breaking news
silver
-
‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!
బంగారం షాపులో నగదు చెల్లించి నచ్చిన నగను కొనుక్కుంటాం. అద్దాల షోరూమ్లో విద్యుత్ కాంతుల మధ్య తళతళలాడే ఆ బంగారు ఆభరణాలను చూసి మురిసిపోతాం. కానీ, ఆ మెరుపు వెనుక.. వందల మంది కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ హొయల వెనుక.. వేల అడుగుల లోతులో పేలే బాంబుల మోత, ఊపిరాడని గనుల్లో ఉక్కపోత ఉందని చాలా మందికి తెలియదు కదా.. ఒక చిన్న ఉంగరం మన వేలికి చేరడానికి ముందు అది ఒక కఠినమైన శిల. ఆ శిల నుంచి స్వచ్ఛమైన పసిడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రకృతితో చేసే యుద్ధమే ఈ ‘బంగారు ప్రయాణం’. బంగారాన్ని గనుల్లో నుంచి ఎలా వెలికితీస్తారో.. ఆభరణాల రూపంలోకి ఎలా మారుస్తారో తెలుసుకుందాం.అన్వేషణ, మైనింగ్బంగారం ఎక్కడ ఉందో గుర్తించడం మొదటి దశ. దీన్ని ప్రోస్పెక్టింగ్ అంటారు. భూగర్భంలో బంగారం నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన తర్వాత మైనింగ్ ప్రారంభమవుతుంది. బంగారం భూమిపై పొరల్లోనే ఉన్నప్పుడు పెద్ద గుంతలు తవ్వి వెలికితీస్తారు. దీన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. బంగారం చాలా లోతులో ఉన్నప్పుడు సొరంగాలు తవ్వి, పేలుళ్ల సాయంతో ముడి ఖనిజాన్ని బయటకు తీస్తారు. దీన్ని అండర్గ్రౌండ్ మైనింగ్ అంటారు.ముడి ఖనిజాన్ని పొడి చేయడంగనుల నుంచి సేకరించిన పెద్ద రాళ్లను క్రషర్స్ యంత్రాల్లో వేసి చిన్న ముక్కలుగా మారుస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న స్పటికాల పరిమాణంలోకి, ఆపై మెత్తటి పౌడర్లాగా పిండి చేస్తారు. ఈ పొడిలోనే అతి సూక్ష్మమైన బంగారు రేణువులు దాగి ఉంటాయి.బంగారం వేరు చేయడంపొడి చేసిన మట్టి నుంచి బంగారాన్ని వేరు చేయడానికి ప్రధానంగా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు.సైనైడ్ లీచింగ్: ఈ పౌడర్కు సోడియం సైనైడ్ ద్రావణాన్ని కలుపుతారు. ఇది బంగారాన్ని ద్రవ రూపంలోకి మారుస్తుంది. ఆ తర్వాత జింక్ పౌడర్ లేదా యాక్టివేటెడ్ కార్బన్ ఉపయోగించి బంగారాన్ని తిరిగి ఘన రూపంలోకి మారుస్తారు.గ్రావిటీ సెపరేషన్: బంగారం బరువు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ప్రవాహం ద్వారా తేలికపాటి మట్టిని కొట్టుకుపోయేలా చేసి బంగారు రేణువులను కిందకు చేరేలా చేస్తారు.స్మెల్టింగ్పైన తెలిపిన ప్రక్రియలో వచ్చిన బంగారాన్ని (దీన్ని డోర్ అని పిలుస్తారు) దాదాపు 1064 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కరిగిస్తారు. ఈ దశలో బంగారం నుంచి ఇతర లోహాలు వేరవుతాయి. ఇక్కడ వచ్చే పసిడి 100% స్వచ్ఛంగా ఉండదు. ఇందులో వెండి లేదా రాగి కలిసి ఉంటాయి. వీటిని బార్స్ రూపంలోకి మారుస్తారు.శుద్ధీకరణ(రిఫైనింగ్)చివరి దశలో బంగారాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేయడానికి మిల్లర్ ప్రక్రియ లేదా వోల్విల్ ప్రక్రియ వాడతారు. ఈ ప్రక్రియల్లో క్లోరిన్ గ్యాస్ను ఉపయోగించి ఇతర మలినాలను తొలగిస్తారు. దీని ద్వారా 99.9% (24 క్యారెట్) స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది.ఆభరణాల తయారీచివరిగా ఈ స్వచ్ఛమైన బంగారానికి కొంత మోతాదులో రాగి లేదా వెండిని కలిపి (సాధారణంగా 22 క్యారెట్లు) నచ్చిన ఆభరణాలుగా మలుస్తారు.ఒక గ్రాము బంగారాన్ని పొందడానికి దాదాపు ఒక టన్ను ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే బంగారం అంత విలువైనది!ఇదీ చదవండి: భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే.. -
రూట్ మార్చిన బంగారం, వెండి.. ఇవాళ ఎంత పెరిగిందంటే
-
రాధికాగుప్తాను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలు ఇవే..
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, అనిశ్చితి నేపథ్యంలో ఏ ఫండ్ను ఎంచుకోవాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే గందరగోళం పెట్టుబడిదారుల్లో పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా పెట్టుబడిదారులకు దిశానిర్దేశం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొన్ని సూచనలు చేశారు.ఇటీవలి కాలంలో ‘నా దగ్గర రూ.30,000 ఉన్నాయి. వెండి కొనాలా? ఏ ఫండ్ తీసుకోవాలి?’ వంటి ప్రశ్నలు తనను ఎక్కువగా అడుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. తక్షణ పరిష్కారాల కోసం వెతకడం కంటే సరైన పోర్ట్ఫోలియోను నిర్మించుకోవడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.ప్రాథమిక అవగాహన ముఖ్యంచాలామంది ఫైనాన్స్ గురించి కనీస అవగాహన లేకుండానే నేరుగా ఫండ్స్ కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. దీన్ని ఆమె ‘శ్వాస తీసుకోవడం నేర్చుకోకముందే డైవింగ్ చేయడం’తో పోల్చారు. పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలని, దీనికోసం తన పుస్తకం ‘మ్యాంగో మిలియనీర్’ ఎంతో దోహదపడుతుందని సూచించారు.ఆర్థిక స్థితిగతులపై స్పష్టతపెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వాస్తవాలను డాక్యుమెంట్ చేసుకోవాలి.మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు ఎంత?ప్రస్తుత పెట్టుబడులు, అప్పులు ఏమిటి?మీ ఆర్థిక లక్ష్యాలు, వాటి కాలపరిమితి ఎంత?స్వల్పకాలికంగా నష్టాలు వస్తే భరించే శక్తి ఉందా?ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటేనే బలమైన పునాది ఏర్పడుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు.నిపుణుల సలహా తీసుకోవడంమ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు లేదా క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సహాయం తీసుకోవాలని ఆమె కోరారు. పైన పేర్కొన్న ఆర్థిక స్పష్టతతో నిపుణులను కలిసినప్పుడు వారు మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్రణాళికను రూపొందించగలరు. మీకు నమ్మకం కలిగే వరకు ఒకటి కంటే ఎక్కువ మంది నిపుణులతో మాట్లాడటంలో తప్పు లేదని ఆమె అన్నారు."I have 30,000 to invest, should I buy silver? What fund do I buy?"I am seeing a lot more friends, family, and folks in general reach out for advice on their portfolio in the last few months. It is probably because volatility is so high across asset classes, returns over the…— Radhika Gupta (@iRadhikaGupta) February 9, 2026తొందరపాటు నిర్ణయాలు వద్దుపెట్టుబడి ప్రయాణం ప్రారంభంలోనే డైరెక్ట్ స్టాక్స్, వెండి, లేదా సంక్లిష్టమైన పీఎంఎస్(ధనవంతులైన పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్) ఉత్పత్తుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. మార్కెట్పై అవగాహన పెరిగే వరకు వీటి కోసం వేచి చూడటం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.తప్పుల నుంచి నేర్చుకోండి‘ఇప్పుడే మొదలుపెట్టే వారు వెంటనే పని ప్రారంభించండి. తప్పులు చేసిన వారు కాసేపు విశ్రాంతి తీసుకోండి’ అని ఆమె సరళంగా వివరించారు. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఎంతోమంది మేధావులు తప్పులు చేశారని గుర్తు చేస్తూ పెట్టుబడి ప్రయాణంలో తప్పులు సహజమని పేర్కొన్నారు. మార్కెట్ దిద్దుబాట్లు అనేవి బోర్డు పరీక్షల వంటివని, అవి మనకు క్రమశిక్షణ, సహనం నేర్పుతాయని ఆమె విశ్లేషించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
బంగారమే బిగ్ బాస్
న్యూఢిల్లీ: గోల్డ్, వెండి ఈటీఎఫ్లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో రూ.24,040 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రాగా, వెండి ఈటీఎఫ్లు రూ.9,463కోట్లను ఆకర్షించాయి. గత డిసెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన రూ.11,647 కోట్లతో పోల్చితే రెట్టింపునకు పైగా పెరిగాయి. అంతేకాదు ఒక నెలలో ఈక్విటీ ఫండ్స్కు మించి బంగారం ఈటీఎఫ్లు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి సన్నగిల్లుతూ.. బంగారం, వెండిపైకి మనసు మళ్లుతోంది. జనవరిలో ఈక్విటీ ఫండ్స్ నికరంగా రూ.24,028 కోట్లను ఆకర్షించాయి. డిసెంబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.28,054 కోట్లతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా ఇది రెండో నెల. గతేడాది నవంబర్లో ఈక్విటీ ఫండ్స్ రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీంతో పోల్చితే డిసెంబర్లో 6 శాతం తగ్గాయి. ఇక గతేడాది అక్టోబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఈక్విటీ పెట్టుడుల రాక మూడు నెలల కనిష్టానికి చేరింది. కమోడిటీల వైపు అడుగులు.. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు ఎలాంటి రాబడులు ఇవ్వకపోగా.. బంగారం, వెండి మంచి ర్యాలీ చేస్తున్నాయని.. దీంతో కొంత మేర పెట్టుబడులు కమోడిటీల్లోకి మళ్లినట్టు వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వప్నిల్ అగర్వాల్ తెలిపారు. ఇక నుంచి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడుల రాక క్రమంగా మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు. స్టాక్స్ విలువలు ఆకర్షణీయంగా ఉండడం, స్థిరీకరణ ముగియడంతో ఈ ఏడాది ఈక్విటీలు బలమైన పనితీరు చూపించొచ్చని, దీంతో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు. ⇒ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్/ పన్ను ఆదా ఫండ్స్) పథకాల నుంచి రూ.594 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ⇒ మరోవైపు డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి నికరంగా రూ.74,827 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో ఇదే విభాగం రూ.1.32 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. ⇒ హైబ్రిడ్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్ కలసిన) రూ.17,356 కోట్లు.. మల్టీ అసెట్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్, బంగారం, వెండి కలసిన) రూ.10,485 కోట్లు చొప్పున వచ్చాయి. ⇒ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని అన్ని రకాల పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.81.01 లక్షల కోట్లకు పెరిగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి జనవరిలోనూ రికార్డు స్థాయిలో రూ.31,000 పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్, వెండికి డిమాండ్.. గోల్డ్ ఈటీఎఫ్లోకి రూ.24,040 కోట్లు రావడంతో.. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.61,000 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు వెండి ఈటీఎఫ్ల్లోకి డిసెంబర్లో రూ.9,463 కోట్లు రావడంతో.. వెండి ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్లో వచ్చిన 3,962 కోట్లతో పోల్చి చూస్తే ఒక్క నెలలోనే 139 శాతం పెరిగాయి. -
తడబడిన వెండి ఎగసిన పసిడి
న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి వెండి నష్టపోగా.. కొనుగోళ్ల మద్దతుతో పసిడి ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం వెండి కిలోకి రూ.7,500 నష్టపోయి రూ.2,64,500 లక్షలకు (పన్నులు కలుపుకుని) పరిమితమైంది. బంగారం 10 గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.1,60,700 వద్ద (పన్నులు సహా) స్థిరపడింది. జ్యుయలర్లు, ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన కొనుగోళ్లు వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరగడానికి కారణమని ట్రేడర్లు తెలిపారు. బంగారం, వెండి ధరలు ఒక శ్రేణి పరిధిలో చలించొచ్చని.. ఈ మార్కెట్లు సమీప కాలానికి స్థిరీకరణ దశలోకి ప్రవేశించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్కు ఒక డాలర్కు పైగా నష్టపోయి రూ.82.16 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది. బంగారం స్వల్ప నష్టంతో ఔన్స్ 5,052 డాలర్ల స్థాయిలో కదలాడింది. అమెరికాలో రిటైల్ విక్రయాలు, నిరుద్యోగ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. -
మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,57,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,44,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి వరుసగా రూ. 1,58,780 (రూ. 870 పెరిగింది) & రూ. 1,45,550 (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతుంది.చెన్నైలో అయితే గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,060 రూపాయల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,800 రూపాయల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 158930 రూపాయల (రూ. 870 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,700 రూపాయల (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచింది.వెండి ధరలుఉదయం కేజీ వెండి రేటు రూ. 2.90 లక్షల వద్ద ఉండేది. అయితే సాయంత్రానికి ఆ రేటు రూ. 3లక్షలకు చేరింది. అంటే కేజీ ధర గంటల వ్యవధిలో రూ. 10వేలు పెరిగిందన్నమాట. -
బంగారానికి బదులుందా? బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్కాయిన్కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్కాయిన్కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki) తెలిపారు. బిట్కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత బిట్కాయిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్కాయిన్ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్ మైనింగ్, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయినప్పటికీ, బిట్కాయిన్ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.I am often asked:Which is a better investment?Gold or Bitcoin.Obviously I would say both for diversification of assets and add silver.Yet if I had to choose only one asset I would choose Butcoin.Why?Because gold is in theory infinite. When the price of gold rises…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026 -
రిస్క్ లేకుంటే రాబడి లేదు!
క్యాలెండర్ మారి నెల దాటిపోయింది. ఫిబ్రవరి కూడా గడిచిపోతోంది. ఈక్విటీలు స్థిరంగా లేవు. ఇండెక్స్లు ఆల్టైమ్ గరిష్ఠాలకు దగ్గర్లో కనిపిస్తున్నా.. 80–90 శాతం షేర్లు కనిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఎఫ్డీలను చూస్తే వడ్డీలు తగ్గి రాబడుల్లేవు. సురక్షితమని బంగారం, వెండి వంటి లోహాలవైపు వెళితే... వాటి ఎగుడుదిగుళ్లకి ఊపిరాడని పరిస్థితి. మొత్తంగా ఇప్పటివరకూ 2026 చెబుతున్నదొక్కటే. రిస్క్ తీసుకోకుంటే రాబడుల్లేవు. అలాగని రిస్క్ తీసుకున్నా నిద్ర లేదు. మరేం చేద్దాం? ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన దారేది? కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాలేంటి? వీటి విశ్లేషణే ఈ వారం ‘వెల్త్ ప్లస్’ స్టోరీ...కొందరిది రిస్క్కు దూరంగా ఉండే ధోరణి. కొందరిదైతే దూకుడుగా రిస్క్ గురించి ఆలోచించకుండా ముందుకెళ్లే ధోరణి. వాస్తవానికి ఇలాంటి ఏకపక్ష విధానాలు ఎప్పుడో తప్ప కలిసిరావు. ఈ సంవత్సరం ఇలాంటి విధానాలు అస్సలు కలిసొచ్చేలా లేవు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల సామర్థ్యం, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ సాధనాల మధ్య కేటాయింపులు సమతుల్యం చేసుకోవాలి. ‘బ్యాలన్స్’గా నడుచుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గతేడాది కూడా (2025–26లో) సంప్రదాయ ఎఫ్డీలు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్లూ పెరిగాయి. జీడీపీలో ఆర్థిక పొదుపులు 47 ఏళ్ల కనిష్టానికి చేరాయి. జీవన వ్యయాలేమో పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకిది పెద్ద సవాలే. కాబట్టి ఏం చేయాలంటే...వేటి ప్రాధాన్యం వాటిదే..మనం ఆహారంలో భాగంగా బియ్యం/గోధుమలకే పరిమితం కాలేం. కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, మాంసం ఇలా అన్నింటినీ తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కోదానిలో ఉండే పోషకాలు వేరు. సమతుల్య ఆహారం మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. పెట్టుబడులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. తమ నికర ఆర్జన ఎంత? అందులో ఖర్చులు ఎంత? మిగిలేది ఎంత? భవిష్యత్ లక్ష్యాలు ఏవి? వాటికి ఎంత మొత్తం సమకూరాలి? ఇందుకోసం ఎంత రాబడి అవసరం? ఈ అంశాల ఆధారంగా ఎఫ్డీలు/డెట్ ఫండ్స్–ఈక్విటీలు–పసిడి/వెండి ఇలా వివిధ సాధనాలకు కేటాయింపులు చేసుకోవాలి. దీన్నే అసెట్ అలోకేషన్ అని కూడా అంటుంటారు. ఏదో ఒక సాధనం కాకుండా, స్వల్పకాల అవసరాల కోసం డెట్, మధ్య కాల అవసరాలకు డెట్–ఈక్విటీ, దీర్ఘకాల అవసరాలకు ఈక్విటీ, బంగారం సాధనాలకు కేటాయింపులు ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల వైవిధ్యం ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఉన్న సమయంలో మరో విభాగంలోని పెట్టుబడులు మంచి పనితీరుతో ప్రయోజనం పొందొచ్చు. వేటికి ఎంత..? సంపాదనలో 35 శాతం అయినా (మూడింట ఒక వంతు) ఆదా చేయాలి. ఆదా చేసిన మొత్తంలో 30–35 శాతాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల పొదుపు పథకాలు, లేదా లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.కనీసం 50–60 శాతాన్ని ఈక్విటీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారం, వెండిలో 10–15 శాతం మించకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ, బంగారం, వెండిపై పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) మంచి సాధనం. రక్షణ–రాబడులుఎఫ్డీలు, డెట్ ఫండ్స్తో సంపద సృష్టి సాధ్యం కాదు. కానీ, పెట్టుబడికి రక్షణ ఉంటుంది. స్వల్పకాలంలో పెట్టుబడి కాపాడుకోవడమే ముఖ్యం.ఈక్విటీలతో సంపద సృష్టి సాధ్యం. అది దీర్ఘకాలంలో, క్రమశిక్షణతో నడుచుకున్నప్పుడే.కమోడిటీలు మిగిలిన పెట్టుబడులకు హెడ్జింగ్గా పనిచేస్తాయి. అదే సమయంలో మెరుగైన రాబడికీ మార్గం చూపుతాయి. ప్రీమియం లోహాలు..బంగారం, వెండి ర్యాలీ ఏ స్థాయిలో ఉంటుందో గత కొన్నేళ్ల అనుభవాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అయితే పసిడి, వెండి ధరలు రెట్టింపయ్యాయి. దీన్ని చూసి ఇన్వెస్టర్లు పసిడి, వెండిలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. కాకపోతే ఈ ఏడాది ఊగిసలాట మామూలుగా లేదు. తాజాగా వెండి గరిష్ఠానికి చేరటం... భారీగా పతనమవటం అంతా నెలలో జరిగిపోయింది. మిగిలిన పెట్టుబడి సాధనాల నుంచి వైదొలిగి మొత్తం వీటిలోనే కుమ్మరించిన వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నది వీటికీ వర్తిస్తుంది. బంగారం, పసిడి ఏటా స్థిరంగా రాబడినిస్తాయన్న భరోసా లేదు. ఇవి ఒక సైకిల్ ప్రకారం చలిస్తుంటాయి. కొన్నేళ్ల పాటు అతి తక్కువ రాబడి, స్థిరీకరణ తర్వాత కొద్ది కాలంలోనే ఎక్కువ ర్యాలీ చేయడం వీటి స్వభావం. కనుక ఏటా స్థిరంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే మెరుగైన విధానం.స్టాక్స్లో మాదిరి వీటిపై డివిడెండ్, బోనస్లు వంటివేవీ ఉండవు.బంగారం కంటే వెండిలో ఆటుపోట్లు ఎంతో ఎక్కువ. ఆర్థిక వ్యవస్థలు గొప్పగా పనిచేస్తున్న కాలంలో ఇవి దీర్ఘకాలం పాటు ర్యాలీకి దూరంగా ఉంటాయి. ఇన్వెస్టర్ల హెడ్జింగ్ కోసం, సెంట్రల్ బ్యాంకుల మారకం నిల్వల స్థిరత్వానికి పసిడికి డిమాండ్ ఎక్కువ. పారిశ్రామిక వినియోగం, ఇన్వెస్టర్ల పెట్టుబడిగానూ వెండికి డిమాండ్ పెరుగుతోంది.కానీ, ఇప్పటి వరకు చరిత్ర చూస్తే 1950 నుంచి ఇప్పటి వరకు పసిడి, వెండిపై రాబడి 10–11 శాతం (వార్షికంగా) చొప్పున ఉంది.పసిడి, వెండిపై పెట్టుబడులకు చార్జీలు, లిక్విడిటీ పరంగా ఈటీఎఫ్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ పథకాలే మెరుగైనవి. ఫిక్స్డ్ డిపాజిట్లు భద్రమే కానీ..ఎఫ్డీలపై 6.5–7 శాతం రాబడి పేపర్పై కనిపించేంత వరకే. మన దగ్గర ద్రవ్యోల్బణం సగటున 5–6 శాతం మధ్య ఉంటోంది. అంటే ఎఫ్డీ ఇచ్చిన రాబడిని ద్రవ్యోల్బణమే తినేస్తున్నట్లు లెక్క. ఇక ఇన్వెస్టర్కు మిగిలేది ఏముంటుంది? కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటిపోతోందన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉంటే ఎఫ్డీఐపై వచ్చే 6–7 శాతం రాబడిపై కూడా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు అసలు రాబడి రాకపోగా... పన్ను అనంతరం స్వల్పంగా నష్టపోవాల్సి వస్తుంది. దీనివల్ల కాలానుగుణంగా ఆ డిపాజిట్కు ఉన్న విలువ తగ్గిపోతుందని గమనించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది ఎంతో సులభమైన పెట్టుబడి సాధనం. కాల వ్యవధి తీరే నాటికి ఎంత వస్తుందన్నది ముందుగానే తెలిసిపోతుంది. పైగా ఇంటి సమీపంలోని బ్యాంక్లో డిపాజిట్ చేసుకుని, కావాల్సినప్పుడు అదే రోజు వెనక్కి తీసుకోగల సౌలభ్యం ఉంటుంది. ఎఫ్డీలో పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఒక డిపాజిటర్కు ఒక బ్యాంక్ పరిధిలో రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది కనుక నిశ్చింత ఎక్కువ. కానీ, భద్రత కోసమని, సౌకర్యం ఉందని చెప్పి నికరంగా రూపాయి కూడా రాబడి లేని (ఎఫ్డీ రేటు నుంచి ద్రవ్యోల్బణం తీసేయగా) సాధనంలో ఉన్నదంతా పెట్టేస్తే ముఖ్యమైన లక్ష్యాలను సాధించడమెలా అన్నది ఆలోచించాలి. పైగా ఆర్బీఐ ఇటీవలి కాలంలో 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించేసింది. భవిష్యత్తులోనూ తగ్గించొచ్చు. అలాంటప్పుడు ఎఫ్డీఐలపై రాబడి మరింత తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా మన పెట్టుబడి విలువ కూడా పెరగాలి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా విద్య, వైద్యం, గృహ అద్దె, నిత్యాసవరాల ధరలు కూడా పెరుగుతుంటాయి. ఈ స్థాయిలో లేదంటే ఇంతకుమించి పెట్టుబడిని వృద్ధి చేసుకోవాల్సిందే. ఇక్కడే ఈక్విటీల పాత్ర కీలకం అవుతుంది. ఈక్విటీలు మెరుగే కానీ..ఈక్విటీలు ఇతర సంప్రదాయ సాధనాలకు మించి రాబడులను ఇస్తాయన్నది చారిత్రక వాస్తవం. కానీ, అది దీర్ఘకాలంలోనే సాధ్యం. పదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీ ఫండ్స్లో రాబడి 12– 15 శాతం మధ్య ఉంది. స్మాల్, మిడ్క్యాప్ ఫండ్స్లో అయితే ఈ రాబడి 30 శాతం వరకు ఉంది. స్వల్పకాలానికి ఈక్విటీల పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు, కరెన్సీ విలువలు, దేశాల రుణ భారాలు, వడ్డీ రేట్లు, వాతావరణ మార్పులు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈక్విటీలు కదులుతూ ఉంటాయి. ఇలాంటి ప్రతికూలతలను జీర్ణం చేసుకుంటూ మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన పనితీరు చూపిస్తుంటాయి.క్రమశిక్షణ, అనుభవం కలిగిన ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీల పతనాలను చూసి ఆందోళన చెందుతుంటారు. ప్రతి ర్యాలీ తర్వాత దిద్దుబాటు కచ్చితంగా ఉంటుందన్నది వాస్తవం.దీంతో ఈక్విటీ పెట్టుబడులపై నిశ్చింత, ప్రశాంతత అన్నది అన్ని సందర్భాల్లో ఉండదు. ముఖ్యంగా మధ్యతరగతి ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తక్షణ రాబడుల కోసం ఫ్యూచర్స్, ఆప్షన్స్ (ఎఫ్అండ్వో), ఇంట్రాడే ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తుంటారు. సరైన పరిశోధన, ఆయా సాధనాల పనితీరు, రిస్క్లు ఇవన్నీ తెలుసుకోకపోవడం ఫలితంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎఫ్డీల మాదిరి (రూ.5లక్షలు) ఈక్విటీ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. స్వల్పకాలంలో పెట్టుబడి విలువ కూడా తగ్గిపోవచ్చన్నది గుర్తు పెట్టుకోవాలి. ఒక్కోసారి మెరుగైన రాబడుల కోసం మార్కెట్ సైకిల్ మారే వరకూ వేచి చూడాల్సి రావచ్చు. ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులతో కంపెనీలు జారీ చేసే డివిడెండ్ సైతం తిరిగి పెట్టుబడిగా మారుతుంది. దీర్ఘకాలంలో కాంపౌండింగ్తో రాబడి మరింత ఇతోధికం అవుతుంది. లిక్విడిటీ ఎక్కువ. సులభంగా క్రయ, విక్రయాలు చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు ఈక్విటీ పెట్టుబడులు బలంగా పనిచేస్తాయి. దీంతో కొనుగోలు శక్తి తగ్గదు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన జ్యోతిష్కురాలు.. బాబా వంగా పేరు మరోసారి వార్తల్లో నిలిచారు. బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే ఈమె.. అనేక దేశాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రపంచ పరిణామాలపై చెప్పిన మాటలు నిజమయ్యాయని ప్రజలు నమ్మడం వల్ల ఆమె పేరు ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందింది.ప్రపంచంలోని చాలా దేశాలు.. కరెన్సీ హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం వంటివి ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బాబా వంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి చెప్పిన మాటలు చర్చకు దారితీసాయి. కాగితపు కరెన్సీ దాని విలువను కోల్పోతుంది. దీనివల్ల ప్రపంచంలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో ప్రజల్లో భయం, ఆందోళనను మొదలైపోయాయి.కరెన్సీకి ఎప్పుడైతే విలువ తగ్గిపోతుందో.. అలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, రాగి వంటి లోహాలే భద్రమైన ఆస్తులుగా మిగులుతాయని, వాటి విలువ ఈ ఏడాది మరింత పెరుగుతుందని బాబా వంగా వెల్లడించారు.2026 ప్రారంభమైన తరువాత బంగారం ధరలు అమాంతం పెరిగి తులం రేటు రూ.1.80 లక్షలకు చేరుకుంది. వెండి ధర రూ. 4 లక్షలకు చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంతలా పెరగడం చరిత్రలో ఎప్పుడూ కనిపించలేదని ఆర్ధిక నిపుణులు సైతం వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితులు కొంత సాధారణ స్థితికి వచ్చేసాయి. దీంతో రేట్లు కూడా వరుసగా తగ్గుముఖం పట్టాయి.బాబా వంగా చెప్పిన మాటలు కేవలం అంచనా మాత్రమే. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయని చెప్పలేము. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కరెన్సీ విలువ తగ్గిపోతుందని భావించి, ముందుగానే బంగారం, వెండి వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైంది కాదు. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఓసారి ఆలోచించాలి. ఎందుకంటే.. అన్ని వేళలా లాభాలే రావు, నష్టాలను కూడా కొన్ని సార్లు భరించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే! -
కియోసాకీకి కోపమొచ్చింది!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకీ, తాను బిట్కాయిన్ను 6,000 డాలర్లకి కొనుగోలు చేశానన్న వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందించారు. బిట్కాయిన్ కొనుగోలు చేసిన తేదీపై అనవసరంగా దృష్టి పెట్టడం ఇన్వెస్టర్ల అసలు లక్ష్యాన్ని తప్పుదారి పట్టిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు.తనను “అబద్ధం చెబుతున్నాడు” అంటూ ఆరోపించిన వ్యక్తి, బిట్కాయిన్ను ఏ తేదీన కొనుగోలు చేశానన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నాడని కియోసాకీ పేర్కొన్నారు. అయితే తాను గుర్తుంచుకునేది కొనుగోలు చేసిన ధర (strike price) మాత్రమేనని, తేదీ తనకు ప్రాధాన్యం కాదని చెప్పారు.“నేను ఏ తేదీన బిట్కాయిన్ కొన్నానో అతడికి ఎందుకు అంత ఆసక్తి?” అని ప్రశ్నించిన కియోసాకీ, ఆ విమర్శల వెనుక వ్యక్తిగత అజెండా ఉండవచ్చని ఆరోపించారు.బిట్కాయిన్ ధర మళ్లీ 6,000 డాలర్లకి పడితే మరోసారి కొనుగోలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తేదీ ఏమిటన్నది తనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. ప్రస్తుతం తాను మరింత బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నానని కూడా వెల్లడించారు.తన విమర్శకులను ఉద్దేశించి, వారు ఎన్ని బిట్కాయిన్లు, బంగారం, వెండి లేదా ఈథీరియం కలిగి ఉన్నారో చెప్పాలని సవాలు విసిరారు. అలాగే అద్దె ఇళ్లు, చమురు బావులు వంటి వాస్తవ ఆస్తులపై కూడా ప్రశ్నించారు. “నేను ఈ ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశానో నాకు గుర్తులేదు. కానీ వాటిని కొనుగోలు చేశానన్నది మాత్రం ఆనందంగా ఉంది” అని కియోసాకీ అన్నారు.అలాగే 2026 సంవత్సరానికి చెందిన 60 అమెరికన్ సిల్వర్ ఈగిల్స్ నాణేలు, 20 మిశ్రమ తేదీల గోల్డ్ ఈగిల్స్ కొనుగోలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వెండి మార్కెట్లో ఉన్న కల్లోలం కారణంగా 2026 సిల్వర్ ఈగిల్స్ భవిష్యత్తులో కలెక్టర్ కాయిన్లుగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.చివరగా, తనను అనుసరించే ఇన్వెస్టర్లకు కియోసాకీ ఒక సూచన చేశారు. “ఆస్తి విలువ, సంఖ్య కంటే కొనుగోలు చేసిన తేదీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సంపద ఆస్తుల సేకరణతోనే వస్తుంది, తేదీలతో కాదు.” అని ముగించారు.To the person who said I was lying that I bought Bitcoin at $6000…. I know my strike price not the date he falsely accuses me of the date I bought Bitcoin on.Why would he care what date I bought it on?Does he have a personal agenda for calling me a liar?If Bitcoin hits…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 7, 2026 -
బంగారం, వెండి ధరల్లో ఇంతమార్పా!
బంగారం, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. మార్కెట్లో సంచనలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా గోల్డ్ రేటు ఏ స్థాయిలో తగ్గిందో.. అదే స్థాయిలో పెరిగింది కూడా. ఈ కథనంలో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు అంటే.. ఆదివారం నుంచి శనివారం వరకు ధరలు ఎలా మారాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఆదివారం (ఫిబ్రవరి 1) రూ. 1,60,580 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర శనివారం (ఫిబ్రవరి 7) నాటికి రూ. 1,56,600 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 3980 రూపాయలు తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. రూ. 1,47,200 నుంచి రూ. 1,43,550 వద్దకు (రూ.3650 తగ్గింది) చేరింది.చెన్నైలో రూ.1,62,550 వద్ద (ఫిబ్రవరి 1) ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 7) రూ. 1,57,310 వద్దకు (రూ. 5,240 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,000 నుంచి రూ. 1,44,200 వద్దకు (రూ. 4,800 తగ్గింది) చేరింది.ఇదీ చదవండి: బంగారం పింక్ పేపర్లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్ ఇదే!ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో వారం రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు 1,60,730 రూపాయల నుంచి రూ. 1,56,750 వద్దకు (రూ. 3980 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు కూడా రూ. 1,47,350 రూపాయల నుంచి రూ. 1,43,700 వద్దకు (రూ. 3650 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపించింది. ఫిబ్రవరి 1న రూ. 3.20 లక్షల వద్ద కేజీ సిల్వర్ రేటు.. నేటికి (శనివారం) రూ. 2.85 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో కేజీ ధర రూ. 35వేలు తగ్గిందన్న మాట. -
మీ దగ్గరున్న వెండి స్వచ్ఛమైనదా, కాదా?: తెలుసుకోండిలా..
వెండి ధరలు గణనీయంగా పెరిగి.. కేజీ రేటు రూ.3 లక్షలకు చేరింది. ఇలాంటి సమయంలో కొంతమంది వ్యాపారస్తులు నకిలీ వెండి లేదా ఇతర మిశ్రమాలు ఎక్కువగా కలిసి ఉండే సిల్వర్ విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీరు కొన్నది నిజమైనదా.. కాదా? తెలుసుకోవడం కష్టం అనుకోవచ్చు. కానీ.. కొన్ని చిట్కాల ద్వారా ఇంట్లోనే వెండిని టెస్ట్ చేసుకోవచ్చని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. మ్యాగ్నెట్ టెస్ట్: నిజమైన వెండిని మ్యాగ్నెట్ను ఆకర్శించదు. ఒకవేలా మ్యాగ్నెట్ వెండిని లేదా వెండి వస్తువును ఆకర్శించిందంటే.. అది నిజమైన వెండి కాదు. అయితే ఈ పరీక్షతోనే దానిని ప్యూర్ సిల్వర్ అని నిర్దారించలేము. మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఇది ఒక బేసిక్ టెస్ట్ మాత్రమే.ఐస్ టెస్ట్: ఇది నిజమైన వెండిని గుర్తించడానికి చేసే మరో టెస్ట్. సిల్వర్ అనేది మంచి ఉష్ణ వాహకం (హీట్ కండక్టర్). ఐస్ మీద వెండిని ఉంచినప్పుడు.. అది వెంటనే కరిగితే అలాంటి వెండి నిజమైనదని, ఒకవేలా ఐస్ నెమ్మదిగా కరిగితే అందులో ఇతర మిశ్రమాలు కలిసి ఉన్నయనడానికి సూచన.స్మెల్ టెస్ట్ (వాసన ద్వారా టెస్ట్): నిజమైన వెండికి ప్రత్యేకమైన వాసన ఉండదు. సిల్వర్ వస్తువును తేలికగా రుద్ది మీ ముక్కు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు.. ఏదైనా వాసన వస్తే.. అందులో ఇతర మిశ్రమాలు ఉన్నట్లు. రాగి లేదా ఇతర లోహాలను కలిపినప్పుడే వెండికి ఒక స్మెల్ వస్తుంది. దీని ద్వారా కూడా నిజమైన వెండిని గుర్తించవచ్చు.క్లాత్ టెస్ట్: వెండిని శుభ్రమైన తెల్లటి వస్త్రంతో సున్నితంగా రుద్దండి. ఆక్సీకరణ కారణంగా నిజమైన వెండి మందమైన నలుపు లేదా బూడిద రంగు గుర్తులను ఏర్పరుస్తుంది. ఎటువంటి గుర్తు కనిపించకపోతే.. అలాంటిది మిశ్రమం కలిసి ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి.వాటర్ టెస్ట్: సాధారణంగా వెండి కొంత బరువుగా ఉంటుంది. కాబట్టి దీనిని నీటిలో వేయగానే వేగంగా కిందికి వెళ్తుంది. ఒకవేలా వేగంగా కిందికి వెళ్లకపోతే.. అది నకిలీదని గుర్తించాలి. వెండిలో కొన్ని లోహాలు కలిసి ఉన్నప్పుడే.. అది నెమ్మదిగా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది.సౌండ్ టెస్ట్: వెండిని ఇతర మెటల్ వస్తువుతో తాకినప్పుడు.. ఎక్కువ శబ్దం చేస్తుంది. నకిలీ వెండి అయితే.. సున్నితమైన శబ్దం చేస్తుంది.వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో కొనుగోలుదారులు.. సిల్వర్ కొనే ఆతృతలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే.. విక్రయదారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన వెండిని.. వివిధ రకాలుగా టెస్ట్ చేసి, అది నిజమైనదా.. కాదా? అని తెలుసుకోవచ్చు.వెండికి హాల్ మార్క్భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.హాల్మార్కింగ్ అంటే: బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. -
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు కొత్త మార్కెట్ దిగువ స్థాయికి చేరుకునే వరకు బిట్కాయిన్ (BTC), బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల ఊగిసలాట కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన పోస్ట్లో, అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న “అత్యంత పెద్ద సమస్య”గా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో సంబంధం ఉన్న భవిష్యత్ బాధ్యతలను కలిపితే మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య” అని కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడే కొనేది లేదువెండి ధర 60 డాలర్లు, బిట్కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. “నేను కొన్ని బిట్కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు” అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ కొత్త దిగువ స్థాయిల కోసం “ఓపికగా వేచి చూస్తున్నాను” అని అన్నారు.గురువారం సెషన్లో బిట్కాయిన్ ధర 60,100 డాలర్ల వరకు పడిపోయి, రాత్రికి 65,600 డాలర్లకు చేరింది. అయినప్పటికీ, గత 24 గంటల్లో ఇది ఇంకా 6.6% తగ్గుదలలోనే ఉంది. స్టాక్ట్విట్స్ ప్రకారం.. బిట్కాయిన్పై రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏడాది కనిష్టానికి చేరి ‘అత్యంత బేరిష్’ జోన్లోకి వెళ్లింది. చర్చల స్థాయి మాత్రం ‘అత్యధికం’గా ఉంది.బంగారం, వెండి మార్కెట్ పరిస్థితిగురువారం రాత్రి బంగారం ఔన్స్కు సుమారు 4,400 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ, గత రోజుతో పోలిస్తే 1.95% లాభపడింది. అయితే, స్పైడర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్ (GLD) రెగ్యులర్ ట్రేడింగ్లో 2.66% పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్స్లో మరో 0.92% తగ్గింది. స్టాక్ట్విట్స్లో పసిడిపై సెంటిమెంట్ ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి తగ్గింది.ఇదీ చదవండి: క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండిఇక వెండి ధరలు గురువారం రాత్రి 4.4% పెరిగి 73.8 డాలర్లకు చేరుకున్నాయి. రెగ్యులర్ సెషన్లో 15.77% పతనం తర్వాత, ఐషేర్స్ సిల్వర్ ట్రస్ట్ (SLV) ఆఫ్టర్ అవర్స్లో మరో 4.63% తగ్గింది. వెండి చుట్టూ రిటైల్ సెంటిమెంట్ కూడా ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి దిగింది. చర్చల తీవ్రత ‘చాలా ఎక్కువ’ నుంచి ‘ఎక్కువ’కు తగ్గింది.సమయం, సహనం కీలకంధరలు తక్కువ స్థాయికి చేరేవరకు వేచి ఉండాలని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. వెండి ధర 74 డాలర్లకి, బంగారం 4,000 డాలర్లకు పడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం తగినంత ఎథీరియం ఉందని, భవిష్యత్తులో ఆ వాటాను పెంచుకోవడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.“లాభం మీరు కొనుగోలు చేసినప్పుడు వస్తుంది… అమ్మినప్పుడు కాదు,” అని రిచ్ డాడ్ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని, ధరల ర్యాలీలను వెంబడించవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. చివరగా, ఆయన తరచూ చెప్పే “పందులు లావవుతాయి… కానీ అత్యాశ పందులు మాంసంగా మారుతాయి” అన్న మాటను మరోసారి గుర్తుచేశారు.AS I POSTED on X earlier. I stopped buying silver at $60.I stopped buying Bitcoin at $6000.I stopped buying gold at $300.I have sold some Bitcoin and some gold. I hate selling because I hate paying capital gain taxes.Today…. I wait patiently for new bottoms for gold…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 6, 2026 -
బిట్కాయిన్ పతనం.. మైఖేల్ బరీ హెచ్చరిక!
బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్కాయిన్ ధర కూడా అమాంతం పడిపోతోంది. ఇది ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళనను కలిగిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ హెజ్ ఫండ్ మేనేజర్ 'మైఖేల్ బరీ' కీలక వ్యాఖ్యలు చేశారు.బిట్కాయిన్ పతనం కేవలం క్రిప్టో మార్కెట్కే పరిమితం కాదు. ఇది బంగారం, వెండి వంటి సంప్రదాయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. మైఖేల్ బరీ హెచ్చరించారు. బిట్కాయిన్లో పెద్ద నష్టాలు వస్తే, పెట్టుబడిదారులు నగదు కోసం ఇతర ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.బిట్కాయిన్ ఇప్పుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. స్పాట్ బిట్కాయిన్ ETFలు, అలాగే కొన్ని పెద్ద కంపెనీలు తమ ట్రెజరీలో బిట్కాయిన్ను నిల్వ చేసుకోవడం వల్ల, క్రిప్టో మార్కెట్లో జరిగే మార్పులు మిగతా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ETFల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తే.. ఆ ఫండ్స్ తమ వద్ద ఉన్న బిట్కాయిన్ను అమ్మాల్సి వస్తుంది. దీని వల్ల ధరలు మరింత పడిపోతాయని మైఖేల్ బరీ పేర్కొన్నారు.బిట్కాయిన్ మరింత పడిపోతే, మైక్రోస్ట్రాటజీ వంటి బిట్కాయిన్పై భారీగా ఆధారపడిన సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని బరీ హెచ్చరించారు. ముఖ్యంగా బిట్కాయిన్ ధర 50,000 డాలర్ల వరకు పడితే.. కొంతమంది దివాలా తీయవచ్చని, అలాగే టోకనైజ్డ్ మెటల్స్ (డిజిటల్ గోల్డ్, సిల్వర్) మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోతారని చెప్పారు. ఇది ఆయన చెప్పినట్లుగా ఒక 'డెత్ స్పైరల్'.. అంటే ఒక సమస్య మరో సమస్యకు దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి.బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. బిట్కాయిన్ ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుందనే వాదనను బరీ ఖండించారు. అంతే కాకుండా.. బిట్కాయిన్.. S&P 500 స్టాక్ సూచీ మధ్య పెరుగుతున్న సంబంధం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఆయన పేర్కొన్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బరీ చెప్పిందే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. గతంలో కూడా క్రిప్టో మార్కెట్ భారీ పతనాల తర్వాత వేగంగా కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా బంగారం, వెండి ధరలు సాధారణంగా.. వడ్డీ రేట్లు, డాలర్ బలం, నియంత్రణ మార్పులు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. కేవలం క్రిప్టో అమ్మకాల వల్ల బంగారం ధరల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం లేదు.ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే! -
మళ్లీ పుంజుకున్న గోల్డ్, సిల్వర్: కొత్త ధరలు ఇలా..
జనవరి 30 నుంచి భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేటు మళ్లీ పెరుగుదల దిశగా పయనించింది. ఈ రోజు (మంగళవారం) ఉదయం రూ. 151750 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మారిపోయింది. దీంతో పసిడి కొనుగోలుదారుల్లో మరోమారు ఒకింత ఆందోళన మొదలైంది. అయితే ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,53,930 (రూ.760 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,41,100 వద్ద (రూ. 700 పెరిగింది) ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ.740 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ.700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,54,080 రూపాయల దగ్గర, 22 క్యారెట్స్ తులం పసిడి ధర రూ.1,41,250 వద్ద నిలిచాయి.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయానికి వస్తే.. ఇక్కడ బంగారం ధర దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3,490 రూపాయలు పెరిగి రూ.1,55,670 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ తులం రేటు 3200 రూపాయలు పెరిగి రూ.1,42,700 వద్దకు చేరింది.సిల్వర్ రేటుమంగళవారం ఉదయం రూ.20 వేలు తగ్గిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి అంతే పెరిగింది (రూ.20,000 పెరిగింది). దీంతో రూ. 2.80 లక్షల దగ్గర ఉన్న కేజీ వెండి రేటు రూ. 3 లక్షలకు చేరింది.ఇదీ చదవండి: జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే! -
పీక్లో వెండి ధరలు… ఒక్కసారిగా కుప్పకూలుతాయా?
వెండి ధర సగానికి పడిపోతుందా? 1980 నాటి సీన్ మళ్లీ రిపీట్ అవుతుందా ? ఇప్పుడైతే వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పీక్ స్టేజ్ లోనే ఉంది — MCXలో వెండి ధర ప్రస్తుతం సుమారు ₹3,00,000/కిలోగా ట్రేడవుతోంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది మనసుల్లో వస్తున్న ప్రశ్న ఏమిటంటే.. 1980ల నాటి ‘వెండి పతనం’ మళ్ళీ జరుగుతుందా? ఒకప్పుడు జరిగినట్లు రాత్రికి రాత్రే ధరలు సగానికి పైగా పడిపోతాయా. 1980 లో జరిగిన వెండి పతనం ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా? అనే భయం నెలకొంది. ఆ రోజు వెండి ధర ఒకే రోజులో 50 డాలర్ల నుండి 10.80 డాలర్లకి పడిపోయింది. అసలు 1980 లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. 1979-1980లో అమెరికన్ బిలియనీర్ సోదరులు ..వీళ్లను హంట్ బ్రదర్స్ అని పిలుస్తారు. వీళ్లు వెండిపై భారీ పందెం వేశారు. ఇద్దరు సోదరులు భౌతిక వెండి, ఫ్యూచర్లలో చాలా పెద్ద స్థానాన్ని నిర్మించుకున్నారు. దీంతో ప్రపంచ సరఫరాలో 50-60 శాతాన్ని నియంత్రణ లోకి తీసుకున్నారు. వీళ్లు ప్రపంచంలోనే 50 శాతం వెండి సరఫరాను నియంత్రించారు. అప్పట్లోనే వెండి ధర ఔన్సుకు 50 డాలర్లకు చేరుకున్నాయి. అయితే అప్పట్లో అమెరికన్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలు నియమించింది.దీని ఫలితంగా 1980 మార్చి 27న ‘సిల్వర్ థర్స్డే’ అని పిలుస్తారు. ఇది చరిత్రలో వెండి పతనాన్ని సూచిస్తుంది.ఇక ఈ సంఘటన తర్వాత హంట్ బ్రదర్స్ దివాలా తీశారు. వెండి ధరలు చాలా సంవత్సరాలు 5-10 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇక చూస్తే ఈ సంవత్సరం కూడా వెండి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిలో వెండి రూ.3.75 లక్షలకు చేరుకుంది. అటువంటి పరిస్థితిలో వెండిలో ఇంత వేగంగా పెరుగుదల దాని పతనానికి కారణం అవుతుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం 1980లో జరిగినట్లు ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించడం లేదు. 1980 నాటి వెండి మార్కెట్ కు నేటి వెండి మార్కెట్ చాలా భిన్నంగా ఉంది. అతిపెద్ద తేడా ఏమిటంటే ఇప్పుడు వెండి పెట్టుబడికి డిమాండ్ లేదు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, వైద్య పరికరాలు సహా అన్ని రంగాలలో వెండి వినియోగం బాగా పెరుగుతోంది. ప్రపంచదేశాలు వెండిని భవిష్యత్తు అవసరాలకోసం పోగుచేసుకుంటున్నారు. దీంతో సామాన్యులకు వెండి దూరమవుతుంది. అయితే 1980 లో జరిగినట్లు రాత్రికి రాత్రే వెండి ధరలు ఢమాల్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు..ప్రపంచ ఆర్థిక అస్థిరత పెరిగితే, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే, డాలర్ బలపడితే లేదా పెద్ద పెట్టుబడిదారులు కలిసి లాభాల బుకింగ్ ప్రారంభించినట్లయితే, అటువంటి పరిస్థితిలో వెండి ధరలు ఒక్కసారిగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన తరువాత.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ ప్రభావం ఈ రోజు (ఫిబ్రవరి 2) కూడా కొనసాగింది. దీంతో రేట్లు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. సోమవారం పసిడి ధర గరిష్టంగా 10370 రూపాయలు తగ్గింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కుప్పకూలిన బంగారం, వెండి!.. కియోసాకి ట్వీట్
ధనికులు, పేదల మధ్య ప్రధాన తేడా డబ్బు కాదు, ఆలోచనా విధానమే అంటున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి'. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వాల్మార్ట్ వంటి వాటిలో సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలావరకు పేదవాళ్లే తండోపతండాలుగా వెళ్లి.. అవసరం ఉన్నా, లేకున్నా వస్తువులు కోనేస్తుంటారు. తక్కువ ధర అని తెలియగానే.. ఇప్పుడు పోతే ఇలాంటి అవకాశం మళ్లీ రాదనే భావనతో ఖర్చు చేస్తారు. ఇది తక్షణం మాత్రమే సంతృప్తిని ఇస్తుంది.. కానీ దీర్ఘకాల లాభం ఉండదు.అయితే.. మార్కెట్లో క్రాష్ వచ్చినప్పుడు (షేర్స్, బంగారం, వెండి, బిట్కాయిన్ ధరలు తగ్గినప్పుడు) పేదవాళ్లు భయంతో తమ పెట్టుబడులను అమ్ముకుంటారు. ఇంకా పడిపోతే.. నష్టం వస్తుందనే భయమే దీనికి కారణం. ఇలాంటి సమయంలోనే ధనవంతులు కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు.ధరలు పడిపోయినప్పుడు, భవిష్యత్తులో విలువ పెరిగే ఆస్తులను తక్కువ ధరకు ధనవంతులు కొనుగోలు చేస్తారు. మార్కెట్ క్రాష్ వచ్చినా వారు భయపడరు. పైగా డబ్బును పోగు చేసి లేదా ఉన్న డబ్బుతోనే.. తెలివిగా పెట్టుబడులు పెడతారు. ఇటీవల బంగారం, వెండి, బిట్కాయిన్ మార్కెట్లు పడిపోవడం కూడా ఇలాంటిదే. కొందరికి ఇది నష్టం లాగా కనిపించినా, మరికొందరికి ఇది గొప్ప అవకాశం.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!ధనికులు నష్టాల్లో లాభాన్ని చూస్తారు.. పేదలు భయాన్ని చూస్తారు. మార్కెట్ పైకి వెళ్లినప్పుడు కొనడం కాదు, కింద పడినప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోవడమే ఆర్థిక విజ్ఞానం. డబ్బు కన్నా ముందు మన ఆలోచనలు మారితేనే, మన భవిష్యత్తు మారుతుందంటున్నారు కియోసాకి.బంగారం, వెండి & బిట్కాయిన్ మార్కెట్ ఇప్పుడే కుప్పకూలింది. అంటే అమ్మకానికి వచ్చింది. నేను వీటిని (గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్) కొనడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ఏమి చేయబోతున్నారు? అంటూ కియోసాకి ట్వీట్ పూర్తి చేశారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.DIfFERENCE BETWEEN Rich People and Poor People:When Walmart has a SALE poor people rush in and buy, buy, buy.Yet when the Financial Asset Market has a sale….a.k.a…..CRASH…the poor sell and run….while the rich rush in….and buy, buy, buy.The gold, silver, and Bitcoin…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 1, 2026 -
బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!
భారతదేశంలో బంగారం ధరలు వారం ప్రారంభంలో భారీగా పెరిగి.. వారాంతంలో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఎంత తగ్గాయి?, ఎంత పెరిగాయనే.. విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.జనవరి 25న 1,60,260 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. జనవరి 31న 1,60,580 రూపాయల వద్దకు చేరింది. వారాంతంలో గోల్డ్ రేటు భారీ తగ్గినప్పటికీ.. సోమవారం నుంచి శనివారం వరకు రూ. 3,200 పెరిగినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 1,46,900 రూపాయల నుంచి 1,47,200 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 3,000 పెరిగింది.చెన్నైలో సోమవారం (జనవరి 25) రూ. 1,59,490 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. శనివారం నాటికి రూ. 1,62,550 రూపాయల వద్దకు (3060 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,47,500 నుంచి రూ. 1,49,000లకు (రూ.1500 పెరిగింది) చేరింది.ఇదీ చదవండి: పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?ఢిల్లీలో వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయనే విషయానికి వస్తే.. జనవరి 25న 1,60,410 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం.. జనవరి 31 నాటికి 1,60,730 రూపాయల వద్దకు (3200 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు 1,47,050 రూపాయల నుంచి 1,47,350 రూపాయల వద్దకు (రూ.3000 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే వెండి ధరల్లో కూడా భారీ మార్పులు జరిగాయి. జనవరి 25న రూ.3.65 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. జనవరి 31 నాటికి రూ. 3.20 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన కేజీ ధర 45000 రూపాయలు తగ్గిందన్న మాట. -
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
-
గంటల వ్యవధిలో.. పతనమైన బంగారం, వెండి!
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 9000కంటే ఎక్కువ తగ్గింది. ఇదే బాటలో వెండి కూడా అడుగులు వేసింది. దీంతో ఉదయం ధరలకు.. తాజా ధరలకు చాలా మార్పు కనిపించింది.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,200 వద్ద ఉండగా, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,55,100 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీ, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 169350 & రూ. 158500 వద్ద నిలిచాయి. 22 క్యారెట్ల తులం పసిడి విషయానికి వస్తే.. రూ. 155250 & రూ. 158500 వద్ద ఉన్నాయి.వెండి ధరలు రూ. 4.25 లక్షల నుంచి.. రూ. 4.05 లక్షల వద్దకు పడిపోయాయి. అంటే గంటల వ్యవధిలో కేజీ సిల్వర్ రేటు 25వేల రూపాయలు తగ్గిందన్నమాట.బంగారం ధరలపై విలియం లీ స్పందనబంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.ఇదీ చదవండి: రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం! -
ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!
బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న వారికి.. వెండి కూడా షాకిస్తోంది. ఏకంగా కేజీ సిల్వర్ రేటు రూ. నాలుగు లక్షలు దాటేసింది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఈ ఒక్క రోజే (జనవరి 29) కేజీ వెండి రేటు రూ. 25వేలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 4.25 లక్షలకు (కేజీ) చేరింది. మొత్తం మీద బంగారం వెండి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి రేట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఔన్సు వెండి రేటు తొలిసారి 5,600 డాలర్లు దాటేసింది.ధరలు పెరగడానికి కారణంబంగారం వెండి ధరలు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య, బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే. స్టాక్ మార్కెట్ వంటి వాటిలో నష్టాలు వస్తాయనే భయంతో.. చాలామంది బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. ఇది ధరలు పెరగడానికి కారణమైంది.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనావెండి ధరలు పెరగడానికి కారణం పారిశ్రామిక డిమాండ్ పెరగడం మాత్రమే కాకుండా.. బలహీనమైన యూఎస్ డాలర్ సిల్వర్ రేటును అమాంతం పెంచేసిందని విశ్లేషకులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితులు & పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా గోల్డ్, సిల్వర్ రేటు పెరగడానికి దొఅహదపడ్డాయని చెబుతున్నారు. -
సిల్వర్ సునామీ.. బంగారం దూకుడు..
-
కియోసాకి వెండినంతా అమ్మేసుకున్నాడా?
ప్రసిద్ద ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకికి బంగారం, వెండిపై పెట్టుబడులంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. అయితే తాను వెండిని మొత్తం అమ్మి బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టానన్న వార్తలు వచ్చాయని, వాటిని ఖండించారు. అవి పూర్తిగా అసత్య ప్రచారాలు అని ఆయన స్పష్టం చేశారు.దీని గురించి రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. వాంకూవర్లో జరిగిన ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఈ రూమర్ల గురించి తెలుసుకున్నానని కియోసాకి తెలిపారు. తన పెట్టుబడి వ్యూహంలో వెండికి ఇప్పటికీ ముఖ్యమైన స్థానం ఉందని, తాను ఒక్క గ్రాము వెండికూడా అమ్మలేదని చెప్పారు.అయితే, తన కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి కొంత బిట్కాయిన్, తరువాత కొంత బంగారం అమ్మినట్లు ఆయన అంగీకరించారు. ఆ నిర్ణయం పెద్ద తప్పు అని, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే వాటిని అమ్మకపోయి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ‘దేవుడి దయ వల్ల వెండి మాత్రం అమ్మలేదు’ అన్నారు.కియోసాకి తన పెట్టుబడి తత్వాన్ని మరోసారి వివరించారు. అప్పు ఉపయోగించి పాజిటివ్ క్యాష్ ఫ్లో వచ్చే రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసి, ఆ ఆదాయంతో బంగారం, వెండి, బిట్కాయిన్, ఈథీరియం వంటి ఆస్తులను కొనుగోలు చేస్తానని చెప్పారు.అమెరికన్ డాలర్ వంటి ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని పునరుద్ఘాటించిన కియోసాకి, “నకిలీ డాలర్లను అమ్మి నిజమైన ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం” అని పెట్టుబడిదారులకు సూచించారు.ద్రవ్యోల్బణం, ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అస్థిరతలపై కియోసాకి గతంలోనూ పలు హెచ్చరికలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విలువైన లోహాలు, క్రిప్టోకరెన్సీలు రక్షణాత్మక పెట్టుబడులుగా ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయం.FYI SILVER Fact:I was at VRIC Vancouver Resource Investor Conference. Great event for anyone serious about their financial education on gold and silver.At VRIC I was informed there is a rumor I sold all my silver to buy more Bitcoin.This is not true. The facts are:I…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 27, 2026 -
ఇకపై సిల్వర్ రీసైక్లింగ్
ఎంఎంటీసీ–పీఏఎంపీ వెండి రీసైక్లింగ్ (పునర్వినియోగానికి అనుకూలంగా మార్చే) వ్యాపారంలోకి అడుగుపెట్టే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్ సరఫరాపరంగా తీవ్ర కొరతకు దారితీసే పరిస్థితులు ఉన్నందున వచ్చే మూడు నెలల్లో తన స్టోర్లలో ప్రయోగాత్మకంగా వెండి రీసైక్లింగ్ను మొదలుపెట్టనున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సమిత్ గుహ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిమాండ్ పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సరఫరా పెరిగే పరిస్థితుల్లేవని, ఈ క్రమంలో రీసైక్లింగ్ వ్యాపారం అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే డిమాండ్ ఇక ముందూ కొనసాగితే అప్పుడు శుద్ధి చేసిన వెండి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. భారతీయుల వద్ద 25,000 టన్నుల బంగారం, ఇంతకు పది రెట్లు వెండి ఉన్నందున రీసైక్లింగ్ను ప్రభుత్వం ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఎంఎంటీసీ–పీఏఎంపీ బంగారం రీసైక్లింగ్కు 20 స్టోర్లను నిర్వహిస్తోందని, వీటిని వెండి రీసైక్లింగ్కు వీలుగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందన్నారు.వచ్చే ఐదేళ్లలో స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్టు తెలిపారు. రీసైక్లింగ్కు అదనంగా.. దక్షిణ, తూర్పు భారత్లో మింటింగ్ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నట్టు సమిత్ గుహ చెప్పారు. మింటింగ్ సామర్థ్యాన్ని 2.4 మిలియన్ కాయిన్ల నుంచి 3.6 మిలియన్ల కాయిన్లకు పెంచుకోనున్నట్టు ప్రకటించారు. తన పోర్టల్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర ప్లాట్ఫామ్లపై బంగారం, వెండి కాయిన్ల విక్రయాలను పెంచుకోనున్నట్టు తెలిపారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..
అంచనాలకు అందకుండా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉదయం రూ. 5400 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2840 వద్దకు వచ్చింది. అంటే దాదాపు సగం తగ్గిందన్నమాట. ఇది పసిడి ప్రియులకు కొంత ఊరటను ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో.. తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 4950 రూపాయలు పెరిగి.. రూ.1,46,400 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. సాయంత్రానికి 2350 రూపాయలు తగ్గి.. రూ. 1,44,050 వద్దకు చేరింది. అదే విధంగా 5400 రూపాయలు పెరిగి రూ. 1,59,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి 2560 రూపాయలు తగ్గి రూ. 1,57,150 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎంత వ్యత్యసం ఉందో చూడవచ్చు.చెన్నైలో కూడా 1,46,500 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. 1,59,820 నుంచి 1,58,730 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,46,550 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర.. సాయంత్రానికి 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,59,860 నుంచి రూ. 1,57,150 వద్దకు చేరింది.వెండి ధరలువెండి ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. అయితే కేజీ సిల్వర్ రేటు రూ. 3.60 లక్షలకు చేరింది. గురువారం (జనవరి 22) రూ. 3.40 లక్షల వద్ద ఉన్న వెండి.. ఈ రోజు (శుక్రవారం) రూ. 20వేలు పెరిగింది. దీంతో రేటు రూ. 3.60 లక్షల వద్దకు చేరింది. -
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి ఆస్తుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాత్కాలిక మార్కెట్ ఊగిసలాటలకంటే దీర్ఘకాలిక ఆర్థిక వాస్తవాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈమేరకు సోషల్ మీడియాలో రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక పోస్ట్ చేశారు. అమెరికా జాతీయ రుణం నిరంతరం పెరుగుతుండటం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుతుండటమే తన పెట్టుబడి దృక్పథానికి ప్రధాన కారణమని కియోసాకి తెలిపారు.“బంగారం, వెండి లేదా బిట్కాయిన్ ధరలు పెరుగుతాయా పడిపోతాయా అని నేను పట్టించుకోను, ఎందుకంటే అమెరికా జాతీయ రుణం పెరుగుతూనే ఉంది, అదే సమయంలో డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది” అంటూ తన ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ ద్రవ్య విధానాలపై కియోసాకి చాలాకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా వ్యాఖ్యల్లో, ఫెడరల్ రిజర్వ్, యూఎస్ ట్రెజరీ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను “అధిక విద్య కలిగిన కానీ అర్హత లేని పీహెచ్డీలు” నియంత్రిస్తున్నారని విమర్శించారు.ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని కియోసాకి తెలిపారు. పరిమిత సరఫరా ఉన్న ఈ ఆస్తులు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణగా నిలుస్తాయని ఆయన నమ్మకం.Q: Do I care when the price of gold silver or Bitcoin go up or down?A: No. I do not care.Q: Why Not?A: Because I know the national debt of the US keeps going up and the purchasing power of the US dollar keeps going down.Q: Why worry about the price of gold, silver,…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026 -
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..
ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి విలువైన లోహాలపై మరోసారి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈసారి ఆయన బంగారంతో పోలిస్తే వెండికే భవిష్యత్తులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు.సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టులో.. వేల సంవత్సరాలుగా బంగారం, వెండి రెండూ డబ్బుగా ఉపయోగంలో ఉన్నాయని గుర్తు చేసిన కియోసాకి, నేటి టెక్నాలజీ యుగంలో వెండి ఒక “స్ట్రక్చరల్ మెటల్”గా మారిందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ఈ టెక్ యుగంలో వెండి అంతే కీలకమని పోలుస్తూ రాసుకొచ్చారు.“వెండి ఇక కేవలం డబ్బు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత అవసరమైన లోహంగా మారుతోంది” అని కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు.ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగం విస్తరిస్తుండటంతో వెండికి డిమాండ్ మరింత పెరుగుతుందనేది ఆయన అభిప్రాయం.ధరల విషయానికి వస్తే, 1990లో వెండి ధర ఔన్స్కు సుమారు 5 డాలర్లు ఉండేదని, 2026 నాటికి అది సుమారు 92 డాలర్లకి చేరిందని కియోసాకి చెప్పారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, 2026లోనే వెండి ఔన్స్కు 200 డాలర్ల వరకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు.WHY SILVER is SUPERIORGold and silver have been money for thousands of years.But…in today’s Technology Age….silver is elevated into an economic structural metal…. much like iron was the structural metal of the Industrial Age.In 1990…silver was approximately $ 5.00 an…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 22, 2026 -
రాహు - కేతువులనూ మింగేస్తున్నారు!
సూర్య, చంద్రులను గ్రహణం రోజున రాహువు లేదా కేతువు కొంత సమయం పాటు మింగేస్తారనేది పురాణ ప్రశస్తి. అంతటి రాహు కేతువులనూ శ్రీకాళహస్తిలో టీడీపీ కూటమి శ్రేణులు మింగేస్తున్నారు. వెండి ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో నాగ పడగల రూపంలో ఆలయానికి దక్కాల్సిన వెండిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదు. పాలకమండలికి చెప్పినా వినిపించుకోవడం లేదు.సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు పూజలకు ఉపయోగించే వెండి నాగ పడగలను టీడీపీ కూటమి నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొంతకాలంగా వెండి ధరలు పెరిగిపోతుండటంతో ఆలయంలో రూ.500 పూజా టికెట్లు కొని.. తద్వారా వచ్చే నాగ పడగలను బయట మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో నిత్యం రాహు–కేతు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పూజలు చేయించుకునే భక్తుల కోసం ఆలయంలోనే రూ.500, రూ.750, రూ.2,500, రూ.5,000 డినామినేషన్లలో టికెట్లు విక్రయిస్తారు. రూ.500, రూ.750 టికెట్లు తీసుకునే భక్తులకు టెంకాయ, నల్లగుడ్డ, ఎర్రగుడ్డ, మినుములు, ఉద్దులు, పసుపు, కుంకుమ, తమలపాకు, వక్కతోపాటు 5 గ్రాముల బరువు గల రెండు (రాహు–కేతు) వెండి నాగపడగల్ని కూడా ఆలయ కౌంటర్లో భక్తులకు అందజేస్తారు. రూ.2,500, రూ.5 వేల టికెట్లు కొన్నవారికి పూజా సామగ్రితోపాటు ఒక్కొక్క టికెట్పై 10 గ్రాముల బరువైన రెండు వెండి నాగపడగల్ని ఇస్తారు. భక్తుల ముసుగులో రూ.500 టికెట్లు కొనుగోలు చేస్తున్న టీడీపీ కూటమి నేతలు ఆలయ కౌంటర్లలో ఇచ్చే నాగపడగల్ని జ్యూవెలరీ వ్యాపారులకు, పూజాసామగ్రిని ఆలయం బయట ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ఆగడాల కారణంగా ఆలయానికి దక్కాల్సిన వెండి పక్కదారి పడుతుండగా.. కూటమి శ్రేణుల జేబులు నిండుతున్నాయి. ఇలా కొట్టేస్తున్నారు: కొన్ని రోజులుగా వెండి ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.3.18 లక్షలు పలుకుతోంది. గ్రాము రూ.300 దాటింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కూటమి శ్రేణులు రూ.500 రాహు–కేతు పూజల టికెట్ కొనుగోలు చేసి, దానితోపాటు కౌంటర్లో ఇచ్చే రెండు నాగపడగల (ఒక్కొక్కటి రెండున్నర గ్రాములు) 5 గ్రాముల వెండిని బయట విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం గ్రాము వెండికి రూ.300 చొప్పున 5 గ్రాముల్ని జ్యూవెలరీ వ్యాపారులకు విక్రయించి రూ.1,500 పొందుతున్నారు. అంటే రూ.500 టికెట్పై ఇచ్చే నాగపడగలకు రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ప్రతి టికెట్పై వచ్చే నాగపడగలకు రూ.1,000 చొప్పున ఆదాయం పొందుతున్నారు. రోజుకు ఒక్కొక్క నాయకుడు కనీసం 10 నుంచి 20 వరకు టికెట్లు కొనుగోలు చేసి తద్వారా వచ్చే నాగపడగల్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కొక్క నాయకుడు రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. దీంతోపాటు టికెట్లపై ఇచ్చే పూజా సామగ్రిని తక్కువ ధరకు ఆలయం వెలుపల వ్యాపారులకు విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా నాగపడగల ద్వారానే టీడీపీ కూటమి శ్రేణులు రోజుకు రూ.6–7 లక్షల వరకు వెనకేసుకుంటున్నారు. సుమారు మూడు నెలలుగా ఈ దందా సాగుతోంది.తరిగిపోతున్న వెండి కొండలుశ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు పూజలు చేసుకుంటే సకల దోషాలు, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సుమారు 2 వేల కిలోల వెండి ఉంది. ప్రస్తుతం దీని విలువ సుమారు రూ.60 కోట్లు. ఈ వెండితోనే క్షేత్రంలోని మింట్లో వెండి పడగలు తయారు చేస్తారు. భక్తులు పూజలో ఉంచిన వెండి పడగల్ని పూజ ముగిసిన అనంతరం ఆలయ హుండిలోనే వేసేస్తారు. అలా వచ్చిన వెండి పడగల్ని ఏరోజుకారోజు సేకరించి 6 నెలలకు ఒకసారి హైదరాబాద్ తరలించి అక్కడ కరిగిస్తారు. తరుగు పోగా మిగిలిన వెండిని కడ్డీల రూపంలోకి మారుస్తారు. తిరిగి ఆ వెండి కడ్డీలను ఆలయంలోని మింట్కు తీసుకొచ్చి నాగపడగల్ని తయారు చేసి టికెట్ తీసుకున్న భక్తులకు కౌంటర్ల ద్వారా ఇస్తారు. భక్తులు పూజలో వినియోగించిన అనంతరం హుండీలో వేయడం ద్వారా తిరిగి ఆలయానికే వస్తుంది. కాగా.. కూటమి నేతలు భక్తుల ముసుగులో టికెట్లు తీసుకుని.. వాటిపై ఇచ్చే నాగపడగల్ని ప్రస్తుత మార్కెట్ ధరకు వ్యాపారులకు విక్రయిస్తుండటంతో ఆలయానికి చెందిన వెండి క్వింటాళ్ల కొద్దీ బయటకు పోతోంది. ఇప్పుడు వెండి ధర రోజురోజుకూ పెరిగిపోతుండటంతో కూటమి నేతలు దీనిపై దృష్టి సారించారు. ఆలయానికి రావాల్సిన వెండిని కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు.టికెట్ కౌంటర్లను మార్చడంతోగతంలో ఆలయ ఆవరణలోని టికెట్ కౌంటర్ల వద్ద రాహు–కేతు పూజల టికెట్లు విక్రయించేవారు. వీటిపై అక్కడి సిబ్బంది, సెక్యూరిటీ నిఘా ఉండేది. కానీ.. ఇటీవల ఆలయ రెండో గేటు, సన్నిధి వీధి వద్ద ఓ టికెట్ల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ సుమారు 10 కౌంటర్లు ఉన్నాయి. టీడీపీ నేతలకి ఇదే ప్రధాన కేంద్రమైంది. కౌంటర్లలో టికెట్ మాత్రమే ఇచ్చి వెండి పడగలు, పూజా సామగ్రి పూజా మండపాల్లోనే ఇచ్చి, వాటిని మండపాల్లోనే హుండీలో వేయిస్తే తప్ప ఈ చోరీని అరికట్టడం కష్టమని చెబుతున్నారు. దళారుల దోపిడీ అధికారులకు తెలిసిందా?!శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజల కోసం కొందరు దళారులు పూజా సామగ్రి తీసుకుని.. పూజలు నిర్వహించకనే వెండి నాగ పడగలను బయట మార్కెట్లో విక్రయిస్తున్నారన్న సమాచారం అధికారుల దృష్టికి వచ్చినట్టుంది. ఈ క్రమంలో బుధవారం రాహుకేతు పూజా టికెట్లను కౌంటర్లో విక్రయించి, వెండి నాగపడగలను మాత్రం రాహు కేతు పూజా మండపాల్లోనే భక్తులకు అందజేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఒక్కరికి ఒక పూజా టికెట్ మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. దీంతో బుధవారం రూ.500 టికెట్ల రాహు కేతు పూజలు అతి తక్కువగా జరిగాయి. వెయ్యి లోపే రాహు కేతు పూజలు జరిగినట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. గడచిన రెండు నెలల్లో రూ.500 టికెట్ల రాహు కేతు పూజలు అతి తక్కువగా నిర్వహించింది బుధవారమే. మరోవైపు, బుధవారం మొదటిసారి రాహు కేతు పూజా టికెట్లను కౌంటర్లో విక్రయించి, పూజా సామాగ్రిని మండపాల్లో అందజేశారు. -
పసిడి పరుగులు.. వెండి వెలుగులు
-
స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసిన తరువాత.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. మంగళవారం ఉదయం ఉన్న ధరలకు, సాయంత్రం ధరలకు పొంతన లేకుండా.. ఊహించని స్థాయికి చేరిపోయాయి. దీంతో గోల్డ్ రేటు రూ.1.50 లక్షలు క్రాస్ చేయగా.. సిల్వర్ 3.4 లక్షల వద్దకు చేరింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాల్లో ఉదయం రూ. 1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,37,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 147280 రూపాయల దగ్గర నుంచి రూ. 1,49,780 వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,000 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,51,640 వద్ద నిలిచాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,37,450 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,49,910 వద్ద నిలిచాయి.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేటు రూ. 22000 పెరిగింది. దీంతో 1000 గ్రాముల ధర 3.40 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. -
సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరువలో ఉండగా.. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ. 3 లక్షలు దాటేసింది.పెట్టుబడిదారుల డిమాండ్, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల కేజీ వెండి రూ.3 లక్షల రికార్డును అధిగమించాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఔన్సు ధర ఏకంగా 94.35 డాలర్లు పెరిగింది. ఇటీవలి సెషన్లలో బంగారం కంటే వెండికి డిమాండ్ పెరుగుతోందని.. దీనికి డాలర్ విలువ తగ్గడం కూడా సహాయపడిందని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజు (జనవరి 19) హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో కేజీ వెండి రేటు 8000 రూపాయలు పెరిగి, రూ. 3.18 లక్షలకు చేరింది. ముంబైలో కేజీ సిల్వర్ రేటు రూ. 10వేలు పెరిగినప్పటికీ రూ. 3.05 లక్షల వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా ఇదే రేటు వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఊహించనంతగా పెరుగుతున్న బంగారం.. కారణమెవరు?వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?వెండిని కేవలం ఆభరణాలు, కాయిన్స్ రూపంలో మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో.. ధరలు ఆటోమేటిక్గా పెరుగుదలవైపు పరుగులు పెడతాయి. -
రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్!
భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపు పొందిన 'ఇండియన్ రైల్వే'లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక భారీ స్కామ్ కలకలం రేపుతోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు.. కృతజ్ఞతా సూచకంగా అందించాల్సిన వెండి నాణేలు/పతకాలు రాగితో తయారైనవిగా తేలడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ ఘటనతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు మోసపోయినట్లు తెలుస్తోంది.రైల్వే సేవల్లో దశాబ్దాలపాటు అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో వెండి పతకాలు అందించడం ఒక సంప్రదాయం. ఇది వారి సేవలకు గుర్తింపుగా భావించబడుతుంది. అయితే ఈ పతకాలు నిజంగా వెండివేనా అనే అనుమానం మొదలై, కొందరు టెస్ట్ చేయించగా.. ఇందులో కేవలం 0.23 శాతం మాత్రమే వెండి ఉందని, మిగిలినది రాగి అని తెలిసింది.ఈ మోసం 2023 - 2025 మధ్య పదవీ విరమణ చేసిన వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని భోపాల్ డివిజన్లోని వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. రైల్వేస్ 2023 జనవరి 23న ఇండోర్కు చెందిన ఒక కంపెనీకి 3,640 నాణేలకు ఆర్డర్ ఇచ్చింది. అందులో 3,631 నాణేలను భోపాల్లోని జనరల్ స్టోర్స్ డిపోకు సరఫరా చేశారు.ఒక్కో నాణెం కోసం రూ. 2200 నుంచి రూ. 2500 ఖర్చు అయినట్లు అంచనా. అయితే వెండి స్థానంలో రాగి ఉపయోగించడం వల్ల మొత్తం కుంభకోణం రూ. 90 లక్షలకు పైగా ఉందని తెలుస్తోంది. రైల్వేలు ఆ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, సరఫరాదారుని బ్లాక్లిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించాయి.ఇండియన్ రైల్వేస్ ఈ నాణేలను గతంలో ప్రభుత్వ టంకశాలలో ముద్రించేది. అప్పుడు వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు వీటిని వేరే కంపెనీ తయారు చేయడం వల్ల.. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి తమ గౌరవ సూచికంగా పొందే పతకం/నాణెం కూడా నకిలీదేనా అని ఆందోళన చెందుతున్నారు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి -
'వెండి దొరకడం కష్టం': కియోసాకి
సిల్వర్ ధర పెరుగుతుందని చెప్పే రాబర్ట్ కియోసాకి మాటలు నిజమయ్యాయి. వెండి రేటు రోజురోజుకు పరుగుతూ.. చూస్తుండగానే రూ. మూడు లక్షలు దాటేసింది. ఇలాంటి సమయంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.''టెస్లా కంపెనీకి వెండి (Silver) దొరకడం కష్టం అవుతోంది. సిల్వర్ రేటు ఔన్స్కు 91 డాలర్ల నుంచి 107 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది'' అని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.TESLA cannot get silver.This Monday silver will gap upfrom $91 an ounce to $107 an ounce.Yay— Robert Kiyosaki (@theRealKiyosaki) January 15, 2026ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సిల్వర్ రేటు గణనీయంగా పెరగడం వల్ల, రాబర్ట్ కియోసాకి.. టెస్లా కంపెనీకి సిల్వర్ దొరకడం కష్టం అవుతోందని అన్నారు. కాగా ఈ రోజు భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 3.06 లక్షల వద్ద ఉంది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.ఇదీ చదవండి: నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్! -
Gold: తగ్గిన బంగారం ధరలు
-
రికార్డు మీద రికార్డు.. రెండు రోజుల్లో రూ.21000 జంప్
గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది. అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం! -
వారెవ్వా ఏమి జోరు..
న్యూఢిల్లీ: రోజుకో రికార్డు నెల కొల్పుతున్న వెండి, బంగారం మరోసారి దూకుడు ప్రదర్శించాయి. కేజీ వెండి ధర రూ. 6,000 జంప్చేసి రూ. 2,71,000ను తాకింది. ఈ బాటలో స్థానిక(ఢిల్లీ) మార్కెట్లో బంగారం 10 గ్రాములు రూ. 400 పెరిగి రూ. 1,45,000కు చేరింది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వివరాల ప్రకారం వెండి అన్ని పన్నులు కలుపుకుని, పూర్తి స్వచ్చత కలిగిన బంగారం ధరలివి. వెరసి మరోసారి పసిడి, వెండి చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అస్థిరతలు ధరలపై ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు మరోసారి తెలియజేశాయి.అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు తలెత్తినప్పుడు పెట్టుబడులకోసం ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలవైపు చూసే సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలతోపాటు.. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్లు, అసెట్ మేనేజర్స్ పసిడిలో ఇన్వెస్ట్ చేస్తుంటే.. వెండికి సోలార్, ఈవీ, ఎల్రక్టానిక్స్ తదితర ఇండ్రస్టియల్ డి మాండ్ సైతం జత కలుస్తోంది. 2 రోజుల్లో రూ. 21,000 గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది.అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం! -
2026లో ఊహించని స్థాయికి బంగారం, వెండి!
బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయడానికి వెనుకడుకు వేస్తున్నారు. అయితే ధైర్యం చేసి కొనుగోలు చేసినవారికి మాత్రం మంచి లాభపడ్డారు. 2025లో అమాంతం పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు 2026లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తాయా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది.నిజానికి 2026 ప్రారంభమై 10 రోజులు పూర్తి కావొచ్చింది. ఈ మధ్యలోనే 10 గ్రాముల గోల్డ్ రేటు భారతదేశంలో రూ.5000 పెరిగింది. దీంతో పసిడి ధర రూ. 1.40 లక్షలు దాటేసింది. ఇదిలాగే కొనసాగితే.. రాబోయే జూన్ నాటికి గోల్డ్ రేటు రూ.2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీ మొత్తంలో పెరగడం బహుశా ఇదే మొదటి సారి అని కూడా చెబుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేటు 140 శాతం పెరిగింది.వెండి ధరల విషయానికి వస్తే.. 2025 ప్రారంభంలో దాదాపు రూ. 90వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. 2026లో రూ.2.75 లక్షల వద్దకు చేరింది. ఇది త్వరలోనే మూడు లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందని కొందరి అంచనా.బంగారం రేటు పెరగడానికి కారణాలు!భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు. -
బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?
-
మారిన గోల్డ్ రేట్లు.. లేటెస్ట్ ధరలు ఇలా..
బుధవారం ఉదయం.. పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో రూ. 127850 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికే 500 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 126750 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 550 తగ్గడంతో రూ. 138270 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నై నగరంలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ. 300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 330 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తగ్గింది. కొత్త ధరలు రూ. 1,28,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,39,640 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్). అయితే ఢిల్లీలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది.వెండి ధరలు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రూ. 2.83 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి 2.77 లక్షల రూపాయల వద్దకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. సంక్రాంతి నాటికి వెండి రేటు రూ. 3 లక్షలకు చేరుతుందని కొందరు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత? -
బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఇతర లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి, ఇదే వరుసలో రాగి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం కూడా ఇదే వరుసలోకి చేరింది.బంగారం అనేది కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా.. మన దేశంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇండియాలో గోల్డ్ను సెంటిమెంట్గా భావించేవారి ఎక్కువగా ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీనిని కొందరు ఆస్తిగా కూడా పరిగణిస్తారు. ఈ కారణాల వల్లనే ఇందులో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.లిథియంకు డిమాండ్ఇప్పుడు బంగారం, వెండి మాదిరిగానే.. లిథియంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీనిని బ్యాటరీల తయారీలో, ఎలక్టిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కెమెరాలు, ల్యాప్టాప్లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. ఇంధన, క్లిన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా దీని వినియోగం చాలా ఎక్కువైంది. కాబట్టి చాలామంది ఇందులో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.సాధారణ లేదా పాత బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం అయాన్ బ్యాటరీలు చాలా మన్నికైనవి. ఛార్జింగ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలు ఎక్కువగా వినియోగిస్తారు. రాబోయే రోజుల్లో ఈవీల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లిథియం డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలుప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు కలిగిన దేశాల జాబొత్యలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. ఈ దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో లిథియం నిల్వలు కొంత తక్కువే. అయితే మనదేశంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో లిథియంను ఇండియా దిగుమతి చేసుకుపోవాల్సిన అవసరం వచ్చే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ! -
వెండి, బంగారం కంటే ఖరీదైన కూరగాయ..! KG ఎంతంటే..?
-
న్యూ ఇయర్లో మొదటిసారి తగ్గిన గోల్డ్ రేటు: కొత్త ధరలు ఇలా..
వరుసగా రెండు రోజులు ధరలు తగ్గిన తరువాత.. బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోచు చేశాయి. వెండి రేటు కూడా అదే బాటలో పయనించింది. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు నూతన సంవత్సరంలో మొదటిసారి తగ్గాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: రెండో రోజూ..
జనవరి 1న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు (జనవరి 2) అమాంతం దూసుకెళ్లాయి. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా 1140 రూపాయలు పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. వెండి రేటు కూడా అదే బాటలో అడుగులు వేస్తూ రూ. 4000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 2.60 లక్షలకు చేరింది.ఈ కథనంలో బంగారం, వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వెండి మెరుపులు
న్యూఢిల్లీ: దేశీయంగా వెండి ధరలు మంగళవారం సరికొత్త రికార్డు స్థాయిని తాకాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో సిల్వర్ రేటు రూ. 1,000 పెరిగి రూ. 2.41 లక్షలకు చేరింది. అయితే బంగారం ధర వరుసగా రెండో రోజున క్షీణించింది. 99.9%స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 2,800 తగ్గి రూ. 1,39,000కు పరిమితమైంది. ఎంసీఎక్స్ లో మార్చి వెండి కాంట్రాక్టు రూ. 9,590 పెరిగి రూ. 2,34,019 పలికింది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో సిల్వర్ రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 3.72 డాలర్లు పెరిగి 75.85 డాలర్లకు చేరింది. బంగారం సైతం ఔన్సుకి 69.61 డాలర్లు పెరిగి 4,401.59 డాలర్లు పలికింది. -
మెటల్స్.. క్రాష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటం, ఎగుమతులపై చైనా ఆంక్షలు తదితర అంశాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి, రాగి తదితర కమోడిటీల ధరలు సోమవారం కుదేలయ్యాయి. వరుసగా నాలుగు సెషన్ల పాటు కొనసాగిన వెండి ర్యాలీకి బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, గరిష్ట స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్) ఫ్యూచర్స్ మార్కెట్లో మార్చి కాంట్రాక్టు ఒక దశలో సుమారు 6 శాతం క్షీణించి రూ. 2,26,275 (కిలోకి) వద్ద ట్రేడయ్యింది. సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సిల్వర్, ఇంట్రాడేలో జీవితకాల గరిష్టం రూ. 2,54,174ని తాకినప్పటికీ రూ. 2,25,500కి కూడా క్షీణించింది. ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు రూ. 28,674 మేర పతనమైంది. గత వారంలో సిల్వర్ ఏకంగా రూ. 31,348 (15.04 శాతం) ఎగిసిన సంగతి తెలిసిందే. పసిడి 3%, రాగి 13 శాతం డౌన్ .. అటు పసిడిలో కూడా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫిబ్రవరి కాంట్రాక్టు పది గ్రాముల బంగారం ధర ఒక దశలో రూ. 4,946 మేర (3.54 శాతం) క్షీణించి రూ. 1,34,927కి తగ్గింది. ఇంట్రాడేలో రూ. 1,40,444 గరిష్ట స్థాయిని చూసింది. అంతక్రితం సెషన్లోనే (శుక్రవారం) పుత్తడి ఆల్టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,40,465ని తాకిన సంగతి తెలిసిందే. ఇక, రాగి విషయానికొస్తే, జనవరి కాంట్రాక్టు 13 శాతం క్షీణించి రూ. 1,211.05 (కిలోకి) పడిపోయింది. ఇంట్రాడేలో ఆల్టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,392.95ని తాకింది. రికార్డ్ స్థాయి ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి, పసిడి రేట్లు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. భారీగా కొనుగోళ్ల వల్ల ఈ రెండూ ప్రస్తుతం ఓవర్బాట్ స్థితిలో ఉండటమనేది అప్రమత్తత వహించాల్సిన అవసరాన్ని సూచిస్తోందన్నారు. తదుపరి ర్యాలీకి ముందు కొంత కరెక్షన్ మంచిదని చెప్పారు. అటు అంతర్జాతీయంగా కామెక్స్లో 2026 మార్చి నెల వెండి కాంట్రాక్టు ఔన్సుకి (31.1 గ్రాములు) 8 శాతం పైగా నష్టపోయి ఒక దశలో 70.56 డాలర్లకు తగ్గింది. ఇంట్రాడేలో 82.61 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు అయిదు శాతం పైగా క్షీణించి ఒక దశలో 4,323.20 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇంట్రాడేలో నమోదైన 4,580.70 డాలర్ల స్థాయితో పోలిస్తే 257.5 డాలర్ల మేర పతనమైంది. తర్వాత కొంత కోలుకుని 4,344.50 వద్ద ట్రేడయ్యింది. ఫ్యూచర్స్ రేట్ల ప్రభావం మంగళవారం దేశీయంగా స్పాట్ మార్కెట్లో కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కారణాలు ఇవి.. వడ్డీ రేట్ల కోతలు, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కమోడిటీల్లో ర్యాలీ మొదలైందని, ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడుతున్న దాఖలాలు కనిపిస్తుండటంతో లాభాల స్వీకరణ జరుగుతోందని భావించవచ్చని జేఎం ఫైనాన్షియల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఉద్దేశించిన శాంతి చర్చలు తుది దశకు చేరాయన్న సంకేతాలు కూడా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశాభావం కలిగిస్తున్నాయని యూబీఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, సీఎంఈ, కామెక్స్లాంటి ప్రధాన డెరివేటివ్స్ ఎక్సే్చంజీలను నిర్వహించే సీఎంఈ గ్రూప్.. వెండి డెరివేటివ్స్ కాంట్రాక్టులపై మార్జిన్లను 20,000 డాలర్ల నుంచి 25,000 డాలర్లకు పెంచేయడం వల్ల ట్రేడర్లు అమ్మకాలకు దిగి ఉంటారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. స్పాట్లో వెండి అప్.. ఫ్యూచర్స్ మార్కెట్లో పతనమైనప్పటికీ.. సోమవారం స్పాట్ మార్కెట్లో వెండి రేటు మరో కొత్త రికార్డును తాకింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ట్రేడర్లు కొనుగోళ్లు కొనసాగించడంతో, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలోకి రూ.3,650 పెరిగి రూ. 2,40,000 స్థాయిని తాకింది. మరో వైపు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి రేటు పది గ్రాములకు రూ.500 క్షీణించి రూ. 1,41,800 వద్ద క్లోజయ్యింది. -
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
భారతదేశంలో భారీగా పెరుగుతున్న వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది.రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో 50 డాలర్ల దిగువన ట్రేడవుతూ.. ఔన్సుకు 80 డాలర్ల మార్కును దాటేసింది. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా భారీగా దిగి వచ్చింది.వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలురష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా.. డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. అంతే కాకుండా శాంతి ఒప్పందానికి అటు పుతిన్ కూడా సుముఖత చూపిస్తున్నారని ట్రంప్ పేర్కొనడంతో, యుద్ధం ముగిసే అవకాశం ఉంది. ఇది వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.సుమారు రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ వెండి ధరలు.. ఏడాది పూర్తి కాకముందే 181 శాతం పెరిగింది. ధర అమాంతం పెరుగుతున్న సమయంలో కొందరు వెండిని కొనడానికి ఆలోచించారు. ఇది కూడా సిల్వర్ రేటు తగ్గడానికి ఒక కారణం.వెండి ధరలు ఇంకా తగ్గుతాయా?వెండికి ప్రస్తుతం కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సిల్వర్ రేటు తప్పకుండా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగమే చేయని కంపెనీ నుంచి లేఆఫ్ మెయిల్: షాకయిన మహిళ -
కొత్త మార్క్కు సిల్వర్!: కియోసాకి ట్వీట్
వెండి ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే సిల్వర్ 80 డాలర్లను దాటుతుందని చెప్పే ఈయన.. తాజాగా కొత్త మార్క్ చేరుతుందని పేర్కొన్నారు.బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని కియోసాకి గతంలో కూడా చాలాసార్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిల్వర్ 200 డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు చూస్తుంటే.. కియోసాకి మాటలు నిజమవుతాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.SILVER BREAKS $ 80.00$200 NEXt ?— Robert Kiyosaki (@theRealKiyosaki) December 28, 2025భారతదేశంలో వెండి రేటుహైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి రేటు రూ. 2.81 లక్షల వద్ద ఉంది. ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ (కేజీ రూ.2.58 లక్షలు).. కొన్ని రోజులుగా ధరలు మాత్రం ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాత్రం గరిష్టంగా రూ. 4000 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి రేటు పెరుగుదలపై మస్క్ ట్వీట్వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025 -
భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కేజీ సిల్వర్ రేటు భారతదేశంలో రూ.2.74 లక్షలకు చేరింది. ఈ ధరలు వచ్చే సంక్రాంతి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు.చైనా కొత్త ఎగుమతి నియమాల గడువు దగ్గర పడుతున్న కొద్దీ వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!వెండిని ఆభరణాలుగా కంటే.. అనేక పరిశ్రమలలో (సౌర ఫలకాలు, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, 5జీ మౌలిక సదుపాయాలు) పారిశ్రామిక ప్రక్రియలకు ఉపయోగిస్తారు. వెండి అనేది.. భూమిపై అత్యంత ఉత్తమ విద్యుత్ వాహక లోహం. కాబట్టి దీనిని అనేక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే.. సిల్వర్ ధరలు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. -
ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!
