స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి

May 21 2025 12:28 AM | Updated on May 21 2025 12:28 AM

స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి

స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి

కల్వకుర్తి టౌన్‌: మహిళలు అన్నిరంగాల్లో రాణించడమే కాకుండా, వారికి అందివచ్చిన స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు అందించే కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గానికి సమానంగా నిధులు కేటాయిస్తూ.. వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. స్వయం శక్తితో ఎదిగి కోటీశ్వరులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలపడేందుకే రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. అనంతరం 150 మంది లబ్ధిదారులకు కుట్టుమిషన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌, కుట్టుమిషన్లను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement