Nagarkurnool
-
ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దోపిడీని అరికట్టాలి
గోపాల్పేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో ధాన్యం సేకరణను నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏదుల మండలం చీర్కపల్లి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ గత పది రోజుల నుంచి లారీల కొరత వలన 7,500 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి కేంద్రంలో ఉండటంతో మిగతా కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీర్కపల్లికి రోజుకు 5 లారీలు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లర్లు జిల్లావ్యాప్తంగా తరుగు, తాలు పేరుతో క్వింటాల్కు 3 కిలోల ధాన్యం తీస్తూ రైతులను దగా చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేవని, ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులకు అవసరమైన కవర్లను ప్రభుత్వమే అందించాలన్నారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పోలీసు అధికారులు వచ్చి జిల్లా సివిల్ సప్లయ్, ఐకేపీ అధికారులు, లారీ కాంట్రాక్టర్తో మాట్లాడి రోజుకు మూడు లారీలు వచ్చే విధంగా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. తరుగు, తాలు పేరుతో జరుగుతున్న విషయాన్ని పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రమేష్, శేఖర్, మహే ష్, శివశంకర్, రాములు, మల్లేష్, కాసీం, శేషయ్య, సత్యనారాయణ, పర్వతాలు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కల్వకుర్తి టౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించడమే కాకుండా, వారికి అందివచ్చిన స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు అందించే కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డితో కలిసి ఆయన లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గానికి సమానంగా నిధులు కేటాయిస్తూ.. వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. స్వయం శక్తితో ఎదిగి కోటీశ్వరులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలపడేందుకే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. అనంతరం 150 మంది లబ్ధిదారులకు కుట్టుమిషన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్, కుట్టుమిషన్లను అందించారు. -
దరఖాస్తుల స్వీకరణ
వెల్దండ: మండలంలోని గుండాల గ్రామం ఏకలవ్య మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పర్ధీప్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో 2025–26 సంవత్సరానికి ఎస్టీ విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. కళాశాలల్లో దరఖాస్తు ఫారాన్ని తీసుకొని అన్ని అర్హత పత్రాలను జత చేసి ఈ నెల 24లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. వీరికి మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్ ఏకలవ్య మోడల్ కళాశాలలో ఈ నెల 26న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. కళాశాలలో బైపీసీ గ్రూప్లో బాలురకు 25 సీట్లు, సీఈసీలో 8 సీట్లు ఉన్నట్లు వివరించారు. డిపో అభివృద్ధిలోభాగస్వాములవుదాం కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో అభివృద్ధిలో ఉద్యోగులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎం ఉమాశంకర్ అన్నారు. పట్టణంలోని డిపో ఆవరణలో మంగళవారం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు చేశారు. డిపో పరిధిలో ఏప్రిల్ నెలలో అత్యధిక ఇన్సెంటివ్, కేఎంపీఎల్, ఈపీకే సాధించిన కండక్టర్లు, డ్రైవర్లను అభినందించి సత్కరించారు. వారికి నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు రత్నమ్మ, వెంకటేశ్వర్లు, నజీర్, షఫీఉల్లా, గౌసొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రోగులతో స్నేహంగా మెలగాలి ఉప్పునుంతల: వైద్యులు, సిబ్బంది ఆస్పత్రికి వచ్చే రోగులతో స్నేహపూర్వకంగా మెలిగి వైద్య సేవలు అందించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త రామకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక సీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించి ఆస్పత్రిలో సిబ్బంది హాజరు రిజిష్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్షించినన సూచనలు, సలహాలు ఇచ్చారు. వైద్యులతోపాటు సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం కోసం వచ్చిన రోగులతో దురుసుగా ప్రవర్తించరాదని హెచ్చరించారు. సమావేశంలో వైద్యాధికారి స్వప్న, ఫార్మాసిస్టు కుమారాచారి తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న చెంతకు..నాలుగు వరుసల రోడ్డు
అచ్చంపేట: మల్లికార్జునస్వామి కొలువై ఉన్న నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రయాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించుకొని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేగా త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.2,800 కోట్లతో ఈ రోడ్డును విస్తరిస్తామని, మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి.. పనులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్– డిండి, బ్రాహ్మణపల్లి (మన్ననూర్) 105.6 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే 6 గంటల ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది. శ్రీశైలం దారిలోని తుక్కుగూడ– డిండి వరకు ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ను తొలగించే పని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరింది. హైదరాబాద్– డిండి, మన్ననూర్ రహదారికి మహర్దశ రూ.2,800 కోట్ల వ్యయంతో ఎన్హెచ్–765 నిర్మాణం మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ ఏర్పాటు స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ.. శ్రీశైలానికి తప్పనున్న ప్రయాణ పాట్లు -
విద్యా ప్రమాణాల పెంపు దిశగా..
కందనూలు: సర్కారు బడుల్లో కొంతమంది విద్యార్థులు చదవడం.. రాయడం వంటివి కూడా చేయలేకపోతుండటాన్ని ఇటీవల పలు సర్వేలు వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టింది. విద్యార్థుల లోపాలను సరిచేసేందుకు ముందుగా ఉపాధ్యాయులకు తర్పీదు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా విద్యార్థులు కనీస విద్యా ప్రమాణాల స్థాయికి చేరుకుంటారని ఆశిస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. మూడు విడతల్లో.. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు బోధనాంశాలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లాలోని 3,513 మంది ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటి విడతగా ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు జిల్లాస్థాయిలో మండల రిసోర్స్పర్సన్లు, స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రెండవ విడత ఎస్జీటీలకు 20 నుంచి 24వ తేదీ వరకు, మూడవ విడత 25 నుంచి 30వ తేదీ వరకు మండలస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాల పెంపు, కృత్రిమ మేధ (ఏఐ) బోధన, తల్లిదండ్రుల సమావేశం ఇతర అంశాలపై తర్పీదు ఇవ్వనున్నారు. శిక్షణ ఇలా.. శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయులకు కంటెంట్ ఎర్నిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, లైఫ్ స్కిల్స్, లెర్నింగ్ ఔట్ కం వంటి విషయాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల నిర్మాణ క్రమాన్ని అర్ధం చేసుకోవడం, అంశాల వారీగా విద్యా ప్రమాణాలపై అవగాహన, బోధనా వ్యూహాల పెంపు, అభ్యసన ప్రక్రియలను సమర్ధవంతంగా తరగతి గదిలో అమలు, ప్రాజెక్టు వర్క్ల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 3,513 మంది ఉపాధ్యాయులకు శిక్షణ మూడు విడతల్లో తరగతులు నిర్వహించేలా ప్రణాళిక ఇప్పటికే మండల రిసోర్స్పర్సన్లు,ఎస్ఏలకు శిక్షణ పూర్తి 20 నుంచి ఎస్జీటీలకు.. -
కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం
కల్వకుర్తి రూరల్: కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ కార్మిక హక్కుల సాధన కోసం పోరాడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెను నిర్వహించాలని 10 కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సమ్మెను జూలై 9కి వాయిదా వేసినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2019, 2020 సంవత్సరంలోనే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని, దీనిని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం ప్రతిఘటన చేయడంతో వాటిని అమలు చేయలేదన్నారు. కార్పొరేట్ పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం వీటిని తెచ్చారని విమర్శించారు. పర్మినెంట్ ఉద్యోగాల వ్యవస్థ స్థానంలో తాత్కాలిక ఉద్యోగాల వ్యవస్థని నెలకొల్పడానికి బాటలు వేశారని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న చేపట్టే సమ్మెను విజయవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, మల్లేష్, రాములు, లక్ష్మమ్మ, రఫిక సుల్తానా, భాగ్యలక్ష్మి, శైలజ, స్వాతి, హసీనా, సుభద్ర, మంజుల, బాల్రెడ్డి, జగన్, అలివేలు తదితరులు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యాలు మెరుగు..
విద్యార్థుల మానసిక వ్యక్తిత్వం ఆధారంగా బోధిస్తున్నాం. అర్థమయ్యే రీతిలో బోధించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అయినప్పటికీ పిల్లలు సామర్థ్యాన్ని అందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఐదు రోజులపాటు ఇచ్చిన శిక్షణ విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాల పెంపునకు దోహదపడుతుంది. – చీర్ల కృష్ణయ్య, ఎస్ఏ ఆంగ్లం, కోడేరు ఎంతో ప్రయోజనం.. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులు. బోధనా వికాసం, సాంకేతిక పాఠాలు, ఏఐ బోధన మెరుగుపరిచే విధంగా ఇస్తున్న శిక్షణ ఎంతో ప్రయోజనకరం. తరగతి గదిలో అర్థం చేసుకునే వాతావరణం కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటి అంశాలపై సృజనాత్మకత పెంచుతాం. – పూజారి సురేందర్, డీఆర్పీ శిక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు.. జిల్లాలోఉపాధ్యాయ శిక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మూడు విడతల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాం. ఎస్జీటీలకు మండల స్థాయిలో, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలకు జిల్లాస్థాయిలో శిక్షణ ఉంటుంది. అంశాల వారీగా శిక్షణ కొనసాగుతుంది. ఉపాధ్యాయులు విధిగా శిక్షణకు హాజరు కావాలి. – రమేశ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి ● -
ఉత్సాహంగా తిరంగా ర్యాలీ
కందనూలు: పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా జిల్లాకేంద్రంలో మంగళవారం సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత సాయుధ దళాలకు గౌరవ సూచికంగా, ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో యువత తరలివచ్చారు. జిల్లాకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రధాన రహదారి మీదుగా అంబేడ్కర్ కూడలి నుంచి పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సైనికులు, విద్యార్థులు, వ్యాపార సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు భారత జాతీయ పతాకాన్ని చేపట్టి భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై జవాన్, అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేజీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, యువమోర్చ జిల్లా కార్యదర్శి నరేష్చారి, నాయకులు సుధాకర్, భరత్ప్రసాద్, సుబ్బారెడ్డి, సుధాకర్రెడ్డి, బాబుసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
డీపీఆర్ రూపొందించారు..
హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి త్వరలోనే నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇప్పటికే డీపీఆర్ రూపొందించారు. మహేశ్వరం గేటు నుంచి డిండి వరకు సర్వే పనులు కొనసాగుతున్నాయి. మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. అలాగే మన్ననూర్– శ్రీశైలం మార్గంలో వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ఎలివేటేడ్ కారిడార్ను ప్రతిపాదించారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్ ● -
మా పాలన దేశానికే రోల్ మోడల్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్‘మా పాలన దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోంది. శాంతిభద్రతల నిర్వహణ, నిరుద్యోగం నిర్మూలన, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం మా పాలనను అభినందించక తప్పని పరిస్థితి నెలకొంది. మా పాలనలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాం. గత 16 నెలల్లో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచాం. మరో 1.50 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించాం. గత ప్రభుత్వ పాలనలో నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి.మా పాలనలో మాత్రం నోటిఫికేషన్లు వాయిదా వేయాలని ధర్నాలు జరుగుతున్నాయి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబం బాగుపడుతుంది. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేసేలా ప్రణాళిక రూపొందించాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద మాచారంలోని 29 మంది చెంచు రైతులకు చెందిన 45 ఎకరాల పోడు భూముల్ని ప్రభుత్వం ఎంపిక చేసింది.వాటిల్లో బోర్లు, సోలార్ పంప్ సెట్తో పాటు మామిడి, ఉద్యాన మొక్కలు నాటారు. కాగా ఆయా భూముల్లోని సోలార్ పంప్సెట్ను ముఖ్యమంత్రి ఆన్ చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా నల్లమల డిక్లరేషన్ను ప్రకటించి మాట్లాడారు. వాళ్లు భూములు గుంజుకున్నారు.. మేం పంటలు ప్రోత్సహిస్తున్నాం ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు రైతుల భూములను గుంజుకుని వారికి బేడీలు వేసి జైలుకు పంపింది. ములుగు, తాడ్వాయి అడవుల్లో ఆడబిడ్డలను చెట్టుకు కట్టేసి కొడితే మేం వెళ్లి అండగా నిలబడ్డాం. కాంగ్రెస్ వచ్చాక గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరా సౌర జలవికాసం అమలు చేస్తున్నాం. గిరిజనుల పోడు భూముల్లో సోలార్ విద్యుత్, బోర్లు ఏర్పాటు చేసి వారు పంటలను పండించేలా ప్రోత్సహిస్తున్నాం. అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం నేను ఇక్కడి నల్లమల ప్రాంతానికి చెందిన వాడినని చెప్పుకునేందుకు నా గుండె ఉప్పొంగుతోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ రానున్న వంద రోజుల్లో ఉచితంగా సోలార్ బోర్లను ఏర్పాటు చేస్తాం. సోలార్ విద్యుత్ వినియోగంతో పాటు ఉత్పత్తి చేసి నెలనెలా రూ.ఐదారు వేల ఆదాయం కల్పించేలా చూస్తాం. నియోజకవర్గంలో ఎన్ని సోలార్ పంప్సెట్లైనా ఉచితంగా ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. సన్న బియ్యంతో పేదల ఆత్మగౌరవం పెంచాం.. గతంలో రైతులు వరి వేస్తే ఉరి అని చెప్పి కేసీఆర్ తన ఫాంహౌస్లో 150 ఎకరాల్లో వరి వేసుకున్నడు. మేం వచ్చాక సన్నాలు పండించాలని చెప్పి రూ. 500 బోనస్ అందించాం. ఏడాదిలో 2.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించి దేశంలోనే నంబర్ వన్గా నిలిపాం. రేషన్ బియ్యంగా సన్న బియ్యాన్ని అందించి పేదల ఆత్మగౌరవాన్ని పెంచాం.’ అని సీఎం చెప్పారు. ప్రధాని అంటే ఇందిరా గాందీలా ఉండాలి.. ‘భారత్–పాకిస్తాన్ యుద్ధం సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ ఒక్క దెబ్బతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ను రెండు ముక్కలు చేశారు. ఇప్పటికి 50 ఏళ్లైనా ప్రధాని అంటే ఇందిరాగాం«దీలా ఉండాలని అంటారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో మేం ప్రజల కళ్లల్లో వెలుగులు నింపేలా పని చేస్తున్నాం. అక్రమ సంపాదనతో ఎవరెన్ని కుట్రలు చేసినా, మా ఆడబిడ్డలకు అన్నీ తెలుసు. సన్నాసులంతా కలసి సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినా, మహిళలకు నిజం తెలుసు. కడుపు నిండా విషం కక్కుతూ మా ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారి దిక్కు చూడం, పట్టించుకోం..’ అని రేవంత్ అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేదు: భట్టి విక్రమార్క భూమి కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించి నీటి సౌకర్యం కలి్పంచిన ఉదంతాలు దేశంలో ఎక్కడా లేవని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా రాష్ట్రంలోని గిరిజనుల కోసం సంకల్పం తీసుకోవడంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్రెడ్డి, శ్రీహరి, మేఘారెడ్డి, అనిరు««ద్రెడ్డి పాల్గొన్నారు. స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో రేవంత్ పర్యటన సీఎం రేవంత్రెడ్డి తన స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గజమాల, పూలతో ఊరేగింపుగా వచ్చి ఘన స్వాగతం పలికారం. కాగా ముఖ్యమంత్రి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తన సొంత ఇంట్లో భోజనం చేశారు. ఏమ్మా.. నీళ్లు పడ్డాయా?చెంచు మహిళలతో సీఎం సంభాషణ సాక్షి, నాగర్కర్నూల్: ఇందిరా సౌర జలవికాసం పథకం ప్రారంబోత్సవం సందర్భంగా మాచారంలోని చెంచుల పోడు భూములను సందర్శించిన ముఖ్యమంత్రి.. అక్కడే ఉన్న చెంచు మహిళలు ఉడుతనూరి అలివేలు, లక్షమ్మలను పలకరించారు. వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. సీఎం: ఏమ్మా.. మీ బోరులో నీళ్లు పడ్డాయా? అలివేలు: మా భూమిలో వేసిన బోరులో నీళ్లు మంచిగా పడ్డాయి సర్. సంతోషంగా ఉంది. సీఎం: ఏం మొక్కలు నాటారు, వాటిని బతికించుకుంటారా? అలివేలు: మామిడి, ఆవకాడో, బత్తాయి మొక్కలు నాటాం. బాగా కాపాడుకుంటాం సర్. ఇన్నాళ్లు మా భూమి బీడుగానే ఉంది. ఇప్పుడు పంటలు పండించుకుంటాం. సీఎం: ఈ పథకంపై ఇతర మహిళలకు శిక్షణ ఇస్తావా? అలివేలు: నేను డిగ్రీ పూర్తి చేశాను సర్. తప్పకుండా మా తోటి మహిళలకు, చెంచులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తా. మీరు మా కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది ‘పోడు’కు నిధుల తోడు గిరిజన సంక్షేమం లక్ష్యంగా నల్లమల డిక్లరేషన్ నల్లమల డిక్లరేషన్లో రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు అంశాలను పొందుపర్చింది. రాష్ట్రంలోని 2,30,735 మంది గిరిజనులకు 2006 ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం సంక్రమించిన సుమారు 6.69 లక్షల ఎకరాల భూములపై పూర్తి హక్కులను గుర్తించింది. ⇒ రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల పోడు భూముల్లో నూరు శాతం ఉచితంగా బోరుబావులు, సోలార్ విద్యుత్ సౌకర్యంతో పాటు ఉద్యాన పంటల ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తారు. పోడు భూముల్లో నీటి సౌకర్యం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధుల కేటాయిస్తారు. ⇒ ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద గిరిజనులకు జీవనోపాధి కల్పించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారు ⇒ తొలుత మాచారంలో పైలట్ ప్రాజెక్ట్. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు ⇒ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు ఐదేళ్ల పాటు లబి్ధదారులతో సర్కారు సమన్వయం. ఎప్పటికప్పుడు అటవీ, విద్యుత్, భూగర్భ జలవనరులు, ఉద్యాన శాఖల పర్యవేక్షణ ⇒ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెంచులు, ఆదిమ జాతుల కుటుంబాలు అందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ⇒ రాజీవ్ యువవికాసం కింద ప్రత్యేకంగా గిరిజన యువతకు రూ.1,000 కోట్ల నిధులతో ఒక్కొక్కరికీ రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాలు. -
లక్ష్యం @ 25 లక్షలు
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం (హరితహారం) కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ పర్యాయం కూడా జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 21 నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమం చేపడుతుంది. దీనిలో భాగంగా జూలై మొదటి వారంలో మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, అంగన్వాడీ, బీడు, బంజరు భూములు, రోడ్డుకిరువైపులా, పొలాల గట్లపై మొక్కలు నాటాలని అధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మొక్కలకు ప్రాధాన్యం.. వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలు పది కాలల పాటు నిలిచి ఉండాలనే లక్ష్యంతో పదో విడత వన మహోత్సవంలో అధికారులు ప్రత్యేకించి కొన్ని జాతుల మొక్కలను ఎంపిక చేశారు. ప్రధానంగా వీటినే నాటించాలని నిర్ణయించారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పండ్ల చెట్లను నాటేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు వేప, రాాగి, మేడి, మర్రి, నేరేడు, కానుగ, కదంబ, గుల్మోర్, కరివేపాకు, మునగ, బొప్పాయి, ఈతతోపాటు పలు రకాలు పండ్లు, పూలు, ఔషధ మొక్కలను నాటేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆయా మొక్కలు సుదీర్ఘకాలం మనగలగడమే కాక.. ఇతరత్రా ప్రయోజనాలను కూడా కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎక్కువ శాతం ఈ రకం మొక్కలనే వన మహోత్సవం కోసం సిద్ధం చేస్తున్నారు. పదో విడత వనమహోత్సవానికిఅధికారుల సన్నద్ధం జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో మొక్కల పెంపకం పండ్లు, ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యం జూలైలో పంపిణీకి సన్నాహాలు చేస్తున్న యంత్రాంగం -
నిరుద్యోగులకు ఉపాధి
నారాయణపేట/నారాయణపేట రూరల్: భూ వివాద రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే పైలట్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. వ్యవసాయ భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించి భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించడంతో ఆమేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అర్హులైన యువతకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. ఓసీలు 54 మంది, బీసీలు 850, ఎస్సీలు 388, ఎస్టీలు 157 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ దరఖాస్తులను సోమవారం నుంచి పరిశీలిస్తారని రెవెన్యూ అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ వారంలోనే శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి 50 రోజుల శిక్షణ అనంతరం జులై చివరి నాటికి లైసెన్స్డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. శిక్షణ పూర్తి అయితే వీరికి మెరుగైన ఉపాధి లభించనుంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు.. భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూపటం (నక్ష) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు భూ భారతి చట్టం అమలులో నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి చూపించే దిశగా లైసెన్స్ కలిగిన సర్వేయర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. శనివారం ఆర్ధరాత్రి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. 50 రోజులపాటు శిక్షణ ఇంటర్లో గణితం ఓ సబ్జెక్టుగా ఉండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్(సివిల్), బీటెక్ సివిల్, పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ కోర్సులు చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మీసేవ ద్వారా ఓసీలు రూ.10 వేలు, బీసీలు రూ.5 వేలు ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చెల్లించారు. వీరిలో నుంచి నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేసి 50 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం రాత పరీక్ష నిర్వహిస్తారు. థియరీ, టిప్పన్, ప్లాటింగ్, ఫీల్డ్ వర్క్ తదితర మూడు విభాగాల్లో శిక్షణ తీసుకొని తదుపరి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్వేయర్ సర్టిఫికెట్ అందజేస్తారు. భవిష్యత్లో భూ భారతి ద్వారా దరఖాస్తు చేసుకున్న బాధితులు సర్వేకు సంబంధించిన సమస్య పరిష్కారానికి, నక్ష వేయించుకోవడానికి ఈ ధ్రువపత్రం కలిగిన వారు ఇచ్చేవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ‘భూ భారతి’లో భాగంగా క్షేత్రస్థాయిభూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు.. లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణ పొందేందుకు అర్హులకు అవకాశం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,449 మంది దరఖాస్తులు -
పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
కొల్లాపూర్ రూరల్: మారుమూల కొల్లాపూర్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని మొలచింతపల్లిలో నిర్వహించిన సీపీఐ మండల పార్టీ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కొల్లాపూర్ ప్రాంతంలోని నల్లమల అడవిలో ముడి సరుకులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో పాలకులు కృషి చేస్తే పేపర్, సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎంతో అనువుగా ఉన్నా కానీ, పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతు భరోసా రైతులందరికీ ఇవ్వాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్రలో పదవుల కోసం కాకుండా పేద ప్రజలకు ఎంతో కృషి చేసిందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫయాజ్, శివుడు తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు బాధ్యత నాదే
దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. నా సొంత గడ్డ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నియోజకవర్గంలోని రైతులు గిరిజన, గిరిజనేతరులు అనే తేడా లేకుండా రైతులందరికీ ఉచితంగా సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఎన్ని మోటార్లు అవసరమైనా ఉచితంగా అందిస్తాం. సోలార్ విద్యుత్ ద్వారా నెలనెలా రూ.6 వేల వరకు ఆదాయం పొందేలా చర్యలు చేపడతాం. రానున్న వంద రోజుల్లోనే అందరికీ సోలార్ విద్యుత్ అందించి దేశానికి మోడల్గా తీర్చిదిద్దుతాం. వ్యవసాయ, గృహ వినియోగానికి సోలార్ విద్యుత్ను వినియోగిస్తూ అదనపు విద్యుత్ను ప్రభుత్వానికి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకోసం ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని డిప్యూటీ సీఎంకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేం కోరినట్లు వంశీకృష్ణను గెలిపించి మీ మాట నిలుబెట్టుకున్నారు.. ఇప్పుడు నా బాధ్యతగా అచ్చంపేట అభివృద్ధికి కావాల్సిన ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. స్వంత నియోజకవర్గం నల్లమలలో సాగునీరు, విద్య, ఉపాధి, రోడ్లు, ఇతర అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉందని సీఎం అన్నారు. ● ప్రత్యేక ప్రణాళికతో సంక్షేమ పథకాలకు నిధులు ● ఈ ప్రాంత బిడ్డగా నా బాధ్యత మరింత పెరిగింది ● విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం ● స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనూ పర్యటన.. ఘన స్వాగతం పలికిన ప్రజలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: ‘ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి నాదే బాధ్యత. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను గెలిపించి.. నాపై విశ్వాసాన్ని చూపి ఆశీర్వదించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడే అవకాశం దక్కింది. నా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి, నిధులు విడుదల చేస్తా. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాను’ అని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. సోమవా రం అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. మాచారంలోని చెంచు రైతుల పోడు భూముల్లోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్, ప్లాంటేషన్, స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను పరిశీలించారు. గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘పాలమూరు బిడ్డలు అంటేనే తట్ట, పార పని.. ముంబయి, పుణె వలస వెళ్లి కష్టపడేవాళ్లని అందరికీ తెలుసు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు బిడ్డలే కావాలి. దేశం నలుమూలలా భూములను సస్యశ్యామ లం చేసేందుకు మన బిడ్డలు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు. నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ఎవరైనా నేను పాలమూరుకు చెందిన వాడినని చెప్పినప్పుడు నా గుండె ఉప్పొంగుతుంది’ అని పేర్కొన్నారు. సభావేదిక వద్దకు నడిచి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిర సౌర జల వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
నాగర్కర్నూల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి 14 మంది ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తారని వారికి న్యాయం చేసేలా చూడాలన్నారు. ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపినట్లు చెప్పారు. ధాన్యం తూకాల్లో తేడా లేకుండా చూడాలి కల్వకుర్తి టౌన్: వరి కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించే ధాన్యం తూకాల్లో ఎ లాంటి తేడా లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన జిల్లా సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్తో కలిసి పరిశీలించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొచ్చేట ప్పుడు ఎండబెట్టి తీసుకొని రావాలని, తేమ శాతం ఎంత తక్కువగా ఉంటే అంత మంచి రేటు వస్తుందని సూచించారు. సన్నరకం ధా న్యానికి ప్రభుత్వం బోనస్ సకాలంలో అందుతుందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధా న్యాన్ని అమ్మాలని చెప్పారు. అనంతరం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని త్వరగా లారీ ల ద్వారా మిల్లులకు పంపాలని, దీంతో వర్షం పడితే ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్లకుండా ఉంటుందని నిర్వాహకులను ఆదేశించారు. పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ వెంకటరమణ అన్నారు. సోమవారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ గురువారం నుంచి 29 వరకు నిర్వహించనున్న పరీక్షల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 6,045 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా వీరికోసం 20 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, ముగ్గురు కస్టోడియన్లను నియమించామన్నారు. అలాగే జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో ప్రిన్సిపాల్స్ ప్రభువర్ధన్రెడ్డి, మాధవి, సీనియర్ అధ్యాపకులు సైదులు, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వీసీ శ్రీనివాస్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, వాసవీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థి వెళ్లే క్రమంలో తప్పకుండా హాల్టికెట్తో పాటు ఒక గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని సూచించారు. సెమిస్టర్–4కు మొత్తం 8,142 మంది విద్యార్థులకు 7,859 మంది విద్యార్థులు హాజరై 283 గైర్హాజరయ్యారు. సెమిస్టర్–5కు సంబంధించి 467 మంది విద్యార్థులు 435 మంది హాజరై 32 మంది గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. -
‘కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం’
నాగర్ కర్నూల్: మాచారం, పాలమూరు ప్రాంతాలంటే తనకు ఎంతో ఇష్టమే కాకుండా ఎంతో గౌరవం కూడా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్.. ఆపై ప్రసంగించారు.‘ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలబెడతాం. పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ది. అచ్చంపేటలో ప్రతిరైతుకు సోలార్ విద్యుత్ అందించి తీరుతాం. సోలార్ విద్యుత్ అందించడమే కాదు.. ఆదాయం వచ్చేలా చేస్తాం. రుణమాఫీ చేశాం.. వడ్లకు బోనస్ ఇస్తున్నాం. వరి వేసుకుంటే ఉరేనన్న దొర మాత్రం వరి వేసి అమ్ముకున్నారు. ైరైతుల కోసం ఇప్పటివరకూ రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశాం. 50 లక్షల పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మహిళలే ఆర్టీసీ బస్సులు అద్దెకు తిప్పుకునేలా చేశాం.మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులకు యజమానులను చేశాం. 2029లోపు కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న
నాగర్కర్నూల్ రూరల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఆరబోసిన మొక్కజొన్న అకాల వర్షానికి తడిసి ముద్దయ్యింది. శనివారం ఆరుగురు రైతులు సుమారు 30 క్వింటాళ్ల మొక్కజొన్నలను మార్కెట్లో విక్రయానికి తీసుకువచ్చారు. అయితే తేమశాతం అధికంగా ఉండటంతో యార్డులోనే ఆరబోశారు. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఆరబోసిన మొక్కజొన్నలను రైతులు కుప్పలుగా పోసి టార్పాలిన్లు కప్పే వరకు తడిసి ముద్దయ్యాయి. ఈ క్రమంలో మొక్కజొన్నలు వర్షపు నీటిలో కొట్టుకుపోకుండా రైతులు పడరాని పాట్లు పడ్డారు. అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం
కొల్లాపూర్: రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం కొల్లాపూర్లోని రాజాబంగ్లా ఎదుట ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా ట్టణంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజాబంగ్లా వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సంధర్భంగా బీసీ జనచైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు దాసరి అజయ్కుమార్ యాదవ్, బీసీ రిజర్వేషన్ల సాధన సమితి నాయకులు శివార్చక విజయ్కుమార్, పెబ్బేటి మల్లికార్జున్, శివశంకర్ యాదవ్, గాలియాదవ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగ రంగాల్లో తక్కువ జనాభా కలిగిన అగ్రవర్ణాలకు అధికంగా రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని.. బీసీలకు మాత్రం ఎలాంటి ఫలాలు అందడం లేదన్నారు. బీసీలు అన్నిరకాలుగా వంచనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి సర్కారు చేపట్టిన కులగణన ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక చట్టం చేయాలన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా బీసీలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు డా.పగిడాల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు కట్టా శ్రీనివాస్, సింగిల్విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, సాయిలు యా దవ్, రామస్వామి, విష్ణుమూర్తి, కాశన్న యాదవ్, బింగి సాయిలు, గాలెన్న, మేకల కృష్ణయ్య, ఆనంద్యాదవ్, చిలుక వెంకటస్వామిగౌడ్, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు నల్లమలకు సీఎం రేవంత్
నాగర్కర్నూల్సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025వివరాలు 8లో uసాక్షి, నాగర్కర్నూల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర జల వికాసం పథకానికి అంకురార్పణ చేయనున్నారు. మాచారం గ్రామంలోని చెంచుల పోడు భూముల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ మోటారు ఆన్ చేసి సీఎం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఇందిరా సౌర జల వికాసం ప్రాజెక్ట్ పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం మాచారం గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద 27 మంది లబ్ధిదారులు.. ఇందిర సౌర జల వికాసం కింద అమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా, ఇప్పటికే 27 మంది చెంచు రైతులకు చెందిన మొత్తం 50 ఎకరాల పోడు భూములను అధికారులు సిద్ధం చేశారు. రైతుల పోడు భూములను చదును చేయడంతో పాటు భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 16 బోర్లను తవ్వించారు. వాటికి సోలార్ విద్యుత్, 5 హెచ్పీ మోటారును ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల భూముల్లో ఇప్పటికే నిమ్మ, బత్తాయి, అవకాడో, మామిడి మొక్కలతో పాటు సరిహద్దుల్లో కొబ్బరి, వెదురు మొక్కలను నాటించారు. వాటికి నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. మొక్కల ద్వారా శాశ్వత ఆదాయం వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా అంతర్గత పంటలను వేసేలా చెంచు రైతులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో మేలు జరిగేలా చూసేందుకు ఐదేళ్ల పాటు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. సీఎం సొంత గ్రామంలోనూ పర్యటన.. మాచారంలో ఇందిరా సౌరజలవికాసం పథకం ప్రారంభోత్సవం అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించనున్నారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుకోనున్నారు. గ్రామంలో సీఎం రేవంత్రెడ్డి సొంత ఖర్చుతో ఇటీవల నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు గ్రామంలోని చెంచుల పోడుభూముల్లో సోలార్ విద్యుత్తో నడిచే బోరు మోటారును ఆన్చేసి ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించి తిలకిస్తారు. 11.35 గంటలకు గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి బయల్దేరుతారు. 1.45 గంటలకు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. -
సీఎం పర్యటనలో నిబంధనల మేరకే అనుమతులు
మన్ననూర్: ఇందిర సౌర గిరి జల వికాసం పథకం పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లమలకు వస్తున్నారని.. ప్రొటోకాల్ నిబంధనలు అమలులో ఉన్నందున ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ కోరారు. శనివారం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి పరిశీలించారు. బహిరంగసభ వేదిక, హెలిప్యాడ్, పైలాన్, సీఎం ప్రారంభించనున్న బోరుబావి, సోలార్, పండ్ల మొక్కలను ఒక్కొక్కటిగా పరిశీలన చేశారు. సోమవారం ఉదయం 11 గంటల వరకు సీఎం మాచారం గ్రామానికి చేరుకోనున్నందున కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి వినతి పత్రాలు, ఫిర్యాదులు ఇచ్చేందుకు అవకాశం లేదని కలెక్టర్ సంతోష్ సూచించారు. సీఎం కాన్వాయితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే పరిమితంగా అవకాశం కల్పిస్తున్నామని.. ప్రజాప్రతినిధులు, నాయకులు ఇతరులకు అనుమతి ఉండదని ఎస్పీ వివరించారు. పథకం ప్రారంభోత్సవానికి అధికారులు నిర్దేశించిన ప్రదేశాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందన్నారు. సీఎం పర్యటించే ప్రదేశాలను భద్రతా బలగాల పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలను డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి తాడూర్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణను ఆయన పరిశీలించి మాట్లాడారు. అనుభవజ్ఞులైన శిక్షకులతో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పిల్లలు ఎలా నేర్చుకుంటారో తెలుసుకోవడం ముఖ్యమన్నారు. గుణాత్మక శిక్షణ మూడు విడతల్లో ఉంటుందని తెలిపారు. అనంతరం పదోతరగతిలో 530 మార్కులు సాధించిన పుష్ప, సునీతను సన్మానించి అభినందించి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. సమావేశంలో వెంకటయ్య, ఎంపీడీఓ ఆంజనేయులు, మండల విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మహముద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు అందాలు చూసొదా్దం
పిల్లలమర్రి మహబూబ్నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ఉంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడుగులాగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ భారీ వృక్షానికి 750 ఏళ్లు ఉంటాయని అంచనా. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మర్రి వృక్షం. పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో క్రీ.శ.7వ శతాబ్దం నుంచి 15వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. మహబూబ్నగర్లోని మెట్టుగడ్డ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏడు తరాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పిల్లలమర్రి, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, ఆకట్టుకునే ప్రాజెక్టులు, ప్రకృతి అందాల నడుమ అలల సవ్వడిలో కృష్ణమ్మ ఒడిలో సాగే బోటు ప్రయాణాలు, జలపాతాలు, జంగిల్ సఫారీ.. ఇలాంటి ఎన్నో విశేషాలతో పాలమూరు పర్యాటకం సందర్శకులను కనువిందు చేస్తోంది. రోజురోజుకు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న పర్యాటక ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటున్నాయి. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచుతూ హాలీడేస్ను జాలీడేస్గా మార్చేస్తోంది. -
పారా లీగల్ వలంటీర్లకు అవగాహన
నాగర్కర్నూల్ క్రైం: పారా లీగల్ వలంటీర్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరఫున ప్రజలకు చట్టాలు, న్యాయ సేవలపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమం శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రజలు ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తానా మాట్లాడుతూ.. పారా లీగల్ వలంటీర్లు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే సంస్థ దృష్టికి తీసుకురావాలని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో చదివేలా కృషి చేయాలన్నారు. న్యాయ సలహాలు, సూచనల కోసం హెల్ప్లైన్ నంబర్ 15100కు సంప్రదించాలని సూచించారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
కొల్లాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్రావు పిలుపునిచ్చారు. గురువారం కొల్లాపూర్లో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్రావు అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. హైదరాబాద్ వంటి మహా నగరాల్లోనే కాకుండా నాగర్కర్నూల్ వంటి చిన్న పట్టణాల్లో కూడా చిరువ్యాపారులకు రక్షణ లేకుండా పోతోందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో దేశద్రోహులు, సంఘ విద్రోహులపైకి బుల్డోజర్లు పంపుతుంటే.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సా మాన్యులు, పేదలపైకి బుల్డోజర్లు పంపుతోందని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని.. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి తెలిసిందన్నారు. అంతకుముందు నరేందర్రావును పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో నాయకు లు శేఖర్గౌడ్, సందు రమేశ్, కేతూరి నారా యణ, సాయికృష్ణగౌడ్, భరత్చంద్ర, కాడం శ్రీనివాస్, అన్వేష్ తదితరులు ఉన్నారు. -
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ప్రపంచ సుందరీమణుల బృందం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సుందరీమణుల బృందానికి స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గురువారం ఎస్పీ డి.జానకితో కలిసి కలెక్టర్ పిల్లలమర్రిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే థీమ్తో ప్రభుత్వం అందాల భామలు.. ప్రాచీన ఆలయాలు పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, ఏఎస్పీ రాములు, డీఎఫ్ఓసత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
నిర్వాసితులకు అండగా ఉంటాం
కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలంలోని బోడబండ తండా, సున్నపుతండా, వడ్డెర గుడిసెలను కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి మంత్రి సందర్శించి.. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీరు వస్తుండటంతో సున్నపుతండా మునకకు గురయ్యే అవకాశం ఉందని.. ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో ఇళ్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో సర్వం కోల్పోయిన ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బోడబండ తండా, సున్నపు తండా, వడ్డెర గుడిసెలకు చెందిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి
నాగర్కర్నూల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో రాజీవ్ యువవికాసం పథకం లబ్ధిదారుల డెస్క్ వెరిఫికేషన్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో అర్హులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్ యువశక్తి పథకానికి సంబంధించి బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్, ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు. యూనిట్ల వారీగా డెస్క్ వెరిఫికేషన్ పూర్తయిన దరఖాస్తుదారుల్లో ఎంత మందిని అర్హులుగా గుర్తించారో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. రాజీవ్ యువవికాసం రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల హార్డ్ కాపీలను త్వరగా పరిశీలించి.. బ్యాంకులకు అర్హుల జాబితాను పంపాలని తెలిపారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి గుర్తించిన అర్హుల జాబితాను సరిచూసుకోవాలని సూచించారు. అర్హుల తుది జాబితాను నియోజకవర్గ శాసన సభ్యుల అనుమతితో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని.. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు కేటాయించవద్దని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ దేవ సహాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, బ్యాంకర్లు, హౌసింగ్ అధికారులు ఉన్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో వేగం పెంచాలి కలెక్టర్ బదావత్ సంతోష్ -
సెర్ప్లో బదిలీలు!
అచ్చంపేట: సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో అన్ని కేటగిరీల వారికి అవకాశం కల్పిస్తూ ఇటీవల ప్రత్యేకంగా జీఓ జారీ చేసింది. విధి విధానాలు ఖరారు చేసి.. త్వరలోనే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని అందులో స్పష్టం చేసింది. దీంతో ఏడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కలగనుంది. ఇతర జిల్లాలో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడేళ్లుగా ఎదురుచూపులు.. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సెర్ప్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వంటి రెండు విభాగాల్లో జిల్లావ్యాప్తంగా 134 మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సెర్ప్ పరిధిలో పనిచేసే ఏపీడీలు, డీపీఎంలు, ఏపీఓ పోస్టులకు జోనల్ స్థాయిలో, ఏపీఎంలు, సీసీలకు జిల్లా స్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. అదే విధంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిలో ఏపీఓ, ఈసీలు, టీసీ, డీఆర్సీ, డీడీసీఎల్ఆర్సీ, డీబీటీ మేనేజర్, ప్లానింగ్ సూపర్వైజర్ పోస్టులకు జోనల్ స్థాయిలో.. టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు జిల్లా స్థాయిలో బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే మూడేళ్లకోసారి వీరికి కూడా బదిలీలు నిర్వహించాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే అయా విభాగాల్లో ఏడేళ్లుగా బదిలీల ప్రక్రియ నిర్వహించలేదు. దీంతో సదరు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ బదిలీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్లు: 3 ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తికి కసరత్తు త్వరలోనే విధి విధానాలు ఖరారు జిల్లాలో 134 మంది ఉద్యోగులు నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం.. సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ జారీ చేసింది. త్వరలోనే మార్గదర్శకాలను ప్రకటించనుంది. వాటి ఆధారంగా నెలాఖరులోగా ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. ఉపాధి హామీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికీ.. వారిని కూడా బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కౌన్సెలింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపడుతాం. – ఓబులేష్, డీఆర్డీఓ -
ఓపెన్ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించండి
కల్వకుర్తి టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సెమిస్టర్–2, 4, 6 పరీక్షల ఫీజు చెల్లించాలని కల్వకుర్తి స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 31వ తేదీలోగా మీసేవ కేంద్రం లేదా ఆన్లైన్ సెంటర్లలో ఫీజు చెల్లించి.. హాల్టికెట్లు పొందాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 73829 29720, 91775 97740 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.ఆక్రమణల కూల్చివేతనాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను బుధవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి పెల్లారెడ్డి ఆస్పత్రి రోడ్డు వరకు కొందరు దుకాణదారులు, చిరువ్యాపారులు ప్రధాన రహదారిని ఆక్రమించి షెడ్లు, మెట్లు నిర్మించుకోగా.. పోలీసు బందోబస్తు నడుమ వాటిని తొలగించారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల అధికారులతో చిరువ్యాపారులు వాగ్వాదానికి దిగారు. అయితే ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే కూల్చివేస్తున్నామని అఽధికారులు చెప్పారు. వ్యాపారులకు పోలీసులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ప్రధాన రహదారితో పాటు శ్రీపురం రోడ్డు, నల్లవెల్లి రోడ్డులో కూడా ఆక్రమణల తొలగింపు చేపట్టనున్నట్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వికాస్ తెలిపారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలతో పాటు ఇంటి అనుమతులు తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు చేపట్టిన వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు.అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దుతాడూర్: అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి నసీం సుల్తానా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. ప్రతి కేంద్రంలో తప్పనిసరిగా ఆట వస్తువులతో పాటు ఫ్యాన్లు, బాత్రూంలు ఉండాలని న్యాయమూర్తి సూచించారు. అదే విధంగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. న్యాయమూర్తి వెంట ఐసీడీఎస్ సీడీపీఓ దమయంతి, ఎస్ఐ గురుస్వామి, వనజ, కార్యదర్శి పవన్కుమార్, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. -
నేటినుంచి డిగ్రీ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలు పలు కారణాలతో రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో ఏబీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ తదితర కోర్సుల్లో 2, 4, 6 సెమిస్టర్లతోపాటు పలు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణకు అధికారులు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని కేంద్రాలకు మెటీరియల్ చేరుకుంది. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 47 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా ఇందులో 17 ప్రభుత్వ.. 30 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సెమిస్టర్–2లో 16,073 మంది విద్యార్థులు, సెమిస్టర్– 6లో 13,787 మంది, సెమిస్టర్–4లో 9,240 మంది విద్యార్థులు కలిపి మొత్తం 39,100 మంది పరీక్ష రాయనున్నారు. 9 రూట్లలో ఫ్లయింగ్ స్క్వాడ్, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్ను నియమించారు. మాస్ కాపీయింగ్కు ఎలాంటి అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. రెండుసార్లు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రారంభం 47 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 39,100 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తిచేశాం.. పీయూ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వి ద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా కాపీయింగ్ తావు లేకుండా పకడ్బందీగా, పాదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ -
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
వంగూరు/మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 18న జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం పర్యటన ఏర్పాట్లను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా సీఎం స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి.. సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లిలో దాదాపు రూ. 50కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ, మిషన్ భగీరథ అధికారులు అభివృద్ధి పనులను పూర్తిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీశైలం హైవే నుంచి గ్రామం వరకు నాలుగు లెన్ల రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైయినేజీ, సీసీరోడ్లు, సోలార్ విద్యుత్ సౌకర్యం తదితర పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా హెలీప్యాడ్ సమీపంలో బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం అమ్రాబాద్ మండలం మాచారంలో సీఎం సభా స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభిస్తారని.. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామపెద్ద జలంధర్రెడ్డి, ఐటీడీఏ పీఓ రోహిత్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బోరుబావులు, సౌరశక్తి పలకల ఏర్పా ట్లు, పండ్ల మొక్కల నాటడం, హెలీప్యాడ్ను పరిశీలించారు. సీఎం హోదాలో మొదటిసారిగా నల్లమలకు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పా టు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. వారి వెంట వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి విజయ్కుమార్, ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, డీఈ నాగలక్ష్మి, పంచాయతీరాజ్ డీఈ చంద్రకళ, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్, తహసీల్దార్ శైలేంద్ర, ఎంపీడీఓలు వెంకటయ్య, జగదీశ్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఏర్పాట్ల పరిశీలన -
అందని ‘ఆయుష్’!
నాగర్కర్నూల్ క్రైం: ఏ వ్యక్తికి అయినా ఆరోగ్య సమస్యలు ఎదురైతే దుష్ప్రభావాలు లేని చికిత్స చేయించుకునేందుకు ఇష్టపడతారు. ఎక్కువగా దేశీయ వైద్యం వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ వైద్యవిభాగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటుచేసి.. రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్కు తగిన ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. జిల్లాలో వైద్యులు, ఫార్మసిస్టులు, ఇతర సిబ్బంది కొరత, నామమాత్రంగా మందుల సరఫరాతో వైద్యసేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు.యునాని వైద్యం మాత్రమే..జిల్లా కేంద్రంలో యునాని వైద్యం మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. ఆయుర్వేద, హోమియో ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడంతో సమీపంలోని వైద్యశాలలకు వెళ్లి వైద్యం పొందాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో ఆయుర్వేద, హోమియో ఆస్పత్రులు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజలు కోరుతున్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అందుబాటులో ఏడుగురు వైద్యులు మాత్రమే..ప్రభుత్వం ఆయుష్ విభాగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. అందుకు తగిన వైద్యులు, సిబ్బందిని నియమించక పోవడంతో సరైన వైద్యం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని రెగ్యులర్ డిస్పెన్సరీల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో పాటు చాలా మంది ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్లో వెళ్లిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయుష్ రెగ్యులర్ ఆస్పత్రులకు సంబంధించి ఏడుగురు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండగా.. మిగతా ఆస్పత్రుల్లో వైద్యులు లేక నిరుపయోగంగా మారాయి. కాగా, ఎన్ఆర్హెచ్ఎం కింద ఏర్పాటుచేసిన 15 ఆయుష్ వైద్యశాలల్లో వైద్యులు ఆయర్వేద చికిత్స అందించకుండా అలోపతి వైద్యం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న ఆయుష్ ఆస్పత్రుల్లో వెంటనే వైద్యులను నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గత కలెక్టర్ హయాంలో ఆయుర్వేదిక్లో పంచకర్మ ప్రారంభించాలనే ఆలోచనతో కొంత మెటీరియల్ కూడా సమకూర్చారు. అయినప్పటికీ సంబంధిత ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో నిరుపయోగం మారాయని పలువురు పేర్కొంటున్నారు.అరకొరగా మందుల సరఫరా..ఆయుర్వేదం, యునాని, హోమియోపై ప్రజల్లో అవగాహన పెరగడంతో.. దీర్ఘకాలిక రోగులే కాకుండా సాధారణ రోగులు సైతం దుష్ప్రభావాలు లేని ఆయుష్ వైద్యంపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా షుగర్, న్యూరోలాజికల్, శ్వాసకోశ, చర్మ, వాతం, గ్యాస్ ట్రబుల్, ఫైల్స్ తదితర వాటితో పాటు సీ్త్రలకు సంబంధించిన వ్యాధులకు ఆయుర్వేద వైద్యం పొందేందుకు మక్కువ చూపుతండటంతో వైద్యశాలల్లో ఓపీ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ప్రభుత్వం మందులను అరకొరగా సరఫరా చేస్తుండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రైవేటులో మందుల ఖరీదు అధికంగా ఉండటం.. తగినన్ని ఆయుర్వేద మందుల దుకాణాలు సైతం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.జిల్లాలో సేవలు ఇలా..జిల్లాలోని 19 చోట్ల ఆయుష్కు సంబంధించి రెగ్యులర్ డిస్పెన్సరీలు ఉండగా.. అందులో ఆయుర్వేద వైద్యశాలలు బిజినేపల్లి, చారకొండ, గొరిట, కార్వాంగ, కొండనాగుల, మన్ననూర్, సిద్దాపూర్, తాడూరు, తూడుకుర్తి, వెల్దండ, వెంకటేశ్వర్లబావి, ఎల్లికల్ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. యునాని వైద్యానికి సంబంధించి అంబటిపల్లి, నాగర్కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, ఎత్తం, కొల్లాపూర్లో రెగ్యులర్ డిస్పెన్సరీలు ఉన్నాయి. పెనిమిళ్లలో హోమియో వైద్యశాల కొనసాగుతోంది. అదే విధంగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద రఘుపతిపేట, ఉప్పునుంతల, తిమ్మాజిపేట, పాలెం, లట్టుపల్లిలో హోమియో వైద్యశాలలు కొనసాగుతున్నాయి. యునాని వైద్యానికి సంబంధించి కోడేరు, కల్వకుర్తి ప్రాంతంలో సెంటర్లు ఉన్నాయి. తెలకపల్లి, బల్మూరు, లింగాల, పదర, బొప్పల్లి, ఉప్పునుంతల, పెద్దకొత్తపల్లి, వంగూరు ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యశాలులు కొనసాగుతున్నాయి.యోగా వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే జిల్లాలోని ఆయుష్ వైద్యశాలల్లో ఏర్పాటు చేసిన యోగా సెంటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. యోగా సెంటర్లలో సిబ్బందిని నియమించినప్పటికీ సరైన వసతులు లేకపోవడం.. ఊరికి దూరంగా ఉండటంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని యోగా సెంటర్ మొదటి అంతస్తులో ఉండటం.. సరైన రెయిలింగ్ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. అధికారులు యోగా సెంటర్లపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..జిల్లా ఆయుష్ విభాగంలో వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీలు, ఇతర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఆయుష్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో పాటు మందుల కొరత లేకుండా చూస్తాం. యోగా సెంటర్లను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాం.– సురేష్, జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్ -
విద్యార్థులకు సులభ పద్ధతిలో బోధించాలి
కల్వకుర్తి టౌన్: ఉపాధ్యాయులు విద్యార్థులకు సుల భ పద్ధతిలో బోధించాలని డీఈఓ రమేశ్ కుమార్ సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి ఎంపిక చేసిన 160 మంది ఉపాధ్యాయులకు బుధవారం కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించి మాట్లాడారు. తెలుగు మౌఖిక భాషాభివృద్ధి, గణితంలో చతుర్విద పక్రియలు, ప్రతి విద్యార్థి సొంతంగా చదవడం, రాయడం, స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్, ఏఐ పద్ధతిలో విద్యాబోధనపై ఐదు రోజులపాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో 23వ స్థానం నుంచి 13వ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. అనంతరం కేజీబీవీలో వేసవి శిక్షణా శిబిరాన్ని డీఈఓ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ నాయక్, జిల్లా రీసోర్స్ పర్సన్లు రఘురాం, మణికంఠ, రాజేందర్, శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలమర్రి ముస్తాబు
రేపు ప్రపంచ సుందరీమణుల రాక ● 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి సందర్శన ● మహావృక్షం ఖ్యాతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఏర్పాట్లు ● విజయనగరం కాలం నాటి ఆలయం.. పురావస్తు మ్యూజియానికి సొబగులు ● తెలంగాణతోపాటు జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా అధికారుల సన్నాహాలు ● వెదురు ఆకృతులు, చేనేత చీరలు, మగ్గాలు, బతుకమ్మలు, బోనాల ప్రదర్శన ● గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం.. గురుకులాల విద్యార్థులతో మాటాముచ్చట ● సుమారు వెయ్యి మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు మిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లు పిల్లల మర్రి పర్యటనను పురస్కరించుకుని పురావస్తు, అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊడల మర్రి చుట్టూ మట్టిని చదును చేసి, గ్రాస్ మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. మహావృక్షం చుట్టూ గోడ, ఊడల మర్రి పునరుజ్జీవంలో భాగంగా ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లరతోపాటు సిమెంట్ కుర్చీలకు రంగులు అద్దుతున్నారు. పిల్లలమర్రి చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ ప్రూఫ్ టెంట్లతోపాటు ప్రత్యేకంగా వాష్రూంలను సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మ్యూజియంలోని శిల్పాలను శుభ్రం చేయడంతోపాటు వాటికి నేమ్ బోర్డులు రాయిస్తున్నారు. ఆయా శిల్పాలు ఏ కాలానికి చెందినవి.. ఎవరి హయాంలో తయారు చేశారు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వంటి వివరాలు నేమ్ బోర్డులో పొందుపరుస్తున్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో సౌండ్ అండ్ లైటింగ్, పారిశుద్ధ్య పనులు చకచకా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఈ నెల 16న ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో పాలమూరు ముస్తాబవుతోంది. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని వారు సందర్శించనుండగా.. మహావృక్షం ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతోంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. ఆలయం.. మ్యూజియం.. ఆ తర్వాత పిల్లల మర్రి.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకోనున్నారు. పిల్లలమర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పురావస్తు మ్యూజియానికి రానున్నారు. ఆ తర్వాత లంబాడాల నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మర్రికి చేరుకోనున్నారు. మహా వృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ సుందరీమణులకు వివరించనున్నారు. అదేవిధంగా రాజరాజేశ్వర ఆలయ విశిష్టతతోపాటు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజియం విశేషాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ప్రత్యేక గైడ్లను నియమించారు. ఏర్పాట్లు ఇలా.. గద్వాల, నారాయణపేట చేనేత చీరల ప్రదర్శన.. మన నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రఖ్యాతి గాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శించనున్నారు. మగ్గాలతో సహజసిద్దంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించనున్నారు. దీంతోపాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్త కళానైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. పిల్లల మర్రి ఆవరణలో 22 మంది అందాల భామల చేతుల మీదుగా వివిధ రకాల మొక్కలు నాటేలా అధికారులు చర్యలు చేపట్టారు. చివరగా గురుకుల విద్యార్థులతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కాసేపు ముచ్చటించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. -
పరిశీలన కొనసాగుతోంది..
రాజీవ్యువ వికాసం కింద వచ్చిన మొత్తం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారులతోపాటు బ్యాంకు అధికారులు సమగ్రంగా దరఖాస్తుల పరిశీలన చేపడుతున్నారు. బ్యాంకుల పరిశీలన పూర్తయిన తర్వాత ఆమోదం పొందిన వాటిని జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తారు. తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తాం. – ఖాజా నిజాం అలీ, బీసీ సంక్షేమ శాఖాధికారి, నాగర్కర్నూల్ అర్హులకు అందించాలి.. రాజీవ్ యువవికాసం కింద ఫొటోస్టూడియో ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం జీవనోపాధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి సకాలంలో సబ్సిడీ రుణాలను అందజేయాలి. – రాజశేఖర్, మన్ననూర్, అమ్రాబాద్ మండలం● -
రోడ్డెక్కిన అన్నదాతలు
పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోలు కొనుగోలు కేంద్రం ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం రైతన్నలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పండించిన వరి ధాన్యాన్ని 20 రోజులుగా కేంద్రంలోనే ఉంచినా మహిళా సమైఖ్య సభ్యులు కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని.. తేమశాతం సరిగా లేదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ అధికారులు రైస్మిల్లర్లతో చేతులు కలిపి ధాన్యం కొనుగోలు చేయడం లేదని మాజీ సర్పంచ్ ఆరోపించారు. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందని.. మళ్లీ ఎండబెట్టాలని సూచిస్తున్నారన్నారు. రాస్తారోకోతో ప్రధాన రహదారిపై గంటన్నర పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామన్గౌడ్, మహిళా సమైఖ్య ఏపీఎం గౌసుద్దీన్ అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడి ఒప్పించి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎస్కే ఖాజా, ఈశ్వర్రెడ్డి, శంకర్రెడ్డి, ఈశ్వరయ్య, నర్సింహ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు
కొల్లాపూర్: వరి ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శిస్తూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆయన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీచేసి అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యంపై కప్పేందుకు అవసరమైన టార్పాలిన్లు మార్కెట్ సిబ్బంది ఇవ్వలేదని, కేంద్రంలో కనీసం తాగునీటి వసతి కల్పించ లేదని, రాత్రిళ్లు విద్యుత్ లేక ధాన్యం, ఇతర సామగ్రి చోరీకి గురవుతోందని రైతులు మంత్రికి వివరించారు. వెంటనే కలెక్టర్, మార్కెటింగ్ అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. రైతులకు సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని వారు మంత్రికి వివరించగా.. రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని మార్కెట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని.. కొనుగోలు కేంద్రం నిర్వహణ బాధ్యతను ఇతరులకు అప్పగించాలని కోరారు. మంత్రి వెంట సింగిల్విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, నాయకులు పస్పుల నర్సింహ, ఎక్బాల్, కేతూరి ధర్మతేజ తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.. పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన పలువురికి మంగళవారం క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెక్కులు పంపిణీ చేశారు. బేస్మెట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తయిన వారికి రూ.లక్ష అందిస్తున్నట్లు చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. నాణ్యతగా నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మండల హౌసింగ్ ఏఈ రాజవర్ధన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్, మాజీ ఎంపీపీలు సూర్యప్రతాప్గౌడ్, వెంకటేశ్వర్రావు, నాయకులు దండు నర్సింహ, వెంకటస్వామిగౌడ్, రవికుమార్, బద్యానాయక్, చంద్రయ్యయాదవ్, రాంలాల్ నాయక్, గోవిందు, శ్రీశైలం, కృష్ణ, శంకర్నాయక్ తదితరులున్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ముగిసిన పాలిసెట్
కందనూలు: జిల్లాలో మంగళవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా పాలిసెట్ కన్వీనర్ మదన్మోహన్ తెలిపారు. మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 2,805 మంది విద్యార్థులకుగాను 2,629 మంది హాజరుకాగా, 176 మంది గైర్హాజరయ్యారని వివరించారు. 93.7 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తనతో పాటు స్పెషల్ అబ్జర్వర్ లక్ష్మయ్య, పాలిసెట్ అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ అంజయ్య పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.బోధన నైపుణ్యాలేఅత్యంత కీలకంతెలకపల్లి: విద్యావ్యవస్థకు ఉపాధ్యాయులే మూల స్తంభాలని.. వారి బోధన నైపుణ్యాలు అత్యంత కీలకమని జిల్లా విద్యాధికారి రమేష్కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని గణిత ఉపాధ్యాయులకు ప్రారంభమైన మొదటి విడత శిక్షణా తరగతులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెళకువలు అందించేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శిక్షణ తరగతులు మంగళవారం నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతాయని.. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గతిలో అమలు చేసేందుకు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా పాఠశాలలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. రోజువారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. టెస్ట్బుక్ మేనేజర్ నర్సింహులు, శ్రీకాంత్, శ్రీనివాసులు, హరికృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.వేసవి క్రికెట్ శిక్షణను వినియోగించుకోవాలినాగర్కర్నూల్: జిల్లాకేంద్రంలోని ఏబీసీ మైదానంలో నెలరోజుల పాటు కొనసాగే ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేష్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఈ ప్రాంత యువకులు సద్వినియోగం చేసుకొని క్రికెట్లో రాణించాలని కోరారు. నాగర్కర్నూల్ జిల్లాలో నిర్వహిస్తున్న శిబిరాలకు ఇన్చార్జ్లుగా మహ్మద్ మోసిన్, సతీష్ ఉంటారని వివరించారు. గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాలను వెలికితీయాలన్న సంకల్పంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని.. క్రీడాకారులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. నాగర్కర్నూల్ యువకులు తమ పేర్లను నమోదు చేసుకొని శిక్షణకు రావడం అభినందనీయమని తెలిపారు.ఈ నెల 15న జట్ల ఎంపిక..జిల్లాకేంద్రంలోని నల్లవెల్లి రోడ్లో ఉన్న నాగర్కర్నూల్ క్రికెట్ అకాడమీ మైదానంలో ఈ నెల 15న అండర్–19 అండర్–23 జిల్లా జట్ల ఎంపిక ఉంటుందని సంఘం ఉపాధ్యక్షుడు సురేష్ తెలిపారు. ఎంపికై న జట్లు ఈ నెల 19 నుంచి ఉమ్మడి జిల్లాకేంద్రంలో జరిగే లీగ్ మ్యాచ్లో పాల్గొంటాయన్నారు. ఐదు జిల్లాల్లోని జట్ల నుంచి ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక చేస్తామని చెప్పారు. -
వైభవం.. మదనగోపాలుడి రథోత్సవం
పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్లో సోమవారం మదనగోపాలస్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో రథాన్ని అందంగా ముస్తాబు చేసి రుక్మిణీ సత్యభామ సమేత మదనగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలను అర్చకులు మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి తేరుపై ఉంచారు. అనంతరం ఆలయ ట్రస్ట్ చైర్మన్, సురభి సంస్థాన వంశస్తుడు ఆదిత్యలక్ష్మణ్రావు ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ప్రారంభించగా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుకు లాగారు. తేరు ముందు కళాకారుల కోలాటాల ప్రదర్శన ఆకట్టుకుంది. -
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
గోపాల్పేట: రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. సోమవారం మండలంలోని మున్ననూరులో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూరి యా, పురుగు మందులను తగిన మోతాదులో వినియోగించాలని సూచించారు. అనంతరం శాస్త్రవేత్తలు భూసార పరీక్షలతో కలిగే లాభాలు, పంట అవశేషాలను కాల్చడంతో కలిగే నష్టాలను వివరించారు. సాగు సమయంలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని, అలాగే పంటమార్పిడి చేపట్టాలని సూచించారు. తక్కువ నీటితో పంటల సాగు, ఆయిల్పాం సాగు చేపట్టాలని కోరారు. -
ధాన్యం కొనుగోళ్లలో పొరపాట్లకు తావివ్వొద్దు
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికకల్వకుర్తి టౌన్: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని.. ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వ నిబంధనలు, కమిటీలు తీసుకున్న నిర్ణయాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో అధికారులతో మాట్లాడి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి పలు విషయాలపై ఆరా తీశారు. సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాక్షి, నాగర్కర్నూల్/ నాగర్కర్నూల్: ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని.. పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 2024–25 యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయనతో పాటు కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేశ్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సన్న, దొడ్డురకం వరి ధాన్యాన్ని వేర్వేరు కేంద్రాల్లో కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రానికి కోడ్ నంబర్ కేటాయించి ఏ రకం ధాన్యం ఏ మిల్లుకు తరలిస్తున్నారన్న వివరాలను ధాన్యం బస్తాలపై రాయాలన్నారు. దీంతో మిల్లుల్లో ఏవైనా అవకతవకలు జరిగితే సులువుగా నిర్ధారణ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుకు నష్టం వాటిల్లకుండా, ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వెంటనే నిర్దేశిత మిల్లుకు తరలించడంతో పాటు తక్షణమే అన్లోడింగ్ జరిగేలా పర్యవేక్షణ చేయాలని కోరారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. ఎవరైనా రైతును మోసగించేందుకు, నష్టపర్చేందుకు ప్రయత్నిస్తే ఎంతమాత్రం ఉపేక్షించవద్దని, అవసరమైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు సరిపడా సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, నీడ వసతి కల్పించాలని సూచించారు. హమాలీల సంఖ్య పెంచి వెంటనే ధాన్యం తూకం జరిగేలా, ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలించేలా చొరవ చూపాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు, రైస్మిల్లర్లు తమ పరిధిలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఆర్డీఓ చిన్న ఓబులేశు, పౌరసరఫరాలశాఖ మేనేజర్ రాజేందర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, రైస్ మిల్లు యజమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు మంత్రి జూపల్లి క్లాస్.. ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సందర్భంగా మంత్రి జూపల్లి అధికారులకు క్లాస్ తీసుకున్నారు. జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల బాధ్యులు ఎక్కువ సంఖ్యలో గైర్హాజరు కావడం, సంచుల్లో అదనపు తూకం విధించడం, 17 శాతానికి మించి తక్కువ తేమ శాతం వచ్చే వరకు రైతులను నిరీక్షించేలా చేయడంపై మండిపడ్డారు. డీఫాల్టర్లుగా తేలిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో అలసత్వంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజవాణిలో ఆయన పాల్గొని ఫిర్యాదుదారులతో వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 16 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 7 భూ తగాదాలు, 3 భార్యాభర్తల గొడవలు, 6 వివిధ రకాల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఫిర్యాదులను ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు సిఫారస్ చేసి త్వరగా పరిష్కరించాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి కల్వకుర్తి రూరల్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో ఎంత మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారో ఆ జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద యువతకు సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా రుణం మంజూరు చేయాలని కోరారు. ఆగస్టు మొదటి వారంలో మూడో మహాసభలు కల్వకుర్తిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ సభ్యులు ఫయాజ్, కేశవులు, వెంకటయ్య, చంద్రమౌళి, ఇందిరా విజయుడు, నర్సింహ, శంకర్గౌడ్, డా. శ్రీనివాస్, పులిజాల పరశురాం, బాలమురళి, మధు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్ మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19, 23 విభాగాలకు ఈ సెలక్షన్స్ ఉంటాయన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్లోని పిల్లలమర్రి రోడ్డులోగల ఎండీసీఏ క్రికెట్ మైదానంలో, జడ్చర్లలోని మినీ స్టేడియంలో, 15న నారాయణపేటలోని మినీ స్టేడియంలో, నాగర్కర్నూల్లోని నల్లవెల్లి రోడ్డులోగల క్రికెట్ అకాడమీలో, 16న వనపర్తి జిల్లా పెబ్బేరులోని పీపీఎల్ మున్సిపల్ గ్రౌండ్లో, గద్వాలలోని ఇండోర్ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారుల సెలక్షన్స్ ఉంటాయని చెప్పారు. ఎంపికై న క్రీడా జట్లతో ఈ నెల 19 నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లకు శ్రీకారం చుట్టిందని, పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభచాటాలని పిలుపునిచ్చారు. క్రికెట్ సెలక్షన్స్కు సంబంధించి మిగతా వివరాల కోసం మహబూబ్నగర్లో సంతోష్ (81792 75867), నాగర్కర్నూల్లో సతీష్ (89193 86105), జడ్చర్లలో మహేష్ (99494 84723), గద్వాలలో శ్రీనివాసులు (98859 55633), నారాయణపేటలో రమణ (91007 53683), పెబ్బేర్లో శంకర్ (96033 60654) నంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. స్పాట్ కౌన్సెలింగ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం (2025– 26)లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు గాను ఈ నెల 15, 16 తేదీల్లో విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల మహబూబ్నగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి, కేటీదొడ్డి, అచ్చంపేట, మన్ననూర్, పెద్దమందడి, కొండాపూర్లో ఈ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో చేరేవారు మొదటి రోజు బాలురకు, రెండో రోజు బాలికలకు జిల్లాకేంద్రం శివారు ధర్మాపూర్లోని ఆల్ మదీనా బీఈడీ కళాశాల ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. -
పంటల బీమా పునరుద్ధరణ?
● వానాకాలం నుంచి అమలుకు యోచనలో ప్రభుత్వం ● రైతుల్లో చిగురిస్తున్న ఆశలు నాగర్కర్నూల్: రైతులను అన్నివిధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఆశించిన మేర పంట చేతికొచ్చి మంచి ధర పలికితే రైతులకు ఎంతో మేలు. కానీ కొన్నిసార్లు పండించిన పంట అకాల వర్షాలకు గురై తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉండటంతో పంటల బీమా తప్పనిసరి అని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తిరిగి అమలు చేసే యోచనలో ఉంది. 2018 నుంచి నిలిపివేత.. పంటల బీమా పథకం రాష్ట్రంలో 2018 నుంచి అమలు కావడం లేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతన్నలకు ఎలాంటి పరిహారం అందడం లేదు. బీమాను అమలు చేస్తే ప్రీమియం చెల్లించిన అన్నదాతలకు నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఏటా వానాకాలం, యాసంగిలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తారు. ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఫసల్ బీమా అమలు చేస్తే రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పంటను బట్టి కొంత ప్రీమియం చెల్లిస్తే మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే విధానం ఉండేది. ప్రస్తుతం ఎలాంటి విధివిధానాలు అమలు చేస్తారో వేచి చూడాలి. గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పెద్దకొత్తపల్లి, బిజినేపల్లి, కొల్లాపూర్ ప్రాంతాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆయా మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసినా.. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. నీరందక పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలు, తెగుళ్లు సోకి పంటలు దెబ్బతిన్నా బీమా రక్షణ కవచంలా పని చేస్తుంది. దీంతో రైతులు ఈ పథకాన్ని అమలు చేయాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. -
15 రోజులైనా రాలేదు..
నాకున్న నాలుగు ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేశాను. మొత్తం 118 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తే.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన. ధాన్యం విక్రయించి ఇప్పటికే 15 రోజులైనా క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రాలేదు. – బూషయ్య, రైతు, లట్టుపల్లి, బిజినేపల్లి మండలం, నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వం నుంచే రావాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. క్వింటాల్కు కనీస మద్దతు ధర ప్రకారం రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. సన్న రకం ధాన్యానికి ఇచ్చే బోనస్ మరుసటి రోజునే ప్రభుత్వం జమ చేస్తుంది. బోనస్ డబ్బులు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. – రాజేందర్, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల శాఖ, నాగర్కర్నూల్ ● -
చెంచుల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం
మన్ననూర్: చెంచులు ఆర్థికాభివృద్ధి సాధించే వరకు వారికి వెన్నంటి ఉంటూ పోత్సహిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఇందిర సౌర గిరి జల పథకంలో భాగంగా చెంచుల వ్యవసాయ పొలాల్లో తవ్వుతున్న బోరుబావులను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని.. ఈ నెల 18న కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించామన్నారు. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో చెంచులు సాగు చేసుకుంటున్న ఆర్ఓఎఫ్ఆర్, పట్టా భూముల్లో బోర్లు తవ్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. బోరుబావులు తవ్విన తర్వాత స్ప్రింక్లర్లు, పంపుసెట్లకు సౌర విద్యుత్ అందిస్తామని.. ప్రస్తుత విధానాలకు అనుకూలంగా ఉద్యాన, వాణిజ్య పంటలు పండించే ఏర్పాట్లు కూడా చేస్తామని వివరించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ, డీఎఫ్ఓ రోహిత్రెడ్డి, ఆర్డీఓ మాధవి, గ్రౌండ్ వాటర్ ఏడీ దివ్యజ్యోతి, డీటీడీఓ ఫిరంగి, డీపీఓ మోహన్రావు, జిల్లా ఉద్యాన అధికారులు జగన్, వెంకటేష్, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్అండ్బీ డీఈ జలంధర్, తహసీల్దార్ శైలేంద్రకుమార్, ఎంపీడీఓ వెంకటయ్య, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అమరవీరులకు ఘన నివాళి
తిమ్మాజిపేట: మండలంలోని గొరిటలో ఆదివారం రాత్రి భారత్–పాకిస్తాన్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ఘన నివాళి అర్పించారు. గ్రామ వీధుల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి చివరగా దేవాలయం సమీపంలో అమరవీరుల చిత్రపటాలు ఏర్పాటుచేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆర్మీ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షుడు చెన్నయ్య, కోశాధికారి నోబుల్రెడ్డి, సలహాదారులు రాంగోపాల్, శాంతయ్య, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి కందనూలు: జిల్లాలో ఈ నెల 13న జరగనున్న పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలిసెట్ జిల్లా క న్వీనర్ మదన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. జిల్లాకేంద్రంలో 8, పాలెంలో ఒక కేంద్రం ఉన్నట్లు చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష కొనసాగనుండగా.. 2,805 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఇందులో 1,354 మంది బాలురు, 1,451 మంది బాలికలు ఉన్నారని.. ప్రతి కేంద్రా న్ని జీపీఎస్తో అనుంధానించిన ట్లు వివరించారు. పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులు హాల్టికెట్, హెచ్బీ పెన్సిల్, బ్లూ, బ్లాక్పెన్ తీసుకొని గంట ముందు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ ఎం.అంజయ్య సెల్నంబర్ 94918 77502 సంప్రదించాలన్నారు.అడుగంటుతున్న కోయిల్సాగర్ దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం 11.6 అడుగులకు చేరింది. యాసంగి సాగుకు ముందు ప్రాజెక్టులో 31.6 అడుగుల నీటిమట్టం ఉండగా పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు చేరింది. యాసంగి సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు మూడు పంప్హౌస్ల నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో మూడు వారాల్లో 1.9 అడుగులుతగ్గింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 11.6 అడుగుల నీరు ఉంది. -
అమ్మా.. నీకు వందనం
నాగర్కర్నూల్ఆదర్శమూర్తి.. అమ్మ వాతావరణం ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు వీస్తాయి. ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025వివరాలు 10లో uసృష్టిలో అమ్మ పాత్ర గురించి వివరిచేందుకు, వర్ణించేందుకు ఏ భాష సరిపోదు. అయితే నా వరకు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా సొంత గ్రామం అప్పారెడ్డిపల్లి వనపర్తి జిల్లా. అమ్మ మణెమ్మ, నాన్న బుచ్చన్న. మేము ఐదుగురం సంతానం కాగా.. ఇద్దరం మగ పిల్లలం, ముగ్గురు ఆడపిల్లలు. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా నాన్న ప్రధానంగా కులవృత్తి వడ్రంగి పనిచేసేవారు. నేను పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరాలకున్నాను. కానీ, అప్పట్లో కులవృత్తికి బాగా డిమాండ్ ఉండడం, మాది పెద్ద కుటుంబం కావడం.. ఇంట్లో నేనే పెద్ద కుమారుడిని కావడంతో మానాన్న పదో తరగతిలోనే ఆపేసి వండ్రంగి పని నేర్చుకోవాలన్నారు. అయితే మా అమ్మ చదువుకుంటేనే విలువ ఉంటుందని, నన్ను ఇంటర్మీడియట్లో చేర్పించారు. అలా అమ్మ ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, ఉన్నత విద్య పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మతోపాటు నాన్న ప్రోత్సాహం కూడా ఉంది. ఇప్పటికీ శనివారం, ఆదివారం వచ్చిందటే చాలు పెద్దోడ ఇంటికి వచ్చివెళ్లు అంటుంది. అంత ప్రేమ పంచడం సృష్టిలో ఒక్క అమ్మకే సాధ్యం. పిల్లలు ఎంత ఎదిగినా తల్లి దృష్టిలో చిన్నపిల్లలే. అందుకే మనకోసం కష్టించే అమ్మకు మనం పెద్దవారం అయిన తర్వాత గౌరవించి బాగా చూసుకుంటే వారికి అదే చాలు. – లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● తల్లి ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగిన వారెందరో.. ● అమ్మ మాట.. బంగారు బాట.. తల్లి ప్రేమ మారదు.. ఉద్యోగరీత్యా మా పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎలాంటి సందర్భంలో నీకు దూరంగా ఉన్నా అనే విషయం చెబితే మా అమ్మాయి అర్థం చేసుకుంటుంది అని చెప్పుకొచ్చారు మహబూబ్నగర్ ఎస్పీ జానకి. మాకు ఒకే ఒక్క కూతురు హైదరాబాద్లో 8వ తరగతి చదువుతుంది. విధుల్లో భాగంగా నేను మహబూబ్నగర్లో ఉంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడి రావడం.. లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికై నా పిల్లలపై చూపే తల్లి ప్రేమ, వాత్సల్యంలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో జనరేషన్కు ఇప్పటి పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు సాంకేతికపరంగా టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. భవిష్యత్పరంగా ఎలా ఉండాలి.. ఇతర అంశాలపై చర్చించడం చేస్తాను. చదువులో కూడా ఏదైనా సందేహాలు, సలహాలు ఇస్తాను. అమ్మాయికి దూరంగా ఉన్నా.. నిత్యం ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటాను. ‘నా చిన్నతనం నుంచి మా అమ్మ శోభ నాకు అన్ని రకాలుగా ప్రోత్సాహంగా నిలిచారు. మా అన్న, చెల్లెలితో పాటు నన్ను బాగా చదువుకునేలా ప్రోత్సహించారు. ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమెకన్నా ముఖ్యమైన వారు మన జీవితంలో ఎవరూ ఉండరు. నాకు సమయం కుదిరినప్పుడల్లా అమ్మ, నాన్న, కుటుంబసభ్యులతో గడుపుతాను. తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. – వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఎస్పీ, నాగర్కర్నూల్ నేడు మాతృదినోత్సవం అమ్మను తొలి గురువుగా భావించి ఆదర్శంగా తీసుకుని సివిల్ సర్వీసెస్ లక్ష్యం నిర్దేశించుకున్నా. వెన్నంటే ఉంటూ ఎంతో ప్రోత్సాహం అందించి నేడు సమాజంలో గౌరవ ప్రదమైన కలెక్టర్గా ప్రజలకు సేవలందించేందుకు సహకారం అందించారు. నా లైఫ్లో ప్రతి ముఖ్యమైన ఘట్టంలో మా అమ్మ నర్సమ్మ పాత్ర చాలా కీలకం. ప్రాథమిక విద్య హైదరాబాద్లో.. ఐదో తరగతి నుంచి ఢిల్లీలో చదువుకునేందుకు అమ్మ తన ఉద్యోగ బాధ్యతలను నా కోసం పదేళ్లపాటు ఢిల్లీకి మార్చుకున్నారు. నా జీవిత లక్ష్యం సాధించేందుకు ఎంతగానో మార్గనిర్దేశనం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మా అమ్మ పట్టుదలతో ఉన్నత చదువులను అభ్యసించి ఆదాయపన్ను శాఖ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. నా కెరీర్లో రోల్ మోడల్గా నిలిచారు. చిన్న వయస్సు నుంచే ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తూ.. జీవిత లక్ష్యం సాధించుకునేందుకు వెన్నంటి నడిపించారు. మారుమూల ప్రాంతమైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామంలో కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టారు. మా నాన్న సురభి సత్యన్నతో జీవితాన్ని పంచుకునేందుకు తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్కు వచ్చారు. నాన్న రాష్ట్ర సర్సీసుల్లో జాయింట్ కలెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మా కుటుంబ ఉన్నతి కోసం మా అమ్మ ఎంతగానో కృషి చేశారు. – ఆదర్శ్ సురభి, కలెక్టర్, వనపర్తి తొలి గురువుగా అందరికీ స్ఫూర్తి సృష్టికి ప్రతి రూపం అమ్మ.. పిలిచే తియ్యని పిలుపే అమ్మ.. ప్రాణం పోసే దేవత అమ్మ.. కన్నపేగు గుండెచప్పుడు అమ్మ.. మమతల ఒడి.. త్యాగాల గుడి.. తొలిబడి అమ్మ.. అమితమైన ప్రేమ.. అంతులేని అనురాగం.. అలుపెరగని ఓర్పు.. మాటల్లో వ్యక్తపరచలేని భావం.. చేతల్లో ప్రదర్శించలేని భాష్యం.. అందుకే అమ్మకు సాటి అమ్మే.. అమ్మకు మించిన దైవం లేదంటారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు వారి అమ్మ ప్రేమను గుర్తు చేసుకున్నారు. అమ్మ లేకుంటే నేను లేను తల్లికంటే ముఖ్యులు ఎవరూ ఉండరు.. వివరాలు 10లో uవివరాలు 10లో uనా కెరీర్లో రోల్ మోడల్ -
ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి కృషి
మన్ననూర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరా సౌర గిరి జల వికాస పథకం రూపకల్పన కోసం పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని అటవీశాఖ జిల్లా కార్యాలయంలో ఎస్పీ వైభవ్ గ్వైకాండ్ రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ప్రారంభించనున్న ఇందిరా సౌర గిరి జల వికాస పథకం కోసం చేపట్టాల్సిన అంశాల గురించి అధికారులకు వివరించారు. జిల్లా పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో నివశిస్తున్న ఆదివాసీ చెంచులను వ్యవసాయ పరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉందన్నారు. ఈ క్రమంలో మన్ననూర్లో చేపట్టనున్న ఈ పథకానికి రూ.12,600 కోట్ల నిధులు కేటాయిస్తూ 6 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తింపజేస్తుందని, దీంతో జిల్లాలోని 2.10 లక్షల మంది ఆదివాసీ చెంచు రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఆర్ఓఎఫ్ఆర్తోపాటు చెంచుల వ్యవసాయ భూములకు సౌర శక్తితో నీటి సౌకర్యం, డ్రిప్ సిస్టం తదితర సౌకర్యాలు కల్పించి ఉద్యాన వన పంటలు సాగు చేయడంతోపాటు దిగుమతులను నేరుగా హైదరాబాద్ మార్కెట్కు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా చెంచుల భూములలో భూగర్భ జల అధికారులు తమ బృందాలతో సర్వే జరిపించి బోరు బావులకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అనంతరం సీఎం పర్యటనలో భాగంగా మన్ననూర్లోని పీటీజీ పాఠశాలలో హెలీప్యాడ్, అదేవిధంగా మాచారంలో సీఎం పాల్గొనే సభా స్థలంతోపాటు చెంచులకు సంబంధించిన పోడు భూములను వారు పరిశీలించారు. ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ, డీఎఫ్ఓ రోహిత్రెడ్డి, ఆర్డీఓ మాధవి, గ్రౌండ్ వాటర్ ఏడీ దివ్యజ్యోతి, డీటీడీఓ ఫిరంగి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు వెంకటేష్, జగన్, డీఆర్డీఓ చిన్న ఓబులేష్, మిషన్ భగీరథ డీఈ హేమలత, ఐటీడీఏ ఏఓ జాఫర్ ఉసేన్, ఆర్అండ్బీ డీఈ జలంధర్, తహసీల్దార్ శైలేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
18న నల్లమలకు సీఎం రాక
మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లమల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో సభాస్థలం ఇతరత్రా ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రూ.12,600 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిర సౌర గిరి జల వికాస పథకం ప్రాజెక్టును ఈ నెల 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే జిల్లా అధికారులు, ఐటీడీఏతో అనుసంధానంగా ఉన్న అధికారులు, సిబ్బందితోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఆదివాసీలతో సమావేశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో అనుకూల ప్రదేశం కోసం పదర మండలంలోని పెట్రాల్చేన్, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, మాచారం, వెంకటేశ్వర్లబావి గ్రామాల్లో పర్యటించా రు. ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ రోహిత్రెడ్డి, డీటీడీఓ ఫిరంగి, ఐటీడీఏ ఏఓ జాఫర్ ఉస్సేన్, మండల అధికారులు, చెంచులు పాల్గొన్నారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్ -
డిగ్రీ ఫలితాలు విడుదల
బిజినేపల్లి: మండలంలోని పాలెం అటానమస్ డిగ్రీ కళాశాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో సెమిస్టర్లో 43 శాతం ఉత్తీర్ణత సాధించారని, విద్యార్థులు తమ ఫలితాలను కళాశాల వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. మార్కుల పునఃమూల్యాంకనం కోసం ఈ నెల 17 వరకు తమ దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలన్నారు. ఫలితాలను పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రమేష్బాబు, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజ్కుమార్, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, అనురాధరెడ్డి విడుదల చేయగా.. కళాశాల అడిషనల్ కంట్రోలర్ శివ, సిబ్బంది శ్రీనివాస్, నాగరాజు, సుష్మ, వెంకటేష్, యాదగిరి, కవిత తదితరులు పాల్గొన్నారు.పాకిస్తాన్ వలసదారులను వెనక్కి పంపాలికందనూలు: జిల్లాలో అక్రమంగా నివశిస్తున్న పాకిస్తాన్ వలసదారులను వెనక్కి పంపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ దేవసహాయంకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనగర్ పర్యాటక స్థలం పహల్గాంలో పాకిస్తాన్ జిహాది ఉగ్రవాదులు అమాయక యాత్రికులను మతం గురించి అడిగి హిందువులను చంపారని, ఈ సంఘటన కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ జిల్లాలో పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా నివశిస్తున్నారని, జిల్లావ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి వారిని గుర్తించి వెంటనే వారి వారి దేశాలకు పంపించి ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ప్రమాదాన్ని నివారించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్రెడ్డి, యువ మోర్చ జిల్లా కార్యదర్శి నరేష్చారి, పట్టణ అధ్యక్షుడు ప్రమోద్కుమార్, నాయకులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
టీనేజ్ ప్రేమలు
ఆన్లైన్ వేదికలు.. సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు ● మైనర్ ఏజ్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న వైనం ● ఆన్లైన్, మొబైల్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలంటున్న చైల్డ్ సేఫ్టీ అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న ఘటనలు ‘నాగర్కర్నూల్ జిల్లాలోని మైనర్ బాలికకు ఓ యువకుడు ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా చాటింగ్ చేసిన తర్వాత తరచుగా కలుసుకునేవాళ్లు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు ఆ బాలిక మైనర్గా ఉండగానే వివాహం జరిపించారు. ఆన్లైన్ పరిచయాలు ప్రేమగా మారుతుండటం, మైనర్ ప్రేమల నేపథ్యంలో మైనర్ వివాహాలు చోటుచేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి.’ సాక్షి, నాగర్కర్నూల్: ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, స్నాప్ చాట్, వాట్సప్.. తదితర సామాజిక మాధ్యమాల్లో నిత్యం గంటల తరబడి గడపడం ప్రస్తుతం టీనేజర్లకు సాధారణంగా మారింది. ఇదే క్రమంలో ఆన్లైన్ వేదికల ద్వారా కొత్తగా పరిచయం అయిన వారి పట్ల ఆకర్షితులవుతున్నారు. వీరిలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. బాల్య దశలోనే ప్రేమ పేరుతో ఇల్లు విడిచి వెళ్లిపోవడం, మైనర్ ఏజ్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. చాలావరకు ఘటనలు సంబంధిత అధికారుల దృష్టికి సైతం రావడం లేదు. తీరా మైనర్గా ఉన్న బాలికలకు వివాహతంతు పూర్తయ్యాక అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. -
‘రక్తదానంతో ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి’
నాగర్కర్నూల్ క్రైం: ప్రతిఒక్కరూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలు నిలుస్తాయని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు అన్నారు. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జనరల్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్– పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ప్రస్తుత పరిస్థితులను అనుసరించి రక్త నిల్వలను అధిక మొత్తంలో సేకరించి ఉంచాలన్నారు. అవసరమైతే సైనికులకు పంపిస్తామని, జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిరోజు జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేసి వారికి తోడ్పాటు కావాలని కోరారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జనరల్ ఆస్పత్రిలో ప్రసవాలకు వచ్చిన గర్భిణులు, ఆర్థోపెడిక్, సాధారణ శస్త్రచికిత్స రోగులకు నిత్యం పాజిటివ్ గ్రూపులతోపాటు నెగెటివ్ గ్రూప్ నిల్వలు కూడా అందుబాటులో ఉంచి ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రక్తనిధి సేకరణ నర్సింగ్ సిబ్బందితో చేపడుతున్నట్లు జిల్లా నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిదేవి తెలిపారు. కార్యదర్శి ఆనంద్, జోన్ సెవన్ ప్రెసిడెంట్ మన్మోహన్రెడ్డి, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ హన్మంతరావు, ప్రశాంత్, అజీమ్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రోహిత్, అనిత, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
చట్టాలపై చెంచులకు అవగాహన
లింగాల: సమస్యల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని సంస్థ అధికారి నస్రీం సుల్తానా అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శుక్రవారం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అప్పాపూర్, మల్లాపూర్ పెంటలో లీగల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారి పలు చట్టాల గురించి చుంచులకు అవగాహన కల్పించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని ఆమె చెంచులకు సూచించారు. న్యాయపరమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో పలువురు చెంచులు తమ సమస్యలను అధికారులతో మొరపెట్టుకున్నారు. అప్పాపూర్ పెంట సమీపంలో నూతనంగా మంజూరైన చెక్డ్యాంను త్వరగా పూర్తి చేయించి తాగునీటి సమస్య నివారించాలని చెంచులు కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను వెంటనే పూర్తిచేయించాలని, ఆధార్, రేషన్ కార్డులు, పింఛన్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు పాండునాయక్, శైలేంద్రకుమార్, సీఐ రవీందర్, ఎస్ఐ వెంకటేశ్వర్గౌడ్, ఆర్ఐ అనిల్, జూనియర్ అసిస్టెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖ గుర్తింపుతో పింఛన్లు
అచ్చంపేట: వయసు పైబడిన చాలామందికి చేతి వేలిముద్రలు పడక పింఛన్ పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారికి పంచాయతీ కార్యదర్శులు అథెంటిఫికేషన్ ద్వారా అందిస్తున్నారు. కానీ, లబ్ధిదారులు వచ్చిన సమయంలో వారు అందుబాటులో లేకపోవడం, వారున్న సమయంలో లబ్ధిదారులు లేకపోవడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో.. సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేక ముఖ గుర్తింపు యాప్ను అమల్లోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు గత నెల 10న రాష్ట్ర సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పింఛన్ల డైరెక్టర్ గోపాల్రావు అన్ని జిల్లాల డీఆర్డీఓలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ, బోదకాలు, డయాలసిస్ చేయించుకునే వారు ఇలా 1,07,390 మంది పింఛన్లు పొందుతున్నారు. జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో 45,239 మందికి మాత్రమే నేరుగా ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. మిగతా 62,151 మందికి పంచాయతీల పరిధిలో తపాలా శాఖ కార్యాలయాల్లోనే వేలిముద్రల ద్వారా పంపిణీ చేస్తున్నారు. కొందరు వృద్ధులకు వేలి కొనలు ఆరిగిపోయి ముద్ర సరిగా పడటం లేదు. ఇలాంటి వారికి కార్యదర్శుల వేలిముద్ర ద్వారా పింఛన్లు అందిస్తున్నారు.ఇబ్బందులు ఇలా..పంచాయతీ కార్యదర్శులు ఇతర పనుల ఒత్తిడితో కార్యాలయానికి రాకపోతే వేచి చూడాల్సిన పరిస్థితి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అవి వచ్చే ప్రాంతాల్లో తపాలా సిబ్బంది వెళ్లి పంపిణీ చేయాల్సి వస్తోంది. కార్యదర్శులు రాకుంటే లబ్ధిదారులు అంత దూరం వెళ్లి తిరిగి వాపప్ రావాల్సిన దుస్థితి నెలకొంటుంది. దీంతో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పింఛను ఇస్తుండగా.. వీటిలోనూ చాలా చోట్ల చిల్లర సాకుతో రూ.16 కోత విధిస్తున్నారనేది బహిరంగ రహస్యమే.అక్రమాలకు అడ్డుకట్ట..జిల్లాలో 4,383 మందికి వేలిముద్రలు పడకపోవడం, మంచానికే పరిమితమైన కార్యదర్శులు అథెంటిఫికేషన్ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కార్యదర్శులు వేలిముద్రలు పడని వారివి ఒకేసారి అంథెటిఫికేషన్ చేసి వెళ్లిపోతున్నారు. తర్వాత తపాలా సిబ్బంది లబ్ధిదారులకు డబ్బులు అందిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులకు తెలియకుండా పింఛన్లు వాడుకుంటున్న ఘటనలు జరిగాయి. ఇదే కాకుండా పింఛన్దారులు మృతిచెందినా.. వారి పేరున నెలల తరబడి అలాగే డబ్బులు పొందుతున్నారు. ముఖ గుర్తింపు యాప్తో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చు.చర్యలు తీసుకుంటాం..ప్రభుత్వం పింఛన్దారులకు ముఖ గుర్తింపు యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. యాప్ అందుబాటులోకి వస్తే అమలు చేస్తాం. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వేలిముద్రలు పడని, మంచానికే పరిమితమైన 4,383 మంది పింఛన్దారులకు కార్యదర్శులు అథెంటిఫికేషన్ ద్వారా పింఛన్లు అందిస్తున్నారు.– ఓబేలేష్, డీఆర్డీఓ -
సందిగ్ధంలో డిగ్రీ విద్యార్థులు
పరీక్షలను బహిష్కరించిన ప్రైవేటు యాజమాన్యాలు కందనూలు: ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలు విడుదల కాకపోవడంతో ఏప్రిల్లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు ఇప్పటికీ నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ నెల 6 నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని నాగర్కర్నూల్ జిల్లాలో డిగ్రీ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కలిపి 17 ఉన్నాయి. ఇందులో 7 ప్రభుత్వ, 10 ప్రైవేట్ కళాశాలలు ఉండగా.. సుమారు 5 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ విద్యా సంవత్సరం డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే తమకు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు చెల్లించే వరకు పరీక్షలు నిర్వహించమని ప్రైవేట్ యాజమాన్యాలు భీష్మించుకొని ఉన్నాయి. ఫీజు బకాయిలకు.. విద్యార్థుల పరీక్షలకు ముడి పెట్టొద్దని యూనివర్శిటీ అధికారులు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు నచ్చజెప్పుతున్నా ససేమిరా అంటున్నారు. పీజీ, ఇతర ఉన్నత చదువుల ప్రవేశాలకు డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలే కీలకం. డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు త్వరగా రాస్తే వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉన్నత చదువులకు ఇబ్బందులు.. స్పష్టత లేదు.. మాకు డిగ్రీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది స్పష్టత లేదు. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు వాయిదా వేశారు. మేము పీజీ పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే మొదట డిగ్రీ పరీక్షలు పూర్తి కావాలి. దీంతో చాలా ఆందోళనలో ఉన్నాం. – మల్లేష్యాదవ్, బీఏ, సాధన డిగ్రీ కళాశాల ఎలా చదువుకోవాలి.. యూనివర్శిటీ అధికారులు ఇలా పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే మేం ఎలా చదువుకోవాలి. పాలమూరు యూనివర్శిటీ, ప్రభుత్వం మా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటికై నా సమస్యకు పరిష్కారం చూపి త్వరగా పరీక్షలు జరిపించాలి. – సాయికిరణ్, బీకాం, ఆర్ట్స్ డిగ్రీ కళాశాల, నాగర్కర్నూల్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన పీయూ పీజీ ప్రవేశ పరీక్షలపై ప్రభావం చూపుతుందని ఆందోళన ఖరారు కాని తేదీలు.. పాలమూరు విశ్వవిద్యాలయం గత నెల 23 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించగా.. 28 నుంచి థియరీ పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ప్రైవేటు యాజమాన్యాలు సహకరించకపోవడంతో వాయిదా వేశారు. మళ్లీ ఈ నెల 6 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించినా.. ఆ తర్వాత మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కాకపోవడంతో ప్రైవేటు కళాశాలలు గత కొన్ని నెలల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా ప్రైవేటు కళాశాలల పరీక్షలు నిర్వహించమని చెప్పడంతో వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సిద్ధం కావొచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. కానీ, ఇప్పటికీ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,123
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,123, కనిష్టంగా రూ.1,779గా ధరలు నమోదయ్యాయి. అలాగే హంస ధాన్యం గరిష్టంగా రూ.1,810, కనిష్టంగా రూ.1,509, ఆముదాలు సరాసరిగా రూ.5,858 ఒకే ధర లభించింది. మార్కెట్కు దాదాపు వెయ్యి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.12న ఐటీఐ అప్రెంటీస్ మేళా కందనూలు: కల్వకుర్తిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 12 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఎస్పీ లక్ష్మణస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు వివిధ పరిశ్రమల్లో ఉపాధి, శిక్షణ పొందుటకు అర్హులని.. జిల్లాలో ఆసక్తి కలిగిన వారు apprenticeshi pindia.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 94921 82944, 78931 22605 సంప్రదించాలని సూచించారు.వేసవి శిబిరాలు వినియోగించుకోవాలితెలకపల్లి: వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేష్కుమార్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న వేసవి శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలోని 29 ఉన్నత పాఠశాలల్లో వేసవి శిబిరాలు కొనసాగుతున్నాయని చెప్పారు. స్పీడ్ మ్యాస్, మ్యూజిక్, మెడిటేషన్, పెయింటింగ్ శిబిరంలో నేర్చుకోవాలని.. నేర్చుకున్న వివిధ అంశాలు జీవితంలో ఎదగడానికి దోహదపడతాయని వివరించారు. అనంతరం శిబిరంలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం పరిశీలించారు. ఆయన వెంట శిక్షకుడు అనంద్ తదితరులు ఉన్నారు.బీజేపీ సంబరాలుకందనూలు: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు జిల్లా కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు భారీ ఊరేగింపు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడే ప్రధాని మోదీ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి దిలీపాచారి మాట్లాడుతూ.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భంగా భారత ప్రభుత్వం బుధవారం ఆపరేషన్ సిందూర్ ప్రకటించి పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టిబెట్టిందని చెప్పారు. యావత్ భారతదేశం ఏకమై కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవడం ఆనందించదగ్గ విషయమని, అవసరమైతే పాకిస్తాన్తో యుద్ధం చేయడానికై నా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, సీనియర్ నాయకులు ఆచారి, పేరాల శేఖర్జీ, భరత్ప్రసాద్, దుర్గాప్రసాద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రమోద్కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.13న పాలీసెట్మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈ నెల 13న పాలీసెట్ నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 3,381 మంది విద్యార్థులు హాజరవుతారని, వీరి కోసం మొత్తం 5 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
పెంట్లవెల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. గురువారం మండల కేంద్రంతో పాటు కొండూరులో జరిగిన సదస్సుల్లో ఆయన పాల్గొని రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరణిలోని లోపాలను సవరించి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి రూపొందించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించాలని ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ విజయసింహకు సూచించారు. అలాగే మండలంలోని ఎంగంపల్లితండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ విజయసింహ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రం తనిఖీ.. మండలంలోని జటప్రోలు, గోపులాపూర్లో ఉన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్, ఆర్డీఓ బన్సీలాల్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఉండకూడదని, రైతులకు కచ్చితంగా రసీదు ఇవ్వాలన్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ బదావత్ సంతోష్ -
లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
నాగర్కర్నూల్ క్రైం: జాతీయ లోక్అదాలత్లో కక్షిదారులు ప్రశాంత వాతావరణంలో కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా కోర్టు న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశ మందిరంలో బ్యాంకులు, విద్యుత్శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 14న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకుంటే సమయం, ఖర్చులు ఆదా అవుతాయని, ఇరువర్గాలు సుఖసంతోషాలతో జీవించవచ్చని, రాజీమార్గమే రాజమార్గమన్నారు. జిల్లాలో విద్యుత్శాఖకు సంబంధించిన కేసులన్నీ కూడా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. క్రిమినల్, చిన్న చిన్న తగాదాలు, డ్రంకెన్ డ్రైవ్, భూ వివాదానికి సంబంధించిన సివిల్ కేసులను కూడా రాజీ చేసుకోవచ్చని సూచించారు. సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి ఇవ్వబడుతుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీమా సుల్తానా పాల్గొన్నారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి రమాకాంత్ -
పత్రికా స్వేచ్ఛను కాలరాస్తే సహించేది లేదు
నాగర్కర్నూల్: పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లే చర్యలకు పాల్పడితే జర్నలిస్ట్ కుటుంబం సహించదని సీనియర్ జర్నలిస్టులు హెచ్చరించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడిని నిరసిస్తూ గురువారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో విలేకర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్, పరిపూర్ణం, అహ్మదుల్లాఖాన్, శేఖరాచారి, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ వెంకటేశ్, సీపీఎం నాయకుడు పొదిల రామయ్య మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై కక్షసాధింపుగా పోలీసులతో దాడి చేయించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను మానుకోవాలని, రాజకీయ కక్షలకు పత్రికలను భాగస్వాములను చేయడం తగదన్నారు. మరోమారు ఇలాంటి ఘటనలకు పాల్పడితే జర్నలిస్టు సంఘాలుగా ఉద్యమాలకు తెరతీస్తామని.. పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కోరారు. అదేవిధంగా పాత్రికేయుల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రాంలక్ష్మణ్, బాలస్వామి, రాజేష్గౌడ్, దర్వేశ్, కొండకింది మాధవరెడ్డి, ఏటిగడ్డ వెంకటేష్, మల్లేష్, శ్రీనివాస్గౌడ్, సత్యం, ప్రసాద్, వినయ్గౌడ్, శ్రీశైలం, సైదులు, పరమేష్, శ్యామ్, దస్తగిరి, విజయ్, సాదీఖ్, సునిగిరి సురేష్, మహమూద్, ప్రదీప్, సయ్యద్ రబ్బాని, మహ్మద్ రహీం, వెంకటేష్, టీవీ 5 సత్యం, రియాజ్, మహ్మద్ సమీర్, విఠల్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక భారం
నాగర్కర్నూల్అన్నదాతలపైశుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025వివరాలు 10లో uరెన్యువల్కు రాశాం.. కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు రూ.86 లక్షలు మంజూరయ్యాయి. ఆర్థిక సంవత్సరం చివరలో నిధులు రావడంతో సమయానికి లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. దీంతో ప్రస్తుత 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు కేంద్రానికి రెన్యువల్ కోసం లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని పునరుద్ధరించి నిధులు ఇస్తామని ప్రకటించింది. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్కర్నూల్ రాయితీపై ట్రాక్టర్లు ఇవ్వాలి.. గతంలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం రాయితీపై ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు ఇస్తే అన్నదాతలకు ఎంతో ఊరట కలుగుతోంది. పంటల సాగుకు ఖర్చు తగ్గుతుంది. – కదిరే కృష్ణయ్య, రైతు, ఉప్పునుంతల దున్నడానికే రూ.11 వేలు.. ఏటా సాగు ఖర్చు పెరుగుతోంది. ట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఎద్దులతో వ్యవసాయం చేద్దామంటే వాటిని మేపేందుకు మేతలేదు. ఎకరా పంట సాగుకు రూ.25 వేల పెట్టుబడి అయితే అందులో రూ.11 వేలు దున్నడానికే పోతోంది. – సబావత్ పుల్యానాయక్, రైతు, గుట్టమీది తండా వ్యవసాయ యంత్రాలకు చేయూత కరువు అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాల ఉప ప్రణాళిక పథకం కింద రైతులకు వ్యవసాయ పరికరాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాకు వివిధ రకాల పరికరాలను అందించేందుకు గాను నిధులు మంజూరు చేస్తుంది. మార్చి 21న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. 2024– 25 ఆర్థిక సంవత్సరం ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాకు 1,341 యూనిట్లకు గాను రూ.3,30,53,000 నిధులు మంజూరయ్యాయి. మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతంపై వీటి ఇవ్వాలని సూచించారు. తక్కువ సమయం ఉండటంతో ప్రచారం కల్పించలేకపోయారు. దీనిపై ఇప్పటికే వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరణలో జాప్యంతో లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైంది. ఈలోగా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మంజూరైన నిధులను వినియోగించలేకపోయారు. దీంతో 2025– 26 కొత్త ఆర్థిక సంవత్సరంలో వీటిని అమలు చేస్తారా.. లేదా.. అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సం కింద నిధులు, దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక పంపించారు. ఏడేళ్ల తర్వాత.. వ్వవసాయానికి సంబంధించి ఐదేళ్లుగా వాతావరణం అనుకూలిస్తున్నా.. అన్నదాతలకు ప్రభుత్వం సాయం కరువైంది. ఏడేళ్లుగా యంత్ర సాయం లేకపోవడంతో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయి. 2017 వరకు ఏటా వానాకాలంలో రాయితీ పరికరాలను అందించగా తర్వాత నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని, రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఖర్చులు, సమయం ఆదా.. కూలీ ఖర్చులతోపాటు సమయాన్ని ఆదా చేసుకోవాలని రైతులు ఎక్కువగా యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఏటా యంత్రాల కోసం దరఖాస్తు చేయడం.. ఎదురుచూడటం పరిపాటిగా మారింది. ప్రతి సంవత్సరం మార్చి నెల గడువు కాగా.. కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల వారీగా ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను మండలాలకు కేటాయించడం తదుపరి మీసేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం.. అనంతరం జిల్లా కమిటీ ద్వారా ఆమోదం తెలిపి, కలెక్టర్ అనుమతితో రైతులకు అందజేయాలి. కాగా.. జిల్లాకు 2014– 15లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో మంజూరు చేయగా.. 2016 నుంచి మాత్రం కేటాయింపులు ఒక రకంగా మంజూరు మరో రకంగా ఉంటోంది. మూడు నెలలకోసారి నాలుగు విడతల్లో నిధులిచ్చే ప్రక్రియ ఊసేలేదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన నిధులు, యూనిట్లు ఇలా.. జిల్లా నిధులు యూనిట్లు (రూ.లక్షల్లో) నాగర్కర్నూల్ 86.31 365 నారాయణపేట 73.85 310 మహబూబ్నగర్ 71.02 252 జోగుళాంబ గద్వాల 56.88 236 వనపర్తి 42.47 178 న్యూస్రీల్అందించే పరికరాలు ఇవే.. మహిళా రైతులకు 50, ఇతరులకు 40 శాతం రాయితీ పరికరాలు ఆర్థిక సంవత్సరం ముగియడంతో లబ్ధిదారుల ఎంపికకు బ్రేక్ 2018 నుంచి నిధులు కేటాయించని వైనం వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కువగా ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. చేతి పంపులు, తైవాన్ పంపులు, డ్రోన్లు, రొటోవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికోసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, ట్రాక్టర్లు, మొక్కజొన్న పట్టే యంత్రాలు, పత్తిని మూటకట్టే పరికరాలు ఇవ్వనున్నారు. కేజీ వీల్స్, తైవాన్ పంపులు, రొటోవేటర్లు, చేతిపంపులు ఎక్కువగా మంజూరయ్యాయి. ఎంపిక చేసిన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. 2016లో తొలి విడత.. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తొమ్మిదేళ్లుగా అటకెక్కింది. 2016లో తొలి విడత నిధులు కేటాయించగా.. తదుపరి కార్యాచరణ కరువైంది. ఈ పథకానికి రూ.5 కోట్లు కేటాయించి, రైతులకు పరికరాలు, అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇచ్చేవారు. ఏళ్లుగా ఆ ఊసే లేకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
రక్తదానం.. ప్రాణదానం
నాగర్కర్నూల్ క్రైం: ఒక్కరి రక్తదానంతో ఎన్నో ప్రాణాలు నిలుస్తాయని రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డా. సుధాకర్లాల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రెడ్క్రాస్ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని.. అత్యవసర సమయంలో క్షతగాత్రులు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అందించాలని సూచించారు. వేసవిలో రక్తం కొరత ఉంటుందని జిల్లాలోని యువత, స్వచ్ఛంద సంస్థలు రక్తదానం చేసేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు.రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి రమేష్రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీధర్, ట్రెజరర్ రాధాకృష్ణ, కుమార్ పాల్గొన్నారు. -
తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉందాం
నాగర్కర్నూల్ క్రైం: తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉండటంతో పాటు చికిత్స అందించేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. వెంకటదాసు కోరారు. గురువారం జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తలసేమియా అవగాహన ర్యాలీ నిర్వహించగా.. ఆయన పాల్గొని ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. తలసేమియా వ్యాధి జన్యుపరమైన లోపంతో తల్లిదండ్రుల నుంచి సంతానానికి సంక్రమిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి గల చిన్నారులు అలసిపోవడం, పెరుగుదల లోపించడం, తరచుగా అంటువ్యాధులకు గురికావడం, హిమోగ్లోబిన్ రెండు నుంచి మూడు గ్రాములు మాత్రమే ఉంటుందని వివరించారు. వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల రక్తం ఎక్కించడంతో పాటు రక్త పరీక్షలు చేయాలన్నారు. ఈ వ్యాధి గల చిన్నారులకు రక్త సంబంధీకుల ద్వారా ఎముక మజ్జ మార్పిడి చేయాల్సి ఉంటుందని.. ఇందుకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. మేనరిక వివాహం, వివాహానికి ముందు తలసేమియా నిర్ధారణ పరీక్షలు చేసుకోవడంతో వ్యాధిని నివారించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సికిల్సెల్ నోడల్ అధికారి డా. ప్రదీప్, పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. వాణి, ఎంఎల్హెచ్పీ నీరజ్, ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
పిల్లలమర్రిలో పకడ్బందీ ఏర్పాట్లు
పాలమూరు: ప్రపంచ సుందరీమణి పోటీల్లో పాల్గొనేవారు ఈ నెల 16న పిల్లలమర్రి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వస్తున్న క్రమంలో ఎక్కడా కూడా సమస్య లేకుండా భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాకేంద్రంలోని పిల్లలమర్రిలో గురువారం జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మహావృక్షం, పురావస్తు మ్యూజియం, శ్రీరాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానం సందర్శిస్తారన్నారు. పర్యాటక ప్రాంతం దగ్గర స్వాగత ఏర్పాట్లు, సౌండ్, విద్యుత్ దీపాలు, పటిష్ట భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఆర్డీఓ నవీన్, ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ సత్యనారాయణ, డీఆర్డీఓ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, డీఈఓ ప్రవీణ్కుమార్, పురావస్తు శాఖ ఏడీ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమం
నాగర్కర్నూల్ క్రైం: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి నసీం సుల్తానా అన్నారు. వచ్చే నెల 14న నిర్వహించే జాతీయ లోక్అదాలత్పై బుధవారం జిల్లా కోర్టులో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. రాజీ అయ్యే క్రిమినల్ కేసులు, పెట్టి కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఎకై ్సజ్ కేసులను జాతీయ లోక్అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీ మార్గం ద్వారా ఇరువర్గాలకు సమయం వృథా కాకపోవడంతో పాటు ఖర్చులు తగ్గుతాయన్నారు. అదే విధంగా ఇరువర్గాలకు న్యాయం చేకూరుతుందన్నారు. వచ్చే నెల 14న నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. జాతీయ లోక్అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కృషిచేయాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి కావ్య, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి శ్రీనిధి పాల్గొన్నారు. -
జైలులో సత్ప్రవర్తనతో ఉండాలి
పాలమూరు: పలు రకాల కేసుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పూర్తిగా సత్ప్రవర్తనతో మెలగాల్సిన అవసరం ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రధాన జైలును బుధవారం న్యాయమూర్తి సందర్శించారు. మొదటగా ఖైదీలకు తయారు చేసే ఆహారం, వంట గది, ఖైదీలు ఉండే బ్యారక్లను పరిశీలించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న వసతులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ జైలు జీవితం తర్వాత ఎలాంటి తప్పులు చేయకుండా కుటుంబం కోసం ఉత్తమ జీవనం సాగించాలన్నారు. -
పిల్లలమర్రిలో ఏర్పాట్లు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా ఈనెల 16న జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని విదేశీ పర్యాటకుల బృందం సందర్శించనుంది. దీంతో ఈనెల 2 నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ప్రాంతం మొత్తం ఎక్కడా చెత్తాచెదారం లేకుండా సుమారు 25 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అలాగే 500 చదరపు గజాల విస్తీర్ణంలో లాన్ (కార్పెట్ గ్రాస్) ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాకర వాతావరణం ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. మరోవైపు మెట్టుగడ్డ (ఎన్హెచ్–167) నుంచి మొదలుకొని పిల్లలమర్రి వరకు గల విశాలమైన రోడ్డుకు ఇరువైపులా మొక్కలను పెంచుతున్నారు. వీటి మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను సైతం తొలగిస్తున్నారు. 16న పాలమూరుకు రానున్న మిస్వరల్డ్ పోటీదారులు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులు -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
కల్వకుర్తి రూరల్/చారకొండ: జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించి.. నిజమైన అర్హులను ఇళ్లకు ఎంపిక చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న రఘుపతిపేట గ్రామాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులు నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు. కాగా, గ్రామంలో 130 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 70 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. మిగతా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. కలెక్టర్ స్వయంగా లబ్ధిదారులను కలిసి సమస్యను తెలుసుకున్నారు. లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు ప్రారంభించే విధంగా అవగాహన కల్పించాలని ఆర్డీఓ శ్రీనునాయక్కు సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా సిమెంటు, ఇతర సామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు లింగసానిపల్లిలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ ఏఈకి కలెక్టర్ సూచించారు. అనంతరం రఘుపతిపేటతో పాటు చారకొండ, జూపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తూకం వేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యాన్ని దించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, చారకొండ మండలం తిమ్మాయిపల్లి వద్ద ప్రధాన రహదారిపై ఆరబెట్టిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. జూపల్లిలో రైతువేదిక వద్ద ధాన్యం కొనుగోలుకు స్థలం అనువుగా లేకపోవడంతో ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోసినట్లు రైతులు వివరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ వెంకట్రాములు, ఆర్ఐ భరత్ తదితరులు ఉన్నారు. పారదర్శకంగా సర్వే నిర్వహించాలి కలెక్టర్ బదావత్ సంతోష్ -
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
నాగర్కర్నూల్ రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సీపీఎం నాయకులు సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగులు అందుబాటులో లేవని చెబుతూ సకాలంలో రైతుల నుంచి ధాన్యం సేకరించడం లేదన్నారు. అదే విధంగా క్వింటాల్కు 3 నుంచి 4కిలోల ధాన్యం అదనంగా తూకం వేస్తూ రైతులను దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులందరూ ధాన్యం తీసుకువచ్చి మార్కెట్లో పోస్తే కొనుగోలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు పర్యవేక్షించి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందికొండ గీత, నాయకులు రామయ్య అశోక్, మధు, సుభాష్, శివరాం పాల్గొన్నారు. -
TGSRTC Bus: సీట్ల కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు
మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పుణ్యమా.. నిత్యం ఎక్కడో ఒక చోట గొడవకు దారితీస్తోంది. నారాయణపేట నుంచి మక్తల్ మధ్య తిరిగే షటిల్ బస్సులో ఇద్దరు మహిళలు సీట్ల కోసం చెప్పులతో కొట్టుకున్న సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నారాయణపేట (Narayanpet) బస్టాండులో బస్సు ఎక్కిన మహిళలు సీట్ల కోసం మాటలు, చీవాట్లతో ఘర్షణ మొదలైంది. చివరికి అది చెప్పులతో కొట్టుకుని దుస్తులు చింపుకొనే వరకు వచ్చింది. ఈ గొడవ మక్తల్ (Makthal) బస్టాండ్కు వచ్చే వరకు గంటసేపు కొనసాగింది. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన కండక్టర్పై కూడా బూతు పురాణం అందుకోవడంతో వెనక్కు తగ్గారు. తోటి ప్రయాణికులు కూడా వారిని నిలువరించలేక.. చూస్తూ ఉండిపోయారు.చదవండి: కన్నీటి నిశ్చితార్థం.. తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు దుర్మరణం -
మామిడి రైతు కుదేలు
అకాల వర్షాలు, ఈదురు గాలులతో తీవ్రనష్టం ●300 టన్నులకు పైగా.. నాగర్కర్నూల్ జిల్లాలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఏప్రిల్ నెలాఖరులో 300 టన్నులకు పైగా మామిడి కాయలు నేల రాలాయి. వీటిని విక్రయించేందుకు హైదరాబాద్ మార్కెట్కు తీసుకువచ్చారు. మార్కెట్లో రాలిన కాయలను తక్కువ ధరలకు రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా రోజూ రాలిన కాయలు మార్కెట్కు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. దీనికి తోడు గాలివానల వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సలీం, మామిడి ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్, కొల్లాపూర్ నష్టంపై నివేదికలిచ్చాం.. అకాల వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా మామిడి తోటల్లో పెద్దమొత్తంలో కాయలు రాలాయి. నియోజకవర్గాల వారీగా పంటనష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో చెట్లు విరిగిపడిన సంఘటనలు లేవు. కానీ, కాయలు చాలా రాలాయి. రాలిన కాయలను మార్కెట్లో ధరలు ఉండవు. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు తెలియజేశాం. – లక్ష్మణ్, ఉద్యానవన శాఖ అధికారి, కొల్లాపూర్ కొల్లాపూర్ శివారులో ఈదురుగాలులకు నేలరాలిన మామిడి కాయలు కొల్లాపూర్: వాతావరణ ప్రభావంతో అంతంత మేరకే దిగుబడులు.. చేతికొచ్చిన దాన్ని అమ్ముకునే సమయానికి అకాల వర్షాలు, భారీ ఈదురుగాలులు మామిడి రైతులను కుదేలు చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు లాభాలు రాకపోగా.. కష్టాలు.. నష్టాలు చుట్టుముట్టి రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. నామమాత్రపు దిగుబడులు ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం మామిడి దిగుబడులు నామమాత్రంగానే ఉన్నాయి. మొదట్లో పూతలు బాగా పూసినప్పటికీ వాతావరణంలో మార్పులు, చీడపీడల కారణంగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాలేదు. సాధారణ దిగుబడి కంటే సగం మేరకు తక్కువగా దిగుబడులు వచ్చాయి. పండిన ఆ కాస్త పంటను అమ్ముకునే సమయంలో మామిడి రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. ఏప్రిల్ నెల మూడో వారం నుంచి తరచూ వీస్తున్న భారీ ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా మామిడి తోటలు దెబ్బతిని.. కాయలు పెద్దమొత్తంలో రాలిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు సైతం నెలకొరిగాయి. సరైన ధరలు లేక.. మామిడి దిగుబడుల సంగతి పక్కన పెడితే.. ధరలు ఈ ఏడాది కూడా పెరగలేదు. ఇందుకు వ్యాపారుల సిండికేటే ప్రధాన కారణం. ఫిబ్రవరి నెలలో టన్ను రూ.లక్షకు పైగా పలికిన మామిడి ధర.. మార్చి మొదటి వారంలో పూర్తిగా తగ్గిపోయాయి. టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే పలుకుతోంది. గాలివానల కారణంగా రాలిన మామిడి కాయలను హైదరాబాద్ మార్కెట్లో టన్నుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపు కొనుగోలు చేస్తున్నారు. అంటే రైతులు పండించిన పంటకు రవాణా, కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి. నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా బీభత్సం సృష్టించిన గాలులు కల్వకుర్తి, బిజినేపల్లి ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లు వాతావరణం అనుకూలించకపంట దిగుబడిపై ప్రభావం ఆర్థికంగా చితికిన రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -
కొలిక్కిరాని ఇందిరమ్మ ఇళ్ల జాబితా
పారదర్శకంగా ఎంపిక.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పారదర్శకత పాటిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఇల్లిల్లూ తిరిగి సర్వే చేపడుతున్నాం. ప్రస్తుతం ఎల్–1 జాబితాలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎల్–2లో పొరపాట్లను సరిదిద్దుతున్నాం. ఈ రెండు జాబితాలను పరిగణలోకి తీసుకొని సర్వే చేపడుతున్నాం. – సంగప్ప, పీడీ, గృహనిర్మాణశాఖ, నాగర్కర్నూలు అచ్చంపేట: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు దరఖాస్తుదారులకు గగనంగా మారుతోంది. దరఖాస్తులు అధికంగా.. మంజూరు తక్కువగా ఉండటంతో మొదటి విడత అదృష్టం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. లబ్ధిదారుల ఎంపికను పర్యవేక్షించే ఇందిరమ్మ కమిటీలు, అధికారులకు ఇది ఒక సాహసంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మార్పుచేర్పులతో అయోమయం నెలకొంది. పట్టణాల్లో పథకం అమలుపై స్పష్టత కరువైంది. పురపాలికల్లో ప్రజాపాలనలో అందిన దరఖాస్తులను వివిధ దశల్లో వడపోశారు. స్థలం ఉండి ఇల్లు లేని వారిని ఎల్–1, ఇంటి స్థలం లేని దరఖాస్తుదారులను ఎల్–2, ఇతరులను ఎల్–3 కేటగిరీగా నిర్ధారించారు. జిల్లాలోని పురపాలికల్లోతొలి దశ సర్వే అనంతరం ప్రత్యేక బృందాలతో మరోసారి వడపోసి తుది జాబితాను రూపొందించారు. ఇవన్నీ కాదని ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాల పేరిట ప్రధానమంత్రి ఆవాస యోజనలో భాగంగా 673 మంది లబ్ధిదారుల వివరాలతో జాబితాను పంపించి సర్వే చేపట్టారు. తాజాగా.. ఆ జా బితా కూడా కాదని మరోటి వస్తుందని, దానిని అనుసరించి సర్వే చేయాలని ఆదేశాలు అందాయి. ఇప్పటికే నాలుగు పర్యాయాలు వార్డుల్లో సర్వే జరిగింది. మరో కొత్త జాబితా ప్రకారం సర్వే చేయడానికి ప్రజల వద్దకు వెళ్లేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. ఇదీ కథ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందజేయనుంది. పురపాలికల్లో ఈ పథకానికి పీఓంఏవైని అనుసంధానించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవైని అమలు చేస్తే ఒక్కో ఇంటికి రూ.75 వేలు, పట్టణాల్లో రూ.1.50 లక్షలు కేంద్రం వాటాగా అందుతుంది. పీఎంఏవై నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని.. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయొద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వేచేసి లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయడంతో పాటు పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేస్తున్నారు. కఠిన నిబంధనలు.. జిల్లాలోని పురపాలికలకు గృహనిర్మాణశాఖ ద్వారా అందిన ఎల్–1 కేటగిరీ లబ్ధిదారుల పేర్లను వార్డుల వారీగా విభజించారు. సుమారు 60 మంది వివరాలు వెబ్సైట్లో లేవని గుర్తించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారి పేర్లు జాబితాలో ఉన్నట్లు తెలిసింది. లబ్ధిదారులు ఆధార్తో పాటు వారి తల్లిదండ్రుల ఆధార్ వివరాలు సమర్పించాలనే నిబంధన ఉంది. దరఖాస్తుదారుల్లో 50 నుంచి 60 ఏళ్ల వయసున్న వారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల ఆధార్ వివరాలు లేకపోవడంతో అప్లోడ్ చేయలేకపోయారు. దీంతోపాటు ఆదాయ ధ్రువీకరణ, పాన్కార్డు, స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అప్లోడ్ చేయాలనే నిబంధనలు ఆటంకంగా మారాయి. 15 రోజుల అనంతరం కొన్నింటికి ఎడిట్ ఆప్షన్లు వచ్చాయి. అయినా కొన్ని దరఖాస్తులనే పీఎంఏవై వెబ్సైట్లో చేర్చారు. 500 మంది జాబితాలో వార్డుకు ఎందరిని ఎంపిక చేయాలనే సూచన లేదు. నాయకుల ఒత్తిడి, వార్డుల్లో ప్రజల ప్రతిఘటనతో సర్వే నత్తనడకన సాగుతోంది. ఇదిలా ఉండగా.. రెండు, మూడు రోజుల్లో వచ్చే జాబితాను అనుసరించి సర్వే చేయాలని, గతంలో చేసిన సర్వేలు, జాబితాలతో సంబంధం లేదని అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి ముందకెళ్తామని పుర కమిషనర్లు చెబుతున్నారు. సర్వేలతో ఎల్–1, 2, 3 కేటగిరీలుగా విభజన తుది జాబితా రూపకల్పనకు అధికారుల అవస్థలు -
వేసవి శిబిరాలతో విజ్ఞానం.. వినోదం
కల్వకుర్తి టౌన్: విద్యార్థులు వేసవి సెలవుల్లో విజ్ఞానంతోపాటు వినోదాన్ని పొందేలా ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశామని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని కేజీబీవీలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వన చేసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్క విద్యార్థి వేసవి శిబిరంలో పాల్గొని అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను జీవితంలో ఎదగడానికి విద్యార్థినిలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. 15 రోజులపాటు ఈ క్యాంపు ఉంటుందని, జిల్లాలోని 20 కేజీబీవీల నుంచి విద్యార్థినులు క్యాంపునకు హాజరయ్యేలా చొరవ చూపిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు డీఈఓ కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపులో భాగంగా విద్యార్థినులకు స్పోకెన్ ఇంగ్లిష్, స్పీడ్ మ్యాథ్స్, డ్యాన్స్, మ్యూజిక్, యోగా, మెడిటేషన్, కంప్యూటర్, కోడింగ్, పెయింటింగ్ తదితరవి నేర్పిస్తారన్నారు. కార్యక్రమంలో జీడీసీఓ శోభారాణి, ఎంఈఓ శంకర్నాయక్, కల్వకుర్తి కేజీబీవీ ప్రత్యేకాధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
నాగర్కర్నూల్: ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎంపీ మల్లురవి అన్నారు. డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎంపీతోపాటు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన నాయకులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని, ఇందుకోసం త్వరలోనే నూతన కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్కు కార్యకర్తలే బలమని, అధికారంలోకి వచ్చేందుకు సైనికుల్లా పనిచేశారని, స్థానిక ఎన్నికల్లో సైతం ఇదే విధంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత నాగర్కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది అంటే అది మీ వల్లేనన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎన్ని ఇబ్బందులూ పెట్టిన, ఎన్ని కేసులు పెట్టినా మీరు మొక్కవోని విశ్వాసంతో పార్టీ గెలుపునకు కృషిచేశారన్నారు. అలాంటి కార్యకర్తల సంక్షేమం, బాగోగుల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రణాళిక సిద్ధం
నాగర్కర్నూల్వానాకాలం..జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు అంచనా మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025వివరాలు 8లో u●అందుబాటులో ఉంచుతాం.. వానాకాలం సాగుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక రూపొందించాం. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఎరువులకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవే కాకుండా సీజన్ ప్రారంభం వరకు నెలవారి కోటా తెప్పించి అందుబాటులో ఉంచుతాం. జిల్లాలో ఈసారి 5,38,462 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశాం. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి పెండింగ్ ఫిర్యాదులు పరిష్కరించాలి నాగర్కర్నూల్: వివిధ సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు, అమరేందర్, దేవసహాయంతో కలిసి కలెక్టర్ 50 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులు వెంటనే పరిష్కార మార్గాలు చూపాలన్నారు. వివిధ శాఖలకు చెందిన సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు వారికి పంపించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఫోర్జరీ సంతకాలతో ఆస్తి కాజేశారు ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ వీలునామా పత్రాలు సృష్టించి తనకు రావాల్సిన ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడంటూ హైదరాబాద్కు చెందిన అంకాల అనితరాణి ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తిమ్మాజిపేట మండలం మారేపల్లికి చెందిన తన సొంత అన్న సుధీర్రెడ్డి ఫోర్జరీ సంతకాలతో దొంగ వీలునామా పత్రాలు సృష్టించి తనకు రావాల్సిన ఆస్తిని రాకుండా చేశారని, దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై నాగర్కర్నూల్ ఆర్డీఓకు సైతం ఫిర్యాదు చేశానని ఆమె వివరించారు. పోలీస్ గ్రీవెన్స్కు 14 అర్జీలు నాగర్కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 14 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో తగు న్యాయం కోసం 8, భూమి పంచాయతీలు 4, భార్యాభర్తల గొడవలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చాయన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కోడేరు: మోడల్ కళాశాలలో ప్రవేశాల కోసం మండలంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాఘవేంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో 40 చొప్పున సీట్లు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ● ఈ ఏడాది వానాకాలంలో అత్యధికంగా వరి, పత్తి సాగు ● అందుబాటులో 25 శాతం విత్తనాలు, ఎరువులు ● మిగతావి సీజన్ నాటికి తెప్పించేలా కసరత్తు ● దుక్కులు దున్నడంలో నిమగ్నమైన అన్నదాతలు విత్తనాల సైతం.. ఇక విత్తనాలు సైతం రైతులకు ఎంత అవసరమనే విషయంలో ముందుగానే అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. పత్తి 2,865 క్వింటాళ్లు, వరి 35,020 క్వింటాళ్లు, కందులు 112 క్వింటాళ్లు, మొక్కజొన్న 40 వేల క్వింటాళ్లు, జొన్నలు 313 క్వింటాళ్లు, మినుములు 26 క్వింటాళ్లు, వేరుశనగ 850 క్వింటాళ్లు, ఆముదం 10 క్వింటాళ్లు ఇతర పంటలకు సంబంధించి 275 క్వింటాళ్లు కలిపి మొత్తం 50,173 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లపై అధికారులు సిద్ధమవుతున్నారు. నాగర్కర్నూల్: జిల్లాలో యాసంగి పంట ముగుస్తున్న క్రమంలో రైతులు వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నారు. యాసంగి చివరలో జిల్లాకు కేఎల్ఐ నీరు నిలిచిపోవడంతో పంటలు ఎండిపోయి చాలామంది రైతులకు నష్టం వాటిల్లింది. అయితే పెట్టిన పెట్టుబడులు మాత్రమే ఆశించిన రైతులు ఈ వానాకాలంలో మంచి దిగుబడి సాధించాలనే ఆలోచనతో ఉన్నారు. దీనికి అనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులు కూడా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ఏడాది వానాకాలంలో దాదాపు 5,38,462 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తారని భావిస్తున్నారు. అయితే గత సీజన్ వానాకాలంతో పోలిస్తే ఈసారి 1,02,770 ఎకరాల్లో అదనంగా సాగు చేస్తారని అంచనా వేశారు. అలాగే పండ్ల తోటలు, ఇతర పంటలు మరో 52,603 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈసారి వర్షాలు సైతం ముందుగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు వేసవి దుక్కులు మొదలుపెట్టారు. సీజన్ ప్రారంభం వరకు.. రైతులు సాగు చేసే పంటలకు అనుగుణంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు, విత్తనాలు అవసరమవుతాయో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాకు సంబంధించి వివిధ రకాల ఎరువులు 99,150 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో యూరియా 40 వేల మె.ట., అవసరం ఉండగా ప్రస్తుతం 6,224 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. అలాగే డీఏపీ 13 వేల మె.ట., గాను 866 మె.ట., ఎస్ఎస్పీ 1,800 మె.ట., గాను 578 మె.ట., ఎంఓపీ 4,350 మె.ట., గాను 487 మె.ట., కాంప్లెక్స్ ఎరువులు 40 వేల మె.ట., గాను 3,094 మె.ట., అందుబాటులో ఉన్నాయి. అయితే సీజన్ ప్రారంభం వరకు నెలవారి కోటా వస్తుందని, ఆ మేరకు రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. న్యూస్రీల్ -
అనర్హులకు ఇళ్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు
నాగర్కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి నాగర్కర్నూల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తాడూరు, తెలకపల్లి, నాగర్కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాలు, నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అర్హుల జాబితాపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్తో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు.. ఎన్ని దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.. మార్కింగ్ అయినవి ఎన్ని.. నిర్మాణ పనులు ప్రారంభించినవి ఎన్ని అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు సొంతింటిని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయొద్దని, అర్హులకు మాత్రమే కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఏ రోజుకారోజు సర్వే చేసిన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని, పెండింగ్లో ఉన్న వాటి పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో నాగర్కర్నూల్ ఆర్డీఓ సురేష్, గృహ నిర్మాణాధికారి సంగప్ప, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
పంటల మార్పిడితోనే అధిక దిగుబడులు
తెలకపల్లి: రైతులు ప్రతి సంవత్సరం పంటలు మార్పిడి చేస్తేనే అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా తెలకపల్లిలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని రసాయన ఎరువులు తగ్గించి నేలతల్లి అరోగ్యాన్ని కాపాడాలని, అవసరం మేరకు యూరియా వాడాలని సూచించారు. ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం సబ్సిడీపై విత్తనాలు, యంత్రాలు సరఫరా చేస్తుందని వాటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. పాలెం వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు సత్యనారాయణ, పుష్పలత మాట్లాడుతూ ఏ భూమిలో ఎలాంటి విత్తనాలు నాటాలి.. ఎంత మోతాదులో విత్తాలి.. ఎంత దిగుబడి వస్తుందో వంటి వివరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా పంటలు సాగు చేయాలన్నారు. ఇందుకోసం రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వేణుగోపాల్రెడ్డి, సుమలత, పర్వత్రెడ్డి, రాజమహేందర్రెడ్డి, ఏఓ నర్మద, ఏఈఓలు రాజ్కుమార్, వెంకటయ్యగౌడ్, సత్యనారాయణగౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ వైఖరి సరికాదు
కందనూలు: దీర్ఘకాలంగా ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ అన్నారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ అధ్యక్షతన సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సర్వీసు, వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగడం శోచనీయమన్నారు. ఎన్నికల సమయంలో అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఉపాధ్యాయ, ఉద్యోగులతోపాటు పదవీ విరమణ పొందిన వారికి కూడా వివిధ రకాల ఆర్థిక బిల్లులు చెల్లింపులో ఏళ్ల తరబడి జాప్యం జరిగిందని, ఇప్పటికై నా వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక తక్షణమే తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ అమలు చేయాలని, బకాయి పడిన 5 డీఏలను తక్షణమే చెల్లించాలని, 317 జీఓతో ఎదురైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ ‘మన ఊరు మనబడి’లో అర్ధాంతరంగా ఆగిపోయిన పాఠశాల భవనాల నిర్మాణం పూర్తి చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాలల్లో శాశ్వతంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్శర్మ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ నిధి బోర్డు డైరెక్టర్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్పందన అంతంతే..
ఈ నెల 3తో ముగిసిన ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు ● మూడుసార్లు గడువు పెంచినా నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ● ఉమ్మడి జిల్లాలో రూ.67.33 కోట్ల ఆదాయం ● అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్కు రూ.18.08 కోట్లు.. ● అలంపూర్ మున్సిపాలిటీకి రూ.16 లక్షలు మాత్రమే.. ● నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 16,266 దరఖాస్తులు రాగా 10,782 కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 2,895 మంది రూ.4.78 కోట్లు చెల్లించగా..1,728 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కల్వకుర్తిలో 11,643 దరఖాస్తులు రాగా 9,491 కి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,160 మంది రూ.4.85 కోట్లు చెల్లించారు. 1,088 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. కొల్లాపూర్లో 4,654 దరఖాస్తులకు 3,718కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 713 మంది రూ.1.23 కోట్లు చెల్లించారు. 264 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అచ్చంపేటలో 12,291 దరఖాస్తులకు 10,765కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,871 మంది రూ.2.72 కోట్లు చెల్లించారు. 106 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు పెద్దగా స్పందన రాలేదు. అనధికార లేఔట్లలోని స్థలాను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ గడువు ముగిసినా.. అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. మూడుసార్లు గడువు పెంచినా ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు యజమానులు పెద్దగా ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోని మొత్తం 21 పురపాలికల్లో కలిపి కేవలం రూ.67.33కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం మొదట ఈ ఏడాది మార్చి 31లోగా చెల్లించే వారికి మొత్తం ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ గడువును ఏప్రిల్ 30 వరకు, మళ్లీ ఈనెల 3వ తేదీ వరకు ఇలా మూడుసార్లు పెంచింది. పురపాలికల వారీగా ఆదాయం ఇలా.. ● మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 32,005 దరఖాస్తులు రాగా.. వీటిలో ఎల్ఆర్ఎస్కు అర్హత కలిగిన 22,183కి ఫీజు చెల్లించాలని మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఇందులో 7,424 మంది దరఖాస్తుదారులు రూ.18.08 కోట్లు చెల్లించగా..ఇప్పటివరకు 2,910 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. జడ్చర్ల పరిధిలో 17,935 దరఖాస్తులు రాగా.. అర్హత కలిగిన 11,071కి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,933 మంది దరఖాస్తుదారులు రూ.6.40 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 847కి మాత్రమే ప్రొసీడింగ్స్ అందాయి. భూత్పూర్లో 6,341 దరఖాస్తుల్లో 4,703కి ఫీజు చెల్లించాల్సి ఉంంది. 1,375 మంది దరఖాస్తుదారులు రూ.2.67 కోట్లు చెల్లించగా.. 651కి ప్రొసీడింగ్స్ అందాయి. దేవరకద్ర పరిధిలో 6,765 దరఖాస్తులకు 6,699కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 1,036 మంది రూ.1.69 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 63 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ● వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 29,450 దరఖాస్తులు రాగా.. 25,827కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 5,214 మంది దరఖాస్తుదారులు రూ.6.40 కోట్లు చెల్లించారు. 2,766 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. పెబ్బేరులో 7,432 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 6,484 కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,561 మంది రూ.1.88 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 417 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కొత్తకోటలో 7,740 దరఖాస్తులు రాగా 7,318కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,355 మంది రూ.1.60 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 63 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ఆత్మకూరులో 3,827 దరఖాస్తులకు 3,150కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 822 మంది రూ.98 లక్షలు చెల్లించగా..623 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అమరచింతలో 619 దరఖాస్తుల్లో 333కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 164 మంది రూ.56 లక్షలు చెల్లించారు. ఇప్పటివరకు 121 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ● నారాయణపేట మున్సిపాలిటీలో 7,154 దరఖాస్తులలో 2,036కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,639 మంది రూ.4.19 కోట్లు చెల్లించారు. 772 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మక్తల్లో 10,616 దరఖాస్తులకు 9,063కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,288 మంది రూ.2.44 కోట్లు చెల్లించారు.599 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కోస్గి పరిధిలో 4,168 దరఖాస్తులు రాగా 1,987కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 965 మంది రూ.1.94 కోట్లు చెల్లించారు. 135 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మద్దూరులో 1,493 దరఖాస్తులు రాగా 1,232 కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 322 మంది రూ.34 లక్షలు చెల్లించారు. 234 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. ● గద్వాల పట్టణ పరిధిలో 14,607 దరఖాస్తులు రాగా 4,000కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,844 మంది రూ.2.96 కోట్లు చెల్లించారు. 927 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అయిజలో 10,166 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 5,244కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,155 మంది రూ.1.47 కోట్లు చెల్లించారు. 689 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అలంపూర్లో 431 దరఖాస్తులే రాగా 366కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 122 మంది కేవలం రూ.16 లక్షలే చెల్లించారు. 64 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. వడ్డేపల్లిలో 1,967 దరఖాస్తులు రాగా 1,787కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 378 మంది రూ.73 లక్షలు చెల్లించారు.304 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. -
వేసవి ఆటలకు వేళాయే..
●● ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల ఏర్పాటు ● ఈసారి ప్రత్యేకంగా ఇంట్రా టోర్నమెంట్లు ● ఇతర క్రీడాంశాలకు సంబంధించి ఇదివరకే ఉచిత శిక్షణ ప్రారంభం జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానం మహబూబ్నగర్ క్రీడలు: గ్రామీణ ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు హెచ్సీఏ, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేసవిలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్నగర్ పట్టణం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ మైదానం, జడ్చర్లలోని డీఎస్ఏ మైదానం, నాగర్కర్నూల్ పట్టణం నల్లవెల్లిరోడ్డులోగల క్రికెట్ అకాడమీ, గద్వాలలోని మినీ స్టేడియం, నారాయణపేటలోని మినీ స్టేడియంలలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా శిబిరాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కోచింగ్ ఉంటుంది, ఆసక్తిగల అండర్– 9 నుంచి అండర్–23 ఏళ్లలోపు క్రీడాకారులు ఈనెల 7 తేదీ వరకు మహబూబ్నగర్–95023 56329, నాగర్కర్నూల్–89193 86105, జడ్చర్ల–99853 75737, గద్వాల–98859 55633, నారాయణపేట–91007 53683 నంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. వచ్చే నెల 7వ తేదీ నెల రోజుల పాటు వేసవి శిక్షణా శిబిరాలు కొనసాగనున్నాయి. ● శిక్షణ శిబిరాల్లో క్రీడాకారుల కోసం మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. క్రీడాకారుల కోసం మ్యాట్లు, నెట్లతో పాటు జంబో కిట్లు అందుబాటులో ఉంచుతారు. కేంద్రాల్లో నిష్ణాతులైన కోచ్లతో శిక్షణ అందిస్తారు. ప్రతిరోజు శిబిరాల్లో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు అల్పాహారం కింద అరటిపండు, గుడ్లతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. ● వేసవి శిబిరాల్లో పాల్గొనే క్రీడాకారులతో ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా టోర్నమెంట్లు (ఇంట్రా డిస్టిక్ట్) నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి అండర్–14, అండర్–16, అండర్–19, అండర్–23తో పాటు మహిళా టోర్నమెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. టోర్నీలో రాణించే క్రీడాకారులను వచ్చేనెలలో హెచ్సీఏ టూ డే లీగ్ పోటీలతో పాటు అండర్–14, అండర్–16, అండర్–19, అండర్–20, అండర్–23తో పాటు ఇతర టోర్నీలకు ఎంపిక చేయనున్నారు. జిల్లాలో 10 చోట్ల శిబిరాలు కందనూలు: జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 10 చోట్ల వేసవి క్రీడా ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన శిబిరాల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శిక్షణ ఇస్తారు. క్రీడ కోచ్ సెల్ నంబర్ వేదిక అథ్లెటిక్ ఆర్.మల్లేష్ 97054 03344 నల్లవెల్లిరోడ్ (నాగర్కర్నూల్) తైక్వాండో ఎ.రవికుమార్ 99669 79309 చర్లఇటిక్యాల (తాడూరు) కబడ్డీ ఎండీ అబ్దుల్ 90141 45580 లింగాల వాలీబాల్ వీఎస్ తిమ్మోతి 98853 40986 తిమ్మాజిపేట వాలీబాల్ పి.వెంకటేష్ 99854 66142 నాగనూల్ (నాగర్కర్నూల్) కిక్బాక్సింగ్ పి.శివ 93470 92409 కొండారెడ్డిపల్లి (వంగూరు) ఫుట్బాల్ పి.జయసింహారెడ్డి 94909 75509 ఉయ్యాలవాడ (నాగర్కర్నూల్) అథ్లెటిక్స్ బి.జగన్ 85001 27351 ఊర్కొండపేట (ఊర్కొండ) బ్యాడ్మింటన్ డి.రామకృష్ణ 84658 66700 పెంట్లవెల్లి యోగా శివకుమార్ 93910 68764 బిజినేపల్లి ఈ నెల 8 నుంచి ఉచిత క్రికెట్ శిబిరాలు శిక్షణ శిబిరాల వివరాలు క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ఐదు చోట్ల వేసవి ఉచిత క్రికెట్ శిబిరాలు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలను ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. గతేడాది నిర్వహించిన వేసవి శిబిరాలకు మంచి స్పందన లభించింది. క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రతిభ చాటుకోవాలి. శిబిరాల్లో ఆసక్తిగలవారు కేంద్రాల్లో సంప్రదించి శిక్షణ తీసుకోవాలి. – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి -
సగరులకు ఆదర్శం భగీరథుడు
నాగర్కర్నూల్: సగరులకు భగీరథ మహర్షి ఆదర్శప్రాయుడని సగర సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. భగీరథ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ర్యాలీతోపాటు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ కూడలితోపాటు హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల్లో భగీరథ చిత్రపటాలు ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన భగీరథ జయంతి కార్యక్రమంలో సగర సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే సగర సంఘం జిల్లా కార్యాలయంలోనూ వేడుకలు నిర్వహించారు. సగర సంఘం కార్యాలయం నుంచి హౌసింగ్ బోర్డు మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీరాములు, జిల్లా గౌరవాధ్యక్షుడు అల్లం రాములు, రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మొల్లబాబు, బాలయ్య, సుధాకర్, శ్రీను, తిరుపతయ్య, బాబు, శైలు, పర్వతయ్య, వెంకటేష్, స్వామి, యుగంధర్, పాండు తదితరులు పాల్గొన్నారు. -
2 వేల ఏళ్ల నాటి గ్రామం..
నంది వడ్డెమాన్గా మారిన వర్ధమానపురం ● 400 ఏళ్లు పాలించిన కాకతీయ సామంత రాజులు ● నేటికీ సజీవంగా చారిత్రక ఆనవాళ్లు ● గ్రామంలో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడు ● రాష్ట్రంలోనే ఏకై క ఆలయంగా ప్రసిద్ధి శనేశ్వరుడికి అతీ ప్రీతికరమైన నల్లటి వస్త్రాలు ధరించి ఇక్కడ పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లేడు, జమ్మి ఆకు, నువ్వుల నూనెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. గుడి ఆవరణలో స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించి.. విగ్రహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి.. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించి.. ఆ తైలాన్ని తలకు రుద్దుకుని మరోమారు స్నానం చేస్తారు. అనంతరం అక్కడే ఉన్న నంది శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడు కొలువుదీరినందున మహిళలు సైతం ఈ పూజల్లో పాల్గొనవచ్చు. నాగర్కర్నూల్: కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. కాగా నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరు మీద ఈ గ్రామానికి వర్ధమానపురం అనే పేరు వచ్చింది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాల క్రమేనా నందివడ్డెమాన్గా మారింది. గ్రామం చుట్టూ ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇందులో ప్రధానంగా కాళిమాత, శివగౌరమ్మ, త్రిమూర్తులు, వీరభద్రస్వామి, నందీశ్వర, శనేశ్వరుడు, చెన్నకేశవస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి. మహిళలు సైతం పూజలు చేయొచ్చు.. -
సీఎం రేవంత్ గ్రామంలో శంకరనేత్రాలయ కంటి శిబిరం
కొండారెడ్డిపల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన, కొండారెడ్డి పల్లి లో వారి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం శంకరనేత్రాలయ సంస్థ ఇటీవల ఉచిత కంటి వైద్య శిభిరాన్ని నిర్వహించింది. ఇది తెలంగాణాలో శంకరనేత్రాలయ సంస్థ నిర్వహించిన ఇరవయ్యోవ కంటి శిబిరం.శంకరనేత్రాలయ అమెరికా అధ్యక్షులు బాలారెడ్డి ఇందుర్తి పటిష్ట నాయకత్వంలో, రేవంత్ రెడ్డి సోదరులు ఎనుముల కృష్ణ రెడ్డి ప్రోత్సాహంతో ఎంతో విజయవంతంగా జరిగిన ఈ కార్యక్రమలో, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఇందుర్తి గణపతి రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ శంకరనేత్రాలయ సంస్థకు, మరియు ఈ కార్యక్రమంలో సహాయం అందించిన ప్రతీ ఒక్కరిని అభినందించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ శిభిరంలో 1888 మంది రోగులను పరీక్షించి 184 మందికి కంటి శుక్ల వ్యాధులు నివారణ శస్త్ర చికిత్సాలు అక్కడికక్కడే, శంకరనేత్రాలయ వారి ప్రత్యేకంగా నిర్మించిన, మొబైల్ ఆపరేషన్ బస్సులలో విజయవంతంగా నిర్వహించారు. ఎనుముల రాజశేఖర్ రెడ్డి, ఎనుముల వేమా రెడ్డి ఎంతో సమర్ధవంతంగా ఈ వైద్య శిభిరాన్ని నిర్వహించి, ఉచిత భోజన సదుపాయాన్ని కూడా అందించారు. ఎంతో విజయవంతంగా జరిగిన ఈ శిభిరానికి మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు గారు, శంకరనేత్రాలయ అమెరికా కార్య నిర్వాహక వర్గ సభ్యులైన శ్యామ్ అప్పాలి , మూర్తి రేకపల్లి , వంశీ ఏరువరం , శంకరనేత్రాలయ హౌస్టన్ ట్రస్టీ నారాయణ రెడ్డి ఇందుర్తి తమ పూర్తి సహాయ సహకారాలను అందించారు. వారికి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.అంకితభావంతో పదిరోజుల పాటు జరిగిన ఈ శిభిరాన్ని, పలువురు ప్రముఖులు సందర్శించి, శంకరనేత్రాలయ సిబ్బందిని అభినందించారు. పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , తెలంగాణా పశుసంవర్ధక శాఖ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి , తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ సంఘ అధ్యక్షులు కే వి ఎన్ రెడ్డిగారు, తెలంగాణా అకాడెమీ అఫ్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) సి ఈ ఓ , రాఘవేందర్ సుంకిరెడ్డి, అనూష ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ జలంధర్ రెడ్డి ఈ శిభిరాన్ని సందర్శించి, శంకర నేత్రాలయం వారు చేస్తున్న సేవలను కొనియాడారు.కొండారెడ్డి పల్లి, మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు, శంకరనేత్రాలయ సంస్థ అందించిన సేవలు ఎంతో విలువయినవని, తమ జీవితాలలో సరికొత్త వెలుగు నింపిందని, తమ కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో మాచారం, అచంపేట్ , డిండిచింతపల్లి, పోల్కంపల్లి, వెల్దండ, ఆమనగల్, నంది వడ్డేమాన్ గ్రామాలలో నిర్వహించిన కాంపుల ద్వారా కూడా ఏంతో మంది లబ్ది పొందడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసి పేదవారిని ఆదుకోవాలని, ప్రభుత్వపరంగా కూడా సంకరనేత్రాలయ సంస్థ చేస్తున్న ఈ ప్రజాహిత కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ఖాతాదారులు టెక్నాలజీని వినియోగించుకోవాలి
తిమ్మాజిపేట: ఖాతాదారులు ఎప్పటికప్పుడు సాంకేతికతను వినియోగించుకొని బ్యాంకు సేవలు పొందాలని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీధర్రెడ్డి అన్నారు. మండలంలోని ఆవంచలో శనివారం ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్యాంకులో డబ్బులు జమ చేసుకోవాలన్నా.. డబ్బులు తీసుకోవాలన్న మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా సాంకేతికతను వినియోగించుకొనే అవకాశం ఉందన్నారు. ఖాతదారులు సామాజిక భద్రత పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, సురక్ష జీవన బీమా, అటల్ పెన్షన్ యోజన పథకాలలో అర్హులైన వారు భాగస్వాములు కావాలని కోరారు. ఏడాదికి రూ.2 వేలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.40 లక్షలు వస్తాయన్నారు. ఏటీఎం, రూపే కార్డులను వినియోగించుకొని సమయం వృథా కాకుండా చేసుకోవాలన్నారు. మోసపూరిత ఫోన్ కాల్స్ ఆందోళన చెందవద్దని, ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. రైతులు, ఖాతాదారులు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకు అందించే సేవలు, సౌకర్యాల గురించి వివరించారు. -
భూ సమస్యల ప్రక్షాళనకే ‘భూ భారతి’
పాన్గల్: నిజమైన హక్కుదారులకు భూ భారతి చట్టం అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల ప్రక్షాళనకు భూ భారతి చట్టం తీసుకొచ్చిందని, పాత చట్టంలోని లొసగులను సవరిస్తూ కొత్త చట్టం రూపొందించినట్లు చెప్పారు. గతంలో ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకొని అనేక భూ ఆక్రమణలు జరిగాయని.. వాటన్నింటిని భూ భారతి చట్టం ద్వారా సరిచేసి ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పారు. ధాన్యం కాంటా, తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యంత పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సూచించారు. కమిటీ సభ్యులు, అధికారులు నిజాయతీగా వ్యవహరిస్తూ అర్హులకే ప్రాధాన్యం ఇవ్వాలని.. అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించి బలోపేతానికి సహకరించాలని కోరారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ.21,59,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి అందజేశారు. కొత్త చట్టం గురించి వివరించేందుకే అవగాహన సదస్సులు.. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం గురించి ప్రజలకు వివరించేందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ధరణిలోని సమస్యల పరిష్కారానికి మేధావులతో చర్చించి పటిష్ట భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అఽధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకొని తప్పును సరిచేసే అవకాశం కొత్త చట్టంలో ఉందన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీఏఓ గోవింద్నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఆర్ఓ సీతారాంనాయక్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఏఓ రాజవర్ధన్రెడ్డి, మండల నాయకులు వెంకటేష్నాయుడు, రవికుమార్, మధుసూదన్రెడ్డి, రాముయాదవ్, పుల్లారావు, భాస్కర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో శనివారం డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్ ఆధ్వర్యంలో వైద్యాధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని 9 ప్రైవేటు ఆస్పత్రులు, 5 డయాగ్నోస్టిక్ సెంటర్లలో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇతర పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్ మాట్లాడుతూ తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు–2010 ప్రకారం నిబంధనలకు లోబడి ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో తప్పనిసరిగా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వైద్యులు, సిబ్బంది వివరాలు ప్రదర్శించాలని ఆదేశించారు. ఆస్పత్రి వ్యర్థాలను బయో మెడికల్ వేస్టేజ్ మేనేజ్మెంట్ వారికి ఇస్తే నిబంధనల ప్రకారం, శాసీ్త్రయ పద్ధతిలో వ్యర్థాలను నిర్మూలిస్తారన్నారు. నిబంధనల ప్రకారం లేని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కొల్లగొడుతున్నారు..
దుందుభీని లూటీ చేస్తున్న ఇసుకాసురులు ●అదనంగా డబ్బులిస్తేనే.. నేను కొత్తగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టా. ఆన్లైన్లో పది ట్రిప్పుల ఇసుక కోసం డబ్బులు చెల్లించాను. అదనంగా రూ.500 ఇస్తేనే ఇసుకను తెస్తాం.. లేకపోతే బుకింగ్ క్యాన్సల్ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ 5 ట్రిప్పులు మాత్రమే ఇసుక తెచ్చారు. ప్రతి ట్రాక్టర్కు అదనంగా రూ.300 వరకు ఇవ్వక తప్పలేదు. మట్టితో కూడిన ఇసుక తెచ్చిపోసినా అడిగే అవకాశం లేదు. ఇంతకు ముందు ఇదే రేటుకు ట్రాక్టర్ వారితో మాట్లాడుకొని మనకు నచ్చిన ఇసుక తెచ్చుకునేవాళ్లం. – ఆలూరి వెంకటేష్, ఉప్పనుంతల ఉన్నతాధికారుల ఆదేశాలపైనే.. కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకే బల్మూరు, అమ్రాబాద్ తదితర మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం దుందుభీ వాగు నుంచి ఇసుక సేకరణకు అనుమతి పత్రాలు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నేరుగా వారు ఎంచుకున్న ట్రాక్టర్ నంబర్తోనే ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కార్యాలయంలో ఇతర పనుల వల్ల ఇసుక తరలింపుపై దృష్టిపెట్టలేకపోతున్నాం. – ప్రమీల, తహసీల్దార్, ఉప్పునుంతల ఉప్పునుంతల: ఒకపక్క మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ పేరిట వాగు నుంచి ఇసుక సేకరిస్తుండటం.. మరోపక్క ఆఫ్లైన్లో ఇందిరమ్మ ఇళ్ల పేరిట రెవెన్యూ అధికారులు విచ్చలవిడిగా అనుమతి పత్రాలు ఇస్తున్నారు.. ఇదే అదునుగా ఇసుక అక్రమదారులు మండల సరిహద్దులోని దుందుభీ వాగును లూటీ చేస్తున్నారు. మన ఇసుక వాహనం ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం చేకూరడంతోపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండ ఇసుక లభిస్తుందని ఆశించిన వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇసుక కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులు సకాలంలో ఇసుక అందక ఎదురుచూడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఫోన్ చేసి తమకు అదనంగా డబ్బులు ఇస్తేనే ఇసుక తెస్తామని వినియోదారులను వేధిస్తున్నారు. రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు డిమాండ్ చేస్తూ.. చివరికి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. ఒకవేళ వినియోగదారులు స్పందించకుంటే వారి బుకింగ్ క్యాన్సిల్ చేసేందుకు వెనుకాడటం లేదు. కొందరు ట్రాక్టర్ల యజమానులతో మైనింగ్కు సంబంధించిన ట్యాక్స్ ఆఫీసర్, రీచ్ ఆఫీసర్ కుమ్మకై ్క బుకింగ్లను క్యాన్సల్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారీ నుంచి వచ్చాక.. మన ఇసుక వాహనం ఆన్లైన్లో ఇసుక బుకింగ్, ఆఫ్లైన్లో తహసీల్దార్ ఇస్తున్న అనుమతుల మేరకు ప్రస్తుతం పెద్దాపూర్ సమీపంలోని దుందుభీ వాగులో మూడు క్వారీల ద్వారా ఇసుక సేకరిస్తున్నారు. ఒక రోజు 200ల ట్రాక్టర్ల ట్రిప్పుల వరకు అనుమతులు ఉండగా.. మరో 50 ట్రిప్పుల వరకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లకు నింపుకొని క్వారీ నుంచి రోడ్డు వద్దకు చేరిన తర్వాత అనుమతి పత్రాలు పరిశీలిస్తుండటం అక్రమానికి అవకాశం కల్పిస్తోంది. రెవెన్యూ పరంగా వీఆర్ఏ, మైనింగ్ నుంచి రీచ్ ఆఫీసర్, పోలీస్ సిబ్బంది ఒకరిని అక్కడ ఉంచుతున్నారు. క్వారీ నుంచి ఇసుక నింపుకొని అక్కడికి వచ్చిన ట్రాక్టర్ల యజమానులు అనుమతి పత్రాలు లేకపోతే అక్కడున్న వారిని ఏదో ఒకరకంగా మేనేజ్ చేసి ట్రాక్టర్ను పంపిస్తున్నారు. ముందుగానే అనుమతి పత్రాలు పరిశీలించి ట్రాక్టర్లను క్వారీలోకి అనుమతిస్తే కొంతమేర అక్రమ రవాణాను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ‘మన ఇసుక వాహనం’ విధానంలోనూ ఆగని అక్రమాలు వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు డిమాండ్ ఇందిరమ్మ ఇళ్ల పేరిట విచ్చలవిడిగా అనుమతులు అధికారుల పర్యవేక్షణ లోపంతో తరలింపులో పక్కదారి ఈ విషయమై జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణకు ‘సాక్షి’ ఫోన్ చేసినా స్పందించ లేదు. అందుబాటులో ఉన్న రీచ్ ఆఫీసర్ రమేష్ను వివరణ కోరగా తనకు బుకింగ్ క్యాన్సల్కు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఆన్లైన్లో బుకింగ్పై వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ను మాత్రమే తనిఖీ చేసి పంపిస్తున్నానని చెప్పుకొచ్చారు. లబ్ధిదారుల పేర్లు లేకుండానే.. కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి పనుల పేరిట స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇసుక అనుమతులు విచ్చలవిడిగా ఇస్తున్నారు. శనివారం ఒక్క రోజే రెవెన్యూ అధికారులు 72 ట్రిప్పులకు అనుమతిచ్చారు. కనీసం అనుమతి పత్రాలపై ఇళ్ల లబ్ధిదారుల పేర్లు కూడా రాయడం లేదు. కొంతమంది ట్రాక్టర్ల యజమానులు అధికారులకు డబ్బులు ముట్టజెప్పి అనుమతి పత్రాలు అక్రమంగా పొందుతున్నట్లు తెలుస్తోంది. రెండు ట్రిప్పులకు తీసుకుంటున్న అనుమతి పత్రాలపై నాలుగు ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. ఇలా చేస్తేనే అన్ని ఖర్చులు పోను తమకు ఎంతో కొంత మిగులుతుందని ట్రాక్టర్ల యజమానులు బాహాటంగానే చెబుతున్నారు. -
దాబాలు సైతం కిక్కిరిసి..
సాక్షి, నాగర్కర్నూల్/ కందనూలు/ నాగర్కర్నూల్ రూరల్: జిల్లాకేంద్రంలోని పలు వైన్షాపుల వద్ద సాయంత్రం అయితే చాలు మందుబాబులు రోడ్లపైనే తిష్టవేస్తున్నారు. నిబంధనల ప్రకారం వైన్షాపు పక్కనే ఉండే పర్మిట్ రూముల్లోనే మద్యం తాగాల్సి ఉన్నా.. వైన్షాపుల ఎదుట రోడ్లపైకి వచ్చి బహిరంగంగా మద్యం తాగు తున్నారు. జిల్లాలోని వైన్షాపులు చాలావరకు ఇళ్ల మధ్య, రోడ్లపైనే ఉన్నాయి. బస్టాండ్, ప్రధాన చౌరస్తాలు, ప్రధాన రోడ్లకు పక్కనే ఉన్న వైన్షాపుల వద్ద రోడ్డుపైనే తిష్టవేసి మరీ మందుబాబులు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. వైన్షాపుల ముందే ఓపెన్ సిట్టింగ్లు ఏర్పాటు చేస్తుండటంతో ఆ రోడ్ల మీదుగా వెళ్లేందుకు మహిళలు, చిన్నారులు జంకుతున్నారు. కరువైన పర్యవేక్షణ.. జిల్లాకేంద్రంలో బార్లు, పర్మిట్రూములతోపాటు దాబాలకు తేడా లేకుండా పోయింది. వైన్ షాపుల ఎదుట, సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చికెన్, మటన్ వంటకాలతో దాబాలు వెలిశాయి. ఇవన్నీ ఓపెన్ సిట్టింగ్లకు అడ్డాలుగా మారాయి. దాబాలు, హోటళ్లు అనే తేడా లేకుండా మందుబాబులు, బహిరంగంగా మద్యపానం, సీసాల గుట్టలతో బార్లు, పర్మిట్ రూములను తలపిస్తున్నాయి. కాలనీలు, ఇళ్ల మధ్యే వైన్షాపులు, దాబాలు ఉండటంతో చుట్టుపక్కల వారు ఇక్కట్ల పాలవుతున్నారు. వైన్ షాపుల ఎదుటే యథేచ్ఛగా మందుబాబుల సిట్టింగ్లు అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్తో రాకపోకలకు అంతరాయం ఇళ్ల మధ్యే విక్రయాలతో బయటకు వెళ్లేందుకు జంకుతున్న మహిళలు జిల్లాకేంద్రంలోని వైన్షాపుల వద్ద భయానక పరిస్థితులు -
హమాలీలకు రూ.26 వేల వేతనం చెల్లించాలి
కల్వకుర్తి రూరల్: కార్మికులను బానిసత్వంలోకి నెట్టే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్తో ఈ నెల 20న నిర్వహించే సమ్మెను విజయవంతం చేద్దామని సివిల్ సప్లయ్ గోదాం హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని సివిల్ సప్లయ్ గోదాం ఇన్చార్జ్ శశిధర్రావుకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, అప్పటి వరకు హమాలీలకు రూ.26 వేల వేతనం చెల్లించాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన హమాలీలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, 50 ఏళ్లు పైబడిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నిర్లక్ష్యం వహించారు..
కేంద్ర ప్రభుత్వం శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం కింద రూ.30 కోట్లు మంజూరు చేసింది. అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులతో పనులు పూర్తిచేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించారు. చాలావరకు పనులు పూర్తికాకుండానే కాంట్రాక్టర్లకు నిధులు కట్టబెట్టారు. మండలంలో కోల్డ్ స్టోరేజీలు, వృద్ధాశ్రమం, డంపింగ్ యార్డు తదితర నిర్మాణాలు ప్రారంభించలేదు. – పరశురాముడు, బీజేపీ అధ్యక్షుడు, పెద్దకొత్తపల్లి మండలంఅనుకూలంగా లేక ఇబ్బంది పడుతున్నాం.. పశువైద్య కేంద్రం నిర్వహణకు అనువైన స్థలం ఏది లేకపోవడంతో పక్కనే ఖాళీగా ఉన్న అంగన్వాడీ భవనంలోకి మార్చారు. అక్కడే ట్రేవిస్ అమర్చి పశువులకు చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇది రోడ్డుపై ఉండడం వల్ల చికిత్స అందించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కువ మొత్తంలో వస్తే పశువులకు చికిత్సలు చేయడం కష్టం. ఐదారు గ్రామాలకు చెందిన రైతులు ఇక్కడికే వస్తారు. పక్కా భవన నిర్మాణం ఐదారేళ్లుగా లెంటల్ లెవల్లోనే ఆగిపోయింది. దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు – దండె కృష్ణయ్య, వెన్నాచేడ్ కాంట్రాక్టర్ల వల్లే.. పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ కింద మంజూరైన నిధులను చాలా వరకు వినియోగించుకున్నాం. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీరోడ్లు, పార్కులను అభివృద్ధి చేశాం. కొన్ని పనులు కాంట్రాక్టర్ల జాప్యం వల్ల పూర్తికాలేదు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేయించాం. – చిన్న ఓబులేసు, డీఆర్డీఓ, నాగర్కర్నూల్ ● -
ఎన్నాళ్లీ కష్టాలు
కొల్లాపూర్: కేఎల్ఐ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఆ గ్రామాలు సాగునీటికి నోచుకోవడం లేదు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి సాగునీటి కోసం ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులను వేడుకుంటూనే ఉన్నా.. కానీ, వారి కోరిక మాత్రం నెరవేరడం లేదు. ఇది కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, మొలచింతలపల్లి గ్రామాల పరిస్థితి. దీంతో నేటికీ ఆయా గ్రామాల రైతులు వర్షాధారంగా.. మరికొందరు బోరుబావులు తవ్వుకొని పంటలు సాగుచేస్తున్నారు. అయితే రెండు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న జీల్దార్తిప్ప చెరువుకు కేఎల్ఐ నీటిని మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా జరిగితే రెండు గ్రామాలకు సాగునీటి సమస్య తీరడంతోపాటు నల్లమల అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు శాశ్వతంగా తాగునీటి వనరులు అందుబాటులో వస్తాయి. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో.. కేఎల్ఐ ప్రాజెక్టుకు కేవలం 3 కి.మీ., దూరంలోనే మొలచింతపల్లి, 6 కిలోమీటర్ల దూరంలో ముక్కిడిగుండం గ్రామాలు ఉంటాయి. వీటికి అనుబంధ గ్రామాలు సైతం ఉన్నాయి. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో ఈ గ్రామాలు ఉండడంతో కేఎల్ఐ నీటిని ఆయా శివార్లకు తరలించేందుకు అధిక మొత్తంలో ఖర్చవుతుందని అధికారులు పట్టించుకోలేదు. తర్వాతి కాలంలో ప్రజల నుంచి డిమాండ్లు పెరగడంతో పాలకులు రెండు గ్రామాలకు సాగునీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. పనుల కోసం శిలాఫలకాలు వేసినా.. కానీ, పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. చెరువులు, బోరు బావులే.. మొలచింతలపల్లి, ముక్కిడిగుండం రెవెన్యూ శివార్లలోని భూముల సాగుకు చెరువులు, బోరుబావులే దిక్కయ్యాయి. ప్రధానంగా జీల్దార్తిప్ప చెరువు కిందనే అధిక ఆయకట్టు ఉంది. ఈ చెరువును 1970లో అప్పటి కొల్లాపూర్ ఎమ్మెల్యే కె.రంగదాసు నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించారు. 2 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా నిర్మించిన ఈ చెరువును మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ్రావు ప్రారంభించారు. చెరువు కింద ప్రస్తుతం దాదాపుగా 1,800 ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీరు సమృద్ధిగా ఉంటే 3 వేల ఎకరాల మేర ఆయకట్టు సాగవుతుంది. వర్షాకాలంలో చెరువు నీళ్ల ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులు రబీ సీజన్లో మాత్రం సాగునీరు లేక పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారు. వన్యప్రాణులకూ ఉపయోగమే.. జీల్దార్తిప్ప చెరువును ఆనుకొని నల్లమల అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ చెరువును కేఎల్ఐ నీటితో నింపితే చెరువు కింద ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందడంతోపాటు నల్లమల అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు శాశ్వతంగా తాగునీటి సౌకర్యం కల్పించినట్లు అవుతుంది. జీల్దార్తిప్ప చెరువుకు రెగ్యులర్గా తాగునీటి కోసం వన్యప్రాణులు వస్తుంటాయి. కృష్ణా జలాలకు నోచుకోని జీల్దార్తిప్ప చెరువు కేఎల్ఐ చెంతనే ఉన్నా మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాలకు అందని సాగునీరు చెరువు కింద 3 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగునీటి మళ్లింపు కోసం కెనాల్ తవ్వేందుకు ఆరేళ్ల క్రితం శంకుస్థాపన ఉన్నతాధికారులకు విన్నవిస్తాం.. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా జీల్దార్తిప్ప చెరువుకు నీటిని మళ్లించే అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. ఈ పనులకు రెండుసార్లు నిధుల కేటాయింపు జరిగింది. అయితే భూ సేకరణలో సమస్యల కారణంగా గతంలో పనులు ముందుకు సాగలేదు. నిధుల కొరత కూడా కారణమే. నిధుల కేటాయింపు, భూ సేకరణ సమస్య, అవసరమైన నిధుల వివరాలతో గతంలో సీఈకి నివేదిక పంపించాం. మరోసారి ఉన్నతాఽధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
నాగర్కర్నూల్: జిల్లాలో అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీసీ నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో భూ భారతి చట్టం అమలు చేయనున్న మండలంలోని గ్రామాల్లో రైతుల నుంచి భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన మండలంలోని ప్రతి గ్రామంలో హెల్ప్ డెస్క్, దరఖాస్తు సెంటర్లు ప్రారంభించాలని, అధికారులు గ్రామాలకు వెళ్లే ముందు ప్రజలందరికీ తెలిసేలా చాటింపు వేయించాలని, దరఖాస్తు ఫారాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా త్వరితగతిన పూర్తిచేసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదం తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో నిరుపేదలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనర్హులను ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయవద్దని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలి నాగర్కర్నూల్ రూరల్: మండలంలోని పెద్దాపూర్లో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గ్రామంలో పలువురు లబ్ధిదారులకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పనులను అదనపు కలెక్టర్ దేవసహాయం, ఎంపీడీఓ కోటేశ్వర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం చేపట్టి ఎన్ని రోజులు అవుతుందని నిర్మాణానికి మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారని, ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యిందని ఆరా తీశారు. పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష జమ చేస్తామన్నారు. -
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేస్తాం
కందనూలు: జిల్లాలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో జిల్లా సంస్థాగత ఎన్నికల సహ ఇన్చార్జ్ మొగిలి దుర్గాప్రసాద్తో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో పార్టీని పటిష్టపరచడానికి బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని, ఇందులో భాగంగానే నూతన మండల కమిటీలు ఏర్పాటు చేశామని, గతంలో చాలా మండలాల్లో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, తాజాగా పది మండలాలకు అధ్యక్షులను నియమించామని వివరించారు. నాగర్కర్నూల్ మున్సిపల్ అధ్యక్షుడిగా ప్రమోద్కుమార్, తెలకపల్లి మండల అధ్యక్షుడిగా చిన్నారెడ్డి, తిమ్మాజిపేట మండలాధ్యక్షుడిగా యశ్వంత్, నాగర్కర్నూల్ రూరల్ అధ్యక్షుడిగా లోమేశ్వర్రెడ్డి, అచ్చంపేట రూరల్ అధ్యక్షురాలిగా జ్యోతి, లింగాల మండల అధ్యక్షుడిగా నవీన్, చారకొండ అధ్యక్షుడిగా కృష్ణ, బల్మూరు మండల అధ్యక్షుడిగా బాలస్వామి, పదర మండల అధ్యక్షుడిగా రవి, అమ్రాబాద్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాసులును నియమించినట్లు చెప్పారు. ఈ నెల 15లోగా గ్రామాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసిన ఉద్యమ కార్యాచరణ తీవ్రతరం చేస్తామన్నారు. -
త్వరలోనే వనపర్తికి ఈఎస్ఐ ఆస్పత్రి
వనపర్తి టౌన్: కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పుర కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో లక్షలాది మందికి నిరంతరాయంగా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు కొత్త నియమకాలను చేపడతామన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం కార్మికులకు ప్రతి బెనిఫిట్ను అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు విజయ చందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మహేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, లైట్, హెవీ వెహికల్స్ సంఘం అధ్యక్షులు అయూబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
నాగర్కర్నూల్ క్రైం: కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే సరైన న్యాయం పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నసీమా సుల్తానా అన్నారు. గురువారం మే డేను పురస్కరించుకొని మండలంలోని నల్లవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం నిర్వహించి న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ 19వ శతాబ్దపు చివరలో కార్మికులతో ఎక్కువ పనిగంటలు చేయించుకుని తక్కువ జీతాలు ఇచ్చేవారని కార్మికుల ఉద్యమం తర్వాత 8 గంటలు మాత్రమే రోజుకు పనిచేయాలని, తగిన వేతనం ఇచ్చేలా మార్పులు వచ్చాయన్నారు. వేతనాల విషయంలో సీ్త్ర, పురుషుల మధ్య తేడా లేకుండా వారికి సమాన వేతనం ఇవ్వడం జరుగుతుందని, దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిన తర్వాత కార్మికుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు కార్మిక శాఖలో ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేసుకోవాలని, భవన నిర్మాణ కార్మికులు, ఇతర పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ప్రమాదవశాత్తు గాయ పడిన, చనిపోయిన ప్రమాద బీమా తీసుకోవడం ద్వారా వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లభిస్తు ందన్నారు. ఎవరైనా కార్మికులు ఆర్థిక స్థోమత లేకుంటే కోర్టు కేసుల్లో ఉన్నవారికి ఉచితంగా న్యాయ సేవాధికార సంస్థ తరపున న్యాయవాదిని నియమిస్తామన్నారు. జూన్లో జరిగే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొని సామ రస్య పూర్వకంగా కేసులు పరిష్కరించుకోవాలని సూ చించారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు శ్రీరామ్ ఆర్య, న్యాయవాదులు రామచందర్, మాధవ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
యూనిఫాంలో మార్పులు
జిల్లాలో 56,733 మంది విద్యార్థులకు ఒక జత దుస్తులు ●బడిబాటకు ముందే.. మే నెలాఖరులోగా యూనిఫాంలు పూర్తి చేసి బడిబాటకు ముందే పాఠశాలలకు చేరేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఇప్పటికే జిల్లాకు చేరిన యూనిఫాం క్లాత్ను ఎంఈఓల పర్యవేక్షణలో పాఠశాలల హెచ్ఎంలు, డీఆర్డీఏ అధికారుల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించడం జరుగుతుంది. కొత్త దుస్తుల్లో పిల్లలు విద్యా సంవత్సరం ప్రారంభం రోజే హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాం. – రమేష్కుమార్, డీఈఓ అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న యూనిఫాంలో మార్పులు చేశారు. 6 నుంచి 12 తరగతి వరకు బాలబాలికలకు ఒకే విధంగా ఉండేలా మార్పు చేయనున్నారు. ముఖ్యంగా ఎదిగే బాలికలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తయారు చేయనున్నారు. గతంలో విద్యా సంవత్సరం సగం ముగిసే వరకు యూనిఫాంలు కుట్టడం కొనసాగేది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈసారి మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే యానిఫాంలు అందేలా పక్కాగా ప్రణాళిక రూపొందించారు. టెస్కో ద్వారా సరఫరా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే యూనిఫాంల క్లాత్ తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) సరఫరా అందిస్తుంది. జిల్లాకు చేరిన యూనిఫాంల క్లాత్ను పరిశీలించి, భద్రపర్చే బాధ్యతను ఎంఈఓలకు అప్పగించారు. ప్రస్తుతం 56,733 మంది బాలబాలికలకు సంబంధించిన ఒక జత క్లాత్ మాత్రమే వచ్చింది. వాటిని స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించేలా కార్యాచరణ రూపొందించారు. ఎంఈఓల పర్యవేక్షణలో డీఆర్డీఏ, అర్బన్, మెప్మా, డీఎల్ఎఫ్ మహిళా సంఘాల సభ్యులకు క్లాత్ అందజేశారు. ఒక్కో జత కుట్టడానికి రూ.75 చొప్పున చెల్లించనున్నారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎంఈఓల పర్యవేక్షణలో కుట్టు పనులు మహిళా సంఘాల సభ్యులకు కుట్టే బాధ్యత ప్రారంభానికి ముందే పాఠశాలలకు చేరేలా ప్రణాళిక స్వల్ప మార్పులతో.. ఈ విద్యా సంవత్సరంలో అందించే యూనిఫాంలలో స్వల్ప మార్పులు చేశారు. చొక్కాలు, లాంగ్ గౌన్లకు పట్టీలు, భుజాలపై కప్స్ వంటివి లేకుండా సాధారణ యూనిఫాంగా డిజైన్ చేశారు. బాలురకు 6 నుంచి 12 తరగతి వరకు నిక్కర్లు కాకుండా ప్యాంట్లు అందించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతానికి నిక్కర్లకు మాత్రమే వస్త్రం జిల్లాకు చేరింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మంగళవారం ఆయా మండల కేంద్రాలకు పంపించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, యూపీఎస్, పీఎస్, కేజీబీవీ, జెడ్పీ, ఎయిడెడ్, యూఆర్ఎస్, టీఎస్ఆర్ఈఐఎస్, మోడల్ స్కూళ్లు కలిపి మొత్తం 839 ఉండగా.. ఇందులో 56,733 మంది బాలబాలికలు ఉన్నారు. -
ఎల్ఆర్ఎస్ గడువు మళ్లీ పొడిగింపు
అచ్చంపేట: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబ ద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద ఫీజు చెల్లిపు గడువు ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 25 శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపు గడువు గత నెల 30న ముగియగా దాన్ని ఈ నెల 3 వరకు పొడిగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి టీకే శ్రీదేవి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే నెల గడువు పొడిగించగా జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ఫీజు చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దాల్సిన సంబంధిత అధికారులు మధ్య సమన్వయం కొరవడటం వంటి కారణాలతోనే ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎల్ఆర్ఎస్ కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ ఫీజు చెల్లించేందుకు మాత్రం చాలామంది ముందుకు రాలేదు. సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం చేకూరుతుందని భావించినా నిరాశే ఎదురైంది. పొడిగించిన గడువుకు అవకాశం మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో దరఖాస్తుదారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇందులో అర్హులుగా గుర్తించినవి 34,756 ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు 44,280ఫీజు చెల్లించిన వారు 7,453 ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.13.18 కోట్లు ఎల్ఆర్ఎస్ ప్లాట్లు సర్వే చేస్తున్న అధికారులు (ఫైల్) ఈ నెల 3 వరకు అవకాశం కల్పించిన ప్రభుత్వం సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం గడువు మూడు రోజులు పొడిగించింది. 25 శాతం రాయితీ సదుపాయాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. ఎఫ్టీఎల్, నిషేధిత సర్వే నంబర్లు మినహా ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రెగ్యులరైజేషన్ రుసుం నిర్ణయించారు. వివిధ కారణాలతో రెగ్యులరైజేషన్ చేసుకోలేకపోయిన వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. -
నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం
నాగర్కర్నూల్: జిల్లాలో నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తానని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలకు చెందిన 27 మంది విద్యార్థులను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, డీఈఓ రమేష్కుమార్ గురువారం సాయంత్రం కలెక్టర్ చాంబర్లో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు త్వరలోనే ట్యాబులు అందజేస్తామని వెల్లడించారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 96.83 శాతం ఉత్తీర్ణతతో జిల్లాను రాష్ట్రస్థాయిలో 13వ స్థానంలో నిలబెట్టినందుకు విద్యా శాఖ, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల జీవితంలో తొలిమెట్టు అని, అత్యుత్తమ ప్రతిభతో అధిరోహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇకపై ఉన్నత విద్యను కూడా అదే స్థాయిలో అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి తమ జీవిత లక్ష్యాలను సాధించడానికి అవసరమైన వనరులు సమకూర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నోడల్ అధికారి కుర్మయ్య, సెక్టోరియల్ అధికారులు షర్ఫుద్దీన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి సీటీ స్కాన్
నాగర్కర్నూల్ క్రైం: జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాద బాధితులతోపాటు ఇతర రోగులకు అత్యవసరంగా అవసరమయ్యే సీటీ స్కాన్ సేవలు జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చాయి. ఏరియా ఆస్పత్రి నుంచి జిల్లా, జనరల్ ఆస్పత్రిగా అప్గ్రేడ్ కావడంతో ఇప్పటికే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. చాలారోజుల క్రితమే కొత్తగా సీటీ స్కాన్ మిషన్ను ఏర్పాటు చేసినప్పటికీ వాటి సేవలను ప్రారంభించలేదు. దీంతో రోగుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి ప్రత్యేక చొరవతో రోగులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 300 మందికి.. గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు చికిత్స చేయించేందుకు సీటీ స్కాన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్లలో రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు ఖర్చయ్యేది. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో మార్చి 20 నుంచి సీటీ స్కాన్ సేవలు ప్రారంభం కావడంతో రోగులకు ఆర్థిక భారం తప్పినట్లయ్యింది. ఇప్పటి వరకు 300 మంది వరకు ఉచితంగా సీటీ స్కాన్ సేవలు పొందారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ప్రస్తుతం రేడియాలజిస్టు అందుబాటులో లేకపోవడంతో జనరల్ ఆస్పత్రి ఎక్స్రే కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు సిబ్బందికి హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ అందించి సేవలు వినియోగించుకుంటున్నారు. సీటీ స్కాన్కు వచ్చే రోగులకు ముగ్గురు వైద్య సిబ్బంది మూడు షిప్టుల్లో సేవలు అందిస్తున్నారు. నారాయణగూడలోని ప్రివెంటివ్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్ కేంద్రం నుంచి టెలీ రేడియాలజిస్టు సేవలు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ను జనరల్ ఆస్పత్రిలోని సీటీ స్కాన్ యంత్రానికి అనుసంధానం చేశారు. వైద్యుల సూచన మేరకు ప్రమాదంలో గాయపడిన సిబ్బందితోపాటు ఇతర రోగులకు సాంకేతిక సిబ్బంది సీటీ స్కాన్ మిషన్లో ఫిలిం తీసిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేయడంతో నారాయణగూడలోని ప్రివెంటివ్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్లో విధులు నిర్వహిస్తున్న రేడియాలజిస్టుకు వెళ్తాయి. ఆయన సీటీ స్కాన్ రిపోర్టులను పూర్తిస్థాయిలో పరిశీలించి రెండు గంటల్లో జనరల్ ఆస్పత్రి వైద్యులకు పంపుతున్నారు. ఆయన సూచనల ఆధారంగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఉదయం 8 నుంచి 2 గంటల వరకు, 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ముగ్గురు సిబ్బంది షిఫ్టుల వారీగా విధుల్లో ఉండటంతో అందరికీ సేవలు అందుతున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులు, ఇతర రోగులకు ఎంతోమేలు రూ.5 వేల విలువైన స్కానింగ్ సేవలు ఇక ఉచితంగా.. టెలీ రేడియాలజిస్టు ద్వారా వైద్య పరీక్షలు రెండు గంటల్లోనే రిపోర్టు.. అత్యవసర రోగులతోపాటు క్షతగాత్రులకు సేవలు అందించేందుకు సీటీ స్కాన్ ప్రారంభించాం. ప్రతిరోజు 10 మంది వరకు సీటీ స్కాన్ సేవలు పొందుతున్నారు. శిక్షణ పొందిన వైద్య సిబ్బంది రోగులకు స్కాన్ చేసి హైదరాబాద్ నారాయణగూడలోని ప్రివెంటివ్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్ కేంద్రానికి పంపుతుండటంతో రెండు గంటల్లోనే రిపోర్టులను అందిస్తున్నారు. వీటి ఆధారంగా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాం. – రఘు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
విషాదం..ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి
నాగర్ కర్నూల్: జిల్లాలోని పెద్ద కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది పోతినేని చెరువులో ఈతకు దిగిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.సరదాగా స్నానం కోసమని వెళ్లిన ఆ చిన్నారులను పోతినేని చెరువు మింగేసింది. మృతి చెందిన చిన్నారులు గణేష్ రెడ్డి (13) రక్షిత (10) శ్రావణ్ (7) లుగా గుర్తించారు. ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో తీవ్ర విషాదచ్చాయలు అలుముకున్నాయి.చిన్నారులు గల్లైంతన తర్వాత సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ముగ్గురు మృతదేహాలను మాత్రమే చెరువు నుంచి బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.గతవారం అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో మొలకలచెరువు నలుగుర్ని మింగిసేన సంగతి తెలిసిందే. మొలకలచెరువు పెద్దచెరువు వద్ద తల్లిదండ్రులతో కలిసి బట్టలు ఉతకడానికి లావణ్య (12) నందకిషోర్ (10)లు అక్కడికి వచ్చారు. చెరువులో దిగుతుండగా మునిగిపోతున్న సమయంలో చిన్నారులు కేకలు వేశారు.అక్కడే ఉన్న లావణ్య తండ్రి మల్లేష్ చిన్నారులను రక్షించే క్రమంలో మునిగిపోయాడు. చిన్నారులు లావణ్య, నంద కిషోర్ లతో కలిసి పక్కంటి చిన్నారి నందిత(11) కూడా చెరువులో దిగి మునిగిపోయింది. -
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
కోడేరు: రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టం తీసుకొచ్చామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో భూ భారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూ భారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని.. ధరణిలో సాధ్యం కాని భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపా రు. కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, ఆర్వోఆర్ మార్పులు, చేర్పులు సులభమవుతుందన్నారు. రైతులు తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని చెప్పారు. 17 రాష్ట్రాల్లో నిపుణులు అధ్యయనం చేసి సమగ్ర అంశాలను పొందుపరుస్తూ రైతు ప్రయోజనాలేఽ ధ్యేయంగా భూ భారతి రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ విజయ్కుమార్, మాజీ ఎంపీపీ కొత్తరామ్మోహన్రావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులు న్యాయంగా పరిష్కరించాలి.. కొల్లాపూర్ రూరల్: రైతుల భూ సమస్యలను రెవెన్యూ అధికారులు న్యాయంగా పరిష్కరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని, రైతులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత చట్టంతో రైతుల సమస్యలకు 30 రోజుల్లో పరిష్కారం దొరుకుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ విష్ణువర్ధన్రావు, మాజీ సర్పంచ్లు మేకల నాగరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హనుమంత్నాయక్, మాజీ కౌన్సిలర్లు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
ప్రజల అభీష్టం మేరకే కొత్త చట్టం
సాక్షి, నాగర్కర్నూల్: సుదీర్ఘకాలం పాటు ప్రజలతో క్షేత్రస్థాయిలో సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే భూభారతి చట్టాన్ని తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ధరణి పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రెవెన్యూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిప్పుకుందని.. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో చాలా వరకు భూ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిరుద్యోగ యువతకు రాజీవ్యువ వికాసం కింద స్వయం ఉపాధి పథకాలు, పేదలకు సన్నబియ్యం పంపిణీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు చట్టసభలో తీర్మాణం తదితర చారిత్రాత్మక పనులను చేపట్టామని అన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వివిధ సంస్థల సీఎస్సార్ ఫండ్స్ ద్వారా పెద్ద ఎత్తున యువతకు స్కిల్ డెవలప్మెంట్, స్వయం ఉపాధి పథకాల యూనిట్లను ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు. కాంగ్రెస్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్, నిజాం, కోటయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
పది స్థానం మెరుగు
టెన్త్ ఫలితాల్లో 96.83 శాతం ఉత్తీర్ణత ● 23 నుంచి 13వ స్థానానికి చేరిన జిల్లా స్థానం ● బాలికలదే పైచేయి.. ●కందనూలు: పదోతరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బుధవారం విడుదలైన ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పై చేయి సాధించారు. జిల్లావ్యాప్తంగా 10,530 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 10,196 మంది పాసవ్వగా.. 96.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 5,230 మంది బాలురుల్లో 5,013 మంది, 5,300 మంది బాలికల్లో 5,183 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 95.85 శాతం, బాలికలు 97.79 శాతం ఉత్తీర్ణులయ్యారు. పెరిగిన ర్యాంకు.. 2023–24 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 91.57 ఉండగా.. 2024–25లో 96.83 శాతానికి చేరింది. అంటే 5 శాతం మెరుగుపడింది. గతేడాది రాష్ట్రంలో 23వ స్థానం ఉండగా.. ఈసారి 13వ స్థానానికి చేరింది. విద్యా విద్యార్థుల పాసైంది ఉత్తీర్ణత ర్యాంకు సంవత్సరం సంఖ్య శాతం 2021–22 10,937 10,171 93.34 16 2022–23 10,545 9,582 90.87 12 2023–24 10,507 9,621 91.57 23 2024–25 10,530 10,196 96.83 13 ఫలితాలు సంతృప్తికరం.. పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 13వ స్థానంలో నిలిచింది. గతేడాది 23వ స్థానంలో ఉండగా ఈసారి 10 స్థానాలు పైకి చేరింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేక తరగతులు, నిత్యం పరీక్షల నిర్వహణతోనే సాధ్యమైంది. – రమేష్కుమార్, జిల్లా విద్యాధికారి -
సంస్కృతి, సంప్రదాయాలు ఆచరించాలి
అచ్చంపేట/అచ్చంపేట రూరల్: భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ఎంతో శ్రేష్టమైనవని హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి అన్నారు. బుధవారం అచ్చంపేటలో బొడ్రాయి (నాభిశిల), పోచమ్మ ఆలయ పునః నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. పురాతన బొడ్రాయిని జీర్ణోద్ధారణ చేసి భ్రమరాంబ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. ఆచార వ్యవహారాలతో పాటు ధర్మబద్ధమైన నియమాలతో జీవనాన్ని కొనసాగించాలని, పాశ్ఛాత్య సంస్కృతిని విడనాడాలని సూచించారు. నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల నిర్వహణ
స.హ.చట్టంపై అవగాహన సమాచార హక్కు చట్టం, గ్రామసభ నిర్మాణ సారథ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు దేవసహాయం అన్నారు. సహచట్టం, గ్రామసభ నిర్మాణ సామర్థ్యంపై పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాలను అభివృద్ధిపరచడంలో పంచాయతీ కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషిస్తారని, కాబట్టి వీరంతా ఆయా అంశాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఇద్దరు చొప్పున పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సహచట్టం, గ్రామసభల నిర్మాణ సామర్థ్యంపై ఏడాది పొడవునా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీపీఓ రామ్మోహన్రావు, రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ హన్మంతు, రీసోర్స్పర్సన్స్ కృష్ణ, కోటేశ్వరరావు, నర్సిరెడ్డి పాల్గొన్నారు. నాగర్కర్నూల్: భూగర్భ జలాలు పెంపొందించడానికి, ఇంకుడు గుంతల నిర్మాణం అత్యంత ఆవశ్యకమైందని, నీటి అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్ తరాలకు నీటిని అందించడానికి నీటి కొరతను నివారించడానికి ఉపయోగపడుతుందని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఆయా శాఖల అధికారులతో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఆఖరు నాటికి అన్ని గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ మోడల్గా మార్చాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని, మురుగు నిల్వ ఉండే చోటు గుర్తించి ఇంకుడు గుంతలు నిర్మించాలని, గ్రామాల్లో శుభ్రత పాటించాలని పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలని చెప్పారు. గ్రామీణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. జిల్లా, గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య మిషన్ కమిటీ ప్రతినెల సమావేశాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేసు, డీపీఓ రాంమోహన్రావు, డీఈఓ రమేష్కుమార్, డీఏఓ చంద్రశేఖర్, డీడబ్ల్యూ ఓ రాజేశ్వరి, డీటీడబ్ల్యూఓ ఫిరంగి పాల్గొన్నారు. -
‘మల్లమ్మకుంట’పై నీలినీడలు..!
రిజర్వాయర్కు గ్రీన్సిగ్నల్.. అంతలోనే.. రిజర్వాయర్లు నిర్మిస్తే తప్ప పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు మొరపెట్టుకున్నారు. స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రిజర్వాయర్లలో రూ.520 కోట్ల వ్యయంతో 1.2 టీఎంసీల సామర్థ్యంతో మల్లమ్మకుంట నిర్మాణానికి మాత్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తుమ్మిళ్ల లిఫ్ట్లో కీలకమైన ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు చేపట్టిన భూసర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. మొత్తం 567 ఎకరాలు అవసరమని అధికారులు నివేదికలు రూ పొందించారు. పెగ్ మార్కింగ్ పనులు నిర్వహిస్తున్న క్రమంలో రైతులు అడ్డుకున్నారు. పూర్తి నష్టపరిహారం ఇచ్చి.. న్యాయం చేశాకే పనులు మొదలుపెట్టాలని ఆందోళనలకు దిగారు. ● ఈ నేపథ్యంలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి కలెక్టర్కు లేఖ రాయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం వల్ల 250 మంది దళిత రైతులు భూములు కోల్పోతారని.. దాన్ని రద్దు చేయాలని ఆయన గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్కు లేఖ రాయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ మేరకు ఆయన నీటిపారుదల శాఖ ఎస్ఈకి లేఖ రాయడం.. ఆ అధికారి పైఅధికారికి నివేదికలు సమర్పించడం.. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం హాట్టాపిక్గా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్పై నీలినీడలు కమ్ముకోగా.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజోళిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్).. దశాబ్దాల కాలంగా నీటి వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ, కర్ణాటక మధ్య నీటి వాటాల స్థిరీకరణతోపాటు తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపుల్లో వివక్షపై జగడాలు కొనసాగాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇదే కీలకాంశంగా మారగా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సైతం మునుపటి పరిస్థితులే నెలకొన్నాయి. ప్రస్తుతం మూడు రాష్ట్రాల సమస్యగా మారింది. ఇది ఒకవైపు కాగా.. మరోవైపు తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా వెనుకబడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని ఆర్డీఎస్ ఆయకట్టును పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేయాలనే లక్ష్యం మాటలకే పరిమితమైంది. ఈ ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించాల్సిన రిజర్వాయర్లపై ఏళ్ల తరబడి సందిగ్ధత వీడకపోవడం.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త ప్రతిపాదనలు తెరపైకి రావడం వంటి కారణాలు అనిశ్చితికి కారణమవుతున్నాయి. సరైన ప్రణాళిక లేమి.. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం వెరసి మల్లమ్మకుంట రిజర్వాయర్పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ పేరుకే 87,500 ఎకరాలు.. నిజాం కాలంలో కర్ణాటక పరిధిలోని రాజోళిబండ సమీపంలో తుంగభద్రపై ఆనకట్ట నిర్మించిన విషయం తెలిసిందే. తెలంగాణకు సంబంధించి నడిగడ్డ ప్రాంతంలో 87,500 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఆనకట్ట ఎడమవైపున 143 కిలోమీటర్ల కాల్వ (ఆర్డీఎస్ కెనాల్) నిర్మాణం పూర్తి చేశారు. అయితే 20 ఏళ్లుగా ఏనాడూ పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందలేదు. పంటలు సాగుచేయడం.. నీరందక అవి ఎండిపోవడం.. రైతులు నష్టాల పాలవడం పరిపాటిగా మారింది. కనీసం 30 వేల ఎకరాలకు నీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆర్డీఎస్ ఆయకట్టును పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం 2017లో తుమ్మిళ్ల లిఫ్ట్తో పాటు ఇటిక్యాల మండలం వల్లూరు, వడ్డేపల్లి మండలం జూలకల్, తనగల వద్ద మల్లమ్మకుంట వద్ద మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన ఫేస్–1, 2 పనులకు జీఓ 429 జారీ చేసింది. 9.6 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట్టి.. తనగల సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 23 వద్ద డెలివరీ సిస్టమ్ ద్వారా తుంగభద్రలోని నీటిని తోడి ఆర్డీఎస్ కెనాల్కు మళ్లించేందుకు శ్రీకారం చుట్టింది. ఏడాది లోపే తుమ్మిళ్ల లిఫ్ట్ను రూ.190 కోట్లతో ఏర్పాటు చేసి.. కెనాల్కు నీటిని పంపింగ్ చేశారు. కానీ రిజర్వాయర్ల నిర్మాణం అటకెక్కింది. రిజర్వాయర్ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు కలెక్టర్కు నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి లేఖతో దుమారం అలంపూర్ పరిధిలోని ఆయకట్టు రైతుల్లో ఆందోళన చిన్నోనిపల్లి, ఆర్డీఎస్కు లింక్ అంటూ తెరపైకి కొత్త ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్న అన్నదాతలు.. కాంగ్రెస్లో భిన్నస్వరాలు -
ఆయిల్పాం కష్టాలు తీరేనా!
త్వరలో ఇబ్బందులు తీరుతాయి.. ఆయిల్ఫెడ్ జీఎం అందించిన సమాచారం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద 95 ఎకరాల్లో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 40 ఎకరాల్లో ఆయిల్పాం పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు స్థలం సేకరణలో దాదాపు కొలిక్కి వచ్చింది. మరో కొన్ని నెలల్లో రైతులు స్థానికంగానే పంటను విక్రయించవచ్చు. – సమీనా బేగం, ఆయిల్ఫెడ్ ఇన్చార్జి, నారాయణపేట నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ లేకపోవడంతో రైతులు పంటను విక్రయించేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. – 2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతులు ఆయిల్పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారులు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్పాం గెలలను తరలించాల్సి వస్తోంది. పరిశ్రమలు ఉంటేనే ప్రయోజనం.. పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు. కాగా.. ఇటీవల నారాయణపేట జిల్లాలో ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం కోతలు ప్రారంభం పంట విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే.. స్థానికంగా ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉంటేనే రైతులకు ప్రయోజనం -
ఉగ్రవాదాన్ని నిర్మూలించి దేశ ఐక్యత చాటాలి
కందనూలు: ఉగ్రవాదాన్ని నిర్మూలించి దేశ ఐక్యతను చాటాలని కవులు, రచయితలు తమ కవితల ద్వారా నిరసన గళాన్ని వినిపించారు. జమ్ముకాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రముఖ కవి గుడిపల్లి నిరంజన్ అధ్యక్షతన ‘ఉగ్రవాదం నశించాలని’ అంశంపై కవులు, రచయితలు తమ కవితలు చదివారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించి, దేశ ఐక్యత చాటాలని, అన్ని మతాల మధ్య మతసామరస్యం పెంపొందించాలని ఆకాంక్షించారు. అలాగే మతాల మధ్య విద్వేషం కాకుండా సామరస్య పూరిత వాతావరణం నెలకొనాలని, లౌకిక ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ విలువలు ప్రతి పౌరుడు పాటించాలని కవులు తమ కవితల ద్వారా పాటల రూపంలో తెలియజేశారు. సరిహద్దులో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఇలాంటి తీవ్రవాద చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో కవులు, రచయితలు ముచ్చర్ల దినకర్, ఎదిరేపల్లి కాశన్న, కందికొండ మోహన్, కొంగరి జానయ్య, సోమశిల సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోనే ఉన్నత శిఖరాలకు..
నాగర్కర్నూల్ క్రైం: విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి నసీం సుల్తానా కోరారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని కొల్లాపూర్ క్రాస్రోడ్లో ఉన్న జ్ఞానేశ్వర వాత్సల్య మందిరం అనాథ ఆశ్రమాన్ని ఆమె సందర్శించి నిర్వాహకులతో మాట్లాడి మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రతి చిన్నారితో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలుంటే న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు మధుసూదన్రావు, శ్రీరామ్ ఆర్య, పవనశేషసాయి తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలు పరిరక్షించాలి : ఎమ్మెల్యే
అచ్చంపేట రూరల్: నియోజకవర్గంలో శాంతిభద్రతలు పరిరక్షించాలని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ కోరారు. సోమవారం పట్టణంలో పోలీసు అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ కుట్రలను సహించేది లేదని, పోలీస్స్టేషన్కు వచ్చే సామాన్యులకు న్యాయం చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పట్టణంలో ప్రతిష్టాత్మకమైన నిర్వహించే బొడ్రాయి పండుగకు భద్రతా చర్యలపై సమీక్షించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్ఐలు రమేశ్, పవన్కుమార్, వెంకట్రెడ్డి, ఇందిర పాల్గొన్నారు. -
భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి
తిమ్మాజిపేట: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం ప్రకారం భూముల రికార్డులు క్రమబద్దీకరించేందుకు త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ఇన్చార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో భూ భారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూ భారతి చట్టంలో తహసీల్దార్కు సమస్య పరిష్కరించే అధికారం ఉందని.. ఆయన పరిష్కరించకుంటే ఆర్డీఓ, కలెక్టర్, కమిషనర్ వరకు వెళ్లవచ్చన్నారు. 30 రోజుల్లో సమస్య పరిష్కారంగాకపోతే ఆన్లైన్లోనే రికార్డు వస్తుందని తెలిపారు. త్వరలోనే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని.. అవసరమైన ధ్రువపత్రాలు అధికారులకు చూపించాలన్నారు. ఇప్పటి వరకు అక్రమంగా ఉన్న పట్టాలను రద్దు చేస్తామని చెప్పారు. అంతకుముందు అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ నరేష్ చట్టం గురించి సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణయ్య, డీటీ జ్యోతి, ఆర్ఐలు రవిచంద్ర, హారిక, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. రికార్డులను క్రమబద్ధీకరించేందుకే రెవెన్యూ సదస్సులు ఇన్చార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి -
భూ సమస్యల పరిష్కారానికే..
బిజినేపల్లి: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్ పి.అమరేందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జూన్ 2 నుంచి గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల భూ సమస్యలు పరిష్కారం చేస్తారని.. రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాలకు వస్తారన్నారు. ఽగ్రామసభల నిర్వహణ తేదీలను ముందుగానే గ్రామ ప్రజలకు చాటింపు ద్వారా తెలియజేస్తారని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరించడానికి ఇదో సరైన సమయమని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ శ్రీరాములు, ఉప తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ కతలప్ప, ఏఓ నీతి, రైతులు పాల్గొన్నారు. భూ భారతితో సమస్యలు పరిష్కారం.. తెలకపల్లి: భూ భారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం భూముల ధరలు పెరగడంతో గ్రామాల్లో భూ సమస్యలు పెరిగాయని.. రైతులు ఏ సమస్యలున్నా ముందుగా తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటే పరిష్కరిస్తారని, అక్కడ పరిష్కారంగాకపోతే ఆర్డీఓ, కలెక్టర్స్థాయిలో పరిష్కరిస్తారని చెప్పారు. త్వరలో గ్రామ పాలన అధికారులను నియమిస్తామని తెలిపారు. రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, సింగిల్విండో వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ చిన్నజంగయ్య, తహసీల్దార్ జాకీర్ అలీ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు -
ప్రజావాణికి 21 వినతులు
నాగర్కర్నూల్: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 21 వినతులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ వినతులు స్వీకరించి ఆయా విభాగాల సిఫారస్ చేసి మాట్లాడారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. ప్రజల వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీసు ప్రజావాణికి 12.. నాగర్కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 12 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించి 4, భార్యాభర్తల గొడవలకు సంబంధించి ఒకటి, వేర్వేరు ఫిర్యాదులు 7 వచ్చినట్లు వివరించారు. నేడు మద్యం బార్ల కేటాయింపు నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని అచ్చంపేటలో లైసెన్స్ రెన్యూవల్ కాని రెండు మద్యం బార్ల స్థానంలో కొత్త వాటి ఏర్పాటుకు 18 దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సమక్షంలో లాటరీ విధానంలో కొత్త వారిని ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 10 గంటలలోగా వారికి కేటాయించిన ఎంట్రీ పాసులు తీసుకొని హాజరుకావాలని పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: హైదరాబాద్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో 2025–26 విద్యాసంవత్సరానికిగాను పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి పూర్తి చేసిన అనాథ బాలికలు, ఎలాంటి ఆధారం లేని బాలికలు మాత్రమే అర్హులని.. ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి బాలరక్షా భవన్, రూం.నం. 308, పాత కలెక్టర్ కార్యాలయం, నాగర్కర్నూల్లో మే 17లోగా అందజేయాలని సూచించారు. కాంగ్రెస్లో సంస్థాగత నియామకాల సందడి స్టేషన్ మహబూబ్నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఎన్నికలలోపే మండల, బ్లాక్, డీసీసీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాల ఎంపిక కోసం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఇటీవలే జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా పీసీసీ పరిశీలకులను నియమించింది. మహబూబ్నగర్ జిల్లాకు దొమ్మాటి సాంబయ్య, గజ్జి భాస్కర్యాదవ్లను పీసీసీ పరిశీలకులుగా నియామకం చేసింది. ఈ మేరకు పీసీసీ పరిశీలకుల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పీసీసీ, డీసీసీ కార్యవర్గంతోపాటు మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాజరుకానున్నారు. మండల, బ్లాక్ కాంగ్రెస్, డీసీసీ కార్యవర్గం నియామకంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించి సంస్థాగత నియామకాల కోసం వచ్చేనెల 4 నుంచి 10 వరకు నియోజకవర్గ స్థాయిలో, 13 నుంచి 20 వరకు మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. మండల స్థాయిలో ఐదుగురు, బ్లాక్ కాంగ్రెస్కు నలుగురు, డీసీసీ అధ్యక్షుడికి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను టీపీసీసీకి నివేదించనున్నారు. వచ్చే నెల చివరి వారంలో మండల, బ్లాక్ కాంగ్రెస్, డీసీసీ అధ్యక్షుల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. -
డీసీసీబీ రుణ లక్ష్యం రూ.600 కోట్లు
ఉప్పునుంతల: ఈ ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ ద్వారా రూ.600 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పీఏసీఎస్లో చైర్మన్ సత్తు భూపాల్రావుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంఘ సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందజేసి రైతులకు పంట, ఇతర రుణాలు అందించేలా చూడాలని సూచించారు. అలాగే స్థానిక పీఏసీఎస్లో సాఫ్ట్వేర్ సమస్యలతో ఓటీఎస్ ద్వారా రైతుల నుంచి కొంత అధికంగా రుణ బకాయిలు వసూలు చేశామని.. జరిగిన పొరపాటును సరిచూసుకున్న వెంటనే వసూలు చేసిన ఎక్కువ డబ్బులను మార్చిలోనే తిరిగి వారి సొంత ఖాతాలో జమ చేశామని, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని వివరించారు. నాబార్డ్, టెస్కాబ్ రుణాలు పొందాలంటే రుణ రికవరీ శాతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం డీసీసీబీకి రూ.21 కోట్లు నష్టం వాటిల్లినా.. ఓటీఎస్ ద్వారా మొండి బకాయిలు వసూలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 78 సహకార పరపతి సంఘాల్లో 39 సంఘాలు మాత్రమే 50 శాతం మేర రుణాలను రికవరీ చేసేవని.. ఓటీఎస్తో మరో 16 సంఘాలు రుణ రికవరీ శాతం 50 శాతం దాటిందని వివరించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తం, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు పాల్గొన్నారు. -
ధరణి ఆపరేటర్లకు 14 నెలలుగా అందని జీతాలు
● ఏజెన్సీ రద్దుతో టీజీటీఎస్కు అటాచ్ ● ప్రభుత్వ ఆదేశాలు అందక ఆగిన వైనం ● జిల్లాలో 23 మంది.. నాగర్కర్నూల్: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ధరణి ఆపరేటర్లకు 14 నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే అరకొర జీతాలు.. అందులో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అవికూడా సకాలంలో అందడం లేదు. సమస్యను పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నా.. ప్రభుత్వం మాత్రం దృష్టి సారించడం లేదని చెబుతున్నారు. జిల్లాకు వచ్చే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా కూడా ఫలితం లేకపోయింది. 2018లో విధుల్లోకి .. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చి అన్ని మండలాల తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా నియమించింది. ఇందుకోసం తహసీల్దార్ కార్యాలయంలో గదిని ఏర్పాటుచేసి భూ రిజిస్ట్రేషన్ల కోసం ధరణి ఆపరేటర్లను నియమించింది. జిల్లాలో 23 మందిని ఆపరేటర్లుగా నియమించగా.. సుమారు ఆరేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రారంభంలో రూ.10 వేలు వేతనం చెల్లిస్తుండగా.. ప్రస్తుతం రూ.12,500 చెల్లిస్తున్నారు. మిగతా వారితో పోలిస్తే వీరి జీతాలు చాలా తక్కువే.. ప్రస్తుతం అవి కూడా సకాలంలో అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. టీజీటీఎస్కు అనుసంధానం.. మొదట వీరిని విధుల్లోకి తీసుకున్నప్పుడు ‘టెరాసిస్’ అనే ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లించేవారు. గతేడాది జనవరిలో ఏజెన్సీ కాంట్రాక్ట్ గడువు ముగియగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గడువు పెంచకుండా నిలుపుదల చేసింది. అంతేగాకుండా ఆపరేటర్లను తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ సర్వీసెస్(టీజీటీఎస్)కు అనుసంధానం చేసి ఆ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ధరణి ఆపరేటర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. టీజీటీఎస్కు అనసంధానం చేయడంతో ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆశపడినా.. కనీసం వేతనాలు కూడా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపకపోవడంతో ఇప్పట్లో వేతనాలు అందుతాయన్న నమ్మకం కూడా కలగడం లేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విషయానికొస్తే 23 మంది ఆపరేటర్లు దాదాపు 14 నెలలుగా వేతనాల కోసం వేచి చూస్తున్నారు. కేవలం జిల్లాకే రూ.40 లక్షల వరకు రావాల్సి ఉంది. పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ధరణి ఆపరేటర్ (ఫైల్)ఇబ్బందులు పడుతున్నాం.. ప్రభుత్వం నుంచి మాకు వచ్చే జీతమే తక్కువ. అరకొర వేతనాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాం. కానీ ప్రస్తుతం ఆ జీతం కూడా సకాలంలో రావడం లేదు. గతేడాది ఫిబ్రవరి నుంచి వేతనాలు అందాల్సి ఉంది. తప్పని పరిస్థితుల్లో ఆపరేటర్లు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ విషయంపై చొరవ చూపాలి. – రాంబాబు, జిల్లా అధ్యక్షుడు, ధరణి ఆపరేటర్స్ అసోసియేషన్ -
స్పందన అంతంతే..
ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ముందుకు రాని ప్లాట్ల యజమానులు ●సద్వినియోగం చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్స్ అందజేస్తున్నాం. 25 శాతం రాయితీ గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే దరఖాస్తుదారులకు లెటర్లు పంపించడం, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట అచ్చంపేట పట్టణ వ్యూ అచ్చంపేట: అనధికార లే–అవుట్లోని స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించి గడువు పెంచినా మున్సిపాలిటీల్లో లక్ష్యం నెరవేరలేదు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట మార్చి 31 నాటికి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఈ నెల 30 వరకు మరోసారి గడువు పొడిగించింది. కాగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 మున్సిపాలిటీల్లో సోమవారం వరకు 32,781 దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం రుసుం చెల్లించడంతో ప్రభుత్వానికి రూ.55.38 కోట్ల ఆదాయం సమకూరింది. 25 శాతం రాయితీతో.. 2020 ఆగస్టు 31 నాటికి ఉన్న అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే వివిధ కారణాలతో దరఖాస్తుదారులకు అనుమతులు మంజూరు చేసే ప్రక్రియలో ఆలస్యం కావడంతో ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందులో కొన్ని నిబంధనలు చేర్చింది. దీని ప్రకారం 2025 మార్చి 31లోగా క్రమబద్ధీకరణ చార్జీలు, ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ కల్పిస్తూ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే పెద్దగా స్పందన రాకపోవడంతో 25 శాతం రాయితీ గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది. మొత్తం దరఖాస్తులు 1,95,963 ఆమోదించినవి 1,40,299 రుసుం చెల్లించినవి 32,781 క్రమబద్ధీకరించినవి 13,765 ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.58.38 కోట్లు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా ఇలా.. మున్సిపాలిటీ మొత్తం ఆ.వి రుసుం క్ర .వి సమకూరిన దరఖాస్తులు చెల్లించినవి ఆదాయం (రూ.కోట్లలో) నాగర్కర్నూల్ 16,158 10,782 2,588 1,522 4.20 కల్వకుర్తి 11,482 9,491 1,936 806 4.11 అచ్చంపేట 12,045 10,765 1,765 94 2.53 కొల్లాపూర్ 4,595 3,718 662 238 1.17 అలంపూర్ 431 366 121 61 0.15 వడ్డేపల్లి 1,941 1,787 355 279 0.68 అయిజ 9,845 5,244 1,074 652 1.34 గద్వాల 14,387 4,000 1,700 848 2.74 జడ్చర్ల 17,684 11,070 2,597 819 5.68 మహబూబ్నగర్ 31,438 22,183 6,817 2,160 15.62 భూత్పూర్ 6,119 4,703 1,260 590 2.12 పెబ్బేరు 7,306 6,484 1,443 391 1.74 కొత్తకోట 7,582 7,318 1,284 648 1.50 ఆత్మకూర్ 3,812 3,150 731 623 0.86 అమరచింత 447 333 162 121 0.51 వనపర్తి 29,072 25,820 4,693 2,499 5.80 మక్తల్ 10,577 9,062 1,170 563 2.15 కోస్గి 3,982 1,987 904 135 1.81 నారాయణపేట 7,060 2,036 1,519 707 3.67 ఆ.వి: ఆమోదించినవి క్ర .వి: క్రమబద్ధీకరించినవి 25 శాతం రాయితీ ఇచ్చి గడువు పెంచినా నెరవేరని లక్ష్యం ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అదే పరిస్థితి విస్తృతంగా ప్రచారం కల్పించినా కనిపించని ఫలితం మరో రెండు రోజులే అవకాశం విస్తృతంగా ప్రచారం.. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ కల్పించిన ప్రభుత్వం వందశాతం లక్ష్యం నెరవేర్చాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఈ పథకంపై అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారులు సామాజిక, ప్రసార మాధ్యమాలు, ఇతర విభాగాల ద్వారా అవగాహన కల్పించినప్పటికీ దరఖాస్తుదారులు పెద్దగా ముందుకు రాలేరు. సోమవారం వరకు క్రమబద్ధీకరణకు 32,781 మంది దరఖాస్తుదారులు రుసుం చెల్లించగా 13,765 మందికి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు 55,664 దరఖాస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో సంబంధిత దరఖాస్తుదారులు వాటిని సరి చేయాలంటూ ఆయా శాఖల అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక కారణాలతో నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, సంబంధిత స్థలాల ఆధారాలు అందిస్తేనే వాటిని సరి చేస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. అయితే 25 శాతం రాయితీ గడువుకు బుధవారం (ఈ నెల 30) వరకు మాత్రమే గడువు ఉండటంతో ఎంత మేరకు లక్ష్యం చేరుకుంటారో వేచి చూడాల్సిందే. -
ఒత్తిళ్లకు తలొగ్గి..
ప్రైవేట్ కళాశాలల సూచనలతో డిగ్రీ సెమిష్టర్ పరీక్షలు వాయిదా ఇబ్బందులు రానివ్వం.. ప్రైవేటు కళాశాలలకు ఎట్టి పరిస్థితిలోనూ ర్యాటిఫికేషన్, అప్లియేషన్ ఇన్స్పెక్షన్ చేపడతాం. వీటికోసం ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. అలా చేస్తేనే దోస్త్లో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సమస్యలు ఉన్న కారణంగా వాయిదా వే సిన పరీక్షలను వచ్చేనెలలో నిర్వహిస్తాం. వి ద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ ప్రకారమే.. అసలు యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఎందుకు తలొగ్గి.. పరీక్షలు వాయిదా వేశారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి. అలాగే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలి. – రాము, యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఉద్యమం చేపడుతాం.. ప్రైవేటు కళాశాలలకు రీయింబర్స్మెంట్ రాకుంటే పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నష్టం చేస్తారా.? పీయూ అధికారుల ఈ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులు మెరుగుపడాలంటే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటివి చేపట్టాల్సిందే. పీయూ అధికారులు తీరు మార్చుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతాం. – నాగేష్, యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వింత ధోరణి నడుస్తోంది. ప్రైవేట్ కళాశాలలను నియంత్రించాల్సిన యూనివర్సిటీ అధికారులు.. ఏకంగా వారి ఒత్తిళ్లకే తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు 2, 4, 6 నిర్వహిస్తున్నట్లు గతంలో సర్క్యులర్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ విడుదల చేయగా.. ఈ నెల 25న వాటిని వాయిదా వేస్తున్నట్లు మరో సర్క్యులర్ జారీ చేశారు. దీనికి కారణం ‘ప్రైవేట్ కళాశాలల విజ్ఞప్తి మేరకు’ మాత్రమే వాయిదా వేసినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. సాధారణంగా పరీక్షలు వాయిదా వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పోటీ పరీక్షలు, సెలవుల దృష్ట్యా మాత్రమే వాయిదా వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్లతో వాయిదా వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. విద్యార్థులకు తీవ్రనష్టం.. పీయూ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ తదితర అన్ని కళాశాలలు కలిపి 102 ఉండగా.. వీటిలో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పీజీలో పీజీ సెట్, లా సెట్, ఎంబీఏ వంటి కోర్సులలో ప్రవేశాలకు విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంది. ఎంట్రెన్స్లకు చదివేందుకు కనీసం 15 రోజుల సమయం కూడా సరిపోదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఫలితాలు, మెమోల జారీ వంటి ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని.. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని వాపోతున్నారు. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాయిదా వేసిన డిగ్రీ పరీక్షలను అధికారులు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నారు. 9 రోజులపాటు నిలిపివేయడంతో పీజీసెట్, లాసెట్పై ప్రభావం అప్లియేషన్, ర్యాటిఫికేషన్ ప్రక్రియపై పట్టింపులేని వైఖరి ఆదేశాలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలు పీయూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు -
నిబంధనలకు పాతర..!
జిల్లాలో అధ్వానంగా హోటళ్ల నిర్వహణ ● అపరిశుభ్రంగా వంట గదులు, పరిసరాలు ● కల్తీ సరుకులు, నూనెలు ● నామమాత్రపు దాడులతో సరిపెడుతున్న అధికారులు అచ్చంపేట రూరల్: ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని ప్రభుత్వం వైద్య, పంచాయతీ అధికారులు, కొందరు స్థానికులతో కలిపి ఆహార కమిటీలను నియమించింది. సభ్యులు హోటళ్లు, ఆహార పదార్థాలు విక్రయిస్తున్న కేంద్రాలను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. కానీ నామమాత్రపు తనిఖీలు చేపడుతుండటంతో జిల్లాలో హోటళ్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా శుభ్రతను పాటించకుండా వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా హోటళ్లు, టిఫిన్ సెంటర్ల ఏర్పాటు.. జిల్లాలోని అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంత్లాలో భోజన ప్రియులను ఆకర్షించేలా హోటళ్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లు వెలుస్తున్నాయి. నిర్వాహకులు వాటిని అందంగా తీర్చిదిద్దడానికి ఇస్తున్న ప్రాధాన్యత.. ఆహార నాణ్యతలో పాటించడం లేదు. తయారీలో వినియోగించే సరుకులు, నూనెలు, ఇతర సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి. ప్రారంభంలో నాణ్యతగా పాటించి రానురాను తగ్గిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వంట గదులు ఇరుకుగా ఉండటంతో కుప్పలు కుప్పలుగా ఈగలు, బొద్దింకలు సంచరిస్తుంటాయి. కల్తీ పదార్థాలు తిని అనేక మంది రోగాలబారిన పడుతున్నారు. బోటీ కర్రీలో ఎలుక.. అచ్చంపేటలోని ఓ హోటల్లో వినియోగదారుడు శుక్రవారం సాయంత్రం బోటీ కర్రీని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. భోజన సమయంలో తెరిచి చూడగా అందులో ఎలుక కనిపించింది. పార్సిల్ను తీసుకొని హోటల్ నిర్వాహకుడిని నిలదీయడంతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్కు ఫిర్యాదు చేశారు. శనివారం ఆ హోటల్తో పాటు మరో హోటల్ను తనిఖీ చేసి నమూనాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని పలు హోటళ్లలో జరుగుతున్నా.. కొందరు మేనేజ్ చేసుకొని నడిపిస్తున్నారు. వంట గదులు అపరిశుభ్రంగా ఉండటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆహార పదార్థాల్లో బొద్దింకలు, బల్లులు పడిన ఘటనలూ ఉన్నాయి. ఫ్రిజ్లలో మాంసాన్ని నిల్వచేసి అవసరం ఉన్న సమయంలో కూరలు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కేసులు నమోదు చేస్తాం.. జిల్లాలోని హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. బేకరీల్లో ఆహార పదార్థాలు నిల్వ చేయొద్దు.. ఏ రోజుకారోజు తయారుచేసి విక్రయించాలి. పలు హోటళ్లల్లో తనిఖీలు చేసి నమూనాలు సేకరించాం. నిబంధనలు పాటించని హోటళ్లను మూసి వేయిస్తాం. – మనోజ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ -
‘వక్ఫ్ చట్టం సవరణతో పేద ముస్లింలకు మేలు’
కందనూలు: ప్రధాని మోదీ తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంతో పేద ముస్లింలకు మేలు చేకూరుతుందని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అఫ్సరపాషా అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వక్ఫ్ బోర్డుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేద ముస్లింకు ఈ చట్టం ఉపయోగపడలేదని, ఏళ్లుగా ఈ ఆస్తులు బడా బాబులకు మాత్రమే చెందాయని, కొత్త చట్టంతో దోపిడీని అరికట్టే అవకాశం వచ్చిందన్నారు. నరేంద్రమోదీ ముస్లింలకు చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని.. ముస్లిం సమాజం నమ్మవద్దని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, మైనార్టీి మోర్చా జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సుబ్బారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గప్రసాద్, మాయని శ్రీశైలం, సుధాకర్రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్చారి, మహిళా నాయకురాలు పద్మ, చంద్రకళ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.నాయినోనిపల్లికి తగ్గిన రద్దీ పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కేవలం 5 వేల మంది భక్తులు మాత్రమే వచ్చారని ఆలయ ట్రస్ట్ చైర్మన్ తెలిపారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి కందనూలు: విద్యార్థులు ఉత్తమ చదువుతో ఉన్నత స్థానానికి ఎదగాలని విశ్రాంత డీజీపీ డా. పుట్టపాగ రవీంద్రనాథ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించి పుట్టపాగ మహేంద్రనాథ్ స్మారక విద్యా పురస్కారాలు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన పేద విద్యార్థులు మంచి మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. తన తండ్రి మహేంద్రనాథ్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, ఐక్యత సమాజ సంస్థ ప్రతినిధులు కళ్యాణం నర్సింహ, భగవేణి నర్సింహులు, బాలరాజు, డా. రాఘవులు, న్యాయవాది రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హిందువులు చైతన్యం కావాలి తిమ్మాజిపేట: మారుమూల గ్రామాల్లోని హిందువులు సైతం చైతన్యం కావాల్సిన అవరం ఉందని విశ్రాంత ప్రొఫెసర్ హన్మంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని అప్పాజిపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కశ్మీర్లో జరిగిన మారణకాండ ప్రజలను ఆందోళనకు గురి చేసిందని.. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు పర్యాటకులను చంపి పర్యాటకరంగాన్ని నీరుగార్చాలని చూశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉండటంతో పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని తెలిపారు. ఐక్యమత్యం లేకపోవడంతో కలిగే నష్టాలు, కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం స్థానికులతో కలిసి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భిక్షపతి, నారాయణ, నర్సింహ, చంద్రయ్య, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చలో వరంగల్..
బీఆర్ఎస్ శ్రేణుల్లో రజతోత్సవ సందడి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘గులాబీ’ శ్రేణుల్లో రజతోత్సవ సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభను ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ జనసమీకరణకు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు.. తాము రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. నేడు ఊరూరా పార్టీ జెండావిష్కరణలను పండుగ వాతావారణంలో నిర్వహించి.. అనంతరం వాహనాల్లో సభకు తరలేలా తగిన ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సైతం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, పార్టీ బ్యానర్లతో మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో పలు కూడళ్లు గులాబీమయంగా మారాయి. సెగ్మెంట్కు 300 వాహనాలు.. 3 వేల మంది జనసమీకరణ వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా పార్టీ శ్రేణులను తరలింపు కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితోపాటు ఎమ్మెల్సీ, అలంపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గానికి 300 వాహనాల వరకు సిద్ధం చేసి.. సుమారు మూడు వేల మంది కార్యకర్తలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందిని తరలించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. పర్యవేక్షణకు ఇన్చార్జీల నియామకం.. వరంగల్కు సుదూర ప్రయాణం చేయాల్సి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పార్టీ నేతలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి వాహనానికి ఓ ఇన్చార్జితో పాటు భోజనం, తాగునీటి వసతుల పర్యవేక్షణకు విడివిడిగా ఇన్చార్జీలను నియమించారు. అదేవిధంగా సభకు వెళ్లే ప్రతి వాహనానికి సంఖ్య, ఇన్చార్జి పేరు, సెల్ నంబర్తో స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్చార్జీలు నియోజకవర్గ ఇన్చార్జితో సమన్వయం చేసుకోనున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి బయలు దేరాయి.. ఎక్కడ భోజనాలు చేశారు.. ఎప్పుడు సభకు వచ్చారు.. ఎ ప్పుడు వెళ్లారు.. ఇలా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు ప ర్యవేక్షించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. పాలమాకుల లేదంటే శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్కు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వాహనాలు పాలమాకుల దాటిన తర్వాత లేదా శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైకి చేరుకుని.. నేరుగా ఘట్కేసర్ వద్ద వరంగల్ హైవేలో దిగుతాయి. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జోన్–2లో పార్కింగ్.. రజతోత్సవ సభకు తరలివెళ్లే ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ తమ వాహనాలను జోన్–2లో పార్కింగ్ చేసుకోవాలి. వరంగల్ జాతీయ రహదారిలో కరుణాపురం వద్ద ఎన్హెచ్–163 బైపాస్లో టోల్గేట్ నుంచి దేవన్నపేట, మేడిపల్లి, అనంతసాగర్ మీదుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. వాహనాలను అక్కడ పార్కింగ్ చేసి నేరుగా సభావేదిక స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్ సభకు భారీగా తరలుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు 50 వేల మంది తరలింపు బస్సులు, కార్లు ఇతర ప్రైవేట్ వాహనాలను సమకూర్చిన నేతలు పట్టణాలతో పాటు ఊరూరా పండుగలా పార్టీ జెండావిష్కరణలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైన పలు కూడళ్లు -
నాగర్కర్నూల్
విచారణ పేరుతో కాలయాపన ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు IIలో u●ఇప్పటికై నా స్పందించండి.. తెలకపల్లిలో దుకాణాల అక్రమ నిర్మాణాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసినాం. డీపీఓ పెట్రోల్ పోసి నన్ను చంపేయండి అంటూ సమాధానమిస్తున్నాడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – శివ, మైఖేల్, ఫిర్యాదుదారులు కలెక్టర్కు నివేదిస్తాం తెలకపల్లిలోని సర్వే నంబర్ 497లో దుకాణాల నిర్మాణాలకు సంబంధించి విచారణ పూర్తయింది. ప్రస్తుతం కలెక్టర్ సెలవులో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే రిపోర్ట్ అందజేస్తాం. పని ఒత్తిడి వల్ల ఫిర్యాదుదారులతో అలా మాట్లాడటం జరిగింది. – రామ్మోహన్, డీపీఓ ● తెలకపల్లిలోని దుకాణ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం ● చర్యలు తీసుకోకుండా ఏళ్లతరబడిగా కాలయాపన చేస్తున్నారని ఆరోపణ ● కిందిస్థాయి అధికారుల నుంచి పైవరకు అక్రమార్కులకే వత్తాసు నాగర్కర్నూల్: అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించడంతో.. ఓ జిల్లా అధికారి ఏకంగా ‘నన్ను పెట్రోల్ పోసి చంపేయండి’ అంటూ వింత సమాధానమిచ్చారు. తెలకపల్లిలోని ప్రధాన రహదారిపై ఎలాంటి అనుమతి లేకుండా 40 దుకాణాలు నిర్మిస్తే ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తులు డీపీఓ రామ్మోహన్కు ఫోన్ చేసి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించడంతో సదరు వ్యక్తులకు పైవిధంగా సమాధానం చెప్పడంతో ముక్కున వేలేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. తెలకపల్లిలోని సర్వే నం.497లో ఎలాంటి అనుమతి లేకుండా దుకాణ సముదాయ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ స్థలం భూదాన్ భూమి అని, దీనికి అసలైన వారసులం తామేనని, ఇద్దరు వ్యక్తులు కొన్నేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. భూదాన్ భూమి తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కొంతమంది తప్పుడు పత్రాలు సష్టించారని, దీనికి సంబంధించి మ్యుటేషన్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తహసీల్దార్ కార్యాలయంలో ఎండార్స్మెంట్ కాపీ సైతం అందజేశారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈ అక్రమ నిర్మాణాలపై మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా సదరు వ్యక్తులతో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిర్మాణ సమయంలో ఒక్కో దుకాణానికి రూ.2 లక్షల వరకు అధికారులు, అప్పటి పాలకవర్గం వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే 2024 ఆగస్టు 12న హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో డీఎల్పీఓ వరలక్ష్మి క్షేత్రస్థాయిలో విచారణ జరిపినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ ఆగ్రహం.. దుకాణాల అక్రమ నిర్మాణాలపై బాధితులు ప్రజావాణిలో కలెక్టర్ బదావత్ సంతోష్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పట్లో విచారణ చేసిన కిందిస్థాయి అధికారులు ఈ దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు. కానీ, ఈ నివేదిక మాత్రం మూడు నెలలుగా కలెక్టర్కు చేరలేదు. దీంతో అధికారులు అక్రమ నిర్మాణాలకు ఏ స్థాయిలో వత్తాసు పలుకుతున్నారో అర్థమవుతుంది. -
పూలే, అంబేడ్కర్ ఆధునిక భారత నిర్మాతలు
కల్వకుర్తి రూరల్: మహాత్మ జ్యోతిబాపూలే, బీఆర్ అంబేడ్కర్ మన ఆధునిక భారత నిర్మాతలు అని, వారు చూపిన మార్గంలో నడుద్దామని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు అన్నారు. శనివారం కల్వకుర్తిలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో ‘పూలే, అంబేడ్కర్ ఆలోచనలు– సమకాలీన పరిస్థితులు’ అనే అంశంపై కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పరశురాములు అధ్యక్షతననిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిద్దరూ ఆధునిక భారత నిర్మాతలు అనే విషయాన్ని నేటితరం మర్చిపోతుందన్నారు. పూలే దంపతులు అందరికీ విద్య కోసం తుది శ్వాస వరకు కృషి చేశారన్నారు. మహిళా సమానత్వం కోసం నాటి ఆటవిక సమాజాన్ని నాగరిక సమాజంగా మార్చారన్నారు. సత్యశోధన జంగ్ సమాజం స్థాపించి సామాజిక సేవలు విస్తృతంగా నిర్వహించారన్నారు. అంబేడ్కర్ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే భావిస్తూ ఆయన అధ్యయన లోతులను విస్మరిస్తున్నారని చెప్పారు. భూమి జాతీయీకరణ జరగాలని, పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా హక్కు ఉండాలని ఆనాడే ఆయన రాష్ట్రాలు– మైనార్టీలు అనే పుస్తకంలో ప్రస్తావించారని చెప్పారు. మహిళల సమానత్వం కోసం హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి నాటి ప్రభుత్వం అంగీకరించకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. కుల వివక్ష, అంటరానితనంపై పూలే, అంబేడ్కర్ అడుగు జాడల్లో ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తున్నట్లు స్కైలాబ్బాబు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిన్నయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కాశన్న, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, స్వాతి, బాలామణి తదితరులు పాల్గొన్నారు. -
పండ్లు.. జ్యూస్లకు డిమాండ్..
వేసవిలో కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు, మామిడిపండ్ల, ఇతర జ్యూస్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ● ఆరోగ్యానికి చెరుకు రసం ఎంతో మేలైనది. ప్రత్యేకంగా వేసవిలో చెరుకురసం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దీనిని తీసుకోవడం వల్ల ఎండల నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ప్రతిచోటా చెరుకు రసం సెంటర్లు వెలుస్తున్నాయి. మహబూబ్నగర్ పట్టణంలో దాదాపు 50 చెరుకు రసం కేంద్రాలు ఉన్నాయి. చెరుకు రసం ఫుల్గ్లాస్ రూ.30, ఆఫ్ గ్లాస్ రూ.20 ధరలు ఉన్నాయి. ● ఈ సీజన్లో ప్రతిచోట లస్సీ సెంటర్లు వెలుస్తాయి. కొన్నేళ్ల నుంచి లస్సీ (పెరుగు)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణ లస్సీ రూ.20, స్పెషల్ లస్సీని రూ.30కు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఫలుదాకు ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. పాలు, డ్రైఫ్రూట్స్తో తయారు చేసే ఫలుదాకు ఇటీవలే కాలంలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గ్లాసు ఫలుదా రూ.40 చొప్పున అమ్ముతున్నారు. ● పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ కొబ్బరిబొండాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిచోట ప్రధాన రోడ్ల వెంట వీటి అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జిల్లాలు, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కటి రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. ● మార్కెట్లో తాటిముంజులు, మామిడి పండ్ల సందడి నెలకొంది. కొల్లాపూర్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మామిడిపండ్లను దిగుమతి చేసుకొని కిలో రూ.80 – 100 వరకు విక్రయిస్తున్నారు. ఇక శరీరానికి చలువ చేయడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తాటిముంజలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది. రూ.100కు 12 ముంజలు ఇస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు కా ర్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే పుచ్చకాయలు అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. లస్సీ.. ఇష్టంగా తాగుతా.. లస్సీ అంటే చాలా ఇష్టం. వేసవి కాలంలో లస్సీని ఎక్కువగా తాగుతా. ఎండలో తిరిగే సమయంలో లస్సీ తాగడం శరీరానికి చల్లటి ఉపశమనం లభిస్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. – సాయికుమార్, మహబూబ్నగర్ -
పర్యాటకులపై ఉగ్రదాడి హేయం
కందనూలు: జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జిల్లాకేంద్రంలోని ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం బాలుర ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు పాస్టర్లు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి, కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంబీ చర్చి చైర్మన్ సంపత్కుమార్ మాట్లాడుతూ మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలోని ప్రజలపై, సైనికులపై దాడులు చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కీలకం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో కీలకం అని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్స్ ప్రతి ఒక్క విభాగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అందుకోసం విద్యార్థులు పూర్తిస్థాయిలో కంప్యూటర్ విద్యపై దృష్టిసారించాలన్నారు. వీటిద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం స్కిల్స్ ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, పరిశోధన కోణం ఆలోచించే వారికి సృజనాత్మకత ఉండడం వల్ల వారు త్వరగా ఉద్యోగాలు సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా అధికారులు సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంవీఎస్ ప్రిన్సిపాల్ పద్మావతి, ఆర్జేడీ యాదగిరి పాల్గొన్నారు. -
పాఠ్యపుస్తకాలు
బడుల ప్రారంభం రోజే.. విడతల వారీగా జిల్లాకు సరఫరా ● ఇప్పటికే గోదాంకు చేరుకుంటున్న పుస్తకాలు ● విద్యార్థులకు సకాలంలో అందించేందుకు విద్యాశాఖ కసరత్తు ● మరోవైపు నోట్బుక్స్ సైతం ఇచ్చేలా చర్యలు అచ్చంపేట: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమకూర్చాల్సిన సౌకర్యాలపై విద్యాశాఖ ముందుగానే దృష్టిసారించింది. ఇప్పటికే యూనిఫాంల వస్త్రం బడులకు చేరగా.. దుస్తులు కుట్టేందుకు అందిస్తున్నారు. వచ్చే 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు సైతం జిల్లాకు చేరుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత కొన్ని రాగా.. మిగిలినవి విడతల వారీగా రానున్నాయి. జిల్లాకు చేరిన పుస్తకాలను గోదాంలో భధ్రపరిచారు. జూన్లో బడులు తెరుచుకునే నాటికి పూర్తిస్థాయిలో అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. పక్కదారి పట్టకుండా నంబర్లు పాఠ్య పుస్తకాలు వేసవి సెలవులు ముగిసే వరకు విడతల వారీగా గోదాంకు చేరనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై వరుస క్రమంలో నంబర్లను ముద్రించారు. వీటి ఆధారంగా ఎన్ని మండలాలకు ఏయే పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు వెళ్లాయన్నది అధికారుల రికార్డుల్లో నమోదు చేయనున్నారు. స్కాన్ చేస్తే వీడియో రూపంలో.. ఎంఈఓలు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా వాటిని హెచ్ఎంలకు బడుల ప్రారంభం నాటికి పంపిణీ చేసేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. పుస్తకంలో ఒకవైపు తెలుగు, మరోవైపు ఆంగ్ల మాధ్యమంలో పాఠాన్ని 1– 10వ తరగతి విద్యార్థులకు అందిస్తున్నారు. 3– 10 తరగతి వారికి పార్ట్–1, పార్ట్–2గా పంపిణీ చేయనున్నారు. ఈ విధానంతో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గనుంది. అలాగే పుస్తకాల్లోని ప్రతి పాఠానికి బార్కోడ్ ముద్రిస్తుండటంతో ఫోన్లో స్కాన్ చేస్తే ఆ పాఠాన్ని వీడియో రూపంలో విద్యార్థులు చూసుకునే సదుపాయం ఉంటుంది. నోట్బుక్స్ అందజేత 1 నుంచి 5వ తరగతి వారికి వర్క్ బుక్స్, 6 నుంచి 10వ తరగతి వారికి రాత పుస్తకాలు అందించనున్నారు. వీటిని పిల్లలకు ఉచితంగా అందించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది. 5 నుంచి 10వ తరగతి వరకు చదివే ఒక్కో విద్యార్థికి 6 నోట్ బుక్స్ చొప్పున అందించనున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలతోపాటు నోటుబుక్స్ను కూడా ఎంఈఓలు తమ మండలాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. యూడైస్ వివరాల ప్రకారం.. జిల్లా, మండల పరిషత్, ఎయిడెడ్ స్కూళ్లలోని ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు.. కేజీబీవీ, మోడల్, ఆదర్శ, ఆశ్రమ పాఠశాలలతోపాటు సంక్షేమ గురుకులాల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేయనున్నారు. కొత్తగా ప్రవేశాలు పొందేవారితోపాటు ప్రస్తుతం చదువుతున్న వారికి పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు ఇవ్వనున్నారు. యూడైస్ ప్లస్ వివరాల ప్రకారం వీటిలో చదువుతున్న విద్యార్థులకు మొత్తం 5,34,660 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఇటీవల జిల్లా పాఠ్య పుస్తకాల గోదాంకు 1,23,190 పుస్తకాలు చేరుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పంపిణీ చేయకుండా నిల్వగా మరో 25 వేల పాఠ్యపుస్తకాలు గోదాంలో ఉండగా.. ఇంకా 4,11,470 పుస్తకాలు రావాల్సి ఉంది. గోదాంలో భద్రపరుస్తున్నాం.. జిల్లాకు పాఠ్య పుస్తకాలు చేరుకుంటున్నాయి. వీటిని జిల్లాకేంద్రంలోని గోదాంలో భద్రపరుస్తున్నాం. ప్రస్తుతానికి పార్ట్– 1 పుస్తకాలు రాగా.. పార్ట్–2కు సంబంధించిన పుస్తకాలు తర్వాత వస్తాయి. గోదాం నుంచి మండలాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తాం. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందిస్తే వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. పుస్తకాలు పక్కదారి పట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – రమేష్కుమార్, డీఈఓ -
మలేరియాను పూర్తిగా నిర్మూలించాలి
నాగర్కర్నూల్ క్రైం: దేశంలో 2030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించడానికి వైద్య సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాస్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీని జెడ్పీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 2008 నుంచి ప్రతి సంవత్సరం అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. మలేరియా ప్లాస్మోడియం పరాన్న జీవులు గల ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్నారు. దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు అని, దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. ఇల్లు, పరిసరాల్లో వ్యాధికారగా దోమలు పెరుగుతాయని, ఈ క్రమంలోనే గతేడాది జిల్లాలో 4 మలేరియా కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీరికి చికిత్స అందించి ఇంటి పరిసరాల్లో యాంటీలార్వా మందులు పిచికారీ చేశామన్నారు. ప్రతిఒక్కరూ దోమలు నివారణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీకాకరణ అధికారి రవికుమార్, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసులు, వైద్యులు వాణి, సంతోష్, అభిరాం పాల్గొన్నారు. -
గ్రామ గ్రామాన మే డే ఉత్సవాలు
నాగర్కర్నూల్ రూరల్: అమరవీరుల స్ఫూర్తితో గ్రామ గ్రామాన మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మేడే ఉత్సవాల ఏర్పాట్లపై భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 139వ మే డే సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్రం 44 కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మీపతి, నాయకులు శివకృష్ణ, పరశురాం తదితరులు పాల్గొన్నారు. -
ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య సరిహద్దు వివాదం..
సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు నాగర్కర్నూల్ జిల్లాలోని కృష్ణాతీరంలో ఉన్న సోమశిలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటులో సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయం ఏపీ పరిధిలో ఉండటంతో సంగమేశ్వరం, సిద్దేశ్వరం గ్రామాలకు చెందిన జాలర్లు, బోట్ల నిర్వహకులు తెలంగాణ నుంచి వచ్చే బోట్లను అడ్డుకుంటున్నారు. తమకు ఆదాయం రావడం లేదని అభ్యంతరం చెబుతుండటంతో తరచుగా వివాదం చెలరేగుతోంది. దీంతో కొన్ని రోజులుగా సంగమేశ్వర దర్శనం కోసం వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొదట తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా సోమశిల నుంచి బోటులో బయలుదేరితే ఏపీ పరిధిలోని సిద్దేశ్వరం తీరం వద్ద బోటును నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలోని సంగమేశ్వరం వరకు ఆటోలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. దర్శనం తర్వాత ఆటోలో సిద్దేశ్వరం వరకు వచ్చి, అక్కడి కృష్ణానదిలో ఏపీకి చెందిన జాలర్ల బోట్లలో సోమశిలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో చోట రూ.వంద చొప్పున.. ఒక్కొక్కరికి మొత్తం రూ.300 ఖర్చు అవుతుంది. బోటు నుంచి ఆటో, ఆటో నుంచి మళ్లీ బోటుకు మారి ప్రయాణించేందుకు కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఇరు రాష్ట్రాల జాలర్ల సరిహద్దు వివాదంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఉద్యమాల ద్వారానే ఉద్యోగ భద్రత
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అధ్యాపకులు ఉద్యమించడం ద్వారా ఉద్యోగ భద్రత సాధ్యపడుతుందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి పేర్కొన్నారు. పీయూలో కొన్ని రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మెకు ఆయన శుక్రవారం మద్దతు తెలిపి, మాట్లాడారు. అధ్యాపకులు మరింత ఉత్సాహంగా ఉద్యమం చేయాలని, వారికి పౌర సమాజం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఉన్నతవిద్యలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు సమాజానికి మార్గదర్శకులుగా పనిచేస్తున్నారని, అలాంటి వారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని టెంట్ కింద కూర్చోవడం సభ్య సమాజానికి తలవంపులు తెస్తుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పీయూ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు తమవంతు సహకారం ఉంటుందన్నారు. -
డేంజర్ నుంచి క్రిటికల్ జోన్లోకి.. ఎస్ఎల్బీసీలో ఇప్పుడేం జరుగుతోంది?
మహబూబ్నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ కోసం నిర్వహిస్తున్న సహాయక చర్యలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేయనుంది. గడచిన 63 రోజులుగా నిర్విరామంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఎనమిది మందిలో ఇప్పటికీ కేవలం ఇద్దరు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రమాదం జరిగిన టన్నెల్లో డేంజర్ జోన్ వద్ద కూడ పనులు పూర్తయ్యాయి. కేవలం క్రిటికల్ జోన్లో మాత్రమే సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది కాని అక్కడ పనులు చేయాలంటే నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతవరకు ఇక సహాయక చర్యలు నిలిపివేయటం మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఫిబ్రవరి 22న పైకప్పు కూలడంతో 8 మంది గల్లంతు కాగా, ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. మిగిలిన వారి మృతదేహాల కోసం నిర్విరామంగా అన్వేషణ కొనసాగుతుంది. క్రిటికల్ జోన్లో మిగిలిన ఆరుగురి మృతదేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు. 12 ఏజెన్సీలకు చెందిన దాదాపు 550 మంది మూడు షిప్పుల్లో పనిచేశారు. భారీ ఊరుతున్న నీటిని పెద్దపెద్ద పంపులతో డీ వాటరింగ్ చేశారు. మట్టి, బురదను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించారు.టీబీఎం మిషన్ను గ్యాస్, ధర్మల్ కట్టర్స్తో కటింగ్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొచ్చారు. చివరి 43 మీటర్ల ప్రాంతం మినహా సొరంగంలోని ఇతర ప్రాంతాల్లో పైకప్పు కూలడంతో పడిన మట్టి, బండరాళ్లు, ఇనుప తుక్కును తొలగించి అన్వేషించినా గల్లంతైన వారిజాడ తెలియరాలేదు. చివరి 43 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉందని, ఈ ప్రాంతంలో సహాయక చర్యలను కొనసాగిస్తే మళ్లీ పైకప్పు కూలవచ్చని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్సిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని జలసౌధలో భవిష్యత్ ప్రణాళికలు, రక్షణ చర్యలపై ఏర్పాటైన నిపుణు కమిటీ సమావేశం అయ్యింది. సహాయక చర్యలకు ప్రస్తుతానికి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. సహాయక చర్యల విషయంలో ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కు చెందిన నిపుణులతో సబ్ కమిటీ వేసి అధ్యయనం జరిపించాలని నిర్ణయించారు. సైట్ స్పెసిఫిక్ రిపోర్టును తయారు చేయాలని కమిటీని కోరారు. కమిటీ నివేదిక ఆధారంగా సహాయక చర్యల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నారు.నివేదిక ఇచ్చేందుకు కనీసం మూడు నెలల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. సమావేశంలో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో సొరంగం పనులు చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. మరోవైపు ఉపరితలం నుంచి సొరంగం చివరి ప్రాంతానికి ప్రత్యామ్నాయ మార్గం నిర్మించాలంటే కూడ ఇదంతా అమ్రాబాద్ రక్షిత పూలుల అభయారణ్య పరిధిలో ఉండటంతో కేంద్రం అనుమతులు తప్పని సరి. అనుమతులు రావటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మరి భవిష్యత్ లో ఎస్ఎల్బీసీల కొనసాగింపుపై ఏ మార్గాన్ని ఎంచుకోవాలో సబ్కమిటీ నివేదిక మీద అధారపడి ఉంది.కాగా అవుట్లెట్ మన్నెవారిపల్లి వైపు నుంచి మాత్రం టీబీఎం ద్వారా తవ్వకాలను కొనసాగించడం సురక్షితమని భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి తెప్పించిన బేరింగ్, అడాప్టర్, రింగ్ బేర్లు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నె వారిపల్లి అవుట్లెట్ వద్దకు చేరాయి. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
‘పంచాయతీ’లో అక్రమాలు..
‘గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను మండల స్థాయి పంచాయతీ అధికారులకు అప్పగించారు. ఇందులో భాగంగా వాహనాల అలెవెన్స్ కోసం పంచాయతీల నుంచి నిధులు వాడుకోవచ్చని 2022లో జిల్లా ఉన్నతాధికారులు ఒక సర్క్యులర్ జారీచేశారు. తర్వాత ఐదు నెలలకే ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. అయితే ఇదే అదునుగా భావించిన ఓ అధికారి.. ఉత్తర్వులు రద్దు అయినప్పటికీ ఏకంగా 15 నెలలపాటు వివిధ గ్రామ పంచాయతీల నిధుల నుంచి సొంత ఖాతాకు మళ్లించాడు. ఒక్కో జీపీ నుంచి రూ.20 వేల చొప్పున సదరు పంచాయతీ అధికారి రూ.లక్షల్లో నిధులను దుర్వినియోగం చేసినట్టు తెలిసింది.’ ‘తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన నిధుల్లో నుంచి రూ.30 వేల చొప్పున సదరు పంచాయతీ అధికారి వ్యక్తిగత ఖాతాలోకి మళ్లాయి. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన చివరి రోజున హడావుడిగా మిగులు నిధులను సొంత ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం. ఇదే మండలం పెద్దూర్ గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్ల జీతాల పేరుతో రూ.17 వేల చొప్పున అధికారి సొంత ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ● జీపీ నిధులు సొంత ఖాతాకు బదిలీ చేసుకున్న మండలస్థాయి అధికారి ● మల్టీపర్పస్ వర్కర్ల జీతాల పేరుతో పక్కదారి ● వాహనాల అలవెన్స్ పేరిట దుర్వినియోగం ● మరో చోటుకి బదిలీ చేసినా పలుకుబడితో పూర్వస్థానానికే డిప్యుటేషన్ సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖలో అక్రమాల పరంపర కొనసాగుతోంది. పంచాయతీ నిధులను ఆయా గ్రామా ల అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించాల్సి ఉండగా, కొందరు వాటిని పక్కదారి పట్టిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు ఉదాసీనత వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్నిసార్లు అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్నా స్పందించడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. సొంత ఖాతాల్లోకి నిధులు.. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల నిధులను కొందరు అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, హరితహారం, పల్లె ప్రగతి నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం ఆయా మండలాల పంచాయతీ అధికారులకు అప్పగించింది. ఇందుకోసం వాహనాలను వినియోగిస్తే వాటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో ఆయా గ్రామ పంచాయతీల నిధుల నుంచి నెలకు రూ.20 వేల చొప్పున వాహన అలవెన్సు తీసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కేవలం ఆరునెలల పాటే కొనసాగించిన అధికారులు తర్వాత దానిని రద్దు చేశారు. అయినా ఉన్నతాధికారుల కళ్లుగప్పి మరో ఏడాదిపాటు వాహనాల అలవెన్సు పేరుతో ఆయా గ్రామాల నుంచి నిధులను వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఆయా గ్రామాల మల్టీ పర్పస్ వర్కర్లకు వారి ఖాతాల్లోకే జీతాలను బదిలీ చేయాల్సి ఉండగా, వారితోపాటు అదనంగా మండలస్థాయి పంచాయతీ అధికారి తన వ్యక్తిగత ఖాతాలోకి జీతాలను మళ్లించడం ఈ శాఖలో కొనసాగుతున్న అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. డిప్యుటేషన్తో పాగా.. నాగర్కర్నూల్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సదరు మండలస్థాయి పంచాయతీ అధికారి ఒకే మండలంలో ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. గతేడాది సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన్ను కొల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఓ మండలానికి బదిలీ చేసింది. అయితే ట్రాన్స్ఫర్ అయ్యి రెండు నెలలు గడవక ముందే సదరు అధికారి చక్రం తిప్పాడు. తనకున్న పలుకుబడితో ‘ప్రత్యేక’ డిప్యుటేషన్ పేరుతో మళ్లీ పూర్వస్థానానికే వచ్చి చేరాడు. రాజకీయ నేత లు, ఉన్నతాధికారుల సహకారంతోనే అక్రమాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలున్నాయి. అక్రమాలపై ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమగ్ర విచారణ చేపడతాం.. గ్రామ పంచాయతీ నిధులను సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్టుగా ఓ అధికారిపై మాకు ఫిర్యాదు అందింది. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – రామ్మోహన్రావు, డీపీఓ ● -
రేషన్కార్డు మాకెప్పుడు?!
జిల్లాలో దరఖాస్తుదారుల ఎదురుచూపులు ●ఎన్నోసార్లు దరఖాస్తు.. నాకు ఏడేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు చేయలేదు. ఎన్నోసార్లు దరఖాస్తు చేశాను. ఇటీవల గ్రామసభలో మా పేరు చదివినా కార్డు మాత్రం రాలేదు. దీంతో రేషన్తోపాటు వివిధ పథకాలు అందడం లేదు. అధికారులు వెంటనే స్పందించి రేషన్కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – సయ్యద్, అమ్రాబాద్ ఆదేశాలు రాగానే.. జిల్లాలో ఇప్పటికే కొందరికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీరికి ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు ఇస్తే అప్పటి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తాం. ప్రజాపాలన దరఖాస్తుల సర్వే కొనసాగుతుంది. సర్వే పూర్తి కాగానే అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపుతాం. – శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి అచ్చంపేట: రేషన్కార్డు లేని నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో కార్డులేని వారు ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అయితే అర్హులైన వారికి కొత్త రేషన్కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. కానీ, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మంజూరు చేసేందుకు సర్వేకు ఆదేశించింది. రేషన్కార్డు కోసం జిల్లావ్యాప్తంగా 2016 నుంచి వివిధ దశల్లో కొత్తగా 78,867 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఎంపిక చేసిన గ్రామాల్లో 5,307 మందికి కార్డుల పంపిణీ చేశారు. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో మిగిలిన వారంతా కార్డు తమకెప్పుడు వస్తుందోనని ఎదరుచూస్తున్నారు. అన్ని పథకాలకు ప్రామాణికంగా తీసుకోవడంతో అర్హుల ఆందోళన ఇటీవల కొందరికి మంజూరు, పంపిణీ మార్పులు, చేర్పులకుఅవకాశం ఇవ్వని ప్రభుత్వం 2016 నుంచి పెండింగ్లోనే వేలాది అర్జీలు -
మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
పెంట్లవెల్లి: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని జటప్రోల్, గోప్లాపూర్ గ్రామాల్లో కొనసాగిన సంవిధాన్ పాదయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది నేతలు మన దేశం కనుమరుగు కాకూడదని ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని కొందరు చూస్తున్నారని, ప్రజలు దీనిని ఎప్పటికీ సహించరన్నారు. బీఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనేత అని, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆ మహనీయుల కృషి ఫలితమే అన్నారు. ప్రతిఒక్కరూ మహనీయుల అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మండలంలోని జటప్రోల్లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, చైర్పర్సన్ వెన్నెల ప్రారంభించారు. కార్యక్రమంలో గోవింద్గౌడ్, రామన్గౌడ్, భీంరెడ్డి, గోపాల్, ఖదీర్, కుమార్ పాల్గొన్నారు. -
ఖైదీలకు మెరుగైన సేవలు
నాగర్కర్నూల్ క్రైం: సబ్ జైల్లో ఖైదీలకు మెరుగైన సేవలు అందించాలని జడ్జి నసీం సుల్తానా అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి నసీం సుల్తానా గురువారం సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, తినే ఆహార పదార్థాలు, వంటగది, వాష్రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా న్యాయ సహాయం అవసరమైతే న్యాయ సేవాధికార సంస్థ తరపున ఉచితంగా అందించి అడ్వకేట్ను నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ శ్రీరామ్ ఆర్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ పవన్ శేషు సాయి, సబ్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి నాగర్కర్నూల్ క్రైం: పరీక్షల ద్వారానే ప్రాథమిక స్థాయిలో జీవనశైలి ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించవచ్చని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని చెప్పారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వచ్చే నెల 1న నిర్వహించే నాలుగో విడత అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలపై వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్లు, పక్షవాతం, కిడ్నీ తదితర వ్యాధులతో ప్రజలలో 65 శాతం మరణాలు, అస్వస్థత కలుగుతున్నాయన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరిని పరీక్షించడం ద్వారా మాత్రమే రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్లను గుర్తిస్తారన్నారు. జిల్లాలో ఇప్పటికే రక్తపోటుతో 77,301 మంది, మధుమేహంతో 38,457 మంది బాధపడున్నట్లు గుర్తించామన్నారు. మే 1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 30 ఏళ్లు పైబడిన 4,35,081 మందిని సిబ్బంది ఇంటింటికి వెళ్లి రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాస్, వైద్యులు భీమానాయక్, తారాసింగ్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్, ప్రోగ్రాం అధికారి రవికుమార్, డీపీఓ రేనయ్య, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
జూరాల.. భద్రమేనా?
● జలాశయంలో తెగిన 8 గేట్ల ఇనుప రోపులు ● 18 చోట్ల రబ్బర్సీల్ దెబ్బతినడంతో లీకేజీలు ● మరమ్మతు నేపథ్యంలో నిలిచిన గ్యాంటీక్రేన్ సేవలు ● మూడేళ్లుగా 50 శాతం కూడా పూర్తికాని రిపేర్లు ● ఆందోళన కలిగిస్తోన్న అధికార యంత్రాంగం, పాలకుల వైఖరి గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రమేనా..? 2009 సంవత్సరం మాదిరిగా మరోసారి వరద పోటెత్తితే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అంటే.. ప్రాజెక్టులోని తెగిన గేట్ల రోప్లు, ధ్వంసమైన రబ్బర్ సీల్ నిర్మాణాలను చూస్తే నిస్సందేహంగా లేదనే మాటే వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులకు సాగునీరందిస్తూ.. కీలకపాత్ర పోషిస్తున్న పెద్దన్నకు పెనుముప్పు తరుముకొస్తే.. అన్న ఆలోచన కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా పాలమూరుకు సాగు, తాగు నీరందిస్తున్న ప్రాజెక్టును.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అధికార యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు.. కృష్ణాబేసిన్ పరిధిలో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఇందిరా ప్రియదర్శిని జూరాలను 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 37,700 ఎకరాలు, కుడి కాల్వ పరిధిలో ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 63,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. జూలై నాటికి పూర్తి.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల కిందట రూ.11 కోట్ల నిధులు వచ్చాయి. అయితే 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. కానీ, 2023లో గ్యాంటీక్రేన్కు సమస్య తలెత్తడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం గ్యాంటీక్రేన్ను పూర్తిస్థాయిలో రిపేరు చేశాం. శుక్రవారం నుంచి పనులు వేగవంతం చేసి జూలై నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. 62 రేడియల్ క్రస్ట్ గేట్లు.. జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులు ఉన్నాయి. ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఈ 62 రేడియల్ క్రస్ట్ గేట్లను ఆపరేట్(పైకెత్తడం) చేయడం ద్వారా నీటిని దిగువనకు విడుదల చేసేలా సులభతరమైన విధానంలో రేడియల్ క్రస్ట్గేట్లు ఏర్పాటు చేశారు. అర్ధ చంద్రాకారంలో ఉన్న గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు గేట్లకు ఇరువైపులా రెండు రబ్బర్ సీల్స్, అడుగు భాగాన ఒక రబ్బర్ సీల్ ఉన్నాయి. ఆపరేట్ చేసేందుకు అవసరమైన ఇనుప రోప్లు గేటుకు ఇరువైపులా, కింది భాగాన రెండు చొప్పున ఇనుప రోపుల నిర్మాణం ఉంటాయి. వీటి సాయంతోనే మొత్తం రేడియల్ క్రస్ట్ గేట్లను అవసరమైనప్పుడు పైకి ఎత్తడం, దించడం చేస్తారు. రిపేర్లతో లీకేజీలు.. ప్రాజెక్టు మొత్తం 62 గేట్లలో 18 గేట్ల నుంచి ఏడాదిగా నీరు లీకేజీ అవుతోంది. ప్రధానంగా గేట్లు దెబ్బతినకుండా, రాపిడికి గురికాకుండా రక్షణ కల్పించే రబ్బర్ సీల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు సహాయపడుతున్న ఇనుప రోప్లు పూర్తిగా దెబ్బతిని 8 గేట్లను ఆపరేటింగ్ చేయలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు మొత్తం 62 గేట్లు మొదలుకొని రబ్బర్ సీల్స్, రోప్స్, పెయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెంథనింగ్ వంటివి మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఒప్పందం గడువు ముగిసి.. మరోసారి పొడిగించిన గడువు ముగిసిపోయినా పట్టుమని 50 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ● ప్రస్తుతం డ్యాం పైభాగాన ఉన్న హయిస్ట్ బ్రిడ్జి, గేట్ల వద్ద ఉన్న వాక్వే బ్రిడ్జికి సంబంధించి సాండ్ బ్లాస్టింగ్ పనులు పూర్తి చేయగా.. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. భారీ వరద వస్తే.. 2009 సంవత్సరం మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల కర్ణాటకలోని టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం, తాజాగా విజయవాడలోని కృష్ణా బ్యారేజీ గేట్లు దెబ్బతినడం ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడి మొత్తం గేట్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘రెస్క్యూ’ కొనసాగించాలా.. వద్దా?
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో శిథిలాల కింద ఉన్న మిగతా కార్మికుల ఆచూకీ కోసం 60 రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకోగా, ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలు లభించాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ కోసం నిరాటంకంగా పనులు కొనసాగుతున్నాయి. 12 సంస్థలకు చెందిన 560 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో తవ్వకాలను కొనసాగిస్తున్నారు. సొరంగంలోని ప్రమాదస్థలంలో డీ2 పాయింట్ వద్ద రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచె వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఇంకా ముందుకు పనులు కొనసాగించాలా లేక నిలిపివేయాలా అన్న దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. చివరి 43 మీటర్లలోనే.. 14 కి.మీ. లోపల సొరంగం చివరన 43 మీటర్లు ప్రమాదకరంగా ఉండటంతో డీ2 పాయింట్ వద్ద ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. అక్కడి మట్టిని తొలగిస్తే మళ్లీ సొరంగం కూలిపోయే అవకాశం ఉందని ఇప్పటికే జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఇనుప కంచె వరకు తవ్వకాలు పూర్తికాగా మిగతా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. వారు ఆ 43 మీటర్ల పరిధిలోనే కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంకా పనులు కొనసాగించాలా, వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్, జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డైరెక్టర్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు చెందిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా, అటవీశాఖ పీసీసీఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్, నీటిపారుదల శాఖ సీఈ, నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సీఈతో కూడిన 12 మంది సభ్యులు ఉన్నారు. చివరి 43 మీటర్లలో పనులు చేపడితే రెస్క్యూ బృందాలకు సైతం అపాయమున్న నేపథ్యంలో పనులు నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. -
ఆరోగ్య సమస్యల నుంచి ఆత్మహత్యల దాకా..
ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో కల్తీకల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వృద్ధులు, మహిళలతో సహా కల్తీ కల్లుకు బానిస అవుతున్నారు. ఏళ్ల తరబడి కల్తీ కల్లు సేవిస్తుండటంతో ప్రధానం మెదడు, నాడీ వ్యవస్థ, లివర్ భాగాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. చివరికి నోటి నుంచి మాటరాని పరిస్థితికి చేరుకుంటున్నారు. కల్తీకల్లులో వినియోగిస్తున్న మితిమీరిన మత్తు పదార్థాలతో పూర్తిగా బానిసై కల్లు మానేయలేని స్థితికి చేరుకుంటున్నారు. విపరీతమైన మత్తులో గొడవలు పడటం, కుటుంబ కలహాలు, మహిళలపై చేయి చేసుకోవడంతో పాటు క్షణికావేశంలో తమవారినే అంతమొందించేందుకు సిద్ధమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మత్తులో డిప్రెషన్కు గురికావడం, తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారు. -
చెంచుల స్థితిగతులపై అధ్యయనం
మన్ననూర్: నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల జీవన స్థితిగతులపై బుధవారం రాష్ట్ర అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేర కు అధికారుల బృందం అప్పాపూర్, భౌరాపూర్ చెంచు పెంటల్లో చెంచులతో సమావేశమై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. చెంచుల జోవనోపాదులతో పాటు జీవన భృతి తదితర అంశాల గురించి చర్చించారు. చెంచు పెంటల్లో తాగునీరు, రవాణా, రోడ్లు, చెక్డ్యాంలు తదితర సౌకర్యాల కల్పనతో పాటు నేచర్ గైడ్ల శిక్షణ కోసం రూ. 1.2కోట్లు మంజూరు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ జాయింట్ సెక్రెటరీ భవానీ శంకర్, పవన్సింగ్, ఫైనాన్స్ అధికారి శ్రీనివాస్, ట్రైబ ల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇస్కాన్ సభ్యులు, మిష న్ భగీరథ డీఈ హేమలత, రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ కల్లుతో బేజారు
కల్లుకు బానిసై తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతం ఏడాదిన్నర కిందట కల్తీ కల్లు సేవించి మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి సమీపంలోని తిమ్మసానిపల్లి, కోయినగర్, దొడ్లోనిపల్లి గ్రామాలకు చెందిన 20 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో చేరి వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్తీ కల్లు వినియోగిస్తూ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి క్రమంగా పెరుగుతోంది. ‘ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లక్ష్మయ్య. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలకేంద్రానికి చెందిన ఈయన కొన్నేళ్లుగా కల్తీ కల్లు తాగుతుండటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మెదడు దెబ్బతిని నోటమాట రాని పరిస్థితికి చేరుకున్నాడు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో మెంటల్ హెల్త్ విభాగంలో చికిత్స తీసుకుంటున్నాడు. గ్రామాల్లో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్నారని, తనలాంటి బాధితులు ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని వాపోయాడు.’ -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: వేసవిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఉంటాయని.. ఇందుకు గాను ప్రాథమిక, ఉన్నత పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో ఆర్పీలుగా పనిచేసేందుకు ఆసక్తిగల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయుల శిక్షణకు ఆర్పీలుగా నలుగురు జీహెచ్ఎంలు, మరో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలతో పాటు 228 మంది రిసోర్స్పర్సన్లు అవసరమన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఈ నెల 30వ తేదీలోగా ఆర్పీల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు. ఎంపికై న ఆర్పీలకు మే నెలలో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బోనస్ ఆలస్యం కావొద్దు బిజినేపల్లి: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం అందించే బోనస్ ఆలస్యం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. అనంతరం 45 మందికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీరాములు, ఏఓ నీతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజుగౌడ్, తిరుపతయ్య, మిద్దె రాములు, నసీర్, మాన్యా నాయ క్, కత్తె ఈశ్వర్, పండ్ల పాషా తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ప్రగతి సాధించాలి మన్ననూర్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని డీఆర్డీఓ చిన్న ఓబులేష్ సూచించారు. వాటర్షెడ్ పథకం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న అమ్రాబాద్ మండలం బీకే ఉప్పునుంతలలో బుధవారం గ్రామస్తులతో కలిసి ఆయన అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో డీఆర్డీఓ మాట్లాడుతూ.. వాటర్షెడ్ పథకం ద్వారా పండ్ల తోటలు, పశుగ్రాసం, పశుసంపద పెంచుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ సమీపంలో ప్లాంటేషన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జగన్, ఏడీహెచ్ జ్ఞానశేఖర్, డీఆర్ఓ వాణికుమారి, ఎఫ్ఆర్ఓ వీరేష్, రామకృష్ణ, క్రాంతి, కేశవులు, సర్దార్ నాయక్, వాటర్షెడ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా అర్హుల ఎంపిక
నాగర్కర్నూల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా చేపట్టాలని ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లో రాజీవ్ యువవికాసం దరఖాస్తుల విచారణ ప్రక్రియ, మండల స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటుపై అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీవ్ యువవికాసం పథకానికి జిల్లావ్యాప్తంగా 42,335, దరఖాస్తులు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 50వేల వరకు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90శాతం, రూ. 2లక్షల వరకు 80శాతం, రూ. 4లక్షల వరకు 70 శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేస్తుందన్నారు. ఇందుకు గాను ప్రణాళికా బద్ధంగా లక్ష్యాల కేటాయింపులు చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల విచారణ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. మండలస్థాయిలో విచారణకు ఎంపీడీఓ, మండల ప్రత్యేకాధికారి, బ్యాంకు మేనేజర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ అధికారులు, డీఆర్డీఓ సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మండలస్థాయి విచారణ తదుపరి జిల్లా కమిటీ పరిశీలన చేస్తుందన్నారు. తుది జాబితాను ఆయా కార్పొరేషన్లకు పంపనున్నట్లు చెప్పారు. జిల్లాలో లాభదాయక యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమర్పించడంతో పాటు సదరు లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం త్వరగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఇళ్ల మంజూరు పూర్తిచేసి.. నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.. ఊర్కొండ: రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని రూపొందించిందని ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఊర్కొండ రైతువేదికలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గతంలో సరైన రిజిస్ట్రేషన్ లేకుండా జరిగిన సాదాబైనామా లావాదేవీలకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. అర్హులైన వారు నిర్దేశిత ప్రక్రియ ద్వారా తమ సాదాబైనామాలను క్రమబద్ధీకరించుకోవచ్చని సూచించారు. అంతే కాకుండా వారసత్వ భూముల విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో భూ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో బాధితులు ఆర్డీఓ, కలెక్టర్ లేదా సీసీఎల్ఏలకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ అప్పీల్ ప్రక్రియ కూడా నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయబడుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత, కచ్చితత్వం కోసం ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని కలెక్టర్ వెల్లడించారు. భవిష్యత్లో భూ సరిహద్దులు, యజమానికి సంబంధించిన వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ ఎండీ యూసుఫ్ అలీ, ఎంపీడీఓ కృష్ణయ్య, ఏఓ దీప్తి, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, నాయకులు జనార్దన్రెడ్డి, రమేశ్ నాయక్, అయూబ్ పాషా, అబ్దుల్ సమీ, వహిదుద్దీన్, మనోహర్ రెడ్డి, ధర్మేందర్ రెడ్డి, మ్యాకల శ్రీనివాసులు, ఆదినారాయణ ఉన్నారు. ‘రాజీవ్ యువవికాసం’లో లాభదాయక యూనిట్ల ఏర్పాటుకు చర్యలు ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి -
కల్తీ కల్లు బాధితులే ఎక్కువ..
జనరల్ ఆస్పత్రిలోని మెడికల్ హెల్త్ సెంటర్కు కల్తీ కల్లు బాధితులు ఎక్కువగా వస్తున్నారు. కల్లులో మత్తుకోసం క్లోరో, ఆల్ఫ్రాజోలం, యాంటీ సైకోటిక్ పదార్థాలను కలుపుతుండటంతో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. నిత్యం కల్తీకల్లు సేవించడం వల్ల బ్రెయిన్, లివర్, నాడీ సంబంధ సమస్యలకు లోనవుతున్నారు. చివరికి నోట మాటరాని పరిస్థితి ఎదురవుతోంది. – డాక్టర్ అంబుజ, సైకియాట్రిస్ట్, జిల్లా మెడికల్ హెల్త్ సెంటర్, నాగర్కర్నూల్కౌన్సెలింగ్ ద్వారా చికిత్స.. కల్తీకల్లు వినియోగంతో నరాల బలహీనత, ఫిట్స్, తిమ్మిర్లు రావడం, చేతు లు, కళ్లలో మంటలతో ఆస్పత్రులకు వస్తున్నారు. వారికి కౌన్సెలింగ్, మందులు ఇచ్చి పంపిస్తున్నాం. తీవ్రమైన కేసులు ఉన్నవారిని హైదరాబాద్కు పంపుతున్నాం. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి, నాగర్కర్నూల్ ● -
రికవరీ ఎప్పుడో?
నాగర్కర్నూల్ బల్దియాలో జీతాల పేరుతో రూ. కోటికి పైగా పక్కదారి విచారణ కొనసాగుతోంది.. మున్సిపాలిటీలో జరిగిన అవినీతికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. సిబ్బంది జీతాల పేరుతో నిధులు పక్కదారి పట్టిన సమయంలో ఇక్కడ పనిచేసిన వారందరూ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశాం. త్వరలోనే పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – కనకయ్యగౌడ్, సీఐ, నాగర్కర్నూల్ నాగర్కర్నూల్: జిల్లా కేంద్రమైన నాగర్కర్నూల్ మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి అవినీతి పరంపర కొనసాగుతోంది. అవినీతి జరిగిన ప్రతీసారి కొన్ని రోజులపాటు హడావుడి చేయడం.. ఆ తర్వాత విషయం కనుమరుగైపోవడం పరిపాటిగా మారింది. గతేడాది మున్సిపాలిటీలో జీతాల పేరుతో రూ. 1.08 కోట్లు పక్కదారి పట్టినట్లు తేలింది. అయితే ఇందుకు బాధ్యులైన ఓ పర్మినెంట్ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేయగా.. మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవినీతి ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అయితే రికవరీ విషయంలో మాత్రం ఆశలు సన్నగిల్లుతున్నాయి. సదరు వ్యక్తులు నిధులను ఏ ఖాతాల్లోకి మళ్లించారు.. వాటిని ఎలా రికవరీ చేయాలనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత కరువైంది. దీంతో గతంలో జరిగిన అవినీతి మాదిరిగానే నిధుల పక్కదారి అంశం కూడా కనుమరుగవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెరపైకి మరికొందరి పేర్లు.. మున్సిపాలిటీలో జరిగిన అవినీతికి ఇద్దరిని బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇందులో ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం మాత్రం బహిర్గతం కావడం లేదు. అయితే చర్యలు తీసుకోబడిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ అవినీతిలో మరికొంత మందికి భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. గతంలో ఇక్కడ పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు, అకౌంటెంట్ల పేర్లతో పాటు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఒకరిద్దరి పేర్లు కూడా చెప్పినట్లు సమాచారం. కాగా, సదరు అధికారులు, సిబ్బంది విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఒకరిద్దరు అధికారులు హాజరైనా.. పూర్తిస్థాయిలో విచారణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 2020 నుంచి గత సంవత్సరం వరకు జీతాల విషయంలో ఈ అవినీతి జరగడంతో.. అప్పటి అధికారులు సైతం విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అధికారులు, ఇతర సిబ్బంది అండదండలు లేకుండా ఇద్దరు సిబ్బంది ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడతారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ విషయంలో ఆ ఇద్దరినే బలి పశువులను చేస్తారా? లేక పూర్తి స్థాయిలో విచారణ చేసి.. అవినీతి బాగోతం వెనకున్నవారిని కనిపెట్టి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. ఇద్దరు ఉద్యోగులపై చర్యలకే పరిమితం అవినీతి సొమ్ము రికవరీపై కనిపించని శ్రద్ధ -
ఉగ్రమూకలను తరమికొడదాం
కందనూలు: జమ్మూ కశ్మీర్లోని పహల్గాం సమీపంలో ఉగ్రవాదుల మారణకాండపై జనాగ్రహం పెల్లుబికింది. ఉగ్రమూకల దుశ్చర్యను ఖండిస్తూ బుధ వారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి చంపడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హిందూ సమాజం చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఉగ్రవాదులకు అశ్రయం ఇస్తున్న వ్యక్తులను ఇక్కడి నుంచి తరమివేయాలన్నారు. ఉగ్రవాదులను నడిరోడ్డుపై కాల్చి చంపాలని వారు డిమాండ్ చేశారు. -
అకాల వర్షాలతో రైతులకు తీవ్రనష్టం
బిజినేపల్లి: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. మండలంలోని లట్టుపల్లిలో వారం రోజుల క్రితం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి ప్రభుత్వ అధికారులు సరైన సమయంలో ధాన్యం సేకరించడంతో ఆదివారం కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన వడ్లను మ్యాచర్ పేరుతో కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. సోమవారం మండలంలోని లట్టుపల్లిలో కొనుగోలు కేంద్రం ఆవరణలో వర్షానికి తడిసిన, కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షం కాారణంగా ఎండిన వడ్లు మళ్లీ తడవడంతో 25 నుంచి 50 శాతం వరకు నష్టం వాటిల్లిందన్నారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది, అధికారులు, ప్రభుత్వం రైతులను పలు రకాలుగా మోసం చేయడంతో వారు చేసేది లేక ప్రైవేటు మిల్లర్లకు రూ.1,800 గుండుగుత్తగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే నష్టం అంచనా వేసి రైతులకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజవర్ధన్రెడ్డి, సుధాకర్రెడ్డి, నారాయణచారి, భూషయ్య, రమేష్గౌడ్, చంద్రకళ, తిరుపతయ్య, రఘుబాబు, ఓం ప్రకాష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’కి 35 అర్జీలు
నాగర్కర్నూల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి 35 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు. పోలీస్ గ్రీవెన్స్కు 9.. నాగర్కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి పోలీస్ ప్రజావాణికి 9 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 3 భూమి పంచాయతీ, 5 తగు న్యాయం గురించి, ఒకటి భార్యాభర్తల గొడవ ఫిర్యాదు వచ్చాయన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: కార్పొరేట్ కళాశాలల పథకం కింద 2025–26 సంవత్సరానికి గాను (frerh& renewal) జూనియర్ కళాశాలలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రావణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలల గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలనుకున్న యాజమాన్యం వారు తమ కళాశాలల గుర్తింపు, విద్యార్థులకు కల్పిస్తున్న హాస్టల్ సదుపాయాలు, అధ్యాపక సిబ్బంది తదితర వివరాలు https: //telanganaepass.cgg.gov.in వెబ్సైట్ లో ఈ నెల 30లోగా పూర్తి వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసి జిల్లా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఫోరం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానంగా గత 2022 ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అయిన కార్మికులకు రావాల్సిన లీవ్ ఎన్క్యాష్మెంట్, 2017 పీఆర్సీకి సంబంధించిన ఏరియర్స్, ప్రతి నెలా 10వ తేదీ లోపు చెల్లించాల్సిన ఎస్ఆర్బీఎస్ డబ్బులను అందజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు జీబీ పాల్, ఆర్.నారాయణ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు 10వ తేదీలోగా చెల్లించాల్సిన ఎస్ఆర్బీఎస్ డబ్బులు ఇంతవరకు చెల్లించలేదన్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలకే విడతల వారీగా ఈ నెల 16వరకు చెల్లించారని, ఇంకా డీఏలు, 2021 పీఆర్సీ ఇవ్వాల్సిఉందని, అలాగే పీఎఫ్, సీపీఎస్లకు చెల్లించాల్సిన బకాయిలను కూడా చెల్లించకుండా నియామకాలను ఎలా చేపడుతారని ప్రశ్నించారు. సమావేశంలో నాగాంజనేయులు, లలితమ్మ, నర్సింలు, మనోహర్, బుచ్చన్న, రియాజుద్దీన్ పాల్గొన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పీయూ వైస్చాన్స్లర్ జీఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఏర్పాటు చేసిన మహనీయుల జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపేందుకు ఎంతో మంది గొప్ప వ్యక్తులు జీవితాంతం కృషి చేశారని, వారి కృషి వల్ల ఎంతో మంది అట్టడుగు వర్గాల వారికి మేలు జరిగిందన్నారు. మహనీయుల జయంతులు చేస్తే వారి ఆశయాలను కొనసాగించినట్లు కాదని, వారు ఎలాంటి సేవలు చేయడం వల్ల గొప్ప వ్యక్తులయ్యారనే అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ జానకి మాట్లాడుతూ గతంలో మహనీయులు చేసిన త్యాగాల వల్లే అన్ని వర్గాల వారు స్వేచ్ఛ సమానత్వంతో మెలుగుతున్నారని, నేటి తరం యువతకు కూడా సమాజసేవ చేసేందుకు తమ వంతుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రొఫెసర్ కాశీం, పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కుమారస్వామి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
దందాలకే ప్రాధాన్యం
● రియల్ వ్యాపారాల్లో జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరు తరచుగా వివాదాస్పదమవుతోంది. తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి.. కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ దందాల్లో, చిట్టీ వ్యాపారాల్లో ఆరి తేరుతున్నారు. ఈ క్రమంలో అదనపు సంపాదన కోసం అక్రమ దందాలకు పాల్పడేందుకు సైతం వెనకాడటం లేదు. అక్రమంగా చిట్టీల దందాకు పాల్పడుతూ ప్రజలను మోసం చేసినట్టుగా తేలడంతో ఇటీవల జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూనే ప్రజల నుంచి రూ.కోటికి పైగా సొమ్మును వసూలు చేసి, తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించి అతనిపై సస్పెన్షన్ వేటు విధించారు. విచారణ పేరుతో కాలయాపన.. జిల్లాలోని కొందరు ప్రభుత్వ టీచర్లు చిట్టీలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో బిజిబిజీగా గడుపుతూ పాఠశాలల్లో విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నా అధికారులు స్పందించడం లేదు. చాలా సందర్భాల్లో విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారు. తమ గ్రామాల్లో టీచర్లు పాఠశాలలకు సరిగా రావడం లేదని ఫిర్యాదులు అందుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మా బడి మూతబడింది.. మా తండాలోని ప్రభుత్వ పాఠశాలలో కొన్ని నెలలపాటు టీచర్ సరిగా రాలేదు. ఎప్పుడు చూసినా మీటింగ్ ఉందంటూ బయటకు వెళ్లేవాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరి పాఠశాల మూతబడింది. వచ్చే ఏడాదైనా తరగతులను ప్రారంభించాలి. – రమేశ్, రూప్లాతండా, బిజినేపల్లి మండలం చర్యలు తీసుకుంటున్నాం.. జిల్లాలో కొందరు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల విధులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నాం. – రమేశ్కుమార్, డీఈఓ ఫైనాన్స్, చిట్టీలు, వడ్డీ వ్యాపారాల్లో తలమునకలు పాఠశాలల్లో సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు ఇటీవల వెల్దండ మండలంలోని ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు జిల్లాలో నామమాత్రంగా మారిన హాజరు ప్రక్రియ -
భూ భారతితో శాశ్వత పరిష్కారం
మన్ననూర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంను రైతులు సద్వినియోగం చేసుకొని శాశ్వత పరిష్కారం పొందాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం పదర, అమ్రాబాద్ మండల కేంద్రాల్లోని అధికారులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అమలులో ఉన్న ధరణిలో జరిగిన లోపాలను సవరిస్తూ భూ భారతి ద్వారా సరిచేసుకునే వెసులుబాటు ప్రభుత్వం రైతులకు కల్పించిందన్నారు. సాదాబైనామాలు, వారసత్వ, అసైన్డ్, వక్ఫ్, పోరంబోకు భూములలో ఉన్న లోపాలు సరిచేసుకోవచ్చని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్కారం కాని సమస్యలు తహసీల్దార్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ వరకు, ఆ తర్వాత సీసీఎల్ ద్వారా కూడా నిర్భయంగా వెళ్లి దరఖాస్తు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఇకపై బ్యాంకు రుణాల కోసం వెళ్లినప్పుడు భూమికి సంబంధించిన ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, భూ భారతి పోర్టల్లో పొందుపరిచిన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్డీఓ మాధవి మాట్లాడుతూ ప్రత్యేకించి ఏజెన్సీ పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరైనా అమ్మితే కొనకూడదని, ఇప్పటి వరకు సాగులో ఉన్న భూములు కాకుండా కొత్తగా భూములు సాగు చేయకూడదని సూచించారు. రైతులు తమ పొలాలపై హక్కులు కలిగి ఉండటంతోపాటు బ్యాంకులో పంట రుణాలు, 1978కి ముందు కొనుగోలు చేసుకున్న భూములకు మాత్రమే పట్టాలు అవుతాయనేది గమనించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్బాబు, ఎంపీడీఓలు శైలేంద్రకుమార్, వెంకటయ్య, ఏఓ సురేష్, నాయకులు హరినారాయణగౌడ్, రహీం, సంబు శోభ, ప్రణీత, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రహసనంగా హాజరు ప్రక్రియ..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులు తరచుగా వస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో మాత్రమే బయోమెట్రిక్ ఉండగా, అది కూడా ఎక్కడా పకడ్బందీగా అమలు కావడం లేదు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్లడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్నిచోట్ల ఉదయం, సాయంత్రం పాఠశాలల్లో హాజరు వేసుకుని మిగతా సమయం అంతా బయటకు వెళ్లి వ్యాపార, ప్రవృత్తి రంగాల్లో నిమగ్నమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నదిలో రోడ్డేసి.. దర్జాగా తవ్వేసి..
●కృష్ణా పరివాహకంలో యథేచ్ఛగా ఇసుక దందా ● నారాయణపేట జిల్లాలో పేట్రేగుతున్న ఇసుక మాఫియా ● జేసీబీ, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు ● 2 చోట్ల రోడ్డు వేసి పగలు, రాత్రనక బెంజ్ వాహనాల్లో రవాణా ● పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ● ఫిర్యాదులు వచ్చినప్పుడే తనిఖీల పర్వం ● తూతూమంత్రపు కేసులతో సరిపెడుతున్న ఖాకీలు ● ఓ రాజకీయ నేత ‘హస్తం’ ఉన్నట్లు ఆరోపణలు అధికారులు పట్టించుకోవాలి.. కృష్ణా నది నుంచి ఇసుక తరలించడం మూలంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతోపాటు నదిలో రోడ్లు వేయడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఉన్న కాస్త నీరు అక్కడే నిలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే వేసవి చివరలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవాలి. – అంబ్రెష్. మాజీ సర్పంచ్, గుడెబల్లూరు, కృష్ణా నా దృష్టికి రాలేదు.. నది రోడ్లు వేసినట్లు నా దృష్టికి రాలేదు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టినా.. అనుమతుల్లేకుండా తరలిస్తున్నా.. చర్యలు తప్పవు. – వెంకటేష్. తహసీల్దార్, కృష్ణా ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా.. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో మైనింగ్ సిబ్బంది కొరత ఉంది. అయినా నదిలో రోడ్డు వేసినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే.. పరిశీలించాలని సిబ్బందిని పంపించా. నీటిని మళ్లించేందుకు రైతులు వేసుకున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా. చర్యలు తీసుకోవాల్సింది వారు. – సంజయ్, ఏడీ, మైనింగ్ శాఖ, మహబూబ్నగర్ తొలుత 8 కి.మీ.ల మేర మట్టి రోడ్డు.. ఉమ్మడి పాలమూరు.. ప్రస్తుత నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో తంగిడి వద్ద కృష్ణానది ప్రవేశిస్తోంది. ఈ మండల పరిధి టైరోడ్ సమీపంలో కృష్ణా పరివాహకంలోని ఓ ఆశ్రమం వద్ద మాఫియా ఆధ్వర్యంలో నదిలో తొలుత ఏడెనిమిది కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు నిర్మించింది. నదిలో ఊట నీరు లేదంటే వరద వచ్చినా.. ఇబ్బందుల్లేకుండా అక్కడక్కడ చిన్న చిన్న తూములను ఏర్పాటు చేసి మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం నదిలో ఇసుక మేటలు పెద్ద ఎత్తున తేలగా.. ఆ ప్రాంతంలో హిటాచీ, జేసీబీల వంటి భారీ యంత్రాలతో తవ్వి.. ఈ మట్టి రోడ్డు గుండా బెంజ్లు, టిప్పర్ల ద్వారా పగలు, రాత్రనక కర్ణాటకకు తరలిస్తున్నారు. ఆ తర్వాత వేరే చోట.. తొలుత మట్టి రోడ్డు వేసి బెంజ్ వంటి వాహనాల్లో ఇసుక తరలించడంపై పలువురు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఎవరు కూడా అటు వైపు చూడకపోవడంతో ఇసుక మాఫియా రాత్రిళ్లూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అదే ఆశ్రమం నుంచి కొద్దిదూరంలో వేరే చోట మట్టి రోడ్డు వేసి.. భారీ ఎత్తున తవ్వకాలు చేపడుతోంది. రోజుకు వందలాది ట్రిప్పుల చొప్పున ఇసుకను కర్ణాటకలోని తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. బెంజ్ ఇసుకను రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దందా వెనుక ఎవరి ‘హస్తమో’? కృష్ణా పరివాహకంలో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా నదిలో రోడ్డు వేసినా.. రాత్రిళ్లూ ఇసుక రవాణా కొనసాగుతున్నా.. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా వెనుక నారాయణపేట జిల్లాకు చెందిన ఓ ‘అధికార’ నేత హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా మండలానికి చెందిన ఓ నాయకుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. సమన్వయ లేమినా.. ముడుపులు అందడంతోనా.. ఇసుక దందాను అరికట్టడంలో భాగంగా ప్రభు త్వ ఆదేశాల మేరకు పేట జిల్లా అధికార యంత్రాంగం ఇదివరకే టాస్క్ఫోర్స్ కమిటీ వేసింది. ఇందులో రెవెన్యూ, భూగర్భ జల, ఇరిగేషన్, పోలీస్, ఆర్టీఏ అధికారులు ఉన్నారు. వీరందరూ ఐక్య కార్యాచరణతో ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాల్సి ఉంది. కానీ.. జిల్లాలో ఆయా శాఖల మధ్య సమన్వయం కొరవడినట్లు తెలుస్తోంది. మరో వైపు ఆయా శాఖల అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. నెలనెలా శాఖల వారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నదిలో రోడ్డు వేస్తే చర్యలు తీసుకోరా.. రాత్రిళ్లూ తవ్వకాలు చేప ట్టొచ్చా? అని ‘సాక్షి’ వివిధ విభాగాల అధికారులను సంప్రదించగా..మా బాధ్యత కాదు అంటూ ముక్తసరిగా సమాధానం ఇవ్వడం గమనార్హం. మళ్లీ కొన్ని రోజుల తర్వాత మఠం నుంచి దాదాపు రెండు కి.మీ.ల దూరంలో ఏడెనిమిది కిలోమీటర్ల మేర నదిలో వేసిన మరో రోడ్డు ఇది.. మక్తల్ నియోజకవర్గ పరిధి టైరోడ్డు సమీపంలోని ఓ మఠం వద్ద కృష్ణానదిలో తొలుత వేసిన రోడ్డు ఇది.. ఇసుకాసుర ‘హస్తం’..! ...తెలంగాణ–కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నారాయణపేట జిల్లాలోని కృష్ణా పరివాహకంలో ఇసుక మాఫియా ఆగడాలకు ఇవి నిదర్శనం. నదిలో మట్టి రోడ్లు వేసి మరి తెలంగాణ పరిధిలోని ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు. పగలు, రాత్రనక యథేచ్ఛగా దందా కొనసాగుతున్నా.. రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ‘ఎత్తిపోతల’పై ప్రభావం.. కృష్ణానది ఆధారంగా మక్తల్ నియోజకవర్గంలో కుసుమూర్తి, వాసునగర్, గూడెబల్లూరు, ముడుమాల్, కొల్పూరు, పారేవులా, పస్పుల మినీ ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా దాదాపు 20 వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. పలు ఎత్తిపోతల ద్వారా మే నెల వరకు తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ప్రస్తుతం రబీ సీజన్ ముగిసింది. దీంతో పంటలకు అంతగా నీటి అవసరం లేకున్నా.. ప్రతి ఏటా ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో పంటల సాగుపై ప్రభావం చూపడంతో పాటు తాగు నీటికి ఇబ్బందులు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేయాలి
అచ్చంపేట: దేశవ్యాప్తంగా మే 20 నుంచి జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. సోమవారం అచ్చంపేట మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తున్నా కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. 44 కార్మికుల చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని, ఉన్న చట్టాలను కాలరాయడమే తప్ప కార్మికులకు మేలు చేయలేదని దుయ్యబట్టారు. సంఘాలు లేకుండా చేస్తున్న మోదీ దిమ్మ తిరిగే విధంగా సమ్మెను చేద్దామని, కార్మికులు కలిసి రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అసంఘటిత, సంఘటిత రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ భవిష్యత్ తరాలకు బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందన్నారు. కార్మికులను రెగ్యులర్ చేసి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రభు త్వ ఉద్యోగులతో సమానంగా గౌరవ వేతనం ఇవ్వా లని డిమాండ్ చేశారు.జిల్లా ఉపాధ్యక్షుడు పర్వతాలు, జిల్లా సహాయక కార్యదర్శి శంకర్నాయక్, పట్టణ కార్యదర్శి రాములు, నాయకులు మధు, సురేష్, సాయిలు, వెంకటయ్య, రమేష్, హరీష్, వెంకటమ్మ, బాలమ్మ, సుభద్రమ్మ పాల్గొన్నారు.