
నీరు పారేదెలా..?!
ఆధునికీకరణకు నోచుకోని కేఎల్ఐ కాల్వలు
●
ఉన్నతాధికారులకు
నివేదించాం..
సాగునీటి కాల్వల్లో జమ్ముగడ్డి, ముళ్లపొదల తొలగింపు, నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు లేవు. ఈజీఎస్ ద్వారా జమ్ము, ముళ్లపొదలు తొలగించే పనులు చేపట్టాలని గతంలో నిర్ణయించారు. కొన్నిచోట్ల ఆ పనులు జరిగాయి. సిమెంట్ లైనింగ్ నిర్మాణాల గురించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– శ్రీనివాస్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ
సొంత డబ్బులు వెచ్చించి..
ఎల్లూరు రిజర్వాయర్ నుంచి కొల్లాపూర్ మీదుగా రామాపురం వరకు ఉన్న డీ–1 కాల్వలో జమ్ముగడ్డి, ముళ్లచెట్లు పెరిగాయి. ఏటా ఒక ప్రజాప్రతినిధి సొంత డబ్బులతో మొక్కలు తొలగిస్తున్నారు. లేకపోతే రైతులమే స్వయంగా పనులు చేయించుకుంటున్నాం. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కాల్వలకు సిమెంట్ లైనింగ్ చేయాలి.
– ఆంజనేయులుగౌడ్, రైతు,
రామాపురం, కొల్లాపూర్ మండలం
● పేరుకుపోయిన జమ్ముగడ్డి, ముళ్లపొదలు
● సాగునీరు ముందుకు
పారకుండా అడ్డంకులు
● వర్షాకాలంలో కోతకు గురవుతున్న వైనం
● సిమెంట్ లైనింగ్ చేయాలని
రైతుల వేడుకోలు
ఆయకట్టు విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలు
కేఎల్ఐ పరిధిలో రిజర్వాయర్లు 3
సాగునీటి కాల్వలు 324 కి.మీ.,
సింగోటం కాల్వ లైనింగ్ కోసం మంజూరు చేసిన నిధులు రూ.10 కోట్లు

నీరు పారేదెలా..?!