'ఇందులో మీ పెట్టుబడి ఐదు రెట్లు పెరుగుతుంది' | Silver Hits Record Highs Robert Kiyosaki Predicts 5x Returns in Silver | Sakshi
Sakshi News home page

'ఇందులో మీ పెట్టుబడి ఐదు రెట్లు పెరుగుతుంది'

Sep 29 2025 4:34 PM | Updated on Sep 29 2025 5:55 PM

Silver Hits Record Highs Robert Kiyosaki Predicts 5x Returns in Silver

బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఒక కేజీ సిల్వర్ రేటు ఈ రోజు (సెప్టెంబర్ 29) రూ. 1,60,000 వద్దకు చేరింది. ఈ సమయంలో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. బిట్‌కాయిన్‌, గోల్డ్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాలను పొందవచ్చని, పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా వెండిపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా లాభాలను పొందవచ్చని వెల్లడించారు.

''నా దగ్గర 100 డాలర్లు ఉంటే.. వెండి నాణేలను (Silver Coins) కొనుగోలు చేస్తాను. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. మీరు 100 డాలర్లు పెట్టుబడి పెడితే.. ఏడాదికి అదే 500 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. కాబట్టి నేను మరిన్ని వెండి నాణేలను కొనుగోలు చేస్తాను. మీరు కూడా వెండిపై ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు'' అని రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో షేర్ షేర్ చేశారు.

ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

2025 సెప్టెంబర్ 1వ తేదీ ఒక కేజీ వెండి ధర రూ. 1,36,000 వద్ద ఉండేది. ఈ రేటు ఇప్పుడు (సెప్టెంబర్ 29) రూ. 1,60,000కు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఒక్క నెలరోజుల వ్యవధిలోనే కేజీ సిల్వర్ రేటు రూ. 24,000 పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement