యూనిఫాంలో మార్పులు | - | Sakshi
Sakshi News home page

యూనిఫాంలో మార్పులు

May 2 2025 12:45 AM | Updated on May 2 2025 12:45 AM

యూనిఫ

యూనిఫాంలో మార్పులు

జిల్లాలో 56,733 మంది విద్యార్థులకు ఒక జత దుస్తులు

బడిబాటకు ముందే..

మే నెలాఖరులోగా యూనిఫాంలు పూర్తి చేసి బడిబాటకు ముందే పాఠశాలలకు చేరేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఇప్పటికే జిల్లాకు చేరిన యూనిఫాం క్లాత్‌ను ఎంఈఓల పర్యవేక్షణలో పాఠశాలల హెచ్‌ఎంలు, డీఆర్‌డీఏ అధికారుల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించడం జరుగుతుంది. కొత్త దుస్తుల్లో పిల్లలు విద్యా సంవత్సరం ప్రారంభం రోజే హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాం.

– రమేష్‌కుమార్‌, డీఈఓ

అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న యూనిఫాంలో మార్పులు చేశారు. 6 నుంచి 12 తరగతి వరకు బాలబాలికలకు ఒకే విధంగా ఉండేలా మార్పు చేయనున్నారు. ముఖ్యంగా ఎదిగే బాలికలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తయారు చేయనున్నారు. గతంలో విద్యా సంవత్సరం సగం ముగిసే వరకు యూనిఫాంలు కుట్టడం కొనసాగేది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈసారి మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే యానిఫాంలు అందేలా పక్కాగా ప్రణాళిక రూపొందించారు.

టెస్కో ద్వారా సరఫరా

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే యూనిఫాంల క్లాత్‌ తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) సరఫరా అందిస్తుంది. జిల్లాకు చేరిన యూనిఫాంల క్లాత్‌ను పరిశీలించి, భద్రపర్చే బాధ్యతను ఎంఈఓలకు అప్పగించారు. ప్రస్తుతం 56,733 మంది బాలబాలికలకు సంబంధించిన ఒక జత క్లాత్‌ మాత్రమే వచ్చింది. వాటిని స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించేలా కార్యాచరణ రూపొందించారు. ఎంఈఓల పర్యవేక్షణలో డీఆర్‌డీఏ, అర్బన్‌, మెప్మా, డీఎల్‌ఎఫ్‌ మహిళా సంఘాల సభ్యులకు క్లాత్‌ అందజేశారు. ఒక్కో జత కుట్టడానికి రూ.75 చొప్పున చెల్లించనున్నారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఎంఈఓల పర్యవేక్షణలో కుట్టు పనులు

మహిళా సంఘాల సభ్యులకు

కుట్టే బాధ్యత

ప్రారంభానికి ముందే

పాఠశాలలకు చేరేలా ప్రణాళిక

స్వల్ప మార్పులతో..

ఈ విద్యా సంవత్సరంలో అందించే యూనిఫాంలలో స్వల్ప మార్పులు చేశారు. చొక్కాలు, లాంగ్‌ గౌన్‌లకు పట్టీలు, భుజాలపై కప్స్‌ వంటివి లేకుండా సాధారణ యూనిఫాంగా డిజైన్‌ చేశారు. బాలురకు 6 నుంచి 12 తరగతి వరకు నిక్కర్లు కాకుండా ప్యాంట్లు అందించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతానికి నిక్కర్లకు మాత్రమే వస్త్రం జిల్లాకు చేరింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మంగళవారం ఆయా మండల కేంద్రాలకు పంపించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, యూపీఎస్‌, పీఎస్‌, కేజీబీవీ, జెడ్పీ, ఎయిడెడ్‌, యూఆర్‌ఎస్‌, టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌, మోడల్‌ స్కూళ్లు కలిపి మొత్తం 839 ఉండగా.. ఇందులో 56,733 మంది బాలబాలికలు ఉన్నారు.

యూనిఫాంలో మార్పులు 1
1/1

యూనిఫాంలో మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement