ప్రజల అభీష్టం మేరకే కొత్త చట్టం | - | Sakshi
Sakshi News home page

ప్రజల అభీష్టం మేరకే కొత్త చట్టం

May 1 2025 1:26 AM | Updated on May 1 2025 1:26 AM

ప్రజల అభీష్టం మేరకే కొత్త చట్టం

ప్రజల అభీష్టం మేరకే కొత్త చట్టం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: సుదీర్ఘకాలం పాటు ప్రజలతో క్షేత్రస్థాయిలో సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే భూభారతి చట్టాన్ని తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ధరణి పేరుతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను రెవెన్యూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిప్పుకుందని.. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో చాలా వరకు భూ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనపై కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు గోబెల్స్‌ ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిరుద్యోగ యువతకు రాజీవ్‌యువ వికాసం కింద స్వయం ఉపాధి పథకాలు, పేదలకు సన్నబియ్యం పంపిణీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇచ్చేందుకు చట్టసభలో తీర్మాణం తదితర చారిత్రాత్మక పనులను చేపట్టామని అన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో వివిధ సంస్థల సీఎస్సార్‌ ఫండ్స్‌ ద్వారా పెద్ద ఎత్తున యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, స్వయం ఉపాధి పథకాల యూనిట్లను ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు. కాంగ్రెస్‌ జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు హబీబ్‌, నిజాం, కోటయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement