
ఉగ్రమూకలను తరమికొడదాం
కందనూలు: జమ్మూ కశ్మీర్లోని పహల్గాం సమీపంలో ఉగ్రవాదుల మారణకాండపై జనాగ్రహం పెల్లుబికింది. ఉగ్రమూకల దుశ్చర్యను ఖండిస్తూ బుధ వారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి చంపడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హిందూ సమాజం చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఉగ్రవాదులకు అశ్రయం ఇస్తున్న వ్యక్తులను ఇక్కడి నుంచి తరమివేయాలన్నారు. ఉగ్రవాదులను నడిరోడ్డుపై కాల్చి చంపాలని వారు డిమాండ్ చేశారు.