే ఎక్కువ మంది పాకిస్తానీ పైలట్లు నకిలీ లైసెన్స్లు కలిగి ఉన్నారని తేలింది. దీంతో సంస్థ 262 మందిని తొలగించవలసి వచ్చింది. ఫలితంగా యూరోపియన్ యూనియన్, యూకే, యూఎస్లు పీఐఏ విమానాలపై నిషేధం విధించాయి. దీంతో పాక్కు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతర్గత సమస్యలు కూడా పీఐఏను దెబ్బతీశాయి. సిబ్బందికి అధిక జీతాలు, ప్రయోజనాలు మొదలైనవి ఖర్చులను మరింతగా పెంచాయి. నిర్వహణ లోపాలతో పాటు, 2020లో జరిగిన పీఐఏ ఫ్లైట్ 8303 క్రాష్ వంటి భద్రతా వైఫల్యాలు సంస్థకు మరింత నష్టం కలిగించాయి. ఇది కూడా చదవండి: గవర్నర్ మనవడిపై హత్యాయత్నం కేసు
అఫ్గాన్తో ఉద్దేశపూర్వకంగా మునీర్ వైరం
లాహోర్: పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికి వినాశకరమైనవని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుధవారం ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్తో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలను పెంచుతున్నారని ప్రస్తుతం పాకిస్తాన్ జైలులో ఉన్న ఇమ్రాన్ ధ్వజమెత్తారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో, దాదాపు నెల రోజుల విరామం తర్వాత రావల్పిండిలోని అడియాలా జైలులో తన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ను కలిసిన మర్నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆసిమ్ మునీర్ విధానాలు పాకిస్తాన్కు విపత్కరమైనవి. ఆయన విధానాలతో, ఉగ్రవాదం అదుపు తప్పి పెరిగిపోతోంది. ఇది నన్ను తీవ్రంగా బాధించింది’.. అని ఖాన్ ఉర్దూలో ట్విట్టర్లో పోస్టు చేశారు.పశ్చిమ దేశాలను సంతృప్తిపరచడానికే..‘ఆసిమ్ మునీర్కు పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టదు. పశ్చిమ దేశాలను సంతోషపెట్టడానికి మాత్రమే ఆయన ఇదంతా చేస్తున్నారు. అంతర్జాతీయంగా తానొక ’ముజాహిద్’ (ఇస్లామిక్ ఫైటర్) గా కనిపించడానికి, ఉద్దేశపూర్వకంగా ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతలను రాజేశారు’.. అని ఖాన్ ఆరోపించారు. డ్రోన్ దాడులను, సొంత ప్రజలపై సైనిక చర్యలను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. అవి ఉగ్రవాదాన్ని మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ‘మునీర్ మొదట ఆఫ్ఘన్లను బెదిరించారు, తరువాత శరణార్థులను పాకిస్తాన్ నుండి బహిష్కరించారు. డ్రోన్ దాడులు చేశారు. వాటి పర్యవసానాలను ఇప్పుడు మనం పెరుగుతున్న ఉగ్రవాదం రూపంలో ఎదుర్కొంటున్నాం’.. అని ఖాన్ పేర్కొన్నారు. జనరల్ మునీర్ను.. మానసిక స్థిరత్వం లేని వ్యక్తిగా అభివర్ణించారు. మునీర్ ఆదేశాలతోనే నిర్బంధంమునీర్ ఆదేశాల మేరకే, తనను, తన భార్యను తప్పుడు కేసులతో బంధించి, అత్యంత దారుణమైన మానసిక చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఖాన్ వాపోయారు. ‘నన్ను నాలుగు వారాలుగా ఒంటరి నిర్బంధంలో ఉంచారు. సెల్లో ఉంచి తాళం వేశారు. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేవు. జైలు మాన్యువల్ హామీ ఇచ్చిన కనీస సౌకర్యాలను కూడా మాకు దూరం చేశారు’.. ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, తన రాజకీయ సహచరులతో సమావేశాలను నిషేధించారని, ఇప్పుడు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కూడా అడ్డుకున్నారని చెప్పారు. ‘నన్ను కలవాలనే చట్టబద్ధమైన హక్కును కోరినందుకు నా సోదరి నౌరీన్ నియాజీని రోడ్డుపై లాక్కెళ్లారు’.. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్తో భేటీ అనంతరం ఉజ్మా మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం బాగుంది.. కానీ ఒంటరి నిర్బంధంతో మానసిక చిత్రహింసకు గురవుతున్నారని తెలిపారు.
హైజాకర్కు పైలట్ ఝలక్
జుబా: అది దక్షిణ సూడాన్ రాజధాని జుబా.. ఉదయపు వేళ ఒక చిన్న విమానం మెల్లగా గాల్లోకి లేచింది. అది క్రైస్తవ సహాయక బృందానికి చెందిన చిన్న టర్బోప్రాప్ విమానం. సమారిటన్స్ పర్స్ అనే సంస్థకు చెందిన సెస్నా గ్రాండ్ కారవాన్. సుదూర ఈశాన్య ప్రాంతంలోని మైవూట్ కౌంటీకి అత్యవసర వైద్య సామగ్రిని చేరవేయడమే దాని లక్ష్యం. కానీ ఆ ప్రయాణం ఊహించని భయానక మలుపు తీసుకోబోతోందని ఎవరికీ తెలియదు.హైజాకర్ ఎంట్రీటేకాఫ్ కావడానికి ముందే, విమానంలోకి యాసిర్ మహ్మద్ యూసుఫ్ అనే దుండగుడు చొరబడ్డాడు. వెనుక క్యాబిన్లో రహస్యంగా దాక్కున్నాడు. గగనతలంలో విమానం ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా తుపాకీతో బెదిరించి, పైలట్ను అదుపులోకి తీసుకున్నాడు. ఆ విమానాన్ని దక్షిణ సూడాన్కు సరిహద్దు లేని మధ్య ఆఫ్రికా దేశం చాడ్కు పోనివ్వాలని డిమాండ్ చేశాడు.బోల్తా కొట్టించిన పైలట్ హైజాక్ తర్వాత, విమానం గంటల తరబడి గాల్లో చక్కర్లు కొట్టింది. విమానంలో ఇంధనం అయిపోయిందని, రీఫ్యూయలింగ్ తప్పనిసరి అని దుండగుడికి పైలట్ స్పష్టం చేశాడు. హైజాకర్ను నమ్మించి, విమానాన్ని ఉత్తర పట్టణమైన వాయు వైపు మళ్లించాడు.హైజాకర్ అరెస్ట్పైలట్ వ్యూహం ఫలించింది. విమానం వాయు పట్టణంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. వాయు పట్టణం ఉన్న వెస్ట్రన్ బహర్ ఎల్ గజల్ రాష్ట్ర పోలీసు ప్రతినిధి అయిన సంతినో ఉడోల్ మయెన్ తెలిపిన వివరాల ప్రకారం, విమానం ల్యాండ్ అయిన వెంటనే దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు దక్షిణ సూడాన్, సూడాన్ మధ్య వివాదాస్పదమైన, చమురు–సంపన్న ప్రాంతమైన అబ్యేయి అడ్మినిస్ట్రేటివ్ ఏరియా నివాసి. జుబా అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే ఒక ఎయిర్ చార్టర్ కంపెనీ లోగో ఉన్న రిఫ్లెక్టివ్ వెస్ట్ను ధరించి ఉన్నాడు. అయితే, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ ఆంట్రోబస్, ఆ పేరుతో తమ సంస్థలో ఎవరూ పని చేయడం లేదనడం గమనార్హం. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. తమను కాపాడిన భద్రతా దళాలకు సమారిటన్స్ పర్స్ ప్రతినిధి మెలిస్సా స్ట్రిక్ల్యాండ్ కృతజ్ఞతలు తెలిపారు.
డాలర్కు 12 లక్షల రియాల్స్
టెహ్రాన్: ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పతనమైంది. ఒక్క అమెరికన్ డాలర్తో మారకం విలువ ఏకంగా 12 లక్షల రియాల్స్కు పడిపోయింది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందనటానికి ఇదే నిదర్శనం. దేశంలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. మాంసం, బియ్యం, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామా న్యుల రోజువారీ జీవనం సైతం గగనంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా జూన్లో ఇజ్రాయెల్ దాడులకు దిగడం, ఇరాన్ ప్రతిదాడుల అనంతరం అమెరికా రంగంలోకి దిగడం తెల్సిందే. మళ్లీ ఇజ్రాయెల్తో యుద్ధం రావచ్చన్న భయాందోళనలు ఇరాన్ వాసులను వెంటాడుతున్నాయి.
జాతీయం
ఇండిగో ఓ మాట.. కేంద్రం మరో మాట!
న్యూ ఏవియేషన్ రూల్స్ను వెనక్కి తీసుకోవడంతో విమానయాన ప్రయాణాలు ఇక సాఫీగా సాగుతాయని భావించిన ప్రయాణికులకు నిరాశ తప్పడం లేదు. పైలట్లు సత్వరమే అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ.. విమానాల రద్దు, వాయిదాలపర్వం ఇంకా కొనసాగుతోంది. దీంతో.. వేల మంది ఇంకా ఎయిర్పోర్టులలోనే ఇరుక్కుపోయారు. ఈ సంక్షోభం ఎప్పుడు ముగస్తుందనే విషయంపై ఇటు కేంద్రం, అటు ఇండిగో ఎయిర్లైన్స్లు ఓ స్పష్టత అంటూ ఇవ్వలేకపోతున్నాయి. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఇంకోన్నిరోజులు సమయం పట్టొచ్చు.. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ చెబుతున్న మాట ఇది. గత నాలుగు రోజులుగా నెలకొన్న పరిస్థితులకు.. తీవ్రస్థాయిలో అవస్థలు పడ్డ ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారాయన. ఇండిగో మొత్తం ఆపరేషనల్ సిస్టమ్ రీబూట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడిందని.. దీని వల్ల షెడ్యూల్లు, క్రూ మేనేజ్మెంట్, ఫ్లైట్ ప్లానింగ్ అన్నీ తాత్కాలికంగా దెబ్బతిన్నాయన్నారు. విమానాల రద్దుపై ప్రయాణికులకు సమాచారం చేరవేస్తున్నామని.. అనవసరంగా ఎయిర్పోర్టుల వద్దకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 10–15 మధ్యకల్లా సేవలు క్రమంగా సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. కేంద్రం మాత్రం మరోలా చెబుతోంది. శనివారం(ఇవాళ)కి పరిస్థితి కాస్త చక్కబడుతుందని.. సోమవారం నుంచి సర్వీసులన్నీ యధాతథంగా, సాధారణ పరిస్థితుల మధ్య నడవొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ.. 24x7 కంట్రోల్ రూమ్ ద్వారా పౌరవిమానయాన శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అయితే పరిస్థితులు మాత్రం కేంద్రం చెబుతున్నట్లుగా ఏమాత్రం లేవు.పైలట్లకు వారాంతపు విశ్రాంతి విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాత్కాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ.. ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగడానికి కారణాలున్నాయి. భారీ సంఖ్యలో విమానాల రద్దుతో ఇప్పటికే షెడ్యూల్లు గందరగోళంగా మారిపోయాయి. తీవ్ర పైలట్ కొరత, రోస్టరింగ్ సమస్యలను చక్కబెట్టుకోవడానికి ఇండిగోకు ఇంకొంత సమయం పట్టొచ్చు. సిస్టమ్ రీబూట్ వల్ల ఏర్పడిన ఆపరేషనల్ అంతరాయం ఒక్కసారిగా సరిచేయలేని స్థాయిలో కొనసాగుతోంది. ఈ ఫలితంతో.. ఇవాళ కూడా వెయ్యికి పైగా విమానాలు రద్దు అయ్యాయి. ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న మిగతా ఎయిర్లైన్స్లు ఛార్జీలు భారీగా పెంచాయి. దీంతో ఈ సంక్షోభం ఇప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు.. ప్రయాణికులకు విమానాల రద్దుపై ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇండిగో కావాలనే ఇలా చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డీజీసీఏ తెచ్చిన కొత్త రూల్స్ విషయంలో ఒత్తిడి పెంచేందుకే ఈ కృత్రిమ సంక్షోభాన్ని ఇండిగోనే సృష్టించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కేంద్రం అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది. ప్యానెల్ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. అయితే.. రూల్స్ వెనక్కి తీసుకోవడంపై పైలట్ అసోషియేషన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇది భద్రతా ప్రమాణాలను తగ్గించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇటు ఇండిగో.. అటు డీజీసీఏ.. ఇద్దరి నిర్వాకంతోనే బిగ్ ట్రబుల్ ఏర్పడిందని, కాబట్టి సమిష్టిగా భాద్యత వహించాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే డీజీసీఏ గనుక రూల్స్ను వెనక్కి తీసుకోకపోయి ఉంటే మాత్రం ఈ సంక్షోభం రెండు మూడు నెలలైనా ముగిసేది కాదనేది నిపుణుల మాట.
సీఎం నితీష్కు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ గుర్తింపు
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మరో ఘనత సాధించారు. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనను లండన్లోని ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’గుర్తించింది. ఈ విషయాన్ని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా పంచుకున్నారు. ‘పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నితీ‹ష్ కుమార్ సాధించిన మైలురాయిని లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించిది. ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా, గర్వంగా ఉంది. దేశ ప్రజాస్వామ్యంలో ఇదో అరుదైన ఘనత’అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో అభివర్ణించారు. ఆయన అచంచల ప్రజాసేవ, స్థిరమైన పాలన, బిహార్ ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసానానికి ఇది ప్రతిబింబమని ఝా కొనియాడారు.
పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్
న్యూఢిల్లీ: ప్రతిపాదిత హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లులో పాన్ మసాలా తయారీ యూనిట్లపై పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రకటించారు. ఈ పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని, ఆరోగ్య పథకాల కోసం వెచ్చిస్తామని తెలిపారు. హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025పై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రత్యేక ప్రయోజనాల కోసం సెస్ విధించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 వీలు కల్పిస్తోందని చెప్పారు. అనంతరం బిల్లును లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పాన్ మసాలా, అలాంటి ఉత్పత్తులను తయారు చేసేందుకు వినియోగించే యంత్రాలు, వాటి సామర్థ్యం ఆధారంగా విధించే సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం వినియోగించుకునేందుకు ఈ బిల్లులో ఏర్పాటుంది. గతంలోనూ ఇలా సెస్లను వివిధ వనరులపై ప్రభుత్వాలు విధించాయన్నారు. 1974 నుంచి క్రూడాయిల్పై సెస్, 2001 నుంచి నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీ, 2000 నుంచి రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో పన్ను వసూలు చేస్తున్న చరిత్ర ఉందన్నారు. పాన్ మసాలా చౌకగా మారడానికి, అదే సమయంలో ఆదాయాన్ని కోల్పోయేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆమె తెలిపారు. వినియోగం ఆధారంగా పాన్ మసాలాపై గరిష్టంగా 40 శాతం మేర జీఎస్టీ ఉంటుందని చెప్పారు. అయితే, జీఎస్టీ ఆదాయంపై ఈ సెస్ ఎటువంటి ప్రభావం చూపదని ఆమె స్పష్టం చేశారు.
ఉద్యోగులకు ఆఫీసు కాల్ కట్ చేసే హక్కు
న్యూఢిల్లీ: పని వేళలు పూర్తయ్యాక ఆఫీసు నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిళ్లను స్వీకరించడంపై ఉద్యోగులకు హక్కు కల్పించేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ సభ్యుల బిల్లు లోక్సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరముందని భావించే అంశాలపై లోక్సభ, రాజ్యసభ సభ్యులు ప్రైవేటుగా బిల్లులను ప్రవేశపెట్టవచ్చు. ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత సాధారణంగా ఈ ప్రతిపాదిత బిల్లులను ఉపసంహరించుకుంటారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే శుక్రవారం లోక్సభలో ఈ మేరకు ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు–2025’ను ప్రవేశపెట్టారు. ప్రతి ఉద్యోగి పని వేళల తర్వాత, సెలవు దినాల్లో వచ్చే విధి నిర్వహణ సంబంధిత ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ను డిస్కనెక్ట్ చేసేందుకు హక్కు ఉండాలి. ఇందుకోసం ఉద్యోగుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించారు. తమిళనాడును నీట్ ప్రవేశ పరీక్ష నుంచి మినహాయించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, దేశంలో మరణ శిక్షను రద్దు చేయాలంటూ డీఎంపీ ఎంపీ కనిమొళి, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని విశాల్దాదా ప్రకాశ్ బాపు పాటిల్(స్వతంత్ర) ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు.
ఎన్ఆర్ఐ
ఆస్ట్రేలియాలో లక్ష్మీపార్వతికి వైఎస్సార్సీపీ శ్రేణుల ఘనస్వాగతం
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లక్ష్మీపార్వతికి నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ,గజ్జల చంద్ర ఓబుల రెడ్డి,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి ,దూడల కిరణ్ రెడ్డి, కామరాజు కృష్ణ చైతన్య ,కోటా శ్రీనివాసరెడ్డి, దుగ్గింపుడి కిరణ్ రెడ్డి, సిద్ధన సురేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం బ్రిస్బేన్లో ఉన్న లక్ష్మీపార్వతి.. వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారు. అక్కడ వివిధ నగరాల్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాకు ఆమె హాజరుకానున్నారు.
అమెరికాలో అందెశ్రీకి ఘన నివాళి
ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ అకాల మృతిపై అమెరికాలో ఘన నివాళి అర్పించారు. నార్త్ కరోలినా ఛార్లెట్ లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసులు అందెశ్రీ మాట, పాటలను స్మరించుకున్నారు.తెలంగాణ భూమి పుత్రుడిగా, నిస్వార్థ స్వరాష్ట్ర సాధన స్వాప్నికుడిగా అందెశ్రీని తెలంగాణ సమాజం కలకాలం గుర్తుపెట్టుకుంటుందని ఎన్.ఆర్.ఐ లు అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా ఆయన ప్రవాసులతో అత్మీయ అనుబంధాన్ని కొనసాగించారని కొనియాడారు.అందెశ్రీ రచనలు, ఆయన గాత్రం చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రవాసులు కోరారు. రానున్న తరాలకు ఆయన రచనలు పరిచయం అయ్యేలా పాఠ్య పుస్తకాల్లో చేర్చటంతో పాటు, అందెశ్రీ పేరుపై రాష్ట్ర స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రత్యేక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) – ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వై. నరేందర్ రెడ్డికి విన్నవించారు.అందెశ్రీని స్మరించుకోవటంతో పాటు, నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, కోర్ టీం సభ్యుడు, చార్లెట్ చాప్టర్ దిలీప్ రెడ్డి స్యాసని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరేంద్ర దేవరపల్లి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) చార్లెట్ చాప్టర్ అధ్యక్షుడు కదిరి కృష్ణ, చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) కార్యదర్శి ప్యారం పుట్టలి, తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రముఖుడు పవన్ కుమార్ రెడ్డి కొండ, స్థానిక తెలంగాణ ప్రవాసులు హాజరయ్యారు.
మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..
ఒక వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అలాంటి క్షణం అత ఈజీగా మర్చిపోలేం కదూ..ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందింటే..శుభం గౌతమ్ అనే వ్యక్తి ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. "నా అమ్మ రష్యాలో సెలబ్రిటీ" అనే క్యాప్షన్తో షేర్ చేయడంతో మరింత వైరల్గా మారింది. ఆ వీడియోలో అతడు తన తల్లితో రష్యా వీధుల్లోకి రాగానే.. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆ తల్లిని చూసి రష్యన్ ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు..ఒక్క సెల్ఫీ అంటూ ఎగబెట్టారు. ఏదో సెలబ్రిటీ మాదిరిగా అంతా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతుంటే..మా అమ్మకు ఒక్కసారిగా ఎంత క్రేజ్ పెరిగిపోయిందో అంటూ మురిసిపోయాడు ఆమె కుమారుడు. విదేశాల్లో మన సంప్రదాయ దుస్తులో గనుక మనం కనిపిస్తే కచ్చితంగా ప్రత్యేకంగా నిలబడటమే గాక, అందరి దృష్టిని ఆకర్షిస్తాం..అందుకు ఈ తల్లే నిదర్శనం. అంతేగాదు ఆమె కొడుకు నా తల్లి రష్యాకు ఇష్టమైన సెలబ్రిటీ అని వీడియోలో చెబుతుండటం స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె కూడా అక్కడి వాళ్ల రియాక్షన్కు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ వారితో సెల్ఫీలు దిగడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. భారతదేశం వెలుపల మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు దరిస్తే..అవి మనల్ని ప్రత్యేకంగా నిలబడేల చేయడమే గాక, రియల్ సెలబ్రిటీకి అర్థం చెప్పేలా మనల్ని నిలబెడతాయి కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడమే కాదు..ఆ తల్లి నిజంగా భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రేమగా పిలుస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Shubham Gautam (@samboyvlogs) (చదవండి: సాత్విక ఆహారంతో బరువు తగ్గగలమా..? నటి, గాయని షెహ్నాజ్ సైతం..)
జపాన్లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు
తెలుగువారు ఏ దేశంలో ఉన్న వారి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పడంలో ఎపుడు ముందుంటారు. అందుకు నిదర్శనం జపాన్లో టోక్యో నగరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (తాజ్) అధ్వర్యంలో జరిగిన కార్తీక మాసం వనభోజనాలు. నవంబర్ 8న ఈ వేడుక స్థానిక కొమట్సుగవ పార్కులో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరు పాల్గొని ఆట పాటలతో సరదాగా గడిపారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్క తినుబండారం తెచ్చి వనభోజన కార్యక్రమం నిర్వహించడం విశేషం. ప్రతి ఏటా ఇలాగే వేడుక జరుపుకోవాలని వారంతా ఆకాంక్షించారు. (చదవండి: ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్)
క్రైమ్
ఏలూరులో అమానుషం
ఏలూరు టౌన్: ఏలూరులో అర్ధరాత్రి వేళ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని వారి ఇంటి తలుపులు, కిటికీలు బాదుతూ ఇద్దరు రౌడీషీటర్లు భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం వారిలో ఒక యువతిని ఓ రౌడీషీటర్ కొట్టుకుంటూ సమీపంలోని సచివాలయానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత ఇద్దరు యువతులనూ రౌడీషీటర్లు బెల్టుతో దారుణంగా కొట్టినట్లు తెలిసింది. తాము పోలీసులను ఆశ్రయిస్తే వారు సరిగ్గా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చివరికి.. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతి (23) తండ్రి మరణించగా.. ఆమె తల్లితో గొడవపడి ఇంటి నుంచి వచ్చేసింది.ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఏలూరుకు చెందిన యువతి వద్ద ఉంటోంది. ఈ నెల 2న రాత్రివేళ వీరిద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నగరంలోని కొత్తపేటకు చెందిన ఇద్దరు రౌడీషీటర్లు అతిగా మద్యం సేవించి అర్ధరాత్రి వేళ యువతులు ఉంటున్న ఇంటి తలుపులు, కిటీకీలు బాదుతూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన యువతి తలుపులు తీయగా.. ఆమెను కొట్టుకుంటూ లాక్కెళ్లిన ఒక రౌడీషీటర్ సమీపంలోని సచివాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు.ఆ తర్వాత యువతులిద్దరినీ బెదిరించి వెళ్లిపోయిన ఆ ఇద్దరు రౌడీషీటర్లు.. మరో గంట తర్వాత స్నేహితులతో వచ్చి యువతులను మళ్లీ బెల్టులతో ఇష్టమొచ్చినట్లు కొట్టి బెదిరించి వెళ్లారు. దీంతో బాధితులిద్దరూ నగరంలోని ఒక పోలీస్స్టేషన్కు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని సమాచారం. అయితే, పోలీసు ఉన్నతాధికారులకు ఈ దారుణ ఘటన గురించి తెలియడంతో అత్యాచార బాధితురాలిని ఓ ఆçస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. అలాగే, హడావుడిగా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఈ ఘటనను పోలీసులు చిన్న కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై మీడియాకు సైతం తెలియకుండా అత్యంత గోప్యత పాటిస్తున్నారు.
మాలిలో ఇద్దరు తెలుగు కార్మికుల కిడ్నాప్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఉపాధి కోసం ఆఫ్రికా దేశమైన మాలికి వెళ్లిన తెలంగాణ, ఏపీకి చెందిన ఇద్దరు యువకులను జమాత్ నుస్రత్ అల్–ఇస్లామ్ వల్–ముస్లిమీన్ (జేఎన్ఐఎం) సంస్థకు చెందిన తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస ప్రవీణ్ (23), ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని పొదరళ్లపల్లికి చెందిన రామచంద్ర (25) గతేడాది హైదరాబాద్కు చెందిన ఓ బోర్వెల్ కంపెనీ పనిపై డ్రిల్లర్లుగా మాలి దేశంలోని కోబ్రి సమీపంలో పనిచేస్తున్నారు. గత నెల 23న వారు పని ముగించుకొని వస్తుండగా సాయుధులైన జేఎన్ఎంఐ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.వారి ఫోన్లను స్వా«దీనం చేసుకొని స్విచ్ఛాప్ చేయడంతో కిడ్నాప్ సమాచారం ఆలస్యంగా భారత ఎంబసీతోపాటు వారి కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. పనుల సీజన్ పూర్తయ్యాక వస్తానని కిడ్నాప్నకు ఒకరోజు ముందు తన కొడుకు ఫోన్ చేసి చెప్పాడని ప్రవీణ్ తండ్రి జంగయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన చెందారు. మరోవైపు బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు మాలిలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.తీవ్రవాదుల డిమాండ్లను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఎంబీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అల్కాయిదాకు చెందిన జేఎన్ఐఎం.. సహెల్ ప్రాంతంలో (మాలి, నైజర్ మొదలైన దేశాలు) మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఆర్థిక యుద్ధం‘వ్యూహంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటోంది. గత ఆరు నెలల్లో (మే నుంచి అక్టోబర్ వరకు) 22 మంది విదేశీయులను బంధించింది. అందులో కొందరు విడుదలవగా మరికొందరు ఇంకా తీవ్రవాదుల చెరలోనే ఉన్నారు. బందీల విడుదలకు తీవ్రవాదులు ఆర్థిక డిమాండ్లు పెడుతున్నారు.
వంద కోట్ల అవినీతి తిమింగలం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/మహబూబ్నగర్ క్రైం: రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. తప్పుడు సర్వేలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి గురువారం ఏక కాలంలో ఇళ్లు, ఆఫీసు, బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బహిరంగ మార్కెట్లో ఆయన ఆస్తుల విలువ రూ.వంద కోట్లకుపైగా ఉన్నట్లు అంచనా. శ్రీనివాసులు ప్రస్తుతం హైదరాబాద్ ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నాడు. శుక్రవారం ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది. శ్రీనివాసులు మరో ఏడాదిలో పదవీ విరమణ అవుతున్నట్లు సమాచారం. మూడు రాష్ట్రాల్లో రూ.కోట్ల ఆస్తులుశ్రీనివాసులుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటకలోనూ రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాయదుర్గం మైహోం భూజాలో విలాసవంతమైన ఫ్లాట్, అనంతపురంలో 11 ఎకరాలు, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా నారాయణపేటలో రైస్మిల్, మహబూబ్నగర్లో నాలుగు ప్లాట్లు, నారాయణపేటలో మూడు ప్లాట్లు, ఇంట్లో 1.6 కేజీల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులు, రూ.ఐదు లక్షల నగదు, కియా, ఇన్నోవా కార్లు దొరికాయి. ఆయన గతంలో నల్లగొండ సహా మేడ్చల్ జిల్లా ల్యాండ్స్ అండ్ సర్వే రికార్డ్స్ అధికారిగా కూడా పని చేశారు. మేడ్చల్ జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రాగా, అప్పట్లోనే ఏసీబీ కేసు కూడా నమోదైంది. కొంతకాలం సస్పెన్షన్లో ఉండి, ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరారు.తప్పుడు సర్వేలతో అక్రమార్జనశంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ రెవెన్యూల మధ్య ఉన్న వంద ఎకరాల గ్యాప్ లాండ్స్కు 555 సర్వే నంబర్ కేటాయించి, విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంలోనూ, ఇబ్రహీంపట్నం ఖానాపూర్ రెవెన్యూ పరిధిలోని 33 ఎకరాల బిలాదాఖల భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామం సర్వే నంబర్ 63లో రూ. 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల సర్కార్ భూమి, శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వే నం. 124/10, 11లోని రూ.రెండు వేల కోట్ల విలువ చేసే 50 ఎకరాలు, శేరిలింగంపల్లి గ్రామం సర్వే నం. 90, 91 నుంచి 102లోని 110 ఎకరాల అలూమినీ కంపెనీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో, సర్వే నం. 68లో ఐదెకరాల ప్రభుత్వ భూమి పట్టాగా మారడంలోనూ, హఫీజ్పేట్ సర్వే నం. 80లోని భూమి, కొండాపూర్ సర్వే నం. 87, 88 ల్లోని భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. అలాగే, వట్టినాగులపల్లి సర్వే నం. 186, 187లో 20 ఎకరాల భూదాన్ భూములు, గండిపేట్ మండలం ఖానాపూర్లోని 150 ఎకరాల బిలా దాఖల భూములకు సర్వే నంబర్ 65 కేటాయించి, ఆయా భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్ సర్వే నం. 69లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక అప్పటి శేరిలింగంపల్లి రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్స్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. గచ్చిబౌలిలో సర్వే నంబర్లు 38 నుంచి 54 వరకు గల 76 ఎకరాల సీలింగ్ సర్ప్లస్ భూములు, మహేశ్వరం మండలం మహేశ్వరం–తుమ్మలూరు గ్రామాల మధ్య ఉన్న 70 ఎకరాల బిలా దాఖల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక కూడా శ్రీనివాసులు హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
రూ.41 లక్షలు : లాయర్ ముసుగులో ఐఎస్ఐ గూఢచారి!