2025 ప్రారంభంలో రూ. 90500 వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఇప్పుడు భారీగా పెరిగింది. ధరలు పెరుగుదల క్రమంలో జులై 26న 1,18,120 రూపాయల వద్ద నిలిచింది. ఆ తరువాత నెలలో (ఆగష్టు 26) రూ.1,23,126 వద్దను చేరింది. ఇలాగే కొనసాగుతూ.. డిసెంబర్ 26 నాటికి కేజీ వెండి రూ. 2,36,350 వద్ద నిలిచింది.జులై 26 ధరలతో పోలిస్తే.. డిసెంబర్ 26నాటి ధరలు రెట్టింపు. అంటే ఆరు నెలల కాలంలో వెండి రేటు డబుల్ అయింది. ఈ రోజు మాత్రమే సిల్వర్ రేటు రూ. 20వేలు పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది.ఈ రోజు (డిసెంబర్ 27) వెండి రేటు రూ. 20000 పెరగడంతో.. కేజీ సిల్వర్ ధర రూ. 2.74 లక్షలకు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ రేటు రూ. 11వేలు పెరిగి.. రూ. 2.51 లక్షల వద్ద ఉంది.వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలువెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.ఇదీ చదవండి: బంగారం, వెండితోపాటు భారీగా పెరుగుతోన్న మరో మెటల్ -
సిల్వర్ సునామీ.. మళ్లీ వచ్చేశాడు కియోసాకి
వెండి ధర మళ్లీ రికార్డ్ యిలో ఎగిసింది. భారత్లో అయితే కేజీకి ఏకంగా రూ. 20 వేలు పెరిగి రూ.2.74 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్కు 80 డాలర్లకు చేరువైంది. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. వెండి ముచ్చట అంటే ఆగుతాడా.. మళ్లీ వచ్చేశాడు. తాజాగా సిల్వర్ గురించి మరో ముచ్చట పంచుకున్నారు.‘వెండి 80 డాలర్లను (ఔన్సుకు) దాటనుంది. తెలివిగా వెండిని పొదుపు చేస్తున్న వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ ఓపికే మీకు సంపాదన తెచ్చిపెట్టింది. ఇప్పుడు మనం సంపన్నులయ్యాం. బంగారాన్ని వెండి అధిగమించింది’ అంటూ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.అంతకు ముందు ఈ వైట్ మెటల్పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి కియోసాకి ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్టైమ్ హై అని అనుకోవద్దని, ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.SILVER To Break $80.Happy New Year ….smart silver stackers.Your patience has paid off.Now we get richer.Happy 2026Silver is hotter than gold.— Robert Kiyosaki (@theRealKiyosaki) December 27, 2025 -
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ క్రమంలో రజతం రేటు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని, లేదు సర్దుబాటు ఉంటుందని ఇలా.. మార్కెట్ విశ్లేషకులు తలో అంచనా చెబుతున్నారు. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధర గురించి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ చేస్తున్నారు.వెండి ఔన్సుకు 70 డాలర్లను దాటిపోయిన నేపథ్యంలో ఈ వైట్ మెటల్పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సమాధానమిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్టైమ్ హై అని అనుకుంటే పొరపడినట్టేనని రాసుకొచ్చారు. ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.వెండి ధర 2026లో అనూహ్యంగా 200 డాలర్లను (ఔన్స్కు) దాటిపోతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇది అతి శయోక్తి కాదని, సాధ్యకావడానికి చాలా కారణాలే ఉన్నాయని స్పష్టం చేశారు. కావాలంటే యూట్యూబ్ మొత్తం వెతికి సాధ్యసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు.ఒక్క డాలరు కన్నా తక్కువున్నప్పుడే..1965లో వెండి ధర ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువున్నప్పటి నుంచే తాను వెండి కొనడం ప్రారంభించానన్న రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు 70 డాలర్లు దాటిపోయినా సిల్వర్ కొనుగోలును ఆపనన్నారు. ధనవంతులు కావడానికి ఉత్తమ మార్గం ఎవరికి వారు సొంతంగా పరిశీలించుకోవడమేనన్నారు.‘చిన్నగా ప్రారంభించండి.... సంపద ఇక మీ బుర్రలో.. మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో పొరపాట్లు చేసినప్పటికీ, ఊరికే మాటలు చెప్పేవారి కంటే మీరు ధనవంతులు అవుతారు ’ అంటూ తనను అనుసరించేవారికి హితవు పలికారు సిల్వర్ మ్యాస్ట్రో..Silver is over $70 USD an ounce.Q: IS IT TOO LATE TO BUY SILVER?A: It depends.If you think silver is at an all time high then you’re too late.I believe silver is just getting started and I believe $70- $200 silver could be an outside reality in 2026.There are many…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 25, 2025 -
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వెండి గుర్తుకొస్తాయి. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువై.. రేటు కూడా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రాగి ధరలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ రేటు 12000 డాలర్లు దాటేసింది.2025లో బంగారం, వెండి ధరలు వరుసగా 70 శాతం, 140 శాతం పెరిగాయి. ఇదే సమయంలో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగిపోయింది. 2009 తరువాత కాపర్ రేటు ఇంతలా పెరగడం బహుశా ఇదే మొదటిసారి. దీంతో నిపుణులు దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు.రాగి ధరలు భారీగా పెరగడానికి కారణాలుమార్కెట్లో రాగి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం..భౌగోళిక, రాజకీయ కారణాలు.రాగిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, డేటా సెంటర్లలో, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో వినియోగించడంఅమెరికా విధించిన సుంకాలు కూడా రాగి ధర పెరగడానికి ఓ కారణం అనే చెప్పాలి. సుంకాల కారణంగా.. రాగి రేటు భవిష్యత్తులో పెరుగుతుందేమో అని చాలామంది దీనిని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో సరఫరా తగ్గిపోయి.. డిమాండ్ పెరుగుతోంది. డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం వల్ల.. ధర పెరిగింది.రాగి ఉత్పత్తి తగ్గడం కూడా సరఫరా తగ్గడానికి కారణమైంది. -
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ కొత్త రికార్డు స్థాయికి దూసుకెళ్తోంది. ఔన్స్కు 72 డాలర్ల మార్కును దాటింది. దాదాపు 140% లాభాలతో, వెండి అనేక ఇతర అసెట్లను గణనీయంగా అధిగమించింది. ఈ నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఫియట్ కరెన్సీ, హార్డ్ అసెట్స్పై వ్యాఖ్యానానికి ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.పారిశ్రామిక డిమాండ్, స్థూల ఆర్థిక ఆందోళనల మధ్య సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా భావిస్తూ పెట్టుబడులు పెంచుతుండటంతో వెండి ధరలు తారస్థాయికి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో తనదైన శైలిలో స్పందించారు.‘వెండి 70 డాలర్లు దాటింది.బంగారం, వెండి పొదుపు చేసేవారికి గొప్ప వార్త.ఫేక్ మనీ (డాలర్లు) దాచుకునే వాళ్లకు బ్యాడ్ న్యూస్’ అంటూ పోస్టును ప్రారంభించిన కియోసాకి అధిక ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, డాలర్ విలువను కోల్పోతూనే ఉన్నందున 2026 నాటికి వెండి ఔన్స్ కు 200 డాలర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.‘నష్టపోకండి.. వెండి ధర 2026 నాటికి 200 డాలర్లకు చేరుకుంటున్న క్రమంలో ఆ ఫేక్ డాలర్ (డబ్బు విలువ ఉండదనేది ఆయన అభిప్రాయం) కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తుంది’ అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి అంచనా కాస్త అతిశయోక్తిలా అనిపించినా వెండి ధర అత్యంత వేగంగా పెరుగుతోందనే విషయం మాత్రం వాస్తవం. SILVER over $70.GREAT NEWS for gold and silver stackers.BAD NEWS for FAKE MONEY savers.I am concerned $70 silver may signal hyper-inflation in 5 years as the fake $ keeps losing value. Don’t be a loser. Fake $ will continue to lose purchasing power as silver goes to…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 23, 2025 -
వెండికి ‘బంగారు’ కాలం
ఈ ఏడాది వెండి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అసాధారణ మైలురాయిని చేరాయి. పెట్టుబడి సాధనంగా, పారిశ్రామిక అవసరాల పరంగా ఈ లోహం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒకవైపు విశ్లేషకులు ధరల దిద్దుబాటు(Correction)పై హెచ్చరిస్తున్నప్పటికీ, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాత్రం వెండి భవిష్యత్తుపై అత్యంత ధీమాతో ఉన్నారు.గతంలో వెండి ఎప్పుడూ బంగారం ధరల గమనాన్నే అనుసరిస్తూ ఉండేది. కానీ 2025లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనిల్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నట్లుగా.. ధరలు తాత్కాలికంగా హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ వెండి మెరుపు కొనసాగుతుంది. వెండి కథ ఇప్పుడే ప్రారంభమైందని అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఏడాదిలో వెండి ధర ఏకంగా 125 శాతం పెరిగింది. బంగారం కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, దాని వృద్ధి 63 శాతం మాత్రమే. అంటే బంగారం కంటే వెండి రెట్టింపు రాబడిని అందించింది. వెండి అటు విలువైన ఆభరణంగానూ, ఇటు కీలకమైన పారిశ్రామిక లోహంగానూ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డిజిటల్ యుగంలో వెండి పాత్ర ఎంతో కీలకంగా మారింది.సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండికి ప్రత్యామ్నాయం లేదు. డేటా సెంటర్ల విస్తరణ, ఎలక్ట్రికల్ వాహనాల విద్యుదీకరణలో దీని డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అత్యాధునిక రక్షణ పరికరాల్లో వెండి కీలక అంశంగా ఉంది. భారతదేశంలో వెండి ఉత్పత్తిదారుగా ఉన్న హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ద్వారా ఈ పెరుగుతున్న పారిశ్రామిక అవసరాన్ని తాము ప్రత్యక్షంగా చూస్తున్నామని అగర్వాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
భారీగా పెరిగిన బంగారం ధర: కొత్త రేట్లు ఇలా..
బంగారం ధరల హీట్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2025 జనవరిలో రూ. 79వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు రూ. 1.38 లక్షలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే ఏడాదిలో రూ. 59వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా గత రెండు రోజులుగా పసిడి ధరలు గరిష్టంగా రూ. 4370 పెరిగింది.హైదరాబాద్, విజయవాడలలో గోల్డ్ రేటు రెండు రోజుల్లో (డిసెంబర్ 22, 23) రూ. 4370 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,180 నుంచి రూ. 1,38,550 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,000 దగ్గర నుంచి రూ. 1,27,000 వద్దకు (రూ. 4000 పెరిగింది) చేరింది.ఢిల్లీ నగరంలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. డిసెంబర్ 22, 23 తేదీల్లో రూ. 4370 పెరిగింది. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,700కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల రేటు రూ. 4000 పెరగడంతో రూ. 1,27,150 వద్దకు చేరింది.చెన్నైలో పసిడి ధరలు పెరగడంతో.. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,310 వద్దకు (రూ. 4030 పెరిగింది), 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,27,700 వద్దకు (రూ. 3700 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాలు) రూ. 8000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.34 లక్షలకు చేరింది. -
కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనికులయ్యే మార్గాలు!
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై సూచనలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. తన ఎక్స్ ఖాతాలో యాక్టివ్గా ఉంటూ.. ధనవంతులు అవ్వడం ఎలా?, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను పేర్కొంటూ ఉంటారు. ఇందులో భాగంగానే.. ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్ధిక పాఠాలను వెల్లడించారు.👉కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి, ప్రపంచ ఇంధన డిమాండ్ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.👉ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.👉ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని అన్నారు.👉ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి. మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు.👉ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.👉ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.👉ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం కొనండి.👉మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు. పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు. -
రూ. 16వేలు పెరిగిన వెండి రేటు: వారంలోనే ఇంతలా
బంగారం ధరలు మాదిరిగా కాకుండా.. వెండి ధరలు ఊహకందని రీతిలో పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో (డిసెంబర్ 14 నుంచి 20 వరకు) సిల్వర్ రేటు ఏకంగా రూ. 16,000 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.2025 డిసెంబర్ 14న రూ. 2,10,000 వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. 20వ తేదీ (శనివారం) నాటికి రూ. 2,26,000లకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే.. ఒక గ్రామ్ సిల్వర్ రేటు 226 రూపాయలకు చేరిందన్న మాట. వారం రోజుల్లో రెండు రోజులు మాత్రమే తగ్గిన రేట్లు, మిగిలిన నాలుగు రోజులు పెరుగుదల దిశగానే వెళ్లాయి.వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలువెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది. -
మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్
ఎనిమిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 9 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు మరింత ధనవంతులు కావడం ఎలా?, అనే విషయం గురించి వెల్లడించారు.ఫెడ్ (FED) భవిష్యత్తు కోసం తమ ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేసింది. వడ్డీ రేట్లను తగ్గించింది. భవిష్యత్తులో భారీగా డబ్బు ముద్రణ జరుగుతుందని, దీనిని కియోసాకి ఫేక్ మనీ ప్రింటింగ్ అని అభివర్ణించారు. ఈ ఘటనను లారీ లెపార్డ్ తన గొప్ప పుస్తకంలో "ది బిగ్ ప్రింట్" అని పిలిచారు.ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం కొనండి.ఇదీ చదవండి: పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరమా.. జరిమానా ఎంత?గత వారం ఫెడ్ రేట్ల తగ్గింపును ప్రకటించిన వెంటనే నేను మరింత వెండిని కొన్నాను. వెండి ధర భారీగా పెరగనుంది. బహుశా 2026లో ఔన్సు రేటు 200 డాలర్లకు చేరవచ్చు. ఈ ధర 2024లో 20 డాలర్ల వద్ద మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.LESSON # 9: How to get richer as the world economy crashes.The FED just let the world know their plans for the future.The FED lowered interest rates…signaling QE (quantitative easing) or turning on the fake money printing press….What Larry Lepard calls “The Big Print” the…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 17, 2025 -
Gold Price: తగ్గేదేలే అంటున్న బంగారం మరో వైపు వెండికి రెక్కలు
-
బంగారం డబుల్: గంటల్లో తారుమారైన ధరలు!
కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఈ రోజు కూడా అదేబాటలో పయనించాయి. అయితే సాయంత్రానికి మరోమారు రేటు పెరగడంతో పసిడి ప్రియులు అవాక్కవుతున్నారు. ఉదయం 980 పెరిగిన పసిడి ధర.. సాయంత్రానికి దాదాపు డబుల్ అయింది. దీంతో రేటు ఊహకందని విధంగా పెరిగిపోయింది. అనూహ్యంగా వెండి కూడా 5000 పెరిగింది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,23,500 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 400 పెరిగిందన్న మాట. (ఉదయం 750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 400 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1350 పెరిగింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1470 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,35,380 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 820 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 650 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1470 పెరిగింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1460 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,35,530 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1350 పెరిగి.. 124250 రూపాయల వద్దకు చేరింది.ఇదీ చదవండి: రూ.2.40 లక్షలకు వెండి.. కొత్త ఏడాదిలో కష్టమే!ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1580 పెరగడంతో రూ. 1,36,530 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,450 పెరిగి.. 1,25,150 రూపాయల వద్దకు చేరింది.వెండి రేటు ఇలాబంగారం ధరలు పెరిగినా.. దాదాపు ఎప్పుడూ స్థిరంగా ఉండే వెండి రేటు ఈ రోజు రెండోసారి పెరిగింది. ఉదయం కేజీ రేటు 3000 పెరిగింది. ఇప్పుడు ఆ ధర రూ. 5000లకు చేరింది. అంటే ఉదయం నుంచి.. సాయంత్రానికే మరో 2000 రూపాయలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 2,15,000లకు చేరింది. -
రూ.2.40 లక్షలకు వెండి.. కొత్త ఏడాదిలో కష్టమే!
బంగారం ధర రూ. 1.30 లక్షలు (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) దాటితే.. కేజీ వెండి రేటు రూ. 2.13 లక్షలకు చేరింది. సిల్వర్ రేటు మరింత పెరిగి 2026కు సుమారు రూ. 2.40 లక్షలకు చేరుకుంటుందని స్టాక్ బ్రోకర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ కంపెనీ 'యాక్సిస్ సెక్యూరిటీస్' వెల్లడించింది.యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం.. వెండి రేటు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతూనే ఉంది. 2025 ప్రారంభంలో రూ. 80వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఇప్పుడు గణనీయంగా పెరిగి, రెండు లక్షల రూపాయలు దాటేసింది. దీనికి కారణం మార్కెట్లో వెండికి పెరుగుతున్న డిమాండ్ అని స్పష్టమవుతుంది.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం పెరగడం, దీంతో డిమాండ్ ఎక్కువ కావడం వల్ల కూడా సిల్వర్ రేటు ఊహకందని విధంగా పెరిగింది. సోలార్ ఫోటోవోల్టాయిక్ రంగంలో మాత్రమే వెండి వినియోగం నాలుగేళ్లలో రెండింతలు పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా వెండికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజు వెండి ధరలుడిసెంబర్ 14న రూ. 2.10 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. ఈ రోజు రూ. 2.13 లక్షలకు చేరింది. అంటే ఈ ఒక్క రోజులోనే సిల్వర్ టు రూ. 3000 పెరిగిందన్నమాట. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరులో సిల్వర్ రేటు ఒకేలా ఉన్నా.. ఢిల్లీలో మాత్రం కొంత తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి రేటు రూ. 2,00,900. దీన్నిబట్టి చూస్తే.. దేశంలో ఢిల్లీలోనే సిల్వర్ రేటు కొంత తక్కువని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం.. -
పీక్లో గోల్డ్, సిల్వర్: డీలా పడిన ప్లాటినం!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఊహకందని రీతిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు క్రాస్ చేయగా.. కేజీ వెండి రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రెండు కాకుండా ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం వంటి విలువైన లోహాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామందికి తెలిసిన లోహాలు గోల్డ్, సిల్వర్, ప్లాటినం మాత్రమే. పెట్టుబడిదారులకు పల్లాడియం గురించి తెలుసుంటుంది.ఇతర లోహాల సంగతి పక్కన పెడితే.. బంగారం వెండి ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి. ప్లాటినం ధరలు ఎందుకు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి?.. ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా పెరిశీలిద్దాం..బంగారం ధరలు పెరగడానికి కారణాలుద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాల కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం, డిమాండుకు తగ్గ.. బంగారం సరఫరా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణాలు అవుతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులలో.. లాభనష్టాలు ఉంటాయి. కానీ బంగారం పెట్టే పెట్టుబడి భద్రంగా ఉంటుందని భావిస్తారు. ఈ కారణంగానే పెట్టుబడిదారులు.. మార్కెట్స్ కుప్పకూలినప్పుడు గోల్డ్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.వెండి ధరలు పెరగడానికి కారణాలుఈ ఏడాది వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడం ఒక కారణం అయితే.. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీలలో వెండి వినియోగం పెరిగిపోవడం కూడా మరో కారణం. నీటి శుద్ధి, వైద్య రంగం, పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలలో కూడా వెండి వినియోగం విరివిగా ఉంది. ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలలో కూడా వెండిని ఉపయోగిస్తారు.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. వెండిని పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల.. సిల్వర్ రేటు రెండు లక్షల రూపాయలు దాటేసింది.ప్లాటినం ధరలు ఎందుకు తక్కువ?➤బంగారం, వెండితో పోలిస్తే.. ప్లాటినం ధరలు చాలా తక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.➤బంగారం, వెండి ఆభరణాలకు ఉన్నంత డిమాండ్.. ప్లాటినం ఆభరణాలు లేదు.➤ప్లాటినంపై పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువ➤ఇండస్ట్రీల్ వినియోగం ఎక్కువగా ఉంది.➤ప్లాటినం ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, రష్యాలలో మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.➤డిమాండ్ తక్కువగా ఉండటం వల్లనే.. ప్లాటినం ధరలు తక్కువగా ఉన్నాయి.ఇతర లోహాలుబంగారం, వెండి మాదిరిగానే.. ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం కూడా విలువైన లోహాలు. అయితే వీటికున్న డిమాండ్ భారతదేశంలో చాలా తక్కువ. ఈ కారణంగానే వీటి ధరలు కూడా అలాగే ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది. -
అతిపెద్ద ఆర్థిక పతనం వస్తోంది.. ఇది ఎనిమిదో పాఠం
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పతనం” దిశగా సాగుతోందని సోషల్ మీడియాలో వరుస పోస్ట్లు చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెబుతున్నారు. అందులోభాగంగా ఎనిమిదో పాఠాన్ని తాజాగా ‘ఎక్స్’లో పంచుకున్నారు.చరిత్ర చూడండి..ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.ఈ పరిణామాలు ప్రపంచాన్ని “రుణ ఆర్థిక వ్యవస్థగా” మార్చాయని, దీని ఫలితంగా అమెరికా జపాన్ వంటి దేశాలు భారీ రుణభారంతో సతమతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డునపడుతున్నారన్నారు.కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం వెండి విదేశాల్లో నిల్వ చేస్తానని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణెం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకొనే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుందని అన్నారు.ఫెడ్ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలంప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వ్నేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి లను “దేవుని సొమ్ము”గా.. బిట్కాయిన్, ఈథీరియంను “ప్రజల డబ్బు”గా కియోసాకి అభివర్ణించారు.ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా, సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని కియోసాకి పునరుద్ఘాటించారు. “వాళ్లే విజేతలు” అని, “ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది” అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు.స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడంలేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికివారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ, బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ, రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళన ఉన్న పలువురికి ఆయన సందేశం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. LESSON # 8: How you can get richer as the world economy collapses.CRASHES do not happen over night.CRASHES take decades to occur.For Example:Silver crashed in 1965: when the US government turned silver coins into fake coins…. Violating Greshams Law which stated when…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 10, 2025 -
17 లక్షల వెండి ఐటమ్లకు హాల్మార్కింగ్
వెండి ఆభరణాల నాణ్యతను ప్రామాణికంగా ధృవీకరించే దిశగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలో 17.35 లక్షల ఐటమ్లను హాల్మార్కింగ్ (హెచ్యూఐడీ) చేసినట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.ఈ ప్రక్రియలో భాగంగా భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రామాణిక మార్కుకి అదనంగా ప్రతి ఉత్పత్తిపై విశిష్టమైన ఆరు అంకెల కోడ్ను, సిల్వర్ అనే పదం, స్వచ్ఛత గ్రేడ్ వివరాలను ముద్రిస్తారని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.సదరు ఉత్పత్తి ప్రమాణాలను ధృవీకరించిన అసేయర్–హాల్మార్కింగ్ సెంటర్ని కూడా ట్రాక్ చేసేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. బీఐఎస్ కేర్ మొబైల్ యాప్లో హెచ్యూఐడీని ఎంటర్ చేసి హాల్మార్క్ గల వెండి ఆభరణాల ప్రామాణికతను వినియోగదారులు తక్షణం తెలుసుకోవచ్చు. -
వెండి మెరుపులు.. కారణాలు ఏమై ఉండొచ్చు?
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో పేదవాడి బంగారంగా పిలిచే వెండి ధరలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్దికాలంగా వెండి ధరలు ఎగబాకుతున్నాయి. ఈ అసాధారణ పెరుగుదలకు కారణం ఏమిటనే ప్రశ్నలొస్తున్నాయి. డిమాండ్కు సరిపడా వెండి సరఫరా కావడంలేదనే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు వెండిపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుందాం.ధరల పెరుగుదలకు కారణంవెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడమేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2022, 2023 సంవత్సరాల్లో వెండి సరఫరా కంటే డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు వరల్డ్ సిల్వర్ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొరత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.డిమాండ్ ఎందుకు పెరిగింది?బంగారం, వెండి రెండూ విద్యుత్ వాహకత, తుప్పు నిరోధకత, సులభంగా సాగే, రేకులుగా మలిచే గుణం వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా వీటి వినియోగం కేవలం పెట్టుబడులు లేదా ఆభరణాల తయారీకే పరిమితం కాకుండా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తోంది.ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీబంగారం అత్యుత్తమ విద్యుత్ వాహకాల్లో ఒకటి. తుప్పు పట్టదు కాబట్టి దీన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కనెక్టర్లు, స్విచ్లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులలోని కీలకమైన భాగాలలో దీర్ఘకాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధనఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్ల్లోని కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను రక్షించడానికి, విద్యుత్ ప్రసారం కోసం బంగారాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బంగారాన్ని పూతగా కూడా ఉపయోగిస్తారు.వైద్య పరికరాలుబంగారం జీవసంబంధితంగా స్థిరంగా ఉంటుంది (శరీరంలో సులభంగా చర్యలకు గురికాదు). తుప్పు పట్టదు. నాన్-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటికి ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సా పరికరాలు, అతిపెద్ద వైద్య ఇమేజింగ్ పరికరాల్లో బంగారాన్ని వాడుతున్నారు.నానోటెక్నాలజీబంగారు నానోపార్టికల్స్కు వైద్య రంగంలో మెరుగైన సామర్థ్యం ఉంది. వీటిని క్యాన్సర్ చికిత్స, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ (మందులను లక్షిత ప్రాంతానికి చేర్చడం), జీవసంబంధిత సెన్సార్ల (Biosensors) తయారీలో పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు.గ్లాస్, కిటికీలుకొన్ని భవనాల అద్దాలు, కిటికీలపై సన్నని బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. ఈ పూత వేడిని నిరోధించి, లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలుప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తి (Solar Energy) రంగంలో వెండి వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్లో విద్యుత్తును సేకరించి సరఫరా చేయడానికి వెండి పేస్ట్లను (Silver Paste) వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే కొన్ని రకాల బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు.ఎలక్ట్రానిక్స్, కండక్టర్లువెండి అత్యుత్తమ విద్యుత్ వాహకతను కలిగి ఉండటం వల్ల అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో సర్క్యూట్ బోర్డులు, స్విచ్లు, ఫ్యూజులు, కనెక్టర్లలో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా అధిక విశ్వసనీయత అవసరమయ్యే పరికరాలలో దీని వినియోగం తప్పనిసరి అవుతోంది.పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలువెండిని రసాయన పరిశ్రమల్లో ఉత్ప్రేరకాలుగా (Catalysts) వాడుతున్నారు. ఉదాహరణకు, ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తిలో (ఇది అనేక ప్లాస్టిక్ల తయారీలో ముఖ్యమైనది) ఇది ప్రముఖంగా ఉపయోగపడుతుంది.నీటి శుద్ధి, వైద్య రంగంవెండికి బలమైన యాంటీమైక్రోబియల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే) లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని నీటి శుద్ధి పద్ధతుల్లో, కొన్ని వైద్య ఉపకరణాలు, కట్టులు (Bandages) తయారీలో వాడుతున్నారు. ఆసుపత్రి పరికరాలపై క్రిమిసంహారక పూతగా కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.ఫొటోగ్రఫీసాంప్రదాయ ఫిల్మ్ ఫొటోగ్రఫీలో ఫిల్మ్, పేపర్పై కాంతిని గుర్తించడానికి వెండి హాలైడ్లను విస్తృతంగా వాడుతున్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీ రాకతో ఈ వినియోగం తగ్గినప్పటికీ ప్రత్యేక ఫొటోగ్రఫీ రంగాలలో ఇంకా ఉపయోగిస్తున్నారు.సరఫరా ఎందుకు లేదు?వెండి అనేది ఒక ఉప ఉత్పత్తి (By-product) లోహం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వెండిలో సుమారు 70% కంటే ఎక్కువ భాగం ప్రధానంగా రాగి, సీసం, జింక్, బంగారం వంటి ఇతర లోహాల మైనింగ్ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా లభిస్తుంది.ప్రధాన లోహాల మైనింగ్పై పెట్టుబడులు తగ్గడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉప ఉత్పత్తిగా లభించే వెండి పరిమాణం కూడా తగ్గిపోతుంది.వెండిని ప్రధానంగా ఉత్పత్తి చేసే గనుల్లో కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ భూమిలో ఉన్న వెండి శాతం (గ్రేడ్) తగ్గిపోతోంది. అంటే ఒకే పరిమాణంలో వెండిని పొందడానికి ఎక్కువ ఖర్చుతో అధిక మట్టిని తవ్వాల్సి వస్తుంది.ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెండిని తిరిగి తీయడం (రీసైక్లింగ్) ఖర్చుతో కూడుకుంది. దీని వల్ల మొత్తం సరఫరాపై ఇది పెద్దగా ప్రభావం చూపడం లేదు.వెండి కేవలం సంప్రదాయ ఆభరణాల లోహం కాకుండా ఆధునిక సాంకేతికతకు, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్కు కీలకమైన పారిశ్రామిక ముడిసరుకుగా మారింది. సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి భవిష్యత్తు సాంకేతికతలపై పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా దీనికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో మైనింగ్ నుంచి లభించే సరఫరా పరిమితంగా ఉండటం వల్ల డిమాండ్ - సరఫరా మధ్య అంతరం మరింత అధికమవుతోంది. ఈ అసమతుల్యతే వెండి ధరలను పెంచేందుకు దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రభుత్వ పథకాలు -
'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచం పేదరికంలో ఉన్నప్పుడు మీరు ధనవంతులు కావచ్చు'' అని వెల్లడించారు.''జపాన్ క్యారీ ట్రేడ్ ముగిసింది. బబుల్ మార్కెట్లు తగ్గబోతున్నాయి. నా మంత్రానికి కట్టుబడి.. బంగారం, వెండి, బిట్కాయిన్ & ఎథెరియం కొనండి. గ్లోబల్ మార్కెట్స్ కుప్పకూలిపోతున్నప్పుడు ఎలా ధనవంతులు కావాలో నేను రాబోయే ట్వీట్లలో వెల్లడిస్తాను. అవును: ప్రపంచం పేదరికంలో ఉన్నప్పుడు మీరు ధనవంతులు కావచ్చు. జాగ్రత్త వహించండి.'' అని రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఇదీ చదవండి: కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనవంతులయ్యే మార్గాలుకియోసాకి ప్రకారం.. తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే.. జపాన్ క్యారీ ట్రేడ్ ఇప్పుడు పనిచేయడం తగ్గిపోతోంది. దీని ప్రభావంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడుతుందని, బంగారం, వెండి వంటివాటితో పెట్టుబడి పెట్టండి. స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం ఏర్పడినా.. ప్రపంచం పేదరికంలో ఉన్నా.., మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు.Japan “Carry Trade” ended.Watch out below. Bubble Markets about to deflate.Standing by my mantra…buy gold, silver, Bitcoin, and Ethereum.More recommendations on how to get rich while world collapses will follow in future Tweets.Yes: you can get richer while world gets…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 29, 2025 -
వెండికి హాల్మార్కింగ్.. వజ్రాభరణాలపై ఫ్రేమ్వర్క్
బంగారు ఆభరణాలకు హాల్మార్కింగ్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. విలువైన లోహాల స్వచ్ఛతను ధ్రువీకరించేలా దాని పరిధిని విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా వెండి ఆభరణాలకు కూడా హాల్మార్కింగ్ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా సహజ, ల్యాబ్ గ్రోన్ డైమండ్ల మధ్య వ్యత్యాసాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయడానికి, ఈ విభాగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఒక ఫ్రేమ్వర్క్ను కూడా ప్రభుత్వం తీసుకురానుంది.వెండికి హాల్మార్కింగ్జూన్ 2021 నుంచి బంగారు ఆభరణాలకు తప్పనిసరి అయిన హాల్మార్కింగ్ వెండి ఆభరణాల కోసం సెప్టెంబర్ 1, 2025 నుంచి స్వచ్ఛందంగా ప్రవేశపెట్టబడింది. అయితే దీన్ని రానున్న రోజుల్లో తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఇటీవల సీఐఐ నిర్వహించిన రత్నాలు, ఆభరణాల సదస్సులో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ.. బంగారు హాల్మార్కింగ్కు పరిశ్రమ, వినియోగదారుల నుంచి లభించిన సానుకూల స్పందన ప్రభుత్వాన్ని ప్రోత్సహించిందని తెలిపారు. ‘వెండి హాల్మార్కింగ్ను స్వచ్ఛందంగా చేయడం ద్వారా దాని ఫలితం, ప్రజల స్పందన ఎలా ఉందో పరిశీలిస్తున్నాం. వెండి ఆభరణాలను సైతం ధరించే మన దేశంలోని వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల విశ్వసనీయతను నిర్ధారించడం చాలా ముఖ్యం’ అని ఖరే అన్నారు. వెండి హాల్మార్కింగ్ను తప్పనిసరి చేయడానికి ముందు పరిశ్రమ ప్రతిస్పందనకు తగినంత సమయం ఇస్తున్నామని వివరించారు.తప్పనిసరి హాల్మార్కింగ్(బంగారానికి) ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 57.17 కోట్ల బంగారు ఆభరణాలకు హాల్మార్క్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 8.44 కోట్ల వస్తువులకు హాల్మార్క్ వేసినట్లు పేర్కొన్నారు.బీఐఎస్ పరిధిలో..బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో ఈ హాల్మార్కింగ్ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా ఆభరణాల వ్యాపారులు, 65 లైసెన్స్ పొందిన రిఫైనర్లు బీఐఎస్లో నమోదు చేసుకున్నారు. అస్సేయింగ్ హాల్మార్కింగ్ సెంటర్ల (AHL) విస్తరణను కూడా ప్రభుత్వ పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా 1,603 బీఐఎస్ గుర్తింపు పొందిన ఏహెచ్ఎల్లు, 109 ఆఫ్ సైట్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే ఈ కేంద్రాల్లో దేన్నీ ప్రభుత్వం నిర్వహించకపోవడం గమనార్హం.ల్యాబ్ గ్రోన్ డైమండ్లపై పారదర్శకతసాంకేతికత అభివృద్ధి చెందడంతో ల్యాబ్ గ్రోన్ డైమండ్లు వాణిజ్యపరంగా లాభదాయకంగా మారాయి. అయితే, సహజ వజ్రాల కంటే అవి చౌకగా ఉన్నందున వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి పారదర్శకతను నిర్ధారించేలా ఫ్రేమ్వర్క్ అవసరమని ఖరే నొక్కి చెప్పారు. పరిశ్రమపై భారం పడకుండా పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(GJEPC), ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి? -
సిల్వర్ ఈటీఎఫ్ల మెరుపులు
’’అలుపెరుగకుండా పరుగుతీస్తున్న బంగారం బాటలోనే వెండిలో కూడా పెట్టుబడులు చేపట్టేందుకు మూడేళ్ల క్రితం దేశీయంగా ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ప్రొడక్టు (ఈటీపీ)లకు తెరతీశారు. వీటిలో ఈటీఎఫ్లు ప్రధాన భాగం. దీంతో 2022లో వెండి ఈటీఎఫ్లు ఊపిరిపోసుకున్నాయి. తొలి దశలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంగా ఇవి జోరందుకున్నాయి. దీంతో 2007లోనే ప్రారంభమైన పసిడి ఈటీఎఫ్లను వెనక్కి నెడుతూ వెండి ఈటీఎఫ్లు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహా లు బంగారం, వెండిలో పెట్టుబడులకు వీలుగా రూపొందించిన ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు)కు ఆదరణ పెరుగుతోంది. ప్రపంచ దేశాలలో బంగారం వినియోగంలో భారత్, చైనాలు టాప్ ర్యాంకులో నిలుస్తుంటే.. వస్తురూపేణా (ఫిజికల్) వెండి కొనుగోళ్లకు సైతం భారత్ రెండో ర్యాంకులో నిలుస్తోంది. దేశీయంగా ఇటీవల ఈటీఎఫ్ల ప్రవేశంతో ప్రధానంగా వెండిలో పెట్టుబడులు అధికమయ్యాయి.పసిడి ధరల ర్యాలీతో పోలిస్తే కొద్ది నెలలుగా వెండి వెనుకబాటు దీనికి కారణమైనట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల కొద్ది నెలలుగా సౌర విద్యుదుత్పత్తితోపాటు.. ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్ వాహన తయారీ, వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ వెండి ధరలకు జోష్నివ్వనున్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశాయి. ఫలితంగా ఇటీవల వెండిలో ఫిజికల్ కొనుగోళ్లు, ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు వివరించాయి. 200 శాతం జూమ్ 2022తో పోలిస్తే సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 200 శాతం దూసుకెళ్లాయి. న్యూయార్క్ సిల్వర్ ఇన్స్టిట్యూట్ వివరాల ప్రకారం ఈ కాలంలో దేశీ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 18 రెట్లు ఎగశాయి. ఈ బాటలో గత 18 నెలల్లో పెట్టుబడులు భారీగా జంప్చేశాయి. తాజాగా వెండి హోల్డింగ్స్ 5.8 కోట్ల ఔ న్స్లు (1,800 టన్నులు)ను దాటాయి. 2024 చివరితో పోలిస్తే ఇది 51 శాతం అధికం! పెట్టుబడుల దూకుడు మూడేళ్ల క్రితం(2022 తొలి త్రైమాసికం) వెండి ఈటీఎఫ్లు ప్రవేశపెట్టినప్పుడు హోల్డింగ్స్ 2.1 మిలియన్ ఔన్స్లు (65 టన్నులు) మాత్రమే. తదుపరి పెట్టుబడులు ఊపందుకోవడంతో 2024 చివరి క్వార్టర్కల్లా 3.8 కోట్ల ఔన్స్ల (1,183 టన్నులు)కు చేరాయి. ఇది వార్షికంగా 200 శాతం వృద్ధికాగా.. ఒక్క 2024లోనే 2.51 కోట్ల ఔన్స్ల (782 టన్నులు) పెట్టుబడులు జత కలిశాయి. ఆపై వెండి ఈటీఎఫ్లు మరింత జోరందుకున్నాయి. పసిడి వెనుకడుగు వెండి ఈటీఎఫ్లతో పోలిస్తే ఇన్వెస్టర్లు పసిడి ఈటీఎఫ్లలో పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇందుకు బంగారం కాయిన్లు, ఆభరణాల(ఫిజికల్) కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభావం చూపుతోంది. ఫలితంగా 2007లో ప్రారంభమైన గోల్డ్ ఈటీఎఫ్ల హోల్డింగ్స్ 2 మిలియన్ ఔన్స్ల(64 టన్నులు)కు చేరినట్లు తెలియజేశాయి. 2024లో గోల్డ్ ఈటీఎఫ్లలో కేవలం 0.5 మిలియన్ ఔన్స్లు(15 ట న్నులు) జమయ్యాయి. అయితే 2024కల్లా గత నాలుగేళ్ల కాలంలో ఇవి 27.4 టన్నుల నుంచి 54.5 టన్నులకు పుంజుకున్నాయి. 2025లో కొనుగోళ్లు మరింత పెరిగాయి. కాగా.. ఈ ఏడాది(2025)లో ఇప్పటివరకూ వెండి ధరలు 75 శాతం దూసుకెళ్లగా.. పసిడి 55 శాతం బలపడిన విషయం విదితమే.పసిడి రూ. 3,500 జూమ్⇒ ఢిల్లీలో రూ. 1,28,900కి గోల్డ్ ⇒ వెండి కూడా రూ. 5,800 అప్ న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి పరు గు తీశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం 99.9% స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ. 3,500 పెరి గి రూ. 1,28,900కి చేరింది. వెండి ధర కూడా కిలోకి రూ. 5,800 పెరిగి రూ. 1,60,800కి చేరింది. మరోవైపు, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ పసిడి కాంట్రాక్టు ధర రూ. 1,458 ఎగిసి ఒక దశలో రూ. 1,25,312 వద్ద ట్రేడయ్యింది. వెండి కూడా రూ. 2,583 మేర ఎగిసి రూ. 1,57,065 వద్ద ట్రేడయ్యింది. న్యూయార్క్ కామెక్స్లో పసిడి డిసెంబర్ కాంట్రాక్టు ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 47.8 డాలర్లు పెరిగి 4,142 డాలర్ల స్థాయిని తాకింది. సిల్వర్ ఫ్యూచర్స్ రేటు 1.94 శాతం పెరిగి 51.30 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
ఇంతలా పెరిగితే కొనేదెలా?: లేటెస్ట్ గోల్డ్ రేట్స్ ఇలా..
నవంబర్ నెల ముగుస్తున్న తరుణంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఈ రోజు (మంగళవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2190 పెరిగింది. దీంతో దేశంలో ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కిరీటం గెలుపొందితే సరిపోదు..ఆ బాధ్యతలు కూడా చేపట్టాలి!
నవంబర్21, 2025న మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది ఫాతిమా బాష్. ఆ కిరీటం తోపాటు పూర్వీకులు(ఇంతకుమునుపు ఆ కీరిటం గెలుపొందినవారు) నెరవేర్చిన బాధ్యతలను సైతం స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఆమె ఇన్స్టాగ్రామ్తో నీలిరంగు దుస్తులతో ఆ కిరీటం తోపాటు వెండి రంగు రిబ్బన్ కూడా ధరించి. ఇంతకీ ఇది దేనికి సంకేతం, దాని ప్రాముఖ్యత ఏంటంటూ అంత తెగ వెతికేస్తున్నారు. మరి అదెంటో తెలుసుకుందామా..!.సెలబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు ధరించే ముడివేసిన రిబ్బన్ దేనికోసం నిలబడుతున్నారనేది తెలుపుతుంది. ఎరుపు రంగు ఎయిడ్స్, గుండెజబ్బుల అవగాహనను సూచిస్తుంది. అదే గులాబీ రంగు రిబ్బన్ రొమ్ము కేన్సర్ని సూచిస్తుంది. ఇక పసుపు ఆత్మహత్య నివారణను సూచిస్తుంది. అలా ఇలా కాకుండా సిల్వర్ కలర్ ధరించిన ఫాతిమా దేనికోసం కృషి చేసింది, ఏ అంశంపై అవగాహన కల్పిస్తుంది అంటే..వెండి రిబ్బన్ ప్రాముఖ్యత..మిస్ యూనివర్స్ ఫాతిమా బాష్ ధరించిన వెండి రిబ్బన్ స్కిజోఫ్రెనియా, పార్కిన్సన్స్, డైస్లెక్సియాతో సహా మెదడు వ్యాధులు, రుగ్మతలు, వెకల్యాలకు మద్దతును సూచిస్తుంది. ఆరోగ్య సమస్యల చుట్టూ ఉన్న కళంకాన్ని తొలగించి, పరిశోధన, మద్దతు కోసం తన ఫాలోవర్లుకు అవగాహన కల్పించేలా ప్రభావితం చేసేందుకు ఆ రిబ్బన్ని ధరించారామె. అదే ఎందుకంటే..ఫాతిమా బాస్ పాఠశాలలో ఉన్నప్పుడు డిస్లెక్సియా ADHDతో ఇబ్బంది పడినందున ఆమె ముడి వేసిన వెండి రిబ్బన్ను ధరించి కనిపించింది.ఇక ఆమెక చదవు అంటే మహా ఇష్టం. ఆ అభిరుచితోనే జస్ట్ 16 ఏళ్లకే యూఎస్ వెళ్లింది. ఆమె తన కెరీర్ని పూర్తిగా ఫ్యాషన్కే అంకితం చేసింది. అలాగే కేన్సర్తో పోరాడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా కూడా పనిచేస్తుంది. వీక్ ఆఫ్ సమయాల్లో వార్షిక టోయ్ డ్రైవ్ని నిర్వహిస్తుందట View this post on Instagram A post shared by Fatima Bosch (@fatimaboschfdz) (చదవండి: పిల్లలు నాకే పుట్టారా?.. డీఎన్ఏ టెస్టుల కలకలం) -
‘క్రాష్ మొదలైంది.. బంగారం, వెండి కొనుగోలుకిదే సమయం’
పెట్టుబడులు, ఆర్థిక విషయాలపై ఎప్పకప్పుడు వ్యాఖ్యానించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో హెచ్చరికను జారీ చేశారు. "చరిత్రలో అతిపెద్ద క్రాష్" ప్రారంభమైందంటూ సోషల్ ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.2013లో తాను ప్రచురించిన పుస్తకం రిచ్ డాడ్స్ ప్రొఫెసీని ప్రస్తావిస్తూ దశాబ్దం క్రితం తాను అంచనా వేసిన ప్రపంచ మాంద్యం ఇప్పుడు బయటపడుతోందని, ఇది ఒక్క అమెరికాను మాత్రమే కాకుండా యూరప్, ఆసియాను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వేగవంతమైన పురోగతి ఉద్యోగాలను ఊడ్చేస్తుందని, ఇది జరిగితే వాణిజ్య, నివాస రియల్ ఎస్టేట్ రెండింటిలోనూ భారీ పతనం తప్పదని రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) నమ్ముతున్నారు.బంగారం, వెండి.. కొనాల్సిందిప్పుడే.. తన దీర్ఘకాల పెట్టుబడి అభిప్రాయాలను పునరుద్ఘాటిస్తూ, కియోసాకి బంగారం (Gold), వెండి, బిట్ కాయిన్, ఎథేరియం హోల్డింగ్స్ ను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తన ఫాలోవర్లకు సూచించారు. ముఖ్యంగా ఈ పరిస్థితిలో వెండి కొనడం ఉత్తమం, సురక్షితమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఔన్స్కు 50 డాలర్ల వద్ద ఉన్న వెండి (Silver Price) త్వరలో 70 డాలర్లకి పెరుగుతుందని, 2026 నాటికి అయితే 200 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.ఇది చదివారా? బిట్కాయిన్ క్రాష్: కియోసాకి షాకింగ్ ప్రకటనధనవంతులవుతారు!"శుభవార్త ఏమిటంటే, లక్షలాది మంది తమ సంపదను పోగుట్టుకుంటున్నా... మీరు సిద్ధంగా ఉంటే... ఈ క్రాష్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది"అని కియోసాకి రాసుకొచ్చారు. ఈ క్రాష్ నుంచి సంపన్నులు అయ్యేందుకు మరిన్ని మార్గాలను రానున్న ట్వీట్లలో వివరిస్తానన్నారు.BIGGEST CRASH IN HISTORY STARTINGIn 2013 I published RICH DADs PROPHECY predicting the biggest crash in history was coming.Unfortunately that crash has arrived.It’s not just the US. Europe and Asia are crashing.AI will wipe out jobs and when jobs crash office and…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 23, 2025 -
లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలు
ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే.. తప్పకుండా పొదుపు చేయాలి. ఈ పొదుపును సరైన మార్గంలో పెట్టుబడిగా పెడితే.. ఊహకందని లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్, రియల్ ఎస్టేట్ వంటి చాలామార్గాలు ఉన్నాయి.ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చేది అనే విషయాన్ని వెల్త్ మోజో.. తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి, ఈరోజు దాని విలువ సుమారుగా..నిఫ్టీ 50: రూ. 1.8 లక్షలునిఫ్టీ నెక్స్ట్ 50: రూ. 2.2 లక్షలుమిడ్క్యాప్ ఇండెక్స్: రూ. 2.7 లక్షలుస్మాల్ క్యాప్ ఇండెక్స్: రూ. 3.1 లక్షలుబంగారం: రూ. 1.9 లక్షలువెండి: రూ. 2.0 లక్షలుఫిక్స్డ్ డిపాజిట్: రూ. 1.35 లక్షలురియల్ ఎస్టేట్: రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.25 లక్షలుబిట్కాయిన్: రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలుదీన్నిబట్టి చూస్తే ఐదు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి.. ఇప్పుడు సుమారు రూ. 2 లక్షలు వస్తుందన్నమాట. అంటే లక్ష రూపాయలకు, మరో లక్ష లాభం. కాగా బంగారం వెండి ధరలు కూడా ఐదేళ్లలో ఊహకందని రీతిలో పెరిగాయి.ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..If you had invested ₹1,00,000 five years ago, here’s what it would roughly be worth today:📊 Nifty 50: ~₹1.8L🚀 Nifty Next 50: ~₹2.2L📈 Midcap Index: ~₹2.7L🔥 Smallcap Index: ~₹3.1L🪙 Gold: ~₹1.9L🥈 Silver: ~₹2.0L🏦 Fixed Deposit: ~₹1.35L🏢 REITs/InvITs:…— Wealthmojo™ (@wealthmojo1) November 18, 2025 -
అంతలోనే ఇంత తేడానా.. మారిపోయిన బంగారం, వెండి ధరలు!
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియుల మదిలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ రోజు (నవంబర్ 13) ఉదయమే గరిష్టంగా రూ. 2290 పెరిగిన 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 3110కు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికే.. బంగారం రేటు రూ. 820 పెరిగింది. వెండి ధర కూడా కేజీపై మరో రూ. 1000పెరగడంతో.. రూ. 1.83 లక్షలకు చేరింది.రూ.10 వేలు పెరిగిన వెండిగురువారం ఉదయం వెండి రేటు రూ. 9000 పెరిగింది. సాయంత్రానికి మరో 1000 రూపాయలు పెరగడంతో.. మొత్తం రూ. 10,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు ఈ రోజు రూ. 1,83,000 వద్దకు చేరింది. గత వారంలో స్థిరంగా ఉన్న వెండి రేటు మళ్లీ పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతోంది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టదని స్పష్టమవుతోంది.బంగారం ధరలు ఇలాఇక బంగారం ధరల విషయానికి వస్తే.. అసలే విపరీతంగా పెరుగుతున్న పసిడి ధర ఇప్పుడు రోజుకు రెండు సార్లు పెరగడంతో.. కొనుగోలుదారులలో ఆందోళన కలుగుతోంది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రస్తుతం.. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 2850 పెరిగి రూ. 1,17,900 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 3110 పెరిగి రూ. 1,24,620 వద్దకు చేరింది.చెన్నైలో కూడా గోల్డ్ రేటు సాయంత్రానికే తారాస్థాయికి చేరింది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3260 పెరిగి రూ. 1,29,820 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 3000 పెరిగి రూ. 1,19,000 వద్దకు చేరింది.ఇదీ చదవండి: వెండి ధర అక్కడికి!.. కియోసాకి ట్వీట్చివరగా దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 2850 పెరిగి రూ. 118050 వద్దకు చేరగా.. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 3110 పెరిగి.. రూ. 128770కు చేరింది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా బంగారం ధరలు సాయంత్రానికే తారుమారయ్యాయి.నిపుణులు ఏం చెబుతున్నారంటే?బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. బంగారం సురక్షితమైన ఆస్తి కాబట్టి ఎక్కువమంది పెట్టుబడి పెట్టడం లేదా కొనుగోలు చేయడంతో పసిడికి డిమాండ్ పెరిగిపోయింది. వెండిని ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగాల్లో కూడా విరివిగా ఉపయోగించడం వల్ల దీని ధర కూడా అమాంతం పెరిగిపోయింది. సిల్వర్ రేటు పెరుగుతుంది.. ధర పెరగకముందే కోనేయండి అంటూ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సైతం చెబుతున్నారు. -
‘పేదల బంగారం’పైనా లోన్లు.. ఎప్పటి నుంచంటే..
ఆర్థికంగా అత్యవసరం తలెత్తినప్పుడు బంగారం ఉంటే అక్కరకువస్తుంది. బ్యాంకులు, ఇతర సంస్థల్లో తాకట్టు పెట్టి లోన్ పొందవచ్చు. ఈ కారణంతోనే చాలామంది మధ్య తరగతి వాళ్లు కూడా తమ స్తోమతకు మించి బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే మరి పేద, సామాన్య ప్రజల దగ్గర బంగారు ఆభరణాలు, వస్తువులు ఉండవు. ఏదో కొద్దో గొప్పో వెండి ఆభరణాలు, వస్తువులు ఉంటే ఉంటాయి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాటిపై లోన్లు ఎవరూ ఇవ్వరు కదా.. అని ఇన్నాళ్లు బాధపడిఉంటారు. ఇకపై ఆ బాధ అక్కర్లేదు. పేదల బంగారంగా భావించే వెండిపైనా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇవ్వనున్నాయి.వెండిపై రుణాలకు సంబంధించి వాణిజ్య బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు రుణ మార్గదర్శకాలను ఆర్బీఐ సవరించింది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుండి వెండి ఆభరణాలు, వస్తువులు లేదా నాణేలను తాకట్టు పెట్టి రుణాలను పొందవచ్చు. పేదలు, సామాన్యులకు రుణ లభ్యతను మెరుగుపరచడానికి ఆర్బీఐ ఈ మార్పులు చేస్తోంది. అయితే ప్రాథమిక వెండి అంటే ఆభరణాలు, వినియోగ వస్తువులు కాకుండా వాణిజ్యానికి ఉపయోగించే వెండి బార్లపై మాత్రం ఈ రుణ సదుపాయం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.అయితే బంగారంపై ఇచ్చినట్లుగా దాటి రేటు ఆధారంగా అధిక మొత్తంలో రుణాలు వెండిపై ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. వెండికి ఉన్న అధిక అస్థిరత, తక్కువ లిక్విడిటీ కారణంగా లోన్-టు-వాల్యూ నిష్పత్తులు, వడ్డీ రేట్లకు సంబంధించి వెండిపై రుణాలు బంగారు రుణాలతో పోల్చితే భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల బ్యాంకులు, రుణ సంస్థలు వెండి-ఆధారిత రుణాలపై తక్కువ క్రెడిట్ పరిమితులను, కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను నిర్ణయించవచ్చు. తాకట్టు పెట్టిన వెండి స్వచ్ఛత, నిల్వ, బీమా ఖర్చులు, తిరిగి చెల్లింపు షెడ్యూల్, జప్తు నిబంధనలతో సహా కారకాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని రుణగ్రహీతలకు ఆర్బీఐ సూచించింది. -
వెండి ధర అక్కడికి!.. కియోసాకి ట్వీట్
మార్కెట్లో కేవలం బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ నెలలో రూ. 2 లక్షలు దాటేసిన వెండి రేటు.. గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. ఈ రోజు (నవంబర్ 10) ఒకేసారి 4000 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 1.69 లక్షలకు చేరింది. ఈ తరుణంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు.రాబర్ట్ కియోసాకి వెండి ధరలు పెరుగుతాయనే.. నేపథ్యంలో ట్వీట్ చేశారు. సిల్వర్ 50 డాలర్లు దాటేసింది. నెక్స్ట్ స్టాప్ 70 డాలర్లు అని వెల్లడించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు.. కియోసాకి చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించారు.SILVER over $50.Next stop $70?— Robert Kiyosaki (@theRealKiyosaki) November 10, 2025భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా.. వెండిని కేవలం ఆభరణాలు, అలంకార సామాగ్రిగా మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ ఇప్పుడు కీలకంగా మారింది.ఇదీ చదవండి: విజయ్ మాల్యా సామ్రాజ్యం: దివాలా తీసిందిలా..వెండిని పారిశ్రామిక రంగాల్లో కూడా వినియోగిస్తున్న కారణంగా.. సిల్వర్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది. దీనివల్ల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది లక్ష రూపాయల కంటే తక్కువ ధర ఉన్న వెండి.. నేడు రూ. 1.69 లక్షలకు చేరిందంటే.. దీనికి ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..
పండుగ సీజన్, డాలర్ విలువ తగ్గడం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం వంటి కారణాల వల్ల ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం గోల్డ్ రేటు స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తోంది. వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. డిసెంబర్ నెలలో పసిడి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ప్రపంచ ఆర్థిక పరిణామాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోదీ అన్నారు. అమెరికా ఫెడ్ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత.. బంగారం 4000 డాలర్ల మార్కు దగ్గర కదలాడాయి. డిసెంబర్లో కూడా ఫెడ్ రేటు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బంగారం ధర తగ్గే సూచనలు ఉన్నాయని ఆయన అన్నారు.చైనాలో, బంగారు రిటైలర్లకు వ్యాట్ ఆఫ్సెట్లను తొలగించడం, మినహాయింపులను 13 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడం వలన ప్రధాన బ్యాంకులు కొత్త రిటైల్ ఖాతాలను స్తంభింపజేయడానికి దారితీశాయి. ఇది ప్రపంచంలోని అగ్ర బంగారు మార్కెట్లో డిమాండ్ను తగ్గించే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో అమెరికా తన కీలకమైన ఖనిజాల జాబితాలో యురేనియం, రాగి, వెండిని కూడా చేర్చింది. కాబట్టి గోల్డ్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది.నేటి బంగారం, వెండి ధరలు ఇలా..నవంబర్ 10న మన దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,23,220 వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,950 వద్ద ఉన్నాయి. మొత్తం మీద ఈ నెల (నవంబర్) ప్రారంభం నుంచి గోల్డ్ రేటు తగ్గుతూ.. పెరుగుతూ ఉందని స్పష్టమవుతోంది.వెండి ధరల విషయానికి వస్తే.. ఈ రోజు (సోమవారం) సిల్వర్ రేటు రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 1.67 లక్షలకు చేరింది. అంటే ఒక గ్రామ్ వెండి రేటు 167 రూపాయల దగ్గర ఉంది. గత నెలలో రూ. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర.. ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ ఉంది.ఇదీ చదవండి: బంగారం: ఇప్పుడు కొనాలా.. ఇంకొన్ని రోజులు వేచి చూడాలా? -
బంగారం ‘కొండంత’ లక్ష్యంతో కొంటున్నా: కియోసాకి
ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. రాబోయే మార్కెట్ క్రాష్ గురించి మరోసారి అలారం మోగించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం వంటి హార్డ్ ఆస్తులపై తన బుల్లిష్ దృక్పథాన్ని మరింత రెట్టింపు చేశారు.తాజాగా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టారు. యూఎస్ రుణం, ద్రవ్య విధానం, ఫెడరల్ రిజర్వ్పై తన అభిప్రాయాలను పంచుకుంటూ ట్రెజరీ ముద్రించినది "నకిలీ డబ్బు" అని అభివర్ణించారు. తాను బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం ఆస్తులను ఎందుకు అమ్మడం లేదు.. ఇంకా కొంటున్నాడో వివరించారు.కియోసాకి అంచనాలో భవిష్యత్తులో బంగారం ఔన్సుకు 27,000 డాలర్లకు చేరుకుంటుంది. బిట్ కాయిన్ 2026 నాటికి 250,000 డాలర్లకు పెరుగుతుంది. వెండి 100 డాలర్లకు చేరుతుంది. ఇక ఎథేరియం 60,000 డాలర్లను తాకుతుంది. యు.ఎస్. ప్రభుత్వం రుణ భారాన్ని విస్తరించడం కొనసాగిస్తున్నందున ఈ ఆస్తులు సాంప్రదాయ పొదుపును అధిగమిస్తాయని రాసుకొచ్చారు.తాను గ్రేషమ్, మెట్కాఫ్ల డబ్బు నియమాలను అనుసరిస్తానని చెప్పొకొచ్చారు. "దురదృష్టవశాత్తు, యు.ఎస్. ట్రెజరీ, ఫెడ్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. తమ బిల్లులు చెల్లించడానికి నకిలీ డబ్బును ముద్రిస్తున్నాయి. ఫెడ్, ట్రెజరీ చేస్తున్నది మనం చేస్తే జైలులో ఉంటాం " అన్నారు.‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద అప్పులున్న దేశంగా నిలుస్తోంది. అందుకే "పొదుపు చేసేవారు నష్టపోతారు" అని నేను చాలాకాలంగా హెచ్చరిస్తున్నా’ అన్నారు. అందుకే బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథీరియంలను అవి క్రాష్ అయినప్పుడు కూడా కొంటున్నానని వివరించారు.CRASH COMING: Why I am buying not selling.My target price for Gold is $27k. I got this price from friend Jim Rickards….and I own two goldmines.I began buying gold in 1971….the year Nixon took gold from the US Dollar.Nixon violated Greshams Law, which states “When fake…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 9, 2025 -
భవిష్యత్తు బంగారు లోహం!
ఏడాది కాలంగా బంగారం, వెండి ధరలు అసాధారణ రీతిలో దూసుకుపోతున్నాయి. ధరల ర్యాలీతో సంతోషిస్తున్న పెట్టుబడిదారులు ఇప్పుడు కీలక దశలో ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా.. లేదా అనే అనుమానం వ్యక్తం కావడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో కామొడిటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కాపర్(రాగి) ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు. పారిశ్రామిక డిమాండ్, సరఫరా కొరత కారణంగా కాపర్ ధరలు సైతం కొంతకాలంగా పెరుగుతున్నాయి. దాంతో కాపర్ ‘భవిష్యత్తు బంగారం’(లాభాల పరంగా)గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాపర్ ధరలు గడచిన ఏడాది కాలంలో దాదాపు 25 శాతం పెరిగాయని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం కేజీ కాపర్ ధర సుమారు రూ.750గా ఉంది. ఇది 2026లో రూ.1500-రూ.1800 వరకు పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.అసలు బంగారం, వెండి ధరలు ఎందుకు పెరిగాయి?బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ అంశాలు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం చూస్తారు. చరిత్రలో బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేసే సాధనంగా ఉంది. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు అధికమయ్యాయి.అనేక దేశాల కేంద్ర బ్యాంకులు భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో తమ నిల్వలను పెంచుకోవడానికి భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశాయి.సాధారణంగా యూఎస్ డాలర్ విలువ తగ్గినప్పుడు డాలర్ ఆధారిత బంగారం ఇతర కరెన్సీలు ఉన్న కొనుగోలుదారులకు చౌకగా మారుతుంది. తద్వారా డిమాండ్ పెరుగుతుంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో సంక్షోభం వంటి సంఘటనలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పెట్టుబడిదారులు భద్రంగా ఉండే బంగారం వైపు మళ్లారు.ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వంటి పరిశ్రమల నుంచి వెండికి పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుంది.కాపర్ (రాగి) ధరల పెరుగుదలకు కారణాలు..ఒకప్పుడు కేవలం పారిశ్రామిక లోహంగా మాత్రమే పరిగణించబడిన కాపర్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మెటల్గా మారుతుంది. కొన్ని నివేదికల ప్రకారం కాపర్ లోహం గత రెండు దశాబ్దాల్లో దాదాపు 700 శాతం పెరిగింది. ఇది పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా గనుల్లో ఉత్పత్తి సమస్యలు, స్థానిక ఆందోళనలు, కొత్త గనుల అభివృద్ధిలో జాప్యం కారణంగా కాపర్ సరఫరా గణనీయంగా తగ్గింది. దీనికి తోడు పెరిగిన డిమాండ్ ధరలను మరింత పెంచింది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుండడం, భారీ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, భవన నిర్మాణ రంగం నుంచి కాపర్కు డిమాండ్ బలపడుతోంది.భవిష్యత్తు అంచనామార్కెట్ నిపుణులు, మైనింగ్ దిగ్గజాలు రాగిని ‘తదుపరి బంగారం’గా పేర్కొంటున్నారు. కాపర్ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలు: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక సంప్రదాయ కారు కంటే ఒక ఎలక్ట్రిక్ కారుకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ కాపర్ అవసరం అవుతుంది. ఈవీల అమ్మకాలు పెరిగే కొద్దీ కాపర్ డిమాండ్ అపారంగా పెరుగుతుంది.క్లీన్ ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన వనరుల్లో ముఖ్యంగా సోలార్, పవన విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణకు కాపర్ అవసరం అనివార్యం. కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థల్లో రాగి కీలకమైన లోహం.డిజిటలైజేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, 5G టెక్నాలజీ, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో కాపర్కు డిమాండ్ పెరుగుతోంది.కాపర్ వినియోగించే పరిశ్రమలుపరిశ్రమవినియోగంవిద్యుత్, ఎలక్ట్రానిక్స్వైర్లు, కేబుల్స్, మోటార్లు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (PCBs)నిర్మాణ రంగం హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, పైపులు, రూఫింగ్రవాణాఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రైల్వేలు, విమానయాన రంగంపునరుత్పాదక శక్తిసోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, బ్యాటరీలుపారిశ్రామిక యంత్రాలుఉష్ణ మాపకాలు(Heat Exchangers), పంపులుగమనిక: పెట్టుబడికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పనిసరని గమనించాలి.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే.. -
ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!
భారతదేశంలో బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగి, అక్టోబర్ నెలలో రూ. 2 లక్షలకు (కేజీ) చేరుకుంది. అయితే నేడు (నవంబర్ 4) సిల్వర్ రేటు రూ. 1.65 లక్షల వద్ద ఉంది. అంటే ఏ స్థాయిలో వెండి రేటు తగ్గిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ.. వెండి ధరలు భవిష్యత్తులో భారీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.భారీగా పెరిగిన వెండి ధరలు, కొనుగోలుదారులను కొంత కలవరపెట్టినా.. ఇటీవల కొంత తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎఎమ్సిలో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్రిన్సిపల్ 'చింతన్ హరియా' మాట్లాడుతూ.. వెండిని ఆభరణంగా మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి వెండి వినియోగం పెరుగుతుంది. తద్వారా రేటు పెరుగుతుందని అన్నారు. వెండికి డిమాండ్ పెరుగుతూ ఉండటం వల్ల.. గత మూడేళ్ళలో సిల్వర్ రేటు 30శాతం పెరిగిందని పేర్కొన్నారు.వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.ఈరోజు సిల్వర్ ధరలుఈరోజు (మంగళవారం) వెండి రేటు రూ. 3000 తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నగరాల్లో కేజీ సిల్వర్ రేటు రూ. 1.65 లక్షల వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ. 1.51 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే.. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో సిల్వర్ రేటు కొంత తక్కువ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో కనిపించని ఏసీ: యాంటిలియాలో ఎందుకిలా? -
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగి ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టింగ్ గురూ రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల గురించి మరోసారి హెచ్చరించారు. అంతర్జాతీ మార్కెట్ల ఒడిదొడుకుల నేపథ్యంలో ‘భారీ క్రాష్ మొదలంది’ అంటూ ‘ఎక్స్’లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ పెట్టారు.లక్షల మంది ఇన్వెస్టర్లు ఆర్థికంగా వినాశనానికి గురవుతారని అంచనా వేశారు. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలు హాని కలిగిస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు. వెండి (silver), బంగారం (gold) వంటి విలువైన లోహాలు, బిట్ కాయిన్, ఎథేరియం లాంటి క్రిప్టోకరెన్సీలు తిరోగమనం సమయంలో రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయని సూచించారు.‘భారీ క్రాష్ మొదలంది. కోట్ల కొద్దీ పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోతాయి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం పెట్టుబడులే మిమ్మల్ని కాపాడేదది’ అంటూ తన ట్వీట్లో రాబర్ట్ కియోసాకి రాసుకొచ్చారు.కియోసాకి (Robert Kiyosaki) ఇలా హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. 2025 ప్రారంభం ఫిబ్రవరిలో కూడా ఇలాగే "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" రాబోతోందంటూ అంచనా వేస్తూ ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.MASSIVE CRASH BEGININING: Millions will be wiped out. Protect yourself. Silver, gold, Bitcoin, Ethereum investors will protect you. Take care— Robert Kiyosaki (@theRealKiyosaki) November 1, 2025 -
షట్టర్ కట్ చేసి.. నిజామాబాద్ లో భారీ చోరీ
-
బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. ఈ రోజు (అక్టోబర్ 28) కూడా ఇదే బాటలో కొనసాగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. నేడు చెన్నైలో పసిడి ధర గరిష్టంగా రూ. 1630 తగ్గింది. హైదరాబాద్ ముంబై నగరాల్లో రూ. 820 తగ్గింది. ఈ కథనంలో బంగారం ధర ఏ ప్రాంతంలో ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’
ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బిట్కాయిన్, బంగారం(Gold), వెండి పెట్టుబడులకు సంబంధించి తాజాగా మరో ట్వీట్ చేశారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి చాలా మంది యూట్యూబ్ జాకీలు భయాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.రాబర్ట్ కియోసాకి తన తాజా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) పోస్ట్లో "ఫియర్ క్లిక్ బైటింగ్" గురించి విమర్శించారు. వ్యూస్, సబ్స్కైబర్లను పెంచుకోవడానికి ఆన్ లైన్ కంటెంట్ క్రియేటర్లు ఆర్థిక మార్కెట్ల గురించి ముఖ్యంగా బిట్ కాయిన్, బంగారం, వెండి గురించి భయంకరమైన అంచనాలను పోస్ట్ చేస్తున్నారన్నారు."చాలా మంది యూట్యూబ్ జాకీలు... 'ఫియర్ క్లిక్ బైట్స్' తో మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.. 'బిట్ కాయిన్ క్రాష్ కాబోతోంది.. లేదా బంగారం, వెండి పతనం కానున్నాయి' వంటి అంచనాలను చెబుతున్నారు. తర్వాత 'నా వెబ్ సైట్ కు సబ్ స్క్రైబ్ చేయండి' అంటూ అడుక్కుంటున్నారు. ఎంత మోసం?" అంటూ కియోసాకి రాసుకొచ్చారు.నిజమైన ఆస్తులను కలిగి ఉండటంపై తన నమ్మకాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కియోసాకి, ఆ మార్కెట్లలో భవిష్యత్తులో ఏదైనా తిరోగమనం వస్తే మరింత కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. "వాళ్లు చెబుతున్నట్లు ఒకవేళ బిట్కాయిన్, ఎథేరియం, బంగారం, వెండి వంటివి క్రాష్ అయితే ఆ తగ్గిన ధరలకు మరింత ఎక్కువ కొనుగోలు చేస్తాను" అన్నారు.ఇదీ చదవండి: షేర్ల విక్రయాలు – పన్ను మినహాయింపు"అసలు సమస్య నకిలీ డబ్బు, అసమర్థ నాయకులు.. లక్షల కోట్లలో ఉన్న జాతీయ రుణం." అని పేర్కొన్న రాబర్ట్ కియోసాకి యూఎస్ డాలర్ "ఫేక్ మనీ" అని చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి రియల్ మనీ అని చెప్పే బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం వంటివాటిని పోగుచేసుకోవాలని తన ఫాలోవర్లకు సూచించారు.FEAR CLICK BAITING:Many You Tube jockeys, vs old time Radio Disc Jockies….lure you in with “Fear Click Baits.” They state such predictions as “Bitcoin to crash.” Or “Gold and silver to crash.”Then they say “ Subscribe to my website.” How phoney. How fake?”If the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 27, 2025 -
ఆర్బీఐ కీలక ప్రకటన: వెండిపై లోన్..
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. కేజీ వెండి రేటు రూ. 2 లక్షలు దాటిన సందర్భం కూడా ఉంది. ప్రస్తుతం దేశంలో సిల్వర్ రేటు రూ. 1.70 లక్షల (కేజీ) వద్ద ఉంది. ఈ తరుణంలో రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక ప్రకటన జారీ చేసింది. గోల్డ్ మాదిరిగానే.. సిల్వర్ మీద కూడా లోన్ ఇవ్వడానికి సన్నద్ధమైంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. వెండి నగలు, కాయిన్స్ వంటి వాటిని తాకట్టు పెట్టుకుని లోన్ మంజూరు చేయాలని వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. వెండి కడ్డీలు, ఈటీఎఫ్లను తాకట్టుపెట్టడానికి అవకాశం లేదు. వీటిపై లోన్ లభించదు.ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టుపెట్టుకోవచ్చు. 500 గ్రాముల వరకు బరువున్న సిల్వర్ కాయిన్స్ కూడా బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ బరువున్న వెండిని తాకట్టు పెట్టుకోకూడదని కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి. మొత్తం మీద వెండిపై రూ. 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. బంగారం మాదిరిగానే.. వెండి మార్కెట్ విలువ ఆధారంగా బ్యాంకులు లోన్ మంజూరు చేయడం జరుగుతుంది.ఇదీ చదవండి: ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి!వెండి రేటు పెరగడానికి కారణాలువెండిని కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా.. పూజ సామాగ్రిగా కూడా ఉపయోగిస్తారు. పారిశ్రామిక రంగంలో కూడా సిల్వర్ డిమాండ్ భారీగా పెరగడం చేత.. వెండి రేటుకు రెక్కలొచ్చేశాయి. సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, ఉత్ప్రేరకాలు, నీటి శుద్ధి, వైద్య రంగం, ఫొటోగ్రఫీ వంటి వాటిలో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల సిల్వర్ రేటు గణనీయంగా పెరిగింది. -
సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్వోఎఫ్లో పెట్టుబడులకు అనుమతి
సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) పథకంలోకి తాజా పెట్టుబడులను అనుమతిస్తున్నట్టు టాటా మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. మార్కెట్ పరిస్థితులు కుదుటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వెండి ధరలు గరిష్టాల నుంచి కొంత దిద్దుబాటుకు గురికావడంతో తాజా పెట్టుబడులకు అనుమతించినట్టు తెలుస్తోంది.సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్వోఎఫ్లో ఏక మొత్తంలో పెట్టుబడి, క్రమానుగత పెట్టుబడి (సిప్), క్రమానుగత పెట్టుబడి బదిలీ (ఎస్టీపీ)లను నిలిపివేస్తున్నట్టు ఈ నెల 14న టాటా మ్యూచువల్ ఫండ్ ప్రకటించడం గమనార్హం. ధరలు అనూహ్యంగా పెరుగుతూ వెళుతున్న తరుణంలో రిస్క్ నియంత్రణలో భాగంగా ఈ చర్య చేపట్టింది. మార్కెట్ పరిస్థితులు సాధారణంగా మారడంతో తిరిగి ఏక మొత్తంలో పెట్టుబడులు, తాజా సిప్లు, ఎస్టీపీలను అనుమతిస్తున్నట్టు టాటా మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా -
'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
నిజమైన డబ్బును మాత్రమే పొదుపు చేయండి. ఫేక్ కరెన్సీని పొదుపు చేయడం వల్ల ధనవంతులు కాలేరని సూచించే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో రెండు ట్వీట్స్ చేశారు.''గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ క్రాష్ అవుతున్నాయి. అయితే బట్కాయిన్ విలువ ఈ నెలలో పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బిట్కాయిన్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 మిలియన్ల మంది బిట్కాయిన్లను కొనుగోలు చేశారు. వీటి సంఖ్య 21 మిలియన్స్ మాత్రమే. కాబట్టి కొనుగోలును వేగవంతం అవుతుంది. దయచేసి ఆలస్యం చేయకండి'' అని కియోసాకి పేర్కొన్నారు.Why I am buying Bitcoin.Bitcoin is first truly scarce money… only 21 million ever to be mined.World close 20 million now.Buying will accelerate.FOMO realPlease do not be late.Take care— Robert Kiyosaki (@theRealKiyosaki) October 22, 2025''ప్రస్తుతం అమెరికా అప్పు పెరుగుతూనే ఉంది. జాతీయ అప్పు 37 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. వేల సంవత్సరాలుగా నిజమైన డబ్బు అంటే.. బంగారం, వెండి అని నాకు తెలుసు. నేడు ఈ జాబితాలోకి బిట్కాయిన్ & ఎథెరియం కూడా చేరాయి. కాబట్టి డబ్బు సేవ్ చేయడంలో తెలివిగా వ్యవహరించండి. అయితే జాగ్రత్త వహించండి'' అని కియోసాకి స్పష్టం చేశారు.బంగారం, వెండి, బట్కాయిన్2025 అక్టోబర్ 17వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత తగ్గుముఖం పట్టాయి. దీంతో రూ. 13,000 దాటిన గోల్డ్ రేటు రూ. 12,500 వద్దకు చేరింది. ఇదే సమయంలో రూ. 2.03 లక్షలకు చేరిన వెండి రేటు.. రూ. 17,4000 వద్దకు వచ్చింది. అయితే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..ఇక బట్కాయిన్ విషయానికి వస్తే.. గత వారంలో కొంత తగ్గుముఖం పట్టిన బట్కాయిన్ విలువ.. నేడు 1.87 శాతం పెరిగి రూ. 96,18,503.80 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. బట్కాయిన్ విలువ మళ్లీ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు నిజమయ్యే అవకాశం కూడా ఉంది.CLICK BAIT??? Don’t get sucked in to anyone who counts on “click bait.”FOR EXAMPLE: I now see “click bait” titles screaming “gold, silver, Bitcoin crashing” or Butcoin to $2 million this month. Then the podcaster then says “To support my channel “click and subscribe”Give…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 23, 2025 -
బంగారం, వెండి క్రాష్..!
సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్ది నెలలుగా అప్రతిహతంగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఉన్నట్టుండి కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో గత 12 ఏళ్లలోలేని విధంగా పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 6.3 శాతం పతనంకాగా.. వెండి మరింత అధికంగా 2021 తదుపరి 8.7 శాతం పడిపోయింది. వెరసి యూఎస్ కామెక్స్లో ఔన్స్ పసిడి ధర 4,082 డాలర్లకు చేరగా.. వెండి ఔన్స్ 47.89 డాలర్లను తాకింది. దీంతో దేశీయంగా బంగారం 10 గ్రాములు కనీసం రూ. 6,000 తగ్గవలసి ఉన్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.దేశీయంగా ఇటీవల బంగారం 10 గ్రాములు రూ. 1,34,800ను తాకగా.. వెండి రూ. 1,85,000కు చేరిన విషయం విదితమే. అయితే డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, దిగుమతి సుంకం మదింపు తదుపరి ధరలు నిర్ణయమయ్యే సంగతి తెలిసిందే. ఈ బాటలో పలాడియం, ప్లాటినం ధరలు సైతం అంతర్జాతీయ మార్కెట్లో 7 శాతం చొప్పున పతనం కావడం గమనార్హం! కాగా.. 2025 డిసెంబర్ ఫ్యూచర్స్ పసిడి రాత్రి 10.30 ప్రాంతంలో 5.5 శాతం (237 డాలర్లు) క్షీణించి 4,122 డాలర్ల వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా 4,393 డాలర్లకు చేరగా.. 4,095 డాలర్ల వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 7.36 శాతం పడిపోయి 47.60 డాలర్ల వద్ద కదులుతోంది. ఒక దశలో 51.61 డాలర్ల వద్ద గరిష్టాన్ని, 47.14 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. కారణాలేటంటే? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూఎస్, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ విషయంలో సానుకూల చర్చలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ విలువ పుంజుకోవడం, యూఎస్ ప్రభుత్వ షట్డౌన్ వంటి అంశాలు పసిడి, వెండి తదితర విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం చైనా, యూఎస్ ప్రెసిడెంట్ల మధ్య సమావేశం జరగనుండటం సానుకూల అంశంగా తెలియజేశాయి.మరోవైపు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించడం మెటల్స్లో భారీ ర్యాలీకి కారణమైంది. టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్కు చేరడంతోపాటు.. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపట్టడం విలువైన లోహాలలో కరెక్షన్కు దారితీస్తున్నట్లు వివరించారు. -
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తన్వీ శర్మకు రజతం
భారత యువ షట్లర్ తన్వీ శర్మ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజత పతకం కైవసం చేసుకుంది. గువాహటిలో జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో తన్వీ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో టాప్ సీడ్ తన్వీ శర్మ 7–15, 12–15తో రెండో సీడ్ అన్యాపత్ ఫిచిత్ఫోన్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మహిళల సింగిల్స్లో భారత్ నుంచి అపర్ణ పోపట్ (1996లో రజతం), సైనా నెహ్వాల్ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. మళ్లీ ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత తన్వీ శర్మ ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే తన్వీ లయ కోల్పోయింది. ‘చాలా తప్పులు చేశా. మ్యాచ్ ప్రారంభం నుంచే తడబడ్డా. తొలి గేమ్ తర్వాత తేరుకొని... రెండో గేమ్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించా. 8–5తో ఆధిక్యంలో ఉన్న సమయంలో చేసిన తప్పిదంతో థాయ్ షట్లర్కు పట్టుబిగించే అవకాశం దక్కింది. ప్రత్యర్థి నా ఆటతీరును సులువుగా పట్టేసింది’ అని తన్వీ పేర్కొంది. -
రిచ్ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్ డబ్బు’ కాదు..
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich dad Poor dad) రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా ద్రవ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి పెట్టుబడుల పెరుగుదల అనేది వ్యవస్థల వైఫల్యానికి సంకేతమని అని ఆయన హెచ్చరించారు. అమెరికా బేబీ బూమర్ (1946-1964 మధ్య పుట్టినవారు)తరగతికి ఈ ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపించబోతుందని ఆయన భావిస్తున్నారు."ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు" అంటూ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. "కానీ ద్రవ్యోల్బణం పేద మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది." ధరలు పెరుగుతున్నప్పుడు, ఫియట్ మనీ లేదా "నకిలీ డబ్బు" సామాన్య అమెరికన్ల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం వంటి "నిజమైన డబ్బు" లో ఆదా చేయాలని ప్రజలకు సూచించారు.అక్టోబర్ లో బంగారం ధరలో జరిగిన నాటకీయ ర్యాలీని అనుసరించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం, బంగారం ప్రపంచవ్యాప్తంగా ఔన్సుకు 4,250 డాలర్లు, భారతదేశంలో 10 గ్రాములకు రూ.1.31 లక్షల వద్ద (అక్టోబర్ 18 నాటికి) ట్రేడ్ అవుతోంది. వెండి కూడా దూసుకెళ్తోంది. అయితే బిట్ కాయిన్ మార్కెట్ గందరగోళం మధ్య 1,21,000 డాలర్ల నుండి 108,000 డాలర్లకు పడిపోయింది.1947 లో జన్మించిన రాబర్ట్ కియోసాకి, తన లాంటి బేబీ బూమర్ తరగతికి ఈ ద్రవ్యోల్బణం బలమైన హానిని కలిగించే అవకాశం ఉందని చెప్పారు. "ద్రవ్యోల్బణం ద్వారా మనం పూర్తిగా తుడిచిపెట్టకుపోతామని" ఆయన హెచ్చరించారు. "మీ అమ్మ, నాన్నలు వీధుల్లోకి రావచ్చు ఎందుకంటే ద్రవ్యోల్బణం వారి సామాజిక భద్రతను తుడిచిపెట్టబోతోంది." అన్నారు.THE RICH get RICHER: while I am personally happy gold, silver, Bitcoin, Ethereum are going up…. My concern is the price of life…. AKA…inflation….makes life harder on the poor and middle class.Please do your best to not be a victim of a broken and corrupt monetary system.…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 17, 2025 -
రూ.1000 తగ్గిన వెండి, అక్కడ మాత్రం పెరిగిన బంగారం!
అక్టోబర్ ప్రారంభం నుంచి దాదాపు పెరుగుతూ ఉన్న ధరలు ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెండి ధర మాత్రం రూ. 1000 తగ్గింది. దీంతో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోని గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో పసిడి కొత్త ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా పసిడి, వెండి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. అక్టోబర్ 18న ధన త్రయోదశికి ముందు పసిడి ధరల ఇలా భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: యూఏఈలో 6జీ కనెక్టివిటీ టెస్ట్ విజయవంతం(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి పండుగ..
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో పసిడి మరో కొత్త మైలురాయి దాటింది. మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర మరో రూ. 2,850 పెరిగి ఏకంగా రూ. 1.30 లక్షలను అధిగమించింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,30,800కి చేరింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా అంతే పెరిగి రూ. 1,30,200కి చేరింది. మరోవైపు, వెండి సైతం కేజీకి రూ. 6,000 ఎగిసి సరికొత్త జీవిత కాల గరిష్టమైన రూ. 1,85,000ని తాకింది.పండుగ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ గణనీయంగా పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 88.80కి పడిపోవడం వంటి అంశాలు పసిడి పెరుగుదలకు కారణమని ట్రేడర్లు తెలిపారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో (ఎంసీఎక్స్) డిసెంబర్ కాంట్రాక్టు రూ. 2,301 పెరిగి రూ. 1,26,930కి చేరింది. ఫిబ్రవరి కాంట్రాక్టు సైతం రూ. 2,450 ఎగిసి రూ. 1,28,220 రికార్డు స్థాయిని తాకింది. పుత్తడికి దీటుగా వెండి డిసెంబర్ కాంట్రాక్టు కూడా కేజీకి రూ. 8,055 పెరిగి రూ. 1,62,700 స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా కామెక్స్లో గోల్డ్ రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 1% పెరిగి ఆల్టైమ్ గరిష్టమైన 4,190 డాలర్లను తాకింది. భౌగోళిక–రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, రేట్ల కోత అంచనాలు, ఈటీఎఫ్లలో పెట్టుబడుల ప్రవాహం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 60% పెరిగి కీలకమైన 4,100 డాలర్ల మార్కును దాటిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా సరఫరా కొరత వల్ల వెండి ఔన్సు ధర కూడా 52 డాలర్లను దాటిందన్నారు. వెండి ధర దేశీయంగా రూ.1,94,639కి, అంతర్జాతీయంగా 59.89 డాలర్లకు పెరగవచ్చని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ తెలిపారు. -
బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశం.. కోటక్ నుంచి గోల్డ్, సిల్వర్ ఫండ్
కోటక్ మహీంద్రా ఏఎంసీ కొత్తగా గోల్డ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) అక్టోబర్ 20తో ముగుస్తుంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ప్రధానంగా కోటక్ గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF), కోటక్ సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF)యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది.బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తూ, దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం ఈ ఫండ్ లక్ష్యమని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని, పరిశ్రమల్లో వెండి వాడకం పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రెండింటి వృద్ధి ప్రయోజనాలను పొందేందుకు ఈ ఫండ్ అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇన్వెస్కో ఇండియా కన్జంప్షన్ ఫండ్ దేశీయంగా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా కన్జంప్షన్ ఫండ్ని (Invesco India Consumption Fund) ప్రవేశపెట్టింది ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ అక్టోబర్ 17 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. రోజువారీ సిప్ రూపంలో అయితే కనీసం రూ. 100, నెలవారీ అయితే రూ. 500 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు.వినియోగం థీమ్తో ప్రయోజనం పొందే కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సాధనాల్లో కనీసం 80% ఇన్వెస్ట్ చేస్తుంది. మనీష్ బొద్దార్, అమిత్ గణాత్రా ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. ట్యాక్స్ శ్లాబులు మార్చడం, జీఎస్టీ సంస్కరణలు మొదలైనవి వినియోగానికి మరింతగా ఊతమిస్తాయని సంస్థ సీఈవో సౌరభ్ నానావటి తెలిపారు. -
బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే..
బంగారం, వెండి కొనే విషయంలో భారతీయ మహిళలను చూసి నేర్చుకోవాలంటున్నారు ప్రముఖ కమోడిటీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్. పెట్టుబడి పాఠాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ‘స్ట్రీట్ స్మార్ట్స్: అడ్వెంచర్స్ ఆన్ ది రోడ్ అండ్ ఇన్ ది మార్కెట్స్’ (Street Smarts: Adventures on the Road and in the Markets) చాలా ప్రసిద్ధి చెందింది.ఇటీవల జిమ్ రోజర్స్ (Jim Rogers) బిజినెస్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బంగారం, వెండిని కలిగి ఉన్నానని, కానీ వాటిని అమ్మే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ధరల వద్ద కొత్తగా కొనుగోలు చేసే ఆలోచన తనకు లేకపోయినా, ధరలు తగ్గితే మరింత కొనడానికి ఆసక్తిగా ఉన్నానని తెలిపారు.రోజర్స్ పెట్టుబడి తత్వం ఇదే..తాను మార్కెట్ భవిష్యత్తు గురించి లెక్కలు వేస్తూ కూర్చోనని, ఎప్పుడైతే వస్తువుల ధరలు పడిపోతాయో అప్పుడే ఎక్కువగా కొనుగోలు చేస్తానని జిమ్ రోజర్స్ చెప్పుకొచ్చారు. బంగారం (gold), వెండి (silver) వంటి విలువైన లోహాలు తన వద్ద ఉన్నాయని, అవి తన పిల్లలకు మిగలాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఇటీవల వెండి ధరలు దూసుకుపోతున్న తరుణంలో తానూ కొంత వెండి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.ప్రపంచంలోని చాలా దేశాలు భారీగా డబ్బును ముద్రిస్తున్నాయి. అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో బంగారం వంటి లోహాలు కరెన్సీ డీ-వాల్యుయేషన్ నుండి తమను తాము రక్షించుకునేందుకు మంచి మార్గమని రోజర్స్ చెప్పారు. ‘భారతీయ మహిళలు శతాబ్దాలుగా బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. వారికి ఉన్న తెలివితేటలు నేనూ నేర్చుకుంటున్నాను’ అని ఉదహరించారు.మార్కెట్లపై దృష్టిచైనా మార్కెట్లో కొంత ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ, తన ఇతర పోర్ట్ఫోలియోలో చాలా భాగం విక్రయించానన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్లు బలంగా ఉండటాన్ని చూస్తే, తన అభిప్రాయం ప్రకారం ఇది అమ్మే సమయం అని చెప్పారు. జిమ్ రోజర్స్ తరచూ మార్కెట్లో వేచి చూసే పెట్టుబడిదారుల సరసన నిలబడతారు. వారు చెబుతున్నది స్పష్టం.. ధరలు పడితేనే కొనండి, ఎప్పుడూ ట్రెండ్ను అనుసరించవద్దు. బంగారం, వెండిలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలన్నది ఆయన సలహా.ఇదీ చదవండి: ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ నుంచి 10 శక్తివంతమైన డబ్బు పాఠాలు -
నం.1, 2 లోహాలు.. ఎందులో వాడుతున్నారంటే..
బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో అసాధారణ రీతిలో పెరుగుతున్నాయి. ఇటీవల కేజీ వెండి ధర ఏకంగా రూ.1.95 లక్షలకు చేరింది. తులంగా బంగారం రూ.1.20 పైమాటే. ఈ పెరుగుదలకు ప్రధానంగా ఆర్థిక అంశాలు దోహదపడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, దీనికి విరుగుడుగా సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం, వెండిపై మదుపరుల దృష్టి మళ్లడం ఒక ముఖ్య కారణం. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం నిల్వలను కొనుగోలు చేస్తుండడం వంటివి కూడా ఈ ధరల పెరుగుదలకు ఇంధనంగా పనిచేస్తున్నాయి. అయితే కేవలం ఆర్థిక కారకాలు, ఆభరణాల తయారీ మాత్రమే కాకుండా ఈ లోహాలకు అనేక పారిశ్రామిక, అత్యాధునిక రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ కూడా ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది.బంగారం, వెండి రెండూ విద్యుత్ వాహకత, తుప్పు నిరోధకత, సులభంగా సాగే (ductility), రేకులుగా మలిచే గుణం (malleability) వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా వీటి వినియోగం కేవలం పెట్టుబడులు లేదా ఆభరణాల తయారీకే పరిమితం కాకుండా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తోంది.బంగారం వినియోగంబంగారాన్ని అత్యధికంగా ఆభరణాల తయారీలో వినియోగించినప్పటికీ దాని ప్రత్యేక లక్షణాల కారణంగా అనేక అత్యాధునిక రంగాల్లో దీనికి ప్రాధాన్యత ఉంది.ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీబంగారం అత్యుత్తమ విద్యుత్ వాహకాల్లో ఒకటి. తుప్పు పట్టదు కాబట్టి దీన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కనెక్టర్లు, స్విచ్లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులలోని కీలకమైన భాగాలలో దీర్ఘకాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధనఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్ల్లోని కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను రక్షించడానికి, విద్యుత్ ప్రసారం కోసం బంగారాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బంగారాన్ని పూతగా కూడా ఉపయోగిస్తారు.వైద్య పరికరాలుబంగారం జీవసంబంధితంగా స్థిరంగా ఉంటుంది (శరీరంలో సులభంగా చర్యలకు గురికాదు). తుప్పు పట్టదు. నాన్-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటికి ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సా పరికరాలు, అతిపెద్ద వైద్య ఇమేజింగ్ పరికరాల్లో బంగారాన్ని వాడుతున్నారు.నానోటెక్నాలజీబంగారు నానోపార్టికల్స్కు వైద్య రంగంలో మెరుగైన సామర్థ్యం ఉంది. వీటిని క్యాన్సర్ చికిత్స, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ (మందులను లక్షిత ప్రాంతానికి చేర్చడం), జీవసంబంధిత సెన్సార్ల (Biosensors) తయారీలో పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు.గ్లాస్, కిటికీలుకొన్ని భవనాల అద్దాలు, కిటికీలపై సన్నని బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. ఈ పూత వేడిని నిరోధించి, లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.వెండి వినియోగంవెండి కూడా బంగారంతో సమానంగా విస్తృత పారిశ్రామిక అనువర్తనాలను కలిగి ఉంది. ఇది అన్ని లోహాల్లో అత్యుత్తమ విద్యుత్, ఉష్ణ వాహకతను కలిగి ఉంది.సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలుప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తి (Solar Energy) రంగంలో వెండి వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్లో విద్యుత్తును సేకరించి సరఫరా చేయడానికి వెండి పేస్ట్లను (Silver Paste) వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే కొన్ని రకాల బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు.ఎలక్ట్రానిక్స్, కండక్టర్లువెండి అత్యుత్తమ విద్యుత్ వాహకతను కలిగి ఉండటం వల్ల అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో సర్క్యూట్ బోర్డులు, స్విచ్లు, ఫ్యూజులు, కనెక్టర్లలో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా అధిక విశ్వసనీయత అవసరమయ్యే పరికరాలలో దీని వినియోగం తప్పనిసరి అవుతోంది.పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలువెండిని రసాయన పరిశ్రమల్లో ఉత్ప్రేరకాలుగా (Catalysts) వాడుతున్నారు. ఉదాహరణకు, ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తిలో (ఇది అనేక ప్లాస్టిక్ల తయారీలో ముఖ్యమైనది) ఇది ప్రముఖంగా ఉపయోగపడుతుంది.నీటి శుద్ధి, వైద్య రంగంవెండికి బలమైన యాంటీమైక్రోబియల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే) లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని నీటి శుద్ధి పద్ధతుల్లో, కొన్ని వైద్య ఉపకరణాలు, కట్టులు (Bandages) తయారీలో వాడుతున్నారు. ఆసుపత్రి పరికరాలపై క్రిమిసంహారక పూతగా కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.ఫొటోగ్రఫీసాంప్రదాయ ఫిల్మ్ ఫొటోగ్రఫీలో ఫిల్మ్, పేపర్పై కాంతిని గుర్తించడానికి వెండి హాలైడ్లను విస్తృతంగా వాడుతున్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీ రాకతో ఈ వినియోగం తగ్గినప్పటికీ ప్రత్యేక ఫొటోగ్రఫీ రంగాలలో ఇంకా ఉపయోగిస్తున్నారు.ఇదీ చదవండి: జరిమానా చెల్లించి, తప్పు అంగీకరిస్తే కేసు మూసివేత!బంగారం, వెండి వాటి ప్రత్యేక భౌతిక, రసాయన లక్షణాలు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వాటి వినియోగాన్ని అనివార్యంగా మార్చాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ, ఏరోస్పేస్, వైద్య పరికరాలు వంటి కీలక రంగాలలో పెరుగుతున్న డిమాండ్ ఈ లోహాల ధరల పెరుగుదలకు ఒక బలమైన పారిశ్రామిక కోణాన్ని జోడిస్తోంది. భవిష్యత్తులో సాంకేతిక ఆవిష్కరణలు పెరిగే కొద్దీ ఈ అమూల్యమైన లోహాల వినియోగం, వాటి విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. -
రూ.1.95 లక్షల వద్ద వెండి: దూసుకెళ్తున్న బంగారం!
భారతదేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఈ రోజు (అక్టోబర్ 13) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 320 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు.. చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేటు ఎలా ఉందో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘వెండి ధరలు ఇంకా పెరుగుతాయ్’.. ఎందుకంటే..
ఇప్పటికే రికార్డు గరిష్టాలకు చేరిన వెండి ధరలు (Silver Price) మరింత పెరగనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరంలో ఔన్స్కు 60 డాలర్ల వరకు పెరిగే అవకాశముంది. ఇది సంవత్సరానికి సుమారుగా 20% పెరుగుదలను సూచిస్తుందని ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ తెలిపింది.ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్కు చెందిన ఈ వెల్త్ అడ్వయిజరీ సలహా విభాగం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో 20 శాతం సరఫరా లోటు నెలకొన్న నేపథ్యంలో బలమైన పారిశ్రామిక డిమాండ్ వల్ల బుల్లిష్ దృక్పథం కొనసాగుతుందని అంచనా వేస్తోంది.ఇదీ చదవండి: ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది: రాబర్ట్ కియోసాకివెండి పెట్టుబడిదారులు ఇప్పటికే 2025 క్యాలెండర్ సంవత్సరంలో 90% లాభాన్ని సాధించారు. అంతర్జాతీయ మార్కెట్లో, వెండి ధరలు ఔన్స్కు 49 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో సురక్షితమైన ఆస్థులకు డిమాండ్ పెరిగిపోవడం వల్ల వెండి ధరలు రికార్డు గరిష్టస్థాయికి చేరాయి. కామెక్స్ వెండి ఇప్పటివరకు సుమారు 70% పెరిగింది. ఎంసీఎక్స్ వెండి సుమారు 71% పెరిగింది.(Disclaimer: నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇంతలా పెరిగితే కొనేదెలా.. తారాస్థాయికి చేరిన బంగారం ధరలు!
హమ్మయ్య బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి అనుకునేలోపే.. మళ్లీ ఊపందుకున్నాయి. నేడు (అక్టోబర్ 11) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 930 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ నగరం బంగారం ధర ఎక్కువగా ఉంది?, ఏ నగరంలో తక్కువగా ఉంది అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కొత్త రేటుకు వెండి: రాబర్ట్ కియోసాకి
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.వెండి 50 డాలర్లు దాటేసింది, తరువాత 75 డాలర్లకు?.. సిల్వర్, ఎథిరియం హాట్, హాట్ (ధరలు భారీగా ఉన్నాయని) అంటూ కియోసాకి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.SILVER over $50.$75 next ?Silver and Ethereum hot, hot, hot.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 10, 2025వెండి రేటు గ్లోబల్ మార్కెట్లో.. మొదటిసారి ఔన్స్కు 50 డాలర్ల స్థాయికి చేరి, 2012 నాటి గరిష్టాన్ని చెరిపేసింది. ఇన్నాళ్ల తర్వాత తిరిగి వెండికి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ మాత్రమే కాకుండా.. అమెరికా టారిఫ్స్ కూడా వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణుల అభిప్రాయం.ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకిభారతదేశంలో 2025 అక్టోబర్ ప్రారంభంలో రూ. 1,61,000 వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజు (అక్టోబర్ 10) రూ. 1,80,000 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 10 రోజుల్లో వెండి ధరలు ఎంతగా పెరిగాయో.. స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ 7 (గురువారం) వెండి రేటు ఏకంగా రూ. 7,000 పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది. ఈ రోజు (శుక్రవారం) కూడా సిల్వర్ రేటు రూ. 3000 పెరిగింది. దీంతో ఒక గ్రామ్ సిల్వర్ రేటు 180 రూపాయలకు చేరింది. -
ఆల్టైమ్ గరిష్టాలను తాకిన వెండి: 10 రోజుల్లో..
ఇన్నాళ్లు బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందిన ప్రజలకు వెండి కూడా నిరాశ కలిగిస్తోంది. 2025 అక్టోబర్ ప్రారంభంలో రూ. 161000 వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజు (అక్టోబర్ 10) రూ. 1,80,000 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 10 రోజుల్లో వెండి ధరలు ఎంతగా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.అక్టోబర్ 7 (గురువారం) వెండి రేటు ఏకంగా రూ. 7,000 పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది. ఈ రోజు (శుక్రవారం) కూడా సిల్వర్ రేటు రూ. 3000 పెరిగింది. దీంతో ఒక గ్రామ్ సిల్వర్ రేటు 180 రూపాయలకు చేరింది. వెండి ధరలు ఒక్క భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ కూడా గణనీయంగా పెరుగుతోంది.వెండి రేటు గ్లోబల్ మార్కెట్లో.. మొదటిసారి ఔన్స్కు 50 డాలర్ల స్థాయికి చేరి, 2012 నాటి గరిష్టాన్ని చెరిపేసింది. 2012లో ఔన్స్ వెండి ధర 49.50 డాలర్లకు చేరుకుని, తర్వాత గణనీయంగా దిద్దుబాటుకు గురైంది. ఇన్నాళ్ల తర్వాత తిరిగి వెండి లోహానికి బలమైన డిమాండ్ కనిపిస్తోంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటుపరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ మాత్రమే కాకుండా.. అమెరికా టారిఫ్స్ కూడా వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణుల అభిప్రాయం. ప్రముఖ అనలిస్ట్ రాబర్ట్ కియోసాకి కూడా వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరగడానికి ముందే.. సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయండి అని సలహా ఇస్తున్నారు. -
‘ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది’
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సాంప్రదాయ 60/40 పెట్టుబడి వ్యూహాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యూహం ప్రకారం 60 శాతం డబ్బును ఈక్విటీల్లో (స్టాక్స్), 40 శాతం డబ్బును బాండ్లలో (స్థిర ఆదాయ పెట్టుబడులు) పెట్టాలి. దీర్ఘకాలిక, స్థిరమైన ఆదాయాన్ని కల్పించగలదని భావించి, ఈ వ్యూహాన్ని ఎన్నో దశాబ్దాలుగా ఆర్థిక ప్రణాళికదారులు ఒక "మ్యాజిక్ ఫార్ములా"గా వర్ణిస్తూ వచ్చారు.అయితే, కియోసాకి అభిప్రాయం (Rich Dad Poor Dad author Robert Kiyosaki) ప్రకారం, ఈ 60/40 విధానం 1971లోనే పనికిరానిది అయిపోయింది. అంటే, అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ బంగార ప్రమాణం నుంచి డాలర్ను వదిలించాక ఇది అసంబద్ధం అయింది.రాబర్ట్ కియోసాకి తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. "మొత్తానికి, ఫైనాన్షియల్ ప్లానర్ల మ్యాజిక్ మంత్రదండం – 60/40 చనిపోయింది" అంటూ పోస్ట్ను మొదలు పెట్టిన కియోసాకి "ఆ బీఎస్ నిష్పత్తి నిక్సన్ బంగారు ప్రమాణం నుంచి డాలర్ను తీసేసిన 1971లోనే చనిపోయింది. దాన్నుంచి ఇప్పటివరకు, ఆర్థిక ప్రణాళికదారులు దీన్ని పదవీ విరమణ భద్రత కోసం మేజిక్ కార్పెట్ రైడ్ లా ప్రచారం చేస్తూ వచ్చారు" అని రాసుకొచ్చారు.అమెరికా ప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద రుణగ్రహీత అని, అమెరికన్ డాలర్ ఒక “నకిలీ” కరెన్సీగా మారిందని కియోసాకి పేర్కొన్నారు. "యూఎస్ డాలర్ నకిలీ. ఇది మార్క్సిస్ట్ ఫెడ్ నియంత్రణలో ఉన్న, దివాలా తీసిన అమెరికన్ ప్రభుత్వ ఐఓయూ మాత్రమే. అలాంటి దేశం నుంచి బాండ్లు కొంటారా? ఆర్థిక భద్రత ఎక్కడుంది?" అంటూ ప్రశ్నించారు.కొత్త ఫార్ములా..మొత్తానికి వాస్తవం తెలిసొచ్చిందని, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు ఇప్పుడు మరో ప్రత్యామ్నాయ వ్యూహం 60/20/20 పోర్ట్ఫోలియోను ప్రోత్సహిస్తున్నాయని వివరించారు. ఈ వ్యూహం ప్రకారం.. 60 శాతం స్టాక్స్ లేదా ఇతర పెట్టుబడులు, 20 శాతం బాండ్లు, 20 శాతం బంగారం (లేదా ఇతర భద్రతా ఆస్తులు)పై పెట్టుబడి పెడతారు. ఇది పెట్టుబడిదారులకు పదవీ విరమణలో మరింత భద్రత కలిగిస్తుందని ఆయా సంస్థలు చెబుతున్నాయన్నారు.నేను వీటికే ప్రాధాన్యమిస్తా..ఎవరెన్ని చెప్పినప్పటికీ తాను ఎప్పటికీ నిజమైన ఆస్తులు అంటే, బంగారం, వెండి నాణేలు, బిట్కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టో కరెన్సీలు, రుణంతో కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ నుంచి అద్దె ఆదాయం, చమురు బావులు, పశువులపై వచ్చే రాబడికే ప్రధాన్యత ఇస్తానన్నారు. ఇవన్నీ ఆదాయం అందించే "రియల్ అసెట్స్" అని చెబుతూ, వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించారు.ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్"నేను ఇప్పటికీ వీటినే ఇష్టపడతాను. నాకు ఇవే 30 సంవత్సరాల క్రితం ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చాయి" అన్నారు. ఇంకో ముఖ్యమైన జీవన పాఠం కూడా ఆయన పంచుకున్నారు. "ఫైనాన్షియల్ ప్లానర్ల మ్యాజిక్ వాండ్ అయిన 60/40 ఫార్ములాని నేను ఎప్పుడూ ఉపయోగించలేదు. మీకు ఉత్తమంగా పనికొచ్చే పెట్టుబడి వ్యూహం ఏదో దాన్ని కనుక్కోండి" అంటూ సూచించారు.FINALLY the BS “magic wand” of Financial Planner’s….the BS of 60/40 is dead.FYI: 60/40 meant investors invest 60% in stocks and 40 % in bonds.That BS ratio died in 1971 the year Nixon took the dollar off the gold standard.For years, financial planners have touted the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025 -
ఇలా అయితే ఎలా 'బంగారం': మరింత పెరిగిన ధరలు
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (అక్టోబర్ 09) కూడా గరిష్టంగా రూ. 220 పెరిగింది. పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. పసిడి ప్రియులలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలాగే కొనసాగితే పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం చెలగాటం.. డాలర్కు సంకటం!
ఈ భూమిపై బంగారాన్ని అన్నింటి కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. ఆయనే రాబర్ట్ కియోసాకి. ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత అయిన ఆయన ఎప్పుడూ బంగారం, వెండి లోహాలపై పెట్టుబడులు పెడుతుంటారు. తనను అనుసరించేవాళ్లనూ పెట్టమని ప్రోత్సహిస్తుంటారు.బంగారం ధర అంతకంతకూ పెరిగిపోతూ రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో 10 గ్రాములకు రూ .1,22,780 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్స్కు 4,000 డాలర్లను అధిగమించింది. దీంతో ఎప్పటిలాగే రాబర్ట్ కియోసాకి వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేశారు. విలువైన లోహాలుక, డిజిటల్ ఆస్తులపై తన బుల్లిష్ వైఖరిని పునరుద్ఘాటించారు."యూఎస్ డాలర్ అంతం?"నా బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం స్టాక్కు విలువ ఇంకా పెరుగుతోంది.యూఎస్ డాలర్ను నమ్ముకున్నోళ్లంతా నష్టబాధితులు.విజేతగా ఉండండి.జాగ్రత్త" అంటూ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.బంగారం, వెండి, బిన్ కాయిన్ల విలువలు పెరిగిపోతున్న తరుణంలో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) సాంప్రదాయ పొదుపులపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమెరికా డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు అంటూ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!END of US Dollar? Adding to my gold, silver, Bitcoin, and Ethereum stack.Savers of US dollars are losers. Be a winner. Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 8, 2025 -
స్టాక్ మార్కెట్ కుప్పకూలబోతోందా?: బఫెట్పై.. కియోసాకి ఆగ్రహం
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. వారెన్ బఫెట్ ఇటీవల బంగారం & వెండిని ప్రశంసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్పుడూ స్టాక్ మార్కెట్, ఫండ్స్ వాణి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే వారెన్ బఫెట్.. ఇప్పుడు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. బఫెట్ కొత్త వైఖరి సాంప్రదాయ స్టాక్లు, బాండ్లకు పొంచి ఉన్న సంక్షోభాన్ని సూచిస్తుందని రాబర్ట్ కియోసాకి తీవ్రంగా స్పందించారు.స్టాక్ మార్కెట్ మసకబారుతోందా?కొన్నేళ్లుగా.. వారెన్ బఫెట్ బంగారం & వెండి వంటివి ఉత్పాదకత లేని ఆస్తులుగా పరిగణించారు. 2011లో బెర్క్షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో కూడా అయన బంగారం ఎక్కువగా ఉపయోగపడేది కాదని, అది లాభాలను తీసుకురాదని వ్యాఖ్యానించారు. వ్యాపారాలు, వ్యవసాయ భూములు, ఇండెక్స్ నిధులను నిజమైన రాబడిని చెబుతూ.. నమ్మకమైన పెట్టుబడులుగా పేర్కొన్నారు. కానీ ఆయనే ఇప్పుడు బంగారం & వెండిని ఆమోదించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.బఫెట్ ఒకప్పుడు బంగారాన్ని ఎగతాళి చేసినప్పటికీ, ఇప్పుడు దానిని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ప్రశంసిస్తున్నాడు. ఇది బఫెట్ దృక్పథంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని కియోసాకి అన్నారు. అంతే కాకుండా.. బఫెట్ మాట విని కొంత బంగారం, వెండి, బిట్కాయిన్ కొనాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వారెన్ బఫెట్కు అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్గా పేరుంది. ఆయన ఎక్కువగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంటారు. దీంతో ఆయన్ను, ఆయన ఆలోచనలకు మంది అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పుడు మారిన బఫెట్ వైఖరితో స్టాక్ మార్కెట్ నుంచి వైదొలిగి బంగారం, వెండి వైపు పయనిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు తగ్గి కుప్పకూలలే ప్రమాదముందా అంటూ కియోసాకి సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!డబ్బు దాచుకోవడం వల్ల పేదవాళ్లు అవుతారని, డబ్బును బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మీ పెట్టుబడి పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. వెండిపై పెట్టుబడి.. మీకు ఐదు రేట్లు లాభాలను తీసుకొస్తాయని ఆయన ఇటీవలే అన్నారు.I WANT TO VOMIT: getting nauseus, listening to Buffet tout the virtues of gold and silver…. after he ridiculed gold and silver for years. That means the stock and bond market are about to crash. Depression ahead?Even though Buffet shit on gold and silver investors like me…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 1, 2025 -
పండుగ వేళ అమాంతం తగ్గిన బంగారం ధరలు: వెండి మాత్రం..
భారీగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఈ కథనంలో నేటి (అక్టోబర్ 02) గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
'ఇందులో మీ పెట్టుబడి ఐదు రెట్లు పెరుగుతుంది'
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఒక కేజీ సిల్వర్ రేటు ఈ రోజు (సెప్టెంబర్ 29) రూ. 1,60,000 వద్దకు చేరింది. ఈ సమయంలో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. బిట్కాయిన్, గోల్డ్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాలను పొందవచ్చని, పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా వెండిపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా లాభాలను పొందవచ్చని వెల్లడించారు.''నా దగ్గర 100 డాలర్లు ఉంటే.. వెండి నాణేలను (Silver Coins) కొనుగోలు చేస్తాను. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. మీరు 100 డాలర్లు పెట్టుబడి పెడితే.. ఏడాదికి అదే 500 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. కాబట్టి నేను మరిన్ని వెండి నాణేలను కొనుగోలు చేస్తాను. మీరు కూడా వెండిపై ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు'' అని రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో షేర్ షేర్ చేశారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక2025 సెప్టెంబర్ 1వ తేదీ ఒక కేజీ వెండి ధర రూ. 1,36,000 వద్ద ఉండేది. ఈ రేటు ఇప్పుడు (సెప్టెంబర్ 29) రూ. 1,60,000కు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఒక్క నెలరోజుల వ్యవధిలోనే కేజీ సిల్వర్ రేటు రూ. 24,000 పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.IF I HAD $100 WHAT WOULD I INVEST IN?I WOULD BUY MORE SILVER COINS.Silver has been manipulated for years.In September 2025 Silver is about to explode. I predict your $100 in silver will be $500 in a year.I am buying more tomorrow.Please do not miss silvers explosion.…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 28, 2025 -
వెండి.. మరో రికార్డ్
న్యూఢిల్లీ: వెండి ధర గురువారం దేశీయంగా సరికొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. కిలోకి రూ.1,000 పెరిగి రూ.1,40 లక్షలకు చేరింది. మరోవైపు కొన్ని రోజులుగా రికార్డుల బాటలో నడిచిన పసిడి (99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాములకు రూ.630 నష్టపోయింది. రూ.1,17,370 స్థాయి వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ మార్కెట్లో వెండి ధర ఔన్స్కు 2 శాతానికి పైనే పెరిగి 45 డాలర్లకు చేరుకుంది.దేశీయంగా ఎంసీఎక్స్ (ఫ్యూచర్స్) మార్కెట్లో డిసెంబర్ కాంట్రాక్టు వెండి ధర రూ.3,528 పెరిగి రూ.1,37,530 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. 10 గ్రా. బంగారం కాంట్రాక్టు ధర రూ.223 పెరిగి రూ.1,12,778కు చేరింది. రేట్ల తగ్గింపుపై ఫెడ్ సానుకూల వైఖరి, 2025లోనూ రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు ధరల పెరగుదలకు కారణమైనట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు.అంతర్జాతీయంగా అనిశి్చతులకుతోడు డాలర్పై ఆధారపడడం తగ్గించుకోవడం అన్నవి బంగారం, వెండిలో కొనుగోళ్లకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్స్కు 8 డాలర్ల నష్టంతో 3,760 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారం, వెండిపై పెట్టింది అప్పుడే అంత అయింది!
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచియిత రాబర్ట్ కియోసాకి ఎప్పుడూ బంగారం, వెండి, బిట్ కాయిన్ల గురించే మాట్లాడుతుంటారు. వాటి మీదే పెట్టుబడులు పెట్టాలని తన ఫాలోవర్లకు సూచిస్తుంటారు. తన ప్రాధాన్యతల నమూనాగా రూపొందించిన పోర్ట్ ఫోలియో అంటే బంగారం, వెండి, బిట్కాయిన్లపై పెట్టిన పెట్టుబడులు 2025 లో ఇప్పటివరకు దాదాపు 40 శాతం పెరిగాయి.ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి, బిట్కాయిన్లపై పెట్టిన పెట్టుబడులే "నిజమైన డబ్బు" అని రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చెప్పే మాటకు ప్రాధాన్యత పెరిగింది. ఫిన్ బోల్డ్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం.. సంవత్సరం ప్రారంభంలో బంగారం, వెండి, బిట్ కాయిన్.. ఈ మూడు ఆస్తులలో సమానంగా విభజించి 1,000 డాలర్లు పెట్టుబడి పెట్టారనుకుంటే ఆ పోర్ట్ ఫోలియో సెప్టెంబర్ 23 నాటికి 1,372.43 కు పెరిగింది.ఏది ఎంతలా పెరిగిందంటే..బంగారం (Gold) 43.06 శాతం లాభంతో ఔన్స్ కు 2,658 డాలర్ల నుంచి 3,754 డాలర్లకు పెరిగింది. వెండి మరింత బలమైన పనితీరును అందించింది. ఔన్స్ కు 29.57 డాలర్ల నుండి 43.89 డాలర్లకు అంటే 47.5 శాతం ఎగిసింది. ఇక బిట్ కాయిన్ 21.17% పెరిగింది. 94,388 డాలర్ల నుండి 113,080 డాలర్లకు చేరింది. వెండి అత్యధిక పనితీరు చూపినా మొత్తం మూడు ఆస్తులు పోర్ట్ ఫోలియో బలానికి అర్థవంతంగా దోహదపడ్డాయని ఫిన్ బోల్డ్ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రపంచంలోనే రెండో ధనవంతుడు.. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు! -
గంటల వ్యవధిలో తారుమారైన బంగారం ధరలు
మంగళవారం ఉదయం గరిష్టంగా రూ. 1,260 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2,620లకు చేరింది. దీంతో పసిడి ప్రియులు ఒక్కసారిగా షాకయ్యారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేటు అమాంతం పెరిగిపోయింది, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఈ కథనంలో తాజా గోల్డ్, సిల్వర్ ధరలను చూసేద్దాం..👉హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.2,620 పెరిగి.. రూ.1,15,690 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,400 పెరిగి.. రూ. 1,06,050 వద్దకు చేరింది.👉ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు.. రూ.2,620 పెరిగి రూ.1,15,840 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,400 పెరిగి.. రూ.1,06,200 వద్దకు చేరింది.👉చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.2,300 పెరిగి రూ.1,16,080 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,06,400 వద్దకు చేరింది.ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో బంగారం రూ.2 లక్షలకు!: కారణాలు ఇవే..వెండి ధరలువెండి ధర రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 1,50,000కు చేరింది. ఉదయం రూ. 1000 పెరిగిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి మరో వెయ్యి రూపాయలు (మొత్తం రూ. 2000) పెరిగింది. -
బంగారంపై బిగ్ న్యూస్ అంటున్న రిచ్డాడ్ కియోసాకి
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి బిగ్ న్యూస్ అంటూ మరో సమాచారంతో ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ‘401(కె)’ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛనిస్తుందని, తనకు అనుకూలమైన బంగారం, వెండి, బిట్ కాయిన్ల విలువను మరింత పెంచుతుందని ఆనందం వ్యక్తం చేశారు.ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన 401(కె) రైటర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ అద్భుతమంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో రాబర్ట్ కియోసాకి ఓ పోస్ట్ పెట్టారు. తన స్నేహితుడు ఆండీ షెక్ట్మాన్ ప్రకారం.. ఆగస్టు 7న అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (401k)పై సంతకం చేశారని, అది ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛను ఇస్తుందని పేర్కొన్నారు.మ్యూచువల్ ఫండ్స్.. లూసర్లకు‘మీలో చాలా మందికి తెలుసు కదా.. నేను మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టను. నాకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు అనేవి నష్టపోయేవారి కోసం’ అంటూ రాసుకొచ్చారు. ట్రంప్ కొత్త ఉత్తర్వు 401కె.. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ, రుణాలు, క్రిప్టో , విలువైన లోహాలు వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులను ఒకే పన్ను గొడుగు కిందకు తెస్తుందన్నారు. ఇది తెలివైన, అధునిక ఇన్వెస్టర్లకు తలుపులు తెరుస్తుందన్నారు.కొత్త పెట్టుబడి అవకాశాలపై అధ్యయనం చేయలేనివారు, కష్టపడలేనివారు మాత్రం అవే సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ట్రంప్ కొత్త ఉత్తర్వుతో తాను మాత్రం చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఎందుకంటే ఇది తన బంగారం, వెండి, బిట్ కాయిన్ లను మరింత విలువైనదిగా చేస్తుందని వివరించారు.BIG NEWS: According to friend Andy Schectman….on August 7, 2025….President Trump signed an Executive Order “Democratizing Access to Alternative Investments for 401k Investors.”As some of you know I do not invest in mutual funds or ETFS. To me Mutual funds and ETFS are for…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 17, 2025 -
బంగారం బుల్లెట్ ర్యాలీ!
న్యూఢిల్లీ: కనకం ‘ల’కారం దాటినా తగ్గేదేలే అంటూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది! కొన్నిరోజులుగా రూ. లక్షపైనే కదలాడుతున్న పుత్తడి ఒక్కసారిగా మళ్లీ హైజంప్ చేసింది. బంగారం ధర మంగళవారం బుల్లెట్లా దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 5,080 పెరిగి రూ. 1,12,750 స్థాయికి చేరింది. దేశీయంగా బంగారానికి ఇది మరో కొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయి. అంతేకాదు.. ఒకేరోజు పసిడి ఇంతలా పెరగడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెండి ధర సైతం కిలోకు రూ. 2,800 లాభపడటంతో రూ. 1,28,800 స్థాయిని తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం 3,698 డాలర్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ‘బంగారం మరో రికార్డు స్థాయిని చేరింది. ఈ ఏడాది ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో 35 శాతం పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ల నుంచి బలమైన డిమాండ్కు తోడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి పెట్టుబడుల రాక, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు.. బంగారం, వెండిలో రికార్డు బ్రేకింగ్ ర్యాలీకి కారణమవుతున్నాయి’అని హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళనలు సైతం సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్నట్టు గాంధీ వివరించారు. -
వెండి.. భవిష్యత్తు బంగారం!
న్యూఢిల్లీ: బంగారం మాదిరే వెండికి సైతం డిమాండ్ బలపడుతోంది. ఫలితంగా వెండి ధర కిలోకి రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. బలమైన పారిశ్రామిక డిమాండ్, డాలర్ బలహీనత, సురక్షిత సాధనంగా పెట్టుబడుల డిమాండ్ ధరలకు మద్దతునిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ధర 37 శాతం పెరిగినట్టు గుర్తు చేసింది.‘‘వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చే ఆరు నెలల్లో కిలోకి రూ.1,35,000కు చేరుకోవచ్చు. 12 నెలల్లో రూ.1,50,000కు చేరొచ్చు. డాలర్తో రూపాయి మారకం 88.5 శాతం స్థాయిలో ఉంటుందని భావిస్తూ వేసిన అంచనా ఇది’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ తొలుత ఔన్స్కు 45 డాలర్లు, తర్వాత 50 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. బలమైన డిమాండ్ 2025లో వెండి మొత్తం ఉత్పత్తిలో 60 శాతం డిమాండ్ పారిశ్రామిక రంగం నుంచి వచ్చినట్టు యూఎస్కు చెందిన సిల్వర్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాలు, 5జీ ఇన్ఫ్రా రంగాల నుంచి వచ్చే కొన్ని త్రైమాసికాల పాటు వెండికి డిమాండ్ కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. సిల్వర్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి పెట్టుబడులు పెరుగుతుండడం కూడా ధరలు ఎగిసేందుకు దారితీస్తున్నట్టు పేర్కొంది.బంగారానికి తోడు వెండిని సైతం తమ రిజర్వుల్లోకి చేర్చుకోవడానికి కొన్ని సెంట్రల్ బ్యాంక్లు ఆసక్తి చూపిస్తుండడం, వెండి మెరుపులకు తోడవుతోంది. వచ్చే మూడేళ్లలో 535 మిలియన్ డాలర్ల విలువైన వెండిని తమ దేశ రిజిర్వుల్లోకి చేర్చుకోనున్నట్టు రష్యా ఇటీవలే ప్రకటించింది. సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది 40 మిలియన్ డాలర్ల మేర సిల్వర్ ఈటీఎఫ్లను కొనుగోలు చేయనుంది. 3,000 టన్నుల దిగుమతిదేశీయంగానూ వెండికి డిమాండ్ బలంగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3,000 టన్నుల వెండి దిగుమతి అయింది. పారిశ్రామిక రంగం నుంచే కాకుండా, పెట్టుబడులకు సైతం డిమాండ్ నెలకొంది. ‘‘జాక్సన్ హోల్ సింపోజియం తర్వాత ఫెడ్ సెప్టెంబర్ సమావేశంలో పావు శాతం మేర రేట్లను తగ్గించడం తప్పనిసరి అని తెలుస్తోంది. తక్కువ రేట్లు, యూఎస్ ఈల్డ్స్ క్షీణిస్తుండడం విలువైన లోహాల ధరలకు మద్దతునిస్తోంది’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. అయితే ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా స్వల్పకాలంలో లాభాల స్వీకరణను కొట్టిపారేయలేమని పేర్కొంది. ప్రస్తుత స్థాయి నుంచి, రేట్లు తగ్గిస్తే రూ.1,18,000– 1,15,000 స్థాయి వరకు వెండిని కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. -
స్పీడుమీదున్న కనకం.. తొలిసారి రికార్డు స్థాయికి!
భారతదేశంలో బంగారం ధరలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు (సెప్టెంబర్ 9) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1360 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,10,290 వద్దకు చేరింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పసిడి ప్రియులకు మంచి రోజు.. ఎందుకంటే?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూ.. ఆల్ టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి. నేడు (సెప్టెంబర్ 8) పసిడి రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 99,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 380 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 99,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,08,770 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 99,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 1,08,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 90 తక్కువ. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (సెప్టెంబర్ 08) కేజీ సిల్వర్ రేటు రూ. 1,37,000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,27,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇవే కారణాలు!
అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పటిష్టంగా ఉండటం, టారిఫ్లపరమైన అనిశ్చితి, ఈ నెలలో అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాల మధ్య పసిడి ర్యాలీ కొనసాగుతోంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం సోమవారం దేశీయంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ. 1,000 పెరిగి మరో కొత్త రికార్డు స్థాయి రూ. 1,05,670ని తాకింది.99.5 శాతం స్వచ్ఛత బంగారం రూ. 800 పెరిగి రూ. 1,04,800కి చేరింది. అమెరికా టారిఫ్లపరమైన అనిశ్చితి, వడ్డీ రేట్లపై ఫెడ్ వైఖరి గురించి ఆందోళన పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు, పసిడిలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారని ట్రేడర్లు వెల్లడించారు. రూపాయి మారకం క్షీణిస్తుండటం, భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పుత్తడి ఆకర్షణీయత మరింత పెరిగిందని ట్రేడ్జీని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డి. త్రివేశ్ తెలిపారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ రిజర్వ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, టారిఫ్లపరమైన అనిశ్చితి, ఈ నెలలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మొదలైన అంశాలు స్పాట్ మార్కెట్లో పసిడి ర్యాలీకి కారణమవుతున్నాయని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కాయ్నాత్ చైన్వాలా చెప్పారు.ఇదీ చదవండి: వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) పసిడి రేటు ఒక దశలో 3,556.87 డాలర్లకు ఎగిసింది. ఇది కొత్త ఆల్టైమ్ రికార్డు స్థాయి కావడం గమనార్హం. మరోవైపు, వెండి ధర కేజీకి మరో రూ. 1,000 పెరిగి ఇంకో కొత్త గరిష్ట స్థాయి రూ. 1,26,000ని తాకింది. పర్యావరణహిత విద్యుత్, ఎల్రక్టానిక్స్ తదితర పరిశ్రమల నుంచి డిమాండ్తో పాటు స్పెక్యులేషన్ కూడా వెండి ర్యాలీకి దోహదపడుతోందని త్రివేశ్ వివరించారు. -
వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,05,880లకు చేరింది. వెండి రేటు రూ. 1,36,000 (కేజీ) వద్ద ఉంది. కాగా సిల్వర్ రేటు మరో మూడేళ్ళలో ఏకంగా రెండు లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.మన దేశంలో వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్స్, ఫోటోవోల్టాయిక్ సెల్స్, వైద్య పరికరాలలో కూడా ఉపయోగిస్తున్నారు. ఆలయాల్లో కూడా వెండి వినియోగం చాలా ఎక్కువగా ఉంది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. పెట్టుబడిదారులు వెండివైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు వెండి ధరల్లో పెనుమార్పును తీసుకువచ్చే అవకాశం ఉంది.కేజీ వెండి రూ.2 లక్షల వద్దకు చేరుకోవడానికి ఇంకెంతో కాలం పట్టదు. ఈ ఏడాది వెండి ధరలు ఇప్పటికే 30 శాతం పెరిగి.. జీవితకాల గరిష్టాలను చేరుకుంది. రాబోయే రోజుల్లో ఈ ధర మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ మార్కెట్ ధోరణులు, పారిశ్రామిక వినియోగం, సాంస్కృతిక కొనుగోలు వంటివన్నీ ధరలు పెరుగుదలకు కారణమవుతాయని సీఏ నితిన్ కౌశిక్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు మరింత పెరుగుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?వెండి రేటు రాబోయే 12-24 నెలల్లో 15–20% పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ర్యాలీ కొనసాగితే.. కేజీ వెండి రూ. 2 లక్షలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని చెబుతున్నారు. పెట్టుబడులు పెట్టేవారు కూడా వెండిపై పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. వెండి నాణేలు, వెండి కడ్డీలు, వెండి ఆభరణాలు మొదలైనవాటిలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. -
‘రిచ్ డాడ్..’ రాబర్ట్ కియోసాకి మరో ముఖ్యమైన హెచ్చరిక..
గ్లోబల్ ఫైనాన్స్ ఎడ్యుకేటర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరో ముఖ్యమైన అంశంపై ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఇటీవల తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా “టాకింగ్ యువర్ బుక్” (talking your book) అనే ఆర్థిక పదాన్ని వివరించారు. దీని అర్థం తనకు లాభం వచ్చే ఆస్తులను ప్రచారం చేయడం, అది విద్య పేరుతో జరిగినా, వాస్తవంగా అమ్మకానికి దారితీస్తే అది నైతికంగా తప్పు అని ఆయన అభిప్రాయం.“నేను నా రియల్ ఎస్టేట్ ద్వారా మిలియన్లు సంపాదించాను… కానీ నేను మీకు ఏ ఆస్తి లేదా మోర్టగేజ్ అమ్మడం లేదు. నేను బోధిస్తున్నాను, అమ్మడం కాదు,” అని కియోసాకి పేర్కొన్నారు. అలాగే, ఒక యూట్యూబ్ రియల్ ఎస్టేట్ కుటుంబం తమ ఆర్థిక సదస్సులో “ఒక ప్రత్యేక పెట్టుబడి అవకాశాన్ని” ప్రస్తావిస్తూ, “మీరు అర్హులైతే” అని చెప్పడం ద్వారా విద్యను అమ్మకానికి మలచడం జరిగిందని ఆయన విమర్శించారు.బిట్కాయిన్, బంగారం, వెండి కొంటాను..టాకింగ్ యువర్ బుక్ పాఠంపై పోస్టుకు కొనసాగింపుగా మరో చేసిన పోస్టులో, కియోసాకి తన పెట్టుబడి విధానాన్ని స్పష్టంగా చెప్పారు. “నేను బంగారం, వెండి, బిట్కాయిన్ కొనుగోలు చేస్తాను. అమ్మడం చాలా అరుదు” అంటూ రాసుకొచ్చారు. ఇది దీర్ఘకాలిక ఆస్తులపై ఆయన నమ్మకాన్ని సూచిస్తుంది. మార్కెట్ను ప్రభావితం చేయాలనే ఉద్దేశం లేకుండా, ఆయన తన ఆర్థిక నమ్మకాలను పంచుకుంటున్నారని ఇది సూచిస్తుంది.VERY IMPORTANTANT $ LESSON;Q: What does “talking your book” mean?A: When a person is “talking their book” they have stopped teaching and are now selling.For example: I often state I make millions from my real estate…using debt. When I state that I am teaching… not…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 31, 2025 -
ఊపందుకున్న బంగారం ధరలు: ఒక్కసారిగా పైకి..
వినాయక చవితి వచ్చేసింది. బంగారం ధరలు మరోసారి ఊపందుకున్నాయి. నేడు (మంగళవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 550 పెరిగింది. దీంతో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
బంగారం, వెండి & బిట్కాయిన్.. ఈ మూడు గత ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు భారీ రాబడులను ఇచ్చాయి. అంతకు ముందుతో పోలిస్తే బంగారం ధర 40 శాతం పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష దాటేసింది. కేజీ వెండి ధర రూ.1.16 లక్షల వద్ద ట్రేడవుతోంది. బిట్కాయిన్ అద్భుతాలు చేస్తోంది. దీని విలువ 111 శాతం పెరిగి, కోటి రూపాయలు దాటేసింది. ఈ మూడింటిలో దేనిని ఎంచుకోవాలని కొందరు పెట్టుబడిదారులు సతమతమవుతుంటారు. ఈ ప్రశ్నకు రాబర్ట్ కియోసాకి & వారెన్ బఫెట్ ఏం చెబుతారంటే..'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి.. బంగారం, వెండి, బిట్కాయిన్ 'నిజమైన డబ్బు' అని చెబుతారు. ఎందుకంటే డబ్బును అదా చేస్తే.. దాని విలువ పెరగదు. వీటిపై (బంగారం, వెండి, బిట్కాయిన్) ఇన్వెస్ట్ చేస్తే విలువ పెరుగుతుంది, సంపన్నులవుతారని అంటారు. డాలర్ లాంటి కరెన్సీలను ఆయన 'నకిలీ డబ్బు' అని పిలుస్తారు.పేదలు, మధ్యతరగతి వారు దాదాపు డబ్బును బ్యాంకుల్లోనే దాచుకుంటారు. ఆ డబ్బు బ్యాంక్ ఖాతాలోనే ఉంటుంది. దాని విలువ ఎప్పటికీ పెరగదు. కానీ డబ్బును రియల్ ఎస్టేట్, బంగారం, చమురు, షేర్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే.. మీ సంపద పెరుగుతుందని కియోసాకి చెబుతారు.ప్రపంచంలోని గొప్ప పెట్టుబడిదారులలో ఒకరైన వారెన్ బఫెట్.. పెట్టుబడిదారుడిగా అతని జ్ఞానాన్ని పెట్టుబడి ప్రపంచంలో బైబిల్గా పరిగణిస్తారు. అయితే బంగారం పనికిరానిదని, వెండి మంచిదని, బిట్కాయిన్కు విలువ లేదని చెబుతారు. బంగారం ఏమీ చేయదు.. అక్కడే ఉంటుంది. ఏదైనా ఆస్తి ఉత్పాదకంగా ఉన్నప్పుడు మాత్రమే విలువ పెరుగుతుందని బఫెట్ విశ్వసిస్తారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ క్రాష్: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం మీద పెట్టుబడి చూపడానికి ఆసక్తి చూపని బఫెట్.. వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి సుముఖత చూపుతారు. ఎందుకంటే.. వెండి ఎలక్ట్రానిక్స్, సౌర ఫలకాలు, వైద్య పరికరాల వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో దీనికి మంచి వాల్యూ ఉంటుందని చెబుతారు. బిట్కాయిన్ లేదా క్రిప్టోకరెన్సీ ఏ ఉత్పాదక కార్యకలాపాలతోనూ సంబంధం లేదని ఆయన నమ్ముతారు.గమనిక: బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలంటే.. వాటిపై తప్పకుండా కొంత అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా వీటిలో పెట్టుబడులు పెడితే.. లాభాల సంగతి దేవుడెరుగు, నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా వీటిపై అవగాహన పెంచుకోవాలనే విషయం మర్చిపోవద్దు. -
తగ్గుతున్న బంగారం ధరలు: వరుసగా ఎనిమిదో రోజు ఇలా
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు (శనివారం) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 60 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి. పసిడి ధరలు తగ్గుతుంటే.. వెండి మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ కథనంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?
భారతదేశంలో ఆగస్టు 09 నుంచి బంగారం ధరలు ఏ మాత్రం పెరగడం లేదు. క్రమంగా తగ్గుతూ నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,01,240 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్స్ పసిడి ధరలు కూడా అమాంతం తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం కొనడానికి ఇదో మంచి తరుణం అని పసిడి ప్రియులు భావిస్తున్నారు. ఈ కథనంలో ఈ రోజు (శుక్రవారం) దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్థిరంగా బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఎట్టకేలకు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో.. నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధరలు మాత్రమే పెరుగుదల దిశగా అడుగులు వేశాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు (గురువారం) పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.అమలు: 2025 సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ ప్రవేశపెట్టనున్నారు.స్వచ్ఛత గ్రేడ్లు: వెండి ఆభరణాల కోసం బీఐఎస్ 900, 800, 835, 925, 970, 990 అనే ఆరు స్వచ్ఛత గ్రేడ్లను పేర్కొంది.హాల్మార్కింగ్ ప్రక్రియ: హాల్మార్కింగ్ ప్రక్రియలో వెండి ఆభరణాలకు ఆరు అంకెల HUID అందించడం జరుగుతుంది. ఈ నెంబర్ దాని ప్రామాణికత, స్వచ్ఛతను సూచిస్తుంది.ఉపయోగం: వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్ 'వెరిఫై HUID' ఫీచర్ను ఉపయోగించి.. హాల్మార్క్ చేసిన ఆభరణాల ప్రామాణికతను ధృవీకరించవచ్చు. హాల్మార్కింగ్ వల్ల నకిలీ లేదా కల్తీ వెండి ఉత్పత్తులను కనిపెట్టవచ్చు. తద్వారా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.హాల్మార్కింగ్ అంటే.. బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.ఇదీ చదవండి: బంగారంపై సుంకం లేదు: డొనాల్డ్ ట్రంప్ -
బాబోయ్ బంగారం!.. వరుసగా నాలుగో రోజు పైపైకి
భారతదేశంలో బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 220 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (గురువారం) బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆగని పరుగు.. దూసుకెళ్తున్న రేటు: నేటి బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు అమాంతం పెరుగుదల దిశవైపు అడుగులు వేస్తూనే ఉన్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 110 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (బుధవారం) బంగారం ధరల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ద్వారా ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి ఏదో క్రాష్ రాబోతోందని హెచ్చరించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ సహా అసెట్ క్లాసుల్లో బుడగలు పేలబోతున్నాయంటూ ఈ 78 ఏళ్ల ఇన్వెస్టర్, ఎంట్రాప్రెన్యూర్ సంకేతాలిచ్చారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో రాబర్ట్ కియోసాకి ఒక పోస్ట్ చేశారు. "బుడగలు పేలడం ప్రారంభించాయి.. బుడగలు పేలినప్పుడు బంగారం, వెండి, బిట్ కాయిన్ కూడా పతనమవుతాయి. గుడ్ న్యూస్’ అంటూ రాసుకొచ్చారు.క్రాష్ అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ రానున్న పతనాన్ని కొనుగోలు అవకాశంగా కియోసాకి పేర్కొన్నారు. ధరలు పడిపోతే తాను బంగారం, వెండి, బిట్ కాయిన్లలో ఎక్కువ పెట్టుబడి పెడతానని చెప్పుకొచ్చారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్తమ సమయం ధరలు తక్కువగా ఉన్నప్పుడు, భయం ఎక్కువగా ఉన్నప్పుడు అని ఆయన వివరించారు.BUBBLES are about to start BUSTING.When bubbles bust odds are gold, silver, and Bitcoin will bust too.Good news.If prices of gold, silver, and Bitcoin crash…. I will be buying.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) July 21, 2025 -
గురు పూర్ణిమ: షిర్డీ సాయినాథుడికి కళ్లు చెదిరే బంగారు వజ్రాభరణాల కానుకలు
సాక్షి,ముంబై: శిర్డీలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ముఖ్యమైన రోజు కావడంతో లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. గురుపూర్ణిమ సందర్భంగా మందిరాన్ని వివిధ రకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురుపూర్ణిమతో ‘శ్రీ సాయిసచ్చరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండపారాయణం సమాప్తి అయిన సందర్భంగా శ్రీసాయి చిత్రపటం, పోతిని ఊరేగించారు. ఈ ఊరేగింపులో సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అంజు శెండే (సోనటక్కే) ‘పోతి’(ధాన్యపుసంచి)ని చేతబట్టుకోగా, మందిరం కార్యనిర్వాహణ అధికారి (ఈఓ) గోరక్ష గాడిల్కర్ వీణ, డిప్యూటీ ఈఓ భీమరాజ్ వరాడే, మెకానికల్ విభాగం ప్రముఖులు అతుల్ వాఘ్లు సాయిచిత్రపటం చేతబట్టుకుని ముందుకు నడిచారు. ఈ ఊరేగింపులో సంస్థాన్ పదాధికారులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి సమీపంలో నిర్మించిన భారీ వేదికపై వివిధ భక్త మండళ్ల బృందాల ఆధ్వర్యంలో రోజంతా భజనలు, ఆధ్యాత్మిక గీతాలు, కీర్తనల ఆలాపన కొనసాగింది. గురుస్థాన్లో నేడు రుద్రాభిషేకంగురుపౌర్ణమి ఉత్సవాల ముగింపు సందర్భంగా నేడు గురుస్థాన్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించ నున్నారు. ఉట్టి ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపనున్నారు. ఆంధ్ర భద్రావతి పేట్ ఆలయానికి భక్తుల తాకిడి సోలాపూర్: గురుపూర్ణిమను పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్కల్కోట్లో శ్రీ స్వామి సమర్థ మహారాజ్ను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయాలు, ఆశ్రమాల్లో ధార్మిక, ఆధ్యాత్మికక కార్యక్రమాలు ప్రవచనాలు, సత్సంగాలు జరిగాయి. వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబా దర్శనం కోసం ఆంధ్ర భద్రావతి పేట్లోని శ్రీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనంతోపాటు స్పెషల్ క్యూలైన్లలోనూ బారులు తీరారు. ఈ ఆలయంలో వారంరోజులుగా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా బుధవారం ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాయినాథ రథ ఊరేగింపు నిర్వహించారు. శ్రీ సాయి దర్బార్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు దత్త నగర్, పద్మశాలీ చౌక్, జంకండి పూల్, జోడు బసవన్నచోక్, మార్కండేయ చౌక్, గుజ్జ నివాస్, వినాకర్ బాగ్, కన్నా చౌక్, రాజేంద్ర చౌక్ మార్గాల గుండా ఆంధ్ర బద్రావతి పేట్ వరకు కొనసాగింది. గణేశ్పురి ఆలయంలో గురుపూర్ణిమ పూజలు భివండీ: గురుపూర్ణిమ సందర్భంగా గణేశ్పురిలోని శ్రీ నిత్యానంద స్వామిని దర్శించు కునేందుకు భివండీ, ముంబై, కళ్యాణ్, ఠాణా, ముర్బాడ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాజీ కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాసపూరి్ణమ సందర్భంగా గురువారం తెలుగు సమాజ్ శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పి.ఈ. ఎం. హైసూ్కల్, జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల, వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, విద్యానికేతన్ స్కూల్, వివేకానంద ఇంగ్లీశ్ మీడియం హైసూ్కల్, బాబా హైసూ్కల్ అండ్ జూనియర్ కాలేజీలోప్రత్యేక కార్యక్రమాలు, విద్యార్థులతో తల్లిదండ్రులకు–ఉపాధ్యాయులకు పాద సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అఖిల పద్మశాలి సమాజ్ కోశాధికారి అవదూత బలరాం బాలె శ్రీనివాస్, భైరి నిష్కమ్, గాజెంగి కృష్ణ, చిటికెన్ వెంకటేశ్, గాజెంగి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా విద్యానందగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజ, పాదపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి నారాయణ, మహేశుని భూమేశ్, యెన్నం శ్రీనివాస్, చెక్కరకోట మనోహర్, వేమున ఆనంద్, బాలె సత్యనారాయణతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా ఓ అజ్ఞాత భక్తుడు సాయిబాబాకు బంగారు కిరీటం, వెండి హారం సమర్పించారు. 566 గ్రాముల బరువున్న రూ.59 లక్షల విలువైన బంగారు కిరీటం, 54 గ్రాముల బరువున్న బంగారు పువ్వులు, 2 కిలోల బరువున్న వెండి హారం ఇందులో ఉన్నాయి.గురుపూర్ణిమను పురస్కరించుకుని చెన్నైకి చెందిన లలితా మురళీధరన్, కె. మురళీధరన్ దంపతులు బాబాకు రూ. 3.05 లక్షల విలువైన బ్రూచ్ సమర్పించారు. బంగారం, వజ్రాలతో దీనిని తయారు చేశారు. -
వెండిలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయా?
-
బంగారం కంటే వెండి ముద్దు
విలువైన లోహంలో ఒకటిగా ఉన్న బంగారం ధరలు ఇటీవల కాలంలో 10 గ్రాములు రూ.1లక్షకుపైగా చేరింది. ఇంకోవైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో వీటి ధరలు ఆకాశాన్నంటినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండిలో పెట్టుబడిపెట్టే వారికి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సూచనలు చేశారు.ఇప్పటికే బంగారం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత సమయంలో పుత్తడి కంటే వెండిపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చని కియోసాకి తెలిపారు. బంగారంతోపాటు బిట్కాయిన్ ధరలు పెరిగిన తరుణంలో అవి కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాతే వాటిని కొనుగోలు చేస్తానని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బంగారం, బిట్కాయిన్ ధరలు ఎప్పుడు పడుతాయోనని వేచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందు సొంతంగా రిసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు.FYI: Silver is the best investment today….june 2025. Gold and Bitcoin are high and I am waiting for gold and Bitcoin to crash before I add to my position.That’s what I think.Do your own research.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) June 23, 2025ఇదీ చదవండి: టూవీలర్లపై టోల్ ఛార్జీలు..?ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి ఇటీవల వెండి గురించి ఇటీవల సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ ‘నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం’ అని అభివర్ణించారు. -
వెండి కంచాల్లో విందు.. వివాదంలో బీజేపీ సర్కార్
ముంబై: మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై కొత్త వివాదం నెలకొంది. ప్రభుత్వం వృథా ఖర్చులపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ కార్యక్రమంలో అతిథులకు భారీ ఖర్చుతో వెండి పళ్లెంలో ఆహారం వడ్డించడం వివాదాస్పదంగా మారింది. అంత ఖర్చు చేసి వెండి ప్లేట్లలో వడ్డించాల్సిన అవసరమేంటని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై వేదికగా పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం జరిగింది. ముంబైలోని విధాన్ భవన్ కాంప్లెక్స్లో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది అతిథులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అతిథులకు విలాసవంతమైన హోటల్లో వెండి ప్లేట్లలో, భారీ ఖర్చుతో భోజనం వడ్డించారు. దీంతో, ఈ ఘటన వివాదానికి దారి తీసింది. అతిథులు ఒక్కొక్కరికి రూ.550 చొప్పున అద్దెకు తీసుకున్న వెండి డిన్నర్ ప్లేట్లపై రూ.5,000 విలువైన భోజనం వడ్డించారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది.ఈ సందర్బంగా కాంగ్రెస్ శాసనసభా నాయకుడు విజయ్ వాడేట్టివార్స్ స్పందిస్తూ..‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఇంత ఖర్చు చేసి వెండి ప్లేట్లపై అతిథులకు వడ్డించడం ఎందుకు?. విలాసవంతమైన విందు ఎందుకు ఇచ్చారు. దీని కోసం దాదాపు 27 లక్షలు ఖర్చు చేశారు. ఇదంతా వృథా ఖర్చే కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయలేదు. బోనస్లు చెల్లించడం లేదు. అనేక సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. కానీ, ఇలాంటి ఖర్చులు చేయడానికి మాత్రం బీజేపీ ప్రభుత్వం వెనుకాడదు అంటూ చురకలు అంటించారు.While enjoying ₹4,500 meals served in silver platters with royal Peshwa-style flair, and staying in luxury hotels like Taj and Trident, members of the Estimates Committee proclaimed in the conference that,“Estimates Committees must ensure that every rupee is spent for public… pic.twitter.com/mMwjbCkWGv— Vijay Kumbhar (@VijayKumbhar62) June 25, 2025మరోవైపు.. ఈ సమావేశంపై సామాజిక కార్యకర్త కుంభార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన..‘రాజ పేష్వా శైలి వైభవంతో వెండి ప్లేట్లతో అతిథులకు భోజనం వడ్డించారు. తాజ్, ట్రైడెంట్ వంటి లగ్జరీ హోటళ్లలో అంచనాల కమిటీ సభ్యులు బస చేశారు. అంచనాల కమిటీ అంటే ప్రతీ రూపాయిని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం కోసం ఆలోచించాలి. కానీ, ఇలాంటి దుబారా ఖర్చులు చేయడమేంటి?. ఇలాంటి వారు.. ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. 5000 ఖర్చు చేసే భోజనం పెట్టి వెండి ప్లేట్ల కోసం 27 లక్షలు ఖర్చు చేశారు’ అని మండిపడ్డారు.అయితే, కాంగ్రెస్ నేతలు, పలువురు ఆరోపిస్తున్నట్టు అవి వెండి ప్లేట్లు కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేవలం వెండి పూత మాత్రమే ప్లేట్లకు పూసి ఉందని అంటున్నారు. అలాగే, భోజనం ఖర్చు కూడా 5000 కాదని తక్కువగా ఉందని వ్యాఖ్యలు చేశారు. -
వెండి రికార్డుల మోత
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో వెండి, బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధర గత ఆల్టైమ్ గరిష్టం రూ.1,08,100ను అధిగమించింది. ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,08,200 స్థాయికి చేరుకుంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.1,00,710 స్థాయిని తాకింది. రూ.540 లాభపడింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో 2012 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి 37 డాలర్లను వెండి అధిగమించింది. రూపాయిలో బలహీనత దేశీ మార్కెట్లో బులియన్ ధరలకు మద్దతుగా నిలిచింది’అని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర పెద్దగా మార్పు లేకుండా 3,400 డాలర్ల స్థాయిలో ఉంది. డాలర్ బలపడడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల పెరుగుదల బంగారం ధరలపై ప్రభావం చూపించినట్టు కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది. దీనికితోడు బుధవారం యూఎస్ ఫెడ్ సమావేశం నిర్ణయాలు బయటకు రానుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి పాటించినట్టు తెలుస్తోంది. -
Gold Price: మళ్లీ రూ.లక్ష దాటిన బంగారం ధర
-
వెండి వెలుగులు
న్యూఢిల్లీ: దేశీయంగా వెండి గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వరుసగా నాలుగో రోజు పరుగును కొనసాగిస్తూ న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కేజీ ధర మరో రూ. 2,000 పెరిగి రూ. 1,04,100 (పన్నులు కలిపి) పలికింది. చివరిసారిగా మార్చి 19న వెండి రేటు ఆల్ టైమ్ గరిష్టమైన రూ. 1,03,500 స్థాయిని తాకింది. పటిష్టమైన ఫండమెంటల్స్, పరిశ్రమల నుంచి డిమాండ్, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా ఉపయోగిస్తుండటం, అంతర్జాతీయంగా సరఫరా నెమ్మదించడం తదితర అంశాల కారణంగా దేశీ మార్కెట్లో వెండి రేటు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. అటు మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో సిల్వర్ ఫ్యూచర్స్ జూలై కాంట్రాక్టు ధర ఒక దశలో సుమారు రూ. 3,833 పెరిగి రూ. 1,05,213 వద్ద ట్రేడయ్యింది. పసిడి పరుగు.. డాలరు బలహీనత, అమెరికా రుణభారంపై ఆందోళనలు, అనిశ్చితిలో సురక్షితమైన సాధనంగా పసిడికి పేరుండటం వంటి అంశాల కారణంగా బంగారం ధర కూడా పరుగు తీస్తోంది. 99.9 శాతం స్వచ్ఛత గల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 430 పెరిగి రూ. 99,690 వద్ద (పన్నులు కలిపి) ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం రూ. 400 పెరిగి రూ. 99,100 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్సుకు (31.1 గ్రాములు) 3,395 డాలర్ల పైకి చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్లో రూ. 98,450 వద్ద ట్రేడయినట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.దీపావళి నాటికి దీపావళి నాటికి వెండి ధర రూ. 1,14,000 – రూ. 1,20,000 స్థాయికి చేరే అవకాశం ఉందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితుల కారణంగా ఈలోపు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని పేర్కొన్నారు. మరోవైపు, కొత్తగా భౌగోళిక రాజకీయ పరిణామాలేమైనా తలెత్తితే మరింత అనిశ్చితికి ఆజ్యం పోసినట్లవుతుందని, దీంతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారంవైపు మొగ్గు చూపవచ్చని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా చెప్పారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న బంగారం: ఎందుకిలా..
భారతదేశంలో బంగారం ధరలు మళ్ళీ లక్ష రూపాయల ధర వద్దకు చేరువకు చేరుతున్నాయి. మే మొదటి వారం తరువాత తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేటు.. మళ్ళీ దూసుకెళ్తోంది. గురువారం గోల్డ్ మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగింది. దీంతో ధరలు మళ్ళీ పైపైకి పయనించాయి. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ నష్టాలను చవిచూశాయి.స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తున్న సమయంలో.. బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో రెండు రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర సుమారు 300 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు దాదాపు రూ. 98,000 వద్దకు చేరింది. ఇదిలా కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో.. తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకుంటుండటంలో ఎటువంటి సందేహం లేదు.స్టాక్ మార్కెట్లు డీలా పడుతుండటంతో.. పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇంతుకు ముందు ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు కొంత అనుకూలంగా ఉన్నట్లే అని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం ఎప్పుడూ భద్రమైన ఆస్తి, కాబట్టి పసిడి కొనుగోలు చేయడానికే ఆసతి చూపండి అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే ఉన్నారు. బంగారం కొనుగోలు చేస్తే.. పేదవారు కూడా భవిష్యత్తులో ధనవంతులవుతారని ఆయన చాలా రోజులకు ముందే వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కూడా ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, జాగ్రత్త పదండి.. అంటూ ఓ సుదీర్ఘ సందేశాన్ని వెల్లడించారు. -
వెండి గాజుల కోసం.. కొడుకు కాదు!
డబ్బుకోసం ఎంత నీచానికైగా దిగజారిపోతున్నాడు మనిషి. తప్పు చేస్తున్నామన్న భయం, పాపభీతి, ఆందోళన ఇలాంటివన్నీ కనుమరుగై పోతున్నాయి. అందుకే మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనిఅంటూ ఏనాడో ఆవేదన వ్యక్తం చేశాడు కవి అందెశ్రీ. కనీస మానవ విలువల్ని మంట గలుపుతూ కన్న బిడ్డలే తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కోకొల్లలుగా చూస్తున్నాం. చనిపోయిన తరువాత కూడా తల్లి నగలకోసం ఒక కొడుకు అతి హీనంగా ప్రవర్తించిన ఉదంతం నెట్టింట హృదయ విదారకంగా నిలిచింది. జైపూర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వెండి ఆభరణాల కోసం తన సొంత తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడో కొడుకు. అవి తనకు దక్కేదాకా అంత్యక్రియలు జరిగేదే లేదంటూ నానా యాగీ చేశాడు. చివరికి ఆమె చితిపై పడుకుని, నన్ను కూడా తగలబెట్టండి అంటూ గొడవ చేశాడు. దీంతో ఆమె అంతిమ సంస్కార కార్యక్రమాలు రెండు గంటలు నిలిచిపోయాయి. ఈ సంఘటన జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని విరాట్నగర్ ప్రాంతంలో జరిగింది. దీన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.ఈ నెల 3న, 80 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. ఆమె కుమారులు, బంధువులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలిని చితిపై ఉంచే ముందు, కుటుంబ పెద్దలు ఆమె వెండి గాజులు ,ఇతర ఆభరణాలను ఆమె పెద్ద కుమారుడు గిర్ధారి లాల్ కు అప్పగించారు.ఆమె బ్రతికి ఉన్నప్పుడు పెద్ద కుమారుడే ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగాచిన్న కుమారుడు ఓంప్రకాష్ వాగ్వాదానికి దిగాడు. చితిపై పడుకుని, వెండి గాజులు ఇవ్వకపోతే దహన సంస్కారాలు కొనసాగించడానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు.బంధువులు, గ్రామస్తులు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినలేదు పైగా తనను తాను దహనం చేసుకుంటానని బెదిరించాడు. చివరికి, చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని బలవంతంగా చితిరి దూరంగా లాగి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అయినా అతగాడు పక్కనే కూర్చుని తన నిరసనను కొనసాగించాడు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, ఓంప్రకాష్ , అతని సోదరుల మధ్య చాలా కాలంగా ఆస్తి వివాదం ఉంది. -
పసిడి.. మళ్లీ లక్షకు చేరువలో
న్యూఢిల్లీ: పసిడి మరోసారి ర్యాలీ చేసింది. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 లాభపడి రూ.99,750 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా టారిఫ్లపై చేసిన ప్రకటన, భౌగోళిక ఉద్రిక్తతలతో బంగారానికి డిమాండ్ ఏర్పడింది. జ్యుయలర్ల నుంచి కొనుగోళ్లు పెరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.2,400 పెరిగి రూ.99,300 వద్ద స్థిరపడింది. ‘‘ట్రంప్ ఫార్మాస్యూటికల్స్పై, అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం టారిఫ్లను ప్రతిపాదించారు. దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి, అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో సురక్షిత సాధనమైన బంగారానికి తిరిగి డిమాండ్ ఏర్పడింది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. బుధవారం యూఎస్ ఫెడ్ పాలసీ సమీక్ష వివరాల కోసం మార్కెట్ భాగస్వాములు ఎదురుచూస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో వెండి ధర కిలోకి రూ.1,800 పెరిగి రూ.98,500కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 3,400 డాలర్లపైకి అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. ఔన్స్కు 100 డాలర్ల వరకు పెరిగి 3,422 డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా డాలర్ బలహీనత సైతం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
బంగారం @ 96,800
న్యూఢిల్లీ: బంగారం మళ్లీ మెరిసింది. జ్యువెలర్లు కొనుగోళ్లకు ముందుకు రావడంతో శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,080 పెరిగి రూ.96,800 వద్ద స్థిరపడింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం కేవలం రూ.180 లాభపడి రూ.96,350 వద్ద ముగిసింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పట్ల సానుకూల ధోరణి కనిపించింది. ఔన్స్కు 47 డాలర్లు పెరిగి 3,269 డాలర్ల స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర సైతం దేశీయంగా కిలోకి రూ.1,600 ఎగసి రూ.97,100 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల ధోరణితో జ్యువెలర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.యూఎస్ వాణిజ్య ఒప్పందాలపై తాజాగా నెలకొన్న సందిగ్ధతతో బంగారం పట్ల సానుకూల సెంటిమెంట్ ఏర్పడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అస్పష్టతకు తోడు వాణిజ్య సంప్రదింపులపై మారుతున్న అమెరికా వైఖరితో ఇన్వెస్టర్లు బంగారంలో షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు మొగ్గు చూపించినట్టు చెప్పారు. -
వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం కొనుగోలు
దేశవ్యాప్తంగా వచ్చే 12–18 నెలల్లో 50 వరకు బంగారం, వెండి వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్టు యాస్పెక్ట్ బులియన్ అండ్ రిఫైనరీ ప్రకటించింది. ఈ వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. వెండింగ్ మెషిన్ వద్దే అప్పటికప్పుడు ధరలను కస్టమర్లు చూసుకోవచ్చని.. రియల్టైమ్ మార్కెట్ ధరలు అక్కడ కనిపిస్తాయని పేర్కొంది. వేగంగా, భద్రంగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ వెండింగ్ మెషిన్లు ఉంటాయని.. మూడు నిమిషాల్లోనే కొనుగోలును పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు సహా పలు రకాల పేమెంట్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.వెండింగ్ మెషిన్ ఎలా పని చేస్తుందంటే..గోల్డ్ కాయిన్ వెండింగ్ మెషిన్లు సాధారణ వెండింగ్ మెషీన్ల మాదిరిగానే పనిచేస్తాయి. కానీ బంగారం విలువ కారణంగా అదనపు భద్రతను కల్పిస్తారు. అందులో భాగంగా వినియోగదారుల వెరిఫికేషన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.మెషిన్లో ముందుగా వినియోగదారులు తమకు కావాల్సిన బంగారు నాణెం బరువు, రకాన్ని ఎంచుకుంటారు.నగదు, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా మొబైల్ బ్యాంకింగ్ (యూపీఐ, క్యూఆర్ కోడ్లు మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు.కొన్ని యంత్రాలకు గుర్తింపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. ముఖ్యంగా అధిక మొత్తంలో చేసే లావాదేవీల కోసం ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వంటి కేవైసీ (నో యువర్ కస్టమర్) పద్ధతులను ఉపయోగిస్తారు.చెల్లింపు అయినట్లు ధ్రువీకరించిన తరువాత మెషిన్లోని స్టోరేజ్ కంపార్ట్మెంట్ నుంచి బంగారు నాణేన్ని రిలీజ్ చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రంకొన్ని యంత్రాల ద్వారా బంగారు కడ్డీలు కూడా పొందే వీలుంటుంది. దానికి సంబంధించిన వివరాలను ముందుగానే వినియోగదారులకు తెలియజేస్తుంది.పంపిణీ సమయంలో భద్రతకోసం సీసీటీవీ మానిటరింగ్, ట్యాంపరింగ్ ప్రూఫ్ మెకానిజమ్స్, వెయిట్ సెన్సర్లను అమరుస్తారు.యంత్రాల్లో యాంటీ-థెఫ్ట్ అలారంలు, రియల్-టైమ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది.బంగారం కొనుగోలు రుజువు కోసం ఈ-రశీదులు కూడా పొందవచ్చు. -
ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 21) గరిష్టంగా రూ. 770 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,350 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 770 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 98,350 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 9030 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 98,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 21) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో ఒడిదొడుకులకు లోనవుతుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,200 (22 క్యారెట్స్), రూ.95,180 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.350, రూ.330 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,180 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.350 దిగి రూ.87,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.330 తగ్గి రూ.95,330 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినట్లే వెండి ధరల్లోనూ(Silver Price) స్వల్పంగా మార్పులొచ్చాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే మంగళవారం కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,09,800 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇక బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజు (ఏప్రిల్ 12) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 270 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,670 వద్ద నిలిచాయి. నిన్న మాదిరిగానే ఈ రోజు కూడా రూ. 250 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 270 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 250, రూ. 270 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,670 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,850 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,850 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 12) కేజీ సిల్వర్ రేటు రూ. 1,10,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: అదృష్టమంటే ఇదే.. ఒకేసారి రెండు లాటరీలు.. ఊహించనంత డబ్బు! -
బాబోయ్ బంగారం.. రెండు రోజుల్లో రూ.4960 పెరిగిన రేటు
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం గరిష్టంగా రూ. 2940 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు (ఏప్రిల్ 11) రూ. 2020 పెరిగి ఒక్కసారిగా షాకిచ్చింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,400 వద్ద నిలిచాయి. నిన్న మాదిరిగానే ఈ రోజు కూడా రూ. 1850 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 2020 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1850, రూ. 2020 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,450 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,400 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,600 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,550 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1850, రూ. 2020 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 11) కేజీ సిల్వర్ రేటు రూ. 1,08,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,100 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: గూగుల్ డొమైన్ కొనేసిన ఇండియన్.. తర్వాత ఏం జరిగిందంటే? -
ఒకేసారి రూ.2940 పెరిగిన గోల్డ్ రేటు: నేటి కొత్త ధరలు ఇవే..
వరుస తగ్గుదల తరువాత.. కొంచెం పెరిగిన బంగారం ధర ఈ రోజు (ఏప్రిల్ 10) ఊహకందని రీతిలో పెరిగింది. ధరల పెరుగుదలలో బహుశా ఇదే అల్టైమ్ రికార్డ్ అనే తెలుస్తోంది. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2940 పెరిగి.. పసిడి ప్రియులకు షాకిచ్చింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 93,380 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఈ రోజు రూ. 2700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 2940 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 2700, రూ. 2940 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,380 వద్ద ఉంది.ఇదీ చదవండి: రూ.4 కోట్ల కారు.. ₹46 లక్షల నెంబర్ ప్లేట్దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 85,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 93,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 2700, రూ. 2940 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 10) కేజీ సిల్వర్ రేటు రూ. 1,04,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 95,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్టైమ్ రికార్డ్!
దేశంలో తొమ్మిదో రోజు బంగారం ధరలు దూసుకెల్తూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 3) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ.540 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 93,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధర.. ఈ రోజు రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 540 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 500, రూ. 540 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,380 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 85,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 93,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500, రూ. 540 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: EPFO విత్డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (ఏప్రిల్ 3) కేజీ సిల్వర్ రేటు రూ. 1,13,900 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,04,900 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
అమాంతం పెరిగిపోతున్న బంగారం ధరలు: నాలుగు రోజుల్లో..
ఉగాదికి ముందే బంగారం ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేటు ఎగిసిపడింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 83,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,200 వద్ద నిలిచాయి. నిన్న రూ. 1050 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1140 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 83,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,200 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 83,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 91,350 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 29) కేజీ సిల్వర్ రేటు రూ. 1,13,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,04,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
వరుసగా తగ్గి.. మళ్ళీ పెరిగిపోతున్న బంగారం ధరలు
ఎండాకాలంలో వచ్చిన వానలాగా.. అలా వచ్చి ఇలా వెళ్లినట్లు, బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గి.. మళ్ళీ అమాంతం పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు గోల్డ్ రేటు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 110 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,350 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,840 వద్ద ఉంది.ఇదీ చదవండి: జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వందేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,990 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (మార్చి 27) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఊహించని రీతిలో.. మరోమారు తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు పెరుగుదలకు బ్రేక్ పడింది. వరుసగా రెండో రోజు గోల్డ్ రేటు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,300 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,980 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు కూడా వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,300 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,980 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,450 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,980 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 22) కేజీ సిల్వర్ రేటు రూ. 1,10,100 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: చాహల్తో విడాకులు.. ధనశ్రీ వర్మకు రూ.4.75 కోట్లు: ఇందులో ట్యాక్స్ ఎంత? -
ఉన్నట్టుండి తగ్గిన బంగారం ధరలు
మూడు రోజుల ధరల పెరుగుదల తరువాత.. గోల్డ్ రేటు ఉన్నట్టుంది తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,220 వద్ద నిలిచాయి. నిన్న రూ. 200, రూ. 220 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,220 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,850 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 90,370 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 21) కేజీ సిల్వర్ రేటు రూ. 1,12,100 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,03,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!


