
శాంతిభద్రతలు పరిరక్షించాలి : ఎమ్మెల్యే
అచ్చంపేట రూరల్: నియోజకవర్గంలో శాంతిభద్రతలు పరిరక్షించాలని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ కోరారు. సోమవారం పట్టణంలో పోలీసు అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ కుట్రలను సహించేది లేదని, పోలీస్స్టేషన్కు వచ్చే సామాన్యులకు న్యాయం చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పట్టణంలో ప్రతిష్టాత్మకమైన నిర్వహించే బొడ్రాయి పండుగకు భద్రతా చర్యలపై సమీక్షించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్ఐలు రమేశ్, పవన్కుమార్, వెంకట్రెడ్డి, ఇందిర పాల్గొన్నారు.