అమృత్సర్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసి, సమాచారాన్ని చేరవేసిన ఆరోపణలపై అరెస్టయిన గుర్గామ్ న్యాయవాది రిజ్వాన్ కేసులో దర్యాప్తు సంస్థలకు పలు కీలక విషయాలు తెలిశాయి. అరెస్టయిన రిజ్వాన్కు రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, డబ్బు సేకరించేందుకు అతను ఏకంగా ఏడుసార్లు అమృత్సర్ వెళ్లాడని, అతని స్నేహితుడు, న్యాయవాది ముషారఫ్ అలియాస్ పర్వేజ్ పోలీసులకు తెలిపాడు. 2022లో సోహ్నా కోర్టులో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు రిజ్వాన్తో స్నేహం ఏర్పడిందని ముషారఫ్ చెప్పాడు. జూలైలో, ఇద్దరూ కలిసి ముషారఫ్ కారులో అమృత్సర్ వాఘా సరిహద్దుకు వెళ్లారు. అక్కడ స్వర్ణ దేవాలయం వద్ద, ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరి నుండి రిజ్వాన్ ఒక సంచి నిండా డబ్బు తీసుకున్నాడు. అయితే, వారిని గుర్తించలేక పోయానని ముషారఫ్ తెలిపాడు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో.. కారును అక్కడే వదిలి రైలులో ప్రయాణించారు. ఆగస్టు 1న కారు తీసుకురావడానికి మళ్లీ అమృత్సర్ వెళ్లారని ముషారఫ్ చెప్పాడు.ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్యరూ.41 లక్షలు సేకరించి..రిజ్వాన్ మొత్తం రూ.41 లక్షల నగదును సేకరించినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ డబ్బును అతను అజయ్ అరోరా అనే వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపాడు. స్కార్పియో, స్కోడా కార్లలో వచ్చిన వ్యక్తుల నుండి డబ్బు సేకరించడానికి.. రిజ్వాన్ ఏడుసార్లు అమృత్సర్ వెళ్లాడు. రిజ్వాన్కు తౌరులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా, సోహ్నాలో ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతా ఉన్నాయి. రిజ్వాన్ ల్యాప్టాప్, ఫోన్లో అనుమానాస్పద లావాదేవీలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో నుహ్ పోలీసు బృందాలు పంజాబ్ అంతటా దాడులు నిర్వహిస్తున్నాయి.
వీడియోలు
విశాఖలో క్రికెట్ ఫీవర్.. టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
ప్రయాణికులను అడ్డుపెట్టుకొని.. ఇండిగో బిగ్ స్కెచ్
బెయిల్ ఇవ్వకండి ప్లీజ్.. మరోసారి పోలీస్ కస్టడీకి
ఏపీ అయ్యప్ప భక్తులకు ఘోర రోడ్డు ప్రమాదం
అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడు
చంద్రబాబు ఇల్లు కనిపించదా? భవానీపురం ఇష్యూ పై కేబీజీ తిలక్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫిఫా శాంతి బహుమతి
ఇండిగో సంక్షోభం.. ఆకాశాన్నంటిన టికెట్ ధరలు..!
ప్రమాదంలో మృతి చెందిన.. విజయనగరం అయ్యప్ప భక్తులు!
బన్నీతో కొరటాల స్టోరీ డిస్కషన్స్?

