breaking news
Devotion
-
విశ్రాంతి అంటే..?
నీవు నీవుగా మిగిలిపోవడమే అసలైన విశ్రాంతి. ఎందుకంటే నీవు నీవుగా మిగిలిపోవడానికి ఏమైనా శ్రమ ఉందా? అస్సలు లేదు. కానీ మనిషి నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా కావాలి, అలా కావాలి అనుకుంటూ విశ్రాంత స్థితి నుండి పక్కకు వెళ్ళిపోతున్నాడు. నీవు నీవు కావడానికి ఏమైనా శక్తి కావాలా? లేక ప్రయత్నం కావాలా? అసలు అలా ఉన్నప్పుడు అలసటనేదే ఉండదు.నీ పేరు మైత్రేయ అనుకుందాం. ఎప్పుడైతే నీవు మైత్రేయ అనే వ్యక్తివి ఐనావో, నాకు ప్రాముఖ్యత కావాలి. నన్ను సమాజం గుర్తించాలి, నన్ను గౌరవించాలి అనుకున్నావు. అదే నువ్వు ఆత్మగా ఉన్నపుడు, సాక్షిగా ఉన్నపుడు ఇలా అనిపించదు. అంటే సమాజంలో ఎప్పుడూ ఒక వ్యక్తిలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు. నీవు ఏది కాదో అది నిరూపించుకోవాలని అనుకుంటున్నావు. అలా ఏదో నిరూపించాలని అనుకుంటున్నావు కాబట్టే నీలో ఎప్పుడూ ఏదో అలసట ఉండే తీరుతుంది. అందుకే చూడు ఎప్పుడైనా నీవు బయటికి వెళ్ళేటప్పుడు బాగా బిగుసుకోని పోతావు. ఇంటికి రాగానే రిలాక్స్ ఐపోతావు. ఎందుకంటే ఇంటికొచ్చాక నీవు నీవైపోతున్నావన్నమాట. అంటే రిలాక్సేషన్కి కారణం నీవు నీ అంతరాత్మతో ఉండటమే. నీవు సమాజంలో కలిసినప్పుడల్లా నీవు కానిది చూపించాలను కోని ఏదో ఒకటి నటిస్తూ వ్యక్తిత్వం అనే ముసుగును వేసుకుంటూ నీ అంతరాత్మకు దూరంగా జరిగిపోతున్నావు. నీ నిజతత్వమైన ప్రశాంతతకు విశ్రాంతికి చాలా దూరమవుతున్నావు.నీవు ఆత్మగా మిగిలిపోవడానికి ఏమీ చేయనవసరం లేదు. నీవు నీవుగా ఈ క్షణంలో సంపూర్ణత్వంతో మిగిలిపోతే నీవే ఆత్మ. ఆత్మ స్వయం ప్రకాశం అంటారు భగవద్గీతలో కూడా. సహజంగానే నీవు శాంతి, విశ్రాంతి మూర్తీభవించిన మనిషివి. నీలో లేనిది ఏమీ లేదు. కానీ మనం ఎప్పుడూ ఇంకా ఏదో కావాలి అని వ్యక్తిగా కోరుకుంటూనే ఉంటాం. భగవద్గీత ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దానికి చావులేదు. పుట్టుక లేదు. ఆత్మగా మిగిలిపోవడానికి ఏమైనా కావాలా? ఆత్మకు వస్తువులు, విషయాలు కావాలా? ఏమీ అబ్జర్లేదు. ఆత్మగా ఏదీ నీకు చెందదు. నీవు ఎవరికీ చెందవు. కానీ అన్నీ నీవే ఒక ఆత్మగా... దేవునిగా. అందుకే ఆత్మగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీవు అంతులేని ప్రకాశానివి, నీవే దైవానివి.– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
వేద వేదాంత విషయాలను బోధించేది భారతం
భారతీయ ఇతిహాసాలకు ప్రజల ఆధ్యాత్మిక, సాంఘిక జీవనంలో మార్గదర్శక పాత్ర ఉంది. అందులో భారతం అజ్ఞాన తమస్సును పోగొట్టి జ్ఞానం అనే దివ్యమైన వెలుగు చూపుతుందని భావిస్తారు. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవునకు ముంజేతి సాధనం ఇది. ఈ భారతేతిహాసం వల్ల మోహం అంటే మానవ సహజమైన భ్రాంతి మటుమాయమవుతుంది. భారతం ఒక మహావృక్షం. సంగ్రహ అధ్యాయం దానికి బీజం. పౌలోమ – ఆస్తీక కథలు మూలం. కురు పాండవ జనన కథ స్కంధం. సభారణ్య పర్వాలు కొమ్మలు, అరణ్య పర్వం రూపం. విరాట – ఉద్యోగ పర్వాలు సారం. భీష్మ పర్వం ప్రధాన శాఖ. ద్రోణ పర్వం ఆకులు. కర్ణపర్వం ఆ చెట్టు పూచిన తెల్లని పువ్వులు. శల్య పర్వం ఆ పువ్వుల పరిమళం. స్త్రీ పర్వం నార. శాంతి పర్వం మహాఫలం. అశ్వమేధ పర్వం ఆ ఫల సంబంధమైన అమృతరసం. ఆశ్రమవాస పర్వం ఆ చెట్టునీడ. మౌసలం శ్రుతి సంగ్రహం. అలాంటి భారత మహావృక్షం కవుల కావ్యకృతికి పోషకం అవుతుంది. భారత కథ వినడానికి జనమేజయుడు తగిన సమయం నిర్ణయించుకున్నాడు. ఆస్థాన పండితులను సమా వేశపరిచాడు. వైశంపాయనుడిని సముచితంగా పూజించాడు. వైశంపాయనుడు ముందుగా హృదయంలో గురు బ్రహ్మకు మొక్కి, ప్రత్యక్షంగా ఉన్న గురుమూర్తికి పాదాభివందనం చేసి, సభ్యులకు చెప్పి, వారి అనుమతితో భారత కథ చెప్పడం మొదలుపెట్టాడు. భారతం శ్రద్ధాభక్తులతో వినే వారికి ఇష్టార్థ సిద్ధినీ, శుభ సంపద్వృద్ధినీ కలిగిస్తుంది. రాజులకు రాజ్యాభివృద్ధినీ, అభ్యుదయాన్నీ సమకూరుస్తుంది. సత్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో నీతికథలను చెప్పిన మహా ప్రబంధం. అన్ని లోకాలకూ పూజ్యమైనది. ఇతిహాసాలలో అగ్రగణ్య. లౌకిక న్యాయశాస్త్రానికి గురువు. వేద వేదాంత విషయాలను బోధించేది భారతమని వైశంపాయనుడు చెప్పాడు. అంత గొప్పది కాబట్టే ‘వింటే భారతం వినాలి’ అంటారు. – యామిజాల జగదీశ్ -
సమయపాలన.. జీవితాన్ని తీర్చిదిద్దే కళ
జీవితంలో అత్యంత అరుదైన, విలువైన బహుమతి ఏదైనా ఉందంటే అది కాలమే. ఈ అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే విజయం, ఆనందం సాధించగలం. సమయం అనేది నిరంతర ప్రవాహం. దానిని సక్రమంగా వినియోగించుకుంటేనే మన జీవితం ఒక అద్భుతమైన గమ్యాన్ని చేరుకుంటుంది, అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం.కాలాన్ని సక్రమంగా వినియోగించుకుంటే వృద్ధి కలుగుతుంది. కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే క్షీణత తప్పదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రతిదీ నశించిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ సూక్తి సమయపాలన అనివార్యతను, అది జీవితంలో వృద్ధికి లేదా క్షీణతకు ఎలా దారితీస్తుందో స్పష్టంగా వివరిస్తుంది.సమయం ఎవరి కోసం ఆగదు; కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఈ నిరంతర ప్రవాహంలో, సమయపాలన అనే కళ ద్వారా మనం మన జీవితాన్ని ఒక సుందరమైన శిల్పంలా మలచుకోవచ్చు. సనాతన ధర్మంలో సమయానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి శుభకార్యానికి ఒక ముహూర్తం, ప్రతి పనికి ఒక నిర్దిష్ట కాలం కేటాయించడం దీనిలో భాగమే. వేదకాలం నుండే మన ఋషులు కాలాన్ని నిశితంగా అధ్యయనం చేసి, దాన్ని విభజించి, ప్రతి క్షణాన్నీ ఎలా సద్వినియోగం చేసుకోవాలో లోకానికి బోధించారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధంలో ప్రతి కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవాలని అర్జునుడికి ఉపదేశిస్తాడు. అలాగే, రామాయణంలో లక్ష్మణుడు నిద్ర లేకుండా సీతారాములకు సేవ చేస్తూ, కాలరహిత నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించి, సమయపాలనకు ఆదర్శంగా నిలిచాడు.(రూ.13 వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?)సమయానికి సమానమైన మిత్రుడు గానీ, శత్రువు గానీ మరొకటి లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మనకు అత్యుత్తమ మిత్రునిగా మారి విజయాన్ని ప్రసాదిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే, అది శత్రువై మనల్ని పతన పథంలోకి నెడుతుంది. ఈ సూక్తి సమయపాలన ప్రాధాన్యతను, దానిని ఆచరణలో పెట్టడం ద్వారా జీవితంలో విజయాలు ఎలా సాధించవచ్చో వివరిస్తుంది.కాలం సమస్త జీవరాశిని పరిపక్వం చేస్తుంది, కాలమే ప్రజలను సంహరిస్తుంది. అందరూ నిద్రిస్తున్నప్పుడు కూడా కాలం మేల్కొని ఉంటుంది. కాలాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ శ్లోకం కాలం అజేయ శక్తిని, దానిని గౌరవించి సద్వినియోగం చేసుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తుంది.సమయపాలన కేవలం పనులను పూర్తి చేయడం కాదు, అది జీవితాన్ని అర్థవంతంగా, క్రమబద్ధంగా జీవించే ఒక గొప్ప కళ. ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం ఉన్నత లక్ష్యాలను సాధించగలం, ఒత్తిడిని తగ్గించుకొని, అంతర్గత శాంతిని పొందగలం. జీవితాన్ని పరిపూర్ణంగా, ప్రయోజనకరంగా మలచుకోవడానికి సమయపాలన ఒక అమూల్యమైన సాధనం. ఈ కళను నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సరికొత్త ఉన్నతిని సాధించగలరు.ప్రపంచంలోని అనేకమంది విజేతలు సమయపాలనను తమ అపార విజయానికి ప్రధాన కారణం అంటారు. వారు ప్రతీ నిమిషాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించు కోవడం ద్వారానే అసాధారణ ఫలితాలు సాధించారు. ఉదాహరణకు, ఒక విద్యార్థి సకాలంలో పాఠాలు పూర్తి చేస్తే ఉత్తమ ఫలితాలు పొందగలడు. అలాగే, ఒక ఉద్యోగి గడువులోగా పనులు అప్పగిస్తేనే వృత్తిలో పురోగమిస్తాడు. కచ్చితమైన సమయపాలన తోనే రవాణా వ్యవస్థలు, ప్రాజెక్టులు సమర్థవంతంగా సాగి, లక్షలాది మంది జీవితాలకు ఆసరా అవుతాయి. ఇవన్నీ మన ధర్మంలో సమయానికి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని, దాని ఆచరణ విలువను స్పష్టం చేస్తాయి. – కె. భాస్కర్ గుప్తా -
శివుడిపైనే పరీక్షించి.. అలా విష్ణువు చేతికి చేరిన దివ్యాయుధం
వచ్చే పదేళ్లనాటికి దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు రక్షణ కల్పించే సాంకేతిక ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మిషన్కు శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రగా పేరు పెడుతున్నట్లు చెప్పారు. హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతంగా భావించబడే.. పరమ పవిత్రమైనదిగా పూజలు అందుకునే సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి ఎలా చేరిందో తెలుసా?.. వామన, లింగ పురాణాల్లో సుదర్శన చక్రం కథ భాగాన్ని చూడొచ్చు. శ్రీదాముడు అనే రాక్షసుడు అహంకారంతో విర్రవీగుతూ దైవ శక్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో.. ధర్మ విరుద్ధంగా లక్ష్మీదేవిని వశపరచుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు.. శ్రీమహావిష్ణువు పరమశివుడి శరణు వేడుతాడు. అయితే అప్పటికే కైలాసగిరిలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు. దీంతో కార్తీక శుక్ల చతుర్దశి నాడు శివుడిని పూజించేందుకు విష్ణువు కాశీకి వెళ్తాడు. వెయ్యి బంగారు పద్మాలతో శివుడిని పూజించాలనుకుంటాడు విష్ణువు. అయితే విష్ణువుకు భక్తి పరీక్ష పెట్టాలని.. అందులో ఓ పద్మాన్ని శివుడు మాయం చేస్తాడు. దీంతో.. కమల నయనుడిగా పేరున్న నారాయణుడు తన కంటినే తామర పువ్వుగా శివుడికి సమర్పించేందుకు సిద్ధమవుతాడు.విష్ణువు భక్తిని చూసి శివుడు ఆనందించి.. శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. ఆ సమయంలో.. ‘‘ధర్మ రక్షణ కోసం ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది. మూడు లోకాల్లో దీనికి సాటి ఆయుధం లేదు’’ అని శివుడు చెబుతాడు. అయితే ఆ చక్రం శక్తిని పరీక్షించదలిచి.. తొలుత శివుడిపైనే ప్రయోగించే వరం కోరతాడు విష్ణువు. అందుకు శివుడు సంతోషంగా అంగీకరిస్తాడు. మహా విష్ణువు సంధించిన సుదర్శన చక్రం శివుని మూడు భాగాలుగా ఖండిస్తుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమై.. ఈ చక్రం తన రూపాలను ఖండించగలిగింది గానీ తత్వాన్ని కాదని చెబుతాడు. సుదర్శన చక్రాన్ని శ్రీదాముడిని సంహరించేందుకు ఉపయోగించమని సూచిస్తాడు. మహావిష్ణువు అలాగే చేసి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. మహావిష్ణువు అవతారం కాబట్టే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ కోసం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి చేరింది.ఒక్కసారి సంధిస్తే..సూర్య భగవానుడి తేజస్సు కలిగిన సుదర్శన చక్రం హిందూ పురాణాలలో మహావిష్ణువు చేతిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తుంది. అందుకే దీనిని సుదర్శనం అంటారు. రెండు వరుసల్లో పదునైన పళ్లతో గుండ్రటి ఆకారంలో ఉంటుంది. భక్తుల కంటిని ఇది ఆభరణమే. కానీ, ధర్మాన్ని రక్షించేందుకు దుష్టసంహారంలో శిక్షాయుధంగా ఇది ప్రయోగించబడింది. ఒక్కసారి సంధిస్తే.. లక్ష్యాన్ని పూర్తి చేసుకునేంత వరకు వెనక్కి రాదు. చక్రానికి ఉన్న ఆ ముళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వల్ల వేగంగా తిరుగుతూ వెళ్తుంది. ప్రపంచంలోని ఏవైనా పదార్థాలను అతి పదునైన అంచులతో తేలికగా కత్తిరించగలదని ప్రశస్తి. అయితే.. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు.. భక్తి, ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. సుదర్శన చక్రాన్ని ధ్యానించడం వల్ల శాంతి, సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి.సుదర్శనోపనిషత్తు ప్రకారం.. సుదర్శన చక్రాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ తయారుచేశాడు. విశ్వకర్మ తన కూతురు సంజనాను సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే సూర్యుని తేజస్సు మూలంగా ఆమె ఆయన్ని చేరలేకపోతుంది. ఇది గమనించిన విశ్వకర్మ.. సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపడతాడు. అప్పుడు రాలిన పొడితో.. పుష్పక విమానం, త్రిశూలం, సుదర్శన చక్రం తయారు చేశాడు.సుదర్శన చక్రం సంహారాలుశ్రీదాముడితో పాటు హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు(శివుని మూడు ఖండాలు) అనే రాక్షసులను సుదర్శన చక్రం ద్వారా మహావిష్ణువు సంహరించినట్లు వామన పురాణంలో పేర్కొనబడింది. మహాభారత ఇతిహాసంలో.. శ్రీకృష్ణుడు నూరు పాపాలు చేసిన శిశుపాలుడిని సుదర్శన చక్రంతోనే సంహరించాడు. జరాసంధుడు, కంసుడు, నరకాసురుడు కూడా సుదర్శన చక్రంతోనే మరణించారు. ఇవేకాదు.. పురాణా ఇతిహాసాల్లో సుదర్శన చక్రం చుట్టూ అల్లుకున్న సందర్భాలు ఇంకెన్నో. అయితే.. సుదర్శన చక్రం భౌతికంగా ఇప్పుడు ఎక్కడ ఉంది?.. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత సుదర్శన చక్రం తిరిగి విష్ణువుకు చేరిందని విశ్వాసం. ఇది భౌతికంగా కనిపించదుగానీ కాదు.. ఆధ్యాత్మికంగా విశ్వంలో ధర్మాన్ని కాపాడే శక్తిగా భావించబడుతోంది.అన్నమయ్య నోట.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున సుదర్శన చక్రానికి చక్రస్నానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సుదర్శన చక్రంపై ప్రత్యేకంగా కీర్తనలు రచించారు. అందులో “చక్రమా హరిచక్రమా” అనే పద్యం ప్రసిద్ధి పొందింది. విశాఖపట్నం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సుదర్శన చక్రానికి అంకితంగా “సుదర్శన హోమం” నిర్వహించబడుతుంటుంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయం ఉంది. -
ముకుందా.. ముకుందా..
విద్యానగర్(కరీంనగర్): కృష్ణ అనే రెండు అక్షరాలు ప్రణవ మంత్రము, మొదలైన పవిత్ర మంత్రాలన్నింటితో సమానమైనవి. సర్వ భయాలు, విఘ్నాలను తొలగించి విజయ పథంలో నడిపించే అద్భుత చైతన్యం కృష్ణనామం. సత్యం జ్ఞాన మనస్తం బ్రహ్మ, ఆనందోబ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్యాన్ వంటి ఉపనిషత్ వాక్యాల సారం శ్రీకృష్ణ నామమే.కృష్ణతత్వం..కృష్ అంటే భూమి న అంటే లేకపోవడం అని అర్థం. కృష్ణుడు అన్ని మతాలు, దేశాలు, కాలాలకు వర్తించే దివ్య సందేశాన్ని భగవద్గీత ద్వారా అందించి చిరస్మరణీయుడయ్యాడు. పరమ దుషు్టలైన కంస, జరాసంధ, శిశుపాల, నరకాసురాది రాక్షసులను సంహరించి జగద్రక్షకుడయ్యాడు. భారతదేశాన్ని యుధిష్టరుని పాలనలో ఏకచత్రాధిపత్యం కిందికి తెచ్చిన రాజనీతి దురంధరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు.కృష్ణావతారం..సమగ్రమైన ఐశ్వర్యం అంటే శాసించే అధికారం, సంపూర్ణ ధర్మం, నిర్మలమైన యశస్సు, పరిపుష్టమైన సౌభాగ్యం, విజ్ఞానం, నిశ్చలమైన వైరాగ్యం ఈ 6 భగవంతుడి లక్షణాలు. నారాయణుని దశావతారాల్లో ప్రతీ అవతారానికి ఇందులో కొన్ని లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని లక్షణాలున్న పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, చతుర్భుజుడు, శంకచక్ర, గద, పద్మాదరుడు, మణిమయ రత్నమకుట కంకణ ధారుడై శ్రీమహా విష్ణువు ఎనిమిదో అవతారం కృష్ణావతారం. సుమారు 5వేల సంవత్సరాల క్రితం కారాగారంలో దేవకి–వాసుదేవులకు శ్రావణ బహుళ కృష్ణపక్ష అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఆ బాల గోపాల పుణ్యాల పున్నమిగా శ్రీకృషుŠ?ణ్డ జన్మాష్టమి వేడుకలను శనివారం ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. బాల కృష్ణుడి లీలలు వయోభేదం లేకుండా అందరినీ అలరించేవే. పాలు, పెరుగు, వెన్నె చౌర్యంతో చిలిపి చేష్టలతోపాటు పసి వయసులోనే పలువురు రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడి లీలావినోదం వర్ణనలకు అతీతమైంది. అందుకే పారాడే పసిబిడ్డలందరూ ఈరోజు బాలకృష్ణులు మాత్రమే కాదు.. వాళ్ల అల్లరిని ఆనందించి, అల్లారు ముద్దుగా పెంచుకునే తల్లులందరూ యశోదమ్మలే.ఉట్ల పండుగశ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజున పిల్లలకు బాలకృష్ణుడి వేషధారణ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బాల్యంలోని శ్రీకృష్ణుడి విన్యాసాలకు చిహ్నంగా ఉట్ల పండుగను వేడుకగా జరుపుతారు. అందనంత ఎత్తులో ఉట్టిని కట్టి.. అందులోని వెన్నను సాహసంతో తీసుకొచి్చన వాళ్లను బాలకష్ణుడి ప్రతీకలుగా భావించేవారు. ప్రస్తుతం ఉట్లలో పాలు, వెన్నకు బదులు డబ్బులు ఉంచి గెలిచినవారికి బహుమతిగా ఇస్తున్నారు. ఉట్టి కొట్టే వేడుక ఆద్యంతం పిల్లలు, యువకులతోపాటు అందరినీ అలరిస్తుంది. ఉట్టిని అందుకునేందుకు చేసే ప్రయత్నాలను సున్నితమైన పద్ధతుల్లో భంగపరుస్తూ వినోదిస్తుంటారు.శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాల ప్రయోజనాలు వేర్వేరు. ఆదర్శ మానవుడికి ప్రతీక శ్రీరాముడు. అందుకే ఆయన ఏకపత్నీవ్రతుడు. దైవానికి ప్రతీక శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కర్మయోగి, కష్టసుఖాల ఎరగక అలసట తెలియక పనులు చేసి ఉచ్చనీచాలన్నీ భరించాడు. లోకోద్ధరణ కృష్ణావతార పరమార్థం. ఉపనిషత్తులు, వేదాల సారాన్ని అందరికీ విడమరిచి అందుబాటులో ఉండేట్లు భగవద్గీతగా చెప్పాడు. జ్ఞానం కంటే పవిత్రమైంది వేరేది లేదు. ఆత్మ జ్ఞానం లభించిన వాడు శాంతి పొంది చివరకు భగవంతుని చేరగలడని జగత్తుకు ఉపదేశమిచ్చి శ్రీకృష్ణుడు జగద్గురువైయ్యాడు. – పవనకృష్ణశర్మ, ప్రధానార్చకుడు, శ్రీదుర్గాభవాని ఆలయం, నగునూర్, కరీంనగర్ -
కృష్ణం వందే జగద్గురుమ్
చాలామంది కృష్ణుడంటే అల్లరి, చిలిపితనం, మాయలు, మహిమలు... అనే అనుకుంటారు. కానీ కృష్ణుడంటే ఒక చైతన్యం. ఒక స్ఫూర్తి. ఎందుకంటే తానో రాజు కొడుకైనా సామాన్య గోపబాలురతో చెలిమి చేశాడు. అల్లరి పనులతో బాల్యాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాడు. అంతేకాదు, యవ్వనంలో ఉండే చిన్న చిన్న సరదాలనూ చూపించాడు. బంధాలను నిలుపుకోవడంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, స్నేహం... ఏదైనా సరే పది కాలాల పాటు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో వివరించాడు. భగవద్గీత ద్వారా ఈ సారాన్ని ప్రపంచానికి అందించాడు. నేడు కృష్ణాష్టమి సందర్భంగా ఆయన చెప్పిన ఆ పాఠాలను అర్థం చేసుకుందాం...స్నేహానికి ప్రాణంచిన్నప్పుడు గోపబాలురతో అరమరికలు లేకుండా హాయిగా ఆడుకున్న శ్రీ కృష్ణుడు స్నేహితులకు, శరణార్థులకూ మాట ఇచ్చాడంటే తప్పడం అన్నది లేదు. ‘కురుక్షేత్రంలో ఆయుధం పట్టను’ అని చెప్పాడు. ఆ మాట మీదే నిలబడ్డాడు. అంతేకాదు. అర్జునుడితో చుట్టరికం ఉన్నప్పటికీ అంతకు మించి ఆప్యాయతను చూపించాడు. శ్రీ కృష్ణుడు, కుచేలుడి గురించి ఎలా చెప్పుకుంటారో అదే విధంగా శ్రీకృష్ణుడు, అర్జునుడి బంధం గురించి కూడా మాట్లాడతారు. పాండవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అండగా నిలిచాడు. వారికి దిక్కుతోచనప్పుడు మార్గదర్శిగా మారాడు. యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఇవన్నీ కేవలం స్నేహం కోసం చేసినవే.ఒక భరోసా... ఒక నమ్మకంనమ్మకం అనేది ఏ బంధంలో అయినా ముఖ్యం. నమ్మకం పోగొట్టుకోడానికి ఎంతోసేపు పట్టదు. కానీ సంపాదించుకోడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కృష్ణుడు చెప్పింది కూడా ఇదే. ‘నన్ను పూర్తిగా నమ్ము.. అంతా నేను చూసుకుంటాను’ అనే భరోసా ఇచ్చాడందరికీ. అందరికన్నా ముందుగా అర్జునుడికి. ఆ నమ్మకంతోనే యుద్ధంలో పోరాడాడు అర్జునుడు. అంగబలం, అర్థబలం, అధికార బలం, సైనిక బలం ఉన్న కౌరవులపై యుద్ధంలో పాండవులు పైచేయి సాధించగలిగారంటే అందుకు కృష్ణుడే కారణం.స్థాయీ భేదాలు చూపలేదు...అవతలి వాళ్ల స్థాయి ఏంటి... వారు ఎలాంటి హోదాలో ఉన్నారు అన్నది పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలని బోధించాడు కృష్ణుడు. అందుకే సాయం కోసం వచ్చిన కుచేలుడి మనసు అర్థం చేసుకుని ఆనందాన్ని అందించాడు. అదే సమయంలో గౌరవం చూపించాడు. కేవలం స్నేహితులు అనే కాదు. ప్రేమికులు, భార్యా భర్తలు...ఇలా ఏ బంధంలో అయినా సరే అందరినీ సమానంగా చూస్తే ఎలాంటి చిక్కులూ రావని, పరస్పరం గౌరవించుకుంటే సమస్యలే ఉండవని నిరూపించాడు.క్షమాగుణంతప్పులు అందరూ చేస్తారు. కొన్నిసార్లు తెలియక, కొన్ని సార్లు తెలిసి అవి జరుగుతుంటాయి. అంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అయిపోడు. వాళ్లపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు. మిత్రులనే కాదు. శత్రువులను కూడా ఒకే రకంగా ఆదరించడంలో కృష్ణుడు ముందుండే వాడు. ఆ మాత్రం క్షమాగుణం లేకపోతే బంధం ఎలా నిలబడుతుంది? మేనత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడు చేసిన వంద తప్పులను మన్నించాడు. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ల నుంచి ఏవేవో ఆశించకుండా పూర్తిగా డిటాచ్డ్గా ఉండాలని బోధించాడు కృష్ణుడు.పరిపూర్ణ జీవితంకృష్ణుడంటే అన్ని బంధాలనూ ఆస్వాదించిన వాడని మరచిపోరాదు. బాల్యంలోనే కన్న తల్లిదండ్రులకు దూరమైనా, పెంచిన తల్లిదండ్రులను పరిపూర్ణంగా ప్రేమించాడు. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులకూ సాంత్వన నిచ్చాడు. పదహారు వేలమంది గోపికలకూ తన ప్రేమను పంచాడు. అష్టమహిషులనూ అదేవిధంగా ఆదరించాడు. తనను నమ్మి వచ్చిన ఎవ్వరికీ ఏ లోటూ రానివ్వలేదు. తాను సంతోషంగా ఉన్నాడు. తనతో ఉన్న వారిని అదేరీతిలో ఉంచాడు.వ్యక్తిత్వ వికాస గురువుఇప్పుడు వస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నింటికీ మూలాధారం రణరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతే! వ్యక్తిత్వ వికాస బోధకులకు కృష్ణుడే గాడ్ ఫాదర్. అందుకే కృష్ణుడు పరమాత్ముడే కాదు.. అందరికీ పరమ ఆప్తుడు... జగద్గురువు కూడా!– డి.వి.ఆర్. -
జన్మాంతర సాఫల్యం అంటే ఎంటో తెలుసా?
అథర్వ వేదానికి అనుబంధమైనది కృష్ణోపనిషత్తు. ఈ రెండు శ్లోకాలు అందులోనివే:అన్యోన్య విగ్రహం ధార్యం తవాఙ్గస్పర్శనాదిహ / శశ్వత్స్పర్శాయితాస్మాకం గృహ్ణీమోవతారాన్వయమ్.రుద్రాదీనాం వచః శ్రుత్వా ప్రోవాచ భగవాన్స్వయమ్ /అఙ్గసఙ్గం కరిష్యామి భవద్వాక్యం కరోమ్యహమ్.సర్వాంగ సుందరుడు, సచ్చిదానంద స్వరూపుడు, మహావిష్ణు అవతారము అయిన శ్రీరామచంద్రుడిని చూసి వనవాసులైన మునిజనం (ఆయన సౌందర్యానికి) ఆశ్చర్యచకితులైనారు. ఆ మునులు శ్రీరాముడితో ‘ఈ భూమిపై జన్మించిన విష్ణు స్వరూపుడివైన నీ ఆలింగన సుఖాన్ని మేమందరం కోరుకుంటున్నాము’ అన్నారు. వారి మాటలకు శ్రీరాముడు ‘నా మరో అవతారమైన శ్రీకృష్ణావతారంలో మీరందరూ గోపికలై జన్మించి నా ఆలింగన సౌఖ్యాన్నీ, అతి సన్నిహిత సామీప్యాన్నీ అనుభవించి ఆనందిస్తారు’ అని బదులిచ్చాడు. ‘అలాగా స్వామీ! అయితే మమ్ములను మా మరుజన్మలో గోపికలుగాను, గోపబాలురుగాను జన్మింపజేయండి. మీ సాన్నిధ్యాన్ని, మీ స్పర్శ సుఖాన్ని పొందే స్థితిలో మాకు గోపికలుగానూ, గోపబాలురుగానూ రూపాలు ధారణ చేయడం సమ్మతమే!’ అని ఆ మునిగణం ఆనందంతో అంగీకారం తెలిపారు. రుద్రాది దేవతలు, మునులు స్వయంగా చేసిన ఈ స్నేహమయ ప్రార్థనను విన్న ఆదిపురుషుడైన భగవానుడు ‘మీ గాఢమైన కోరికను నేను తప్పక మన్నించి నెరవేరుస్తాను!’ అన్నాడు – అని పై శ్లోకాల భావం. పరమ పురుషుడు, భగవానుడు అయిన శ్రీరాముడి ఈ మాటలను విన్న దేవ మునిగణాలు ఆనందంతో ‘మేము కృతార్థులమైనాము స్వామీ!’ అన్నారు. రామావతారంలో ఏకపత్నీవ్రతుడు అయిన కారణంగా శ్రీరాముడికి మునిజనం కోరికను ఆ జన్మలో తీర్చే అవకాశం లేకపోయిందన్నది విదితం. ఒక జన్మలో చేసిన పుణ్యాలకు ఫలితాన్ని మలి జన్మలో పొందడాన్ని ‘జన్మాంతర సాఫల్యం’ అంటారు. రామావతారంలో మునిజనం కృష్ణావతారంలో గోపికలై జన్మించడం ద్వారా భగవంతునితో అత్యంత సన్నిహితమైన సాంగత్యం పొంది అత్యుత్తమమైన జన్మాంతర సాఫల్యాన్ని పొందారు.– భట్టు వెంకటరావు -
ఏ ధర్మం ఎలా చెప్పినా..అందరమూ వెళ్లిపోవాల్సిన వాళ్లమే!
పుడమిపై శ్వాస పీలుస్తున్న ప్రతి ప్రాణీ ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒకరోజు ఈ జీవితాన్ని ముగించాల్సిందే. పుట్టిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదు. ఇది నగ్నసత్యం. తిరస్కరించలేని నిజం. ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. ‘కుల్లునఫ్సిన్ జాయిఖతుల్ మౌత్ ’ అని పవిత్ర ఖురాన్ చెప్పింది. ‘జాతస్య మరణం ధ్రువం’ అని వేదం చెప్పింది. ఏ ధర్మం చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా అర్థం అదే. కాని మనం దీన్ని పట్టించుకోం. మన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మరణిస్తూనే ఉన్నారు. మనం వారి అంత్యక్రియల్లో పాల్గొని, స్వయానా మన భుజాలపై మోసి, వారిని సమాధిలో దించి, స్వహస్తాలతో వారిపై మట్టికూడా వేస్తున్నాం. వారు సంపాదించిన ఆస్తిపాస్తులు, ఆభరణాలు, హోదా, అధికారం ఏదీ వారు తమవెంట తీసుకువెళ్ళడం లేదు. రిక్తహస్తాలతో వచ్చారు. రిక్తహస్తాలతోనే వెళ్ళిపోతున్నారు.కనీసం పార్థివ శరీరంపై ఉన్న బట్టలు, ఆభరణాలు కూడా ఇక్కడే వదిలేసి, ఆత్మీయులతో బంధాలను సైతం తెంచుకొని ఈలోకాన్ని వీడివెళ్ళి΄ోతున్నారు. తమవెంట భూములు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఏవీ తీసుకొని వెళ్ళడంలేదు. ప్రాణప్రదంగా ప్రేమించే భార్యాబిడ్డలు కూడా వెంట వెళ్ళడంలేదు. అంటే ఇవేవీ ఆ రోజు పనికి రావన్నమాట.ముహమ్మద్ ప్రవక్త ఒక మాట చెప్పారు. ధర్మాధర్మాల విచక్షణ పాటించండి. మంచి పనులు విరివిగా చేయండి. రేపు మిమ్మల్ని కాపాడేవి ఇవే. ‘ఎందుకంటే, మీరు సంపాదించిన డబ్బూ దస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తమూ మీ ఊపిరి ఆగిన మరుక్షణమే మీతో సంబంధాన్ని తెంచుకుంటాయి. మీరు తినీ తినకా, ధర్మం అధర్మం ఆలోచించకుండా, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా మీది కాకుండా పోతుంది. భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం... వీరంతా మిమ్మల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మిమ్మల్ని మట్టిలో కలిపేసి వెళ్ళి΄ోతారు. మీ వెంట వచ్చేది, మిమ్మల్ని కాపాడేది కేవలం మీరు చేసుకున్న మంచి పనులు మాత్రమే.కనుక ధర్మాధర్మాలను విడిచిపెట్టి, ఇతరులను మోసం చేసి, వంచించి, అక్రమ దారిలో సంపాదించి చివరికి బావుకునేదేమిటో ఎవరికివారు ఆలోచించుకోవాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం. అసలు సాఫల్యం. కేవలం మన లాభం కోసం ఇతరులను వంచించడం మానవీయ విలువలకే వ్యతిరేకం. కాబట్టి, ఇహలోక జీవితం ప్రశాంతంగా, సంతోషంగా, గౌరవ ప్రదంగా సాగి΄ోవాలన్నా, రేపటి పరలోక జీవితం జయప్రదం కావాలన్నా మరణాన్ని మరువకూడదు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
జగాలన్నీ ఒకెత్తు, కృష్ణుడు ఒక్కడూ ఒక ఎత్తు
పాండవుల బలం గురించి మాటిమాటికీ అడుగుతూ ఉండే ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పిన కృష్ణతత్వం అనంతం. ‘జగాలన్నీ ఒక ఎత్తు, కృష్ణుడు ఒక్కడూ ఒక ఎత్తు. అతని ముందు ఎన్నున్నా ఏవున్నా దుర్బలాలు. అతని సంకల్పాన్ని బట్టి సృష్టి, పుష్టి, నష్టి కలుగుతూ ఉంటాయి. సత్యమూ, ధర్మమూ స్థిరంగా ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. అక్కడే జయమూ ఉంటుంది. అన్ని లోకాలూ తానే అయి అన్ని జీవులలో ఆత్మగా ఉంటూ విహరిస్తూ ఉంటాడు. మాయను స్వీకరించి ఈ లోకంలో ఏదో రూపాన పుట్టి దుష్టశిక్ష, శిష్ట రక్ష చేస్తూ ఉంటాడు. పాండవుల కష్టాలు పోగొట్టాలనే నెపంతో ధర్మబాహ్యులైన నీ కొడుకులను నిగ్రహించడానికే ఆయన వచ్చా’డంటాడు సంజయుడు. ‘ఆ దేవుని తత్వం ఏ మాత్రం తెలిసిన వారైనా సరే ఆయన్ని ఆశ్రయిస్తారు. హాయిగా బతుకుతారు. విద్య, అవిద్య అని రెండున్నాయి. అవిద్యకు లొంగినవాడు తామసుడై విష్ణువును తెలుసుకోలేడు. విద్వావంతుడే తెలుసుకోగలడు. విద్య అంటే ఎలాంటిదంటే, సత్వ రజ స్తమో గుణాల వికారాలకు లొంగక ధర్మాన్ని అనుష్ఠిస్తూ భావశుద్ధి కలిగి ఉండటమే. విష్ణువును తెలుసుకోవడానికి ఎవరికైనా ఇదే దారి. విద్యా లక్షణాలకి విరుద్ధమైన పద్ధతి అవిద్య’ అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడిని ‘ధర్మపరుడవై కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే నువ్వూ నీ తమ్ములూ సుఖంగా బతకొచ్చు’ అంటాడు. కానీ దుర్యోధనుడికి ఆ మాటలు రుచించవు. గాంధారితోనూ చెప్పిస్తాడు ధృతరాష్ట్రుడు. కానీ వింటేగా దుర్యోధనుడు! అన్నిటిలో తాను ఉంటూ అన్నిటినీ తనయందు ఉంచుకుంటాడు... ఇదే ‘వాసుదేవ’ నామానికి అర్థం. దీనిని సరిగ్గా తెలుసుకున్నవారు శుభ ఫలితం పొందుతారు. – యామిజాల జగదీశ్ -
‘సంసార కటు వృక్షం’ అంటే ఏంటి?
జీవితంలో సారవంతమైన సమయాల కంటే, నీరసంగా గడిచే ఘట్టాలే ఎక్కువ. అందుకే జీవితాన్ని ‘సంసార కటు వృక్షం’ అన్నారు. ఇదొక చేదు ఫలాల చెట్టు. ఎక్కువ ఫలాలు చేదు. కొన్ని మాత్రమే మధురం. జీవితంలో చేదు తగ్గించుకోవాలంటే, క్రోధం, ఈర్ష్య, నిస్సం తోషం, అసంతృప్తి, క్రూరత్వం లాంటి భావనలూ, భావోద్రేకాల రూపంలో ఉండే చేదు ఫలాలను వీలయినంతవరకూ ఏరి పారేసి, దూరంగా ఉంచాలి. లేకపోతే జీవితమంతా చేదవుతుంది. వీలయినంతవరకూ రుచికరమైన మధుర ఫలాలను కోసుకొని, భద్రపరచుకొని తనివారా ఆస్వాదించాలి.ఈ సంసార విషవృక్షంలో శ్రమపడి వెతికితే అందరికీ అమృతతుల్య మైన మధుర ఫలాలు రెండు లభిస్తాయట. ఒకటి – సుభాషిత రసాస్వాదం, రెండు – సజ్జనులతో సాంగత్యం. మంచి మాటల తీయని రుచి చవిచూడ గలగటం, మనసుకు ప్రశాంతిని చేకూర్చగల మంచి మనుషుల సాహచర్యం చేయటం. పెద్దలు అనుభవంతో, మన మేలు కోరి చెప్పే సత్యాలూ, నీతులూ, మార్గదర్శకమైనమంచి మాటలూ విన్నప్పుడు ఆనందాన్నిస్తాయి. మననం చేసుకొంటే మదిని చల్లబరుస్తాయి. పట్టుదలతో, పూనికతో పాటించి చూస్తే, జీవితాన్ని చక్కదిద్ది సుఖమయం చేస్తాయి. అలాగే, జీవితంలో మంచి మనుషుల సాహచర్యం, సాంగత్యం లభిస్తే, అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. సజ్జనుల సాంగత్యంలో, వాళ్ళ స్వభావమూ, నడతా, భావ జాలమూ సాటివారిని ప్రభావితం చేసి, చక్కని వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తాయి.‘కాపీ’ పుస్తకంలో కుదురుగా ఉన్న దస్తూరీని అనుకరించటం అభ్యాసం చేస్తే, అభ్యాసం చేసిన వాళ్ళ చేతిరాత మెరుగయినట్టు, సజ్జనుల సాంగత్యంలో, వారి నీడలో నడిచే వారి నడత తిన్ననవుతుంది. అందుకే ’నీ స్నేహితులెవరో నాకు చెప్పు, నువ్వెలాంటి వాడివో నేను చెప్తాను’ అన్న పాత సామెత ఎంతో అర్థవంతమైంది. – ఎం. మారుతి శాస్త్రి -
మనిషి దుఃఖం నుండి బయటపడలేకపోవడానికి కారణం ఇదే!
ఆత్మ చాలా బలమైనది. ఆత్మ సహకారంతో ఉన్నప్పుడు నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు. వ్యక్తి అనే ముసుగు నుండి, అహంకారపూరితమైన మనస్సు నుండి అతీతంగా ఎదగడం సులభమవుతుంది. అప్పుడు నీవు నీ ఆలోచనలతో, నమ్మకాలతో విడిపడతావు. నీ స్వస్థలమైన ఆత్మను చేరుకుంటావు. ఒక చేపలమ్ముకునే అమె పూలమ్ముకునే వాళ్ళ ఇంట్లో బస చేయాల్సివస్తుంది. ఆమె చేపలవాసనకు అలవాటుపడి ఉండటం వల్ల ఆ ఇంట్లోని పూలవాసనకు నిద్ర పట్టదు. అప్పుడామె తాను అమ్ముకోవడానికి తెచ్చుకున్న ఎండుచేపల మీద నీరు చల్లి, అప్పుడు వచ్చిన వాసనను పీల్చుకుంటూ నిద్రపోతుంది. అంటే మనం అలవాటుకు బానిసలం కావడం వల్ల అది తప్పు అని తెలిసినా మానుకోము. అందులోనే కూరుకునిపోతాం. అందువల్లే మనిషి దుఃఖం నుండి బయటపడలేక పోతున్నాడు. ఆత్మ వెదజల్లే పరిమళాన్ని కాదని మనస్సుకు బందీయై జీవితమంతా గడిపేస్తున్నాడు.గత జ్ఞాపకాలను అన్నింటినీ అధిగమించేయాలి. అది ధ్యానం ద్వారానే సులభమవుతుంది. భవిష్యత్తు లేదు, ఊహలు లేవు, లక్ష్యాలు లేవు, సమస్యలు లేవు.... కేవలం ఈ క్షణంలో ఉంటావు. ఆ ప్రస్తుత క్షణానికి ఏ రూపమూ లేదు. అందరికీ ఒకలాగే ఉంటుంది. ఆత్మానుభవం జరుగుతుంది. అదే నీ నిజతత్వం. అక్కడ వ్యక్తిగా ఉండవు. కొన్ని లక్షల, కోట్ల జన్మలక్రితం ఆత్మ ఎలా ఉండిందో ఇప్పుడూ అలాగే ఉంది. ఇంకో కోటి జన్మల తర్వాత కూడా అలాగే ఉంటుంది. సష్టి కూడా అలాగే ఉంటుంది. అది కాలానికి అతీతమన్నమాట. అది–అంతం లేవు. ఆ ఆత్మ తత్వంలో నీవు ఉన్నప్పుడు పుస్తక జ్ఞానమే అవసరం లేదు. నీవు చెప్పిందే జ్ఞానమవుతుంది.– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
రాముడు భూమిపై అవతరించినప్పుడు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?
విష్ణువు రాముడిగా... కృష్ణుడిగా... ఇంకా అనేక రూపాలలో భూమిపై అవతరించాడని అంటారు కదా... మరి ఆ రూపాలలో ఆయన భూమిపై ఉన్నప్పుడు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా? ‘రామునిగా.. కృష్ణునిగా.. నారసింహుడిగా విష్ణువు భూమిపై అవతరించినప్పుడు ఆయా అవతారాలు పరిసమాప్తి అయ్యేంత వరకు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?’ అనే విషయం తెలుసుకొనే ముందు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం...ఒకేలా ఉండే పది ప్రమిదలలో ఒకేవిధమైన వత్తులు వేసి, నూనె పోసి ముందు ఒక ప్రమిదను వెలిగించి, ఆ ప్రమిదతో మిగిలిన ప్రమిదలు వెలిగించి ఆ ప్రమిదల వరుసలలో పెట్టి; వేరే ఎవరినైనా ఈ ప్రమిదల వరుసలోని ఏ ప్రమిదతో నేను దీపం వెలిగించానో చెప్పగలవా అంటే ఆ వ్యక్తే కాదు ఎవరూ చెప్పలేరు; కారణంం మిగిలిన ప్రమిదలను వెలిగించిన తొలి ప్రమిద వెలుగు తగ్గదు. మిగిలిన ప్రమిదల్లాగే ప్రకాశిస్తుంది... అలాగే భగవంతుడు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా; విడివిడిగా ఎత్తినా తన అస్తిత్వాన్ని కోల్పోకుండా తన అసలు రూపంతో దర్శనమిస్తూనే ఉంటాడు... విష్ణువు నుంచి ఉద్భవించిన ఈ అవతారాలు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడిలో ఐక్యమొందుతాయి... ఒకసారి ఐక్యమొందినా కూడా భక్తుల కోరిక మేరకు మరల, మరల అవే రూపాలతో అవసరమైనప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి.ఈ విధంగా అమ్మవారు అంటే లక్ష్మిదేవి కూడా భూలోకంపై అవతరించారు; అవతరిస్తారు. అలాగే శివ పార్వతులు, మిగిలిన దేవతలు సందర్భాన్ని బట్టి భూలోకంపై అవతరిస్తూ ఉంటారు.– డి.వి.ఆర్. -
నమ్మినోల్లకు నమ్మినంత
అదొక పల్లెటూరు. ఊరి వెనుక ఒక పెద్ద గుట్ట ఉంది. ఊర్లోని ఒక భక్తుడికి ఆ గుట్టపైన గుడి కట్టాలనిపించింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గుడి నిర్మాణం పూర్తి చేశాడు.గుడి పక్కనే ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకుని తల్లితో పాటు అక్కడే నివాసం ఉండే వాడు. గుడి, ఊరికి దూరంగా ఉండటంతోను, కష్టపడి గుట్ట ఎక్కాల్సి రావడంతోనూ గ్రామస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు.ఆ భక్తుడిలో బాధ, భయం మొదలయ్యాయి. కొండంత భారం మోయలేకపోతున్నానని తల్లితో చెప్పుకుని ఏడ్చాడు. అతడి బాధ చూసి ఆమె ‘కష్టాలు కలకాలం కాపురముండవు. మనకూ మంచి రోజులు వస్తాయి. నమ్మినవాళ్ళని భగవంతుడు ఎన్నటికీ విడిచి పెట్టడు’ అని ధైర్యం చెప్పేది.పైకి గంభీరంగా ఉన్నా ఆమెలో కూడా బాధ లేకపోలేదు. హారతిపళ్ళెంలో పడే పైసలు చమురు ఖర్చులకే రావడం లేదని లోలోపలే ఆందోళన చెందేది. ‘అయినా ఇది దైవసేవ. దేవుడే మనకు దారి చూపుతాడు’ అని గట్టిగా నమ్మేది.ఒకరోజు ఆమె గుడిపూజ సామానులు శుభ్రంగా కడిగి ఎత్తి పెడుతున్న సమయంలో హారతి పళ్ళెం గుట్ట బండరాయి మీద పడింది. పళ్ళెం పడిన చోట ఒక వీనుల విందైన రాగం ఆమెకు వినిపించింది. ‘ఇంతలో అయ్యో... పళ్ళెం సొట్టబోయిందే..’ అని బాధపడుతూ వచ్చాడు కొడుకు. కానీ ఆమె అలాగే బండరాయి మీద కూర్చుని చిన్న రాయి తీసుకుని కొట్టసాగింది. ఉన్న పళ్ళెం సొట్టపోయిందని బాధపడుతూ ఉంటే నువ్వేమి చేస్తున్నావని అడిగాడు. ఆమె చిన్నగా నవ్వింది. గుడి చుట్టూ ఉన్న బండరాళ్ళను రాతితో కొట్టి చూడసాగింది. తల్లి చేష్టలను వింతగా చూడసాగాడు కొడుకు. ఆమె గట్టిగా ‘‘మన కష్టాలు తీరిపోయాయి. గుడి పోషణ ఇక సులభం’’ అని చెప్పింది. ఆశ్చర్యపోతూ ఆమె దగ్గరికి వెళ్ళి ‘ఎలా?’’ అని అడిగాడు. ‘‘ఈ బండ రాళ్ళను కొట్టి చూస్తే, సరిగమపదనిసలు పలుకుతున్నాయి. వెంటనే శిల్పకళ గురువు స్థపతిని పిలిపించు. సప్తస్వరాల్లోని ఒక్కో రాగం పలికే బండను ఎంపిక చేసి వరుసగా పెట్టించాలి. ఆ రాగాలను పలికించడానికి ఒక రాయిని అందుబాటులో ఉంచాలి. వచ్చిన భక్తులు ఆసక్తిగా వీటిని కొట్టి సంతోష పడతారు’’ అని చెప్పింది. మారుమాట్లాడకుండా తల్లి చెప్పినట్లే చేశాడు.ఆ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టూ ఉన్న గ్రామాలకు చేరింది. మొదట పిల్లలు, ఆ తర్వాత యువకులు, చిన్నగా ఊరిజనం, చుట్టుపక్కల గ్రామస్తులూ గుట్ట ఎక్కడం ప్రారంభించారు. దైవ దర్శనం చేసుకుని సరిగమలు పలికిస్తూ సంతోషపడసాగారు. గుడి ఆదాయం చిన్నచిన్నగా పెరగసాగింది. తల్లీకొడుకు దేవుడికి నమస్కరిస్తూ ‘నమ్మినోల్లకు నమ్మినంత’ అనుకున్నారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
ఆదర్శం అంటే...
‘‘ఇది చేయాలనుకొంటున్నాను, అది చేయాలను కొంటున్నాను.’’ అని అంటూ ఉంటారు చాలా మంది. ఒక సారి చేసిన తరవాత చేయాలి అనుకోటానికి అవకాశం కానీ, అవసరం కాని ఏముంది? జీవితంలో ఫలానాది సాధించటం నా ఆదర్శం, ఎప్పటికైనా నేను ఆ విధంగా అవాలి అనుకుంటున్నాను – ఇటువంటి మాటలు యువత నుండి తరచుగా వినపడుతూ ఉంటాయి. అంటే, ఆ విధంగా ఉండటం వారికి ఇష్టం. కాని, ఉండే ప్రయత్నం మాత్రం చేయరు. వారికి ఏదైనా కావాలి అంటే మాత్రం వెంటనే వచ్చేయాలి. దానికి శ్రమ పడేది తాము కాదు కదా! అమ్మనో, నాన్ననో సతాయించి సాధించుకుంటారు. తాము చేయవలసిన వాటిని ఆదర్శం పేరిట గోడ మీద రాస్తారు ‘‘రేపు’’ అని. ఆ రేపు ఎప్పటికీ రాదు. వెళ్ళిపోయింది నిన్న. వచ్చి మనకి అందుబాటులో ఉన్నది ఈ రోజు. ఆచరించాలి, లేదా ప్రయత్నం చేయాలి, లేదా మొదలు పెట్టాలి అంటే – ఇప్పుడే, ఈ క్షణమే సరి అయింది. పరిస్థితులు అనుకూలించినప్పుడు, నాకు వీలైనప్పుడు అనుకుంటే కుదరదు. ఎందుకంటే బద్ధకించే వారికి వాయిదా వేయటానికి ఏదో ఒక వంక దొరుకుతుంది. అలలు తగ్గాక సముద్రంలో స్నానం చేస్తాను అని ఒడ్డున కూర్చొన్నట్టు ఉంటుంది. అంటే ఆదర్శాలు ఉండకూడదా? అనే ప్రశ్న వస్తుంది. ఉండాలి. చిన్న పిల్లవాడికి ఐఏఎస్ అవాలన్నది ఆదర్శం. ఈ క్షణాన అవలేడు కదా! దానికి ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి. దాని కోసం ఇప్పటి నుండి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా శిక్షణ తీసుకోవాలి. ఇప్పటినుండి ఎందుకు? డిగ్రీ అయినాక చూద్దాం, అనుకుంటే కుదరదు కదా! ఆదర్శం వాస్తవంగా మారటానికి తగిన కృషి చేయాలి. ఉన్నతమైన ఆదర్శాలు ఉండటం మంచిదే. నిజానికి ఉండాలి కూడా. ఆదర్శాలు వల్లెవేయటానికి బాగుంటాయి కాని, అవి ఆకాశ హర్మ్యాలు కాకూడదు. తన శక్తి సామర్థ్యాలకు తగినట్టు ఉండాలి. మృత్యువును జయించటం, బొందితో స్వర్గానికి వెళ్ళటం వంటి అసాధ్యమైనవి సాధించటం నా ఆదర్శం అనటం హాస్యాస్పదం. అవి సాధించటం కుదరదు కనుక ప్రయత్నం చేయటం వృథా అని మానేయటానికి ఒక వంక చెప్పే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అద్దాన్ని ఆదర్శం అంటారు. ఆదర్శాలు అద్దం లాంటివి. దానిలో ప్రతి బింబాలు మాత్రమే కనపడతాయి. బింబం కాదు. అయితే, ప్రతిబింబం బింబాన్ని సరిచేయటానికి పనికి వస్తుంది. చెదిరిన బొట్టు దిద్దుకోటానికో, చెరిగిన జుట్టుని సద్దుకోటానికో అద్దంలోని ప్రతి బింబం సహాయం చేస్తుంది. అందులో చూసి ముఖాన్ని సరి చేసుకోవచ్చు. ప్రతిబింబంలో సరి చేయటం కుదరదు. అద్దంలో ప్రతిబింబానికి బొట్టు పెడితే ముఖం మీదకి రాదు కదా! రాసి పెట్టుకున్న ఆదర్శాలు అద్దంలో ప్రతిబింబాల వంటివి. ఆచరణ ముఖం లాంటిది. అక్కడ చూస్తూ ఇక్కడ తగిన మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఆదర్శాలని గుర్తు చేసుకుంటూ ప్రేరణ పొందాలి. ఆదర్శం వ్యక్తులు అయితే వారి వలె ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆ స్థాయికి రావటానికి వారు ఏవిధంగా శ్రమించారో దానిని ఆదర్శంగా తీసుకోవాలి కాని, ఇప్పుడు వారు అనుభవిస్తున్న సుఖాన్ని, వైభవాన్ని కాదు. దురదృష్టవశాత్తు చాలామంది రెండవ దానినే ఆదర్శంగా తీసుకోవటం జరుగుతోంది. ఆదర్శం ఆచరణగా పరిణమించాలి. ఆదర్శాలను వాస్తవాలుగా పరిణమింప చేసుకోటానికి శక్తి మేరకు కృషి చేయాలి. ఒకవేళ అది ఫలించక పోయినా పరవాలేదు. ప్రయత్నం ప్రధానం. తన ఆదర్శాన్ని సాకారం చేయటానికి జీవిత మంతా వెచ్చించారనే ఖ్యాతి మిగులుతుంది. – డా.ఎన్. అనంతలక్ష్మి -
ఈ ఒక్క నామంతో విష్ణు సహస్రనామం పఠించినంత పుణ్యం
కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గం నామ సంకీర్తన అని అందరికీ తెలుసు. అయితే పాడటం తెలీదని చింతించనక్కర్లేదు. భజనలు ఎలా చేయాలో కూడా తెలీదు అని చింతించ నక్కర్లేదు. సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా ఉచ్చరించలేనుగా అని చింతించనక్కర్లేదు. నిజాయతీగా, భక్తితో ఉచ్చరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు.‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’ – దీనిని చెప్పుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం పఠించిన ప్రయోజనం పొందుతాం అంటారు. అది కూడా సాధ్యం కాదా? ఐదు నామాలు చాలు. అయిదింటిలో మొదటి నామం: ‘రామ’. చింతలు, దుఃఖాలు తలెత్తినప్పుడు ఏకాంత ప్రదేశంలో కూర్చుని రామ నామాన్ని జపిస్తే చాలు, రామ నామం విన్న వెంటనే హను మంతుడు ఆ ప్రదేశంలోకి వచ్చి కూర్చుంటాడని అంటారు. ‘యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్/ తత్ర తత్ర కృతమస్త కాంజలిమ్’.రెండవ నామం: ‘కృష్ణ’. ఈ నామమే పాండవులను రక్షించింది. ‘కృష్ణా! నాకు కష్టాలు ఇవ్వు! అప్పుడే, నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని కృష్ణుడిని వరం అడిగింది కుంతి. మానసిక బలాన్నీ, కష్టాలను భరించే ఓర్పునూ ఇచ్చే నామమిది. మూడవ నామం: ‘నారాయణ’. బాలుడు ప్రహ్లాదుడిని రక్షించిన నామం. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా రక్షించిన నామం. నాలుగవ నామం: ‘గోవింద’. దుశ్శాసన సభలో ద్రౌపది తన రెండు చేతులను పైకెత్తి ‘గోవింద! గోవింద!’ అని అన్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడిన నామమిది. తిరుమలలో ఎల్లవేళలా ప్రతిధ్వనించే నామం. ఇక ఐదవ నామం: ‘నరసింహ’. నీవే శరణాగతి అని నమ్మిన భక్తులకు కష్టాల నుంచి విముక్తిని ఇస్తాడు నరసింహుడు. వేరు వేరు పేర్లతో ఉన్న దేవుని ఏ పేరుతో ఎక్కడ స్మరించినా ఆయన ఆలకించి ఆదుకుంటాడు.– యామిజాల జగదీశ్ -
ఆర్మీ అన్నలకు ‘రాఖీ’ సెల్యూట్!
కళ్ల ఎదుటే ఉన్న అన్నకు చెల్లెలెలాగూ రాఖీ కడుతుంది. ‘అండగా ఉండన్నా’ అంటూ అన్నదమ్ముల్ని అడుగుతుంది. కానీ... కొందరు అన్నలు అక్కడెక్కడో సుదూర మంచు పర్వత సానువుల్లోనో, ఎగిరిపడే రేణువుల ఎర్రటెడారి ఇసుకల్లోనే గస్తీ తిరుగుతూ ఉంటారు. అప్రమత్తంగా ఉంటూ అనునిత్యం మన సరిహద్దులకు కాపలా కాస్తూ ఉంటారు. వాళ్లకు ఏ చెల్లెమ్మలూ కనబడరు. ఏ అక్కలకూ వాళ్లందుబాటులో ఉండరు. అయితే... సొంత అన్నదమ్ములైనా అవసరమైనప్పుడు రక్షణ కల్పించడానికి వస్తారో రారోగానీ ఆ సోదరులు మాత్రం ఎవరు రాఖీ కట్టినా కట్టకున్నా... శత్రువుల నుంచి నిర్భీతిగా నిత్యరక్షణకవచంలా నిరంతరమూ మనకడ్డుగా నిలబడిపోతుంటారు. వాళ్లే మన సరిహద్దులను అనుక్షణం రక్షిస్తుండే మన ఆర్మీ జవాన్లు! ఆ ఆర్మీ అన్నలకు చెల్లెళ్ల ప్రేమానురాగాలు తప్పక దక్కాలనే సంకల్పంతో కొందరు చెల్లెళ్లు గత 28 ఏళ్లుగా ప్రయాసపడుతునే ఉన్నారు. వాళ్లు పడే ఈ ప్రయాస ప్రాధాన్యమేమింటే... వాళ్లకు అత్యంత ఆనందాన్నిచ్చే ఓ అందమైన శ్రమ. ఆ చెల్లెళ్లు మరెవరో కాదు... మహారాష్ట్ర జలగావ్లోని ‘ఇందిరాగాంధీ సెకండరీ స్కూల్’కు చెందిన విద్యార్థినులు.ఒకటీ రెండేళ్లుగా కాదు... అసిధారావ్రతంలా అచ్చంగా గత ఇరవయ్యెనిమిదేళ్లుగా సైనిక సోదరులకిలా రాఖీలు పంపుతున్నారు. వాటిని ఆ విద్యార్థినులు ఇంకెవరినుంచో తీసుకోరు. మరెక్కణ్నుంచో కొనరు. స్వయంగా తమ చేతులతో ప్రేమగా తయారు చేస్తారు. ఇందుకు కావాల్సిన ముడిసరుకులనూ తమ పాకెట్ మనీతోనే కొంటారు. ఇలా ప్రతి ఏడాదీ వాళ్లు కనీసం 28,000 లకు తగ్గకుండా రాఖీలు తయారు చేసి పంపుతూ రక్షాబంధన్ పండుగ వేడుకలకు నిజమైన సంప్రదాయాన్నీ, స్ఫూర్తినీ అద్దుతున్నారు.వంద నుంచి వేలాది రూపాయల వరకు... ఓ చెల్లి తన అన్నకు రాఖీ కట్టాక ఉద్వేగాలను అదుపులో ఉంచుతూ ఆ అన్న తనకున్నంతలో తన చెల్లెలికిచ్చే బహుమతులు వంద రూపాయల నుంచి వేలలో ఉంటాయి. ఉదాహరణకు వంద రూపాయలలోపు వచ్చే రిబ్బన్ర్యాప్లో కట్టిన చాక్లెట్ బాక్స్నో, రెండొందల్లో వచ్చే ఆమె పేరులోని మొదటక్షరమో, ఆమె రాశీచక్రపు గుర్తుతో దొరికే కీచైనో, వెయ్యి రూపాయల విలువైన వన్ గ్రామ్ గోల్డ్ గొలుసో, రెండువేల విలువైన డ్రస్సూ– దుపట్టానో, పదివేల విలువ చేసే పెండెంటో లేదా లక్షల విలువ చేసే నిజం బంగారమో ఏదో ఒకటి రిటన్ గిఫ్టుగా ఇచ్చేందుకు ఇప్పుడు మార్కెట్లో రెడీలీ అవైలబుల్ గిఫ్ట్లు ఎన్నో ఉన్నాయి.మరి ఆ ఆర్మీ అన్నయ్యలేమిస్తారో... ఎర్రటెండల్లో వాచీతో పాటు రాఖీని చూసినపుడు తగిలే చల్లగాలి తెమ్మెరలాంటి హర్షోల్లాసపు ఆహ్లాదభావన ఆ చెల్లెలు అందించే గిఫ్ట్ అయితే... గస్తీ పనిలో భాగంగా పర్వతసానువులపైన పైపైకిపాకేవేళల... మణికట్టుపై కట్టి ఉన్న ఆ రాఖీని చూసినప్పుడు... ఆ తెలిమంచు తెరలపై తన చెల్లెలి ముఖం కనిపిస్తే కంటికి అడ్డుపడే ఆ కన్నీటితెరతోపాటు సంతోషాలు ఉబికి వస్తుండటమే ఆ అన్నయ్యిచ్చే అమూల్యమైన రిటర్న్ గిఫ్ట్. దేశరక్షణతో పాటు మనకు అది అదనం. – యాసీన్ -
వేయి శుభముల వరము మీకు...
భక్తితో పూజిస్తే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి కఠినమైన నిష్ఠలు, నియమాలు, మడులకన్నా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తాలే ముఖ్యం. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాచరణ వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సకల సంపదలూ కలుగుతాయని ప్రతీతి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, ఆరోగ్య సంపద, జ్ఞానసంపద మొదలైనవి ఎన్నో.పూజను చక్కగా... భక్తి శ్రద్ధలతో చేసుకోవాలంటే ముందుగా పూజాద్రవ్యాలను సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మధ్య మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు. పూజకు కావలసినవి: పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరొత్తులు, కర్పూరం, చిల్లరనాణేలు, తెల్లని వస్త్రం, రవికల గుడ్డ, మామిడాకులు, పండ్లు, అమ్మవారి పటం లేదా ప్రతిమ, కలశం, కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో శుచిగా తయారు చేసిన నైవేద్యాలు (శక్తి కొలదీ చేసుకోవచ్చు) బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, ఆవునెయ్యి.శ్రావణమాసంలో ΄పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.వ్రత విధానంవ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన ముగ్గువేసి, కలశం పెట్టాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును అమర్చుకోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకుని ఉంచాలి.తోరం ఇలా తయారు చేసుకోవాలితెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఇలా తయారు చేసుకున్న తోరాలను పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి పూజకు సిద్ధం కావాలి.గణపతి పూజఅదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా! ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలుంచాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి. స్వామివారి ముందు పళ్ళు లేదా బెల్లాన్ని నివేదించి తాంబూలం సమర్పించాలి. అనంతరం నీరాజనం సమర్పించాలి. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సు మీద ఉంచుకోవాలి. తర్వాత వరలక్ష్మీ వ్రతాన్నిప్రారంభించాలి.కలశపూజకలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాఃమూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితాఃకుక్షౌతు సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరాఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణఃఅంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాఃఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై చిలకరించాలి. పూజ చేస్తున్న వారు తమపైన చల్లుకోవాలి.అనంతరం పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి. ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఇంతకుముందు సిద్ధం చేసుకున్న తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి పూజించి కుడిచేతికి తోరం కట్టుకోవాలి.వ్రత కథాప్రారంభంపూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ‘‘మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి’’ అన్నారు. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని చెబుతూ శివుడు పార్వతికి చెప్పిన ఆ వ్రత కథను ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గల యోగ్యురాలు. రోజూప్రాతఃకాలాన నిద్రలేచి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని భర్త, అత్తమామల సేవలో తరించేది.వరలక్ష్మీ సాక్షాత్కారంవరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో కనిపించి ‘ఓ చారుమతీ! ఈ శ్రావణ ΄పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తాను’ అంటూ పూజా విధానాన్ని చెప్పి అంతర్థానమైంది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా ΄పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.అనంతరం అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి రథ గజ తురగ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.ఈ కథ విని అక్షతలు శిరసుపై ధరించాలి. ఆ తరువాత ముతై ్తదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాలి. పూజ చేస్తున్నంతసేపూ ప్రశాంత చిత్తంతో ఉండాలి. – డి.వి.ఆర్. -
సేవతోనే సాఫల్యం: కోళ్లపురి వరదలు ఇంట్రస్టింగ్ స్టోరీ
పూర్వం కోళ్ళపురి అనే ఊరిలో చాలా కోళ్ళు ఉండేవి. వాటితోపాటు కొంతమంది బాతులు కూడా పెంచుకునేవారు. ఒకరోజు ఊరి వెలుపల చెరువులో ఒకబాతు స్నానానికి వెళ్ళింది. ఈదీఈదీ (స్నానం చేసి) బయటికొచ్చింది. ఒళ్ళంతా, ఈకలన్నీ తడిసి పోవడంతో రెక్కలు టపటపలాడించసాగింది. అప్పుడు అనుకోకుండా దాని రెక్కలు పక్కనే ఉన్న ముళ్ళ పొదలో ఇరుక్కు పొయ్యాయి. ఎంత విదిలించుకున్నా ఒళ్ళంతా గాయాలయ్యాయి గాని, అందులోంచి బయట పడలేక పోయింది. అంతలో చాలా కోళ్ళుమేసుకుంటూ మేసుకుంటూ అటువైపుగా వచ్చాయి. వాటిని చూడగానే బాతు ప్రాణం లేచి వచ్చింది. స్నేహితులారా.. నాక్కాస్త సహాయం చేయండి. నేనీ ముళ్ళ పొదలో చిక్కుకు పోయాను. నా ప్రాణాలు కాపాడండి. అని మొరపెట్టుకుంది. కాని ఆ కోళ్ళు దానికి సహాయం చెయ్యకపోగా, ‘‘మాకేం పని.. నువ్వేమైనా మాకులమా.. మా మతమా.. నీది బాతుకులం.. మాది కోడి కులం..’’ అంటూ తమదారి తాము వెళ్ళి పొయ్యాయి. కాని అందులో ఒక తెల్లని కోడి, ‘‘లేదు..లేదు.. మనమంతా కలిసి బాతును రక్షిద్దాం.. మనం కులం కాక పోయినా దానిది కూడా ప్రాణమేకదా..మనకెలా భయం, బాధ కలుగుతాయో దానికీ అలాగే కలుగుతాయికదా.. రండి రక్షిద్దాం’’ అని చెప్పింది.కాని కోళ్ళుదాని మాట వినలేదు. ‘‘నీకంత ప్రేమ ఉంటే నువ్వెళ్ళి కాపాడుకో.. మేము రాము’’ అని తెగేసి చెప్పాయి. తమదారి తాము వెళ్ళి΄ోయాయి. పాపం తెల్ల కోడి చాలా బతిమాలింది. ఈరోజు మనం దానికి సహాయం చేస్తే, రేపు మనకేదైనా ఆపద వస్తేదేవుడు మనల్ని కా పాడతాడు. అని నచ్చజెప్పజూసింది. అయినా కోళ్ళు దాని మాట లక్ష్య పెట్టకుండా కొ..క్కొ..క్కొ..క్కో... అనుకుంటూ అక్కణ్ణించి వెళ్ళి΄ోయాయి. తెల్లకోడి ఇక చేసేదేమీలేక ఒక్కతే బాతును రక్షించడానికి కంకణం కట్టుకుంది. ముళ్ళకొమ్మలు ముక్కుతో, కాళ్ళతో లాగడం వల్ల అది కూడా తీవ్రంగా గాయపడింది. అయినా సరే దైవంపై భారంవేసి శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నించింది. చివరికి విజయం సాధించింది. బాతుప్రాణాలతో బయట పడింది. బాతు దైవానికి, తెల్ల కోడికి కృతజ్ఞతలు సమర్పించుకుంది. తెల్లకోడిని వాటేసుకొని మరీ మరీ ధన్యవాదాలు చెప్పింది. నీ మేలు ఎన్నటికీ మరువనని వాగ్దానం చేసింది.కొన్నాళ్ళకు కోళ్ళపురి అనే ఆ ఊరికి వరదలొచ్చాయి. అంతా తట్టా బుట్టా సర్దుకొని తలా ఒక మెట్ట వైపుకు బయలు దేరారు. కోళ్ళన్నీ భయంతో గజగజ వణికిపోతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. తమ యజమానులైనా రక్షిస్తారేమోనని ఎదురు చూశాయి. కాని వారేప్రాణభయంతో తలా ఒక దిక్కుకు పరుగు లంకించుకుంటున్నారు. చూస్తూ చూస్తూనే వరద సమీపిస్తోంది. కాళ్ళ దగ్గరికొచ్చేసింది. అంతలో బాతు పరుగెత్తుకుంటూ వచ్చింది. వచ్చీరాగానే తెల్ల కోడిని సమీపించి, మిత్రమా భయపడకు నేనున్నాను. అంటూ వీపుపై ఎక్కించుకొంది. అది చూసి మిగతా కోళ్ళకు పశ్చాత్తాపం కలిగింది. ఆరోజు మనం కూడా సహాయానికి పోయి ఉంటే ఈనాడు మనకు కూడా సహాయం అందేదే అని చేసిన తప్పును గుర్తుచేసుకొని సిగ్గుతో తలవంచుకున్నాయి. బాతు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తెల్ల కోడిని సురక్షిత ప్రదేశానికి చేర్చి, తన తోటి బాతులన్నిటినీ పిలుచుకొచ్చింది. కోళ్ళన్నిటినీ అవి తమ వీపులపై ఎక్కించుకొని ఈదుకుంటూ అవతలకు చేర్చాయి. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యడం, ఇతరుల బాధను తొలగించడం చాలా గొప్ప పుణ్యకార్యం. ఆపదలో ఉన్నవారు మనవాళ్ళా కాదా అని చూడడం అజ్ఞానం. మనవాళ్ళయితే సహాయం చెయ్యడం, కాకపోతే వదిలేయడం ధర్మ వ్యతిరేకం. మానవత్వానికీ వ్యతిరేకం. ఆపదలో పడింది ఎవరైనా సరే ఆదుకోవడం ధర్మం, మానవత్వం. ఏదోఒక సమయంలో దాని ప్రతిఫలం లభించి తీరుతుంది. మనకు తెలియకుండానే ఊహించని వైపునుండి సహాయం అందుతుంది. ఇతరుల కష్టాలను దూరం చేసేవారిని దైవం ప్రేమిస్తాడని, వారి కష్టాలను దూరం చేస్తాడని దైవ ప్రవక్త వారు చెప్పిన సూక్తికి ఈ కథ అద్దం పడుతోంది. కనుక కష్టాల్లో, బాధల్లో ఉన్నవారు ఎవరైనా సరే శక్తిమేర ఆదుకునే ప్రయత్నం చేయడమే విశ్వాసుల లక్షణం. తద్వారానే ఇహ, పరలోకాల సాఫల్యం ప్రాప్తమవుతుంది.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
శ్రీకృష్ణ సృష్టి... సురభి
జనానాం క్షున్నివృత్యర్థం ప్రత్యూషే భజతి ప్రభుఃతథాహి శ్రీహరిసృష్టా కామధేనుః ప్రసూరభూత్లోకాలన్నిటికీసంతృప్తి కల్గటానికి శ్రీహరి తన ఆకలి తీర్చుకుంటాడు. అందుకే కామధేనువు సృష్టి జరిగింది. సర్వజీవకోటికీ ఆహారాన్ని అనుగ్రహించటమే శ్రీహరి సంకల్పం.నిజమాలోచిస్తే, శ్రీహరికి ఆకలి ఏమిటనిపిస్తుంది. గోలోకంలో ఒకప్పుడు శ్రీకృష్ణుడు తనకు ఆకలి వేసింది అన్నాడు. రాధ ప్రక్కనే ఉంది. ఇదేదో విచిత్రమనుకొన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు తన దేహం ఎడమభాగం నుండి ‘సురభి’ని సృష్టించాడు. ఒక కుండలోకి పాలు పితికాడు. ఆయన కొన్ని ఆరగించి, ఎందుకనో ఆ కుండను నేలకేసి కొట్టాడు. ఆ కుండ తాకిడికి భూమి మీద ఒక పెద్ద కొలను ఏర్పడింది. ఆ కొలను చూడగానే రాధకు పట్టలేనంత సంతోషం కల్గింది. ఆ కొలనులో స్నానం చేస్తూ, ఈతలు కొడుతూ సంతోషంతో, కేరింతలు కొట్టడం ప్రారంభించింది.ఈ సురభి నుండి గోవులనేకం పుట్టు కొచ్చాయి. అవి అన్నీ, భూలోకానికి చేరు కున్నాయి. భూమి మీద ఉన్న ఆవులజాతిఅంతా ఈ సురభి సంతానమే. భూమి మీద మానవులంతా ఈ ఆవులను పోషిస్తూ, వాటి పాలు, పెరుగు, నెయ్యి మొదలగునవి ఆహా రంగా తీసుకొని, సుఖశాంతులతో ఉన్నారు. ఆవును తల్లిగా భావించి, రక్షించి, పూజించటం ప్రారంభించారు. అప్పటినుంచి అది ‘గోమాత’ అని పిలవబడింది.ఇదీ చదవండి: Raksha Bandhan 2025 పర్వాల పూర్ణిమ, రాఖీ పరమార్థం ఇదే!ఒకప్పుడు భూలోకంలో విపత్కరమైన కరవు వచ్చింది. అందువల్ల గోరక్షణా లేదు, గోపూజా లేదు. పంచ గవ్యములు లేక పోవటం చేత యజ్ఞయాగాదులు ఆగి పోయాయి. అందువల్ల దేవతలకు హవిర్భా గాలు అందటం లేదు. కనుక మానవులతో పాటు దేవతలకు కూడా ఇబ్బంది కల్గింది. ఇలా దేవతలు, మానవులు ఇక్కట్టుల పాలవటం బ్రహ్మ గమనించి దేవతలనువెంటబెట్టుకొని, గోలోకం వెళ్లాడు. అక్కడశ్రీకృష్ణునికి ఈ బాధలన్నీ చెప్పి మొర పెట్టుకున్నాడు. కృష్ణుడు వారి దైన్యాన్ని చూచి మొర ఆలకించి కనికరించాడు. వెంటనే సురభిధేనువు తోక నుండి ‘కామధేనువు’ను సృష్టించి దేవతలకు అనుగ్రహించాడు. దేవతల కోరిక మేరకు ఆ కామధేనువు వేలకొలది ఆవుల్ని భూలోకానికి ప్రసాదించింది.మళ్లీ ప్రజలందరికీ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. యథావిధిగా గోపూజ, గోరక్షణ మునుపటి లాగానే కొనసాగుతున్నాయి. జయ గురు దత్త!చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
శ్రావణ మాసం : వరాలమ్మ తల్లి.. వల్లూరమ్మ
తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్థి చెందిన అమ్మవారి ఆలయాలలో ప్రకాశంజిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలోని వల్లూరమ్మ ఆలయం ఒకటి. మూడు వందల సంవత్సరాల క్రితం హోమ గుండంనుండి ఉల్కాముఖిగా ఆవిర్భవించిన ఆదిశక్తి వల్లూరు గ్రామనామంతో వల్లూరమ్మగా వ్యవహరింపబడుతూ భక్తుల పూజలందుకుంటున్నది. ప్రజలను, పశుసంపదను వ్యాధి బాధలనుండి, దుష్టశక్తులనుండి కాపాడే చల్లనితల్లిగా విరాజిలుతోంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఉన్నతాధికారులు వంటివారు వల్లూరమ్మను తప్పక దర్శించి పూజలు నిర్వహిస్తారు. నాయకులకు వల్లూరమ్మ ఆలయం వద్ద ఘనంగా స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకురావడం నేటికీ అమలు జరుగుతున్న సంప్రదాయం. వల్లూరమ్మ ఆవిర్భావం వెనుక ఆసక్తిదాయక కథనం ఉంది. 17వ శతాబ్దిలో ఒంగోలుతోపాటు పరిసర ప్రాంతాలను ఒంగోలు రాజులుగా పేరొందిన మందపాటి జమీందారులు పాలించేవారు. రామభద్రరాజు, రామచంద్రరాజు హైదరాబాద్, కర్నాటక నవాబులకు అనుకూలంగా వ్యవహరిస్తూ తమ రాజ్యాన్ని విస్తరించుకున్నారు. వీరిలో రామచంద్రరాజు అమిత ధైర్యశాలిగా, పరాక్రమవంతునిగా పేరొందాడు. ఒంగోలు రాజుల ప్రాబల్యం వెంకటగిరి రాజులకు కంటగింపైంది. చిలికిచిలికి గాలివాన అన్నట్లు కొన్ని విషయాలలో ఉభయుల మధ్య ఏర్పడిన తగాదా చివరకు యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు రాజులు పరాక్రమంలో గొప్పవారు కాగా వెంకటగిరి రాజులు ఆర్థికంగా, సైనికపరంగా బలోపేతులు. యుద్ధంవల్ల జననష్టం, ధన నష్టం జరుగక తప్పదనే భావన కలిగింది. దీనితో వెంకటగిరి రాజులను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జయించాలనే ఆలోచన ఒంగోలు రాజులలో కలిగింది. ఒంగోలు రాజులకు సన్నిహితుడు, దేవీ ఉపాసకుడు, మంత్రతంత్ర శాస్త్రాలలో అపార ప్రావీణ్యం కలిగిన అద్దంకి రామచంద్రయ్య బరూరి నరసింహ యోగీంద్రుల సహకారంతో అగ్నిగుండంనుండి దివ్యశక్తిని ఉద్భవింపచేసి వెంకటగిరి రాజులను జయింవచ్చని సలహా ఇచ్చాడు. అద్దంకి రామచంద్రయ్య యజ్ఞకర్తగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సంగతి గూఢచారులద్వారా తెలుసుకున్న వెంకటగిరి రాజులు ΄ోలూరి వంశజుల సహకారంతో, పరాంకుశవారి తోడ్పాటుతో ఒంగోలు రాజులు తలపెట్టిన హోమానికి విఘాతం కలిగించే మంత్రతంత్ర ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన యజ్ఞకర్తౖయెన బరూరి నరసింహ యోగీంద్రునిపై మంత్రతంత్ర ప్రయోగం చేసారు. దాని ప్రభావంతో ఆయనకు తీవ్రమైన కడుపు నొప్పి ప్రారంభమైంది. యజ్ఞగుండంనుండి అమ్మవారుఆవిర్భవించే సమయం ఆసన్నమైందని, ఆమె ఆవిర్భవించగానే ఆమెకు హారతి ఇచ్చి, బలి సమర్పించి సంప్రీతురాలిని చేయవలసినదిగా చెప్పి ఆయన బహిర్భూమికి వెళ్లారు. జ్వాలలు వెలిగక్కుతూ యజ్ఞగుండంనుండి 12 సంవత్సరాల బాలిక రూపంలో అమ్మవారు బయలువెడలడంతో అది చూసిన అద్దంకి రామచంద్రయ్య చేష్టలుడిగి అమ్మవారికి నివేదన చేయలేదు. దాంతో ఆమె అలిగి ముందుకు సాగింది. ఆమె చూపులు ప్రసరించిన మేర అంతా మంటలు వ్యాపించి కాలి బూడిద అయ్యాయి. ఆందువల్ల ఆమెకు జ్వాలాముఖి అనే పేరు కలిగింది. ఆమె ఈతముక్కల ప్రాంతానికి చేరగానే గ్రామ రైతు రామచంద్రారెడ్డి అమ్మవారిని గమనించి ఆమెకు పాలను సమర్పించి సంతోషపరచాడు. తాను గ్రామాన్ని, ప్రజలను చల్లగా కాపాడుతూ అక్కడనే ఉంటానని పలికి జ్వాలాముఖి ఈతముక్కల గ్రామ పొలిమేరలో వెలసింది.ఇదీ చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!ఉల్కాముఖి ఆవిర్భావం..వెంకటగిరి రాజుల వంచనవల్ల తమ కార్యం విఫలమైందని మందపాటి రాజులు, అద్దంకి రామచంద్రయ్య బాధపడుతుండగా బరూరి నరసింహ యోగీంద్రులు శుచిౖయె యజ్ఞస్థలికి వచ్చి పరిస్థితిని గ్రహించారు. యజ్ఞగుండం నుండి మరో దివ్యశక్తిని ఆవిర్భవింపచేయవచ్చని పలికి యజ్ఞాన్ని కొనసాగించారు. కొంతసేపటికి యజ్ఞగుండంనుండి చిటపటలతో, ఉల్కలను వెదజల్లుతూ ఉల్కాముఖి ఆవిర్భవించింది. ఉల్కాముఖి ఆవిర్భవించ గానే అద్దంకి రామచంద్రయ్య, బరూరి నరసింహ యోగీంద్రులు ఆమెకు నివేదనలు సమర్పించి సంతృప్తిపరిచారు. ప్రజలను ఆపదలనుండి కాపాడవలసినదిగా వారు ఆమెను ప్రార్థించారు. వారి ప్రార్థన మేరకు ముందుకు సాగిన ఉల్కాముఖి వల్లూరు చెరువు కట్ట వద్దకు రాగానే అక్కడ నిలిచి΄ోయింది. తాను అక్కడనే ఉండి ప్రజలను, పశుసంపదను చల్లగా కాపాడుతుంటానని ఆమె వారికి హామీ ఇచ్చింది. ఆ ప్రకారమే ఉల్కాముఖి ప్రజలను దుష్టశక్తులనుండి, వ్యాధి బాధలనుండి కాపాడుతూ చల్లనితల్లిగా పూజలందుకుంటున్నది. యజ్ఞకుండంలో ఉల్కల మధ్యనుండి ఆవిర్భవించినందున ఉల్కాముఖిగా ఆమె పేరొందింది. వల్లూరు గ్రామంలో వెలసినందున వల్లూరమ్మ అనే పేరు ఆమెకు స్థిరమైంది. వల్లూరమ్మ ఆవిర్భావానికి కారణభూతులైన అద్దంకి వారి ఆడపడుచుగా వల్లూరమ్మ ప్రసిద్థి చెందింది. ఆ తర్వాత ్ర΄ాణప్రతిష్ఠ జరిగింది. తరువాతి కాలంలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించారు. మరికొద్దికాలం తర్వాత శిథిలావస్థకు చేరి నిరాదరణకు గురైన ఆలయం ఆ తర్వాత జరిగిన శతచండీ యాగం లనంతరం నూతన విగ్రహ ప్రతిష్ఠ, విమాన గోపురం, ముఖ మండపం, ప్రహరీ గోడ, సింహద్వార నిర్మాణం జరిగాయి. ఆలయంలో పరివార దేవతలుగా గంగమ్మ. పొలేరమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయంలో సుందరశిల్పాల ఏర్పాటు : దాతలు, భక్తుల సహకారంతో ఆలయం లోపలి భాగంలో అష్టలక్ష్ములతోపాటు గాయత్రి, సరస్వతి, రాజరాజేశ్వరి, శివ పార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి వంటి పలు దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. ఇవి జీవకళ ఉట్టిపడుతూ భక్తులనుఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.విశేష కార్యక్రమాలు : వల్లూరమ్మ ఆలయంలో శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తారు. వెయ్యిమందికిపైగా మహిళలు పాల్గొంటారు. ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కనుమ పర్వదినంనాడు అమ్మవారికి గ్రామోత్సవంతోపాటు వల్లూరు చెరువులో వల్లూరమ్మకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గుడి ఉత్సవం జరుగుతుంది. వాహన పూజలు : వల్లూరమ్మ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాకు చెందినవారే గాక గుంటూరు, నెల్లూరు జిల్లాలనుండి కూడా ఎంతోమంది భక్తులు తాము నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలను ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపిస్తారు. ఆలయం చుట్టూ వాహనంపై ప్రదక్షిణ చేస్తారు. అలాచేస్తే అమ్మవారి అనుగ్రహంతో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా రక్షిస్తుందని విశ్వాసం. పొంగళ్ల సమర్పణ : ప్రతి ఆదివారం ఆలయంలోని వల్లూరమ్మకు భక్తులు పొంగళ్లను, మొక్కుబడులను సమర్పిస్తారు. సంతానం లేనివారు, వివాహం కానివారు తమ ఈప్సితాలు నెరవేరేలా చూడమంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆలయం బయట పొర్లుదండాలు పెడతారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. రైతులు, వ్యాపారులు కూడా తమ కోరికలు తీర్చాలంటూ అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పిస్తారు. ఆదివారం వల్లూరమ్మ ఆలయం భక్తజన సందోహంతో కళకళలాడుతుంటుంది చేరుకునే మార్గం..వల్లూరమ్మఆలయం విజయవాడ–చెన్నై ప్రధాన జాతీయ రహదారిలో ఉండడంతో రవాణాపరంగా ప్రయాణీకులకు, భక్తులకు అనుకూలమే. ఉంటుంది. పల్లెవెలుగు బస్సులతోపాటు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. -
మత్తు వదిలితేనే మహత్తు
విశాల విశ్వంలోని జనులెందరినో పట్టి పీడించే రుగ్మత, ప్రగతిపథంలో వారు ముందుకు సాగకుండా ఆపివేసే దుర్లక్షణం మత్తు. మత్తు అంటే నిద్ర అన్న నిఘంటువు అర్ధంలోనే మనం తీసుకోరాదు. ఇది ఒక్కో వ్యక్తిని అల్లుకునే ఒక విధమైన జడత్వం. మనిషి పురోగమించాలంటే ముందుగా వదలవలసింది జడత్వంతో కూడిన యోచనలను మాత్రమే. కార్యాచరణకు సంసిద్ధుడై సాగే సమయాన ప్రతి విషయాన్ని సందేహించడం, అనుభవజ్ఞులు చెప్పిన మాటలను విభేదిస్తూ అక్కడే చతికిలబడడం వంటి వాటినీ ప్రగతి నిరోధకాలుగా మనం చెప్పుకోవచ్చు.చదువుకునే సమయంలో, ఉద్యోగ నిర్వహణలో కొందరు తమతో పనిచేసే మిగిలినవారి కంటే ఉత్తమ ఫలితాలను సాధిస్తూ మహత్తరంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. వారి విజయాలకు కారణం వారి జీవనశైలి. కొంతమంది మాత్రం ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉన్నామన్నట్లుగా చతికిలబడిపోతారు.ప్రగతికి అడ్డుకట్టు వేసే ప్రధానమైన విషయాలు సోమరితనం, మనిషిలో ఆత్మ విశ్వాసం లోపించడం, అనుక్షణం సందిగ్ధావస్థలోనే కొట్టు మిట్టాడడం వంటివి. అయితే, వీటిలో సోమరితనం అనేది ప్రధానమైన సమస్య. ఒక సినీకవి చెప్పినట్లుగా ‘‘ మత్తు వదలరా.. ఆ మత్తులోన బడితే గమ్మత్తుగా చిత్తవుదువురా..’’ అంటూనే‘‘జీవితమున సగభాగమ్ము నిద్దురకే సరిపోవును..మిగిలిన ఆ సగభాగమ్ము చిత్తశుద్ధి లేకపోవును..’’ అని కూడా లిఖించాడు. ఆ కవి చెప్పిన మాటలు అక్షర సత్యం. మత్తుగా ఉండడం అంటే మొద్దు నిద్రే కాదు, మనిషి జాగ్రదావస్థలోనే ఉన్నా ఒకింత బద్ధకంగా ఉండడం, చైతన్యరహితంగా ఉండడం, చేయవలసిన కార్యవిధి గురించి అస్సలు ఆలోచించకపోవడం వంటివి కూడా మత్తులో ఉన్నట్లుగానే మనం భావించాలి.మనిషి కార్యసాధనకు ఉపక్రమించే సందర్భంలో కలిగే సందిగ్ధావస్థ పురోగతికి గొప్ప ప్రతిబంధకం. ఈ అవస్థ ఏదో ఒకటి రెండుసార్లయితే సరి పెట్టుకోవచ్చు. ఆరంభంలో ఎవరికైనా ఇటువంటివి తప్పవు. కానీ, ఇదే సమస్య, ప్రతిసారీ ఎదురైతే, ఆ మనిషి మానసిక స్థితి మీద సందేహ పడవలసిందే.. ప్రతి కదలికకూ భయపడుతూ, ముందుకు సాగితే తనకు ఏమవుతుందో, చేపట్టిన పనిలో ఉత్తమ ఫలితాలు వస్తాయో రావో అని మీమాంసకు గురి కావడమే ఈ రకమైన మానసిక స్థితికి కారణం. ఇటువంటి వారు తప్పకుండా, తమ ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చుకోవాలి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం అత్యంత ఆవశ్యకమని గుర్తెరగాలి. ఏదన్నా సాధించాలి అని అనుకున్నప్పుడు, అన్నివేళలా, విజయం మన సొంతం కాదు, ఒక్కొక్కసారి పరాజయమూ చవి చూడవలసి వస్తుంది. తప్పనిసరిగా విజయం సాధిస్తామని తలచినప్పుడు కూడా ఒక్కోసారి మనకు అనూహ్యంగా అపజయం కలుగుతుంది. అటువంటి క్షణాల్లోనే క్రుంగిపోకుండా, నీరస పడకుండా, ఎటువంటి మానసిక ఒత్తిడికీ తలొగ్గక ముందుకు సాగాలి.ఇటువంటి సందర్భాల్లో ఓడిపోయామని తలచకూడదు. మగరాజైన సింహం తనకు కావలసిన ఆహారం లభించకపోతే ఏ మాత్రం నిరాశ చెందదు. అలసిపోయినా, డస్సిపోయినా, కీళ్ళు సడలిపోయినా, కష్ట స్థితిని పొందినా, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టడానికి సంసిద్ధురాలవుతుంది. అందుకే మానవుడు జడత్వంతో కూడిన మత్తులో ఏమాత్రం కూరుకుపోకూడదు. మత్తులో పడితేఎంతటి యోధుడైనా అవుతాడు చిత్తు..!! మత్తును వదిలి చైతన్యమూర్తిగా మెలిగేవ్యక్తిని తప్పక వరిస్తుంది విజయమనే మహత్తు..!!ప్రతిరోజూ ఉదయం మనం రోజును ఎలా ప్రారంభిస్తామనే విషయం ఆ రోజంతా మన శక్తి స్థాయిని, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అందుకే, జీవితంలో ఏదైనా సాధిద్దామని అనుకునేవారు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునేవారు ఉదయంపూట కొన్ని అలవాట్లను తప్పక పాటించాలి.ఉదయం 20–30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఒత్తిడిని పెంచే హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో కావలసినంతగా వత్తిడిని తగ్గించే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి మనిషిలోని శక్తి స్థాయులను పెంచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. – అన్నమయ్య తత్వ ప్రవచన సుధాకర వెంకట్ గరికపాటి -
భగవంతుడి సృష్టి
ఈ విశ్వంలో భూమి ఉంది, కాబట్టి మనం ఇక్కడ పుట్టాం. భూమి ఉండటానికి మానవులు ఏమైనా చేశారా? లేదు, ఏదో ఒక శక్తి భూమిని సృష్టించింది. మనం పుట్టిన తర్వాత జీవించటానికి ప్రాణవాయువు అవసరం. ఆ ప్రాణవాయువు ఏర్పడటానికి మానవులేమైనా చేశారా? లేదే! ఏదో ఒక శక్తి దాన్ని పుష్కలంగా లభింపచేసింది. ఈ భూమిపైన ఎప్పుడూ గాఢాంధ కారం ఉండి ఉంటే జీవించటం సాధ్యమా? వెలుతురు ఉండాలి. ఆ వెలుతురు ఉండాలంటే సూర్యుడుండాలి. ఆ సూర్యుడు అక్కడ ఉండటానికి మనుషులు ఏం చేశారు? ఏదో ఒక శక్తి ఆ సూర్యుణ్ణి సృష్టించింది. మనం జీవించటానికి నీరు అత్యంత ముఖ్యం. మరి నీటిని మనుషులెవరైనా చేశారా? ఏదో ఒక శక్తి సముద్రాలను ఏర్పరచి వాటిని నీటితో నిల్వచేసి నిరంతరం మనకు అందుబాటులోనికి తెచ్చి పెడుతున్నది. ఆహారం తీసుకొంటేనే మనం జీవించగలం. మరి ఆ ఆహారాన్ని మనుషులెవరైనా ఏ లోకం నుంచైనా భూమిపైకి తెచ్చిపెట్టి మనకు సరఫరా చేస్తున్నారా?మనం వివేకాన్ని వినియోగించి యోచిస్తే ఇదంతా స్వచ్ఛమైన సత్యమని తెలుస్తుంది. ఈ సత్యాన్ని తెలిపే గ్రంథం మానవ సమాజానికి శ్రేయస్సును కలిగించేదవుతుంది. ‘అన్నాద్భవన్తి భూతాని, పర్జన్యాదన్న సంభవః.’ అంటే ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, ఆ మేఘము యజ్ఞం వలన కలుగు చున్నది. అంత ముఖ్యమైన యజ్ఞాన్ని జరిపే బాధ్యత అల్పజ్ఞులైన మానవులపై ఉంచక ఆ దైవం ముఖ్యమైన కార్యాలన్నీ తానే జరిపించినట్లే ఆ యజ్ఞాన్ని కూడా ఆయనే జరివిస్తున్నాడని భగవద్గీత చెబుతోంది. ‘తపామ్యహమహం వర్షం నిగృహ్ణా మ్యుత్సృజామి చ’ అంటాడు భగవానుడు. ‘నేను (సూర్య కిరణములను) తపింప చేయుచున్నాను, వర్షమును కురుపించుచున్నాను, వర్షమును నిలుపుదల చేయుచున్నాను. (గీతామకరందము–శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామి). మనిషి జీవించ టానికి అవసరమైన భూమి, గాలి, ఎండ, నీరు, ఆహారం అన్నీ ఆ కరుణా మయుడే సమకూర్చాడు. వాటిని కలుషితం చేయకుంటే ఆయురారోగ్యాలు కల్గుతాయి.– రాచమడుగు శ్రీనివాసులు -
ఏ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకోవాలి..?
సాధారణంగా వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పున్నమి ముందు శుక్రవారం చేసుకోవాలన్నది సంప్రదాయం కనుక ఆగస్టు 1 శుక్రవారం చేసుకోవాలా? లేక ఆగస్టు 8న వచ్చే శుక్రవారం చేసుకోవాలా... అన్న సందేహం సహజం. చాలామంది పంచాంగ కారులు 8వ తేదీని పున్నమి అయినా ఆ వేళే చేసుకోవాలని నిర్ణయించారు. అయినా మనకు గ్రంథ ప్రమాణం, సంప్రదాయ వేత్తల ఉపదేశ ప్రమాణమూ కావాలి కనుక వ్రతనిర్ణయ కల్పవల్లి అనే గ్రంథం శ్రావణస్య సితేపక్షే పూర్ణిమోపాంత భార్గవేవరలక్ష్మీ వ్రతం కార్యం మోక్షసంపత్ ఫలప్రదమ్అని భవిష్యోత్తర పురాణోక్తిని ఉట్టంకిస్తూ చెప్పింది కాబట్టి మంచి సంçపద, మోక్షమూ కలిగించే వరలక్ష్మీవ్రతం శ్రావణ మాస శుక్లపక్షంలోని పున్నమికి దగ్గరగా ఉన్న శుక్రవారం నాడు చేసుకోవాలన్నదే నిర్ణయంగా చెప్పబడింది. ఒకవేళ పున్నమిరోజునే శుక్రవారం వస్తే.. ఆ రోజే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. ఈ మేరకు ఈ ఆగస్టు 8నే వరవలక్ష్మీవ్రతం చేసుకోవాలనే సంకేతం కదా! ఒకవేళ ఏ కారణం చేతనైనా 8 వతేదీ ఆటంకం కలుగుతుందేమో అని అనుకొనే వారు ఆగస్టు 1న వచ్చే రెండవ శుక్రవారం కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. (చదవండి: శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?) -
శ్రావణ మాసంలో మహిళలు ఆకుపచ్చని గాజులే ఎందుకు ధరిస్తారంటే..?
శ్రావణ మాసం అంటేనే పండుగలు, కళ్యాణ వైభోగాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలో ఉండే వాతావరణానికి అనుగుణంగా ఉండే మన ఆచార వ్యవహారాలు సైన్సుకే అందని విషయాలను వివరిస్తాయి. ప్రతిదాంట్లో సంప్రదాయం, ఆరోగ్యం రెండూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పవిత్ర మాసంల వరాలిచ్చే వరలక్ష్మీ దేవిని కొలిచే మహిళల కట్టు, బొట్టు, తినే ఆహారం ఇలా ప్రతిదాంట్లోనూ ప్రత్యేకత ఉంటుంది. అలా ఎందుకో సవివరంగా తెలుసుకుందామా.!.శ్రావణ మాసంలో భారతీయ వివాహితలు ఆకుపచ్చ గాజులు ధరిస్తుంటారు. ఇది వారి సంతోషకరమైన, సుసంపన్నమైన వైవాహిక స్థితిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు శుభప్రదమని, సంతానోత్పత్తికి సంబంధించినదని వారి నమ్మకం. అంతేకాదు, తమ శ్రేయస్సుకు, అదృష్టానికి, ప్రకృతి పునరుద్ధరణకు ప్రతీకగా ఆకుపచ్చ గాజులు ధరిస్తుంటారు. వర్షాకాలంలో వాతావరణం ప్రశాంత శక్తితో ముడిపడి ఉంటుంది. ఆకుపచ్చ రంగు కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత, భావోద్వేగ సమతౌల్యతను కలిగిస్తుంది. అన్యోన్యతకు సూచికగా, సంప్రదాయం, ఆరోగ్యం, భక్తిని ఒకే వరసక్రమంలో పరిచయం చేసే శక్తి ఆకుపచ్చ రంగుకు ఉంటుంది. గాజుల శబ్దం ప్రతికూలతను దూరం చేస్తుందని నమ్మకం. శివ–శక్తి దైవిక ఐక్యతను ప్రతిబింబించే సామరస్యాన్ని కూడా సూచిస్తుందనే భావన దీనిలో ఇమిడి ఉంది.ఫలవంతమైన ఎంపికశ్రావణ మాసం వర్షాకాలం కనుక అలెర్జీలను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు సి–విటమిన్ సమృద్ధిగా లభించే పండ్లు తీసుకోవాలి. అలాగే, జీర్ణక్రియకు మేలు చేసేవీ జాబితాలో ఉండేలా చూసుకోవాలి. నారింజలో అధికంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, రసాయనాల గాఢత లేని వాటిని ఎంచుకోవడం మేలు. అరటిపండు శక్తినిస్తుంది. జీర్ణక్రియ పనితీరుకు సహాయపడుతుంది. ఈ మాసంలో అరటిపండు వాడకం విరివిగా కనిపిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడే బొప్పాయి మలబద్ధక నివారిణిగా కూడా పనిచేస్తుంది. (చదవండి: బడి పాఠాలే కాదు ‘బతుకు బడి’ పాఠాలు కూడా..) -
అంతర్గత సంపదే నిజమైనది
ఇంటా బయట ఆందోళనకరమైన జీవన విధానం. నిత్యం ఒత్తిడి, భావోద్వేగ సంఘర్షణలు. అయితే... ధ్యానం ద్వారా వాటిని సమతుల్యం చేసుకునే శక్తి మనకు ఉంది. ధ్యానం ఆత్మ సముద్ధరణకు ఉపయోగపడే అత్యున్నతమైన సాధనం. ఇంటిలో, సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాలంటే ముందు మనలో ప్రశాంతత కలగాలి అని వివరించారు బ్రహ్మకుమారీస్ రాజయోగిని కులదీప్ దీది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ‘సంత్ సమాగమమ్’ కార్యక్రమంలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.‘నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి పోటీ, మితిమీరిన సాంకేతికత, భావోద్వేగ సంఘర్షణల కారణంగా మనశ్శాంతిని కోల్పోతున్నాం. ధ్యానం శక్తిమంతమైన, సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తుంది. సహనాన్నిప్రోత్సహించి సామరస్యాన్ని పెంపొదిస్తుంది. మానసికంగా ఇది మనసును ప్రశాంత పరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. మానసిక శ్రేయస్సును పెంచుతుంది. ఈ విషయాలు అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. యువతలో వేగవంతమైన భావోద్వేగాలు..నేటి యువత భావోద్వేగాలకు చాలా ఎక్కువగా గురవుతోంది. వేగవంతమైన భావోద్వేగాలు, విచ్ఛిన్నమైన సంబంధాలు, ప్రేమ గురించి విరుద్ధమైన ఆలోచనలతో వారి జీవితమే కాకుండా వారి ద్వారా ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతోంది. మనం వారికి ఏం చెప్పగలం అంటే.. నిజమైన ప్రేమ అంటే కేవలం ఆకర్షణ లేదా భావోద్వేగం కాదు. అది అర్థం చేసుకోవడం, గౌరవించడం, అవసరమైనప్పుడు కొంచెం స్పేస్ కూడా ఇవ్వడం. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. లోలోపల ఖాళీగా అనిపిస్తే బయట ప్రేమ కోసం వెతకద్దు. ప్రేమ స్వీయ అవగాహనతో ్ర΄ారంభమవుతుంది. జీవితం కేవలం ఆనందం కోసం కాదు ప్రయోజనం కోసం అని గ్రహించాలి.గృహిణులు ఇంట్లో శాంతిని నిలబెట్టాలంటే... ‘నేను ప్రశాంతమైన ఆత్మను’ అనేది ముందుగా గుర్తుంచుకోవాలి. కొన్ని నిమిషాల నిశ్శబ్దం లేదా ధ్యానంతో రోజును ప్రారంభించాలి. కుటుంబ సభ్యులను కేవలం పాత్రలుగా కాకుండా ఆత్మలుగా చూడండి. ఇది సహనాన్ని, మంచి అవగాహనను తెస్తుంది. వంట చేసేటప్పుడు మీ ఆలోచనలను స్వచ్ఛంగా, ఉన్నతంగా ఉంచుకోండి. ఎటువంటి లక్షణాలు ఉన్న భోజనం తింటారో అటువంటి ఆలోచనలే వస్తాయి. జీవితం అలాగే తయారవుతుంది. గృహిణి ప్రశాంతంగా ఉన్నప్పుడు, మొత్తం కుటుంబం సురక్షితంగా, ప్రేమగా, సంతోషంగా ఉంటుంది. మనిషి జీవితం ధ్యేయం...‘నేను ఎవరు?’ నాది ఏది, సత్యత ఏంటీ.. అనేది గ్రహించాలి. రోజువారీ జీవితంలో శాంతి, ప్రేమ, స్వచ్ఛత వంటి అసలు లక్షణాలను వ్యక్తపరచాలి. మనం కేవలం శరీరాలు కాదు. మనం ఆత్మలం. ప్రతి ఆత్మ తన ప్రత్యేక΄ాత్రను ΄ోషించడానికి, ప్రపంచానికి ఏదైనా మంచిని అందించడానికి ఇక్కడ ఉంది. మనం విలువలు, ఆధ్యాత్మిక అవగాహనతో జీవించినప్పుడు మనం లోపల నండి సంతృప్తి చెందుతాం. ధ్యానం మనకు పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి, మన ఉన్నత ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. ‘నేను ప్రతిరోజూ మెరుగవుతున్నానా?’ అని తమని తాము ప్రశ్నించుకోగలిగితే, మీరు సరైన మార్గంలో ఉన్నారనేదానికి అదే సంకేతం. వెలితిగా ఉండటానికి పరిష్కారం..బాహ్య, భౌతిక విజయం వాస్తవానికి అంతర్గత శూన్యతను పూరించదు. నిజమైన సంతృప్తి అంతర్గత శాంతి, ప్రేమ నుండి వస్తుంది. మన ఆత్మ పరమ సంబంధం కోరుకుంటుంది. మనం స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఇతరులకు సేవ చేసినప్పుడు మనం అర్థవంతంగా, సంతృప్తిగా భావించడం ప్రారంభిస్తాం. నిశ్శబ్దం, సరళత, ఆధ్యాత్మికత మన హృదయాన్ని నింపుతాయి. ఇవేవీ బాహ్య విజయాల ద్వారా అందవు. ఆధ్యాత్మికత తోడవ్వాలి. అంతర్గత సంపద ఉంటే వెలితి అనేదే ఉండదు’’ అని తెలిపారు ఈ రాజయోగిని.నేను ఆత్మను అనే భావనతో అవగాహన... ‘నేను ఒక ఆత్మను’ అనే అవగాహన మనకు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. భావోద్వేగపరంగా తక్షణమే స్పందించే బదులు, అవగాహనతో ప్రతిస్పందిస్తాం. ఇతరులను వారి రూ΄ాలతో, పనులతో కాకుండా ఆత్మలుగా చూడటం ప్రారంభించినప్పుడు మానవ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ అవగాహన సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది. పిల్లలపై తల్లిదండ్రుల దృష్టికోణం... తల్లిదండ్రులు పిల్లలను ఆస్తిగా కాకుండా వారి స్వంత ప్రయాణంతో కూడిన వ్యక్తిగత ఆత్మలుగా చూడాలి. ప్రతి బిడ్డ ప్రత్యేకమైనవాడే. ఇతరులనుండి ప్రేరణ కలిగించవచ్చు. కాని ఇతరులతో ΄ోల్చకూడదు. ప్రేమ అంటే ప్రతి కోరికనూ నెరవేర్చడం కాదు. అలా చేస్తే వారి కోరిక తీరక΄ోతే మారాం చేయడమో, మొండిగా అవ్వటమో చేస్తారు. సమయం చూసి వారితో ప్రేమతో మాట్లాడాలి. కఠినంగా కాకుండా ప్రశాంతంగా, స్పష్టతతో మాట్లాడండి. పిల్లలు సురక్షితంగా, ప్రేమతో ఉన్నప్పుడు బాగా వింటారు. అంతర్గత బలం వారికి ప్రేమ, సరైన మార్గదర్శకత్వం రెండింటినీ ఇవ్వడానికి సహాయ పడుతుంది– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎవరు చెప్పారన్నది కాదు... స్థితప్రజ్ఞత ముఖ్యం!
ఒకరోజు ఒకతను ఒక ముని దగ్గరకు వెళ్లాడు. ఆయనకు నమస్కరించి ‘జ్ఞానం అంటే ఏమిటి? నేను కలిసిన కొందరు ఒక్కోలా చెప్పారు... మరి మీరేమంటారో తెలుసుకోవాలని ఉంది’ అన్నాడు. ‘జ్ఞానం అంటే సుఖాన్ని పొందినప్పుడు పట్టరాని ఆనందంతో ఉన్న చోటుని మరచిపోవడం కాదు... బాధలో అలసిసొలసి డీలా పడిపోవడం కాదు. కష్టమో సుఖమో దేనికైనా స్థిరంగా ఉండటం ముఖ్యం’ అన్నారు ముని. ‘మీరు దీనిని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు?’ అని అడిగా డతను. అంతట ఆ ముని ‘నేను ఈ నిజాన్ని గాడిద నుండి నేర్చు కున్నాను’ అన్నారు. ‘ఏమిటి మీరు చెప్తున్నది? అది ఎలా సాధ్యం?’ అని అడిగాడు మునిని. ఒక గాడిద ఆ దారిన పోతోంది. ముని దాని వంక చూడమన్నారు. ‘ఈ గాడిద వీపు మీద ప్రతి ఉదయం మురికి బట్టల మూటలు పెట్టి తోలుకుంటూ పోతాడు దాని యజమాని. నదిలో మురికి బట్టలన్నింటినీ ఉతికి సాయంత్రం శుభ్రమైన బట్టల మూటలను గాడిద వీపు మీద ఉంచి ఇంటిబాట పడతాడు. మనం ఆ గాడిదలా ఉండాలి. ఉదయం పోతున్నప్పుడు మురికి బట్టల మూటలని అదేమీ బాధపడలేదు. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు శుభ్రమైన బట్టల మూటలని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవదు. దేన్ని చూసీ అది చలించలేదు. ఆ స్థిరమైన జ్ఞానాన్ని దాని నుంచి నేర్చుకున్నాను’.అలాంటి స్థితి పరిపక్వతతోనే సాధ్యం. సుఖమైనా, కష్టమైనా స్థితప్రజ్ఞత ముఖ్యం. ఎవరు బోధిస్తారనేది ముఖ్యం కాదు. గురువు ఎవరైనా కావచ్చు, కానీ మనం ఏమి నేర్చుకుంటున్నామనేదే ముఖ్యం.– యామిజాల జగదీశ్ -
విశేష ఫల ప్రదం
నాగపంచమి/గరుడ పంచమి: నాగారాధనకు సంబంధించిన ముఖ్యరోజులలో కార్తీకశుద్ధ పంచమి ‘గరుడ పంచమి’ లేదా ‘నాగ పంచమి’ గా ప్రసిద్ది. కొన్నిప్రాంతాలలో నాగపంచమిని శ్రావణమాసంలో ఆచరిస్తారు. గరుత్మంతుడు సూర్యుడికి రథసారథి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందుకే ఆయనకి సుపర్ణుడని పేరు. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనిస్తే... ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూస్తూ ఉన్న మూర్తి కనిపిస్తుంది. అంటే విష్ణుమూర్తి తనను ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం కోసమే. నాగులనుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లలను కా పాడుకొనేందుకు చేసే పూజ నాగపంచమి, నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి.గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యం పోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. మనికొన్నిప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృ ప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ/నాగ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుందని నమ్ముతారు. ఇదే రోజున నాగపంచమి వ్రతం చేసుకునేవారు నాగుల ఆకారాన్ని ఇంటి గోడలమీద తీర్చిదిద్ది పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. నాగారాధన వల్ల సర్పదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఈరోజున చేసే నాగారాధన వల్ల చర్మవ్యాధులు, చెవి సంబంధిత రోగాలు తొలగుతాయని కూడా ప్రతీతి.మహనీయుల మాటలు→ ఏది మనకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించాలి. ఏది మనకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించాలి. ఏది మనకు మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం స్మరణ చేసుకోవాలి.→ మంచి ఆలోచనలతో మనసు నింపుకో మంచి పనులతో ప్రతిష్ట పెంచుకో మంచి పలుకులతో మన్ననలు అందుకో వీటి అన్నిటితో అందరిని కలుపుకొని పో→ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ భయపడేవారు ఏమీ సాధించలేరు. సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు.→ బయటకు కనిపించే రంగు,రూ పాన్ని చూసి ఎవ్వరినీ అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచేంతవరకూ కాకి, కోయిల రెండూ ఒకేలా ఉంటాయి.→ అవసరమైన దానికంటె ఎక్కువ విషయాలు సేకరించేవారు, తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడేవారు విజ్ఞాన వంతులు.‘ -
శ్రీరాముని వైరాగ్యం
శ్రీరామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు గురువు వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. గురుకులం నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాముడు తండ్రి అనుమతితో తమ్ముళ్లను వెంట బెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్ళాడు. అనేక మున్యాశ్రమాలు, పుణ్య నదులు, దేవా లయాలు దర్శించి అయోధ్యకు చేరు కున్నాడు. ఆ తర్వాత శ్రీరామునిలో గొప్ప మార్పు వచ్చింది. తోటి బాలురతో ఆడటం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడడు. ఎప్పుడూ పద్మాసనంలో కూర్చుని, ఏదో దీర్ఘాలోచనలో ఉండేవాడు.అలా ఉండటానికి కారణం ఏమిటని తండ్రి దశరథుడు అనునయంగా ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పడు. దశరథుడు, వశిష్ఠునితో చర్చించాడు. ఆయన రాముని ‘ఈ విచిత్ర ప్రవర్తనకు కారణం ఏదో ఉండే ఉంటుంది. నెమ్మదిగా తెలుసుకోవాలి’ అంటాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడు తన యజ్ఞ రక్షణకు రాముని పంపమని దశరథుని అడగటానికి వచ్చాడు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో సంభాషిస్తూ... తీర్థయాత్రల నుంచి వచ్చిన దగ్గర నుంచి తనలో ఒక విచారణ ఉత్పన్నమైనదనీ, ప్రాపంచిక విషయాల పట్ల తనలో అనాసక్తి ఏర్పడిందనీ, ధనాదులు, సంపదలు శాశ్వతానందాన్ని ఇవ్వక పోగా ఇంకా అజ్ఞానారణ్యం లోకి తోసి వేస్తున్నాయనీ చెబు తాడు. తామరాకు మీద నీటి బొట్టులా నిర్లిప్తంగా ఉండే మార్గం ఏదీ? అని అడుగుతాడు. శ్రీరామునిలో ఈ వైరాగ్యాన్ని చూసి అతడికి ఆత్మ విచారణ తత్వాన్ని బోధించమని వశిష్ఠునితో చెబుతాడు విశ్వామిత్రుడు.అప్పుడు ఒక సభా వేదికను ఏర్పాటు చేసి, వశిష్ఠుడు జ్ఞానయుక్త వైరాగ్యంతో కర్మ వైముఖ్యం పొందిన శ్రీరామునికి జ్ఞాన, కర్మలు రెండూ వేరు కావనీ, ఒకే పక్షికున్న రెండు రెక్కల వంటివనీ బోధించి కర్తవ్యోణ్ముఖుని చేయటానికి ప్రేరణాత్మక కథలనూ, ఆత్మ విచారణ తత్వాన్నీ బోధించాడు. ఈ కథల సారమే యోగవాశిష్ఠంగా ప్రఖ్యాతమైంది. – డా. చెంగల్వ రామలక్ష్మి -
ఔషధవనంలో అపురూప ఆలయం
వనపర్తి జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని చిట్టడవిలో.. ఎత్తయిన కొండ శిఖరంపై భూదేవి, శ్రీదేవి సమేతుడై కొలువుదీరిన తిరుమలనాథస్వామి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సుమారు 300 ఏళ్ల క్రితం ఈ కొండపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ప్రాంత ప్రజలు ఏటా శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా.. పశువుల కాపరులు, అడవి తల్లిని నమ్ముకున్న ముదిరాజ్లు దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే సంప్రదాయాన్ని ప్రారంభించారు. వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు వెళ్లే ప్రధాన రహదారిలో.. 5 కిలోమీటర్ల దూరంలో స్వామివారి ఆలయ ముఖద్వారం ఉంటుంది. అక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు.ఆలయ చరిత్ర శతాబ్దాల క్రితం వనపర్తి సంస్థానాధీశులు వేటకు వెళ్లినప్పుడు ఎత్తయిన కొండ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం, వేల అడుగుల ఎత్తులో విశాలమైన రాతిచాప, అక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు (నీటి కొలను) ఉండటం చూశారు. శిఖరాగ్రాన స్వామివారిని ప్రతిష్టించాలని నిర్ణయించుకుని.. ఏకశిలపై స్వామి, అమ్మవార్ల విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేసినట్లు చరిత్ర కథనం. ఏటా శ్రావణ మాసంలోని శనివారాల్లో అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు. వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కొందరిని ఆలయ ధర్మకర్తలుగా, పెద్దగూడెంలోని ఓ ముదిరాజు కుటుంబాన్ని పూజలు చేసేందుకు నియమించారు. నాటి నుంచి నేటివరకు ఆయా కుటుంబాల వారే స్వామివారిని సేవించుకుంటూ.. ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.తాటిచెట్టు మెట్ల నుంచి.. మొదట్లో గుట్టపై నుంచి స్వామివారు కొలువుదీరిన శిఖరాగ్రానికి చేరుకునేందుకు సంస్థానాధీశులు తాటిచెట్ల కాండంతో మెట్లను ఏర్పాటు చేసినట్లు భక్తులు చెబుతారు. 1993 ప్రాంతంలో దాతల సహాయంతో ఇనుప మెట్లను, ఇటీవల కాంక్రీట్ మెట్లను ఏర్పాటు చేశారు. శ్రీరంగాపురం రంగనాయకస్వామి, పెద్దగూడెంలోని కోదండరామస్వామి ఆలయాలతోపాటు తిరుమలనాథస్వామి ఆలయాల్లో సంస్థానాధీశులు విగ్రహ ప్రతిష్ట చేయించి పూజలు చేసేవారని స్థానికులు పేర్కొంటారు. ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హయాంలో తారురోడ్డును నిర్మించారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది.ఔషధ మొక్కలకు పుట్టినిల్లు.. తిరుమలనాథస్వామి కొలువుదీరిన కొండపై ఎన్నో ఔషధ మొక్కలు (Medicinal Plants) ఉన్నట్లు గుర్తించారు. ఏటా శ్రావణ మాసంలో పచ్చని చెట్లు, ఎన్నో రకాల ఔషధ మొక్కలతో పాటు.. చేతికి అందేంత ఎత్తులో వెళ్తున్న మేఘాలు.. చల్లని జల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణం మంతమ్రుగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని, జాతరను తిలకించి.. ప్రకృతిని ఆస్వాదిస్తారు.సుదూర ప్రాంతాల నుంచి.. వనపర్తికి 5 కిలోమీటర్ల దూరంలో వెలిసిన తిరుమలనాథస్వామిని దర్శించుకొని.. మొక్కులు తీర్చుకునేందుకు జిల్లాతోపాటు గద్వాల, మహబూబ్నగర్, కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కర్ణాటక ప్రాంతవాసులు.. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం చేస్తారు.తొలి శనివారం.. శ్రావణ మాసంలో వచ్చే తొలి శనివారం తిరుమలనాథస్వామి గుట్టపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు కల్యాణ మహోత్సవం జరిపిస్తారు. సామాన్యుల నుంచి కోటీశ్వరులు సైతం ఒకేచోట నేలపై కూర్చొని స్వామి, అమ్మవార్లకు కల్యాణం చేయిస్తారు. భక్తులతోనే కల్యాణ మహోత్సవం నిర్వహించడం ఇక్కడి విశేషం.చదవండి: ఈ జలపాతాలకు చూసేందుకు రెండు కళ్లు చాలవు -
సానబెట్టే సామర్థ్యం, సమరోత్సాహం
రామాయణ, మహాభారత కాలాల నుంచి నేటి దాకా చూస్తున్నాం, తలపెట్టిన పని విజయవంతం కావాలంటే, అర్థ బలం, అంగ బలం, బుద్ధి బలం, సామర్థ్యం మాత్రమే సరిపోవు. వాటికి తోడుగా ఉత్సాహం కావాలి. ఆత్మవిశ్వాసం, సకారాత్మకత, పట్టుదల, బలమైన విజయకాంక్ష– వీటిని కలబోస్తే అది ఉత్సాహం రూపంలో ప్రకటితమౌతుంది.రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి అన్నట్టు సమరం సాగింది. ప్రత్యర్థులిద్దరూ అన్ని విధాలా సమరంలో సమవుజ్జీలే. ఇద్దరివీ లోకోత్తరమైన బల పరాక్రమాలు. అందుకే యుద్ధం సుదీర్ఘంగా సాగినా, ఎంతకీ ఎటూ తెగలేదు. ప్రత్యర్థులిద్దరూ అలసిపోయారు. చింతాక్రాంతులు కూడా అయ్యారు. ఆ దశలో, యుద్ధం చూసేందుకు దేవతలతో కలిసి వచ్చిన అగస్త్య మహర్షి, యుద్ధ పరిశ్రాంతుడై కూర్చొన్న దాశరథి దగ్గరకు వచ్చాడు. సకల కార్య సిద్ధిప్రదమూ, సర్వశత్రు వినాశకమూ అయిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు. అవని జనులకు ప్రత్యక్ష దైవమయిన ఆదిత్యుడిని ఈ స్తోత్రంతో ముమ్మారు స్తుతించి, అందరు దేవతల అనుగ్రహాన్ని పొంది, దైవబలం సమకూర్చుకొమ్మన్నాడు. జయావహమైన ఈ మంత్రం జపించి, స్థైర్య సాహసాలను సంతరించుకొమ్మన్నాడు. ‘ఇప్పుడిక నువ్వు రావణుడిని వధించటం తథ్యం!’ అని తన ఆశీర్వాద బలం కూడా జోడించి, శ్రీరాముడిని ఉత్సాహపరిచి వెళ్ళాడు. ఈ ఘటన యుద్ధాన్ని కీలకమైన మలుపు తిప్పింది. ఇనుమడించిన ఉత్సాహంతో ఈసారి రణరంగంలో ప్రవేశించిన దాశరథి ధాటిని దశకంఠుడు తట్టుకోలేకపోయాడు. వీగిపోయి, విగత జీవుడయ్యాడు. వైదేహీ వల్లభుడినే విజయలక్ష్మి కూడా వరించింది. నిరుత్సాహం సమర్థతను నీరు గారుస్తుంది. ఉత్సాహ శక్తి సామర్థ్యాన్ని సాన బట్టి, పదును పెంచుతుంది. అగ్నికి వాయువులా తోడై, ప్రజ్వలింపజేస్తుంది. దైవబలమూ, మహా పురుషుల ఆశీర్వాద బలమూ, శంకలను శమింపజేయటం వల్ల కలిగే మనోబలమూ, ధర్మ పక్షానికి సర్వదా కవచంగా నిలిచే ధర్మబలమూ, ఉత్సాహాన్ని వృద్ధి చేసే ఉత్ప్రేరకాలు.– ఎం. మారుతిశాస్త్రి -
నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం
కరీంనగర్కల్చరల్: శ్రావణం..సకల సౌభాగ్యాలు, సకల శుభాలు ప్రసాదించే మాసం. లక్ష్మీ కటాక్షం ఉంటే అన్నింటా అభివృద్ధి, అంతులేని సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మహాలక్ష్మి ప్రాణనాథుడు శ్రీమహావిషు్టవు జన్మనక్షత్రమైన శ్రావణం పేరుతో శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్ర, శని వారాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. మంగళగౌరీ వ్రతం, నాగులపంచమి, భానుసప్తమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహజయంతి, వరలక్ష్మీవ్రతం, జంధ్యాలపౌర్ణమి, పొలాల అమావాస్య పండుగలు జరుపుకుంటారు ప్రకృతి మాసం ప్రకృతిమాసమైన శ్రావణమాసంలో వర్షరుతువు ప్రభావం వల్ల ఎక్కడ చూసిన జలకళ కనిపిస్తుంది. ప్రకృతి మాత నిండుగ పచ్చదనంతో పరవశించి పోతుంది. భూమిపై ఉన్న మలినాలు, క్రిములు, కీటకాలు, వర్షపు నీటికి కొట్టుకుపోయి శుభ్రంగా కనిపిస్తోంది. చెట్లు పచ్చగా చూపరులకు కనువిందు చేస్తుంటాయి. పర్వదినాలతో పాటు నోములు, వత్రాలకు అనూకులమైన మాసం కావడటంతో మహిళలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. శివునికి ప్రతీకరమైన మాసంశ్రావణ మాసంలో ప్రతీ సోమవారం శివునికి ప్రతీకరమైనది. శివ భక్తులు ఈ మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు ఉపవాస దీక్ష ఉండి అభిషేకం, నమక చమక రుద్రాభిషేకం శివపురాణం, శివలింగానికి ఫల,పంచామృత,క్షీరాభిషేకాలు చేస్తారు.సమస్త శుభకార్యాలు చేసుకోవచ్చుఆధ్యాత్మిక జీవనంలో విజ్ఞాన శాస్త్రం కలిసి ఉంటుంది. ప్రతీ వ్యక్తి శ్రావణమాసంలో హిందూ, వెదిక, సనాతన సంప్రదాయాన్ని, ఆచారాలు పాటిస్తే ఆధ్యాత్మిక, ఆరోగ్యకర జీవితాన్ని గడపవచ్చు. ఈ మాసంలో సమస్త శుభకార్యాలు జరుపుకోవచ్చు.– నమిలికొండ రమణాచార్యులు, ప్రముఖ ఆగమశాస్త్ర పండితుడుఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకొని నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత ఆలయంలో క్యూలైన్లు, చలువ పందిళ్లు, మామిడి తోరణాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. మొదటి శ్రావణ శుక్రవారం రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. అలాగే చైతన్యపురి మహాశక్తి ఆలయం, నగునూరి దుర్గాభవానీ ఆలయాల్లో శ్రావణ మాసం ఏర్పాట్లు చేశారు. -
సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలంటే ఏమిటి?
సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి జీవితాన్ని కోరుకుంటారు. శాంతి, సుఖ సంతోషాలు తమ సొంతం కావాలని అభిలషిస్తారు. కష్టనష్టాలను, అశాంతిని ఎవ్వరూ ఆశించరు. కానీ ఏదీ ఆశించినట్లు, అనుకున్నట్లు జరగదు. జీవితంలో అనుకూల, ప్రతికూల పరస్థితులు వస్తూనే ఉంటాయి. ఎగుడు దిగుళ్ళు మానవ జీవితంలో అనివార్యం. అనుకూల పరిస్థితుల్లో ΄ పొంగిపోవడం, ప్రతికూల పరిస్థితుల్లో కుంగిపోవడం మానవుడి చంచల స్వభావానికి నిదర్ళనం. అసలు మంచి జీవితమంటే ఏమిటి? సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలంటే ఏమిటి? అందమైన భవంతి, కళ్ళు చెదిరే ఆస్తులు, హోదా, అధికారం, వాహనాలు, భార్యాపిల్లలు, కుటుంబం – ఇవన్నీ సమకూరితే మంచిజీవితం లభించినట్లేనా? సుఖసంతోషాలు సొంతమైనట్లేనా? కాదు..ఇవన్నీ ఆనందంలో ఒక భాగమే తప్ప, పరిపూర్ణ సంతోషానికి సోపానాలు కాలేవు. ఇది అనుభవం చెప్పే యథార్ధం. ఎందుకంటే, అందమైన ఇల్లు, కోరుకున్న భార్య, రత్నాల్లాంటి బిడ్డలు, విలాసవంతమైన వాహనాలు, కావలసినంత బ్యాంకుబ్యాలెన్సు, బలం, అధికారం, – ఇంకా రకరకాల విలాసవంతమైన సాధనా సంపత్తి నిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ, సంతోషంకోసం, సంతృప్తికరమైన జీవితం కోసం వెదుకులాట మానవ సమాజంలో ప్రతినిత్యం మనం చూస్తున్నాం. అన్నీ ఉండికూడా అనుభవించలేని అనేకమంది సంపన్నులూ మనకు పరిచయమే. అంటే ఇవన్నీపాక్షిక ఆనందాన్ని మాత్రమే అందించగలవుకాని, పరిపూర్ణసంతోషానికి సోపానం కాలేవని మనకు అర్థమవుతోంది. అయినా మనిషి అనాదిగా శాంతి, సంతోషాలకోసం తంటాలు పడుతూనే ఉన్నాడు. తనకు తోచిన ప్రయోగాలతోపాటు, తనలాంటి వారు చెప్పే సూత్రాలన్నిటినీ పాటిస్తున్నాడు. ఎవరెవరి చుట్టూనో తిరుగుతూ, చెప్పిందల్లా చేస్తూ, తులమో ఫలమో సమర్పించుకుంటూ ఉన్నాడు. కాని ఎక్కడా శాంతి, సంతోషం లభించడంలేదు. ధనం ధారపోసి కొనుక్కుందామంటే, అది మార్కెట్లో లభ్యమయ్యే వస్తువు కూడా కాదాయె. మరేమిటీ మార్గం? మంచిజీవితం, శాంతి, సంతోషం, సంతృప్తి ఇవన్నీ ఎండమావేనా? ఇదే విషయాన్ని ఒక శిష్యుడు ముహమ్మద్ ప్రవక్త (స) వారిని అడిగాడు. అప్పుడాయన గారు,’ అల్లాహ్ ను (దైవాన్ని) బాగా స్మరించు. అనాథలను ఆదరించు. పేదసాదలకు శక్తిమేర సహాయం చెయ్యి.’ అని ఉపదేశించారు. అంటే, ఇలా చెయ్యడం ద్వారా నువ్వు కోరుకుంటున్న శాంతి, సంతోషాలతో నిండిన మంచి జీవితం ప్రాప్తమవుతుంది అని అర్థం. కాని నాలుగు రాళ్ళసంపాదన సమకూరగానే దుర దృష్ట వశాత్తూ మనుషుల్లో అహం పెరిగి పోతోంది. దైవాన్ని స్మరించడం తరువాత సంగతి, అసలు దైవాన్నే మరిచి పోయి, పేదసాదలను దగ్గరికి రానివ్వని పరిస్థితి నెలకొంటోంది. మరిక శాంతి లభించాలంటే ఎలా లభిస్తుంది.? కాబట్టిసర్వకాల సర్వావస్థల్లో దైవాన్ని స్మరిస్తూ, సాధ్యమైనంతమేర మంచి పనులు చేస్తూ, చెడులకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. సత్కార్వాల్లో లభించే సంతోషం సంతృప్తి మరెందులోనూ లభించదు. ధర్మబద్ధమైన సంపాదన, ధర్మసమ్మతమైన ఖర్చు, సత్కార్యాల్లో సమయాన్ని వెచ్చించడం – ఇదిగనక మనం ఆచరించగలిగితే నిత్య సంతోషం, ఇహపర సాఫల్యం సొంతమనడంలో సందేహమే లేదు.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
యునెస్కో వారసత్వ సంపదలో మరో 7 అద్భుత ఆలయాలు
దక్షిణ భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలకు నిలయం. వీటి అద్భుతమైన వాస్తుశిల్పం, చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక మహత్తు అద్భుతం. అందుకే ఈ దేవాలయాల్లో చాలా వరకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. రాతి శిల్పాలు, సంగీత స్తంభాలు, రథాకార నిర్మాణాలు ఈ ఆలయాలకు ఒక ప్రత్యేకతను, గుర్తింపునూ తీసుకువచ్చాయి. ప్రతి దేవాలయం ఒక అపురూప కట్టడం. అంతేకాదు, ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతుంది. ఇటీవలే యునెస్కో తాజాగా మరో ఏడు ఆలయాలకు వారసత్వ గుర్తింపును ఇచ్చింది. అవేమిటో చూద్దాం.. 1. కడలేకల్ గణేశాలయం – హంపి బాల గణేశుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో ముద్దుగా కూర్చుని, చిట్టి చేతులను ఆ జగదంబ వీపుమీద వేసినట్లుగా ఉన్న ఈ విగ్రహం చూడగానే ఆహా అనిపిస్తుంది. హంపీలోని ప్రముఖ శిల్పాలలో ఒకటైన కడలేకల్ గణేశ విగ్రహం ఏకశిల నుంచి చెక్కబడింది. విజయనగర సామ్రాజ్య శిల్పకళా చాతుర్యాన్ని ప్రతిబింబించే ఈ ఆలయం వినాయకుడి భక్తులకు ఎంతో ప్రీతికరమైనది. ‘కడలేకల్‘ అనే పేరు గణేశుడి పొట్టను పోలి ఉండటం వల్ల వచ్చింది.2. బృహదీశ్వరాలయం – తంజావూరు రాజరాజ చోళుడు 1010లో నిర్మించిన ఈ అద్భుత ఆలయం, శివుని వాహనమైన నందితో సహా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని రాతి శిల్పాలు అబ్బురపరుస్తాయి. ప్రతి రోజు రాత్రి జరిగే పూజ ప్రత్యేక ఆకర్షణ. పూజారులు వేద మంత్రాలతో బృహదీశ్వరునికి పవిత్ర జలాలు, పాలతో అభిషేకం చేస్తారు. పల్లకీలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అందంగా మార్చుతుంది.3. ఐరావతేశ్వరాలయం – దారాసురరథాకార శిల్పాలకు పెట్టిన పేరైన ఈ ఆలయం సురపతి అయిన ఇంద్రుడి వాహనం శ్వేత మత్తేభం ఐరావతం పేరు మీదుగా ప్రసిద్ధికెక్కింది. గోడలపై పురాణాలు చెక్కబడి ఉంటాయి. ప్రత్యేక ఆకర్షణ – సంగీత మెట్లు. ఏడు మెట్లు, ఏడు సంగీత స్వరాలను సూచిస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆలయంలోని సూర్య పుష్కరణి అనే పవిత్ర పుష్కరిణిలో ముందుగా స్నానం చేసి ఆ తర్వాత స్వామిని సందర్శించటం ఆనవాయితీ.4. మహిషాసురమర్ధిని మండపంమహాబలిపురం పల్లవ రాజవంశం నిర్మించిన ఈ రాతి శిల్పాల ఆలయం, మహిషాసురుడు, దుర్గాదేవి మధ్య యుద్ధాన్ని చూపించే అద్భుత దారుశిల్పాలతో ప్రసిద్ధికెక్కింది. అంతేకాక, శ్రీ మహా విష్ణువు తన పానుపైన ఏడు తలల ఆదిశేషునిపైన విశ్రాంతి తీసుకుంటున్న శిల్పం చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.5. షోర్ టెంపుల్, మహాబలిపురంమహాబలిపురం పల్లవ రాజు 11వ నరసింహవర్మ 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఒకప్పుడు ఏడు దేవాలయాల సమూహంలో భాగం. వరద ముంపులో మిగతా ఆలయాలన్నీ నీట మునిగి΄ోయినా, ఇది మాత్రమే నిలిచి ఉంది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి, వైకుంఠ ఏకాదశి పండుగలకు ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.6. విరూపాక్షాలయం – హంపిహంపి మధ్యలో ఉన్న ఈ ఆలయం మహా శివునికి అంకితం చేయబడింది. పంప అనే బ్రహ్మ కుమార్తె ఇక్కడ తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుందనే కథనం దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం తెచ్చింది. ఇక్కడ పంచామృత అభిషేకం, పూల అలంకారం, పూజారుల వృత్తాకార ఊరేగింపులు ముఖ్య విశేషాలు.7. విఠలాలయం – హంపిఈ ఆలయం సంగీత స్తంభాలు (మొత్తం 56) కు ప్రసిద్ధి. స్తంభాలను మీటితే వినసొంపైన స్వరాలు వినిపిస్తాయి. విష్ణువు అవతారమైన విఠలేశ్వరుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఆధ్యాత్మికతకే కాదు, గొప్ప కళాత్మకతకు కూడా నిదర్శనంగా నిలుస్తుంది.ఇదీ చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే! -
తెలివిని హరించేది..ఏదో తెలుసా?
పూర్వం గోమతీ నది తీరంలో కంధుడు అనే ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. కంధుడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు ప్రమ్లోచన అనే అప్సరసను పంపించాడు. ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం ప్రమ్లోచన కంధుడిని చేరి, సపర్యలు చేసి అతడి మనసును రంజింపజేసింది. వారిరువురి మధ్య అనురాగం వృద్ధిపొందింది. అలా కొంత కాలం గడిచాక, తాను వచ్చిన పని అయిందని గ్రహించిన ప్రమ్లోచన కంధుడితో ‘స్వామీ, నేను ఇంద్రుడి కొలువులో ఉండేదానను. ఇక్కడకు వచ్చి చాలా కాలం అయింది. ఇక సెలవిస్తే వెళతాను!’ అంది. దానికి కంధుడు ‘నువ్వు ఇక్కడకు వచ్చి ఎక్కవసేపేమీ కాలేదు. అప్పుడే నన్ను విడిచి వెళితే ఎలా?’ అన్నాడు. మరికొంత కాలం గడిచింది. ప్రమ్లోచన మళ్ళీ వెడతానని బయలుదేరింది. ‘నీవు వచ్చి ముహూర్తం సమయమైనా గడవలేదు. అప్పుడే వెళ్ళిపోతానంటావేమిటి?’ అన్నాడు కంధుడు. మరి కొంత కాలం గడిచింది. మరోసారి ప్రమ్లోచన ఇంద్రుడి సన్నధికి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. ‘తపస్సు చేసుకుంటూ రోజులు గడిపే నా జీవితంలో నేను కోరకుండానే ప్రవేశించి, నా మనసులో మోహ బీజాన్ని నాటి, ఆనందపరచి, ఇప్పుడు ఆ అంతటినీ వ్యర్థంచేసి వెళ్ళిపోతాననడం నీకు తగినదేనా?’ అన్నాడు కంధుడు.మరి కొంత కాలం గడిచింది. ఒకనాడు సూర్యుడు అస్తమిస్తున్న వేళ నదీతీరానికి బయలుదేరాడు కంధుడు. ‘ఎక్కడికి స్వామీ?’ అడిగింది ప్రమ్లోచన. ‘సాయంత్రమయింది, సంధ్యాకాల విధులు తీర్చుకుని వస్తాను!’ అన్నాడు కంధుడు. దానికి ఆమె నవ్వి ‘ఒకనాటి పొద్దున నేను రావడం నిజం! ఇప్పుడు సాయంత్రమవడమూ నిజం! కానీ ఈ రెండింటి మధ్య తొమ్మిది వందల ఏడు సంవత్సరాల ఆరు నెలల మూడు రోజుల కాలం గడిచింది!’ అన్నది. తెలివిలోకి వచ్చిన కంధుడు, మోహంలో చిక్కుకుని ఎంత విలువైన జీవితాన్నీ, తపోధనాన్నీ తాను పోగొట్టుకున్నాడో గ్రహించి బాధపడ్డాడు.– భట్టు వెంకటరావు -
కండ బలం కొన్నాళ్ళే.. అతి సమీప బంధువు
ఒక ఊర్లో గాడి తప్పిన యువకుడు ఒకడుండేవాడు. ఇతరులతో అకారణంగా గొడవ పడేవాడు. అందరినీ కొట్టి తిట్టేవాడు. వాడి అకృత్యాలకు గ్రామస్తులు ఎందరో విసిగిపోయారు. అతనికి బుద్ధి చెప్పడానికి తగిన మార్గం కానరాక సమయం కోసం ఎదురు చూస్తున్నారందరూ! ఒకరోజు ఓ వృద్ధురాలు తన ఇంటి ముందర ఉడకబెట్టిన వడ్లను ఆరబెడుతోంది. దారిన పోతున్న ఆ యువకుడు వడ్లను తన్ని వెళ్ళిపోయాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ వృద్ధురాలు ‘‘కండ బలం కొన్నాళ్ళే. దాన్ని చూసి మురిసిపోవద్దు. అతి సమీప బంధువు వచ్చిన రోజున తెలుస్తుంది నీకు అసలు విషయం’’ అని తిట్టి పోసింది.అక్కడినుంచి అయితే ఆ యువకుడు వచ్చేశాడు కానీ అతి సమీప బంధువు ఎవరో తెలుసుకో వాలనిపించింది. తనను ‘డీ’ కొట్టేంత మొనగాడు ఎవడో కళ్ళారా చూడాలనిపించింది. పక్క ఊర్లో ఉన్న తమ దాయాదుల ఇళ్లకు వెళ్ళాడు. ‘నాకు అతి దగ్గర బంధువు ఎవరు’ అని ఆరా తీశాడు.దగ్గరి బంధువులు ఉన్నారు కానీ, నీతో తలపడేంత గట్టి మనుషులు ఎవ్వరూ లేరని వారు సర్ది చెప్పి పంపారు. అతడి అహం సంతోషించింది కానీ, శత్రు శేషం ఉండరాదని గట్టిగా భావించిన అతడు శపించిన వృద్ధురాలినే అడిగి తెలుసుకుందా మనుకున్నాడు. ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్ళాడు. అతడి రాక విషయం తెలిసి ఆమె అప్పటికే ఊరు విడిచి వెళ్ళి పోయింది.తిన్నగా తన ఇంటికి వెళ్ళాడు. అమ్మ అన్నం తినమని పిలిచింది. వద్దన్నాడు. ఆకలి కాలేదన్నాడు. కారణమేమిటని అడిగింది. విషయం చెప్పాడు. ఆమె చిన్నగా అతడి భుజం తట్టుతూ ‘‘ఎవ్వరికైనా అతి సమీప బంధువు మృత్యువు. అది మన నీడ లాగా మనతోనే ఉంటుంది. ఎప్పుడు మనల్ని కబళిస్తుందో మనకు తెలియదు. చనిపోయే సమయంలో మనం చేసిన ΄ాపపుణ్యాలు గుర్తుకు వస్తాయని పెద్దలు చెబుతారు. ఆ విషయమే ఆమె నిన్ను హెచ్చరిక చేసింది’’ అన్నాడు.‘‘ఆ బంధువు ఎప్పుడు వచ్చేదీ మనకు తెలియదా? తెలిస్తే ఆ బంధువుని మూడు చెరువుల నీళ్ళు తాగించాలని ఉంది’’ అని గర్వంగా అన్నాడు. ఆమె నవ్వి ‘‘ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కానిది మృత్యువు. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో తెలుసుకోవడం ఎవ్వరి తరం కాదు. వచ్చినప్పుడు తప్పించుకోవడానికి కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే అది వచ్చేలోగా మనం మంచి పనులు చేయాలని చెబుతారు. ఒకర్ని నొప్పించే పనులు చేయవద్దని అంటారు’’ అని వివరించింది.ఏ క్షణాన అయినా వచ్చే అతి సమీప బంధువు గురించి అవగాహన వచ్చింది అతడికి. క్షమాపణలు చెబుదామని ఆ వృద్ధురాలిని వెదకడం కోసం బయలుదేరాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?
సకల శుభాల శ్రావణ మాసం ఈ నెల 25న ఆరంభం కానుంది. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల సౌలభ్యం కోసం ఆలయ నిర్వహణ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది, అందుచేత మహిళలు ఈరోజును ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు. నెల రోజులుగా ఆషాఢం కావడంతో ముహూర్తాలు లేవు. ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో మహిళలు శ్రావణ లక్ష్మీ వ్రతాలను ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈనెల 26న మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్షి్మకి పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.నోముల మాసం శ్రావణం..పురోహితులు శ్రావణ మాసాన్ని నోముల మాసంగా అభివర్ణిస్తారు. శ్రావణంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతాలను ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణంలో వచ్చే ఏ మంగళవారమైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పెళైన ఏడాది తరువాత ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు.ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు. ముఖ్యమైన పండగలు..శ్రావణ మాసమంతా పండగల సందడి ఉంటుంది.ఈ నెల 26న తొలి శుక్రవారం, ఆగస్టు 1న రెండవ శుక్రవారం, ఆగస్టు 3న ఆదివారం స్నేహితుల దినోత్సవం, ఆగస్టు 8న మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 9న రాఖీ పండగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, ఆగస్టు 15న నాల్గవ శుక్రవారం, ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండగలు శ్రావణంలో ఉన్నాయి. ఆగస్టు 22న ఐదవ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది.శ్రావణం పూర్తయిన వెంటనే భాద్రపదం మాసం ఈ ఏడాది ఆగస్టు 27న జరగనున్న వినాయకచవితితో ప్రారంభంకానుంది.శ్రావణమాసానికి అత్యంత ప్రాధాన్యంసకల శుభాలను ఒసగే శ్రావణం జ్ఞానస్థితిని అందిస్తుంది. హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణమాసంలో వైష్టవారాధనతో పాటు మహాశివుడికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు.ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి.ఎస్వీఎల్ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టంఈ నెల 28 నుంచి మంచి ముహూర్తాలు.. నెల రోజులుగా ఉన్న ఆషాఢ మాసం ఈనెల 22తో ముగియనుంది. ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో ఈనెల 28 నుంచి ఆగస్టు 22 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో వ్రతాలతో పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభాకార్యాలకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జూలై 26,27,30,31 ఆగస్టు నెలలో1,3,4,6, 7, 8, 9, 10, 11, 13,14,17,18 తేదీలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసంలో ఉన్న 17 మంచి ముహూర్తాల్లో జిల్లాలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. (చదవండి: వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!) -
మీ బిడ్డలం... బోనమందుకో తల్లీ...
తెలంగాణ ప్రాంతంలో పెద్దమ్మ, పోచమ్మ, కట్ట మైసమ్మ, ఆరె మైసమ్మ, గండి మైసమ్మ, మాంకాళమ్మ, నల్ల పోచమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, జగదాంబిక పేర్లతో ప్రతి ఆషాఢమాసంలో అమ్మవార్లు బోనాలందుకుంటారు. అందుకే ఆషాఢం వచ్చిందంటే చాలు.... ప్రతి ఇంటా బోనాల హడావిడి కనిపిస్తుంది. ఆషాఢమాసం సందర్భంగా గత నెలలో ఆరంభమైన తెలంగాణ సాంస్కృతిక సంబురం బోనాల వేడుకలు ఆషాఢ బహుళ అమావాస్యతో ముగియనున్నాయి. నేడు పాతబస్తీలోని లాల్ దర్వాజాలో కొలువై ఉన్న సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.భక్తి, ఉత్సాహభరితమైన ఊరేగింపులు, సంబురాలు, ఆచారాలకు ప్రసిద్ధి చెందిన బోనాల పండుగ భాగ్యనగర వాసుల జీవితాలలో కొన్ని శతాబ్దాలుగా భాగమై ఉంది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో అత్యధికులు ఎక్కువగా జరుపుకునే పండుగల్లో బోనాలు ముఖ్యమైనది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో గ్రామదేవతలకు ప్రతియేటా ఆషాఢమాసంలో పూజలు జరిపి, బోనాలు సమర్పించే ఈ సంప్రదాయం ఈనాటిది కాదు, వందల ఏళ్లుగా వస్తున్నదే. నగర వాతావరణంలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, కాలగమనంలో సంప్రదాయక పండుగలెన్నో పేరు తెలీకుండా అదృశ్యమై పోతున్నా, ఈ బోనాల వేడుకలు మాత్రం తమ వైభవాన్ని ఏమాత్రం కోల్పోకుండా అలనాటి ఆచార సంప్రదాయాలతో వైభవోపేతంగా నేటికీ కొనసాగుతుండడం విశేషం.నవాబుల కాలం నుంచి...మూసీ నది వరదల కారణంగా అంటువ్యాధులకు ఆలవాలమైన నగరంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాని మహారాజా కిషన్ప్రసాద్ సలహా మేరకు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్దర్వాజ సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి చార్మినార్ వద్దకు చేరిన వరదనీటిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించాడట. అప్పటికి అమ్మ తల్లి శాంతించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో నవాబులే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఎందుకీ బోనాలు?ఆషాఢమాసమంటే వర్షాకాలం.. అంటే అంటువ్యాధులకు ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లంగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. నియమనిష్ఠలతో అమ్మవారికి పసుపునీళ్లు, వే పాకులతో సాక పెడతారు. తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు. అచ్చ తెలంగాణ జానపదాలు బోనాల పాటలు ఆడామగా, చిన్న పెద్ద, ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణ జానపదాలు ‘‘గండిపేట గండెమ్మా దండం బెడత ఉండమ్మా.., బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే.., అమ్మా బైలెల్లినాదే... అమ్మా సల్లంగ సూడమ్మ... మైసమ్మా మైసమ్మా... వంటి పాటలు, పోతురాజుల నృత్యవిన్యాసాలు, శివసత్తుల చిందులు చూపరులను అలరిస్తాయి. పోతురాజుల చేతి కొరడా దెబ్బ... పోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. తమ ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లకు కాపలా కాసేందుకు విచ్చేసే పోతురాజులు నృత్యవిన్యాసాలు తప్పక చూడతగ్గవి. చిన్న అంగవస్త్రాన్ని ధరించి ఒళ్ళంతా పసుపు రాసుకుని కాళ్ళకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మపండ్లు, కంటికి కాటుక, నుదుట కుంకుమ దిద్దుకుని మందంగా పేనిన పసుపుతాడును కొరడాగా ఝళిపిస్తూ, తప్పెట్ల వాద్యాలకు అనుగుణంగా గజ్జెల సవ్వడి చేస్తూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ కన్నుల పండుగ చేస్తారు. పోతురాజుల చేతి కొరడా దెబ్బతినడానికి చాలామంది పోటీ పడుతుంటారు. ఎందుకంటే ఆ కొరడా దెబ్బ దుష్టశక్తులను, శారీరక రుగ్మతలను దూరంగా తరిమి కొడుతుందని వారి విశ్వాసం.గోల్కొండ జగదాంబికదే తొలిబోనంమొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, ఇక ఆ తర్వాత అన్నిచోట్లా బోనాల సంరంభం మొదలవుతుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక్కోరోజు ఆషాఢ ఘటోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఊరేగింపు తర్వాతే బోనాల వేడుకలు ్ర పారంభమవుతాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదలైన ఉత్సవాలు తిరిగి ఆ అమ్మకు సమర్పించే తుదిబోనంతో ముగియడం ఆచారం.అమ్మ... ప్రతి ఇంటి ఆడపిల్లఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. అదే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.తొట్టెల సమర్పణతమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెను సమర్పించడం ఆచారంగా ఉంది.బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ప్రాంతానికి చేరుకుంటుంది. ఆషాడంలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. – డి.వి.ఆర్. -
శంకరుని మాటల మర్మం ఇదీ.. సర్వజ్ఞుల మాటలు
అల్లుణ్ణీ, కూతుర్నీ చూసివద్దామని వెళ్ళినప్పుడు, ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించి, తగిన మర్యాదలు చేయలేదని శంకరుడిపై కోపగించిన దక్షుడు, ప్రతీకారంగా శంకరుడిని అవమానించాలనే ఆలోచనతో ఒక యజ్ఞం చేయడానికి పూనుకున్నాడు. ఆ యజ్ఞానికి శంకరుడిని తప్ప సకల దేవతలనూ, మునిగణాలనూ పిలిచాడు. అది తెలుసుకున్న నారదుడువెంటనే కైలాసానికి వెళ్ళి పార్వతితో, ‘అమ్మా, మీ తండ్రిగారికి ఏమైందో తెలి యడం లేదు. మీ ఇరువురనూ తప్ప మిగతా అందరినీ పిలిచి, అన్ని హంగు లతో యాగం చేస్తున్నాడు. వినడానికే నాకు బాగా అనిపించక, నీ చెవిన వేసి పోదామని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది. ఇక వెళ్ళొస్తాను!’ అని చెప్పి, అగ్గి రాజేసి వెళ్ళిపోయాడు. తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలని పార్వతికి మనసులో కోరిక కలిగింది. అయితే, పిలవని పేరంటానికి వెళ్ళడం ఎలాగ? కలత చెందిన మనస్సుతో, చెప్పాలా వద్దా అని సందేహిస్తూనే, విషయం శంకరుడి చెవిలో వేసింది. సతి మాటలలోని ఉద్దేశాన్ని గ్రహించిన శంకరుడు ఇలా సమాధానం చెప్పాడన్నాడు పోతన, తాను రచించిన ‘వీరభద్ర విజయం’ కావ్యం ప్రథమాశ్వాసంలో:మెచ్చని మామలిండ్లకును మేకొని శోభనవేళ బిల్వమిన్పొచ్చముగల్గుబో దగుట పోలదు నల్లుర కెజ్జగంబులంబొచ్చెము లేదు కన్యలకు బుట్టినయిండ్లకు బోవ లోకము న్మెచ్చును బొమ్ము పబ్బముకు మీతలిదండ్రుల జూడ బైదలీ!‘ తనను ఇష్టపడని మామల ఇండ్లలో జరిగే శుభ కార్యాలకు, ఆహ్వానం లేకుండా వెళ్ళడం ఏ లోకంలోని అల్లుళ్ళకైనా మర్యాద కాదు. అయితే, ఆహ్వానం లేనప్పటికీ కన్యలకు తమ పుట్టినిండ్లకు వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. లోకం మెచ్చుకుంటుంది కూడా! అందు వలన, మీ తల్లిదండ్రులను చూడటానికి నీవు వెళ్ళు!’ అలా పార్వతి పుట్టినింటికి వెళ్ళింది. కానీ తిరిగి రాలేదు. పుట్టినింట్లో జరిగిన అవమానాన్ని భరించలేక, శివుడిని మనసులో తలుచుకుని శివయోగవహ్నిని మేలుకొలిపి, ఆ ఘోరాగ్నిలో తనను తాను భస్మం చేసుకుంది. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. కనుకనే, జరగబోయేది తెలిసిన శంకరుడు పార్వతిని ‘పోయిరమ్మని’ అనకుండా, కేవలం ‘పొమ్ము పబ్బమునకు’ అని మాత్రమే అన్నాడు. సర్వజ్ఞుల మాటలు భవిష్యత్తుకు దర్పణములుగా భాసిల్లుతాయి.– భట్టు వెంకటరావు -
భక్తి పారవశ్యం: చేతుల్లో పాములతో ఆలయానికి.. వీడియో చూస్తే గగుర్పాటే
భక్తి అనేది పలు రకాలుగా ఉంటుంది. శ్రవణం, కీర్తనం, దాస్యం అను నవవిధ భక్తి మార్గాలు గురించి విన్నా. కానీ ఇలాంటి భక్తి మార్గాన్ని మాత్రం చూసుండరు. ఆ భక్తి చూస్తేనే షాక్కి గురిచేసేలా ఉంటుంది. అలాంటి భక్తి పారవశ్యాన్ని బీహార్లో చూడొచ్చు. ఆ భక్తుల అసమాన భక్తికి భయం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలుగుతాయి.బీహార్లోని సమస్తిపూర్లోని సింగియా ఘాట్ వందలాది మంది భక్తులతో సందడిగా ఉంది. వారంతా నాగ పంచమి ఉత్సవంలో పాల్గొనడానికి పెద్త ఎత్తున వచ్చారు. అక్కడ మతపరమైన ఆచారంలో భాగంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పాములను ఉట్టి చేతులతో నేరుగా పట్టుకుని వెళ్లే సాంప్రదాయం చూస్తే నోటమాట రాదు. అక్కడి ప్రజలంతా సింగియా బజార్లోని మా భగవతి ఆలయంలోకి ఆ పాములను తీసుకుని వెళ్తున్నారు. వారంతా ఆ పాములును కర్రలకు లేదా తలకు, చేతులకు చుట్టుకుని తీసుకువెళ్తుడటం విశేషం. అది చాలా సర్వసాధారణం అన్నట్లుగా ఆ పాములను చేత్తో పట్టుకుని స్థానిక సర్ప దేవత అయిన మాతా విషరి నామాన్ని జపిస్తూ మా భగవతి ఆలయానికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత పూజలు చేసి వాటిని అటవీ ప్రదేశంలో వదిలేస్తారట. అక్కడ బిహార్ చుట్టుపక్కల గ్రామలైన ఖగారియా, సహర్సా, బెగుసరాయ్, మిథిలా, ముజఫర్పూర్ జిల్లాతో సహా అంతటా ఈ ఉత్సవం ఘనంగా జరుగుతుంది. విదేశీయలును ఆకర్షించే ప్రధాన ఉత్సవం కూడా ఇదే. అయితే అక్కడ స్థానికులు మాత్రం ఇదంతా సంప్రదాయమని చెబుతుండటం విశేషం. ఊరేగింపుగా పాములను తీసుకొచ్చి పవిత్ర తోటలు లేదా ఆవరణంలో వాటిని ఉంచి పూజలు చేస్తారట. వారంతా తమ కుటుంబ రక్షణ, ఆరోగ్యం కోసం నాగ దేవతను ఇలా ప్రార్థిస్తారట. కోరికలు తీరిన తర్వాత నాగపంచమి నాడు కృతజ్ఞతగా నైవేద్యాలు నివేదించి ఇలా పాములను చేత పట్టుకుని ఉత్సవం చేస్తారట. అయితే ఇంతవరకు ఈ ఉత్సవంలో అప్పశృతి చోటు చేసుకోలేదట. పైగా ఈ పండుగలో ఇంతవరకు ఎవ్వరికి పాము కాటు, లేదా గాయం అయిన దాఖాలాలు కూడా లేవట. ఆ విచిత్రమైన పండుగకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pradeep Yadav (@br_vlogger17) (చదవండి: పార్లమెంటు క్యాంటీన్లో సరికొత్త హెల్త్ మెనూ! లిస్టు చూసేయండి!) -
కాపాడిన దైవం : మనమే గొప్పఅని భ్రమపడితే!
హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్ గొప్పదైవభక్తుడు. అనునిత్యం దైవధ్యానంలో నిమగ్నమై ఉంటూ, ప్రజలకు ధార్మికబోధ చేస్తూ ఉండేవారు. ఒకనాటి రాత్రి ఆయన యధాతథంగా దైవారాధనలో నిమగ్నమై ఉన్నారు. అంతలో ఒక మహోజ్వలమైన వెలుగు కనిపించింది . హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మ బయటికి వెళ్ళి చూశారు. ఆకాశం వైపునుండి ఒక సింహాసనం జాజ్వల్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ భూమ్మీదకు దూసుకువస్తోంది. అసలు అది ఏమిటో కూడా చూడలేనంత వెలుగు భూమండలంపై పరచుకుంటోంది. అంతలో ’అబ్దుల్ ఖాదర్ జీలానీ..! మేము నీ దైవభక్తిని, నీ ఆరాధనను మెచ్చుకున్నాము. ఇకనుండి ఇతరులకు ధర్మబద్దం కానివి నీకు ధర్మబద్ధం చేశాము. అంటే హరాం విషయాలను నీకు హలాల్ గా చేశాము.’అన్న అదృశ్యవాణి వినిపించింది.అప్పుడు హజ్రత్ జీలానీ రహ్మ, హరామ్ వస్తువులు హలాల్ చేయడం ఎవరికిసాధ్యం? ఇదేమైనా షైతాన్ పన్నాగం కాదుకదా..?.. అని ఆలోచిస్తూ..,’ ఇంతకూ నువ్వు ఎవరివి? దైవానివా. సృష్టికర్తవా..?’అని ప్రశ్నించారు. ఈప్రశ్నకు అటువైపునుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. నేను దేవుణ్ణి అని చెప్పేధైర్యం షైతాన్ కులేదు. వాడు నేనే దైవాన్ని అని చెప్పలేడు. మౌనమే సమాధానమైంది. వెంటనే ఆయన, ఇదంతా షైతాన్ కల్పించిన భ్రమ మాత్రమే.. అని పసిగట్టి,’ శాపగ్రస్తుడా.. దుర్మార్గుడా..దూరంగా పారిపో..’అంటూ.. అల్లాహ్ శరణు వేడుకున్నారు.అప్పుడు షైతాన్ మరో పాచిక విసురుతూ..’జీలానీ ..నిన్నునీ జ్ఞానం కాపాడింది.’ అని పలికాడు. ’కాదు.. కాదు.. నా జ్ఞానం కాదు..నాప్రభువు కాపాడాడు.’ అన్నారు హజ్రత్ జీలానీ రహ్మ వెంటనే.. ఈ విధంగా షైతాన్ చివరి అస్త్రం కూడా పనిచేయకుండా పోయింది. దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, మనమేదో దైవభక్తులమని, దానధర్మాలు చేస్తుంటామని, ఇతరసత్కార్యాలెన్నో చేస్తూ ఉంటామని, విద్యావిజ్ఞానాలు ఉన్నాయని, అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎవ్వరూ భ్రమపడకూడదు. అంతా దైవానుగ్రహమని మాత్రమే భావించాలి తప్ప దైవభక్తిపరులమని ప్రత్యేకతలు ఆపాదించుకొని గర్వించకూడదు.– మదీహా -
మిగాలోపుని మరణం
పూర్వం మగధ రాజధాని రాజగృహ నగర సమీపంలో ఒక పెద్ద పర్వతం ఉండేది. దాని మీద గరుడ జాతి పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ పక్షుల పేరు మీద దానికి గృధ్రకూట పర్వతం అనే పేరు వచ్చింది. ఆ పర్వతం మీద అపనందుడు అనే గరుడుడు ఉండేవాడు. మంచి బలశాలి కావడం వల్ల ఆకాశంలో అవలీలగా ఎగిరి రాగలిగేవాడు. అతని పుత్రుడు మిగాలోపుడు. అతను కూడా తండ్రిని మించిన రెక్కబలం కలవాడు. కుర్రతనపు జోరు మీద కన్నూమిన్నూ కానేవాడు కాదు. ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. కంటికాననంత దూరం ఎగిరి వచ్చేవాడు. ఈ విషయం తండ్రికి తెలిసింది. బిడ్డను పిలిచి– ‘‘కుమారా! మిగాలోపా! నీ విహంగ విన్యాసాల గురించి విన్నాను. మంచిదే! కానీ, నాయనా! ఒక్కో జీవికి ఒక్కో హద్దు ఉంటుంది. అలాగే పక్షులకు కూడా! మన గరుడ పక్షులకూ ఒక హద్దు ఉంది. ఆకాశంలో మనం లేచిపోయి నేలను చూసినప్పుడు ఈ ప్రాంతం నాలుగు మూలలా కనిపించేంత వరకే మనం పోవాలి. ఆ హద్దు దాటిపోతే, మన ΄ప్రాణాల మీదికి మనం తెచుకున్నట్లే. నింగి నుండి నేలరాలడం తప్పదు. ఇకనుండి వేగంలో, ఎత్తులో నీ హద్దుల్లో నీవుండు’’ అని చెప్పాడు.తండ్రి చెప్పాడే కానీ, తనయుడు దాన్ని చెవికెక్కించుకోనేలేదు. ఒక రోజున మిగిలిన పక్షులు వద్దని వారించినా వినకుండా సహజ వాతావరణ పరిధిని దాటి ఇంకా పైపైకిపోయాడు మిగాలోపుడు. అక్కడ మేఘాల్లో సుడిగాలి రేగింది. ఆ సుడిలో చిక్కుకున్న అతని దేహం ఛిద్రమై΄ోయింది ప్రాణాలు కోల్పోయిన మిగాలోపుని శరీర భాగాలు గాలిలోనే ఎటో కొట్టుకుపోయాయి. అతని మరణం అతని పరివారాన్ని కుంగదీసింది. తండ్రి తల్లడిల్లాడు. అతని మీద ఆధారపడ్డ భార్యాబిడ్డలు భుక్తి కోల్పోయారు. గృధ్రకూట పర్వతం మీద ఛిద్రమైన పక్షి కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పెద్దల మాట వినకపోవడం, తమ హద్దులు తాము తెలుసుకోలేక΄ోవడం, నిర్లక్ష్యం, లెక్కలేనితనం ఎంతటి విపత్తును కలిగిస్తాయో బుద్ధుడు చెప్పిన గొప్ప కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
‘మేరోరపి సారతరా భక్తిః : నిజమైన భక్తి
‘మేరోరపి సారతరా భక్తిః.’ అంటే భక్తి మేరు పర్వతం కంటే కూడా మిక్కిలి శక్తి కలదీ, ఉన్నతమైనదీ అని అర్థం. సర్వము భగవద్విలసితంగా భావించి, ఆ భావనతో ఆత్మార్పణ చేసుకొనే పరిశుద్ధ స్థితి భక్తికి పరాకాష్ఠ. ఇదే నిజమైన భక్తి! గురుభక్తి కూడా ఇంతే! గురువునే దైవ భావంతో ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ జీవితాన్ని కైంకర్యం చేసుకోవటం నిర్దుష్టమైన భక్తికి సరిహద్దు. భగవదనుభూతికి అనేక మార్గాలు న్నాయి. కానీ అందరికీ అందుబాటులో అనుసరణీయమైన మార్గం మాత్రం భక్తి మార్గమే. విభిన్న రుచులు గల మానవుల మనస్సుకు నచ్చిన విధంగా స్వీకరించదగిన విధానాలు భక్తిమార్గంలో ఉన్నాయి. అవే నవవిధ భక్తి మార్గాలు: ‘శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనం అర్చనంవందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్’ అని శ్రవణ కీర్తనాదులు చెప్పబడినాయి. ఆ యా భక్తుల రుచులను అనుసరించి ఈ నవవిధాలు అనుసరింపబడతాయి. భక్తి అనేది శ్రవణంతో ప్రారంభమై బలపడుతూ, చివరిదైన ఆత్మనివేదనంతో పరిపూర్ణం అవుతుంది. అత్మనివేదనం గల భక్తులకూ భగవంతునికీ భేదమే కనబడదు. ఈ విషయంలో గోపికల భక్తి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇదీ చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్.. రూ.7500కే వీసా : ఎవరికి? ఎలా? ఎక్కడ?‘ఓ అర్జునా! నా సేవ కోసమే గోపికలు తమ శరీరాన్ని రక్షించు కొంటున్నారు. అందువల్లనే నిగూఢమైన నా ప్రేమకు వారు పాత్రు లయ్యారు’ అని కృష్ణ పరమాత్మ అర్జునునితో అంటాడు. అలాగే దాన ధర్మాలు చేసినా... భక్తి భావంతో ప్రతిగ్రహీతను విష్ణువుగా భావించి దానమిస్తే దానికి విలువ ఉంటుంది. ఒక రోజు ఓ రాజసభలో ఉన్న సాధువుతో ‘నేను తల్చుకుంటే మిమ్మల్ని గొప్ప సంపన్నుణ్ణి చేయగలను’ అన్నాడు రాజు. సాధువు ఆ మాటకే మాత్రం పొంగిపోకుండా: ‘రాజా! దయవుంచి ఒక కాటా తెప్పించండి. అందులో ఒక వైపు నాకీయదలచిన సంపద ఉంచండి’ అని అన్నాడు. దానికి రాజు సరే అని వెంటనే ఆ యేర్పాటు చేశాడు. నగలు, నాణాలు, బంగారం, వజ్రాలు వంటి వెన్నో ఒక వైపు ఉంచాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతో ఒక చిన్న ఆకును తెచ్చి ఆ రెండవ తక్కెటలో వేశాడు. అంతే కాటాలో వేసిన రాజుగారి సంపదకంతా ఈ ఆకు సమానంగా తూగింది. కాస్త మొగ్గు కూడా ఉంది. రాజుకు గర్వ భంగం అయింది. నిజమైన భక్తునికి ప్రతి జీవిలోనూ అంతర్యామిగా భగవంతుడే కనబడతాడు. నిజమైన భక్తుల్లో చివరికి ఆత్మజ్ఞానం సుసంపన్నమైన వాళ్లు మోక్షా ర్హులవుతారు అని స్వామీజీ అనుక్షణం ప్రబోధిస్తుంటారు.జయ గురు దత్త!-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం-విశిష్ఠత
శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ హయగ్రీవుడిని రహస్యంగా భావించే సహస్రనామాలను తనకు ఉపదేశించమని అగస్త్య మహర్షి అభ్యర్థిస్తాడు. హయగ్రీవుడు శ్రీ లలితా సహస్రనామాలకు గల అనంత శక్తి కారణంగా దానిని యోగ్యులైన పుణ్యాత్ములకు మాత్రమే తెలియజేయ వలసి ఉంటుందని, అతనికి శ్రీ లలితా సహస్రనామ మూలాన్ని ఉపదేశిస్తాడు.దీనికి స్వరకర్తలు వసిని మొదలైన వాగ్దేవతలు. శ్రీ లలితా దేవి ఆజ్ఞపై వసినీ మొదలైన వాక్ దేవతలు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని రచించారు. వారు రహస్య మంత్రాలతో కూడిన వేయి నామాలను కూర్చారు. శ్రీ లలితా దేవి ఆస్థానంలో మొదటి సారిగా వాక్ దేవతలు సకల దేవతలు మంత్రిణి, దండిని ఇతర శ్రీ మాత అనుచరుల సమక్షంలో ఈ సహస్రనామాన్ని పఠించారు.శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం విని ముగ్ధురాలైన అమ్మ వారు తన భక్తులను అనుగ్రహించేందుకు ఈ విధముగా ప్రకటించింది ‘ఈ నామాలను ఎవరు అనుసరిస్తారో/ ఆచరిస్తారో.. ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర నామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో, వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను‘ అని. కాబట్టి ఈ స్తోత్రం అమ్మ వారి పూర్ణానుగ్రహం తప్ప మరొకటి కాదు.శ్రీ మాత స్వయంగా చెప్పినట్లు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అన్ని రకాల సమస్యలను నయం చేసే శక్తివంతమైన పరిష్కారం.ఈ స్తోత్రం చివరలో బ్రహ్మాండ పురాణంలో స్తోత్రం ఉనికి గురించిన ప్రకటన ఉంది. ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితా రహస్య నామ సాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం ‘లలితోపాఖ్యానం‘లో ఉంది. ఇందులో శ్రీ లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. ఈ స్తోత్రం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే ఇందులో ఉన్న అమ్మవారి నామాలను అర్థం చేసుకొని వాటిని ధ్యానంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ అనన్యమైన భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు.మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మన సూక్ష్మ శరీరంలో ఉన్న వివిధ శక్తి కేంద్రములు లేదా చక్రముల వద్ద శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారు ఏ విధంగా విరాజిల్లుతుంటారో వర్ణించబడి ఉంటుంది. ఈ చక్రములన్నీ మన శరీరంలోనే ఉంటాయి. అంటే అర్థము మన దేహము లోనే విభిన్న చక్రాలలో విభిన్న రూపాలలో అమ్మవారు కొలువై ఉంటారు.ఇప్పుడు విద్యుత్ శక్తి వలన ఎలాగయితే మన చుట్టూ ఉన్న ఫ్యాన్ లు, లైట్ లు, ఎ.సి.లు వంటి అనేక విద్యుత్ ఉపకరణాలు పని చేస్తూ ఉంటాయో, అదే విధంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి శక్తి వలన మానవుని సూక్ష్మ శరీరంతో పాటు అండ పిండ బ్రహ్మాండముతో నిండిన ఈ చరాచర జగత్తు మొత్తం నడుస్తుంది.– డా. పి. రాకేష్(సహజ యోగ సంస్థాపకురాలు, శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల ఆధారంగా) -
రాహుకేతు పూజలు : తమిళుల కాళహస్తి తిరుప్పాంపురం
జాతకంలో కాలసర్ప దోషం, కళత్ర దోషాలు ఉంటే ఆ దోషాలను తొలగించుకునేందుకు శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు దోష పూజలు చేయించుకోవడం తెలుగువారి మరి తమిళ తంబీలకు..? వాళ్లకు కూడా ఇలాంటి క్షేత్రం ఒకటి ఉంది.అదే తిరుప్పాంపురం. రాహుకేతువులు ఏకశరీరంగా ఉన్న మహా మహిమాన్వితమైన సర్పక్షేత్రమిది. ఉత్తర శ్రీకాళహస్తిగా పేరు పొందిన ఈ క్షేత్రం తమిళులకు అత్యంత పవిత్రమైనది. తమిళులే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని సర్పదోషనివారణ పూజలు చేయించుకుని ఉపశమనం పొందుతుంటారు. తిరుక్కాళాత్తి, కుడండై, తిరునాగేశ్వరం, నాగూర్, కీయ్ పెరుపల్లం తదితర అయిదు పుణ్యక్షేత్రాల గొప్పతనాన్ని ఒక్కటిగా కలిగి ఉన్న పవిత్ర స్థలమే తిరుప్పాంపురం. సాక్షాత్తూ సర్పాలే తమకు కలిగిన దోషాన్ని ఇక్కడకు వచ్చి తొలగించుకున్న గాథలు ఉన్నాయి. తిరుప్పాంపురం ఆలయంలో ఉన్న దైవం పేరు శేషపురీశ్వరుడు. అమ్మవారు వండుచేర కుయిలి. ఇక్కడ ఉన్న పుణ్య తీర్థం ఆదిశేష తీర్థం. ఈ ఆలయ విశిష్టతను తమిళ వాల్మీకిగా కొనియాడబడిన తిరునావుక్కరుసు వంటివారు కొనియాడారు. స్థలపురాణం: ఒకసారి కైలాసంలో శివుడిని వినాయకుడు పూజిస్తున్నాడు. అప్పుడు శివుడి మెడలోని పాములు తమనూ కలుపుకుని పూజిస్తున్నట్లు గర్వపడ్డాయి. అది గ్రహించిన శివుడు ఆగ్రహించి, ఇక మీదట నాగుపాములన్నీ తమ దివ్యశక్తులను కోల్పోయి సామాన్య సర్పాలవలె మానవుల చేత చిక్కి నానాహింసల పాలూ అయి మరణిస్తాయని శపించాడు. దీంతో శివుడి మెడలోని వాసుకితోపాటు రాహుకేతువులు తదితర సర్పాలు తమ శక్తిని కోల్పోయి తల్లడిల్లాయి. అవి తమ తప్పును తెలుసుకుని తమకు శాపవిమోచనం కల్పించవలసిందిగా పరమేశ్వరుని ప్రాధేయపడ్డాయి. దాంతో బోళాశంకరుడి మనసు కరిగిపోయింది. మహాశివరాత్రి రోజున తిరు΄్పాంపురం వెళ్లి అక్కడ కొలువై ఉన్న తనను ఆరాధిస్తే శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు వాసుకి, ఆదిశేషుడు తదితర అన్ని నాగులూ కలసి ఆ ఏడాది మహాశివరాత్రిరోజు తెల్లవారు ఝామునే తిరునాగేశ్వరంలోని నాగనాథ స్వామిని, తిరుప్పాంపురంలోని పాంబునాథుడిని, నాగూరులోని నగనాథుని ఆరాధించాయి. తిరుప్పాంపురం క్షేత్రంలో ఆరాధించిన వెంటనే నాగుల శాపం తొలగిపోయింది. ఇక్కడ ఈశ్వరుడిని ఆరాధించేందుకు వచ్చిన సర్పాలు ఒక పుణ్యతీర్థాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తీర్థానికే ఆదిశేష తీర్థమని పేరు. బ్రహ్మ, ఇంద్రుడు, అగస్త్యుడు, గంగాదేవి వంటి వారు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి ధన్యులైనట్లు పురాణ గాథలున్నాయి. ఇదీ చదవండి: అవరోధాలు, అపజయాలు కుంగదీస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!ఇక్కడ ఉన్న మూడవ కుళోత్తుంగ చోళుడి శిలాఫలకాన్ని బట్టి చూస్తే ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెప్పవచ్చు. తంజావూరును పాలించిన శరభోజి చక్రవర్తిపాలనలో ఈ ఆలయానికి వసంతమండ΄ాన్ని, తూర్పుదిక్కుగా రాజగోపురాన్ని నిర్మించారు. ఈ గోపురానికి ఎదురుగానే ఆదిశేష తీర్థం ఉంది. ఇక్కడ ఉన్న వినాయక విగ్రహానికి కూడా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామికి శేషపురీశ్వరుడు, పాంబుపుర నాథుడు, పాంబుపురీశ్వరుడు తదితర నామాలున్నాయి. గర్భగుడిలో శివుని పూజించే రీతిలో ఉన్న ఆదిశేషుని విగ్రహం కనువిందు చేస్తుంది. వెలుపలి ప్రాకారానికి ప్రదక్షిణ మార్గంలో భైరవుడు, సూర్యుడు, దుర్గ, శనీశ్వరుడు, రాహువు, కేతువు తదితర సన్నిధులున్నాయి. ఇక్కడ ఉన్న రావిచెట్టుకింద అసంఖ్యాకంగా సర్పశిలలున్నాయి. ఆలయంలో ఈశాన్య దిక్కుమూలలో రాహుకేతువులు ఒకే సన్నిధిలో కనిపిస్తారు. ఇక్కడ రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే సర్పదోష పరిహార పూజలకు ఈ ఆలయం పెట్టింది పేరు. రాహుకాలంలో ఆలయం తెరిచిన వెంటనే నేతిదీపాలు కొని వెలిగిస్తారు. రాహు, కేతు దోషాల పరిహారపూజలకు తగిన సంభారాలు ఇక్కడే లభిస్తాయి. సర్పదోష నివృత్తి కోసం వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు చేయించుకుంటూ కనిపిస్తారు. జాతకంలో సర్పదోషం ఉన్నవారు, రాహుకేతువులకు మొక్కుకుని, తిరుప్పాంపురంలో పూజలు చేయించుకునే వారు అధిక సంఖ్యాకంగా కనిపిస్తుంటారు. చదవండి: అమెరికా స్టోర్లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చఎలా వెళ్లాలంటే..?తమిళనాడులోని కుంభకోణం నుంచి కారైక్కాల్ వెళ్లే దారిలో ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. చెన్నై సెంట్రల్ నుంచి కుంభకోణానికి రైళ్లు, బస్సులు ఉన్నాయి. కుంభకోణం వరకు వెళ్తే అక్కడ నుంచి తిరుప్పాంపురం వరకు వెళ్లడానికి మినీ బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసు బస్సులు ఉన్నాయి. చూడదగ్గ ఇతర ప్రదేశాలు: సాధారణంగా తమిళనాడులోని నవగ్రహాలయానికి వెళ్లే వారు ఇక్కడికి వస్తుంటారు లేదంటే ఇక్కడికి వచ్చినవారు నవ గ్రహాలయానికి వెళ్తారు. అలాగే కుంభకోణంలోని ఐరావతీశ్వరన్ ఆలయం, ఉప్పిలియప్పన్ ఆలయం, ఆదికుంభేశ్వరన్ ఆలయం, సారంగపాణి ఆలయం, ఆరుల్మిగు స్వామినాథన్ ఆలయం, సూర్యనాయర్ కోయిల్, పట్టీశ్వరం ఆలయం తదితరాలున్నాయి.– డి.వి.ఆర్. భాస్కర్ -
అవరోధాలు, అపజయాలు కుంగదీస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!
అవరోధాలు, అపజయాలు, ఆశాభంగాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు ఎలాంటి వారినైనా మానసికంగా కుంగదీస్తాయి. ఎలాంటి సమస్యలూ లేకుండా జీవితం సాఫీగా సాగి΄ోవాలనే ఎవరైనా కోరుకుంటారు. జాతకంలోని గ్రహాల బలాబలాల మేరకు కొన్ని కొన్ని దశలలో, కొన్ని కొన్ని గోచార పరిస్థితుల్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు బాధించకుండా ఉండాలంటే...రోజువారీ విధి నిర్వహణ కోసమే కావచ్చు లేదా ఏదైనా ప్రత్యేకమైన పనిమీదనే కావచ్చు... ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావద్దు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పండ్లు లేదా పూలు లేదా మిఠాయిలు వంటివి తీసుకురావడం మంచిది.చిన్న రాగినాణేన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి, దానిని వీధిగుమ్మం దగ్గర తోరణానికి వేలాడదీయండి. ప్రతికూల శక్తుల నుంచి రక్షణగా ఉంటుంది.ప్రతిరోజూ ఉదయాన్నే పక్షులకు తృణధాన్యాలను ఆహారంగా వేయండి. ఆర్థిక సమస్యలు శీఘ్రంగా తొలగి పోతాయి.గురువారం రోజున ఇష్టదైవానికి చెందిన గుడికి వెళ్లడం మాత్రమే కాదు, ఆ రోజున గురువులను, గురు సమానులను కలుసుకొని వారికి మీ శక్తి మేరకు దక్షిణ తాంబూలాదులను సమర్పించి, వారి ఆశీస్సులు తీసుకోండి. పూజ కోసం వినియోగించే అగరొత్తులు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలను శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో కొనుగోలు చేయండి.– సాంఖ్యాయన -
శ్రావణం: ఈశ్వరాభిషేకం
భువనేశ్వర్: శివ భక్తులకు శ్రావణ మాసం అత్యంత పవిత్ర ప్రదం. ఈ నెల పొడవునా ప్రతి సోమవారం ఇష్ట ఆరాధ్య దైవం మహా దేవుడు శివునికి పవిత్ర జలంతో అభిషేకించి తరించేందుకు దీక్ష బూనుతారు. తొలి శ్రావణ సోమవారం పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాలు శివ దీక్ష భక్తులతో కిటకిటలాడాయి. కఠోర నియమ నిష్టలతో ఒక చోటులోని నదీ జలం సేకరించి వేరొక చోట పూజలందుకుంటున్న మహా దేవునికి అభిషేకిస్తారు. నదీ తీరంలో శుచిగా స్నానం ఆచరించి దీక్ష వస్త్ర ధారణతో తీరంలో లాంచనంగా పూజాదులు నిర్వహించి పవిత్ర నదీ జలంతో నింపిన కలశాల్ని కావడికి అమర్చి పాద యాత్ర ప్రారంభిస్తారు. ఈ దీక్షకుల్ని కావడి ధారులు (కౌడియా)గా పేర్కొంటారు. పాద యాత్ర ఆద్యంతాలు దీక్ష నియమ నిబంధనల్ని కఠోరంగా అవలంభిస్తారు. సోమవారం శైవ క్షేత్రం చేరేలా యాత్ర కొనసాగిస్తారు. భోలా శంకరుని కటాక్షం కోసం బోల్ భం నిరంతర శివ నామ నినాదంతో ముందుకు సాగుతారు. బోల్ భం దీక్షకుల ఆగమనం పరిసరాల్ని శివ మయం చేస్తాయి. శైవక్షేత్రాలు ప్రత్యేకంగా అలంకరించుకుని వీరికి స్వాగతం పలుకుతాయి. దారి పొడవునా కావడిధారి పాదచారులకు ఎటువంటి అసౌకర్యం అవాంతరం కాకుండా పోలీసు, రవాణా తదితర అనుబంధ వర్గాలు అంకిత భావంతో చేయూతనిస్తాయి. దవళేశ్వరునికి పవిత్ర జలంతో అభిషేకిస్తున్న భక్తులు పలు స్వచ్చంధ సేవక వర్గాలు దారి పొడవునా దీక్షకు అనుగుణంగా వీరి కోసం ఏర్పాట్లు చేసి ఆదరిస్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి శైవ క్షేత్రాలు విద్యుద్దీపాలు, పచ్చని తోరణాలు, సుగంధిత పూల మాలల అలంకరణతో కనులు మిరమిట్లు గొలిపేలా ముస్తాబవుతాయి. ఆయా క్షేత్రాల్లో బోల్ భం దీక్షకులు సులభంగా మహా దేవునికి అభిషేకించేందుకు తాత్కాలిక బారికేడ్ల గుండా వరుస క్రమంలో దర్శన సౌకర్యం వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించి దేవస్థానం యంత్రాంగం సహకరిస్తారు. ఏకామ్ర క్షేత్రంలో లింగ రాజు, అఠొగొడొ ధవళేశ్వరుని దేవస్థానం, రాజ్గంగ్పూర్లోని ఘోఘరేశ్వర్, ఢెంకనాల్ కపిలేశ్వర్ మరెన్నో ప్రముఖ శైవ క్షేత్రాలు బోల్ భం దీక్షకుల ఆగమనంతో శ్రావణ శోభతో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా మహా నది, ఉప నదులు, బ్రాహ్మణి, వైతరణి, కువాఖాయి తదితర పవిత్ర నదుల నుంచి సేకరించిన జలాన్ని కావడి భారంతో నిష్టతో సంకల్పం మేరకు శైవ క్షేత్రం చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో మహా శివునికి అభిషేకిస్తారు. ఈ దీక్షలో ఆబాల గోపాలం అత్యంత అంకిత భక్తి భావంతో పాల్గొంటారు. శివాలయంలో భక్తులు భారీగా గుమిగూడారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది భక్తులు, కౌడిలు బ్రహ్మణి నది, వేదవ్యాస్ శైవ పీఠం నుంచి నీటిని తీసుకువచ్చి ఘోఘరేశ్వర్ శివాలయానికి నీటిని సరఫరా చేశారు. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand) పూరీ సాగర తీరంలో శ్రావణ సోమవారం పురస్కరించుకుని మహా దేవుని ఆశీస్సులు కోరుతూ ఆవిష్కరించిన సైకత మహా శివుడు, బొడొ సింగారం అలంకరణలో కటక్ అఠొగొడొ ధవళేశ్వరుని దర్శనం -
రామావతార పరమార్థం : సరస్వతీ దేవి ప్రేరణతోనే కైకేయి వైరం
సాధారణంగా లోకంలో... రామాయణంలోని మంథర కపట స్వభావం గలది అనీ, భరతుని కంటే కూడా రామునిపై ఎక్కువ పుత్ర ప్రేమను చూపించే కైకేయి మనసును విరిచి, రాముడిని వనవాసానికి పంపేటట్లు చేసిందనీ ఆమె పాత్ర స్వభావం గురించి ఒక విశ్లేషణ ఉంది. కానీ, అధ్యాత్మ రామాయణంలో, రామావతార పరమార్థం నెరవేరటానికి సరస్వతీ దేవి ప్రేరణతో ఆమె అలా వైరభావం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది.రామ పట్టాభిషేక వార్త విని, కౌసల్యా దేవి ఈ శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలని లక్ష్మీదేవిని పూజించింది, దుర్గాదేవిని పూజించింది. అయినా ఆమె మనసులోకించిత్ వ్యాకులత ఉందిట. జరగబోయేది ముందుగానే సూచనగా తెలుస్తున్నది ఆమెకు. అప్పుడు దేవలోకంలో దేవతలంతా కలిసి, వాగ్దేవి సరస్వతిని ప్రేరేపించారు: ‘నీవు భూలోకంలో అయోధ్యా నగరానికి వెళ్లు. రామ రాజ్యాభిషేకానికి విఘ్నం కలగజేయటానికి యత్నించు. ముందు మంథర మనసులో ప్రవేశించి, ఆమెలో వ్యతిరేక భావం కలిగించు. తర్వాత కైకేయిలో ప్రవేశించి ఆ విధంగానే చెయ్యి. రామ రాజ్యాభిషేకం ఆగిపోతే గానీ, రామావతార పరమార్థం నెరవేరదు,’ అని చెప్పారు. సరస్వతి దేవి సరేనని బయలుదేరింది. అయోధ్యా నగరం చేరి మంథర మనసులో ప్రవేశించింది.కైకేయితో మంథర ‘నీకు గొప్ప ఉపద్రవం రాబోతోంది. రేపు రామునికి పట్టాభిషేకం జరగబోతోంది’ అంది. కైకేయిసంతోషంతో దివ్యమైన మణి నూపురాన్ని మంథరకు బహు మతిగా ఇచ్చింది. సరస్వతీ దేవి ప్రేరణతో మంథర... కైకేయి మనసు బాధ పడేట్లు, రామ పట్టాభిషేకం జరిగితే కౌసల్యకు దాసిలా ఉంటావని చెపుతుంది. ఆ మాటల ప్రభావంతో కైకేయి మనసులో మార్పు వచ్చి, కోప గృహంలో చేరింది. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్లడం, సీతాపహరణం, రావణ సంహారం... ఇలా ఎన్నో ఘట్టాల్లో రాముడు తాను నిర్వర్తించా ల్సిన సకల కార్యాలను నిర్వర్తించాడు.– డా.చెంగల్వ రామలక్ష్మి -
గురు పూర్ణిమ: షిర్డీ సాయినాథుడికి కళ్లు చెదిరే బంగారు వజ్రాభరణాల కానుకలు
సాక్షి,ముంబై: శిర్డీలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ముఖ్యమైన రోజు కావడంతో లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. గురుపూర్ణిమ సందర్భంగా మందిరాన్ని వివిధ రకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురుపూర్ణిమతో ‘శ్రీ సాయిసచ్చరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండపారాయణం సమాప్తి అయిన సందర్భంగా శ్రీసాయి చిత్రపటం, పోతిని ఊరేగించారు. ఈ ఊరేగింపులో సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అంజు శెండే (సోనటక్కే) ‘పోతి’(ధాన్యపుసంచి)ని చేతబట్టుకోగా, మందిరం కార్యనిర్వాహణ అధికారి (ఈఓ) గోరక్ష గాడిల్కర్ వీణ, డిప్యూటీ ఈఓ భీమరాజ్ వరాడే, మెకానికల్ విభాగం ప్రముఖులు అతుల్ వాఘ్లు సాయిచిత్రపటం చేతబట్టుకుని ముందుకు నడిచారు. ఈ ఊరేగింపులో సంస్థాన్ పదాధికారులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి సమీపంలో నిర్మించిన భారీ వేదికపై వివిధ భక్త మండళ్ల బృందాల ఆధ్వర్యంలో రోజంతా భజనలు, ఆధ్యాత్మిక గీతాలు, కీర్తనల ఆలాపన కొనసాగింది. గురుస్థాన్లో నేడు రుద్రాభిషేకంగురుపౌర్ణమి ఉత్సవాల ముగింపు సందర్భంగా నేడు గురుస్థాన్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించ నున్నారు. ఉట్టి ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపనున్నారు. ఆంధ్ర భద్రావతి పేట్ ఆలయానికి భక్తుల తాకిడి సోలాపూర్: గురుపూర్ణిమను పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్కల్కోట్లో శ్రీ స్వామి సమర్థ మహారాజ్ను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయాలు, ఆశ్రమాల్లో ధార్మిక, ఆధ్యాత్మికక కార్యక్రమాలు ప్రవచనాలు, సత్సంగాలు జరిగాయి. వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబా దర్శనం కోసం ఆంధ్ర భద్రావతి పేట్లోని శ్రీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనంతోపాటు స్పెషల్ క్యూలైన్లలోనూ బారులు తీరారు. ఈ ఆలయంలో వారంరోజులుగా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా బుధవారం ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాయినాథ రథ ఊరేగింపు నిర్వహించారు. శ్రీ సాయి దర్బార్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు దత్త నగర్, పద్మశాలీ చౌక్, జంకండి పూల్, జోడు బసవన్నచోక్, మార్కండేయ చౌక్, గుజ్జ నివాస్, వినాకర్ బాగ్, కన్నా చౌక్, రాజేంద్ర చౌక్ మార్గాల గుండా ఆంధ్ర బద్రావతి పేట్ వరకు కొనసాగింది. గణేశ్పురి ఆలయంలో గురుపూర్ణిమ పూజలు భివండీ: గురుపూర్ణిమ సందర్భంగా గణేశ్పురిలోని శ్రీ నిత్యానంద స్వామిని దర్శించు కునేందుకు భివండీ, ముంబై, కళ్యాణ్, ఠాణా, ముర్బాడ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాజీ కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాసపూరి్ణమ సందర్భంగా గురువారం తెలుగు సమాజ్ శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పి.ఈ. ఎం. హైసూ్కల్, జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల, వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, విద్యానికేతన్ స్కూల్, వివేకానంద ఇంగ్లీశ్ మీడియం హైసూ్కల్, బాబా హైసూ్కల్ అండ్ జూనియర్ కాలేజీలోప్రత్యేక కార్యక్రమాలు, విద్యార్థులతో తల్లిదండ్రులకు–ఉపాధ్యాయులకు పాద సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అఖిల పద్మశాలి సమాజ్ కోశాధికారి అవదూత బలరాం బాలె శ్రీనివాస్, భైరి నిష్కమ్, గాజెంగి కృష్ణ, చిటికెన్ వెంకటేశ్, గాజెంగి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా విద్యానందగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజ, పాదపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి నారాయణ, మహేశుని భూమేశ్, యెన్నం శ్రీనివాస్, చెక్కరకోట మనోహర్, వేమున ఆనంద్, బాలె సత్యనారాయణతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా ఓ అజ్ఞాత భక్తుడు సాయిబాబాకు బంగారు కిరీటం, వెండి హారం సమర్పించారు. 566 గ్రాముల బరువున్న రూ.59 లక్షల విలువైన బంగారు కిరీటం, 54 గ్రాముల బరువున్న బంగారు పువ్వులు, 2 కిలోల బరువున్న వెండి హారం ఇందులో ఉన్నాయి.గురుపూర్ణిమను పురస్కరించుకుని చెన్నైకి చెందిన లలితా మురళీధరన్, కె. మురళీధరన్ దంపతులు బాబాకు రూ. 3.05 లక్షల విలువైన బ్రూచ్ సమర్పించారు. బంగారం, వజ్రాలతో దీనిని తయారు చేశారు. -
అన్ని స్థితులనూ ఆస్వాదించగలగాలి
జీవితం విభిన్న స్థితుల సంగమం. ఇక్కడ సుఖమూ ఉంది, దుఃఖమూ ఉంది. సంతోషమూ ఉంది, బాధా ఉంది. ఆనందమూ ఉంది, విచారమూ ఉంది. తీపీ ఉంది, చేదూ ఉంది. శీతలమూ ఉంది, ఉష్ణమూ ఉంది. సంతృప్తీ అసంతృప్తీ రెండూ ఉన్నాయి. శాంతి, అశాంతీ కూడా ఉన్నాయి. ఇదంతా దైవాభీష్టం, దేవుని ఆదేశానుసారం, ఆయన నిర్ణయం మేరకే.అందుకని మానవులు కష్టాలొచ్చినప్పుడు కుంగి΄ోకూడదు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు. ధైర్యంతో స్వాగతం పలకాలి. ఇవన్నీ దేవుని తరఫునే అని భావిస్తూ, ఆ కరుణామయుడే వీటినుండి విముక్తి కలిగిస్తాడని నమ్మాలి.ఇదేవిధంగా కష్టాలు దూరమై, పరిస్థితులు మెరుగు పడి, అంతా సజావుగా జరిగి΄ోతూ, సుఖసంతోషాలు ప్రాప్తమైతే ఇదంతా తమ గొప్పదనమేనని, తమ రెక్కల కష్టార్జిత ఫలితమేనని భావించి విర్రవీగకూడదు. ఇదంతా అల్లాహ్ అనుగ్రహమని, ఆ కరుణామయుని ప్రసాదితమన్న విశ్వాసం హృదయంలో జనించాలి. ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు తాను ప్రసాదించిన అనుగ్రహాలను తిరిగి లాక్కోగలడు. కాబట్టి ప్రతి అనుగ్రహానికీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. ముహమ్మద్ ప్రవక్త(స)ప్రవచనం ఇలా ఉంది: ‘ఎవరైతే ధన, ప్రాణ నష్టాల్లో కూరుకు΄ోయి, ఆ విషయం ఎవరి ముందూ బహిర్గతం చేయకుండా, ప్రజలతో ఫిర్యాదు చేయకుండా ఉంటాడో అతణ్ణి క్షమించడం అల్లాహ్ బాధ్యత.’అల్లాహ్ ఇలా అంటున్నాడు: ‘మానవులారా! నా ప్రసన్నత కోసం, నేను ప్రసాదించే పుణ్యాన్ని ΄పొందే సంకల్పంతో, దుఃఖ సమయం ఆసన్నమైనప్పుడు సహనం వహించినట్లయితే, నేను స్వర్గంకన్నా తక్కువైనదాన్ని, స్వర్గం తప్ప మరిదేన్నీ మీకు ప్రసాదించడానికి ఇష్టపడను.’ప్రాపంచిక జీవితంలో కష్టనష్టాలు, సుఖ సంతోషాలు చాలా సహజ విషయాలు. వీటిద్వారా దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి. సుఖ సంతోషాలు, శాంతి సంతృప్తులు ్ర΄ాప్తమైనప్పుడు అల్లాహ్కు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. కష్టాలు కడగండ్లు ఎదురైతే, జరగరాని సంఘటనలు ఏమైనా జరిగి కష్టనష్టాలు, బాధలు సంభవిస్తే దాస్య ఔన్నత్యానికి ప్రతిరూపంగా అనన్యసామాన్యమైన సహనం వహించాలి. హృదయం కృతజ్ఞతతో నిండి ఉండాలి. అంటే, అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలగాలి. దీన్నే ‘స్థితప్రజ్ఞత’ అంటారు. ఇలాంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. స్వర్గసీమను అనుగ్రహిస్తాడు.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ ఇదీ చదవండి: వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం! -
సార్థక జీవితం -మరణంతోనే వెలుగు
అల్ప పదాలలో అనంతార్ధాన్ని చూపే ప్రసంగ కళా శాస్త్ర పండితుడిగా, ధర్మశాస్త్ర నిపుణుడిగా పేరొందిన అపోస్తలు డైనపాలు క్రీస్తు మరణాన్ని చూసే విధానం అద్భుతమనే చెప్పాలి.‘నా సువార్త ప్రకారంగా’ అంటూ పౌలు మహాశయుడు దేవుని సంకల్ప ప్రకారమైన క్రీస్తు సత్యసువార్తను కుదించి కేవలం మూడే మూడు పదాలతో సువార్తను నిర్వచించాడు. క్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానం అంటూ సువార్తను వివరించాడు. ఇదే క్రీస్తు సువార్తను మరల మరింతగా క్లుప్తంగా చేసేస్తూ విషయ సారం ఇదే అనేంత తేటగా అసలును తేల్చేస్తూ అది హుందాగా మన ముందు పెడతాడు. క్రీస్తు మరణమే సువార్త’అంటూ ఒకే ఒక్క మాటతో ఇలా సులభం చేసేశాడు. అయితే క్రీస్తు సువార్త ఎప్పుడూ దేవుని సంకల్పంతో ముడిపడి ఉంటుంది. సువార్తను దేవుని సంకల్పంతో ఎన్నడూ వేరుచేసి చూడలేము. పౌలు క్రీస్తు మరణాన్నే సువార్తగా అదే తన జీవిత పరమావధిగా, గమ్యంగా చేసుకొని జీవితాంతం ఈ ఒక్క అతిశయంతోనే సువార్తను అంతటా ప్రకటించాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటాడు ఒకసారి. క్రీస్తు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచారం చేయండి అంటూ సంఘానికి పిలుపునిస్తూ అజ్ఞాపిస్తాడు ఇంకొకసారి. ఔను, నిజానికి క్రీస్తు మరణమే సువార్త.అయితే సమాధి, పునరుత్థానాలు అను రెండు అంశాలు కూడా సువార్తను బలపరచేవే. ఎలాగంటే, మరణించిన క్రీస్తును సమాధి చేశారు. అలాకాకుండా ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏ వైద్యశాలకో ఆయన్ను తరలించేవారు. అలా జరుగలేదు. రోమా ప్రభుత్వం ఆయన మరణించాడు అన్నది నిర్ధారణ చేసుకొనే ఆయన పార్థివ దేహాన్ని సంబంధిత వ్యక్తులు, శిష్యులకు అప్పగించింది. ఇక పునరుజ్జీవం విషయానికి వస్తే, క్రీస్తు మరణం నుండి తిరిగి లేవక΄ోతే క్రైస్త్తవులకు మనుగడే అనగా నిరీక్షణే లేదని పౌలే బలంగా నొక్కి వక్కాణిస్తుంటాడు. అయినా సరే, పౌలు దృష్టి కోణంలో క్రీస్తు మరణమే సువార్త. సువార్త అంటే క్రీస్తు మరణం... క్రీస్తు మరణమే సువార్త అన్నంతగా ΄పౌలు జీవితంతో క్రీస్తు సువార్త ముడిపడి పెనవేసుకొంది.మరో విధంగా చూస్తే, ఒక వ్యక్తి సమాధి చేయబడ్డాడు అంటే మరణించాడు అనేకదా అర్థం. మరణించిన వారే సమాధి చేయబడతారు. అదేవిధంగా మరణించాడు అనంటే ఒక వ్యక్తి ఎక్కడో ఒకచోట పుట్టాడు అనే కదా దీనర్థం. కాబట్టి ఈ కోణంలోనూ మరణమే సువార్త అయ్యింది. మరణంతోనే వెలుగు చేతల పరమైన సత్క్రియలు, వీరోచిత కార్యాలు, ధైర్య సాహసాలు మాట్లాడినంత గట్టిగా ఏవీ మాట్లాడలేవు. ఒక సైనికుడు తన వీర మరణంతోనే వెలుగులోకి వస్తాడు. కొత్తగా ఈ ప్రపంచానికి పరిచయం అవుతాడు. ఇక అప్పటి నుండే అతని పుట్టుక, పేరు, ఊరు, తల్లిదండ్రులు, అతడు చదివిన ΄ాఠశాల, సంబంధిత ఇతర విద్యా సంస్థలు, అతనికి చదువు చెప్పిన గురువులు, అతని సన్నిహిత స్నేహితులు, బంధు మిత్రులు అంతా మీడియా కెక్కుతారు. దేశానికి అతని త్యాగపూరిత మరణం చేసిన గొప్ప మేలునే ఎప్పుడూ మరువక దేశ ప్రజలు అంతా గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటిదే, ఇంతకు మించినదే క్రీస్తు మరణం. – జేతమ్ -
వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం!
వృత్తి ఉద్యోగాల్లోని అవరోధాల వల్ల చాలామంది నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు. పనికి తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కకపోవడం ఎవరికైనా మనస్తాపం కలిగిస్తుంది. పనిచేసే చోట రాజకీయాల వల్ల తరచుగా నష్ట΄ోతూ ఉన్నట్లయితే విరక్తిలో కూరుకుపోతారు. ఇలాంటి దుస్థితిని ఎలా అధిగమించాలంటే... అసూయాపరుల కారణంగా ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించాలంటే, శుక్రవారం రాత్రివేళ కిలో మినుములను నీట్లో నానబెట్టండి. శనివారం ఉదయం స్నానాదికాల తర్వాత ముందురోజు నానబెట్టిన మినుములను ఒక పళ్లెంలోకి తీసుకోండి. ఆ మినుములను మూడు సమ భాగాలుగా చేయండి. ఒక భాగాన్ని గుర్రానికి, ఒక భాగాన్ని గేదెకు, ఒక భాగాన్ని ఆవుకు తినిపించండి.ప్రభుత్వోద్యోగాల్లో కొనసాగుతున్న వారు ఉద్యోగ జీవితంలో అవరోధాలు తొలగిపోవాలంటే సూర్య ఆరాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించండి. ప్రతి ఆదివారం ఒక చిన్న బెల్లంముక్కను ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి. ఉద్యోగ జీవితంలో కుట్రలు కుతంత్రాలకు బాధితులు బలి కాకుండా ఉండాలంటే, ప్రతి శుక్రవారం ఉపవాసం చేయండి. శుక్రవారం ఉదయం స్నానాదికాల తర్వాత దేవీ ఆర్గళ స్తోత్రాన్ని మూడుసార్లు ఏకాగ్రతతో పఠించండి. అనాథ బాలికలకు కొత్త దుస్తులు ఇవ్వండి.ఉద్యోగ జీవితంలో పురోగతికి ఏర్పడుతున్న అవరోధాలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం ఉదయం స్నానాదికాలు, నిత్యపూజ తర్వాత రావిచెట్టు మొదట్లో గుప్పెడు నానబెట్టిన మినుములు, ఒక చిన్న బెల్లం ముక్క నివేదనగా ఉంచి, నీలిరంగు పూలతో పూజించాలి. గాయత్రీ హోమం చేయడం ద్వారా కూడా ఫలితం ఉంటుంది.– సాంఖ్యాయన విజయం కోసం... జయ శ్లోకంజయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలఃరాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితఃదాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణఃహనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజఃన రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీంసమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్జయశ్లోకం అనే పేరుగల ఈ శ్లోకాన్ని మన కోరికను లేదా సమస్యను బట్టి శుచిగా ఉండి 5/11/21/40 రోజులపాటు నిత్యం భక్తిశ్రద్ధలతో చదువుకుంటూ హనుమంతుడికి అరటిపండ్లు నివేదించడం వల్ల ఎంతటి క్లిష్ట సమస్యలైనా తీరిపోతాయని ప్రతీతి. మంచి మాటలు మనం చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు. అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటపుడు మనం కనపడాల్సిన అవసరం లేదు. మంచితనం కనపడితే చాలు.చిరునవ్వును మించిన అలంకరణ లేదు. వినయాన్ని మించిన ఆభరణం లేదు. డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది. కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది.మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావొచ్చేమో కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు’.చెడుని ప్రశ్నించడం, మంచిని ప్రశంసించడం నేర్చుకున్నప్పుడు అది మనలో మంచిని పెంచి చెడుని తొలగిస్తుంది’. -
తొలి ఏకాదశి సందర్బంగా లండన్లో SVBTCC ఆధ్వర్యంలో బాలాజీ కల్యాణం
తొలి ఏకాదశి అనే పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని, శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) — లండన్ లోని బాలాజీ దేవాలయం - ఒక వైభవమైన శ్రీనివాస (బాలాజీ) కల్యాణాన్ని ఘనంగా నిర్వహించింది. లోడన్ వ్యాలీ లెజర్ సెంటర్, రెడింగ్ — SVBTCC ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 1800 మందికి పైగా భక్తులు హాజరై పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ వేడుకకు ఎర్లీ మరియు వుడ్లీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి యువాన్ యాంగ్, వోకింగ్హాం మేయర్ మేడం క్యారొల్ జ్యూవెల్, మరియు హిల్సైడ్ కౌన్సిలర్ పాలిన్ జార్గెన్సెన్ లాంటి ప్రముఖ స్థానిక రాజకీయ నాయకులు హాజరై ప్రత్యేకంగా గౌరవించారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పిల్లలు మరియు నిపుణుల ద్వారా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీతం, నృత్యం, భక్తి కళల ద్వారా భారత సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తూ, కార్యక్రమం మొత్తం భక్తి శ్రద్ధలతో, సాంస్కృతిక గౌరవంతో, సముదాయ భావంతో సాగింది.భక్తుల నుంచి వచ్చిన భారీ స్పందనకు SVBTCC ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. స్వదేశానికి దూరంగా ఉన్నా కూడా, పవిత్ర తొలి ఏకాదశి రోజున కల్యాణాన్ని నిర్వహించగలగటం ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నామనీ, లండన్ లోని బాలాజీ దేవాలయంలో ఈ వేడుక నిర్వహించటం మాకు గర్వకారమని అని పేర్కొన్నారు. ఈ వేడుక భారతీయ డయాస్పోరా యొక్క స్థిరమైన సాంస్కృతిక విలువలకు గుర్తుగా నిలిచిందన్నారు లండన్లోని ఆధ్యాత్మిక , సామాజిక జీవితాన్ని ప్రోత్సహించడంలో SVBTCC పాత్రను మరోసారి చాటుకుందని భక్తులు కొనియాడారు. -
'గురువు' అనే పదం ఎలా వచ్చింది..? అతడిని తెలుసుకునేది ఎలా..?
అంధకారాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలిగించేవాడే గురువు. గురువ అనే శబ్దానికి అత్యంత మహోన్నత అర్థాన్ని వివరించారు ఎందరో మహానుభావులు. ఇవాళ(గురువారం) గురుపౌర్ణమి సందర్భంగా అలాంటి నిజమైన గురువును ఎలా గుర్తించాలి? . ఆయన మనల్ని ఎలా కనుగొంటాడు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం! . ‘గురు’ అనే పదం రెండు పదాల నుండి వచ్చింది: ‘గు’ అంటే అంధకారం, మరియు ‘రు’ అంటే తొలగించడం లేదా చెదరగొట్టడం. ఒక గురువు, భ్రాంతి యొక్క చీకటి సందుల నుండి బయటపడి మన నిజమైన నివాసం, అంటే జ్ఞానోదయం భద్రతలోకి అడుగుపెట్టేవరకు, జన్మజన్మాంతరాలుగా మన చేతులు పట్టుకుని నడిపిస్తాడు. మరి నిజమైన గురువును ఎలా గర్తించాలి?మనం గురువును కనుగొనం, గురువే మనల్ని కనుగొంటాడని చెబుతున్నాయి పురాణాలు. పరమ సత్యం పట్ల మన తపన తీవ్రమైనప్పుడు, ఆత్మసాక్షాత్కారం వైపు సవాలుతో కూడిన ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేయడానికి దేవుడు ఒక దైవిక మార్గాన్ని లేదా గురువును పంపుతాడు. అటువంటి గురువు దైవ నియమితమైనవాడు. ఆయన దైవంతో ఏకమైనవాడు, అలాగే భూమిపై ఆయన ప్రతినిధిగా మాట్లాడటానికి దైవిక ఆమోదం కలిగి ఉంటాడు. గురువు నిశ్శబ్ద దైవ వాణి. గురువు నిర్దేశించిన సాధనను అనుసరించడం ద్వారా, శిష్యుడు భ్రాంతి సముద్రాన్ని దాటడానికి జ్ఞానం అనే తన సొంత ప్రాణరక్షక తెప్పను నిర్మించుకుంటాడు. గురువు, దేవుడు మన జీవితాల్లోకి అడుగిడే అనంత ద్వారం. మనం మన సంకల్పాన్ని, చైతన్యాన్ని గురువుతో అనుసంధానించుకోకపోతే, దేవుడు మనకు సహాయం చేయలేడు. ఈ రోజుల్లో, శిష్యత్వం అనేది గురువుకు లోబడి తమ స్వేచ్ఛా సంకల్పాన్ని వదులుకోవడంగా పరిగణించబడుతుంది. అయితే, గురువు యొక్క సార్వత్రిక కరుణ పట్ల విశ్వసనీయత ఏ మాత్రం బలహీనతకు సంకేతం కాదు.స్వామి శ్రీయుక్తేశ్వర్ ఇలా అన్నారు: “స్వేచ్చా సంకల్పం అనేది పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏర్పడ్డ అలవాట్లు లేక మానసికోద్రేకాలకు లోబడి ప్రవర్తించడంలో లేదు.” అయితే, సాధారణ మానవులు తమ సంకల్ప శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించకుండానే తమ నిత్య జీవితాలను గడుపుతారు సంక్షోభంలో, దుఃఖంలో, ఆనందంలో కూడా. స్వేచ్ఛ అంటే నిజానికి మన అహం-ప్రేరిత స్వభావం నుండి విముక్తి పొందడమే. ఇది అనంత జ్ఞానం, సర్వవ్యాప్త చైతన్యం, సర్వవ్యాప్త ప్రేమపై ధ్యానం చేసినప్పుడు మాత్రమే వస్తుంది; వీటిని శిష్యులు సత్య గురువు బోధనల ద్వారా అనుభవించగలరు. పరమహంస యోగానంద అటువంటి సద్గురువులలో ఒకరు. ఆయన దివ్యమైన గురుపరంపర నుంచి వచ్చారు. క్రియాయోగ మార్గ జ్ఞానాన్ని ప్రపంచానికి విస్తరింపజేయడానికి కృషి చేశారు. క్రియాయోగం ఆత్మసాక్షాత్కారానికి అత్యున్నత మార్గాలలో ఒకటి. లక్షలాది మంది జీవితాలను ఉద్ధరించిన ఆయన ఆధ్యాత్మిక గ్రంథమైన “ ఒక యోగి ఆత్మకథ”లో, యోగానంద ఇలా వ్రాశారు: క్రియాయోగమన్నది మనిషి రక్తంలో కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్తో నింపే ఒకానొక మానసిక-శారీరక ప్రక్రియ. ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి, దీనితో ఒక యోగి కణజాలాల క్షయాన్ని తగ్గించడం కానీ మొత్తానికే ఆపెయ్యడం కాని చేయగలడు. ఆధ్యాత్మిక పురోగతికి అటువంటి శక్తివంతమైన పద్ధతిని మానవాళికి పంచుకోవడం తప్పనిసరి. ఈ ఉద్దేశ్యంతోనే, యోగానంద తన గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్ ప్రోద్బలంతో, 1917 లో రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను, 1920 లో లాస్ ఏంజిల్స్లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ను స్థాపించారు.సత్య జిజ్ఞాసువులకు క్రియాయోగ బోధనలు ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్. ద్వారా స్వీయ-సాక్షాత్కారంపై గృహ అధ్యయన పాఠాల రూపంలో అందుబాటులో ఉన్నాయి. విశ్వాసి యొక్క తపన లోతుగా ఉండి, దేవుడిని తెలుసుకోవాలని నిరంతర ఆకాంక్ష ఉంటే, ఒక సద్గురువు స్వయంగా తన శిష్యుడికి మార్గనిర్దేశం చేయడానికి వస్తాడని నమ్ముతారు. ఇది ఒక సద్గురువు యొక్క దివ్య వాగ్దానం. గురువు భౌతిక శరీరంలో ఉన్నా లేకున్నా, ఆయనతో అనుసంధానమైన శిష్యుడికి ఆయన ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాడు, ఎందుకంటే సద్గురువు యొక్క చైతన్యం శాశ్వతం. సంత్ కబీర్ మాటల్లో, “సద్గురువును కనుగొన్న శిష్యుడు ఎంతో గొప్ప అదృష్టవంతుడు!” (చదవండి: వ్యాసాయ విష్ణు రూపాయ...) -
జయహో శాకంబరీ మాత!
అమ్మవారంటే సాక్షాత్తూ అమ్మే. ఈ సృష్టిలోని జీవరాసులన్నింటికీ అమ్మ అయిన జగన్మాత అందరి ఆకలిని తీర్చడానికి శాకంబరి దేవి అవతారంలో ఉద్భవించింది. ఈ దేవిని పూజించటం వల్ల కరువు కాటకాల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆకలి బాధ ఉండదనీ భక్తులు విశ్వసిస్తారు. వరంగల్లోని భద్రకాళీ అమ్మవారికి శాకంబరీ దేవి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరిస్తారు. ఇందుకు సంబంధించిన పురాణ గాధ తెలుసుకుందాం...∙ఆషాఢ ఉత్సవాలువేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సులు అందక శక్తి హీనులై΄ోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది.ఋషులు, దేవతలు సర్వ శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో ‘శతాక్షి’గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకంలో వున్న దుస్థితి ని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచెం వ్యవధి పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్ళతో సహా ఒక పెద్దచెట్టు లాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకంబరి అవతారం.పార్వతీదేవి దుర్గగా, తన నుంచి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది. అలనాటి ఈ ఘటనకు ప్రతీకగా విజయవాడ ఇంద్రకీలాద్రితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవీ ఆలయాల్లో ఆషాఢ మాసం లో శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. శుక్లపక్ష త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజులు ఈ ఉత్సవాలు సాగుతాయి.వరంగల్లోని భద్రకాళీ ఆలయంలో మొదటిసారిగా ఆషాడ శుద్ధ సౌర్ణమి నాడు శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఇవి కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కూడా ప్రారంభించారు. దేవీ భాగవతంతో పాటు మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో శాకంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు... అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు... వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను.. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను.. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి, మళ్లీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి, ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని’ అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది.కనకదుర్గ గుడిలో కూరగాయలతో అలంకరణఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకంబరీ దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది. ఈ శాకాల సముదాయం అంతులేని కోర్కెలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు పాపాలను పోగొడుతుంది. ఉమాగౌరీ సతీ చండీ కాళికా పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది. ఈ శాకంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు. నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు. శుక్లపక్ష చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పౌర్ణమినాడు షోడశకళా ప్రపూర్ణుడవుతాడు.చదవండి: తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం చేస్తున్నా: ఉపాసన కొణిదెల ఆషాఢమాసంలో ఆలయానికి వెళ్లే అవకాశం లేని భక్తులు కనీసం అమ్మవారి ముందు రకరకాల పండ్లు, కూరగాయలను ఉంచి, వీలయితే వాటితో అమ్మవారిని అలంకరించి, ముందుగా కొన్ని మనం స్వీకరించి ఆ తర్వాత వాటిని పేదలకు పంచిపెడితే చాలా మంచిది. అందుకు కూడా వీలు లేనివారు కనీసం శాకంబరీ ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారిని తలచుకుని పేదలకు పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు దానం చేయడం ఫలదాయకం.వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో గత నెల జూన్ 26న సహస్ర కలశాభిషేకంతో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15రోజుల పాటు అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించారు. నేడు గురువారం పౌర్ణమి సందర్భంగా మహాశాకంబరీ అమ్మవారిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!– అడ్లూరి సునందాశివప్రసాద్ సాక్షి, హన్మకొండ కల్చరల్ -
వ్యాసాయ విష్ణు రూపాయ...
మానవ జీవిత చరితార్థానికి, భగవదర్శనానికి బాటలు వేసేవారు గురువులు. అందుకే గురువుని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తాం. గురుపూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, వ్యాసపూర్ణిమ.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఈ రోజు ఎంతోపవిత్రమైనది. ఈ రోజు అష్టాదశ పురాణాలను మనకు అందించిన వ్యాసభగవానుని జన్మదినం కారణంగా గురుస్థానంలో ఆ వ్యాసభగవానుని స్మరించుకునే పర్వదినం. గురువులకు గురువుగా ఖ్యాతి గడించిన మహనీయుడు వ్యాసమహర్షి. అందువలన లోకంలో అందరూ శ్రీ వ్యాసమహర్షిని పూజించి, గౌరవించాలి. ఆషాఢ పూర్ణిమను గురు పూజతో ఉత్సవం చేయటం మన భారతీయ సంస్కృతిలో భాగమైంది. మానవ చరిత్రలోనే అపూర్వమైన ఆధ్యాత్మిక పర్వదినంగా నిలచింది వ్యాస జన్మతిథి. ముందుగా ఈ తిథికి సంబంధించిన ఒక చక్కని కథను తెలుసుకుందాం. ఒక శిష్యుడు తన గురువుగారిని వెదుకుతూ చివరికి ఆయనను కలుసుకుంటాడు. కొంత కాలం తరువాత శిష్యుడు సెలవు తీసుకుంటూ తిరిగి ఎప్పుడు దర్శనమిస్తారు అని గురువుగారిని అడుగుతాడు. అప్పుడు గురువుగారు ‘‘శిష్యా! నీవు నన్ను దర్శించాలని కుతూహలంగా ఉన్నావు గనుక విను. ఎవరైతే పురాణగాథలను, వేద గాథలను వ్యాఖ్యానం చేస్తూ వాటి రహస్యాలను ఉపదేశిస్తుంటారో వారే నా నిజ స్వరూపం అని తెలుసుకుని, వారిని సాక్షాత్తు వ్యాస మూర్తిగా భావించి పూజింపవలసినది. నేను ఎల్లప్పుడూ ఇటువంటి పౌరాణికులందరిలోనూ ఉంటాను’’ అని అంటారు. అందువల్ల పౌరాణికులు, కథకులు, బోధకులు అందరూ గురువులే. పురాణాలలో నిగూఢంగా ఉన్న విషయాలను తెలుసుకోవాలంటే వ్యాస మహర్షి అనుగ్రహం అవసరం. అందుచేత మనం వ్యాస పూర్ణిమ నాడు పౌరాణికులను, మన గురువులను పూజించి తగిన విధంగా సత్కరించాలి. హిందూమతంలో భగవంతుని తెలుసుకోవటానికి ముఖ్యమైన ఆలంబనగా గురువును భావిస్తారు. తమ జీవితాలకు సరైన మార్గ నిర్దేశనం చేయటానికి కావలసిన సాధన సంపత్తి గురువు ద్వారా లభిస్తుందని అందరి విశ్వాసం. గురువులుగా ప్రసిద్ధిగాంచిన ఆదిశంకరులు, దత్తాత్రేయుడు, శ్రీషిరిడీ సాయినాథుడు మొదలైనవారిని ఈరోజు కొలుస్తారు. ఈ గురుపూర్ణిమ ఉత్సవాన్ని శ్రీ ఆదిశంకరులే ప్రారంభించారని కూడా చెబుతారు. అఙ్ఞానమనే చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారు గురువు. మనం జన్మించిన తరువాత మన కన్నతల్లిదండ్రులు ప్రథమ గురువులు కాగా, మిగిలిన జీవితం మొత్తం మార్గనిర్దేశనం చేసేవారు గురువు. సమస్త ప్రకృతిలో నిండి నిబిడీకృతుడై జానాన్ని, ప్రేమను పంచటానికి గురువులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ మహత్తర ఙ్ఞానాన్ని అందుకోవటానికి శిష్యులకు చిత్తశుద్ధి అవసరం. మనిషిలో గుప్తంగా దాగివున్న ఙ్ఞానాన్ని, విశేష శక్తియుక్తులను వెలికితీసి మార్గనిర్దేశనం కలిగించేవారు గురువు. మనమందరం గురువుకు తగిన గౌరవమర్యాదలు కలిగిస్తూ, వారి అడుగుజాడలలో పయనిద్దాం. విశ్వమానవ శాంతికి బంగారు బాటలు వేద్దాం.– డా. దేవులపల్లి పద్మజ -
భగవంతుణ్ణి దర్శించాలంటే..
