నాగర్‌కర్నూల్‌ | - | Sakshi
Sakshi News home page

నాగర్‌కర్నూల్‌

Apr 27 2025 12:25 AM | Updated on Apr 27 2025 12:25 AM

నాగర్

నాగర్‌కర్నూల్‌

విచారణ పేరుతో కాలయాపన

ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

వివరాలు IIలో u

ఇప్పటికై నా స్పందించండి..

తెలకపల్లిలో దుకాణాల అక్రమ నిర్మాణాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసినాం. డీపీఓ పెట్రోల్‌ పోసి నన్ను చంపేయండి అంటూ సమాధానమిస్తున్నాడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

– శివ, మైఖేల్‌, ఫిర్యాదుదారులు

కలెక్టర్‌కు నివేదిస్తాం

తెలకపల్లిలోని సర్వే నంబర్‌ 497లో దుకాణాల నిర్మాణాలకు సంబంధించి విచారణ పూర్తయింది. ప్రస్తుతం కలెక్టర్‌ సెలవులో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే రిపోర్ట్‌ అందజేస్తాం. పని ఒత్తిడి వల్ల ఫిర్యాదుదారులతో అలా మాట్లాడటం జరిగింది.

– రామ్మోహన్‌, డీపీఓ

తెలకపల్లిలోని దుకాణ అక్రమ

నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా

పట్టించుకోని వైనం

చర్యలు తీసుకోకుండా ఏళ్లతరబడిగా

కాలయాపన చేస్తున్నారని ఆరోపణ

కిందిస్థాయి అధికారుల నుంచి

పైవరకు అక్రమార్కులకే వత్తాసు

నాగర్‌కర్నూల్‌: అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించడంతో.. ఓ జిల్లా అధికారి ఏకంగా ‘నన్ను పెట్రోల్‌ పోసి చంపేయండి’ అంటూ వింత సమాధానమిచ్చారు. తెలకపల్లిలోని ప్రధాన రహదారిపై ఎలాంటి అనుమతి లేకుండా 40 దుకాణాలు నిర్మిస్తే ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తులు డీపీఓ రామ్మోహన్‌కు ఫోన్‌ చేసి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించడంతో సదరు వ్యక్తులకు పైవిధంగా సమాధానం చెప్పడంతో ముక్కున వేలేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..

తెలకపల్లిలోని సర్వే నం.497లో ఎలాంటి అనుమతి లేకుండా దుకాణ సముదాయ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ స్థలం భూదాన్‌ భూమి అని, దీనికి అసలైన వారసులం తామేనని, ఇద్దరు వ్యక్తులు కొన్నేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. భూదాన్‌ భూమి తాము రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు కొంతమంది తప్పుడు పత్రాలు సష్టించారని, దీనికి సంబంధించి మ్యుటేషన్‌ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తహసీల్దార్‌ కార్యాలయంలో ఎండార్స్‌మెంట్‌ కాపీ సైతం అందజేశారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈ అక్రమ నిర్మాణాలపై మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా సదరు వ్యక్తులతో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిర్మాణ సమయంలో ఒక్కో దుకాణానికి రూ.2 లక్షల వరకు అధికారులు, అప్పటి పాలకవర్గం వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే 2024 ఆగస్టు 12న హైదరాబాద్‌లోని కమిషనర్‌ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో డీఎల్‌పీఓ వరలక్ష్మి క్షేత్రస్థాయిలో విచారణ జరిపినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కలెక్టర్‌ ఆగ్రహం..

దుకాణాల అక్రమ నిర్మాణాలపై బాధితులు ప్రజావాణిలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పట్లో విచారణ చేసిన కిందిస్థాయి అధికారులు ఈ దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు. కానీ, ఈ నివేదిక మాత్రం మూడు నెలలుగా కలెక్టర్‌కు చేరలేదు. దీంతో అధికారులు అక్రమ నిర్మాణాలకు ఏ స్థాయిలో వత్తాసు పలుకుతున్నారో అర్థమవుతుంది.

నాగర్‌కర్నూల్‌1
1/1

నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement