
‘యువవికాసం’ యూనిట్లు గ్రౌండింగ్ చేయండి
నాగర్కర్నూల్: రాజీవ్ యువవికాసం యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై బుధవారం కలెక్టరేట్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్ కార్పొరేషన్ అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువవికాసం పథకంతో అర్హులందరికీ దశల వారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. వచ్చేనెల 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా యువత స్వయం ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు యూనిట్లన్నీ గ్రౌండింగ్ చేసి.. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో లబ్ధిదారులకు యూనిట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాపై కలెక్టర్ సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
● జిల్లాలో చివరి దశలో ఉన్న వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టర్ చాంబర్లో రెవెన్యూ, పౌరసరఫరాల, రవాణా శాఖల అధికారులు, మిల్లర్లు, లారీ అసోసియేషన్ సభ్యులతో ఆ యన సమావేశమై మాట్లాడారు. వర్షాలు కురుస్తు న్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యా న్ని మిల్లులు లేదా గోదాములకు తరలించేందుకు అవ సరమైన లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం తరలింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోకుండా కాపాడటం ము ఖ్యమని.. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతు లకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమా వేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్ ఉన్నారు.
● వనమహోత్సవంలో శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో డీఆర్డీఓ చిన్న ఓబులేష్, ఎఫ్ఆర్ఓ రోహిత్ గోపిడిలతో కలిసి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 11వ విడత వనమహోత్సవం లక్ష్యం మేరకు జిల్లావ్యాప్తంగా 41లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
● జిల్లాలో పీవీటీజీగా గుర్తించిన చెంచులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం జన్మన్ జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా చెంచులకు మంజురైన గృహాల నిర్మాణాలపై ఐటీడీఏ పీఓ రోహిత్ గోపిడితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా ఎనిమిది మండలాల్లోని 88 ఆదివాసీ చెంచు పెంటల్లో 8,772 మంది నివసిస్తుండగా.. ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా ఇప్పటికే 890 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా చెంచు పెంటల్లో మిగిలిన అర్హులను గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
వచ్చే నెల 2న లబ్ధిదారులకుమంజూరు పత్రాలు
కలెక్టర్ బదావత్ సంతోష్