గురువులు, ఆచార్యుల అనుగ్రహం లేకుంటే ఏదీ అర్థం కాదు, ఏదీ సాధించ లేము. అందుకే గురువును సాక్షాత్తూ త్రిమూర్తులయిన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో పోల్చారు పెద్దలు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు, మహాత్ములైన గురువులున్నారు. సర్వగురువులకూ గురుస్థానీయుడు వేదవ్యాసుడు. అందరు గురువుల్లోనూ అంశల భేదంతో వేదవ్యాస మహర్షి ఉంటాడు. ఈ విధమైన ఏకత్వ గురుభావన ఈ దేశ సంప్రదాయం. గురువు అనుగ్రహం ఉంటేనే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అంటే భగవంతుణ్ణి దర్శించాలంటే ముందుగా గురువు అనుగ్రహాన్ని పొందాలి. ఇనప ముక్కను బంగారంగా మార్చే పరశువేది గురువు. అలాగని గురువును పరశువేదితోనే పూర్తిగా పోల్చడానికి వీలు కాదు. అంతకు మించినవాడు. అన్నింటికీ అతీతుడు.మనిషి అయినవాడు బాధ్యతల నుంచి పారిపోకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఘర్షణకు తావులేకుండా కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా ఎలా నిర్వహిస్తాడో వ్యాసభగవానుడు, శంకర భగవత్పాదుల వంటి గురువులు వైరాగ్యం అంటే బాధ్యతలను వదిలిపెట్టడం కాదని, వ్యామోహపడకుండా బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహించడమనే సందేశాన్ని ఈ సమాజానికి అందించారు. ఇక అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించి, సంపూర్ణంగా గురు కృపను పొందినవారే.గురువును ఎప్పుడూ వినయ విధేయతలతో ప్రసన్నం చేసుకోవాలే కానీ, అహంకారంతో తూలనాడి వారి ఆగ్రహానికి గురికాకూడదు. దేవేంద్రుడంతటివాడు గురువైన బృహస్పతి తన కొలువులోకి రావడాన్ని చూసి కూడా లేవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆయన ఆగ్రహానికి గురై సింహాసనంతో సహా సర్వసంపదలనూ పోగొట్టుకున్నాడు. చివరకు తప్పు తెలుసుకుని ఆయనను ఆశ్రయించి ఆయన అనుగ్రహంతోనే తిరిగి పూర్వ వైభవాన్ని పొందాడు. అందుకే గురువు గురువే.– డి.వి.ఆర్.జులై 10, గురువారం గురు పూర్ణిమ -
నిజమందిరానికి చేరిన జగన్నాథుడు : అద్వితీయంగా అంతిమ ఘట్టం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని శ్రీ జగన్నాథుని రథ యాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మంగళవారం జరిగింది. దీంతో శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర ముగిసింది. సంధ్యా ధూపం తర్వాత రథంపై ఉన్న మూల విరాటులతో ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో గొట్టి పొహండి నిర్వహించి సురక్షితంగా శ్రీ మందిరం రత్న వేదికకు చేర్చడంతో నీలాద్రి విజే విజయవంతమై రథ యాత్రకు తెర పడింది. రథ యాత్ర క్రమంలో ఉత్సవ సేవాదులు నిర్వహించారు. రథాలపై మూల విరాటుల పూజలు ముగియడంతో రథాల పైనుంచి విగ్రహాల్ని దించేందుకు చారుమళ్లు ఏర్పాటు చేశారు. వీటి గుండా వరుస క్రమంలో మూల విరాటులతో ఉత్సవ మూర్తుల్ని శ్రీ మందిరం రత్న వేదిక పైకి తరలించారు. బుధ వారం నుంచి శ్రీ మందిరం రత్న వేదికపై భక్తులకు యథాతథంగా ఏడాది పొడవునా చతుర్థా మూర్తుల దర్శనం ప్రాప్తిస్తుంది. మహాలక్ష్మికి స్వామి బుజ్జగింపురథయాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మహోత్సవంలో శ్రీ మహాలక్ష్మి దేవిని జగన్నాథ స్వామి బుజ్జగించే వైనం భక్త జనాన్ని ముచ్చట గొలిపించే అపురూప ఘట్టం. నీలాద్రి విజే సమయంలో సుదర్శనుడు, దేవీ సుభద్ర, బలభద్ర స్వామిని శ్రీ మందిరంలోనికి ఆహ్వానించిన శ్రీ మహా లక్ష్మి ప్రియ నాథుడు శ్రీ జగన్నాథుని ప్రవేశం అడ్డుకుని శ్రీ మందిరం సింహ ద్వారం తలుపులు మూసి వేస్తుంది. తనను విస్మరించి తోబుట్టువులతో యాత్రకు ఏగి విరహ వేదన తాళలేక స్వయంగా దర్శనం కోసం వెళ్లిన నిరుత్సాహ పరచడంతో శ్రీ మహా లక్ష్మి అలక ప్రదర్శించడం ఈ ముచ్చట గొలిపే ఘట్టం జానపద ఇతివృత్తం. దేవేరి అలక తీర్చేందుకు యాత్ర కానుకగా శ్రీ జగన్నాథుడు రసగుల్లాను దేవేరికి సమరి్పంచడంతో మురిసిపోయి సాదరంగా శ్రీ మందిరం లోనికి ఆహ్వానిస్తుంది. ఇది రథ యాత్రలో చిట్ట చివరి ముచ్చట గొలిపే ఘట్టం.అద్వితీయంగా అంతిమ ఘట్టంపర్లాకిమిడి: పదిరోజులపాటు గుండిచా రథయాత్రకు బయలుదేరిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు మంగళవారం ఉదయం మూడు రథాలతో నిజ మందిరానికి క్షేమంగా విచ్చేశారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్రపండా, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దారు, ఐఐసీ ప్రశాంత్ భూపతి, ఇతర భక్తుల సహాయంతో రాజవీధి నుంచి శ్రీమందిరం వరకూ రథాన్ని లాగారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా శ్రీలక్ష్మీదేవితో కలిసి శ్రీలక్ష్మీనారాయణ అవతారంతో రథాయాత్ర ముగుస్తుంది. ఆఖరిరోజున పెద్ద యాత్ర జరుగనున్నది. -
సీత్లా భవాని పండుగ : కాపాడే దేవత
లంబాడీ గిరిజనులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే పండుగే... ‘సీత్లా భవాని’ వేడుక. గిరి జన సంప్రదా యంలో లంబాడీలు చేసుకునే తొలి పండుగ కూడా ఇదే. ప్రకృతిని ఆరాధిస్తూ... పంటలను, పశు సంపదను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడు కుంటారు. ఈ పండుగ, బోనాల వేడుకలు ఒకేకాలంలో రావడం గమనార్హం. వర్షాకాలంలో రక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అటు హిందువులూ, ఇటు లంబాడీ గిరిజ నులూ తమ తమ గ్రామదేవతలకు బోనాలు ఎత్తి పూజించి మొక్కులు చెల్లించుకుంటూ ఆ వ్యాధుల బారిన పడకుండా కాపాడమని వేడుకుంటారు. సీత్లా భవాని కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశు సంపద పెరగాలనీ; దూడలకు పాలు సరిపోనుఉండాలనీ, తమ పశువులకు గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా వాటిని కాపాడా లనీ, అటవీ సంపద తరగకూడదనీ సీత్ల తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ పండుగను వివిధతండాల్లో ఆ తండా ప్రజలు, పెద్ద మనుషులంతా కలిసి ఆషాఢ మాసంలో ఏదో ఒక మంగళవారంఎంచుకొని జరుపుతారు. ప్రతి సంవత్సరం కేవలం మంగళవారం మాత్రమే జరపడం ఆనవాయితీ.ఇదీ చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్తండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవాని సాధారణంగా ప్రతిష్ఠితమై ఉంటుంది. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అక్కడికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. దేవతను పూజించే ప్రక్రియలో తండా పెద్ద మనిషి పూజారిగా వ్యవహరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం.– నరేష్ జాటోత్, నల్గొండ -
మజ్జిగౌరీ హుండీల ఆదాయం రూ.1.04 కోట్లు, విదేశీ కరెన్సీ
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరీ అమ్మవారి హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మందిరం ట్రస్టు అధ్యక్షులు రాయిసింగి బిడిక, సభ్యులు, మందిరం సూపరింటెండెంట్ సమక్షంలో మందిరం ప్రాంగణంలోని తొమ్మిది హుండీలను తెరిచారు. సాయంత్రం వరకు కొనసాగిన లెక్కింపులో భాగంగా అమ్మవారికి భక్తులు వేసిన కానుకల రూపంలో 1,04,36,963 రూపాయల నగదు, వెండి రెండు కిలోల 505 గ్రాములు, బంగారం 38 గ్రాములు లభించినట్లు మందిరం ట్రస్టు అధ్యక్షులు రాయిసింగ్ తెలిపారు. సాయంత్రం ఆరు గంటల వరకు లెక్కింపు కొనసాగిందని.. స్థానిక సేవా సంస్థలకు చెందిన మహిళలు, విద్యార్థులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 27వ తేదీన హుండీ లెక్కింపులో భాగంగా అమ్మవారికి భక్తులు వేసిన కానుకల రూపంలో 94,49,054 రూపాయల నగదు, 93 గ్రామలు బంగారం, 2.170 కిలోల వెండి లభించినట్లు వివరించారు. అమ్మవారి హుండీ ఆదాయంలో భాగంగా ఇప్పటికి రెండుసార్లు కోటి రూపాయలు నగదుగా ఆదాయం సమకూరడం విశేషమని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, ఇటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆది, మంగళ, బు«ధవారాల్లో అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారని అన్నారు. సోమవారం నాడు హుండీలొ లభించిన నగదును స్థానిక ఉత్కళ గ్రామీణ బ్యాంకులో అమ్మవారి పేరిట డిపాజిట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇదిలాఉండగా ఈసారి హుండీలొ విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించడం గమనార్హం. -
జగన్నాథుడికి పానకం సేవ, శ్రీమందిరం శిఖరాన మహాదీప హారతి
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న శ్రీ మందిరంలో ఏకాదశి తిథి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తిథి పురస్కరించుకుని క్రమం తప్పకుండా శ్రీ మందిరం శిఖరాన నీల చక్రం ప్రాంగణంలో మహా దీప హారతి నిర్వహిస్తారు. రథ యాత్రలో పవిత్ర ఏకాదశి నాడు అత్యంత ఆకర్షణీయమైన స్వర్ణాలంకార దర్శనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులకు శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో ఆలయ శిఖరంపై మహా దీప దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. స్వర్ణ అలంకార దర్శనం కొనసాగుతుండగా మహాదీప హారతి నిర్వహిస్తారు. దీనితో యాత్రకు తరలి వచ్చిన అశేష భక్తజనం ఆలయ శిఖరంపై మహా దీప హారతి కనులారా ప్రత్యక్షంగా తిలకించే అవకాశం పొందుతారు. వెండి కలశాల్లో హారతి మహా దీప హారతి కోసం 3 వెండి కలశాలు సిద్ధం చేస్తారు. వీటిని నెయ్యితో నింపుతారు. అరటి నారతో దీపం ఒత్తులు వినియోగిస్తారు. అరటి నారకు కొత్త బట్టను చుట్టి బలపరుస్తారు. తెల్ల రంగు వస్త్రం వినియోగిస్తారు. ఇలా సిద్ధం చేసిన మహా దీపాన్ని తొలుత శ్రీ జగన్నాథుని ముందు ద్యోతకం చేసిన తర్వాత, ఆలయం పైకి ఎత్తుతారు. జగన్నాథునికి పానకం నివేదన ఏటా పవిత్ర ఆషాఢ శుక్ల ద్వాదశి సందర్భంగా రథాలపై దేవుళ్లకు పానకం సమరి్పస్తారు. చీకటి పడ్డాక ఈ సేవ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని పాటించారు. ప్రత్యేక మట్టి పాత్రల్లో పానకం నింపుతారు. మూల విరాట్ల పెదవుల ఎత్తు వరకు ఈ పాత్రలు తయారు చేస్తారు. వీటి నిండా సుగంధ ద్రవ్యాలతో రుచికరమైన పానకం పోసి రథాలపై తెరచాటున గోప్యంగా నివేదించడం ఆచారం. ఈ సమగ్ర ప్రక్రియను ఒధొరొ పొణ సేవగా పేర్కొంటారు. రథాలపై ప్రధాన విగ్రహాల ఎదురుగా మట్టి పాత్రల్ని నిలిపి ఒధొరొ పొణ సేవ నిర్వహిస్తారు. స్వామికి పానకం నివేదించడం పూర్తయ్యాక పాత్రలు పగల గొట్టడంతో రథాల పైనుంచి పాణకం పొరలుతుంది. రథాల పైనుంచి పార్శ్వ దేవతల మీదుగా నేలకు ఈ పానకం జారుతుంది. ఇలా జారిన పానకం పార్శ్వ దేవతలు, అశరీర జీవులు సేవించి మోక్షం పొందుతారని విశ్వాసం. పవిత్ర ఆషాఢ శుక్ల ద్వాదశి పురస్కరించుకుని సోమవారం ఈ సేవ జరిగింది. దేవతా మూర్తులకు స్వర్ణాలంకరణ జయపురం: చైతన్యమందిరం నుంచి శ్రీజగన్నాథ్, బలభద్ర, సుభద్రలతో ఉన్న పెద్ద రథం, పతిత పావనుడు ఉన్న చిన్న రథాలు రాత్రి 8.00 గంటలకు రథొపొడియ వద్దకు చేరాయి. దాదాపు రాత్రి పదకొండు వరకు భక్తుల పూజలు అందుకున్న దేవతా మూర్తులను జగన్నాథ ఆలయానికి తీసుకు వచ్చారు. లక్ష్మీదేవి అనుమతితో గర్భగుడిలోకి వెళ్లాక స్వర్ణాలంకరణ చేశారు. కార్యక్రమంలో దేవాదాయ విభాగ అదనపు తహసీల్దార్ చిత్త రంజన్ పటా్నయిక్, జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కశ్యప్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్,జ యపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్లతో పాటు దేవదాయ సిబ్బంది పాల్గొన్నారు. -
Guru Purnima 2025 ఉపాసన తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం
ప్రముఖ వ్యాపారవేత్త, హీరో రామ్చరణ్ భార్య ఉపాసన ఆధ్యాత్మికత, ఆనందం కోసం వ్రతాన్ని ఆచరిస్తునట్టు ప్రకటించారు. ఈ గురు పూర్ణిమకు తాను తొమ్మిది వారాల సాయిబాబా వ్రతాన్ని ప్రారంభిస్తున్నానని అభిమానులతో పంచుకున్నారు. తద్వారా దేవునితో అనుబంధంతో పాటు అభిమానులతో కూడా కనెక్ట్ అవ్వడానికి ఇదొక మార్గమంటూ ఆమె పోస్ట్ చేశారు. చిన్నప్పటినుంచీ దైవంమీద ఎంతో భక్తి. మా తల్లిదండ్రులు పిలిస్తే పలికే దైవం శిర్డీ సాయినాధుడిని భక్తితో కొలవడం చూశాను. తన భర్త రామ్చరణ్కు అయ్యప్ప ఎలాగో తనకు సాయిబాబా అలా అని తెలిపింది. సాయిబాబా వ్రత కల్పం చదవడం మొదలు పెట్టగానే తనలో పాజిటివ్ వైబ్, తన చుట్టూ ఉన్నవారిలో కూడా సానుకూల దృక్పథం అలడుతుందని చెప్పుకొచ్చారు. ది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్స్టాలో షేర్ చేసారు. ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో తనతో కలిసి రావాలని ఆహ్వానించారు.సాయిబాబా తొమ్మిదివారాల వ్రతం అంటేకోరిక కొర్కెలు నెరవేరేందుకు కులమతాలకు అతీతంగా, స్త్రీ పురుష భేదము లేకుండా సాయి బాబా భక్తులు తొమ్మిది వారాల పాటు ఆచరిస్తారు. పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ప్రతి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయం, సాయంత్రి నిష్టతో సాయినాధుడిని పూజించాలి. 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. వత్రం పూర్తైనా తరువాత కొంతమంది షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించు కుంటారు. బీదలకు అన్నదానం చేస్తారు. 5 లేదా 11 మందికి శ్రీసాయి వ్రత పుస్తకాలను ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీ. (జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది)అత్యంత భక్తితో, నిష్టతో ఆచరిస్తే ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, ఆర్థిక బాధలుండవని నమ్ముతారు. అలాగే వృత్తి వ్యాపారాలలో పురోగతి, విజయం లభిస్తాయని, ఐశ్వర్యం, కుటుంబ శాంతి, విద్య, ఉద్యోగం, వివాహం ఇలా సకల మనోభీష్టాలు నెరవేరుతాయని చెబుతారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
కనుమరుగవుతున్న మఠాలు
వందల ఏళ్ల నాటి అపురూప ఆలయ సంపద ఆలనాపాలనా లేక ధ్వంసమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో వీరశైవ మతానికి చెందిన శ్రీచండీకాంబసహిత సోమేశ్వరాలయం ఉంది. వీరశైవ పంచపీఠాల్లో కొలనుపాక ఒకటి. రేణుక సిద్ధుని జన్మభూమిగా ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాంగణంతోపాటు.. గ్రామంలో పలుచోట్ల 22 కులాలకు సంబంధించిన మఠాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా కనుమరుగవగా, మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని కులాలు.. తమ మఠాలను అభివృద్ధి చేసుకుంటుండగా.. నిరుపేద కులాలకు చెందిన మఠాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మఠాల అభివృద్ధి పన్నెండేళ్లుగా పూర్తి కాలేదు. దీంతో శిథిల చరిత్రకు నిలయంగా సోమేశ్వర దేవాలయ ప్రాంగణం నిలుస్తోంది.మఠం అంటే.. మత ధర్మ నిష్టాపరుడై సద్భక్తి, వైరాగ్యంతో వీరుడనిపించుకొనడమే వీరశబ్దం అర్థం. 12వ శతాబ్దపు ఉత్తారార్ధంలో కన్నడ దేశపు కాలాచురి రాజైన బిజ్జలుని మంత్రి బసవనితో వీరశైవం వ్యాప్తి పొందింది. అంతకు ముందే ఆరాధ్య శైవం వ్యాప్తిలో ఉండేది. వీరశైవం ఆంధ్రదేశంలో ప్రవేశించి రాజుల ఆదరణ పొందింది. కాకతీయ రాజుల కాలంలో వీరశైవం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లిందని చరిత్ర పరిశోధకులు చెబుతారు. కాకతీయ రాజుల కాలంలో అనేక శైవ దేవాలయాలు నిర్మితమయ్యాయి. శైవ పీఠాలు, మఠాలు.. రాజుల సహాయ సహకారాలతో ఏర్పడి ప్రజాదరణ పొందాయి. అట్టడుగు వర్గాలలో వీరశైవం వ్యాప్తి పొందింది. వీరశైవం విజృంభించిన తర్వాత.. కొలనుపాకలో ప్రతి కులానికి ఒక మఠం ఏర్పడింది. వీరశైవులు తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అష్టాదశ వర్గాల వారికి శివాలయాలు నిర్మించి ప్రజల మన్ననలు పొందారు.మఠాల ప్రాధాన్యం మఠం అంటే.. మతపరమైన విద్యాబోధన కేంద్రం. విద్యాలయం. సన్యాసులు నివసించే ప్రాంతాలని, దేవాలయాలని అనేక అర్థాలున్నాయి. మఠాలు దేవాలయాలకు అనుబంధంగా ఉంటాయి. దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక జీవనం గడిపే సద్వర్తనులైన ఆచార్యుల నిలయాలు. వీటికి అనుబంధంగా ఉండే మఠాల్లో.. ఆచార్యులు విద్యార్థులకు విద్యాబోధన చేస్తుండేవారు. మఠాచార్యులు అన్ని శాస్త్రాలలో ప్రవీణులుగా ఉండేవారు. పదో శతాబ్దంలో కాలాముఖ శైవాచార్యులు మఠాలను ఏర్పాటు చేసి.. ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ శిష్యులకు విద్యాబోధన చేస్తుండేవారు. ఎందరో రాజులు కాలాముఖ శైవ గురువులను రాజగురువులుగా ఆదరించి పోషించారు. సాంఘికంగా వీరికి చాలా విలువ ఉండేది. వీరు చెప్పిందే వేదం. రాజు నుంచి బంటు వరకు మఠాచార్యుల ఆజ్ఞలను పాటిస్తూ గౌరవిస్తుండేవారు. సంఘాన్ని శాసించే కేంద్ర బిందువుగా మఠాచార్యులుండేవారు. ఈ మఠాలన్నీ 10వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు గొప్ప స్థితిలో ఉన్నాయి. మఠాలన్నీ విద్యా కేంద్రాలుగానే కాకుండా సాంస్కృతిక కేంద్రాలుగా ఉండి.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేయడానికి దోహదపడుతుండేవని పరిశోధకుల అభిప్రాయం. కుల ప్రాతిపదికన.. కొలనుపాకలో కుల ప్రాతిపదికతో ఏర్పడిన 22 మఠాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇన్ని కుల మఠాలు ఒక్క దగ్గర లేవు. ఇది కొలనుపాకకు ఉన్న ప్రత్యేకత. శ్రీశైలంలో 13 మఠాలున్నట్లు సాహిత్య, శాసనాల ద్వారా తెలుస్తోంది. కాలముఖ మఠాలు 2, వీరశైవ మఠాలు 3, గోళకీ మఠాలు 4, ఆరాధ్య మఠాలు 1, ఇతర మఠాలు 3 శ్రీశైలంలో ఉన్నాయి. కానీ కొలనుపాకలో ప్రతి కులానికి ఒక మఠం ఉంది. వీరశైవం బాగా వ్యాప్తి చెందాలంటే ప్రతి కులంలో ఉన్న వ్యక్తులకు శైవదీక్ష ఇప్పించాలి. కులప్రాతిపదికగా మఠాలు ఏర్పాటు చేస్తే.. అది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో కులానికి ఒక మఠం ఏర్పాటు చేశారు.ప్రతి మఠంలో నంది, శివలింగం కొలనుపాకలోని ప్రతి మఠం దాదాపు అలంకారాలు లేకుండా నిర్మితమయ్యాయి. ప్రతి ఆలయంలో శివలింగం, నంది తప్ప వేరే అలంకారాలు లేవు. ప్రతి కులం వారు పండుగ రోజుల్లో.. శివరాత్రి రోజు తమ తమ మఠాలను అలంకరించుకుని పూజలు జరుపుకొంటారు. కొలనుపాకలో 18 కులాల వారికి గురువులున్నారు. మఠాల దగ్గర పండుగ రోజుల్లో ఆయా కుల పురాణాలు పఠిస్తుండేవారు. ఆ జానపద గాయకులను ప్రతి కులం వారు ఆదరించి పోషించారు. ప్రతి కుల పురాణంలో కేంద్ర బిందువు వీర శైవమే. అన్ని కులాలకు తమ కులమే మూలమని ప్రతి కుల పురాణాల ఇతివృత్తాలలో కనిపిస్తుంది. సోమేశ్వరస్వామి ఆలయ సింహద్వారం వద్ద ప్రమాణ మండపం ఉంది. తగాదాలలో ప్రమాణాలు చేయాల్సి వస్తే ఈ మండపం దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తుంటారు. ఈ మండపంలో అబద్ధాల ప్రమాణాలు చేస్తే అరిష్టం కలుగుతుందని ప్రజల విశ్వాసం. కొలనుపాకలోని మఠాలివే.. వైశ్యమఠం, గాండ్ల మఠం, కాపుల మఠం, గొల్ల మఠం, కుర్మ మఠం, గౌండ్ల మఠం, మేర మఠం, పద్మశాలి మఠం, మేదరి మఠం, జాండ్ర మఠం, చాకలి మఠం, మంగలి మఠం, కుమ్మరి మఠం, వడ్డెర మఠం, మహమ్మాయి మఠం, మాల మఠం, మాదిగ మఠం, చిప్ప మఠం, సంగరి మఠం, పెరెక మఠం, శంబరి మఠం, తెనుగు మఠం ఉన్నాయి.చదవండి: ఆలయంలో అబ్బురపరుస్తున్న బామ్మ.. 15 నిమిషాల పాటు 250 కిలోల గంట మోగిస్తూ.. -
మహా కుంభాభిషేకం : భక్తజన సంద్రం.. తిరుచెందూరు
సాక్షి, చెన్నై: తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం (Arulmigu Subramania Swamy Temple) ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన పనులకు హిందూ మత దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మహోత్సవం జరగనున్నడంతో దేశ విదేశాల నుంచి మురుగన్ భక్తులు తిరుచెందూరు వైపుగా కదిలారు. ఏర్పాట్లు పూర్తి.. కుంభాభిషేకం మహోత్సవం నిమ్తితం జూలై 1 నుంచి పూజలు మొదలయ్యాయి. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన యాగ శాలలో విశిష్ట పూజలు జరుగుతూ వచ్చాయి. యాగాలు,హోమాలు విజయవంతంగా పూర్తి చేశారు. మహాకుంభాభిషేకం నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించ లేదు. ఆలయం ఆవరణలో మూల విరాట్, వళ్లి, దేవానై అమ్మవార్లకుయాగాది పూజలు జరిగాయి. రాత్రి నుంచి వేకువ జాము వరకు 12 కాల యాగ పూజలు జరిగాయి. Thoothukudi, Tamil Nadu: The Maha Kumbabhishekam at Tiruchendur Subramania Swamy Temple marked the culmination of ₹300 crore renovations. Held with elaborate rituals, holy water anointing, drone blessings, and live broadcasts, it drew thousands of devotees, secured by 6,000… pic.twitter.com/1OHDv5u40O— IANS (@ians_india) July 7, 2025 సోమవారం ఉదయం 6.15 గంటల నుంచి 6.50 గంటల మధ్య రాజగోపురంలోని తొమ్మిది కుంభ కలశాలలో పవిత్ర జలాలలను పోయనున్నారు. అదే సమయంలో విమాన ప్రకారం, మూల విరాట్, షణ్ముగర్, వళ్లి, దేవానై, పెరుమాల్, నటరాజర్ వంటి అన్ని పరివార మూర్తుల గోపురంలోని కలసాలలోపవిత్ర జలాలను పోసి శా్రస్తోక్తంగా కుంభాభిషేక మహోత్సవం పూర్తి చేయడానికి సర్వందం చేశారు. ఈ మహోత్సవాన్ని భక్తులు తలికించేందుకు వీలుగా సముద్ర తీరం, పరిసరాలలో భారీ ఏర్పాట్లు చేశారు. స్వామి ఆలయం పరిసరాలలో విద్యుత్ వెలుగులు, సప్తవర్ణ పుష్పాలతో దేదీప్యమానంగా వెలుగొందుతు న్నాయి. ఈ మహోత్సవం కోసం రూ.15 లక్షలు విలువగల డ్రై ఫుడ్స్తో మాలలను స్వామి, అమ్మవార్ల కోసం సిద్ధం చేశారు. తిరుచెందూరులో మహా కుంభాభిషేకం వేడుకకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం జరిగే ఈ వేడుకను కనులార వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతున్నారు. దీంతో నిఘా వలయంలోకి ఆధ్యాత్మిక పట్టణాన్ని తీసుకొచ్చారు. నిఘా కట్టుదిట్టం నిఘా నీడలో.. భక్తులకు మెరుగైన సేవలే కాదు, భద్రత పరంగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఇలం భగవత్, ఎస్పీ ఆల్బర్ట్ జాన్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మానవ రహిత విమానాలను రంగంలోకి దించారు. సముద్ర తీరంలో జనం చొచ్చుకు వెళ్లకుండబా పెద్ద ఎత్తున రక్షణ కవచంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతుండటంతో ప్రత్యేక బస్టాండ్లను ఏర్పాటు చేశారు. తిరుచెందూరు వైపుగా పలు పట్టణాలు,నగరాల నుంచి బస్సులు రోడ్డెక్కించారు. పది లక్షల మంది భక్తులు తరలి రావచ్చు అన్న సంకేతాలతో అందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి.ఆహారం, తాగునీరు వంటి సౌకార్యలు కల్పించారు. అక్కడక్కడ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
ఆషాఢ శుక్ల ఏకాదశి బంగారు స్వామి
భువనేశ్వర్: శ్రీ క్షేత్రంలో ఆషాఢ శుక్ల ఏకాదశి పుణ్య తిథి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పూరీ శ్రీ మందిరం భక్త జనంతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచి ప్రత్యేక పూజాదులతో స్వామి పలుమార్లు ఆకర్షణీయమైన అలంకరణతో శోభిల్లాడు. హరి శయన ఏకాదశి పురస్కరించుకుని రథాలపై దేవుళ్లకు 2 సార్లు బొడొ సొంగారొ అలంకరణ చేయడం విశేషం. ఈ సందర్భంగా రథాలపై మూల విరాటుల్ని స్వర్ణ అలంకారంలో దర్శించుకుని భక్తులు తరించారు. శ్రీ క్షేత్ర వాసుడు శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర దాదాపు అంతిమ దశకు చేరుకుంది. స్వామి యాత్ర ఆద్యంతాలు భక్త జనాన్ని మురిపిస్తాడు. పవిత్ర ఆషాఢ శుక్ల ఏకాదశి పుణ్య తిథి పురస్కరించుకుని భక్తులకు బంగారు శోభతో దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో 3 రథాలపై దేవుళ్లని బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ మందిరం సింహ ద్వారం ప్రాంగణంలో పతిత పావనునికి బంగారు అలంకరణ చేశారు. రత్న వేదికపై నిత్యం అసంపూర్ణ దారు విగ్రహాలుగా దర్శనం ఇచ్చే మూల విరాటులు రథ యాత్రలో రథాలపై బంగారు తొడుగులు, ఆభరణాలతో నిలువెత్తు రూపంతో దర్శనం ఇస్తారు. కుల, మత, వర్గ, వర్ణ వివక్షకు అతీతంగా ఆరు బయట పరిపూర్ణ జగన్నాథుని దర్శించుకునే అపురూప అవకాశం స్వామి రథ యాత్రలో మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ ఏడాది రాత్రి 11 గంటల వరకు రథాలపై మూల విరాటుల పరిపూర్ణ రూపాన్ని బంగారు అలంకరణలో దర్శించుకునే అవకాశం కలి్పంచారు. ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల నుంచి ఈ దర్శనం ప్రారంభం కావడం విశేషం. శ్రీమందిరంలో హరి శయన ఏకాదశి ఆషాడ శుక్ల ఏకాదశి సందర్భంగా రథాలపై దేవుళ్ళకు హరి శయన ఏకాదశి ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. నేటి నుంచి కార్తీక మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు వరకు భగవంతుడు 4 నెలలు శయనిస్తాడు. వల్లభ్ల బొడొ సింగారో అలంకరణ పవిత్ర హరి శయన ఏకాదశి పురస్కరించుకుని రథాలపై మూల విరాటులకు వరుసగా 2 సార్లు బొడొ సింగారొ అలంకరణ చేయడం ఆచారం. నిత్యం సాగే బొడొ సింగారొ అలంకరణ తర్వాత భోగ సేవ తర్వాత అధిక భోగ సేవ నిర్వహించి మరో మారు బొడొ సింగారొ అలంకరణ చేస్తారు.దీన్ని వల్లభ బొడొ సింగారొ అలంకరణగా పేర్కొంటారు. ఏటా 5 సార్లు బంగారు శోభతో దర్శనం ఏటా రథ యాత్ర పురస్కరించుకుని మారు యాత్ర (బహుడా)లో భాగంగా ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి నాడు రథాలపై బహిరంగంగా అన్ని వర్గాల భక్తులకు స్వామి బంగారు దర్శనం ఒక రోజు లభిస్తుంది. ఏడాదిలో మరో 4 సార్లు శ్రీ మందిరం లోపల మూల విరాటులు బంగారు అలంకరణతో శోభిల్లుతారు. ఏటా కార్తీక పూరి్ణమ, పౌష్య పూర్ణిమ, డోల పూర్ణిమ, అశ్విని శుక్ల దశమి పుణ్య తిథుల్లో స్వామి బంగారు శోభతో భక్తులకు మిరిమిట్లు గొలిపిస్తాడు. పుష్యాభిõÙకం సందర్భంగా పుష్య మాసం పౌర్ణమి నాడు, దసరా ఉత్సవాల్లో విజయ దశమి నాడు స్వర్ణ శోభితుడుగా దర్శనం ఇస్తాడు. శ్రీ మందిరం రత్న వేదికపై ఆయా తిథుల్లో మధ్యాహ్న ధూపం తర్వాత మూల విరాటుల్ని బంగారు ఆభరణాలతో అలంకరించడం ఆచారంగా కొనసాగుతోంది. దసరా సమయంలో విజయ రామచంద్రునిగా, కార్తీక పౌర్ణమి సమయంలో ద్వారక నాథునిగా, డోల పౌర్ణమి సమయంలో గోపేశ్వరుడిగా, పుష్యాభిషేకం సమయంలో శ్రీరామునిగా పూజిస్తారు. -
తెలిసి చెడు కర్మలు చేయకుండా ఉండటమే కర్తవ్యం
జీవులు అనుభవించే మంచి చెడు ఫలితాలకు వాళ్ళు గతంలో చేసిన కర్మలే కారణమన్నది భగవద్గీత సారాంశం. అయినా, మనుషులు మాయలో పడి, తమకు జరిగే అనుభవాలకు ఇతరులెవరో కారణం అని భావిస్తారు. భీష్మునితో ధర్మరాజు... ‘పట్టుదలతో చుట్ట పక్కాలను చంపుకున్నాను. దుర్యోధనుడు రాజ్యం పంచుకోవటానికి ఇష్ట పడలేదు. నేనైనా కోపం మాని, అతడిని రాజ్యం అనుభవించనీయలేదు. మా ఇద్దరి వల్ల ఇంత జన నష్టం జరిగింది’ అని బాధ పడ్డాడు. అప్పుడు భీష్ముడు ‘చంపటానికి మనిషి కర్త కాడు’ అని ఉదాహరణ పూర్వకంగా ఒక కథ చెపుతాడు.గౌతమి అనే వనిత కుమారుడు పాము కాటుకు చనిపోతాడు. ఆమె దుఃఖిస్తుండగా ఒక వేటగాడు ఆ పామును చంపబోయాడు. ఆమె వారించి, ‘పామును చంపితే నా బిడ్డ బతుకుతాడా? శత్రువునైనా చేత చిక్కితే చంపటం న్యాయం కా’దంది.పాము తాను మృత్యు దేవత పంపగా వచ్చాను కానీ, స్వయం కర్తను కాదంది. అంతలో మృత్యువు వచ్చి, తాను యముడు పంపగా వచ్చానని, తాను ఆ బాలుడి మరణానికి కారణం కాదంది. యమధర్మరాజు వచ్చి... పాము, మృత్యువు, తాను ఈ బాలుడి మరణానికి కారణం కాము; అతడి కర్మలే కారణం. జీవుడు కర్మఫలాన్ని తప్పించుకోలేడని చెబుతాడు. వేటగానికి జ్ఞానోదయమై వెళ్ళిపోతాడు. కాబట్టి, ‘యుద్ధంలో బంధు మిత్రులు మరణించటానికి వారి కర్మలే కారణం కానీ, నీవు గానీ, దుర్యోధనుడు గానీ కారణం కాదు’ అని భీష్మ పితామహుడు చెప్పాడు. తెలిసి చెడు కర్మలు చేయకుండా ఉండటమే మనుషుల కనీస కర్తవ్యం. – డా.చెంగల్వ రామలక్ష్మి -
ఆశ్రిత లక్షణం
తమకు జీవితాన్ని ప్రసాదించి, తాము చేసే పనికి ఎంతోకొంత సొమ్మును పారితోషికంగా ఇచ్చి రక్షించే యజమానిని ఆశ్రితులు సైతం రక్షించడం పరమ విధి. అసలు ఆశ్రితులు అంటే ఎవరు? బాధల్లో ఉన్నప్పుడు గానీ, మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ‘‘నేనున్నాను’’ అని చెంత నిలిచి ఆదరించేవాడు మిత్రుడు, ఆ రకంగా విపత్తులో మేలు పొందినవాడు ఆశ్రితుడు. పెద్ద అర్థంలో తీసుకుంటే, జగతిలోని జీవులందరూ ఆశ్రితులే..!! అందరినీ రక్షించేది ఆ పరంధాముడే..!!ఈ విశాల విశ్వంలో ఏదో ఒక అవసరాన్ని తీర్చుకునేందుకు మనం మరొకరి మీద ఆధారపడక తప్పదు. ఆ విధంగా ఆపత్కాలంలో మనను ఆదుకున్నవాళ్ళను వదిలి వేయకుండా, వీలున్నంతగా సహాయం చేయగలగడమే ఉత్తమ ఆశ్రిత లక్షణం. ఇక, ప్రస్తుత ప్రపంచంలో విభిన్న రకాలవ్యాపకాల్లో, ఉద్యోగాల్లో తమ విధులు నిర్వహించే ఉద్యోగులందరూ ఆశ్రితుల కోవలోకే వస్తారు. తమ సంస్థ ఒక్కొక్కసారి అభివృద్ధిలో ఉన్నతస్థానంలో నిలువవచ్చు, మరొకసారి ఊహించని ఇబ్బందుల్లో కూరుకుపోవచ్చు. అయితే, సంస్థ ఉత్థానంలో ఏ విధంగా ఉద్యోగులు ఆనందించి, తమ వ్యక్తిగత ప్రగతికి బాటలు వేసుకున్నారో, ఆ సంస్థ కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు, సంస్థను వీడకుండా, తమ వంతు సహకారాన్ని అందించాలి. తాము సంస్థకు వెన్నెముకగా ఉన్నామని, ఏ ఇబ్బందినైనా దాటడంలో తాము అహరహం కృషి చేస్తామని యాజమాన్యానికి భరోసా యివ్వాలి. ఎక్కడ తమకు ఎక్కువ జీతం, సదుపాయాలు ఉంటాయో, అక్కడికి తక్షణమే మారిపోయే ప్రస్తుత తరానికి చెందిన యువతీ యువకులు ఈ మాటలు వింటే నవ్విపోతారు. వారి దృష్టిలో ఈ విధంగా నడుచుకోవడం దాదాపుగా అసాధ్యం. కానీ, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో తోడుగా నిలిచి, ఉత్తేజాన్ని అందించే ఈ ఉత్తమ లక్షణం సంస్థకు భవితను చూపడంలో అత్యంత అవసరం. ఏ సంస్థ మనుగడకైనా నమ్మకస్తులైన ఉద్యోగులు చాలా అవసరం. వారి అంకితభావం, సంస్థ తమ సొంతం అన్న బలీయమైన అనుబంధం వల్లనే ఆ సంస్థ లేక వ్యవస్థ నాలుగు కాలాలపాటు పచ్చగా నిలబడుతుంది. శతాబ్దాలుగా వ్యాపార వ్యవహారాలను అచ్చెరువొందేలా నిర్వహిస్తూ, చెదరని నమ్మకానికి నమూనాగా నిలిచిన అగ్రగామి సంస్థల రహస్యం ఆ సంస్థను ఆశ్రయించి ఉండడమే గాక, సర్వకాల సర్వావస్థల్లో తమ సహకారాన్ని అందించే ఉద్యోగులే..!!ఇక, రామాయణ కథలోనూ అత్యంత విశ్వసనీయులైన ఆశ్రితులు మనకు తారసపడతారు. ముందుగా చెప్పుకోవలసింది సుగ్రీవుడు. అన్నయైన వాలిపట్ల భయంతో కొండల్లో తలదాచుకున్న సుగ్రీవుడు, శ్రీరాముని శరణు వేడి, రఘువీరుని పరాక్రమంతో వాలి నిహతుడు కాగా, తాను కిష్కింధకు రాజయ్యాడు. సీతాన్వేషణ ఘట్టంలో నలుచెరగులకు వానరులను పంపి, శ్రీరామునికి ప్రీతిని కలిగించాడు. అదే విధంగా చెప్పుకోవలసిన మరొక అద్భుత పాత్ర విభీషణునిది. అన్న ధర్మవిహితమైన తన మాటలను పెడచెవిని పెట్టడంతో రాముని శరణు వేడాడు. రావణుని తమ్ముడైన విభీషణునికి శరణాగతిని ప్రసాదించి, ఆశ్రయమిచ్చాడు. రాముని నీడలో ఆశ్రితుడైన విభీషణుడు రామునికి యుద్ధ సమయంలో లంకలోని రాక్షసుల బలాబలాలను, బలహీనతలను తెలియజేసి, దుష్ట సంహారానికి బాటలు వేశాడు. ఆఖరికి అయోధ్య త్వరగా చేరాలన్న రాముని ఆతృతను గమనించి, శ్రీరాముని తన పుష్పక విమానంలో సాగనంపి, తన శుభ లక్షణాలను లోకాలన్నిటికీ ఘనంగా తెలియజేశాడు. అధునాతన యుగంలోనూ ఆశ్రితులు ఈ విధంగా తమకు ఆశ్రయమిచ్చిన వారికి సహకరిస్తే, సంస్థలు ఇతోధికంగా వృద్ధి చెందుతాయని, దేశ పురోగతికి బంగరు బాటలు ఏర్పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు.పచ్చటి కోరికభారతీయ పురాతన కాలానికి చెందిన ఒక కథను ఈ సందర్భంలో పరికించడం సమంజసం. కాశీదేశంలో ఒక వేటగాడు విషపూరితమైన బాణాన్ని లేడిపై ప్రయోగించగా అది పచ్చటి ఫలవృక్షానికి తాకింది. దాని ప్రభావం వల్ల ఆ చెట్టు కొద్ది కాలానికి పూర్తిగా ఎండిపోయింది. ఆ చెట్టు తొర్రలో కొంతకాలంగా ఒక చిలుక నివసిస్తూ ఉండేది. ఎండిపోయినా, ఆ చెట్టును వీడిపోకుండా చిలుక ఆ చెట్టు తొర్రలోనే నివాసం ఉండసాగింది. ఒకానొక సందర్భంలో దేవరాజైన ఇంద్రుడు ఆ చిలుకతో సంభాషిస్తూ, ‘‘ఓ చిలుకా.. ఈ చెట్టు పూర్తిగా ఎండిపోయింది. ఈ చెట్టు తొర్రలో ఉండడంవల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు, పచ్చగా ఉన్న మరొక చెట్టును ఆశ్రయించి, నీవు ఆనందంగా గడుపు’’ అని సలహా యిచ్చాడు. ఇంద్రుని మాటలకు ప్రత్యుత్తరమిస్తూ, ఆ చిలుక ‘‘చెట్టు పండినపుడు ఉండడం, ఎండినపుడు విడిచిపోవటం కృతఘ్నత కదా.. ఈ చెట్టు ఎండిపోయినా, నేను ఇక్కడే ఉంటాను..’’ అంది. దేవేంద్రుడు ఆ చిలుక మాటలకు ఎంతగానో సంతోషించాడు. చిలుకను ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ చిలుక ‘‘స్వామీ..! ఈ చెట్టుకు పూర్వ వైభవాన్ని అనుగ్రహించు’’ అని కోరింది. ఆ చిలుక కోరిన విధంగానే దేవేంద్రుడు ఆ చెట్టు మళ్ళీ పచ్చగా ఉండేలా కటాక్షించాడు. ఆ విధంగా ఆశ్రితురాలైన ఆ చిలుక వల్ల ఆ చెట్టుకు మేలు జరిగి, పునర్వైభవాన్ని పొందింది. ఆశ్రితుల లక్షణం ఇంత చక్కగా ఉంటే, యజమాని లేక సంస్థకు ఎంతో మేలు జరుగుతుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది.– తత్వ ప్రవచన సుధాకరవెంకట్ గరికపాటి -
Muharram 2025 : ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి
ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం సంవత్సరంలోని మొదటి నెల ‘ముహర్రం’ (Muharram 2025). ప్రతి సంవత్సరం ఈ నెల వస్తూనే ముహమ్మద్ ప్రవక్త(స) వారి జీవితంలోని ఓ ముఖ్యమైన ఘట్టం మనసులో మెదులుతుంది. అదే ‘హిజ్రత్’. (మక్కా నుండి మదీనాకు వలస). హిజ్రత్ తరువాతనే ధర్మానికి జవసత్వాలు చేకూరాయి, ధర్మం ఎల్లెడలా విస్తరించింది. ధర్మ పరిరక్షణ, మానవ సేవ, మానవులకు సత్యసందేశాన్ని అందించడం లాంటి మహత్తర ఆశయం కోసం కష్ట నష్టాలను సహించాల్సి వచ్చినా, చివరికి స్వదేశాన్ని విడిచి వలస వెళ్ళవలసి వచ్చినా వెనకాడకూడదనే విషయాన్ని ముహర్రం ప్రతి సంవత్సరం విశ్వాసులకు గుర్తుచేస్తూ ఉంటుంది.ముహర్రం ఘనతకు సంబంధించి ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్ నెల. రమజాన్ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే’. (సహీహ్ ముస్లిం: 2755) ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా ) అప్పుడు ప్రవక్త వారు, ’ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు,’ ఇది చాలా గొప్పరోజు. ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ) ను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. ఫిరౌన్ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు ఉపవాసం పాటిస్తాము’. అని చె΄్పారు. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, మీరు రెండు రోజులు రోజా పాటించమని తన సహచరులకు బోధించారు. అంటే ముహర్రం మాసం 9,10 కాని, లేక 10,11 కాని రెండురోజులు రోజా పాటించాలి. కాకతాళీయంగా ’కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ్ర΄ాముఖ్యత మరింతగా పెరిగి΄ోయింది. అంతమాత్రాన ముహర్రం నెలంతా విషాద దినాలుగా పరిగణించడం సరికాదు. ఎందుకంటే అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను హజ్రత్ ఇమామె హుసైన్ ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘ముహర్రం ‘నెలలో ఆయన త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు. కనుక మొహర్రం నెల ప్రాముఖ్యం, హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం మామూలు విషయం కాదు. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి ప్రేరణ పొందాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు దాన్ని కాపాడుకోడానికి నడుం బిగించాలి. ఇదే ఇమామె హుసైన్ అమరత్వం మనకిస్తున్న సందేశం.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (జులై 6 ముహర్రం పండుగ సందర్బంగా) -
పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి భక్తులకు నిరుత్సాహం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి రోజున గుండిచా ఆలయంలో నవమి సంధ్యా దర్శనం ప్రాప్తిస్తుంది. అడపా మండపంపై ఒక రోజు దర్శనం శ్రీ మందిరం నీలాద్రి మండపంపై జగతినాథుడు శ్రీ జగన్నాథ స్వామి ( Lord Jagannath ) పది సంవత్సరాల దర్శనం పుణ్యఫలం ప్రసాదిస్తుందని పౌరాణిక కథనాలు సూచిస్తున్నాయి. స్వామి జన్మస్థలం అడపా మండపంపై పగటి పూట దర్శనం కంటే సంధ్య వేళ దర్శనం పుణ్యం పది రెట్లు అధికంగా లభిస్తుంది. అందుచేత నవమి సంధ్యా దర్శనం ప్రాధాన్యత సంతరించుకుంది. అడపా మండపంపై శ్రీ నవమి సంధ్యా దర్శనం సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేశారు. స్వామి మారు రథ యాత్ర బహుడా యాత్రకు ముందస్తు సన్నాహాలు, బహుళ సేవల ఆచరణ ఒత్తిళ్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ మందిరం పాలక వర్గం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ గుండిచా ఆలయ సింహ ద్వారం గుండా ప్రవేశం నివారించారు. దీంతో భక్తులకు నవమి నాడు సంధ్య వేళలో దర్శనం ప్రాప్తి లేకుండా పోయింది. సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇదీ చదవండి: జగన్నాథుడి కల్కి అవతారం : మారు రథయాత్రశ్రీ గుండిచా ఆలయ శుద్ధి తర్వాత తర్వాత అడప మండపంపై అనేక ముఖ్యమైన సేవలను నిర్వహించాల్సి ఉంటుంది. బహుడా యాత్ర రోజున రథంపై మూల విరాటులను దర్శించుకునే అవకాశం భక్తులు పొందుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు భక్తజన వర్గం జగతి నాథుని పట్ల భక్తి పూర్వక సేవ, అంకితభావంతో సహకరించాలని అభ్యర్థించారు.. అనుబంధ వర్గాల సేవకుల సహకారం, సమన్వయంతో బహుడా సంబంధిత సేవల్ని సకాలంలో పూర్తి చేయాలని అభ్యర్థించారు. -
Jagannath Rath Yatra: కల్కి అవతారం : నేడు మారు రథయాత్ర
భువనేశ్వర్: శ్రీ గుండిచా ఆలయంలో భక్తులు శ్రీ జగన్నాథుని సంధ్యా దర్శనం కోసం తండోపతండాలుగా తరలి వచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు పరిమితం చేశారు. అడప మండపంపై ఇది చివరి దర్శనం. ఈ సందర్భంగా శారదా బాలి జనసముద్రంగా మారింది. మహా ప్రభువు దర్శనం కోసం బొడొశొంఖొ వరకు బారులు తీరారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా శుక్రవారం శ్రీ గుండిచా ఆలయం ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా శారదా బాలి ప్రాంగణంలో భక్తుల రద్దీ నియంత్రణ, మారు రథ యాత్ర భద్రతా సన్నాహాల్ని ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఇదీ చదవండి: Antidepressants మహిళల మెదడు సేఫే, బట్ పురుషులకే!బహుడా యాత్ర పురస్కరించుకుని పోలీసులు వాహనాల రవాణా వ్యవస్థ కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ దయాళ్ గంగ్వార్ ప్రత్యక్షంగా ఈ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ప్రజలకు బల్క్ సందేశాలు పంపిస్తారు. జన సందోహం ఉన్న చోట డ్రోన్, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అన్ని ఫోన్లకు సందేశాలు పంపిస్తారు. అదనంగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీల ద్వారా కూడా వాహన చోదకులకు సమాచారం ప్రసారం చేస్తారు. నవమి సంధ్యా దర్శనం, మారు రథ యాత్ర బహుడా భద్రత, రక్షణల సమగ్ర వ్యవస్థని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా పర్యవేక్షించారు. జన్మ వేదికపై శ్రీ జగన్నాథుని చివరి దర్శనం క్రమబదీ్ధకరణ కార్యాచరణని పరిశీలించారు. శాంతిభద్రతల ఏర్పాట్లపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఇతర సీనియర్ అధికారులతో పోలీస్ డైరెక్టర్ జనరల్ సమావేశమయ్యారు. కల్కి అవతారంలో జగన్నాథుడు పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో జగన్నాథ స్వామి శుక్రవారం కల్కి అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు ఈ రోజుతో దశవతారాలు పూర్తయ్యాయి. శనివారం బహుడా యాత్ర సందర్భంగా శ్రీజగన్నాథరథాలు తిరుగుముఖం పెట్టారు. గుండిచా మందిరం వెలుపల ఆనందబజార్లో శుక్రవారం భక్తులకు ఉచితంగా ఓబ్బడా (అన్న ప్రసాదం) రథాయాత్ర కమిటీ అందజేసింది -
అల వైకుంఠ పురంలో..లక్ష్మీ కటాక్షం
లక్ష్మీ కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు పొందవచ్చునన్న నమ్మకానికి సాక్షాత్తూ వేదసూక్తాల సాక్ష్యం ఉంది. బ్రహ్మ, ఇంద్ర, గంగాధరుల వైభవం కూడా శ్రీదేవి మెల్లని కడగంటి చూపు వల్ల లభించిందే (శ్రీమత్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మ ఇంద్ర గంగాధరమ్...) అని ఆస్తికులు విశ్వసిస్తారు. ఆమె కటాక్షానికి అంతటి శక్తి కలగటం వెనక గల కీలకాన్ని ఆదిశంకరులు కవితాత్మకంగా అభివర్ణించారు. అల వైకుంఠ పురంలో నెలవైన ఆ శ్రీహరి రూపం మీద, మహాలక్ష్మి చల్లని నల్లని కంటి చూపు సోకిందట. మగువల వీక్షణలు తుమ్మెదల బారులా నల్లగా ఉన్నట్లు భావించటం కవిత్వ సంప్రదాయం, ‘కవి సమయం’. ఆమె క్రీగంటి చూపు తనను తాకగానే హరి పులకించి పోయాడు. ఆయన నిగనిగల శరీరం మీద ఆ పులకలు స్ఫుటంగా కనిపించాయి. నల్లని, దృఢమైన తమాల వృక్షం మీద విరివిగా అంకురించిన చిన్ని చిన్ని మొగ్గల గుత్తుల లాగా కనిపించాయి. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్స్వామి పులకలను తాకిన సరసిజాక్షి వీక్షణలు, అరవిరిసిన ఆ మొగ్గలను ఆశ్రయించిన తుమ్మెదల లాగా కనిపించాయి. తుమ్మెద పువ్వులో మకరందాన్ని స్వీకరించి తనలో నింపుకొంటుంది. అలాగే, సకల సంపదలకూ, విభూతులకూ ఆకరమైన జగన్నాథుడి మీద సోకిన వీక్షణం, ఆ సంపదలనూ, విభూతులనూ కానుకగా అంగీకరించి, స్వీకరించింది. ‘అంగీ’కృతం– అంటే తన శరీరంలో భాగం చేసుకున్నది. అంగం హరేః పులక భూషణం ఆశ్రయంతీ,భృంగ అంగనా ఇవ ముకుల ఆభరణం తమాలం,అంగీకృత అఖిల విభూతిః అపాంగ లీలామాంగల్యదా అస్తు మమ, మంగళ దేవతాయాః!ముకుళములు (మొగ్గలు) ఆభరణంగా గల తమాల వృక్షాన్ని ఆడు తుమ్మెద ఆశ్రయించినట్టు, నారాయణుడి పులకలెత్తిన శరీరాన్ని ఆశ్రయిస్తూ, ఆయన అఖండ విభూతులను స్వీకరించి తనలో ‘అంగీ’భూతం చేసుకున్న మా మంగళ దేవత మహాలక్ష్మి కడగంటి చూపుల లీలా విలాసం, నాకు మంగళ ప్రదాయకము అగుగాక! ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?మంగళ దేవతాయాః అపాంగలీలా, మమ మాంగల్యదా అస్తు! ఎంత చింతన చేస్తే అంత మనోహరంగా అనిపించే ఇంతటి అద్భుతమైన ఉత్ప్రేక్ష చేసినప్పుడు, ఆది శంకరాచార్యులకు పట్టుమని పదేళ్ళు కూడా లేవంటారు. పేదరాలి ఇంట సిరులు కురిపించేందుకు, ఆచార్యుల వారు ఆలపించిన ‘కనకధారా స్తోత్రం’లో మకుటాయమానమైన మొదట శ్లోకం ఇది.– మారుతి శాస్త్రి -
ఇక్కడ త్రిమూర్తులకూ ఆలయాలు, ఎక్కడో తెలుసా?
కాకతీయ కాలం నాటి ఆధ్యాత్మిక శోభకు, శిల్పకళా వైభవానికి తార్కాణం 800 ఏళ్లనాటి ‘పిల్లల మర్రి’ (Pillalamarri )దేవాలయాలు. తెలుగు వారిని ఒకే తాటిమీదికి తీసుకువచ్చి సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయ రాజుల ఏలుబడిలో ఒక ఆధ్యాత్మిక, కళాక్షేత్రంగా వెలసిన కమనీయ సీమ సూర్యాపేట దగ్గర గల పిల్లలమర్రి.ముక్కంటికి మూడు ఆలయాలు..పిల్లలమర్రిలో మూడు ప్రసిద్ధ శైవక్షేత్రాలున్నాయి. 13వ శతాబ్దంలో వీటిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దం ఆరంభంలో కట్టిన గుడులు దాదాపు 150 సంవత్సరాలు వైభవోపేతంగా వెలిగాయి. ఆ తర్వాత పరదేశీ పాలనలో దోపిడీలకు గుర యినా, మధ్య మధ్య పునః ప్రతిష్టలు పొందాయి. బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ క్రీ.శ. 1208లో ఎరుకేశ్వర ఆలయాన్ని కట్టించారు. కాకతీయ శిల్పకళావైభవాన్ని చాటిచెప్పేలా చాలా ఎత్తుగా ఆలయం నిర్మించారు. దీని ముఖమండప స్తంభాలు నల్లరాయితో చెక్కారు. స్తంభాలు చాలా నునుపుగా అద్దం మాదిరిగా కనిస్తాయి. ముఖమండపంలోని స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినపడతాయి. ఆలయంలో కొలువైన స్వామివారిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని ప్రతీతి. బేతిరెడ్డి సోదరుడైన నామిరెడ్డి పిల్లలమర్రిలో రెండు శివాలయాలు కట్టించారు. తన పేరిట నామేశ్వర ఆలయం నిర్మించగా తన తల్లిదండ్రుల పేరిట త్రికూటాలయం నిర్మించారు నామేశ్వరాలయంలో నల్లరాతిపై చెక్కబడిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ద్వారాలు, ముఖమండపాలపై లతలు, పుష్పాలు, వివిధ భంగిమలలో నృత్యాలు కళాకారులు, గాయకులు, వాద్యకారులు, దేవతావిగ్రహాలు తదితర శిల్పాలు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవు. కొన్నిచోట్ల స్తంభాలపై సూక్ష్మాతిసూక్ష్మంగా అందమైన నగిషీలతో శిల్పాలను మలిచారు. కఠినమైన నల్లరాయి శిల్పుల చేతిలో మైనం లాæకరిగి΄ోయిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్తస్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తాయి. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతిదూలాలపై భారత రామాయణ గా«థలు, సముద్ర మథనం వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. నామేశ్వర ఆలయం పక్కనే త్రికూటేశ్వర ఆలయం ఉంది. ఒకేమండపంలో శివునికి మూడు వేర్వేరు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మూడు ఆలయాలకు కలిపి ఒకే నంది ఉండటం ఇక్కడ విశేషం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోకళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సేవలో వీరంగాలు వేయటం, అగ్నిగుండాలు కాల్చటం మొదలైన వేడుకలు నిర్వహిస్తున్నారు. చెన్నకేశ్వర... బ్రహ్మదేవాలయాలు... పిల్లలమర్రి శైవం, వైష్ణవం కలిసి పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. శివకేశవులకు భేదాలు లేవని చాటిచెప్పేలా మూడు ప్రసిద్ధ శివాలయాలు ఉన్న పిల్లలమర్రి గ్రామంలోనే ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయం ఉంది. 13వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. గర్భాలయంలో మకర తోరణం లో చెన్నకేశవస్వామివారి రూపలావణ్యం నయన మనోహరం. గర్భాలయం వెలుపల పన్నిద్దరు ఆళ్వారులు కొలువై ఉన్నారు. క్రీ.శ.1260లో చెన్నకేశ్వర ఆలయం ధ్వంసం అయ్యింది. 1899 ప్రాంతంలో గ్రామానికి చెందిన వుమ్మెత్తల చక్రయ్య గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని తిరిగి నిర్మించినట్లు చెబుతారు. చెన్నకేశ్వర ఆలయంతో΄ాటు నామేశ్వర ఆలయం ఎడమవైపు బ్రహ్మదేవుని ఆలయం ఉంది. బ్రహ్మ హంసవాహనారూఢుడై సరస్వతీమాతతో కలిసి దర్శనమిస్తారు. మహాదేవుని సేవ కోసం బ్రహ్మాసరస్వతులు హంసవాహనంపై ఇక్కడికి వస్తుంటారని స్థలపురాణం చెబుతోంది.ఎలా చేరుకోవాలంటే?ప్రసిద్ధ పురాతన ఆలయాలకు నెలవైన పిల్లల మర్రికి చేరుకోవడం చాలా సులువు. సూర్యాపేట జిల్లాలోని పిల్లల మర్రి గ్రామం హైదరాబాద్ నుంచి 134 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ నుంచి విరివిగా సూర్యాపేటకు బస్సులు ఉంటాయి. సూర్యాపేటలో దిగితే ఆక్కడినుంచి వాహనాల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామానికి చేరుకోవచ్చు.ఆ గ్రామం మూడు సుప్రసిద్ధ శైవ ఆలయాలకు నెలవు... ఒక్క ముక్కంటికే కాదు బ్రహ్మ, విష్ణువులకు సైతం ఆలయాలు ఉండటం మరో ప్రత్యేకత. త్రిమూర్తులలోని లయకారకుడైన శివుడు ఎరుకేశ్వరుడు, నామేశ్వరునిగా అవతరించగా స్థితికారకుడైన విష్ణువు చెన్నకేశ్వరునిగా వెలిశారు. ధరిత్రిపై పూజలు ఉండని శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడికి సైతం ఇక్కడ ఆలయం ఉండటం విశేషం. సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి హంస వాహనారూఢుడై దర్శనమిస్తాడిక్కడ. -
మోసం చేస్తే మోసమే!
పూర్వం బాగ్దాద్ నగరంలో బహెలూల్ అనే పేరుగల ఒక దైవభక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆయన బాగ్దాద్ వీధుల్లో నడుస్తూ వెళుతున్నారు. అలా వెళుతూ వెళుతూ ఒకచోట విశ్రాంతి కోసం ఆగాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా బాధగా, ఆందోళనగా ఉన్నాడు. అది గమనించిన బహెలూల్ , ‘ఏమిటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, విషయం ఏమిటి?’ అని ఆరా తీశారు.‘అయ్యా.. ఏం చెప్పమంటారు? కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర కొంత పైకం అమానతుగా ఉంచాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే, అసలు నువ్వెవరివి..? నాకు పైకం ఎప్పుడిచ్చావు?’ అని బుకాయిస్తున్నాడు. ఎంత ప్రాధేయపడినా కనికరించకుండా, ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశాడు. కాని నా అమానత్తును మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి..? రిక్తహస్తాలతో మిగిలాను. ఏ మార్గమూ కానరావడం లేదు.’ అంటూ బోరుమన్నాడు. బహెలూల్ అతణ్ణి ఊరడిస్తూ.., ‘నువ్వేమీ బాధపడకు..దైవ చిత్తమైతే ఆ పైకం నేను ఇప్పిస్తాను.’ అన్నారు ప్రశాంతంగా..‘అవునా..! నా పైకం ఇప్పిస్తారా..?’ అంటూ ఆశగా చూశాడా వ్యక్తి.. ‘‘కాని ఎలా సాధ్యం? ఆవ్యక్తి పరమ దుర్మార్గుడు... నాకైతే ఏమాత్రం నమ్మకం కుదరడంలేదు.’ అన్నాడు నిరాశతో.. ‘‘అలా అనకు.. నిరాశ తిరస్కారం ( కుఫ్ర్ )తో సమానం.. దైవచిత్తమైతే నీ పైకం నీకు తప్పకుండా లభిస్తుంది.’ అన్నారు బహెలూల్. ’నిజమే.. ఆశ లేకపోతే మనిషి బ్రతకలేడు. కాని.. ఎలా సాధ్యమో కూడా అర్ధం కావడం లేదు.’’నువ్వు ఆందోళన చెందకు. నేను చెప్పినట్లు చెయ్ . నీ పైకం ఇప్పించే పూచీనాది.’ అన్నారు బహెలూల్ ధీమాగా..’సరే ఏం చేయమంటారో చెప్పండి. ’అన్నాడతను. ఆశగా.. ’రేపు ఉదయం ఫలానా సమయానికి నువ్వు ఆ వ్యక్తి దుకాణం దగ్గరికిరా.. నేనూ ఆ సమయానికి అక్కడికి వస్తాను. నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్న క్రమంలో నువ్వొచ్చి నీ అమానత్తును అడుగు.’ అన్నారు బహెలూల్ . సరేనంటూ ఆ వ్యక్తి బహెలూల్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.తెల్లవారి ఉదయం బహెలూల్ ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత, తాను కొన్నాళ్ళపాటు పని మీద ఎటో వెళుతున్నానని, కాస్త ఈ సంచి మీదగ్గర ఉంచితే తిరిగొచ్చిన తరువాత తీసుకుంటానన్నారు. ఇందులో వంద బంగారునాణాలు, కొంతనగదు ఉందని చెప్పారు. ఆ వ్యక్తి లోలోన సంతోషపడుతూ, సరేనని సంచీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మోస΄ోయిన వ్యక్తి వచ్చి తను అమానతుగా ఉంచిన పైకం ఇమ్మని అడిగాడు. ఆ వ్యాపారి ఒక్కక్షణం ఆలోచించి, ఇప్పుడు గనక ఇతనితో పేచీ పెట్టుకుంటే, విలువైన బంగారు నాణాల సంచి చేజారే అవకాశముందని గ్రహించాడు. వెంటనే అతని పైకం అతనికిచ్చేశాడు. అతను సంతోషంగా పైకం తీసుకొని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. బహెలూల్ కూడా తన సంచిని వ్యాపారి దగ్గర అమానత్తుగా ఉంచి తనదారిన తను వెళ్ళిపోయారు. కొంతసేపటి తరువాత, అతడు సంబరపడుతూ, బహెలూల్ దాచిన నాణాల సంచి విప్పి చూసి, నోరెళ్ళబెట్టాడు. అందులో గాజు పెంకులు, గులక రాళ్ళు తప్ప మరేమీ లేవు. తను చేసిన మోసానికి తగిన శాస్తే జరిగిందని భావించాడు. ఇకనుండి ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకొని ధర్మబద్ధమెన జీవనం ప్రారంభించాడు.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్∙ -
Toli Ekadashi 2025: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?
ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని, తొలి ఏకాదశి అనీ పిలుస్తారు. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈ రోజు మొదటిది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు... అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలూ కలిగాయని పురాణోక్తి. చదవండి: హనుమకు ఆకు పూజ ఎందుకు ఇష్టం? సీతమ్మ సత్కారం -
Hanuman హనుమకు ఆకు పూజ ఎందుకు ఇష్టం?
తమిళనాడు రాష్ట్రం, కరూర్కి చెందిన ఒక బ్యాంకు ఉద్యోగి వేంకటేశ్వర స్వామి దర్శనార్థం కారులో తిరుమల బయలుదేరాడు.ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చేసరికి కొంచెం సేద తీర్చుకోవాలనుకున్నాడు. ఓ ఆంజనేయస్వామి గుడి వద్ద కారు ఆపాడు.ఆ పక్కనే ఓ భార్యాభర్తల జంట కొబ్బరికాయల కొట్టు పెట్టుకుని ఉన్నారు. భార్య అంగడిలో కూర్చుని ఉంది. భర్త అంగడి ముందర ఉన్న పూల మొక్కలకు నీళ్ళుపోస్తూ ఉన్నాడు. అతడి దగ్గరికి వెళ్ళాడు బ్యాంకు ఉద్యోగి. ఇక్కడ స్వామికి తమల΄ాకులతో పూజ చేస్తారా?’’ అని ప్రశ్నించాడు. ‘‘అవును’’ అని బదులిచ్చాడు వ్యాపారి.‘‘నేనెప్పుడూ చూడలేదు. దీని విశేషం ఏమిటి?’’ అని ఆసక్తిగా అడిగాడు బ్యాంకు ఉద్యోగి. ‘‘నేను పెద్దగా చదువుకున్న వాణ్ని కాదు. పెద్దలెవరైనా రామాయణం, మహా భారతం లాంటివి చెబుతూ ఉంటే కనీసం వినను కూడా వినలేదు. అయితే మా ఊరిలో ఈ ఆకు పూజ గురించి చెప్పుకునే కథ గురించి మాత్రం మీకు చెప్పగలను’’ అన్నాడు.‘‘నువ్వు విన్నదే చెప్పు. నాకెందుకో కుతూహలంగా ఉంది’’ అన్నాడు బ్యాంకు ఉద్యోగి.భక్తి భావంతో ఆ వ్యా΄ారి తను వేసుకున్న చెప్పులు తీసివేశాడు. తలకి చుట్టిన తువ్వాలును తీసి భుజాన వేసుకున్నాడు. చక్కగా నిలబడి ఆంజనేయ స్వామిని మనసులోనే ప్రార్థించి ఇలా చెప్పసాగాడు.‘‘అది లంకానగరంలో అశోక వనం. ఎక్కడ చూసినా కురూపులైన రాక్షస స్త్రీలు. వారి మధ్యలో సీతమ్మ.ఆమె ముఖం కళ తప్పి ఉంది. పది తలల రాక్షసుడు పెట్టే బాధలు సహించలేకపోతోంది. సరిగ్గా ఆ సమయంలో పిల్ల గాలి వీచింది. చెట్టు మీది పక్షుల రెక్కలు రెపరెపలాడాయి. ‘ఏమిటా’ అని సీతమ్మ చుట్టూ కలయచూసింది. ఎదురుగా ఒక కాంతి పుంజం. కళ్ళు వెడల్పు చేసి చూస్తే ఎదురుగా వినయ విధేయతలతో చేతులు జోడించిన ఆకారం. అది మానవాకారం కాదు, వానరాకారం. సీతమ్మ జడుసుకుంది. ‘ఇది రావణ మాయ ఏమో...’ అని అనుమానపడింది.అయితే ఆ వానరాకారం గౌరవంగా ‘అమ్మా’ అని సంబోధిస్తే ఉలిక్కిపడింది. ‘‘అనుమానం వలదు, నేను రామదూతను’’ అని హనుమంతుడు వినమ్రంగా విషయమంతా వివరించాడు. అంతా ఆసక్తిగా విన్నది సీతమ్మ. హనుమంతుడు చెప్పటం ఆ΄ాక సుగుణాభిరాముని క్షేమ సమాచారాలు అడిగింది. వాలి సుగ్రీవుల గురించి వాకబు చేసింది. శ్రీ రాముడు కపిసైన్యంతో రానున్నాడనే చల్లని కబురు తెలుసుకుని ఆనందపడింది. శ్రీరాముల వారు ఆనవాలుగా పంపిన ఉంగరం చూసి పరవశించిపోయింది.ఆ సంతోషంలో హనుమంతుడిని గౌరవించాలని అనుకుంది సీతమ్మ. చుట్టూ చూసింది. పూల చెట్లు ఏవీ కనిపించలేదు. కనీసం తులసీ బృందావనమైనా అక్కడ లేదు. పరిసరాలను మరింత సూక్ష్మంగా చూసింది. కంచెను అల్లుకుని ఉన్న తమలపాకు తీగలను చూసింది. వాటిని చిన్నగా గిల్లి దండగా మార్చింది. చిరునవ్వుల మోముతో హనుమ మెడలో వేసింది. ఈ హఠాత్పరిణామానికి హనుమ ఆశ్చర్యచకితుడయ్యాడు. హనుమ కంట ఆనందాశ్రువులు. ‘‘అంజన తనయా.. లోకంలో ఎవరు ఏ శుభ వార్త అందించినా బహుమతులివ్వడం మా ఆనవాయితీ. నువ్వు శ్రీ రాములవారి ఉంగరాన్ని నాకు చేరవేశావు. శ్రీరాముడు వస్తున్నాడన్న మంచి విషయం తెలియ జేశావు. ఈ దేశం కాని దేశంలో నీకు ఈ తమల పాకుల దండ తప్ప మరేమీ ఇవ్వలేను’’ అని చెప్పింది.ఊహించని సత్కారానికి హనుమంతుని ఒళ్లంతా పులకరించింది. ‘‘లోకమాత అయిన నీవు నా మెడలో తమలపాకుల మాల వేశావు, నా జన్మ చరితార్థమయ్యింది తల్లీ’’ అని రెండు చేతులూ జోడించి తల వంచాడు. ఇదే రానురాను ఆకు పూజకు నాంది పలికిందని ఇక్కడ చెప్పుకుంటారు. శివునికి బిల్వపత్రం, విష్ణువుకు తులసి లాగా హనుమంతునికి తమలపాకు ప్రియ మయిందని భావిస్తారు. హనుమంతునికి ఆకుపూజ చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చని ఇక్కడి వారి నమ్మకం’’ అని వివరించాడు. అప్పటికే ఆ బ్యాంకు ఉద్యోగి తమలపాకుల మాల, ఇతర పూజా సామగ్రి కొనుక్కుని గుడిలోకి వడివడిగా వెళ్తూ ఉన్నాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
బాధించడమే లోకం తీరు.... అందుకే శ్రీరాముడు కూడా!
లోకం నోరు చాలా పెద్దదే కాక బలమైనది కూడా. ఎంత మాట మాట్లాడటానికి కూడా వెరవదు. రాజును గురించి మాట్లాడు తున్నామా లేక ఆ రాజు దగ్గర పనిచేసే సేవకుడిని గురించి మాట్లాడుతున్నామా అన్న ఆలోచన లోకానికి ఉండదు. వాళ్ళిద్దరి మధ్య తేడా ఉన్నట్లుగా అది గుర్తించదు. లోకానికి అందరూ సమానమే! కనుక ఎవరి గురించైనా ఎంత మాటైనప్పటికీ ఏ భయమూ లేకుండా అనేసి, అక్కడితో తన పని అయిపోయినట్లుగా చేతులు దులుపుకుని నిలబడి, ఆ తరువాత ఏమి జరుగుతుందో చూస్తూ ఉంటుంది. లోకం మాటలు నచ్చనపుడు, ఆ లోకం నోరు నొక్కాలని చేసే ప్రయత్నాలు ఎవరికీ సఫలం కావు. లోకం నోరు ఎక్కడి నుండి ఎక్కడికి వ్యాపించి ఉన్నదో కనిపెట్టగలిగినవాడు ఈ లోకంలో లేడు. అది తెలిసినవాడు కనుకనే శ్రీరాముడంతటి ప్రభువు కూడా లోకం నోరు నొక్కే ప్రయత్నం చేయలేదు. సీతమ్మపై వేసిన నిందకు ఆధారం చూపమని లోకాన్ని నిలదియ్య లేదు. అది వృథా పని అని తెలిసి శ్రీరాముడు అలా చేయలేదు. దానికి బదులుగా, లోకం తన నుండి ఏమి ఆశిస్తున్నదో ఊహించి, ఆ పనిని, అది అన్యాయమని అనిపించినప్పటికీ, భరించలేని బాధకు గురిచేసినప్పటికీ, చేశాడు శ్రీరాముడు అని లక్ష్మణుడి చేత సీతమ్మకు చెప్పించాడు తిక్కన మహాకవి ‘నిర్వచనోత్తర రామాయణం’లోని ఈ కింది పద్యంలో.ఏనిం కేమని చెప్పుదున్ రఘుకులాధీశున్ జగంబెల్ల నీకై నిందింపగ జాల నొచ్చి యిది మిథ్యావాద మైనన్ సమాధానం బేర్పడ జేయకున్న నిజవృత్తం బెంతయున్ దూషితంబై నీచత్వము రాక తక్కదని యూహాపోహ సంవేదియై.‘నేనింక ఏమని చెప్పను తల్లీ! లోకమంతా నిందించడంతో కలత చెందారు శ్రీరాములవారు! అదంతా అబద్ధమనీ, అందులో ఎంతమాత్రమూ నిజం లేదన్నది తెలుస్తున్నప్పటికీ, లోకుల నిందకు సరైన సమాధానం చెప్పేదిగా అనిపించే ప్రతిక్రియను వెంటనే చేయకపోతే, అది చాలా నీచమైన పరిస్థితులకు దారి తీస్తుందని ఊహించి, లోకం తీరుకు కలత చెంది’ ఇలా చేయ మన్నారని సీతమ్మకు సంగతిని వివరించి చెప్పి, అడవిలో విడిచి వెళుతూ దుఃఖించాడు లక్ష్మణుడు.– భట్టు వెంకటరావు -
ఒత్తిడి లేని జీవితం కావాలంటే.. ఇదే సీక్రెట్!
ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏ జీవిౖయెనా ఏమీ తీసుకురాదు. మృతి చెందినప్పుడూ తనతో ఏదీ తీసుకుపోదు. ఈ ఎరుక ఒక్కటే మనిషికి ఒత్తిడిలేని జీవితాన్ని అందిస్తుంది. ఈ చిన్న కథ ద్వారా ఈ వాస్తవం బోధపడుతుంది. ఒకానొక రోజు, ఓ ధనవంతుడు తన ఇంటి బాల్కనీలో పడక్కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాస్సేపటికి అతను ఒక చిన్న చీమ తన ఆకారం కన్నా కొన్ని రెట్లు ఎక్కువ పెద్దదైన ఓ ఆకును తీసుకుపోవటం చూశాడు.ఇంతలో ఓ చోట ఒక పగులు కనిపించింది. అక్కడ ఆ చీమ ఎలా పోతుందా అని ఆసక్తిగా చూశాడు. పగులు దగ్గరకు రావడంతోనే చీమ అక్కడ ఆకును అడ్డంగా ఉంచి దానిపైకి ఎక్కి అవతలకు దాటింది. అనంతరం ఆ ఆకును ముందుకు లాగింది. మొత్తం మీద చీమ ఇలా మరిన్ని అడ్డంకులను దాటుకుంటూ విజయవంతంగా ముందుకు సాగింది. చీమ చివరకు దాని గమ్యస్థానమైన పుట్ట వద్దకు చేరుకుంది. తన పుట్ట ముందర ప్రవేశ ద్వారంగా ఓ రంధ్రం ఉంది. ఆ రంధ్రంలోకి తాను వెళ్ళడానికి వీలుంది తప్ప తానింత దూరమూ తీసుకొచ్చిన ఆకుని పుట్టలోకి తీసుకుపోయే వీలు లేదు. అది తెలీని చీమ ఎంత ప్రయత్నించినా ఆకుతో సహా రంధ్రంలోకి వెళ్లడానికి నానా తిప్పలూ పడింది. చివరకు చేయగలిగిందేమీ లేక ఆకును ప్రవేశద్వారం దగ్గరే విడిచిపెట్టి లోపలికి వెళ్లింది.ఇదీ చదవండి: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?ఒక వ్యక్తి చాలా కష్టపడి తన జీవితంలో ఎన్నెన్నో సమకూర్చుకుంటాడు. ఇబ్బందులు అధిగమించి సౌకర్యాలను పొందుతాడు. బోల్డన్ని ఆస్తిపాస్తులను పోగేసుకుంటాడు. తాను జీవించడానికి అవసరమైనవాటికన్నా ఎక్కువే పోగుచేసి సంతోషపడిపోతూ ఉంటాడు. చివరికి, అతను మరణించేటప్పుడు తనదంటూ ఏదీ తీసుకుపోలేడు. ఈ సంపదలేవీ తనతో రావని తెలిసీ మనిషి చివరి వరకూ అవసరం లేకపోయినా సంపాదించడానికే ప్రయత్నిస్తాడు. కానీ, రిక్త హస్తాలతో చీమ పుట్టలోకి వెళ్లినట్లే... మనిషీ మరణం ఒడిలోకి జారుకుంటాడు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానం! ఈ జ్ఞానమే ఇహలోకంలో మనిషికి ప్రశాంతతను ప్రసాదిస్తుంది. – యామిజాల జగదీశ్ -
Indias 10 richest temples: రూ. 3 లక్షల కోట్లతో టాప్లో ఏది?
ఎంతో పవిత్రమైన, సాంస్కృతిక వారసత్వాన్ని చాటు దేవాలయాలకు నిలయం భారతదేశం. కోట్లాదిమంది భక్తులు సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు తమను సర్వ పాపాలనుంచి, ఆపదలనుంచి కాపాడతాడని విశ్వసిస్తారు. అనేకమంది భక్తులు తమ ఆరాధ్య దైవం పేరుతో లక్షలాది కానుకలను విరాళాలుగా ఇస్తుంటారు. అలా అత్యంత ఘనమైన సంపదతో అలరారే దేశంలోని టాప్ పది దేవాలయాలను పరిశీలిద్దాం.ప్రపంచం నలుమూలల నుండి ప్రతీ ఏడాది లక్షలాది భక్తులు, పర్యాటకులను అద్భుతమైన దేవాలయాలను సందర్శిస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. ఇందులో నగదు విరాళాలు, బంగారం, వెండి లాంటి విలువైన ఆస్తులు ఇందులో ఉంటాయి. వీటిని అనేక సామాజిక కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను వినియోగిస్తాయి సంబంధిత ఆలయట్రస్టులు. ఈ దేవాలయాల సంపద అమూలమ్యైన భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబించడమే కాకుండా, భారతదేశ సాంస్కృతిక, సామాజిక , ఆర్థిక నిర్మాణంలో వాటి పాత్రకు నిదర్శనం కూడా.భారతదేశంలోని 10 అత్యంత ధనిక దేవాలయాలుఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయంసుందరమైన తిరుమల కొండలలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక మతపరమైన ప్రదేశాలలో ఒకటి. దీని విలువ రూ. 3 లక్షల కోట్లు అని అంచనా. ప్రతిరోజూ దాదాపు 50వేల మంది భక్తులు సందర్శిస్తారు . ఈ ఆలయం విరాళాలు, బంగారం , ఇతర కానుకల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు రూ. 1,400 కోట్లు ఆర్జిస్తుంది.కేరళలోని తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా ప్రసిద్ధి చెందిన పద్మనాభస్వామి ఆలయంలో రూ.1.2 లక్షల కోట్ల విలువైన సంపద దీని సొంతం.బంగారు ఆభరణాలు, వజ్రాలు, పురాతన వెండి , పచ్చలు ఉన్నాయి. 2015లో, గొప్ప ఖజానాను గుర్తించడం ఇప్పటికే ఉన్న భారీ నిధికి మరింత తోడైంది.గురువాయూర్ దేవస్వం, కేరళలోని గురువాయూర్విష్ణువు కొలువై ఉండే ఈ పురాతన ఆలయం సంపదకూడా చాలా ఎక్కువ.. దీనికి రూ.1,737.04 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 271.05 ఎకరాల భూమిని కలిగి ఉందని తెలుస్తోంది. ఈ ఆలయంలో బంగారం, వెండి ,విలువైన స్టోన్స్కు సంబంధించి పెద్ద నిధి కూడా ఉంది. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంసముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉన్న పవిత్ర దుర్గాదేవి ఆలయం భారతదేశంలోని అత్యంత సంపన్నమైన వాటిలో ఒకటి. 2000-2020 వరకు, దీనికి 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి. రూ. 2,000 కోట్లకు పైగా నగదు విరాళాలుగా వచ్చాయి.మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయందేశంలో అత్యధికంగా సందర్శించే ఆలయాలలో ఒకటి షిర్డీ సాయినాథునికి ఆలయం. రోజుకు దాదాపు 25,000 మంది భక్తులను ఆకర్షిస్తుంది. ముంబై నుండి దాదాపు 296 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని 1922లో నెలకొల్పారు. 2022లో రూ. 400 కోట్లకు పైగా విరాళాలు అందుకుంది. ఇది రెండు ఆసుపత్రులను కూడా నిర్వహిస్తుంది. ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులకు ఉచిత భోజనాన్ని అందిస్తుంది.అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ( గోల్డెన్ టెంపుల్)బంగారం తాపడం చేసిన అద్భుతమైన దేవాలయం స్వర్ణ దేవాలయం. గొప్ప వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన సిక్కు మతం ఆధ్యాత్మిక హృదయంగా భావిస్తారు. 1581లో నిర్మించబడిన ఇది ప్రతి సంవత్సరం దాదాపు రూ. 500 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.మధుర మీనాక్షి ఆలయంతమిళనాడులో మధురైలో ఉన్న ఈ ఆలయం దాని అద్భుతమైన డిజైన్ , పండుగ వాతావరణానికి ప్రశంసలు అందుకుంది. ఇక్కడకొలువుదీరిన మీనాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇది రోజుకు 20వేల మందికి పైగా భక్తులువస్తారు. ప్రతి సంవత్సరం రూ. 60 మిలియన్లు సంపాదిస్తుందని అంచనా.సిద్ధివినాయక ఆలయం, ముంబైముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రసిద్ధ గణేష్ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకటి, దీని విలువ రూ. 125 కోట్ల అంచనా. దీనికి ప్రతిరోజూ రూ. 30 లక్షల విలువైన కానుకలు అందుతాయి.ఇక్కడ విగ్రహం 4 కిలోల బంగారంతో అలంకరించి ఉంటుంది.గుజరాత్లోని సోమనాథ్ ఆలయంభారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన శివాలయాలలో ఒకటైన సోమనాథ్ 12 జ్యోతిర్లింగాలలో ఇది మొదటిదిగా భావిస్తారు. ఈ ఆలయం గర్భగుడిలో 130 కిలోల బంగారం, దాని శిఖరంపై అదనంగా 150 కిలోలు ఉన్నాయట.ఒడిశాలోని పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయంఒడిశా ఆధ్యాత్మిక వారసత్వానికి మూలస్తంభమైన 11వ శతాబ్దపు ఆలయం జగన్నాథ ఆలయం. చార్ ధామ్ యాత్రలో కీలకమైంది కూడా. . దీని విలువ దాదాపు రూ. 150 కోట్లు . దీంతోపాటు దాదాపు 30వేల ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు ఇటీవల నిర్మితమైన, బాగా ప్రాచుర్యం పొందిన, అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటి అయోధ్యలోని రామమందిరం. -
Secret of Happiness: ఆనంద రహస్యం
తొండమనాడు రాజు ఓ పర్వదినాన శేషాచలం కొండలలోని అద్భుత సహజ శిల్పకళా చమత్కారమైన తుంబురు తీర్థం దర్శించడానికి వెళ్ళాడు. సనక సనంద తీర్థం, నల్లగుండాల మీదుగా దట్టమైన అటవీలోయలో నడుచుకుంటూ తుంబురు తీర్థం చేరాడు. భూ పరిణామ క్రమంలో భాగంగా ఓ కొండ కొబ్బరిచిప్పలా రెండుగా విచ్చుకుని చివర్లో జలజల ΄ారుతున్న తుంబురు తీర్థం జలపాతాన్ని చూస్తూ గంటలకొద్దీ గడిపినాడు. పక్కనే వున్న తరిగొండ వెంగమాంబ గుహ వద్ద వున్న నిశ్చలానంద స్వామిని దర్శించుకున్నాడు.తనకు అష్టైశ్వర్యాలున్నా ఎందులోనూ ఆనందం కనిపించడం లేదని బాధను వ్యక్తం చేశాడు. నిశ్చలానంద స్వామి చిరునవ్వు నవ్వాడు. అప్పుడే కాలినడకన కొందరు భక్తులు గోవిందలు చెప్పుకుంటూ తిరుమల కొండకి నడిచి వెళుతున్నారు. వారు నడిచి నడిచి అలసిపోయి ఉన్నారు. వారికి కడుపు నిండా అన్నం పెట్టి, వారు భోజనం చేసి వెళ్లేటప్పుడు రాజును వారి కళ్ళలోకి చూడమన్నాడు.వెంటనే రాజు తనతో వచ్చిన వంటవాళ్లను, భటులను పురమాయించి చకాచకా వంటలు చేయించాడు. వేడివేడిగా అరటి ఆకులో వడ్డించిన వంటలను కాలి నడక భక్తులు ఆవురావురుమని తినసాగారు. అలా తింటున్న వారిని చూస్తున్న రాజుకు తాను తినకుండానే కడుపు నిండిపోయినట్లనిపించింది.భోజనమయ్యాక భక్తులు ఒక్కొక్కరూ వచ్చి ‘అన్నదాతా సుఖీభవా’ అని చెప్పి వెళ్తుంటే రాజు తృప్తిగా తియ్యటి గుటకలు మింగాడు. రాజు ముఖంలోకి మెరుపు వచ్చింది. తనకి తెలియకుండానే కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. అదే అదునుగా భావించిన నిశ్చలానంద స్వామి ‘‘మనం ఒకరికి ఏదైనా ఇస్తున్నామంటే మనం శక్తి మంతులమవుతున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వడంలో సహజమైన ఆనందం వుంటుంది. తీసుకోవడం కన్నా ఇవ్వడంలో వున్న ఆనందం పదింతల గొప్పది’’ అని ఇవ్వడంలో వున్న గొప్పదనాన్ని రాజుకు విశదీకరించి చెప్పినాడు. ఆనంద రహస్యం ఇవ్వడంలోనూ.... దాన గుణంలోనూ వుందని గుర్తించిన రాజు మరిన్ని దానాలు చేయాలని నిర్ణయించుకుని స్వామి పాదాలకు నమస్కరించి తన రాజ్యానికి బయలుదేరాడు. -
Basaveshwarudu: బసవ బోధ
సమాజంలో నెలకొన్న దురాచారాలను, మూఢ విశ్వాసాలను సమూలంగా నిర్మూలించి జనులను సన్మార్గంలో నడి పించి ఉద్ధరించాలని తపించి ఆ ప్రయత్నంలోనే తనువులను బాసిన మహనీయులెందరో! వారిలో బసవేశ్వరుడు ఒకరు. బసవేశ్వరుడు క్రీ.శ. 1131లో కర్ణాటకలో జన్మించాడు. ఆయనకు ఎనిమిదేళ్ళ వయసులో ఉపనయనం చేయదలచిన తల్లితండ్రులతో, ‘అక్కకు లేని ఉపనయనం నాకెందుకు?’ అని ప్రశ్నించాడు. సదాచారం, సత్ప్రవర్తన లేని జీవితం వ్యర్థమనీ, చిత్త శుద్ధి దైవ సాక్షాత్కారాన్ని కల్గి స్తుందనీ చాటి చెప్పాడు. బస వేశ్వరుని అపారమైన మేధను గమనించి కల్యాణ కటకాన్ని పాలించే ఆనాటి రాజు బిజ్జ లుడు ఆయనను తన రాజ్యంలో మహామంత్రిగా నియ మించాడు. కేవలం శాసించటానికే పరిమితమైన రాజ సభను ప్రజాసమస్యలను పరిష్కరించే వేదికగా ‘అనుభవ మంటపం’గా ఆయన తీర్చిదిద్దాడు. ‘కాయకమే కైలాసం’ అనే సిద్ధాంతాన్ని బోధించి ప్రజలను కార్యకర్తలుగా, కార్య దక్షులుగా మలిచాడు. తాము చేసే పనిని శ్రద్ధతో చేయ టమే అసలైన పూజ అని తెలియజెప్పాడు.మానవులంతా సమానమే, శివుడే సత్యం, ఆయన నిరాకారుడు, ఖరీదైన ఆలయాలు, అలంకారాలు వద్దు, వాస్తు – జ్యోతిషాలు అసత్యాలు, భక్తి కన్నా సత్ప్రవర్తన మిన్న అని పదేపదే గొంతెత్తి చెప్పాడు. వేటగాడైన కన్నప్ప, పారిశుద్ధ్యపు పని చేసిన మేదర చెన్నయ్య, అంటరాని వాడైన సిరియాళుడు ఎలా ముక్తి పొందగలిగారో వివరించాడు. కులాంతర వివాహాలను, సహపంక్తి భోజనాలను బసవేశ్వరుడు ఆనాడే ప్రోత్సహించి సంఘ సంస్కరణకు పూనుకొన్నాడు. ఇలాంటివి నచ్చని సంప్రదాయవాదులు కుట్ర పన్నారు. అయినా వాటిని ఎదుర్కొంటూ ఆయన తన కార్యక్రమాలను కొనసాగిస్తూనే శివైక్యం చెందాడు.– రాచమడుగు శ్రీనివాసులు -
Jagannath Rath Yatra సర్వం జగన్నాథం
పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడిలో రథయాత్ర సందర్భంగా ఘోష యాత్ర మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైంది. ఉదయం జిల్లా కలెక్టర్ బిజయ కుమార్దాస్, ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా, సబ్ కలెక్టర్ అనుప్ పండాలు విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్రకు పహాండిని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్రలను రథాలపైకి తీసుకెళ్లారు. అనంతరం గజపతి వంశీయురాలు కల్యాణీ దేవి గజపతి మేళతాళాలతో రాజ మందిరం నుంచి విచ్చేసి జగన్నాథుని రథంపై శా్రస్తోత్తరంగా పూజలు చేసి బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. దీనిని చెరాపహారా అంటారు. స్థానిక కళాకారులు రథాల ముందు ఒడిస్సీ నృత్యాలతో ప్రజలను అలరించారు. మూడు రథాలను గుండిచా మందిరం వైపు సాయంత్రం 5.00 గంటలకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయడం వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మల్కన్గిరిలో... జిల్లా కేంద్రంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ముందుగా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్తో ఆలయ అర్చకులు పూజ నిర్వహించి రథం లాగడం ప్రారంభించారు. యాత్రలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం కదిలే సమయంలో కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. రాయగడలో... రాయగడలో రథయాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథ మందిరం నుంచి దేవతామూర్తులకు సాంప్రదాయబద్ధంగా పొహండి నిర్వహించి ప్రత్యేకంగా రూపొందించిన రథంలో నిలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రథంలాగే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ ఫరూల్ పటా్వరీ, తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తదితరులు రథంలాగే కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగడుగునా భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సేవా సంస్థలు మజ్జిగ, చల్లని పానీయాలు వితరణ చేశారు. ఇదిలా ఉండగా స్థానిక రైతుల కాలనీలోని జిమ్స్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన రథం అందరినీ ఆకట్టుకుంది. రథయాత్రను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్థానిక మజ్జిగౌరి మందిరం ట్రస్టు తరుపున మందిరం ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జయపురంలో... పట్టణంలో అంగరంగ వైభవంగా రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో శుక్రవారం యాత్ర జరగగా, ఒక్కరోజు తర్వాత అనగా శనివారం నుంచి జయపురంలో రథయాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం జగన్నాథ స్వామి ఆలయం నుంచి దేవతామూర్తులను మంగళ వాయిద్యాలతో తోడ్కొని వచ్చి రథాలపై ఆశీనులు చేశారు. అనంతరం శనివారం మధ్యాహ్నం వరకు దేవతామూర్తులకు భక్తులు పూజలు చేస్తారు. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు రథాన్ని గుండిచా మందిరానికి తీసుకొని వెళ్తారు. కొరాపుట్లో... కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో రథయత్ర తొలి ఘట్టంలో భాగంగా రథాలు గుండిచా మందిరాలకు చేరుకున్నాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి దంపతులు, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చోలు పాల్గొన్నారు. నబరంగ్పూర్లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి రథం లాగారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్లో నేతృత్వంలో కమాండెంట్ ఎన్కేకే ప్రసాద్ నేతృత్వంలో రథయాత్ర జరిగింది. మరోవైపు విశ్వవ్యాప్త రథయాత్రకు విభిన్నంగా జయపూర్, ఆంధ్రా–ఒడిశా వివాదస్పద ప్రాంతం కొఠియాలో ఒక రోజు ఆలస్యంగా శనివారం రథయాత్ర జరగనుంది. శుక్రవారం మాత్రం పొహండి నిర్వహించి విగ్రహాలను రథం మీదకి చేర్చారు. ఆకట్టుకునే పుష్ప మకుటంస్వామివారి అలంకరణలో ఆకట్టుకునే అపురూప పుష్ప మకుటం. దీనిని యాత్ర వ్యవహారిక భాషలో ఠయ్యా అంటారు. సుగంధిత పుష్పాలతో దేవతా త్రయం బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీజగన్నాథుని కోసం వేర్వేరుగా 3 ఠయ్యాలు తయారు చేస్తారు. స్థానిక రాఘవ దాసు మఠం క్రమం తప్పకుండా వీటిని పంపిణీ చేస్తుంది. వీటి తయారీలో వెదురు బద్దలు, జీలుగు, జరీ కాగితాలు వంటి ఆకర్షణీయమైన వస్తువులతో పాటు సుగంధిత పుష్పాలను వినియోగిస్తారు. కదంబ పుష్పాలు ప్రముఖ స్థానం ఆక్రమించి ఆబాలగోపాల భక్త జనాన్ని ఆకట్టుకుంటాయి. -
పవిత్ర తులసి మాలలతో బుల్లి రథం
భువనేశ్వర్/పూరీ: పవిత్రమైన తులసి మాలలతో బుల్లి రథం రూపుదిద్దుకుంది. స్వామివారి భక్తులకు ఈ కళాఖండం అంకితం చేసినట్లు సృజనాత్మక కళాకారుడు బిశ్వజిత్ నాయక్ తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి 8 అంగుళాల ఎత్తు, 7 అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ రథంలో 551 తులసి మాలలు, 175 ఐస్క్రీం పుడకల్ని వినియోగించారు. రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధంరథయాత్రకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. రథాలు లాగడం మొదలుకొని యాత్ర పూర్తయ్యే వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రథాలు లాగడంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూరీ రిజర్వు పోలీసు గ్రౌండులో చేపట్టిన ఈ కార్యక్రమం రథయాత్రను తలపింపజేసింది. బలభద్రుని తాళ ధ్వజం, జగన్నాథుని నందిఘోష్, సుభద్ర దర్ప దళనంకు ప్రతీకగా మూడు జీపుల్ని మూడు రథాల మాదిరిగా వినియోగించారు. క్లియరెన్స్, కార్డన్ ఏర్పాటు దశల్లో అనుబంధ బలగాలకు మెలకువలను నేర్పించారు. అదనపు పోలీసు డైరెక్టరు జనరల్, జిల్లా న్యాయాధికారులు, సీనియర్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. -
Jagannath Rath Yatra నేడే జగన్నాథుని నేత్రోత్సవం
భువనేశ్వర్: అశేష భక్త జనం అభీష్టం నెరవేరే మధుర క్షణం చేరువైంది. నవనవలాడే యవ్వన రూపుతో ఆరాధ్య దైవం జగన్నాథుడు భక్తుల మధ్య ప్రత్యక్షం కానున్నాడు. మర్నాడు శ్రీ గుండిచా యాత్రకు బయల్దేరుతాడు. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి. గత 14 రోజులుగా తెరచాటున స్వామి భక్తులకు కానరాకుండా రహస్య ఉపచారాలతో సరికొత్త ఉత్సాహం పునరుద్ధరించుకోవడంతో శ్రీ క్షేత్రం హడావిడిగా ఉంది. చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకతజ్యేష్ట పూర్ణిమ నాడు అష్టోత్తర కలశ జలాభిõÙకాన్ని స్నాన యాత్రగా జరుపుకున్న స్వామి తడిసి ముద్దయ్యాడు. దీంతో మూల విరాటుల సహజ రూపు చెదిరి పోయింది. జ్వర పీడతో వైద్య నియమాల ప్రకారం అనవసర మండపానికి తరలిపోయాడు. అది మొదలుకొని భక్తులకు నిత్య దర్శనం కొరవడింది. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాజవైద్య వర్గం తైలాది వైద్య ఉపచారాలతో దేవుళ్ల ఆరోగ్యం కోలుకుంది. యథాతథంగా భక్తులకు నిత్య దర్శనం ప్రసాదించేందుకు భగవంతునికి మార్గం సుగమం అయింది. హింగుళ (ఎరుపు), హరితల (పసుపు), కస్తూరి, కేశర (కుంకుమ), కొయిత (మారేడు గుజ్జు) వంటి సహజ మూలికా వర్ణ ద్రవ్యాల మేళవింపుతో మూల విరాటుల ముఖాలకు క్రమ పద్ధతిలో రంగులు హద్ది యవ్వన రూపం తీర్చి దిద్దుతారు. జగన్నాథుని సంస్కృతిలో ఇదో గోప్య సేవ. కాగా, గురువారం భక్తులు ప్రవేశించేందుకు శ్రీ మందిరం తలుపులు తెరుచుకుంటాయి. గుడిలో బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, జగన్నాథుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.రథాలపై నీలచక్రాల అమరిక పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని శ్రీమందిరంలో నీలచక్రాలకు పండాలు శాస్త్రోక్తంగా బుధవారం పూజలు నిర్వహించారు. అనంతరం వాయిద్యాలతో వీటిని శ్రీజగన్నాథ రథం నందిఘోష, బలభద్రస్వామి రథం తాలధ్వజ, సుభద్ర రథం దర్పదళన రథాలపై అమర్చారు. దీంతో నేటి నుంచి జగన్నాథ రథంపై హనుమాన్ జెండాను ఎగురవేస్తారు. అనేక దేవతామూర్తులు రథాయాత్రకు ఆటంకం కలుగకుండా ఈ పది రోజులు కాపాడతారనేది భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో రథాయాత్ర కమిటీ చైర్మన్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దార్ బెహారా, రథాయాత్ర కమిటీ సభ్యులు కుమార్, బసంత పండా, భరత్ భూషన్ మహంతి, రాజేంద్ర కుమార్ బెహరా, అశోక్ మహారాణా పాల్గొన్నారు. -
Puri Rath Yatra 2025 ప్రత్యేక రైళ్లు
పర్లాకిమిడి: పూరీ రథయాత్ర సందర్భంగా ఈస్టు కోస్టు రైల్వే గుణుపురం–పూరీ–గుణుపురానికి ఈనెల 26, జూలై 4, జూలై 5న ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈనెల 26న ట్రైన్ నంబర్ 08443 సాయంత్రం 6.30కు గుణుపురం నుంచి బయల్దేరి మరుసటి రోజు వేకువన 2.15కు పూరీ చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. అలాగే తిరుగు ప్రయాణం ట్రైన్ నంబరు 08428 పూరీ నుంచి 2.45లకు వేకువజామున బయలుదేరి గుణుపురానికి మధ్యాహ్నం 12.30లకు చేరుకుంటుందని ఈస్టుకోస్టు రైల్వే సీనియర్ డివిజనల్ మేనేజరు కె.సందీప్ తెలియజేశారు. రిటర్న్ ట్రైను పూరీ నుంచి జూన్ 27 నుంచి జూలై 6, జూలై 7 వరకూ నడుస్తుంది. అలాగే పలాస, పూరీ, పలాసకు అన్రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్సు కూడా జూన్ 26 నుంచి జూలై 7 వరకూ రాత్రి 9.30కు పలాసలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు పూరీ చేరుకుంటుంది. రిటర్న్ ట్రైన్లు కూడా పూరీ నుంచి పలాసకు జూన్ 27 నుంచి జూలై 8 వరకూ నడుస్తాయి. మధ్యాహ్నం 2.30కు బయల్దేరి అదే రోజు రాత్రి 9.15కు పలాస చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఈ ప్యాసింజరు ట్రైను నిలుపుదల చేస్తారని ఒక ప్రకటనలో తెలియజేశారు. చదవండి: శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ .. ఎలా చేస్తారు? -
Jagannath Rath Yatra శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ
భువనేశ్వర్: జగన్నాథుడిని యాత్రకు సిద్ధం చేసేందుకు గోప్య సేవకుల వర్గం తలమునకలై ఉంది. గత 13 రోజులుగా స్వామి సోదరీ సోదరులతో కలిసి తెర చాటున గోప్య సేవలు పొందుతున్నాడు. ఆషాఢ కృష్ణ పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని స్వామి వారికి ఖొల్లి లగ్గి సేవ నిర్వహించారు. రాత్రి పూట ఈ సేవని చేపట్టారు. జ్వరం నుంచి ఉపశమనం పొందడంతో శారీరక దారుఢ్యం కోసం పలు లేపన సామగ్రి గోప్య మండపానికి తరలించడం ఖొల్లి లగ్గి సేవలో భాగం. శుద్ధ సువార్ సేవకుల ఇంటి నుంచి ఈ సామగ్రిని తీసుకుని వెళ్లడం ఆచారం. ముందు రోజు ద్వాదశి నాడు చీకటి పడిన తర్వాత శ్రీ మందిర సముదాయం విమలా దేవి పీఠం ఆవరణలో ఉన్న బావి నుంచి నీరు తోడుకుని పోయి స్వామి చికిత్స కోసం అవసరమైన లేపనాలు తయారు చేశారు. బాజా, తురాయి, ఘంటానాదంతో శుద్ధ సువార్ ఇంటి నుంచి శ్రీ మందిరానికి ఊరేగింపుగా ఔషధ సామగ్రిని సోమవారం తరలించారు. ఈ లేపన సామగ్రిని బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని శ్రీ అంగాలకు పూర్తిగా అద్దుతారు. దీనితో శరీరం వజ్ర దారుఢ్యంతో మెరుస్తుంది. రూపుదిద్దుకుంటున్న జగన్నాథుని రథం ఈ నెల 27 నుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్న రథాయాత్ర కోసం రథం నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రథం తయారీలో భాగంగా రంగులు అద్దే పనుల్లొ కళాకారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల రుపాయలను వెచ్చించి రథాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నహాలు చేస్తుంది. స్థానిక పాతబస్టాండు సమీపంలోని గుండిచా మందిరంలో పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటుగా జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతా మూర్తులు గుండిచా మందిరంలో ఉండి భక్తులకు దర్శంన ఇస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తొమ్మిది రోజుల యాత్రలో భాగంగా గుండిచా మందిరానికి ఆనుకుని ఏర్పాటైన స్టాల్స్ వద్ద భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పూర్తిగా ఉంటుందని వివరించారు. -
సేంద్రియ బియ్యంతో జగన్నాథునికి అమృతాన్న భోగం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దైనందిన భోగాల నివేదనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది రథ యాత్ర మొదలుకొని స్వామి వారికి అమృత అన్న భోగం నివేదన ప్రారంభించనున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా రథ యాత్ర నుంచి గుండిచా మందిరం అడపా మండపంలో కొఠొ భోగ సమయంలో మహా ప్రభువుకు అమృత అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాడీ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బొడు సువార్, సువార్ మహాసువార్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సువార్ మహాసువార్ భోగ మండపంలో అమృత అన్నం ఉపయోగించాలని ప్రతిపాదించారు. మహా ప్రభువు భోగం తయారీలో అమత అన్నాన్ని ఉపయోగించడం గురించి గతంలో చర్చించి ప్రయోగాత్మకంగా ఈ చర్యని అమలు చేశారు. కొరాపుట్ ప్రగతి ఇనిస్టిట్యూట్ అమృత అన్నం బియ్యం సరఫరాకు మద్దతు ప్రకటించిందని సీఏఓ తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సేంద్రియ బియ్యంతో ప్రసాదం తయారీ.. మందిరంలో జగన్నాథుని అన్న ప్రసాదాలు మహా ప్రసాదంగా ప్రతీతి. ఈ ప్రసాదం సేంద్రియ బియ్యాన్ని ఉపయోగించి తయారు చేయాలని పాలక వర్గం నిర్ణయించడం ప్రత్యేకత సంతరించుకుంది. స్వామి నిత్య అన్న ప్రసాదాల తయారీలో సేంద్రియ బియ్యం వినియోగిస్తారు. ఈ బియ్యంతో వండిన ప్రసాదాల్ని అమృత్ అన్నం అనే ప్రత్యేక పేరుతో వ్యవహరిస్తారు. ఎటువంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా సహజమైన ఎరువులను ఉపయోగించి సాగు చేసిన బియ్యం మాత్రమే వినియోగిస్తారు. తొలి దశలో స్వామికి నివేదించే కొఠొ భోగ సేవలో మాత్రమే వినియోగిస్తారు. తదుపరి దశలో ఇతర అన్ని వంటకాల్లో ఈ బియ్యం వినియోగం బలపరుస్తారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న కొళాజీర, పింపుడిబాసొ, యువరాజ్ మొదలైన సేంద్రియ బియ్యాన్ని అమృత అన్న మహా ప్రసాదంలో ఉపయోగిస్తారు. మందిరంలో రోజుకు 50 నుండి 55 క్వింటాళ్ల బియ్యంతో స్వామి మహా ప్రసాదం వంటకం అవుతుంది. ప్రత్యేక ఉత్సవాలు, పండగపబ్బాల సందర్భంగా రోజుకు 100 నుండి 200 క్వింటాళ్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అదనంగా కొఠొ భోగం కోసం ప్రతి రోజూ 100 కిలోల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అన్న మహా ప్రసాదానికి అధిక నాణ్యత గల బియ్యం వినియోగానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. పిండి వంటల ప్రసాదాల తయారీలో మసూరి బియ్యం కొనసాగుతుంది. క్రమంగా వీటి స్థానంలో అమృత్ అన్నం బియ్యం వినియోగించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం మందిరం అన్న ప్రసాదాల తయారీలో కొరత లేకుండా అమృత అన్నం బియ్యం సరఫరా చేసేందుకు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమిలో సేంద్రియ వరి సాగు అవసరం అని అనుభవజ్ఞుల వర్గం పేర్కొంది. మందిరం పాలక వర్గం ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా కొనసాగిస్తుంది.ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత -
ఇలా అయితే వేదన తప్పదు : అదే నీవు... అదే దైవం!
దైవం ఈ క్షణంలోనే ఉంది. ఈ క్షణంలో నీవు ఎక్కడ ఉన్నా సరే, ఏమి చేస్తున్నాసరే ఆత్మస్థితిలోకి వెళ్ళగలవు. అదే దివ్యచైతన్యం. అదే నీవు, అదే దైవం. ఆ సమాధి స్థితి దైనందిన జీవితంలో నిరంతరం ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మదర్శనంలోనే ఉండాలి. చూసేవాడివే నీవు, శరీరానికి, మనస్సుకు ఏమి జరుగుతున్నా సరే సంపూర్ణంగా స్వీకరించు, వాటికి అంటకుండా దూరంనుంచి గమనిస్తూ ఉండు. విషయాలను తర్కించి, జరుగుతున్నది మంచేనా లేక చెడా అని రకరకాలుగా అలోచిస్తూ సంస్కారాలను పెంచుకోవద్దు. జరుగుతున్నది ఏదైనా సరే నీవు సాక్షిగా చూస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. అదే నిన్ను మనస్సుకు అతీతంగా తీసుకెళ్తుంది. శరీరము–మనస్సులకు జరుగుతున్న వాటితో కలిసిపోయావంటే వేదనలను అనుభవిస్తావు. జరుగుతున్న వాటిని సాక్షిగా గమనిస్తే ఆత్మలోని అనందమే నీవు అవుతావు. దుఃఖించేవాడివి నీవు కాదు, దుఃఖించేవాడిని గమనించేవాడివే నీవు. ఇలాంటి జీవనశైలిని అలవర్చుకుంటే నిత్యం సచ్చిదానందంలో ఉంటావు. అది నొప్పిఐనా, అవమానమైనా, సంతోషమైనా, విజయమైనా, ప్రశంసైనా.... ఏదైనాసరే నీకు అంటకూడదు. సమభావంతో స్వీకరించు, సాక్షిగా గమనించు. సత్యం నీలో ఉంది. దేన్ని వెంబడించినా ఆనందం రాదు గుర్తుంచుకో. అన్నింటిలోనూ జీవించు కానీ వేటితోనూ కలిసిపోవద్దు. ఆధ్యాత్మికంగా ఉండడమంటే కోరికల్ని అణిచివేయడమని, కొన్ని పనుల్ని చేయకూడదని, సంసారాన్ని త్యజించడమని, హిమాలయాలకు వెళ్ళడమని కొందరు చెప్పే అజ్ఞానపు పోకడలను అనుసరించవద్దు. అసలు జరుగుతున్నదేదీ సత్యం కానపుడు దాన్ని వదిలేయడం ఏమిటి? నీవే దైవమైనప్పుడు దేన్ని వదిలేయాలి? మనస్సుతో మాత్రం ఎప్పుడూ ఏకమవ్వద్దు. మనకున్న నమ్మకాలు, భయాలు, అ΄ోహలు అన్నీ మనస్సు వల్లనే. సత్యాన్ని తెలుసుకోనీయకుండా చేసేది మనస్సే. నీవు సాక్షివైనప్పుడే మనస్సు అంతమవుతుంది. అలోచనలు లేని శుద్ధ చైతన్యం అనుభవమౌతుంది.చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలుబుద్ధుడు, మహా వీరుడు మొదలైన యోగులు కూడా దేవుడు భౌతికమని ఎన్నడూ చెప్పలేదు. సత్యమే దైవం. అదే నీ నిజస్థితి. దేవుడు అనేది నీచివరి మజిలీ. దైవాన్ని నమ్మడం అనేది దైవాన్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఏమాత్రం సహకరించదు. పైగా నమ్మకమే దైవాన్ని తెలుసుకోవడానికి అడ్డుపడుతుంది. నమ్మకాలనేవి నీ మనస్సులోని ఊహలే. సత్యాలు మాత్రం కావు. దైవాన్ని తెలుసుకోవడానికి ఏ క్రతువులు, భాషలు అవసరమే లేదు. కానీ ఈ రోజు ప్రతి మతంలోనూ మనస్సు తాలూకు నమ్మకాలు, అలవాట్లు అనేవే ఉన్నాయి కానీ నిన్ను నీవు తెలుసుకోవడం, సాక్షీభావనతో ఉండడం అనే అంశాలే ఉండటం లేదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, గ్రంథాలు చదివినా అది మన అహంకారాన్ని పోషించి మనస్సును ఇంకా బలపరచి సత్యానికి అడ్డుగోడలు కడుతుందే కానీ సత్యాన్ని తెలుసుకోనివ్వదు. నిన్ను నీవు తెలుసుకోనివ్వకుండా అడ్డుపడేది మనస్సే. రోజాపువ్వు గురించి తెలుసుకున్నంత మాత్రాన నీవు ఆ రోజాపువ్వుని ఆస్వాదించలేవు. ఒక విషయం గురించిన జ్ఞానం ఆ విషయానుభవానికే అడ్డమవుతుంది. మనస్సు నిన్ను సత్యాన్ని తెలుసుకోనివ్వదు. ఆనందాన్ని అనుభవించ నీయదు. ఏదో ఒక కొత్త సమస్యను, కోరికను సృష్టిస్తూ, ప్రశ్నిస్తూ, ఈ క్షణాన్ని తిరస్కరిస్తూ ఉంటుంది. ఆనందం మనస్సుకు అతీతమైన స్థితి కనుక అక్కడికి నిన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూనే ఉంటుంది. దీని ఉచ్చునుండి బయటపడడానికి అనుక్షణం నీవు సాక్షీభావనతో నిన్ను నీవు గమనిస్తూ ఉండాలి. చేతనలో ఉండాలి. చేతన అనేది మనస్సుకాదు కానీ మనస్సు ద్వారా ప్రవహిస్తుంది. ఇది అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలవు. నిత్యజీవితంలో ఈ సాక్షీభావన అనేది సాధన చేయటం చాలా ముఖ్యం. ఇదీ చదవండి: Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు – స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
పంట – కలుపు
పొలంలో ఏదైనా తనకి కావలసిన పంట పండించుకోవటానికి రైతు ఎంతగానో కృషి చేయ వలసి ఉంటుంది. పొలం దున్నాలి. పదును చెయ్యాలి. కావలసిన విత్తనాలు నాటాలి. నీరు పెట్టాలి. చీడ పీడలు రాకుండా మందులు వెయ్యాలి. పశువులు తినకుండా కాపాడాలి. నిరంతరం ఎటువంటి ఇబ్బంది రాకుండా పసిపిల్లలని చూసినట్టు కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉండాలి. అయినా ఏదో ఒక చిన్న సమస్య అనుకున్నంత ఫలసాయం రాకుండా అడ్డుపడుతూనే ఉంటుంది. కావాలనుకున్న దాని విషయంలో జరిగే తంతు ఇది. కాని, కలుపు మొక్కల సంగతి చూడండి. విత్తనాలు కూడా వెయ్యనవసరం లేదు. ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. పంట కోసం చేసిన ఏర్పాటుని హాయిగా తాము అనుభవించి ఏపుగా పెరుగుతాయి. వాటిని ఏరి పారేసినా, పీకి పాకం పట్టినా ఎట్లా బతుకుతాయో అంతుపట్టదు. చక్కగా పుటకరించి ఎదుగుతాయి. ఏమి చెయ్యని చోట కూడా చక్కగా మొలకెత్తి పెరుగుతాయి.సరిగ్గా ఇదే విధంగా మనలో మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు తలెత్తి నాటుకు పోవటం అనే క్రమం సాగుతుంది. అదేం చిత్రమో కాని చెడుకి ఆకర్షణ అధికం. బలం కూడా ఎక్కువే. అంతిమ విజయం మంచికే అంటాం కాని, ఈ లోపు జరగవలసిన హాని జరిగి పోతూ ఉంటుంది. ఆకర్షణ తాత్కాలికమైనా ప్రభావం గట్టిగానే ఉంటుంది. అందుకే ఈ రెండింటి విషయంలో రైతు పంటకోసం ఎంత జాగ్రత్త వహిస్తాడో అంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. మంచిభావాలు అనే విత్తనాలు మొలకెత్తటానికి అనువుగా మనసు అనే క్షేత్రాన్ని చదును చేయాలి. ఇదే క్రమశిక్షణ. శారీరక మానసిక శుద్ధి క్రమశిక్షణ వల్ల సిద్ధిస్తుంది. కలిగిన మంచి ఆలోచనలు మనస్సులో గాఢంగా నాటుకొని పెం పొందే విధంగా తగిన వాతావరణాన్ని కల్పించుకోవాలి. ఇదే పొలానికి నీరు పెట్టి ఎరువు వెయ్యటం వంటిది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఎండి పోయినట్టు, పంటకి తెగులు సోకినట్టు సదాలోచనలు కూడా పక్కదారి పట్టవచ్చు. అందుకని వచ్చిన మంచి ఆలోచనలని నిరంతరం మననం చెయ్యటం, వీలైనంత వరకు ఆచరణలో పెట్టటానికి ప్రయత్నం చెయ్యటం చేయాలి. ఆలోచన క్రియారూ పాన్ని దాల్చితే స్థిరపడి పోతుంది. పంట బాగా ఎదగాలని ప్రయత్నం చేస్తే, చేసిన శ్రమఫలాన్ని అంతా కలుపు మొక్కలే పొంది బలంగా ఎదుగుతాయి. అదేవిధంగా, మంచి భావాలనే నిరంతరం మనసులో నింపుకుని ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా, దురాలోచనలు సందు చూసుకుని దూరి పోయి, ఎక్కువ ప్రాబల్యాన్ని సంతరించుకుంటాయి. కనుక వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. లేక పోతే పంటని మించి కలుపు మొక్కలే రాజ్యమేలినట్టు కూడని భావాలే విస్తరించి మంచిభావనలని అణచి వేయటం జరుగుతుంది. ప్రయత్నం లేకుండానే పెచ్చు పెరిగే ప్రతికూల భావజాలానికి అడ్డుకట్టవేసి, సానుకూల భావాలని ప్రయత్నపూర్వకంగా పెం పొందించుకుని పోషించుకుంటూ ఉండాలి. అవి వాటంతట అవి రావు. ఉదాహరణకి కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేద్దామనే ఆలోచన వచ్చిందనుకుందాం లేదా రోజూ కొద్ది సమయం యోగాభ్యాసమో, నడకో, ధ్యానమో చేద్దామనే భావన కలిగిందనుకుందాం. ఆ భావన మాయం కాకుండా ఆచరణ దాకా వచ్చేవరకు దానినే గుర్తు చేసుకుంటూ ఉండాలి. లేక పోతే ఆ నిర్ణయాన్ని బలహీనపరచే ఆలోచనలు విజృంభిస్తాయి. ఇంకేముంది? అంతా మామూలే! కాని, అదే ఏదైనా చెడు ఆలోచన వచ్చిందనుకుందాం. దానిని బలహీన పరచే ఊహలు రావు. వచ్చినా నిలవవు. అందుకే మనస్సులో మెదిలిన సదాలోచనని వెంటనే అమలు చెయ్యమని, దురాలోచనని వీలైనంత ఆలస్యం చెయ్యమని చెపుతారు పెద్దలు. వ్యవసాయంలో కలుపుతీతకి ఉన్నంత ప్రాధాన్యం సాధనలో శారీరిక... మానసిక శుద్ధికి ఉంది. వద్దనుకున్న కలుపు మొక్కలు ఎదిగినంత వేగంగా పంట ఎదగనట్టే చెడు ఆలోచనలు వచ్చినంత త్వరగా మంచి ఆలోచనలు రావు. మంచి చేయాలనే ఆలోచన కలగవచ్చు. కానీ, దానిని అమలు పరచటం గురించి మనస్సులో స్థిరంగా అనుకోవటం కాని, ఎక్కువసేపు ఆలోచించటం గాని సాగదు. దానికి కారణం కలుపు మొక్కల వంటి చెడు భావాలు దృఢంగా పాతుకు పోయి, బలంగా ఎదిగి, బాగా విస్తరించి, సదాలోచనలు అస్తిత్వం కోల్పోయేట్టు చేయటమే. అందుకే ప్రధానంగా చెయ్యవలసింది పనికిరాని భావాలని మనస్సులో నుండి తొలగి పోయేట్టు చేయటమే. అపుడు మనస్సులో మంచిభావాలు విస్తరించటానికి కావలసిన ఖాళీ ఏర్పడుతుంది. – డా.ఎన్. అనంతలక్ష్మి -
మూలికా వైద్యం, కోలుకుంటున్న జగన్నాథుడు
భువనేశ్వర్: జ్యేష్ట పూర్ఠణిమ నుంచి అస్వస్థతకు గురైన శ్రీ జగన్నాథుడు తెర చాటున గోప్యంగా వైద్య సేవలు పొందుతున్నాడు. స్వామి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. మరో వైపు యాత్ర దగ్గర పడుతుంది. స్వామి ఆగమనం కోసం భక్త జనం నిరీక్షిస్తోంది. రాజ వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాత్రింబవళ్లు ఉపచారాలు చేస్తున్నారు. శుక్రవారం పవిత్ర అనవసర దశమి సందర్భంగా శ్రీ మందిరంలో చక్కా విజే సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాటుల్ని రాతి పీఠంపైకి తరలించారు. ఇది స్వామి ఆరోగ్యం కోలుకుంటున్నట్లు సంకేతం. భోగ మండప సేవ పూర్తి అయిన తరువాత జయ, విజయ ద్వారం మూసివేసి బెహరణ్ ద్వారం తెరిచారు. ధుకుడి ద్వారం సమీపంలో ఉన్న మూడు స్తంభాకార పీఠాలను గోప్య సేవల ప్రాంగణానికి తరలించి వాటిపై మూల విరాట్లను పూజించడం చక్కా విజే సేవగా పేర్కొంటారు. దశ మూల మోదకాల వైద్యం ఆయుర్వేద పద్ధతులు, గ్రంథాల ప్రకారం జగతి నాథునికి వైద్యం కొనసాగుతుంది. ఆరోగ్య స్థితిగతులకు అనుగుణంగా వైద్య శైలిని సమయోచితంగా సవరించుకుని ఔషదీయ పదార్థాల్ని నివేదిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్వామి కోసం దశ మూలికల మోదకం తయారు చేశారు. శ్రీ మందిరం రాజ వైద్య సేవకులు తరతరాలుగా మహా ప్రభువుని సేవిస్తున్నారు. ఈ మహా ఔషధిని సిద్ధం చేయడంలో పది రకాల ఔషధీయ మూలికల్ని వినియోగించడం విశేషం. ఈ మిశ్రమంతో తయారు చేసిన ఔషధాన్ని వేర్వేరుగా 3 మట్టి పాత్రల్లో పేర్చి వాటిపై కర్పూరం చల్లి మూతబెట్టి శ్రీ మందిరంలో గోప్య సేవలు అందజేస్తున్న వర్గాలకు అందజేశారు. (Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత)ఆషాఢ కృష్ణ పక్ష దశమి రోజున మూడు రాతి పీఠాలపైకి చేర్చిన మర్నాడు సంప్రదాయం ప్రకారం దేవ దేవుళ్ల కోసం రాజ వైద్యుల కుటుంబీకులు తయారు చేసిన దశ మూలికల ఔషధాన్ని వైద్యంలో భాగంగా నివేదిస్తారు. ఆషాఢ కృష్ణ పక్ష ఏకాదశి నాడు మూల విరాటులకు పతి మహాపాత్రొ వర్గం సేవకులు వీటిని సమర్పిస్తారు. పవిత్ర ఏకాదశి తిథి నాడు రాత్రి పూట ఆలయ వైద్యుడి సలహా మేరకు పతి మహాపాత్రో సేవకులు వీటిని సమర్పిస్తారు.కోలుకుంటున్న జగన్నాథుడు -
పొగడ్తల కోసమా దానం? ఎలాంటి దానం గొప్పది!
పవిత్రమపి యత్ క్రూరం కర్మ తన్నహి శోభతేపరోపకారకం శాంతం కర్మ సద్భిః ప్రశస్యతే మనం చేసే పని ఎంత పవిత్రమైనదైనా క్రూరంగా ఉంటే మాత్రం రాణించదు. అది శాంతమై, ఇతరులకు ఉపకారం కలిగించేదైతే సజ్జనులు దాన్ని ప్రశంసిస్తారు. పూర్వం ఒక గ్రామంలో వృద్ధ స్నేహితులు ఇద్దరుండేవారు. వాళ్ళిద్దరూ బాగా కలిగిన ధనవంతులే. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. ఒకసారి ఊరి బయటకు వారు షికారుకు వెళ్లినప్పుడు వారిని పిచ్చి కుక్క కరిచింది. ఫలితంగా ‘రేబిస్ వ్యాధి’ సోకింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మరణం తప్పదని నిర్ధారణ అయింది.ఇప్పుడు వాళ్ళకు ఏదో దాన ధర్మాలు చేసుకుంటే మంచిదనీ, కీర్తి ప్రదమనీ అనిపించింది. పిచ్చికుక్కలు మానవజాతికి ప్రమాదకారులు కనుక వాటివల్ల తమ లాగానే ఇతరులు బాధపడకూడదనే సదుద్దేశంతో వారిలో ఒకాయన, తన యావత్తు ఆస్తినీ పిచ్చికుక్కల్ని చంపటానికి ఖర్చు పెట్టాలని వీలునామా రాశాడు. ఇక రెండవ వ్యక్తి, పిచ్చికుక్క కాటువల్ల వచ్చే రోగానికి మంచి మందు కనిపెట్టి దాన్ని రోగులకు ఉచితంగా ఇచ్చి వైద్యం చేయాలంటూ అందుకోసం తన ఆస్తినంతా ఖర్చుపెట్టాలని వీలు నామాలో రాశాడు. ఎలా వుంది, వీరిరువురి దానాల తీరు? ఇద్దరూముందు తరాలవారికై మంచి పనే చేశారు. కాని మొదటాయన చేసిన దానం చాలా క్రూరమైంది. హింసాత్మకం. రెండవవాడు చేసింది సున్నితమైంది. జాతికి బాగా ఉపయోగపడేది. ఈరెండవ పద్ధతి దానాన్నే పెద్దలు మెచ్చుకుంటారు. ఇలాగే దానధర్మాల కోసం ధనం బాగా ఖర్చుపెట్టే దాతలున్నారు. బీదలకు అన్న సత్రాలు కట్టిస్తారు. పాఠశాలలు నెలకొల్పుతారు. బావులు, చెరువులు తవ్విస్తారు. దళిత దీన జనాలకై తిండి, వస్త్రాలు, వసతి వంటివెన్నో కల్పిస్తారు. కానీ ఇలాంటివి చేసే వ్యక్తులకెంతో ఓర్పు, జాలి, దయాదాక్షిణ్యా దులుండటం అవసరం. లేకపోతే ఆ దానాల ఫలితాన్నందు కోలేరు. ముఖ్యంగా ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం ఉండ కూడదు. ‘నా గురించి పదిమంది పొగడాలి’ అనే కాంక్ష ఉండ రాదు. ‘దానం చేయటం నా కర్తవ్యం’ అని భావిస్తూ ఫలాపేక్ష రహితంగా చేసే దానం ఉత్తమం. జయ గురుదత్త!శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
భవసాగరం అంటే..
మనలోని ఏడుపొరలలోని భవసాగరం, నాభి రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ధర్మ సంరక్షణలో మనం ఆనందాన్ని పొందుతాం. మనం ఎవరితోనైనా మంచిగా ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. ఈ ధర్మ బద్ధత అనేది మనలోని భవసాగరం పరిశుభ్రంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఉదయం 4 గంటలకే నిద్రలేచి పెద్దగా హారతిపాటలు పాడుతూ, గంధంచెక్క అరగదీస్తూ పెద్ద పెద్ద స్తోత్రాలు పాడుతూ స్నానమాచరించి ఇంటిల్లిపాదికీ నిద్రాభంగం చేసినంత మాత్రాన అది సదాచార పరాయణత్వం కాక పోవచ్చు. పిల్లల్ని నిద్రపుచ్చి తల్లి బహుశా ఎప్పుడో ఆలస్యంగా పడుకుని ఉండవచ్చు. ఈ ధర్మం అనేది అంతర్గతమైనది. ఉదాహరణకు మీరు ఏదైనా ఎవరికైనా దానం చేయాలనుకున్నారనుకోండి. అది మీకు, పరమాత్మునికి మధ్య విషయం మాత్రమే. దానిని బాహ్యంగా ప్రకటించ వలసిన పని లేదు. ధర్మమంటే మిమ్మల్ని మీరు అంతర్ముఖంగా పరిశుభ్రపరచుకోవటం ముఖ్యం. అంతే కానీ వేరెవరినో కాదు. మీ హృదయాన్నుండి వచ్చే ఆ ధర్మానందాన్ని, ఆ రసాన్ని మీరే ఆస్వాదించాలి. మీ పవిత్రతను మీరే ఆస్వాదిస్తారు. ఆనందిస్తారు. ధర్మం అనేది మీ హృదయంలో ఎంతవరకు ఉన్నదనేది ముఖ్యం. అనాహత చక్రం ఇది చాల ముఖ్యమైన చక్రం. అదే హదయ(అనాహత) చక్రం ‘‘ ఉదార చరితానామ్ వసుధైక కుటుంబం’’ అంటే ఉదార స్వభావులైన వారు ప్రపంచమంతా వారి కుటుంబమే అని భావిస్తారు. ప్రతి ఒక్కరిపట్ల ప్రేమ ప్రవహిస్తూంటుంది. ప్రతి ఒక్కరి సమస్య తమ సమస్యగానే భావిస్తారు. ప్రతి ఒక్కరికీ తానొక తల్లిగా ఉండాలి అని భావించుకోవటం అనే గుణం మధ్య హృదయం నుండి వస్తుంది. ప్రప్రథమంగా హృదయ చక్రం విశిష్టత భద్రత. మీలోని భద్రతా భావాన్ని మీరు అనుభూతి చెందటం. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఆ భద్రతాభావాన్ని అనుభూతి చెందగలరు.మీ సంపూర్ణ భద్రత అనేది మీలోని ఆత్మ మాత్రమే. అంతేగాని వేరే ఏవీ ముఖ్యం కావు. మీరు అలాంటి భద్రతాభావం కలిగి ఉన్నవారైతే మీ పిల్లలు కూడా ఆ భద్రత అనేది తమలోనే ఉన్నదని గ్రహిస్తారు. అటువంటి పిల్లలు నిజమైన ధైర్యవంతులుగా ఉంటారు. చదవండి: Murugan పళని మురుగన్కి ప్రణామాలు!మీలోని మీ భద్రతాభావాన్ని మీరు ఆస్వాదించండి. భద్రతాభావం వలన కలిగే ఆనందమే మిమ్మల్ని అధ్యాత్మిక లోతులకు తీసుకుని వెళుతుంది. ఎవరిలో అయితే భగవంతుడు ఉంటాడో, ఎవరికైతే భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయో వారికి అంతకన్నా ఇంకేమి కావాలి? ఎందుకంటే భగవంతుడు సర్వ శక్తిమంతుడు. ఎవ్వరిశక్తీ ఆ భగవంతుని శక్తి కన్నా ఎక్కువకాదు. కాబట్టి మొదటగా మీ మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆ విశ్వాసాన్ని మీ హృదయ చక్రంలో పదిల పరచుకోండి. ఆ విశ్వాసమే మీకు రక్షణ ఆనందాన్నిస్తుంది. ప్రపంచంలోని అభద్రతా భావాలన్నింటికీ విశ్వాసమే సమాధానం. మన హృదయంలో జగదంబ అయిన దుర్గామాతను స్థిరపరచుకోవాలి. – డా. పి. రాకేష్(మన అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థ గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనం ఆధారంగా) ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత -
Murugan పళని మురుగన్కి ప్రణామాలు!
తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహితపరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి అత్యంత విశిష్టమైనవి.. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్రే ఉంది. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే... కుమార, కుమరన్, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షణ్ముగం, శరవణ, శరవణన్, గుహ, గుహన్ మురుగ, మురుగన్ – ఇలా ఎన్నో పేర్లున్నాయి. తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామికి గల వైభవ ఆలయాలలో’పళని’ (Arulmigu Dhandayuthapani Swamy) ప్రముఖమైంది. ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో తన కుమారులైన గణేశుని, కుమారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్పాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వరూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భుత ఫలాన్ని పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్రదక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు. అది చూసి శివదేవుడు జాలిపడి ’అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి ‘ఫలం – ని’ నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివాసం ఉండు’ అంటూ కుమారుని బుజ్జగించాడు. దీంతో వైభవమైన ‘పళని’ రూపుదిద్దుకుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమయింది!మురుగన్ కొండపళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది! దీనిని ‘మురుగన్ కొండ’ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై ‘ఏరియల్ రోప్ – వే’ ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణ కోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకతప్రకృతి దృశ్యాలుమెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్టమొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెలితే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్తంభాలు అత్యంత సుందరమైన శిలాచిత్రాలతో మంత్రముగ్ధులు గావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వార΄ాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి.విశిష్టమైన విగ్రహంగర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్వవేక్షణంలో రూపొందింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని ’నవ పాషాణం’ అనే విశేషమైన శిలను మలచి తయారు చేశారని, ఇందులో శక్తిమంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు. ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకు పోతాయని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!.మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శనభాగ్యాన్ని అందజేస్తారు. కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ కృత్తిక సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.బోగర్ సిద్ధుని సమాధిఈ పళని కొండలో బోగర్ సిద్ధుని సమాధి, ప్రత్యేక గర్భగుడి ఉన్నాయి. ఇక్కడి స్వామివారి విగ్రహం చిలుక బొమ్మను కలిగి ఉంటుంది. ఇక్కడి స్వామిని కీర్తిస్తూ ‘‘తిరుపుగళ్’’ అనే పాటలను అరుణగిరినాథుడు రచించాడు. అంతేకాదు, తన పాటలతో చిలుక రూపంలో కుమారస్వామితో ఉండే వరం పొందాడని భక్తుల విశ్వాసం. పళని కొండకు వెళ్లే దారిలో ఇడుంపన్ మందిరం ఉంది. తెల్లవారుజామున ఇక్కడ పూజలు చేసిన తర్వాతే, కొండపై ఉన్న కుమారస్వామికి పూజలు చేస్తారు. – డి.వి.ఆర్ -
Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత
Jagannath Yatra 2025 జగన్నాథ రథయాత్ర 2025 ఒడిశాలోని పూరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ రథయాత్రను ప్రతి భారతీయుడు కనీసం ఒక్కసారైనా చూసి తరించాలని భావించే ఆధ్యాత్మిక సందర్భం. దేశ, విదేశాల నుంచీ ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు జగన్నాథ రథయాత్రను చూసి తరిస్తారు. ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడు జరుగుతుంది.ఉత్సవ విగ్రహాలకు బదులుగా సాక్షాత్తు గర్భగుడిలో ఉండే విగ్రహమూర్తులేప్రత్యేకంగా తయారు చేసిన మూడురథాల్లో (జగన్నాథుడు, బలభద్రుడు , సుభద్ర దేవి) యాత్ర ద్వారా ఒడిశాలోని పూరి వీధుల గుండా ఊరేగడం ఇక్కడి విశేషం. ఈ ఉత్సవంలో ఒవేలాది మంది భక్తులు లాగుతున్న మూడు భారీ చెక్క రథాలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, గొప్ప రథయాత్ర. అందుకేబ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand) జగన్నాథ రథయాత్ర చరిత్ర 5 వేల సంవత్సరాల నాటిదనీ, ప్రస్తుత రూపం 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ రాజు ప్రస్తుత జగన్నాథ ఆలయాన్ని నిర్మించినప్పుడు రూపుదిద్దుకుందని చెబుతారు. ప్రతి సంవత్సరం కొత్త కలపతో రథాన్ని తయారు చేయడం ఈ రథయాత్ర మరో ప్రత్యేకత. ఈ యాత్రలో రథం తాడును లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష రెండవ రోజు నుండి పూరీ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర జూన్ 27 ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు ముందు అనేక శుభ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనాయి.. రథం నిర్మాణం నుండి స్నాన పూర్ణిమ వరకు, జగన్నాథుడు, బలభద్రుడు ,సుభద్రలను 108 కలశాలతో స్నానం చేస్తారు. దీని తరువాత, జూన్ 26న గుండిచ ఆలయం శుభ్రం చేయబడుతుంది. గుండిచ ఆలయం అనేది దేవుని అత్తగారిల్లు. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు తన అత్త ఇంటికి వెళ్లి, ఆమరుసటి రోజు అంటే జూన్ 27న రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రోజున, భగవంతుడు శ్రీమందిర్ నుండి మూడు గొప్ప రథాలలో గుండిచ ఆలయానికి బయలుదేరుతాడు. రథయాత్ర తొమ్మిది రోజుల పాటు కొనసాగిన తిరుగు ప్రయాణం, బహుద యాత్ర జూలై 5న సాగుతుంది. ఈ సందర్భంలో జగన్నాథుడు మళ్ళీ సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రతో కలిసి శ్రీమందిర్కు బయలుదేరుతాడు.ప్రతి రథానికి ఒక ప్రాముఖ్యత ఉంది.నందిఘోష (జగన్నాథుని రథం)"విశ్వ ప్రభువు" అయిన జగన్నాథుడు మూడు రథాలలో అత్యంత గొప్పదైన నందిఘోష రథంలో స్వారీ చేస్తాడు. దాని పేరు సూచించినట్లుగా, అది కదిలేటప్పుడు ఆనందకరమైన శబ్దం చేస్తుంది. మూడు రథాలు వరుసలో ఉన్నప్పుడు అతని రథం ఎల్లప్పుడూ కుడి వైపున ఉంచుతారు.తాళధ్వజ (బలభద్ర ప్రభువు రథం)జగన్నాథుని అన్నయ్య అయిన బలభద్రుడు తాళధ్వజ రథంలో ప్రయాణిస్తాడు. "తలధ్వజ" అనే పేరు దాని జెండాపై ఉన్న తాళ వృక్షాన్ని సూచిస్తుంది. బలరాముడి రూపంగా పరిగణించబడే బలభద్రుడు ఈ రథంలో స్వారీ చేస్తాడు. అతని రథం సాధారణంగా ఊరేగింపులో ఎడమ వైపున ఉంచుతారు.దర్పదలన (సుభద్రాదేవి రథం)అతి చిన్నదైనప్పటికీ అత్యంత అలంకరించబడిన రథం జగన్నాథుడు మరియు బలభద్రుని సోదరి అయిన సుభద్ర దేవికి చెందినది. "దర్పదలన" అనే పేరుకు "గర్వాన్ని నాశనం చేసేది" అని అర్థం, దేవత తన భక్తుల నుండి అహాన్ని ఎలా తొలగిస్తుందో చూపిస్తుంది. పండుగ సమయంలో సుభద్ర దేవి రథాన్ని ఆమె సోదరుల రథాల మధ్య ఉంచుతారు. ఆమె స్త్రీ దైవిక శక్తిని సూచిస్తుంది . మహిళా భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు.ప్రతి రథం కోసం దాదాపు 1,000 చెక్క ముక్కలను ఉపయోగిస్తారు. నిర్మాణానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. విశేషమేమిటంటే, ఈ భారీ నిర్మాణాలు ఎటువంటి లోహపు మేకులు లేదా ఫాస్టెనర్లు లేకుండా తయారు చేస్తారు. "మహారాణులు" అని పిలువబడే కళాకారుల తరతరాలుగా అందించబడిన సాంప్రదాయ కలపడం పద్ధతులను ఉపయోగించి వీటిని రూపొందిస్తారు. శ్రీ జగన్నాథునికి లేహ్య సేవఈ రథయాత్రకు సంబంధించిన రథాల తయారీ దాదాపు తుది దశకు చేరుకుంది. అలాగే ఆ యాత్రంలోభాగంగా జన్నాథునికి లేహ్య సేవ ఘనంగా నిర్వహించారు. స్నాన పూర్ణిమనాడు భారీ స్నానం చేసిన తర్వాత శ్రీ జగన్నాథుడు, అతని తోబుట్టువులు అస్వస్థతకు గురయ్యారు. వారు త్వరగా కోలుకోవడానికి ఆలయ రాజ ఆయుర్వేద వైద్యుల మార్గదర్శకత్వంలో వివిధ రకాల మూలికా ఔషధాలతో చికిత్స కొనసాగిస్తున్నారు. దేవతలు ప్రస్తుతం అనవసర మండపంపై కొలువు దీరి గోప్య సేవలు పొందుతున్నారు. ఈ సేవల్లో ప్రత్యేకంగా తయారుచేసిన నూనెలు, మూలికా ఔషధాలు వాడతారు. ఈ సమయంలో స్థానిక మూలికలు మరియు వేర్లతో తయారు చేసిన ఔషధాలు, పండ్ల రసాలు మూల విరాట్లకు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళ వారం ఒస్సా లగ్గి (తైల పూత) ఉపచారంతో సేవలు అందించారు. సుధ సువారో సేవక వర్గం తయారు చేసిన ఒస్సా అనే ప్రత్యేక వైద్యాన్ని దేవతలకు అందజేశారు. మంగళ వారం అపరాహ్న ధూపం తర్వాత దేవతలకు ఒస్సా లగ్గి నిర్వహణ సన్నాహాలు ప్రారంభించారు. దైతపతి సేవకులు రాత్రి పూట ఈ చికిత్స నిర్వహించారు. -
Puri Rath Yatra 2025: వస్తున్నాయ్..జగన్నాథ రథచక్రాల్
భువనేశ్వర్: ఈ ఏడాది జరగనున్న పూరీ జగన్నాథుని రథ యాత్రకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. యాత్ర సమీపిస్తుండటంతో, జగన్నాథుని రథాల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. పూరిలోని రథ ఖాలా వద్ద శ్రీ జగన్నాథుని రథం నందిఘోష బలభద్రుని తాళ ధ్వజం, దేవీ సుభద్ర దర్ప దళనం అనే 3 రథాలు శ్రీ మందిరం శిఖరంతో సరిసమానంగా ఎదుగుతున్నట్లు అబ్బురపరుస్తున్నాయి. శ్రీ జగన్నాథ స్వామి యాత్ర తయారీ కార్మిక విభజనకు నిలువెత్తు తార్కాణం. అట్టడుగు నుంచి నిలువెత్తు వరకు రథాల తయారీ పనులు గొలసు కట్టుగా కొనసాగుతున్నాయి. రథాల తయారీ శాలలో వడ్రంగులు, చేతి వృత్తులవారు, ముఖ్యంగా మహరణ, భోయి సేవకులు సంప్రదాయ గడువు ప్రకారం కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 3 రథాల పనులు ఒకే క్రమంలో నిబద్ధతతో నిర్వహించడంతో ఒకే స్థాయిలో అంచెలంచెలుగా తయారీ పూర్తవుతుంది. ఒక్కో రథం బహుళ అంతస్తు భవనాన్ని పోలి ఉంటుంది. రథంపై భగవంతుని పీఠం పైభాగాన 3 మిద్దెలతో రథాల తయారీ నింగిని తాకే ఊపుతో ఎదుగుతుంది. ప్రతి రథం యొక్క మూడవ మరియు చివరి మిద్దె (ఒఘా భూయి) తయారీ పూర్తయ్యింది.భద్రతకు ప్రాధాన్యత: సంప్రదాయబద్ధంగా వడ్రంగుల చేతిలో తయారు అవుతున్న 3 భారీ రథాల్లో ప్రతి అంశాన్ని అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. శ్రీ మందిరం సింహ ద్వారం నుంచి గుండిచా మందిరం వరకు పోకరాకలు చేయాల్సిన రథాలకు చక్రాలకు మూలాధారం. వీటి పటిష్టతకు భద్రత కల్పించే దిశలో చక్ర రక్షకులు (పొరా భొఢి) తయారీ పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న దైవిక ప్రయాణానికి రథాల తయారీ సింహ భాగం పూర్తయ్యింది.నేల నుంచి నింగికి: జతతి నాథుడు యాత్ర చేసే రథం నేల నుంచి నింగికి ఎగసినట్లు తయారవతుంది. చక్రాల నుంచి రథ శిఖరం వరకు అందం కనులు మిరమిట్లు గొలుపుతుంది. ఈ అందాన్ని ఆవిష్కరించడంలో క్లిష్టమైన కళాత్మక రంగుల మేళవింపుతో అలంకరించడంలో చిత్రకారులు హుషారుగా పని చేస్తున్నారు. రథం పార్శ్వ తోరణాల్ని (పట్టొ గుజొ) సేవకులు సాంప్రదాయ మూలాంశాలను రూపకారులు చెక్కుతున్నారు. నలువైపులా అలంకృత చెక్కలు: రథం అందాల్ని ప్రతిబింబించడంలో నలు వైపుల ఆకర్షణీయమైన అలంకార చెక్క తోరణాల (ఫొటొలొ) అమరిక కీలకమైన నైపుణ్యత. రథాలపై నిలిపిన మిద్దెలు పట్టు కోల్పోకుండా దిట్టంగా ఉండేందుకు అంతర్భాగంలో వంపు తిరిగిన చెక్కల్ని (సేని) ఆధారంగా జోడిస్తున్నారు. -
అతిరథుడు బాహ్లికుడు..చదివితే భారతమే చదవాలి!
‘కొడుకా! నేనెటులొ, అట్లె బాహ్లికుడు కూర్చున్ నీకు...’ అంటాడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడితో! ‘కుమారా! నీకు నేనెంతో, అంత గానూ కావలసినవాడు, ప్రియబాంధవుడూ బాహ్లికుడు. నేనూ, బాహ్లికుడూ, భీష్ముడూ... నీకు అత్యంత పూజనీయులం. మా మాట కాదని ధర్మరాజుతో యుద్ధానికి దిగవద్దు’ అని దీనంగా బతిమాలు కొంటాడు. ఈ ఘట్టం విన్నప్పుడు, దుర్యోధనుడికి తండ్రి తాతల సరసన మూడో అతి ముఖ్య బంధువయిన బాహ్లి కుడు ఎవరు, ఆయన ఎందుకు ప్రసిద్ధుడు కాలేదు అని సందేహం వస్తుంది.బాహ్లికుడు, భీష్ముడి తండ్రి శంతనుడి సోద రుడు. భీష్ముడికి పెత్తండ్రి. ఆయన తండ్రి ప్రతీపుడు తను రాజుగా ఉన్నప్పుడే, బాహ్లికుడికి కొంత రాజ్యభాగం ఇచ్చి రాజును చేశాడు. ఆ తరవాత కొన్ని అసా ధారణ పరిస్థితుల వల్ల చిన్న కొడుకయిన శంతనుడికి హస్తినాపుర రాజ్యాధికారం లభించింది. పరిశీలనగా చూస్తే, చరిత్రలో ఎన్నెన్నో రాజ్యాధికార వారసత్వాలు అసాధారణంగా సంక్రమించటం కనిపి స్తుంది. భారతంలో అలాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి. ఇదీ చదవండి: షారూఖ్ను మించిపోయేలా, మహేష్ టేస్ట్ అండ్ స్టైల్ : ధర రూ. 8 కోట్లు!భారతంలో బాహ్లికుడికి ప్రధాన పాత్ర లేదు. ఆయన పేరు అరుదుగా వినిపిస్తుంది. కానీ వంశంలో అందరి కంటె వృద్ధుడిగా, ఆయన కౌరవ పాండవులిద్దరికీ సన్నిహితుడే. వాళ్ళ ఇళ్ళలో శుభాశుభ కార్యాలన్నిటికీ ఆయనే ఇంటి పెద్ద. పూజ్యుడు.ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు, ఆయన వచ్చిఇంటి పెద్దగా గొప్ప గౌరవం పొంది, ఒక ఉత్తమ రథాన్ని కానుకగా ఇస్తాడు. ద్రౌపదీ మానభంగ ఘట్టంలో నిస్సహాయంగా చూస్తూ ఊరు కొన్న కురు వృద్ధ, గురు వృద్ధ, బాంధవులలో బాహ్లికుడు ఉన్నాడు. తరవాత జరిగిన రెండో విడత జూదం వారించేందుకు గట్టిగా చెప్పి చూసిన పెద్దలలో బాహ్లికుడి పేరు కూడా కనిపిస్తుంది.భీష్మ పితామహుడికే పెద తండ్రి అయిన బాహ్లికుడు, పండు ముసలితనంలో కూడా భారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరా డాడు. భీష్ముడి పరిగణనలో ఆయన కౌరవ పక్షంలో ఉన్న మహావీరు లలో అగ్రగణ్యులలో ఒకడు. ‘అతిరథుడు బాహ్లికుడు విను, అతులిత బలు, డతని యట్ల ఆత్మజుడును...’ అని అభివర్ణిస్తాడు గాంగేయుడు. యుద్ధంలో వీరోచితంగా పోరాడి, చివరికి భీముడి చేత వీరమరణం పాలవుతాడు. మహాభారత కథ ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన ఉదాత్తమైన పాత్రల ద్వారా మానవ స్వభావాన్ని అనేక కోణాల నుంచి ఆవిష్కరించి చూపు తుంది. అందుకే, చదివితే భారతమే చదవాలి!– ఎం. మారుతి శాస్త్రి -
సగమైన సముద్రం
తుంగభద్ర నది ప్రవహిస్తోంది. దూరంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అష్టోత్తరం వీనుల విందుగా వినిపిస్తూ ఉంది. నది ఒడ్డున కూర్చుని ఉన్న గురువుతో శిష్యుడు ‘‘స్వార్థం అంటే ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘స్వార్థం అంటే తన గురించి మాత్రమే శ్రద్ధ వహించడం. ఇతరులను పట్టించుకోకుండా తన ప్రయోజనం, ఆనందం లేదా సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించడం’’ అని బదులిచ్చాడు గురువు. ‘‘దాని పర్యవసానాలు ఏమిటి?’’ అని మళ్ళీ ప్రశ్నించాడు శిష్యుడు. ‘‘స్వార్థం ఎంత పనైనా చేయిస్తుంది. దానికి అంతమనేది లేదు. నీకు అర్థమయ్యే రీతిలో ఒక ΄కతకథ చెబుతాను విను.‘‘ఒక పెద్ద సామ్రాజ్యంలోని రాజ్యాలలో వర్షాలు లేక తీవ్రమైన కరువు ఏర్పడింది. ఏమి చేయాలో తెలియని చక్రవర్తి ఆస్థాన పండితులను పిలిచి చర్చించాడు. తపస్సు చేసి దైవానుగ్రహం పొందటమే శరణ్యమని వారు సలహా ఇచ్చారు. రాజ్యాల శ్రేయస్సు కోసం అడవులకెళ్ళి ఘోర తపస్సు ప్రారంభించాడు. చక్రవర్తి తపస్సుకి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ఇదీ చదవండి: Today recipes : బ్రెడ్తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?తన సామ్రాజ్యంలో మంచివానలు కురవాలని, నీటికరువు ఉండకూడదని కోరాడు చక్రవర్తి. ఎందుకైనా మంచిదని తన సామ్రాజ్యానికి ఆనుకుని ఉన్న సముద్రాన్ని కూడా మంచినీళ్ళుగా మార్చివేయమని అడిగాడు. ‘‘ఆలోచించే అడుగుతున్నావా?’’ అని దేవుడు రాజును ప్రశ్నించాడు.‘‘వృథాగా ఉన్న సముద్రం నీళ్ళు మంచినీళ్ళుగా మారితే మా సామ్రాజ్యంలోని ప్రజలు తరతరాలు నీటి ఎద్దడి లేకుండా సుఖపడతారు కదా. చరిత్రలో నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా’’ అని దేవుణ్ణి ఒప్పించాడు.చదవండి: ‘మై లవ్..’గర్ల్ఫ్రెండ్ కోసం ఒంటరిగా కుమిలి కుమిలి : వైరల్ వీడియో‘‘సరే, నీ ఇష్టం’’ అని చక్రవర్తి కోరినట్లే చేశాడు దేవుడు. వెంటనే మంచి వర్షాలు కురిశాయి. పరమానంద భరితుడయ్యాడు చక్రవర్తి. కొన్నాళ్ళు గడిచాయి. ఉప్పునీళ్ళ సముద్రం మంచి నీళ్ళుగా మారాక పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చక్రవర్తి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. సముద్రం సగమై ఉంది. ఆశ్చర్యపోయాడు. అలలు సైతం నీరసంగా పడి లేస్తున్నాయి. చక్రవర్తి గుండె తరుక్కుపోయింది. కారణమేమిటని తన సిబ్బందిని అడిగాడు. ఏ రాజ్యానికి ఆ రాజ్యం రాజులు అవసరం ఉన్నా లేకున్నా సముద్రం నీళ్ళని తమ రాజ్యాల వైపుకు మళ్ళించుకున్నారని చెప్పారు. ‘సముద్రాన్ని కూడా సగం చేసింది కదా మనిషి స్వార్థం’ అని తల పట్టుకున్నాడు చక్రవర్తి. ఇంకొన్నాళ్ళు గడిస్తే సముద్రం పూర్తిగా మాయమై పర్యావరణ సమస్య వస్తుందని గుర్తించాడు. వెంటనే తపస్సు ప్రారంభించడంతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చేసిన తప్పునకు క్షమాపణలు కోరి సముద్రాన్ని ఉప్పునీళ్ళగా మార్చమని ప్రాధేయపడ్డాడు’’ అని స్వార్థం గురించి వివరించాడు గురువు. స్వార్థం మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుందని అర్థం చేసుకున్నాడు శిష్యుడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
జూన్ 26 నుంచి ఆషాఢ మాసోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ: ఆషాఢ మాసోత్సవాలు, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. ఈ నెల 26 నుంచి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలు, 26 నుంచి జూలై 4 వరకు వారాహి నవ రాత్రులు, జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఆషాఢ మాసోత్సవాలు.. అమ్మవారికి సారె ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్నాటకల నుంచి కూడా భక్తులు దుర్గమ్మకు సారె సమర్పిస్తారు. నెల రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. మూలవిరాట్ దర్శనానంతరం ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు. గుప్త నవరాత్రులుఆషాఢంలో దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 26 నుంచి జూలై 4వ తేదీ వరకు వారాహి నవరాత్రులు (గుప్త నవరాత్రులు) నిర్వహిస్తారు. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై ఆలయ వైదిక కమిటీ, అర్చకులు ఈవోతో చర్చించారు. శాకంబరీదేవి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారి మూలవిరాట్తో పాటు ఉపాలయాల్లో దేవతామూర్తులు, ఆలయ ప్రాంగణాన్ని కాయగూరలు, ఆకుకూరలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసే కదంబం ప్రసాదం శాకంబరీదేవి ఉత్సవాల ప్రత్యేకత. చదవండి: Today recipes : బ్రెడ్తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?వైదిక కమిటీ, అర్చకులతో ఈవో సమీక్ష దుర్గగుడిలో ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్ శుక్రవారం ఆలయ వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు, ఆలయ ఏఈవో, ఫెస్టివల్ విభాగంతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అమ్మవారి దర్శనంలో ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థ్ధానంపై ఉందని ఆలయ అధికారులతో పేర్కొన్నారు. దర్శన వేళలు, రద్దీ సమయాల్లో వ్యవహరించాల్సిన విధానాలు, ప్రస్తుతం అమలులో ఉన్న వీఐపీ ప్రత్యేక బ్రేక్ దర్శన వేళలు వంటి అంశాలను చర్చించారు. సమీక్షలో ఈఈ కోటేశ్వరరావు, వైదిక కమిటీ సభ్యులు శ్యావాశ్వ మహర్షి, సీహెచ్ ఆంజనేయ ఘనాపాటి, ప్రధాన అర్చకుడు ఎల్. దుర్గాప్రసాద్, ఉప ప్రధానఅర్చకులు కోట ప్రసాద్, ఏఈవో ఎన్. రమేష్బాబు, బి. వెంకటరెడ్డి, వన్టౌన్ సీఐ గురుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్ -
కాశీ తర్వాత కందూరే!
కందూరు రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ కల్ప వృక్షాలు ఉండటమే ఇందుకు ప్రత్యేక కారణం. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం కందూరు సమీపంలోని రామలింగేశ్వరాలయం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. కాశీ తర్వాత కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నాయని పురాణం చెబుతోంది. ఈ కల్ప వృక్షాలకు ఓ ప్రత్యేకత ఉంది. వృక్షాల కింద వంటలు చేసి, అందులో కొంత ఇతరులకు దానం చేసి కల్పవృక్షాల కిందే భోజనాలు చేసి నిద్రిస్తే కోరిన కోర్కెలు, గృహబాధలు, రోగాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.కల్పవృక్షాలు ఉండటమే ప్రత్యేకత కల్పవృక్షాలు (కబంధ) కాశీ తర్వాత కందూరులోనే కొలువయ్యాయని చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో ఉంది. ఈ ఆలయం వద్ద ఓ విశిష్టత ఉంది. ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 27 కల్పవృక్షాలు ఉండటమే ప్రత్యేకత. ఆకాశంలో ఉండే 27 నక్షత్రాలకు ప్రతీకగా ఆలయం పక్కనున్న కోనేరు చుట్టూ 27 కల్పవృక్షాలు ఉన్నాయి. చాలామంది ఆలయం వద్ద ఉన్న కల్పవృక్షాల వేర్లను తీసుకెళ్లి నాటినా అవి పెరగలేదు. ఆలయం వెలిసిన నాటి నుంచి ఇక్కడ 27 కల్పవృక్షాలే ఉండటం అరుదైన విశేషంగా భక్తులు భావిస్తారు. అందుకే కందూరుకు వెళ్తే కాశీకి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రచారకర్తగా ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి వ్యవహరిస్తున్నారు.తంబళి వంశ మహిళతో.. కందూరు సమీపంలోని గుట్టపై పూర్వం రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది. గుట్టపై కొలువైన రామలింగేశ్వరుడిని తంబళి వంశానికి చెందిన మహిళ రోజూ గుట్టపైకి ఎక్కి దర్శించుకునేది. కాలక్రమేణా ఆమె గర్భిణి కావడంతో రోజూ గుట్ట ఎక్కడం ఆమె వల్ల కాలేదు. ప్రతిరోజు గుట్ట ఎక్కి మిమ్మల్ని దర్శించుకోవడం నావల్ల కాదు.. మళ్లీ ఎప్పుడు దర్శించుకుంటానో ఏమోనని స్వామితో మొరపెట్టుకుంది. వెంటనే అక్కడ ప్రత్యక్షమైన రామలింగేశ్వరస్వామి నీవు రాలేకుంటే నేనే నీవెంట వస్తాను.. వెనుదిరిగి చూడకుండా గుట్ట దిగి వెళ్లు అని ఆమెతో చెప్పాడు. వెంటనే ఆ మహిళ గుట్ట దిగడం ఆరంభించింది.రథంపై రామలింగేశ్వరస్వామి గుట్ట దిగుతున్న సమయంలో రథచక్రాలు, గంటల శబ్దాలకు ఆమె భయపడి వెనుదిరిగి చూసింది. దీంతో రథచక్రాలు విరిగి ఒకటి కోనేరులో పడిపోయింది. రెండోది లింగాకృతి దాల్చి రామలింగేశ్వరుడి పీఠంగా ఏర్పడిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ మహిళ శిలగా రూపాంతరం చెందింది. ఆమె శిలావిగ్రహం నేటికీ గర్భగుడిలో ఉంది. ప్రస్తుతం స్వామివారికి పానవట్టం లేదు. రథచక్రమే పానవట్టంగా మారడమే ఈ క్షేత్ర మహిమ.చదవండి: అడవే ఆధారం.. బతుకు భారం -
మోస్ట్ వ్యూడ్ వీడియో.. 460 కోట్లు
స్థానిక కళాకారులతో కలిసి పాటల కచేరి నిర్వహించినా, అంతర్జాతీయ వేదికలపై ఆడిపాడినా హరిహరన్ (Hariharan) గళానికి ఉన్న ప్రత్యేకత వేరు. తాజా విషయానికి వస్తే...ఈ ప్రముఖ గాయకుడు పాడిన ‘హనుమాన్ చాలీసా’ (Hanuman Chalisa) యూట్యూబ్లో( Youtube) ‘మోస్ట్ వ్యూడ్ వీడియో’గా నిలిచింది. 4.6 బిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. ‘ఊహించని స్పందన ఇది. ఎక్కడకు వెళ్లినా హనుమాన్ చాలీసా గురించే మాట్లాడుతున్నారు’ అంటున్నాడు హరిహరన్.జీమ్యూజిక్కు రెడ్ డైమండ్ ప్లే బటన్మన దేశంలోని టాప్ మ్యూజిక్ లేబుల్స్లో ‘జీ మ్యూజిక్ కంపెనీ’ ఒకటి. తాజా విషయానికి వస్తే... యూట్యూబ్లో 100 మిలియన్ సబ్స్క్రైబర్లతో ‘వావ్’ అనిపించింది. యూట్యూబ్ వారి ప్రతిష్ఠాత్మకమైన ‘రెడ్ డైమండ్ ప్లే బటన్’ను సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ అందుకున్న ప్రపంచంలోని రెండో మ్యూజిక్ లేబుల్... జీ మ్యూజిక్. దశాబ్దం క్రితం ప్రారంభమైన ‘జీ మ్యూజిక్’ ఇండియన్ మ్యూజిక్ మార్కెట్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.మోస్ట్ వ్యూడ్ వీడియో.ఇవీ చదవండి: Anjana Sri రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
Solar Plexus: మణి పుర చక్రం అంటే ఏంటి?
గతవారం మొదటి రెండుపొరల గురించి చెప్పుకున్నాం కదా.. ఈ వారం మూడవ చక్రం నాభి లేదా మణిపుర చక్రం గురించి... మీరు మంచి ఆహారాన్ని తిన్నపుడు మీకు కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆకలితో ఉన్నట్లైతే మీరు ధ్యానంలో కూడా సరిగా కూర్చోలేరు, ఆనందించలేరు. భగవంతుడు మీ ఎదురుగా ఉన్నా కూడా ‘‘ఓ దేవుడా! మొదటగా నా కడుపు నింపు. నేను నీతో తర్వాత మాట్లాడతాను’’ అని అంటారు. ఆకలితో ఉన్నప్పుడు మనం ఆహారాన్ని తింటున్నప్పుడు కలిగే ఆనందాన్ని వర్ణించలేం. నాభి ఈ ఆనందం కూడా చాలా తాత్కాలికం. అలా సంపూర్ణంగా ఆనందించగలిగితే మీరు మరల మరల కావాలని కోరుకోరు. దానిని అధిగమించడానికి సంతృప్తి ఒక్కటే మార్గం. రెండు ముద్దలు తిన్నా సరే మీరు సంతృప్తి చెందాలి. సంతృప్తితో ఉండటమే మీరు నాభి చక్రాన్ని సరిచేసుకునే మార్గం. మీ వస్తుసంబంధమైన కోరికలకు అంతులేదు. ఎన్ని వస్తువులు ఉన్నా కానీ ఇంకా కావాలనుకుంటారు. కానీ దేనినీ ఆనందించలేరు.. దాని వల్ల నాభి చక్రం అలజడికి లోనవుతుంది. దీనిని అరికట్టే మార్గం నాభి చక్రం సంతృప్తి. ప్రతి విషయంలోనూ మీరు సంతృప్తిని కలిగి ఉండాలి. కాబట్టి ఆనందించడానికి సంతృప్తి ఒకటే మార్గం. ఇది నిత్య ధ్యానసాధన ద్వారా మనలో శ్రీ లక్ష్మీనారాయణ శక్తిని జాగృతి చేసుకో గలగడం ద్వారా సాధ్యపడుతుంది. సంతృప్తి అనేది ఆత్మ సాక్షాత్కారం లేకుండా సాధ్యం కాదు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం ΄÷ందకుండా మీరు సంతృప్తిని కలిగి ఉండాలని చెపితే అది ఏదో ఒక ఉపదేశంలాగానే ఉంటుంది. కానీ ఆత్మ సాక్షాత్కారం ΄÷ందిన తరువాత మీ ఆత్మని ఏది సంతృప్తి పరుస్తుందో మీకు తెలుస్తుంది. కాబట్టి మీ ప్రాముఖ్యతలు మారతాయి. ఇదీ చదవండి: ప్రేమించే వ్యక్తి.. ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉత్తమం! ఎలా? -డా. పి. రాకేష్(మన అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థ గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనం ఆధారంగా) -
ఏ సమయంలో ఏ దేవుణ్ణి పూజించాలి?
సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుని, దుర్గను పూజించిన మంచి ఫలం కలుగుతుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువును సాయంత్రం మూడుగంటలకు పూజించిన మంచి ఫలితం కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేళ. రాత్రి ఆరు నుంచి తొమ్మిదివరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణా కటాక్షాలు లభిస్తాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహావిష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.చదవండి: Murudeshwar Temple Facts: కోరిక కోర్కెలు తీర్చే పరమ పావన క్షేత్రంబౌద్ధవాణి : ఆ గౌరవం అనుభవానికే..! ఒక అడవిలో ఏనుగు, కోతి, తిత్తిరి పిట్ట స్నేహంగా జీవిస్తున్నాయి. ప్రతిరోజూ మూడూ ఒకచోట చేరి సాధక బాధలు చెప్పుకునేవి. తాము గడించిన అనుభవాలు పంచుకునేవి. ఒకరోజున వాటికి ఒక ఆలోచన వచ్చింది. మన ముగ్గురిలో జ్ఞానులు ఎవరు? పెద్ద ఎవరు? పెద్దవారు ఎవరైతే వారికి మిగిలిన ఇద్దరూ నమస్కరించాలి. గౌరవించాలి’’ అని అనుకున్నాయి. అప్పుడు ఏనుగు– ‘‘మీ ఇద్దరికంటే నేనే పెద్దను. గౌరవనీయుడను. ఎందుకంటే ఇదిగో ఈ మర్రిచెట్టు ఇప్పుడు మహావృక్షంగా ఉంది. కానీ ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడే నాకు తెలుసు. నేను ఆ మొక్క మీదినుండి నడిచి΄ోయేవాణ్ణి. అప్పుడు దాని చివరి కొమ్మలు నా పొట్టకు తాకుతూ ఉండేవి’’ అని చెప్పింది. ఆ మాటలు విన్న కోతి– ‘‘ఓ! మిత్రమా! అలాగా! ఐతే విను. ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పటినుంచే నాకు తెలుసు. నేను కూర్చొని దీని చిగుర్లు తినేదాన్ని. కాబట్టి నేనే పెద్దను. నన్నే గౌరవించాలి’’ అంది. ఆ రెండింటి మాటలు విన్న తిత్తిరి పిట్ట నవ్వుతూ– ‘‘మిత్రులారా! ఈ చెట్టుకు తల్లి వృక్షం నదీతీరం ఆవల గట్టున ఉంది. దాని కాయలు తిని, ఇటుగా వచ్చి ఇక్కడ రెట్ట వేశాను. అందులోని విత్తనమే ఈ చెట్టుగా మొలిచింది’’అంది. మిగిలిన రెండూ ఆశ్చర్యపడి– ‘‘మిత్రమా! మా ఇద్దరికీ ఈ ఒక్క చెట్టే తెలుసు. నీకు ఈ చెట్టు, దాని ముందరి తరం చెట్టూ తెలుసు. తరతరాల అనుభవం నీది. కాబట్టి నీవే గౌరవనీయుడవు’’అని తిత్తిరికి నమస్కరించాయి. బుద్ధుడీ కథ చెప్పి– ‘‘భిక్షువులారా! పెద్దల్ని మనం అందుకే గౌరవించాలి. మనం వారికి ఇచ్చే గౌరవం వారి వయస్సుకే కాదు, అనుభవానికి’’ అని చెప్పాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ -
Murudeshwar కోరిన కోర్కెలు తీర్చే పరమ పావన క్షేత్రం
పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్ (Murudeshwar temple). ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ స్వామిని పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ తాలూకాలో. రావణాసురుడు తన అనన్యసామాన్యమైన భక్తితో శివుని మెప్పించి, కైలాసం నుంచి ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని వస్తుంటాడు. రావణాసురుడి చేతికి శివుడి ఆత్మలింగం చిక్కితే, అతను దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఇక రావణుని అకృత్యాలకు అడ్డుకట్ట వేయగలవారే ఉండరనే ఉద్దేశ్యంతో దేవతల కోరికమేరకు వినాయకుడు ఒక పిల్లవాడి రూపంలో వస్తాడు. సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రావణుడు, ఆత్మలింగాన్ని తన చేతిలో పెట్టేముందు దానిని మార్గమధ్యంలో భూమిమీద ఎక్కడా ఉంచకూడదని శివుడు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్న రావణుడి కంట పడతాడు బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణపతి. కాసేపు శివలింగాన్ని చేతితో పట్టుకుని ఉంటే, తాను స్నానసంధ్యలు ముగించుకుని వస్తానని చెప్పి వెళతాడు రావణుడు. పథకం ప్రకారం, రావణుడు వచ్చేలోగా శివలింగాన్ని నేలమీద పెట్టేస్తాడా బాలుడు. ఇంకేముంది, శివలింగం భూమిలో దిగబడిపోతుంది. రావణుడు ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. అప్పుడు రావణుడు ఆగ్రహంతో ఆత్మలింగానికి కప్పి ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరి పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులపాదధూళి పడి పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్. చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ స్వామిని పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ తాలూకాలో పారేస్తాడు. ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో, అక్కడ శివలింగాలు ఉద్భవించి, ఆ ప్రదేశాలు మహిమాన్విత ప్రదేశాలుగా మారిపోయాయి. అవే, గోకర్ణక్షేత్రానికి దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వర లింగాలు. ఈ క్షేత్రాలన్నీ కలిపి పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరమయింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది మురుడేశ్వరక్షేత్రమయిందని అంటారు. మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానవట్టాన్ని దేవశిల్పి విశ్వకర్మను రప్పించి, శివుడే స్వయంగా దగ్గరుండి తయారు చేయించాడని ప్రతీతి. ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీమాత, తూర్పున దుర్గామాత, ఇతర దేవతలందరూ మిగిలిన దిక్కులలో ఉండి పరిరక్షిస్తూ ఉంటారని, బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పూలు, పత్రాలతో పూజించి, పండ్లను నివేదించి వెళుతుంటాడని, బ్రహ్మదేవుడు శివుడిపై తన కమండలంతో చిలకరించిన నీటితో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సు ఏర్పడిందనీ స్థలపురాణం చెబుతోంది. .అనితర సాధ్యమైన శిల్పసౌందర్యం... మురుడేశ్వర దేవాలయం ఆ కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, అద్భుత శిల్పసౌందర్యానికి నిదర్శనం. మురుడేశ్వర దేవాలయం ఆవర ణంలో కనిపించే శివుని ఎత్తైన పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది. 123 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించడానికి రెండేళ్ల పట్టిందట. 20 అంతస్థులతో కూడిన ఆలయ గాలిగోపురం సుమారు 250 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాలిగోపురానికి ఇరుపక్కలా గల ఏనుగు ప్రతిమలు సజీవ శిల్పాల్లా కనిపిస్తాయి.తీర్థేశ్వరం కూడా... మురుడేశ్వరంలో పవిత్ర స్నానాలు చేయడానికి బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అనే ముఖ్యమైన తీర్థాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేయడం వల్ల దీర్ఘవ్యాధులు నశిస్తాయని, కోరిన కోరికలు నెరవేరతాయనీ అంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఇతర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమైనవి. ఆలయం ఆవరణలో ఉన్న రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలను నెరవేర్చమని భక్తులు ముడుపులు కడుతుంటారు. ఎలా వెళ్లాలంటే..? గోకర్ణం నుంచి మురుడేశ్వరం సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురుడేశ్వరం 17వ నంబరు జాతీయ రహదారిలో ఉండటం వల్ల రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. బెంగళూరు, మంగుళూరు, హుబ్లీ, ధర్మస్థల నగరాలనుంచి బస్సులున్నాయి. నేరుగా రైలు సౌకర్యం కూడా ఉంది. భోజన, వసతి: ఇక్కడ యాత్రీకులు ఉండటానికి వసతి గృహాలు, హోటళ్లు ఉన్నాయి. – డి.వి.ఆర్. భాస్కర్ -
భక్తి... త్యాగాల సమ్మేళనం ఈదుల్ అజ్ హా
ప్రతి విశ్వాసికి జీవితంలో తీపి గుర్తులుగా నిలిచి΄ోయే సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో పండుగలు కూడా ఒకటి. ఇస్లామ్ జీవన విధానంలో ముస్లింలు రెండు పండుగలు జరుపుకుంటారు. ఒకటి ఈదుల్ ఫిత్ర్ /రమజాన్, రెండవది ఈదుల్ అజ్ హా/బక్రీద్. ఈదె ఖుర్బాన్ గా పిలువబడే ఈ బక్రీద్ పర్వదినం చరిత్రలో ఒక విశిష్ట స్థానం దక్కించుకుంది. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఇది భక్తి, త్యాగం, ప్రేమ, సహనం, సమానత్వం, మానవతా విలువల ఉత్కృష్ట రూపం. ఈద్ మూలసారాన్ని అర్థం చేసుకోవాలంటే, దాని చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసుకోవాలి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను దైవం పరీక్షించాడు. పరీక్షలో భాగంగా తన కుమారుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను త్యాగం చేయమని ఆదేశించాడు. దైవాదేశాన్ని విన్న మరుక్షణం ఆయన ఎలాంటి తడబాటు లేకుండా అంగీకరించారు. కుమారుణ్ని కూడా సంప్రదించారు. ఇది దేవుని ఆజ్ఞ అని అర్థమై, తండ్రికి సహకరించేందుకు సిద్ధపడ్డాడు కుమారుడు. ఇదే సమయంలో దైవం వారి నిబద్ధతను మన్నించి, వారి త్యాగానికి బదులుగా ఒక గొర్రె పొట్టేలును పంపించి, వారిని పరీక్షనుండి సురక్షితం గావించాడు. నిజాయితీ, భక్తి తత్పరత, నిబద్ధత, త్యాగనిరతి లాంటి సుగుణాలన్నీ ఎటువంటి కఠిన పరీక్షలనుంచయినా సురక్షితంగా బయట పడేయగలవని ఈ సంఘటన రుజువు చేస్తోంది.ఈ ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ముస్లింలు ఈదుల్ అజ్ హా/బక్రీద్ జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం ఒక జంతువును త్యాగం చేయడం మాత్రమే కాదు. అది మన మనస్సులోని స్వార్థాన్ని, లోభాన్ని, అహంకారాన్ని త్యాగం చేయడం కూడా! మనం చేసే ఈ త్యాగం తాలూకు భక్తి శ్రద్ధలు అంటే తఖ్వా మాత్రమే దైవం చూస్తాడు, స్వీకరిస్తాడు. రక్త మాంసాలతో ఆయనకు సంబంధంలేదు. అవసరమైతే ధర్మం కోసం, న్యాయం కోసం నాప్రాణమైనా ఇస్తాను అనే స్పష్టమైన సంకేతం ఇందులో ఉంది. ఈ విషయం ఖురాన్లో ఇలా ఉంది: నా నమాజు, నా త్యాగం (నుసుక్), నా జీవితం, నా మరణం సమస్తమూ సర్వలోక పాలకుడైన దైవానికే.(పవిత్ర ఖురాన్ 6:162)’అల్లాహ్ వద్దకు మాంసం గాని, రక్తం గాని చేరవు; ఆయనకు చేరేది మీ తఖ్వా మాత్రమే’ (పవిత్ర ఖురాన్ , సూరె హజ్ : 37) ఈద్ పర్వదినాన్ని మనం ఎలా గడిపితే అది దైవానికి ఆమోదయోగ్యమవుతుందో ఆ దిశగా ప్రతి విశ్వాసి ప్రయాణం సాగాలి. త్యాగం, భక్తి, ప్రేమ, వినయం, క్షమ, సహనం, మానవత ఇవే ఈ పండుగకు మూల సారాంశం. మన తలుపు తట్టే ప్రతి అవసరమున్న హృదయాన్ని తాకే రోజు ఈదుల్ అజ్ హా కావాలి. మనం చేసే త్యాగం దైవానికి చేరాలంటే అది హృదయ పూర్వకమైనదిగా, తఖ్వాతో కూడినదై ఉండాలి.హృదయాన్ని తాకే సందేశంఈ పర్వదినాన మాంసాన్ని పంచుకోవడం కూడా ఒక విశేషమైన సంప్రదాయం. పేదలకు, బంధువులకు, సొంత కుటుంబానికి ఈ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి పంచడం వల్ల పరస్పర మానవ సంబంధాలు బలపడతాయి. ఇది ఒక ఆచారమే కాదు, ఒక సాంఘిక బాధ్యత కూడా.ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారి ప్రవచనం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది: ‘తను కడుపునిండా అన్నం తిని, తన పొరుగువాడు పస్తు ఉన్నట్లయితే, అలాంటి వ్యక్తి మోమిన్ (విశ్వాసి) కాలేడు. (ముస్త్రదక్ అల్ హాకీం, 7303) ఈ హదీసు మనకు బోధించేది, మనకు తెలిసేది ఏమిటంటే ఈద్ పర్వదినం సందర్భంగా సంతోషం కేవలం మన ఇంట్లో మాత్రమే కాదు, మన చుట్టుపక్కల వారిని కూడా మన సంతోషంలో భాగస్వాములను చేయాలి. అదే నిజమైన ఆధ్యాత్మికత. అదే నిజమైన మానవత. అలాగే, ఈద్ సందర్భంగా త్యాగం అంటే, కేవలం మాంసం పంచడం మాత్రమే కాదు, మన అవసరాలను కొంతవరకు నియంత్రించుకొని, పేదసాదల పట్ల కరుణతో, సేవాభావంతో వ్యవహరించాలి. నిజమైన త్యాగం అంటే పండుగ, పండుగ తర్వాతి కాలంలోనూ మన ప్రవర్తనలో మార్పు కనిపించాలి. మన వ్యక్తిత్వంలో, మన ఇంట్లో, మన కుటుంబంలో, మన సమాజంలో పరిశుభ్రత, నైతికత పరిఢవిల్లాలి. ముఖ్యంగా ఈద్ రోజున మనం ఇరుగు, పొరుగును పలకరించాలి. కులమతాలు వేరయినా, మానవతా సంబంధాల పరంగా మనమంతా ఒక్కటే. పరస్పరం సోదర సంబంధమే. ఈ ఐక్యతను చాటాలి. ఈద్ ఒక ఇస్లాంకు సంబంధించిన పండుగ అయినా, దాని సందేశం విశ్వమానవీయంగా ఉంది. ప్రతి హృదయాన్ని తాకే విధంగా ఉంది. దీన్ని మత విభేదాల్ని చెరిపి, మానవతను సమీకరించే రోజుగా మార్చుకోవాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Sri Rama తిరిగి రా, స్వామీ!
‘లోక హితం కోసం నేను శ్రీరాముడిగా మానవ అవతారంలో జన్మిస్తాను. లోక కంటకుడయిన రావణాసురుడిని వధిస్తాను. ఆ తరవాత పదకొండు వేల సంవత్సరాలు భూలోకంలోనే ఉండి రాజ్యం చేస్తాను’ అని శ్రీహరి బ్రహ్మాది దేవతలకు వాగ్దానం చేయటం రామాయణం బాలకాండ ఆరంభంలో కనిపిస్తుంది. అలా మానవ రూపంలో జన్మనెత్తిన తరువాత, శ్రీరాముడు ‘నేను భగవదవతా రాన్ని!’ అని ఎక్కడా చెప్పలేదు. తనను తాను మానవమాత్రుడిగానే భావించుకొని, ధర్మమూర్తిలా జీవించాడు. దేవతల కిచ్చిన వాగ్దానం ప్రకారం లంకేశ్వరుడిని వధించాడు. పదకొండు వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా రామరాజ్యాన్ని సాగించాడు. ఆయన భూలోకంలో ఉన్నంత కాలం భూమి మీది ప్రజలు చల్లగా, సుఖంగా ఉన్నారు. కానీ హరి తమకు దూరమవడంతో, దేవతలకు మాత్రం ఆ కాలమంతా క్షణమొక యుగంగా గడిచింది. అనుకొన్న పదకొండు వేల సంవత్సరాల అవధి పూర్తి కాగానే, బ్రహ్మదేవుడు కాలపురుషుడిని తన దూతగా శ్రీరాముడి దగ్గరకు పంపాడు. ఆయన సందేశం ఇది: ‘దేవా! నువ్వు వైకుంఠానికి తిరిగి రావలసిన సమయం వచ్చిందని సవినయంగా గుర్తు చేస్తున్నాను. అయినా మరికొంత కాలం భూలోకంలో ఉండాలని నీకు అనిపిస్తే అలాగే చేయి. లేక ముందు అనుకొన్న ప్రకారం తిరిగి వస్తావా, దేవతలందరూ నీ రాకతో మరింత నిశ్చింతగా జీవించ గలుగుతారు. నిర్ణయం నీది!’ మానవావతారంలో ఉన్న మాధవుడు ‘నేను ఇన్నాళ్ళుగా ఇక్కడ ఉన్నది త్రిలోక క్షేమ కారణమయిన పని మీద! అది పూర్తయింది. కాబట్టి నా వశవర్తులుగా నడుచుకొనే దేవతా గణానికి, ఎప్పటిలాగే అన్ని విష యాలలోనూ అండగా ఉండటం నా కర్తవ్యం. త్వరలోనే నేను తిరిగి వస్తున్నాను’ అని సమాధానం పంపాడు. తరవాత కొద్ది కాలానికే రామావతారం చాలించి, పరంధామానికి తిరిగి వెళ్ళాడు. రామావతార సమాప్తి గురించిన ఆసక్తికరమైన వృత్తాంతం రామాయణం ఉత్తరకాండలో కనిపిస్తుంది.–ఎం. మారుతి శాస్త్రి -
నాకే ఇన్ని కష్టాలా...? అంతా మన వల్లే.. !
భక్తుడు తన జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది!!... భగవంతుడు తనకు సన్నిహితంగా ఉన్నవారిని అనేక రకాలుగా పరీక్షిస్తుంటాడు!!... ’కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు... ఇవన్నీ ఆ పరీక్షలో భాగాలే! వాటిని ఒకటి తరువాత మరొకటి ఇస్తూ ఉంటాడు ‘నన్ను అట్టే అంటిపెట్టుకుని ఉంటాడా! లేదా విసుగుతో నన్ను దూరం చేసుకుంటాడా?’ అని అయన చూస్తూ ఉంటాడు!!... ఒకసారి పరీక్షలో ఉత్తీర్ణులం అయ్యాక మరొక పరీక్ష ఉండటం... లేకపోవడం ఆయన ఇష్టం...!కానీ ఒకసారి విఫలం అయ్యాక మాత్రం మళ్ళీ పరీక్ష పెట్టడం జరగదు! ఎందుకంటే అప్పటికే మన సామర్థ్యం అయనకు తెలిసిపోతుంది కనుక, ఈ విషయం మనం చక్కగా గ్రహించి కష్ట నష్టాలు వచ్చినపుడు దైవాన్ని నిందించక, మరువక, విడువక ఆయనపై విశ్వాసంతో సహనం వహించాలి. అప్పుడే అయన తన అనుగ్రహాన్ని పుష్కలంగా అందిస్తాడు!!...ఎలా వచ్చిన కష్ట నష్టాలు అలా పోతాయి. అయితే మన విశ్వాసం, సహనం ఎలా ఉండాలంటే పరీక్ష పెట్టీ పెట్టీ ఆయనే విసుగు చెందిపోవాలి...అంతేకానీ నేను రోజూ పూజలు, అభిషేకాలు చేస్తున్నాను, నాకు ఈ పని కావాలి, ఆ పని జరగాలి, లేకపోతే ఎందుకు అని అనుకోరాదు. అంతా బాగున్నప్పుడు అదంతా మన వల్లే అనుకుని పొంగిపోయి, సౌఖ్యాలు కలుగనపుడు మాత్రం దైవాన్ని నిందించటం తగదు, దానికంటె మనలో విశ్వాస లోపం ఎక్కడైనా ఉందేమో చూసుకోవాలి. ఇదీ చదవండి: ప్రేమించే వ్యక్తి.. ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉత్తమం! ఎలా?కొన్నిసార్లు అంతా బాగానే ఉన్నట్లు అనిపించవచ్చును, కానీ ఎక్కడో ఏదో మూలన చిన్న సందేహం మిగిలిపోయిందేమో అని చూసుకోవాలి. పాత్రలో నీరంతా బయటకు పోవడానికి పాత్రంత రంధ్రం అవసరం లేదు... చిన్న రంధ్రం ఉంటే చాలు పాత్రలో నీరంతా బయటకు పోవడానికి, కనుక ఆ చిన్న రంధ్రం ఎక్కడుందో కనుక్కుని దానిని మూసివేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నిందిస్తూ కూర్చోకూడదు. దైవనింద వల్ల మరింత పాపం చుట్టుకుంటుంది తప్ప సమస్యలు తీరిపోవు! విశ్వాసమే అసలైన పరిష్కారాన్ని ఇస్తుంది.చదవండి: Bakrid 2025 త్యాగాల పండుగ : ‘తఖ్వా’ అంటే.. -
ప్రేమించే వ్యక్తి.. ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉత్తమం! ఎలా?
అంతర్ముఖ ప్రేమానందం: భగవంతుడంటే ప్రేమ అని మనం ఎన్నోసార్లు విన్నాం. ప్రేమ అంటే ఏమిటో ఎందరో అవతార మూర్తులు, అవతార పురుషులు వారి వారి మార్గాలలో విశదీకరించారు. దానిని ఎంతగా వర్ణించి విశదీకరించినప్పటికీ ప్రేమను అనుభూతి చెందకుండా దాని ఆనందాన్ని పొందలేరు. ఆ ప్రేమను అనుభూతి చెందడం, దానిని అర్థం చేసుకోవడమే ఉత్తమమైన మార్గం. మనలో ఆ ప్రేమను ఆస్వాదించి ప్రకటించగల యంత్రాంగాన్ని భగవంతుడే మనలో పొందుపరిచాడు. ఇది మనలో ఉన్న మిక్కిలి సూక్షమైన, సున్నితమైన యంత్రాంగం. అటువంటి ప్రేమప్రకాశమే ఆనందం. మిగిలినది ఏదీ మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. హృదయాల్లో అనుభూతి చెందుతున్న ప్రేమ మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలదు. కాబట్టి ఒక ప్రేమించే వ్యక్తి ఒక ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉన్నతుడు.మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థ లేక యంత్రాంగం మనలో ఏడు పొరలుగా పనిచేస్తుంది. ఈ పొరల ఉపరితలం మీద ఆనంద తరంగాలు ఉప్పొంగి మెదడు అనే ఒడ్డుకు చేరుకొని ఆనందమనే బుడగలుగా ఏర్పడతాయి. కాని అక్కడ మన మెదడు హేతుబద్ధమైన శిలలా ఉంటే ఈ బుడగలు ఎందుకూ పనికి రాకుండా కరిగిపోయి ఆ రాయి మీద ఏ ప్రభావాన్నీ చూపలేవు. ఈ ఏడు పొరలే మనలోని శక్తి కేంద్రాలు. వాటినే చక్రాలు అని అంటాము. అదే మన శరీరంలో మన కంటికి కనపడని కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఇప్పుడు మనలోని ఈ అంతర్గత సూక్ష్మ వ్యవస్థ లోని ఈ శక్తికేంద్రాలను గురించి కొంత విశదంగా తెలుసుకుందాం. మొదటిది మూలాధార చక్రం మొట్టమొదటి శక్తి కేంద్రమైన మూలాధార చక్రం మనలోని విసర్జనావయవాల మీద ప్రభావం చూపుతుంది. మనలో విసర్జనప్రక్రియ సరిగా జరిగినపుడు మనం ఎంతో ఉపశమనం పొందుతాం. ఇది చాలా ప్రాథమికమైన విషయం. అయితే ఆ ఉపశమనం మనకి ఒక రకమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇది చాలా స్థూలమైన చిన్న విషయంగా చెప్పబడుతుంది కానీ ఆ ఆనందం పొందడం చాలా ముఖ్యమైనది. కానీ ఈ ఆనందం మిగిలిన ఎన్నో లోతైన, సున్నితమైన వాటివలన కలిగే ఆనందాన్ని అధిగమించకుండా ఉండాలంటే మనం అ స్వచ్ఛతను కలిగి ఉండాలి. అదే మనలో వుండాల్సిన మొట్టమొదటి గుణం. స్వచ్ఛత అనేది ఎవరిలోనైనా కావాలనుకుంటే వచ్చేది కాదు. అది అంతర్గతంగా నిర్మితమై ఉండాలి. కానీ సహజయోగ సాధనతో మూలాధారాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా స్వచ్ఛతను వృద్ధి చేసుకోవచ్చు. స్వాధిష్టాన చక్రంఇక రెండవ పొర సృజనాత్మకత వలన కలిగే ఆనందం. అదే స్వాధిష్టాన చక్రం. కొంతమంది దేనినైనా సృష్టించాలని చాలా ఆరాట పడుతూంటారు. ఏదో ఒక పుస్తకాన్నో, లేక ఏదైనా కళాత్మకమైన దాన్నో సృష్టించడం చాలా ముఖ్యమని వారు అనుకుంటారు. ఈ సృజనాత్మకతకు కనుక హేతుబద్ధమైన మెదడు తోడైతే అప్పుడు అలాంటి వారు తామే అందరికన్నా గొప్పవారమని గర్వపడుతూ వుంటారు. ఎందు చేతనంటే వారు తాము చేసే పనులన్నింటి సత్ఫలితాలు వస్తున్నాయని, తన గొప్పతనం వలననే విజయం చేకూరుతోందని భావిస్తారు. ప్రతిదాన్నీ హేతువాదంతో చూస్తారు. అయితే అది సరైన ఆలోచన కాదు. ఈ రెండవపొరని అధిగమించాలంటే నిర్విచార స్థితిలోనికి వెళ్ళాలి. మీ అవగాహన ప్రకాశవంతమైనపుడు మీరు నిర్విచార స్థితిలోకి వెళతారు. అపుడు మీరు ఏమి సృష్టించినా దానిని కేవలం గమనిస్తారంతే. నిర్విచారమైన ఎరుకలో మీరు దేన్ని చూసినా, ఏమి సృష్టించినా దాన్ని ఆనందించ గలుగుతారు. ఎటువంటి ఆలోచనలూ లేని స్థితికి వెళతారు. ఈ గుణం మనలోనే వున్న శ్రీ బ్రహ్మ దేవ సరస్వతి తత్త్వాన్ని జాగృత పరచడం వల్లే సాధ్యమవుతుంది. – డా. పి. రాకేష్(అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థ గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనం ఆధారంగా) -
Bakrid 2025 త్యాగాల పండుగ : ‘తఖ్వా’ అంటే..
సాధారణంగా పండుగలంటే తిని తాగి, భౌతికంగా పొందే తాత్కాలిక సంతోషం అనుకుంటారు. కాని అదొక అద్వితీయమైన, అనిర్వచనీయమైన, అలౌకిక ఆత్మానందం. రమజాన్ తరువాత బక్రీద్ రూపంలో మరో అద్భుత అవకాశం మనల్ని వరించింది. దీన్నిసద్వినియోగం చేసుకోవాలి. పుణ్యకార్యాలు ఆచరించి అత్యంత శ్రేష్ఠ సామగ్రి అయిన ‘తఖ్వా’(దైవభీతి)ను హృదయాల్లో ప్రతిష్టించుకోవాలి. జీవితం సార్ధకం కావాలంటే పరమ ప్రభువు ఆదేశాలను తు. చ. తప్పక పాటించాలి. అందుకే పరమ దయాళువైన అల్లాహ్ మనకోసం కొన్ని వసంత రుతువుల్ని ప్రసాదించాడు. అందుకని ఈ రుతువులో కరుణామయుని దయను పొందే నిమిత్తం కష్టపడాలి. వీలయినన్ని ఆరాధనలు చేయాలి. నఫిల్ ఉపవాసాలు పాటించాలి. ముఖ్యంగా ‘అరఫా’ రోజా పాటించాలి. దానధర్మాలు చేయాలి. అల్లాహ్ ప్రీతిని, ప్రసన్నతను పొందే ప్రయత్నం చేయాలి. నిజానికి జిల్ హజ్ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రాహీమ్ , హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా సమాజంతో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘంగురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది పండుగ.ప్రతి ఒక్కరూ తమస్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ‘హజ్ ’యాత్రకు వెళతారు. అంతటి స్థోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. అదికూడా లేనివారు రెండు రకతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన అల్లాహ్ హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. మంచికోసం మానవ సంక్షేమం కోసం, ధర్మంకోసం, ధర్మసంస్ఢాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఇందులో ఉంది.(శనివారం బక్రీద్ పర్వదినం సందర్భంగా...) -
Chitrakoot చరిత్ర చెక్కిన రామాయణం.. అడుగడుగునా విశేషమే!
మధ్యప్రదేశ్లోని సత్నాజిల్లాలో గల చిత్రకూటం ప్రకృతి సౌందర్యానికే కాదు... ఎందరో పురుషుల తపోదీక్షకు కేంద్రంగా ఉంది. అత్రి, అనసూయ, మార్కండేయుడు వంటి మునిపుంగవులు, గురువులకే గురువు దత్తాత్రేయుడు వంటి వారు తపస్సు ఆచరించేందుకు ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోయి, పర్ణశాలలు నిర్మించుకుని, ఇక్కడి మందాకినీ నదిలో స్నానమాచరించి, నది ఒడ్డునే తపస్సు చేసుకున్నట్లు స్థలపురాణ చెబుతోంది.మధ్యప్రదేశ్ అడవులలో ఉత్తరప్రదేశ్ సరిహద్దులలో ఉన్న ఈ పవిత్రస్థలిలో ప్రతి కొండా, గుట్టా, రాయీ రప్పా, చెట్టూ పుట్టా, వాగూ వంకా, తీర్థమూ జలపాతమూ... ఇలా ప్రతి ఒక్కటీ కూడా సీతారామ లక్ష్మణులు, వారి దాసుడైన హనుమంతుడి పేర్లతోనే ముడిపడి ఉంటాయి. కేవలం జీవంలేని ప్రదేశాలే కాదు.. ఇక్కడ జీవం పోసుకున్న ప్రతి వారి పేర్లలో సీతా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమంతుడూ ఉంటారు. వారి పిలుపులు కూడా రామ్ రామ్ అనే ఉంటాయి. తమకు తారసపడిన ప్రతి వారినీ రామ్ అనే పిలవడం వీరి ఆచారం. కొండగుహలన్నీ రామనామ జపంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద బండరాళ్లమీద సీతమ్మ చీరలు ఆరవేసుకున్నట్లుగా... రామయ్య శయనించినట్లుగా... లక్ష్మణుడు సేదదీరినట్లుగా... హనుమంతుడు గంతులు వేసినట్లుగా ఆనవాళ్లుంటాయి. అంతర్వాహినిగా గుప్తగోదావరి: మందాకినీ నదితోపాటూ యమునా నది కూడా ఇక్కడికి దాపులలోనే ఉంది. ఇక్కడ అడుగుపెట్టిన పాదచారులకు తన చల్లని స్పర్శతో, గలగల శబ్దాలతో అంతర్వాహినిగా ప్రయాణిస్తూ ఓ గోదావరీపాయ గుప్తగోదావరిగా పేరు తెచ్చుకుంది. రామ్ఘాట్: మందాకినీ నది ఒడ్డున గల ఈ స్నానఘట్టంలోనే రాముడు రోజూ స్నానం చేసేవాడట. రామలక్ష్మణులు స్నానం చేసి వస్తున్నట్లుగా తులసీదాసు తన మనోనేత్రాలతో దర్శించాడట. అందుకే దీనిని తన రామచరిత్ మానస్లో రామ్ఘాట్ అని ప్రత్యేకంగా పేర్కొన్నాడు.కామద్గిరి: మందాకినీ నది పరిక్రమ చే సే భక్తులు ఇక్కడ గల రామాలయాన్ని సందర్శించి, మొక్కులు మొక్కుకుంటారు. ఎందుకంటే కామదనాథుడనే పేరుగల రాముడు కోరిన కోరికలు తీర్చే వేల్పుగా ప్రసిద్ధి΄÷ందాడు. ఇక్కడే అనేక ఆలయాలున్నాయి. భరత్ మిలాప్: తన అన్నగారు ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్న భరతుడు వేలాదిమంది సైనికులను, పరివారాన్ని వెంటబెట్టుకుని వచ్చి, రాముణ్ణి కలిసిన ప్రదేశమిది. రాముణ్ణి భరతుడు కలిసిన ప్రదేశం కాబట్టి, భరత్ మిలాప్ అనే పేరొచ్చింది. ఇక్కడ భరతుడికి చిన్న మందిరం ఉంది. జానకి కుండ్: రాముడు స్నానం చేసిన ప్రదేశానికి కొద్దిదూరంలోనే సీతాదేవి స్నానం చేసేదట. అందుకే ఈ ఘట్టానికి జానకి కుండ్ అనే పేరొచ్చింది. సతీ అనసూయ ఆశ్రమం: అత్రి మహాముని పత్ని, సతీ అనసూయా దేవి ఇక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపమైన దత్తాత్రేయుడిని, ఆయన సోదరులను సాకిందట. సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు అనసూయా శ్రమాన్ని సందర్శించారట. అప్పుడు అనసూయ సీతకు పాతివ్రత్య ధర్మాలను బోధించడంతో΄ాటు, రకరకాల లేపనాలను, రుచిగల పండ్లను, చీరలను కానుకగా ఇచ్చిందట. హనుమాన్ ధార: చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 3000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రదేశానికి చేరాలంటే కనీసం రెండువేల మెట్లను ఎక్కవలసిందే! ఎంతో ప్రయాసకు ఓర్చి ఇక్కడ వరకు వచ్చిన వారి అలసట, మార్గాయాసం అంతా తీరిపోయేలా పురాతన హనుమద్విగ్రహం దర్శనమిస్తుంది. ఎక్కడినుంచి పడుతోందో తెలియని విధంగా నిత్యం జలధార పడుతూ, విగ్రహాన్ని అభిషేకిస్తుంటుంది.రామశయ్య: సీతారామలక్ష్మణులు తాము శయనించేందుకు వీలుగా ఒక పెద్ద చెట్టునీడన గల రాతిప్రదేశాన్ని శయ్యలా చెక్కారట. ఈ రాతిపరుపు పైనే సీతారాములు శయనించేవారట. వారు ఇక్కడ సేదదీరేవారనడానికి గుర్తుగా సీతారామలక్ష్మణుల ముగ్గురి విగ్రహాలూ దర్శనమిస్తాయి. దీనికే రామశయ్య అని పేరు వచ్చింది. స్ఫటిక శిల: సీతారాములు కూర్చున్న ఒక రాతితిన్నెకే స్ఫటిక శిల అని పేరు. సీతారాముల పాదముద్రలు ఈ శిలపై మెరుస్తూ కనిపిస్తాయి. ఉత్సవాలు... పర్వదినాలు: చిత్రకూటంలో ప్రతి అమావాస్యకూ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఇంకా దసరా, దీపావళి, సంక్రాంతి, హోలీ, ఉగాది వంటి అన్ని హిందూ సంప్రదాయ పండుగలప్పుడూ ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. భోజన, వసతి సదుపాయాలు: చిత్రకూటాన్ని సందర్శించే యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పర్యాటక మంత్రిత్వ శాఖలవారు విడివిడిగా అందుబాటు ధరలలో భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇవిగాక ప్రైవేటుగా బడ్జెట్ హోటళ్లు కూడా ఉన్నాయి. – డి.వి.ఆర్. ఎలా వెళ్లాలంటే : విమాన మార్గం: చిత్రకూటానికి దగ్గరలో గల ఏర్΄ోర్ట్ ఖజురాహోనే. అయితే ఇక్కడినుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో గల చిత్రకూటానికి వెళ్లాలంటే మాత్రం మళ్లీ బస్సు లేదా రైలుప్రయాణం తప్పదు మరి. వారణాసి, జబల్పూర్ విమానాశ్రయాలయితే ఇంకా దూరం.రైలు ద్వారా: ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, వారణాసి వంటి ప్రధాన నగరాలనుంచి రైలు ద్వారా కార్వి రైల్వేస్టేషన్కు చేరుకోవచ్చు. అక్కడినుంచి 12 కిలోమీటర్ల దూరంలోని చిత్రకూటానికి ప్రైవేటు వాహనాలుంటాయి. రోడ్డు మార్గం: అలహాబాద్, సత్నా, పన్నా, బండాల నుంచి చిత్రకూటానికి మంచి రోడ్డుమార్గం ఉంది. బస్సులు లేదా ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. -
ఉన్నది ఒకటే అన్న భావనే అద్వైతం
ద్వైతం కానిది అద్వైతం. అంటే రెండు అనే భావన పోయి ఉన్నది ఒకటే అని భావించగలగటం అద్వైతమవుతుంది. అయితే ఉపాధులన్నీ సమానమని అర్థం కాదు. పాపపుణ్య కర్మ ఫలితంగా వచ్చిన ఉపాధులు పరస్పరం భిన్నమైనవే. అవి పూర్తిగా నశించిపోయేవే. నశించనిది, నిత్యసత్యమైనది ఉపాధి గతమైన ఆత్మ ఒక్కటే. ఈ విషయం గ్రహించటమే సమదర్శి స్వభావం. నిత్యసత్యం, వ్యవహార సత్యం అనేవి రెండున్నాయని గ్రహించాలి. మనకు కనబడే ప్రపంచమంతా వ్యవహారంలో సత్యం. కాని నిత్యసత్యము మాత్రం కాదు. ప్రపంచం నిత్యసత్యమని తెలిస్తే అది భ్రాంతి అనక తప్పదు. ఈ అద్వైత జ్ఞానం వల్ల తానంటూ వేరే ఉండక అంతట తననే చూడటం, తనలోనే సర్వాన్ని చూడటం జరుగుతుంది. ‘ఆత్మ వత్సర్వభూతాని సర్వభూతాని చాత్మని’ అనే దాని కర్థం అదే. ఈ జ్ఞానం ఒక్క గురుబోధ, గురుసేవ వల్లనే లభ్యం. కేవలం గ్రంథ పఠనం చాలదు.ఒక గురువు గారు తన శిష్యుడికి ‘అద్వైతం’ గురించి పాఠం ప్రారంభించారు. ‘భగవంతుడు ఒకడే. ఆయన సర్వాంతర్యామి. ఆయన సంకల్పంతో సృష్టి జరిగింది. ఆయనొక్కడే నిత్య సత్యం. ఈ కనబడేది అంతా భ్రాంతి వల్ల కనబడు తున్నది కాని నిజానికి ఇదేదీ లేదు. అని మొదట్లో బోధించటం జరిగింది. ఈ జ్ఞానం శిష్యులలో స్థిరపడటానికి ఇంకా సమయం కావాలి. గురువిచ్చే అనుభవం సంపాదించాలి. అప్పుడుగాని అర్థమైనట్లు కాదు. ప్రాథమిక దశలోనే ఉన్న ఈ శిష్యుడు ఒక సారి అడవికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. దారిలో ఒక మదపుటేనుగు ఎదురుగా వస్తున్నది. దానిపై ఉన్న మావటివాడు, ఈ ఏనుగు ఇది పూర్తిగా మచ్చిక కాని మదపుటేనుగు పక్కకు తప్పుకో అని అరిచాడు. ఆ శిష్యునికి అద్వైతం పాఠం గుర్తుకొచ్చింది. ‘ఈ కనబడేదంతా బ్రహ్మమే. రెండవదంటూ లేదు.’ కాబట్టి ఈ కన బడే ఏనుగు భ్రాంతి జన్యమైంది. కనుక నేను తప్పుకోవలసిన పని లేదని ముందుకు నడిచాడు. ఏనుగు రానే వచ్చింది, తొండంతో అతణ్ణి విసిరి అవతల పారవేసింది. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైందో లేదో కాని మనకు మాత్రం బాగా అర్థమవ్వాల్సింది ఏమిటంటే... ‘ఉపాధులన్నింటిలోనూ ఉన్న అంతర్యామి ఆత్మ ఒక్కటే అయినా, ఉపాధి గత భేదం భేదమే’అని! -
అలాంటి వారి హృదయాల్లో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు!
నిర్మలమైన హృదయం కలిగి ఉండి, మత్సరభావం లేకుండా, ప్రశాంత చిత్తంతో ఎల్లవేళలా సృష్టిలోని సమస్త జీవుల పట్ల స్నేహభావం కలిగి ఉంటూ, ఇతరులతో సంభాషణల సమయంలో ప్రియంగా మాట్లాడేవారి హృదయాలలో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడని విజ్ఞులు చెబుతారు. ‘కావాలని మనస్సులోని ఆలోచనలను పాపకర్మలు చేయడం వైపుకు మరల నీయకుండా, చెడ్డ పనులను తలపెట్టక, ధర్మమార్గాన్ని ఎన్నడూ విడిచి పక్కదోవ పట్టకుండా చూసుకుంటూ, చెడ్డపేరు తెచ్చిపెట్టే పనుల జోలికి వెళ్ళకుండా, ఇరుగుపొరుగున అందరూ తమను మెచ్చుకునే పద్ధతిలో జీవనం సాగించే వ్యక్తులు దేవతలతో సమానమైనవారే అవుతారని, వారిలో ఇంకేమి తక్కువని అలా అనకుండా ఉండగలం?’ అని వెన్నెలకంటి సూరన రచనయైన ‘ఆంధ్ర శ్రీ విష్ణుపురాణము’ ప్రశ్నించి చెప్పింది. పుణ్యానికైనా, పాపానికైనా, సుఖానికైనా, దుఃఖానికైనా మనిషి చేసే అలోచనలే ముఖ్యం కాబట్టి, ప్రయత్న పూర్వకంగా మనసును చెడు ఆలోచనల వైపుకు మళ్ళకుండా చూసుకోవడం మనిషికి అవసరం అన్నది పై మాటల సారాంశంగా భావించవచ్చు. సరిగా ఈ ఆలోచననే నొక్కి చెప్పినట్లుగా, బుద్ధిలో సందేహము, నిర్మలత్వము లేకుండా ఆచరించబడే కర్మల నిష్ప్రయోజకత్వాన్ని ఎఱయకవి రచించిన ‘సకలనీతికథా నిదానము’ ప్రథమాశ్వాసములోని ఈ కింది తేటగీతి పద్యం తేలికైన మాటలలో చెప్పింది.చిత్తశుద్ధి లేక చేసిన జపమునుతపము హోమవిధియు దానములునుదేవతార్చనములు భావింప నిష్ఫలమట్లుగాన వలయు నాత్మ శుద్ధి. మనసు నిర్మలంగా ఉండడం, చేసే పనియందు లగ్నమై ఉండడం – కార్యాచరణలో ఈ రెండూ చాలా ముఖ్యమైనవని తెలుసుకోవాలి. ఏకాగ్రచిత్తంతో చేయని ఏ పని కూడా సరైన ఫలితాలను ఇవ్వదు. మనసులో నిర్మలత్వం లేని దానము, దేవతార్చన కూడా నిష్ఫలమే అవుతాయి. అందువలన మనసును – అంటే ఆత్మను, బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం అని పై పద్యం సారాంశం. సువాసనలు వెదజల్లే పూవులను పూచే మొక్కలకు, రుచికరమైన పండ్లను ఫలించే చెట్లకు, మూలాలు భూమి పొరలలోని మట్టిలో నిక్షిప్తమై ఉన్నట్లుగా, ఇహపరాలలో మనిషికి ఆధ్యాత్మిక సౌఖ్యాలను అందించే పుణ్యానికి మూలాలు నిర్మలమైన చిత్తంతో ఈ భువిపై జీవనంలో ఆచరించే సత్కర్మలలోనే ఉంటాయన్నది కాదనలేని నిజం.– భట్టు వెంకటరావు -
Sirimanu Utsavam అంబరాన్నంటిన సిరిమాను సంబరం
పార్వతీపురం టౌన్: మంగళ వాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. కళాకారుల వేషధారణల నడుమ ఇప్పలపోలమ్మ, ఎర్రకంచె మ్మ అమ్మవార్లు సిరిమానోత్సవం మంగళవారం సంబరంగా సాగింది. సిరిమాను పూజారుల రూపంలో వీధిల్లోకి తరలివచ్చిన అమ్మవార్లను తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. వీరితో పార్వతీపురం పట్టణం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను కనులారా వీక్షించిన భక్తులు జయజయధ్వానాలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. మహిళలు ఘటాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవా ర్లను పూజించారు. అమ్మవార్ల పూజార్లు జన్నిరామారావు, నక్క వాసుదేవరావులు అమ్మవారి దండకం చదివి సాయంత్రం 5 గంటల సమయంలో సిరిమానును అధిరోధించారు. అంజలి రథంపై పేడి వేషధారుల నాట్యం అనంతరం సిరిమాను తిరువీధి ప్రారంభమైంది. అమ్మవార్లను ఎమ్మెల్యేలు బోనెల విజయ చంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయరాజు, తదితరులు దర్శించుకున్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు సిరిమాను సంబరం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించా యి. తప్పెటగుళ్లు, కోలాటం, అమ్మవార్ల వేషధారణలు, కాంతారా, బళ్లు వేషాలు ఆకట్టుకున్నాయి. 450 మందితో పోలీస్ బందోబస్తు పార్వతీపురం ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. 40 సీసీ కెమెరాలు అమర్చి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు జిల్లా కేంద్ర సరిహద్దుల్లో భారీ వాహనాలను నిలిపివేసి, అత్యవసర, కార్లు, ద్విచక్ర వాహనాలను బైపాస్ మార్గం గుండా మళ్లించారు. పోలీస్ బందో బస్తును ఎస్పీతో పాటు ఏఎస్పీ అంకిత సురాన, పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్బీ సీఐ పి.రంగనాథం, సీసీఎస్ సీఐ అప్పారావు పర్యవేక్షించారు. -
ఉండాల్సిన నమ్మకం : భగవంతుడు సర్వాంతర్యామి
భగవంతుడు సర్వాంతర్యామి అనేది భారతీయుల విశ్వాసం. అందుకే భారతీయులకు నదీనదాలూ, కొండలూ, గుట్టలూ, జంతువులూ, పక్షులూ... ఒకటేమిటి– అన్నీ పూజనీయాలే. పండుగలూ పబ్బాలలో ప్రకృతితో మమేకమై తన్మయత్వంతో పూజలు చేయడం అందుకే! అయితే వివిధ రూపాల్లో ఉన్న దేవుని గుర్తించడంలో మాత్రం చాలామంది విఫలమవుతూ ఉంటారు. ఇందుకు దైవాన్ని గుర్తించగలిగిన జ్ఞానం వారికి లేకపోవడమే కారణం. దేవుణ్ణి దర్శించుకోవడానికి గుడి లోపలికి చాలా భక్తిప్రపత్తులతో వెళతారు. కానీ గుడి మెట్లపై కూర్చునే యాచకులు, దీనులను చాలామంది పట్టించుకోరు. వారితోనే నిజంగా దేవుడు కూర్చున్నా గుర్తించలేరు. అయితే భగవంతుని గుర్తించడానికి శోధన అవసరం. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్అన్వేషించే కొద్దీ భగవంతుణ్ణి ఏదో ఒకరోజు తెలుసుకోవచ్చు. ఆరాధనా పద్ధతులతోపాటు అన్వేషణా జ్ఞానాన్నీ సముపార్జించాలి. ఆ జ్ఞానం లేకపోతే ఆ నారాయణుడే మన ముందుకొచ్చి నిల్చున్నా తెలుసుకోలేం. పైపెచ్చు అనుమానిస్తాం. అతను నిజంగా నారాయణుడేనా అని ఆలోచనలో పడతాం. నారాయణుడేదో మన అవసరాలను తీర్చడానికొస్తే ఎదురు మనమే అవీ ఇవీ అడిగి అనుమానిస్తాం. అప్పుడు ‘నేను సాక్షాత్తూ ఆ నారాయణుడినే నయ్యా’ అని భగవంతుడు చెప్పినా సరే... మన మనసు ఒప్పుకోవడానికి ససేమిరా అంటుంది. ‘అదేంటీ, నాకంత సులభంగా పరమాత్మ ప్రత్యక్షమవుతాడా’ అని సందేహిస్తాం. ఇటువంటి స్థితిలోనైనా మనకు ప్రహ్లాదుడి మాట గుర్తుకు రావాలిగా... ఆ హరి నారాయణుడు లేని చోటేది? అతను సర్వాంతర్యామి అనేది తెలిసుండాలిగా! అలాకాక ‘నీకు శంఖం, చక్రం లేవేమిటీ? నీ వాహనమైన గరుత్మంతుడేడీ?’ అని ప్రశ్నిస్తే ఆ నారాయణుడిని ఎలా చూడగలం?చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుందిమనకు మన మీదే అపనమ్మకం. అటువంటప్పుడు సాక్షాత్తూ ఆ వైకుంఠవాసుడైనా ఏమీ చేయలేడు. కనుక మనకు ఉండాల్సింది నమ్మకం. అన్నింట్లోనూ ఆ భగవంతుడు ఉంటాడనేది తెలియాలి. – యామిజాల జగదీశ్ -
దేవతలు నడయాడిన నేల.. అద్భుత మహిమలు!
నారాయణపేట/కృష్ణా: నారాయణపేట జిల్లా కృష్ణా మండలం తంగిడి గ్రామ సమీపంలోని కృష్ణా, భీమా నదుల సంగమ ప్రాంతం ఓ విశిష్టమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడే భీమా నది తెలంగాణలోకి ప్రవేశించి.. తంగిడి క్షేత్రంలోనే కృష్ణానదిలో విలీనమవుతుంది. దేవతలు నడయాడిన స్థలంగా, రుషులు, మునులు తపస్సు ఆచరించిన దైవభూమిగా, ఎన్నో అద్భుతాలు, మహిమలు జరిగిన క్షేత్రంగా తంగిడికి ఘన చరిత్ర ఉంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు (Pilgrims) ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడే రెండు పుష్కరాలు.. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని కృష్ణా మండలం తంగిడి వద్ద కృష్ణా, భీమా నదులు కలుస్తాయి. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పుష్కరాలకు కృష్ణా, భీమా సంగమ ప్రాంతం ప్రత్యేకత చాటుతోంది. 2016, ఆగస్టు 12 నుంచి 23 వరకు 12 రోజులపాటు పుష్కరాలు జరిగాయి. 2028లో ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరిగే పుష్కరాలకు సిద్ధమవుతోంది. భీమా పుష్కరాలు 2018, ఆక్టోబర్ 11 నుంచి 22వ తేదీ వరకు తంగిడి, కుసుమూర్, శుక్రలింగంపల్లి గ్రామాల్లో జరిగాయి. 2030, అక్టోబర్ 11 నుంచి 22వ తేదీ వరకు పుష్కరాలు (Pushkaralu) జరగనున్నాయి. అయితే సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. దక్షిణం వైపు ప్రవాహం.. భీమానది దక్షిణం వైపు ప్రవహిస్తుంది. ఇది కాశీలోని గంగానదితో సమానం. గయాలోని హోళీ స్థలమైన ప్రజలు పుష్కర స్నానం ఆచరించడం స్వచ్ఛమైనదని, పవిత్రమైన ప్రదేశమని హిందువులు భావిస్తారు. తంగిడి వద్ద కృష్ణా, భీమా నదుల సంగమాన్ని నివృత్తి సంగమం అని పిలుస్తారు. గత చరిత్ర ప్రకారం దత్తాత్రేయ అవతారమెత్తిన స్వామి శ్రీపాదవల్లభ కురువపురం అనే ప్రదేశం ఈ సంగమానికి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రదేశం ప్రత్యేకత కలిగి ఉండటం, తెలంగాణ రాష్ట్రంలోకి కృష్ణానది ప్రవేశ స్థలం కావడంతో ఈ సంగమం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇక్కడే విద్యుత్ శక్తి పుట్టింది.. సాక్షాత్ జగద్గురు శ్రీదత్తాత్రేయ మహాస్వామి మొదటి అవతార పురుషుడైన శ్రీపాద వల్లభుడు తంగిడి క్షేత్రంలోని కృష్ణా, భీమా నదుల సంగమక్షేత్రంలో స్నానం ఆచరించి తపస్సు చేసినట్లు వేదాల్లో పేర్కొనబడింది. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని నివృత్తి సంగమంగా పేరు గాంచిందని దత్త పీఠాధిపతులు చెబుతుంటారు. అలాగే ఈ ప్రాంతంలో సంగమేశ్వరుడి ఆలయం ఉంది. ఇది అతి పురాతనమైన దేవాలయం. ఇక్కడ కొడెకల్ స్వామీజీ చెప్పినట్లు ఈ నది నీటి ద్వారానే ఓ శక్తి పుడుతుంది. ఆ తర్వాత సంగమంలోని రాతి కోడి కూస్తుంది. ఆ కోడి కూసిన రోజు ఈ ప్రపంచం మునిగిపోతుందని ఓ శిలాశాసనం ఉంది. ఆ శాసనంలో చెప్పినట్లే ఇక్కడున్న బురుజుపై రాతి కోడి ఉండేది. అది ప్రస్తుతం శిథిలమైంది. అలాగే శాసనం కూడా శిథిలమైపోయింది. కానీ ఈ మాటలను మాత్రం ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ అంటుంటారు. అలాగే ఆ స్వామీజీ చెప్పినట్లు ఈ నీటి ద్వారానే శక్తి పుడుతుందని చెప్పినట్లే కర్ణాటకలోని శక్తినగర్లో పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్శక్తి ఉత్పత్తి అవుతోంది. సంగమ క్షేత్రం ప్రత్యేకతలివీ.. కృష్ణా మండలం తంగిడి వద్ద కృష్ణా, భీమా నదులు కలిసే ప్రాంతమే సంగమ క్షేత్రం. ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, అక్కడ దేవతలు, రుషు లు, మునులు తపస్సు ఆచరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు దివ్యక్షేత్రంగా వెలుగొందిందని ప్రసిద్ధి. దత్తాత్రేయ మొదటి మానవ అవతారం ఎత్తిన శ్రీపాద వల్లభుడు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. ఇప్పటికీ ఆయన జన్మించిన ఇల్లు అక్కడ ఉండటం విశేషం. అక్కడ 16 ఏళ్ల వరకు ఉండి దేశ సంచారం నిమిత్తం వెళ్లిపోయారు. అలా వెళ్లిన వ్యక్తి.. కొన్నేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా మాయమయ్యారు. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి నాడు తంగిడిలోని నివృత్తి సంగమంలో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు ఆచరించి.. ఇక్కడి నుంచి కర్ణాటకలోని కుర్మగడ్డకు వెళ్లారని చారిత్రక ఆధారాలున్నాయి.ఇప్పటికీ ఈ సంగమంలో శ్రీపాదుడు తపస్సు చేసిన వినాయక విగ్రహం, ఆయన పాదుకలు, శివలింగం ఉన్నాయి. ఆయన ఇక్కడి నుంచి కుర్మగడ్డకు నడుచుకుంటూ వెళ్లిన మార్గంలో నదిలో నల్లరాయితో రోడ్డు వేసినట్లు ఇప్పటికీ ఇక్కడ ప్రత్యక్షంగా కన్పిస్తాయి. ఇంతటి విశేషమైన ఈ ప్రాంతాన్ని తెలుసుకున్న విఠల్బాబా అప్పట్లో దత్త భీమేశ్వర ఆలయం నిర్మించారు. ఈ నివృత్తి సంగమంలో స్నానం ఆచరించిన భక్తులకు పాపాలు నివృత్తి అవుతాయని ప్రసిద్ధి. ఈ స్థానం తెలంగాణకు ఓ వరంలాంటిది. ఇలాంటి క్షేత్రం మరెక్కడా లేదని, ఇది ఓ మానస సరోవరం అని దత్త పీఠాధిపతులు అంటున్నారు. 1557–58లో విజయనగర రాజు రామరాయ బహమన్ సుల్తానులను ఓడించి ఈ సంగమం ఒడ్డున కుతుబ్షాహీ, ఆదిల్షాహీ, నిజాంషాహీ, బరీద్ షాహీ సుల్తానులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.బ్రిడ్జి నిర్మించాలి నది అటువైపు కర్ణాటకలో ఉన్న సంగమ క్షేత్రానికి ఇటువైపు ఉన్న భక్తులు వెళ్లేందుకు బ్రిడ్జిని నిర్మించాలి. అప్పుడే అక్కడి భక్తులు ఇక్కడికి, ఇక్కడి భక్తులు అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు కృషి చేయాలి. – శ్రీకాంత్చారి, పురోహితుడుచదవండి: మత్స్యరూపం.. శుభ సంకల్పంపర్యాటకంగా తీర్చిదిద్దాలి తంగిడి వద్ద ఉన్న సంగమ క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కలి్పంచాలి. కృష్ణా, బీమా నదుల సంగమం వద్ద స్నానాల గదులతో పాటు దుస్తులు మార్చుకునేందుకు గదులు నిర్మించాలి. – అమర్కుమార్ దీక్షిత్, కృష్ణా -
యోగం – ధ్యానం
యోగాత్పరతరం పుణ్యంయోగాత్పరతరం శివమ్యోగాత్పరతరం సూక్ష్మంయోగాత్పరతరం నహియోగము కన్నా శ్రేష్ఠమైన పుణ్యము మరొకటి లేదు. యోగము కన్నా అధికమగు మంగళకరమూ లేదు. యోగము కన్నా శ్రేష్ఠమగు, సూక్ష్మతరమగు జ్ఞానమూ లేదు. యోగము కన్నా ఉత్కృష్టమగు వస్తువు మరొకటి లేదు. (యథార్థ భారతి ఫిబ్రవరి 2014 సంచిక) చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?నాస్తి ధ్యాన సమం తీర్థంనాస్తి ధ్యాన సమం తపఃనాస్తి ధ్యాన సమో యజ్ఞంతస్మాత్ ధ్యానం సమాచరేత్ ధ్యానంతో సమానమైన తీర్థం లేదు, ధ్యానంతో సమానమైన తపస్సు లేదు, ధ్యానంతో సమానమైన యజ్ఞం లేదు, కాబట్టి ధ్యానాన్ని బాగా ఆచరించండి అని దీని అర్థం. యోగం, ధ్యానం వేరు వేరు కాదు. యోగంప్రారంభ దశ, ధ్యానం తర్వాతి దశ. యోగం శరీరంతో మొదలై ధ్యానానికి బాటలు వేస్తుంది. శరీరం, మనసు, ఆత్మ అనేవి మూడు విడి విడి భాగాలు కావనీ; శరీరం స్థూలమైనదనీ, దానికంటే సూక్ష్మమైనది మనస్సనీ,అంతకంటే సూక్ష్మమై అన్నిటికీ కేంద్రమై ఆధారమైఉన్నది ఆత్మ అనీ అనుభవజ్ఞులు చెబుతారు. ఆత్మ దర్శనం కావాలన్నా, ఆత్మానుభూతి కావాలన్నా అంతర్ముఖులు కావాల్సిందే! యోగంతో... అంటే శరీరంతో ప్రారంభించి మనసుకు చేరితే తర్వాత జరగాల్సినది జరుగుతుందంటారు. అంటే ముందు శరీరాన్ని దోష రహితంగా, రోగ రహితంగా చేసుకోవాలి. తర్వాత మనసులోని మాలిన్యా లను తీసివేయాలి. వాటికి సహకరించేవే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాలు. ఇవన్నీ ఆచరిస్తే సమాధి అనే స్థితి కల్గుతుంది. యోగాన్ని సక్రమంగా అభ్యాసం చేసి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుదాం. ప్రపంచ శాంతికీ పాటుబడదాం. ‘యోగీ భవ’ అన్నది శ్రీకృష్ణుని సలహా. (పుట 552– గీతామకరందము)– రాచమడుగు శ్రీనివాసులుఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలు -
రెండో భగవద్గీత అనుగీత, ఆసక్తికర విషయాలు
శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన రెండవ ప్రబోధం ‘అనుగీత.’ దీనిని భగవద్గీత సారాంశంగా చెప్పవచ్చు. కురు–పాండవ యుద్ధం తర్వాత ధర్మరాజు రాజ్య పాలన చేస్తూ ఉంటాడు. కృష్ణార్జునులు ఇంద్రప్రస్థపురంలో ఉంటూ నదులు, అడవులు, కొండలలో విహరిస్తూ కబుర్లు చెప్పుకునేవారు. ఒక రోజు కృష్ణునితో అర్జునుడు ‘యుద్ధానికి పూను కున్నప్పుడు నా మనసు కలతచెంది, నేను కుంగిపోయినప్పుడు నువ్వు తత్త్వ బోధకాలైన మహా వాక్యాలను నా మీద కరుణతో బోధించి యుద్ధా నికి సిద్ధం చేశావు. అప్పుడు ఆ మాటల సారాంశాన్ని మనసులో పదిలపరుచుకోలేక పోయాను. మరోసారి ఆ తత్వోపదేశాన్ని అనుగ్రహించ’ మని ప్రార్థించాడు.యుద్ధ ప్రారంభంలో చెప్పినదే ‘భగవద్గీత’. మానవులు పూర్తిగా లౌకిక ప్రపంచంలో మునిగి, సంసార తాపత్రయం నుండి బయటపడలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు అందులో నుంచి బయటపడి తరించటానికి భగవద్గీత 18 మెట్లు చూపిస్తుంది. ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్క అధ్యాయం. ఇవి దైవా నికి దగ్గర చేస్తాయి. బ్రహ్మ విద్యను తెలిపే గీతా శ్లోకాలను యథాతథంగా పునరుక్తం చేయటం సాధ్యం కాదని తెలిపి, కృష్ణుడు వేరే పద్ధతిలో కొన్ని పాత్రల పరంగా ప్రతిపాదించాడు.ఇందులో ‘బ్రాహ్మణ గీత’లో బ్రాహ్మణుడు, అతని భార్య సంభాషణ ద్వారా బ్రహ్మ విద్యా ప్రబోధకాలైన అంశాలను తెలిపాడు. ‘అధ్వర్య– యతి సంవాదం’లో యజ్ఞాలలో కెల్లా తపోయజ్ఞమే శ్రేష్ఠమని చెప్పాడు. గురు శిష్య సంవాద రూపంలో సత్వ గుణ సహాయంతో రజస్తమో గుణాలను జయించి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది, సత్వాన్ని కూడ విడిచిపెట్టాలని చెప్పాడు. అశ్వమేధ పర్వంలో బోధించిన ఈ ‘అనుగీత’ గీతా తాత్పర్యమే! ఇది అర్జునునిలో ఆధ్యాత్మిక పరిణామాన్ని కలిగించటానికి ఉద్దేశించినది. ఇది చదివితే, మననం చేస్తే సకల మానవాళిలో ఆధ్యాత్మిక భావ వికాసం పెంపొందుతుంది. – డా.చెంగల్వ రామలక్ష్మి -
Bakrid 2025: జిల్ హజ్ మొదటి పది రోజుల ప్రాముఖ్యం
జిల్ హజ్ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రాహీమ్ , హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ప్రపంచ విశ్వాసుల పర్వదినం. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారం కాదు. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియా రూపంలో దైవ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ.ఇస్లామీయ క్యాలెండరులో చివరి నెల అయిన జిల్ హజ్ మాసంలోని మొదటి పదిరోజులను ముస్లింలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజులు ఆధ్యాత్మిక వికాసానికి, ఆత్మప్రక్షాళనకు, సమాజ సంక్షేమానికి మంచి అవకాశం కల్పిస్తాయి. జిల్హజ్ మొదటి పదిరోజులకు సంబంధించి ఖురాన్, హదీసులలో స్పష్టమైన సంకేతాలున్నాయి. సూరా అల్ ఫజ్ర్లో, ‘ప్రభాత సమయం సాక్షిగా, పది రాత్రుల సాక్షిగా..’ (ఖురాన్ 89:1–2) అని ఉంది. ప్రఖ్యాత ఖురాన్ వ్యాఖ్యాత ఇబ్నె కసీర్ .. ఈ ప్రస్తావన జిల్మాసం పదిరోజులకు సంబంధించినదే అని తఫ్సీర్ ఇబ్నె కసీర్లో రాశారు. ప్రవక్త (స) వారి ప్రవచనం ప్రకారం, ‘దైవానికి ఈ పదిరోజులలో చేసే మంచి పనులకన్నా ఇతరరోజుల్లో చేసే పనులు ప్రియమైనవి కావు’ (సహీ బుఖారీ, హదీస్ 969) అని చెప్పారు. అంటే జిల్హజ్ మాసం మొదటి పదిరోజులకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో మనకు వీటి ద్వారా అర్థమవుతోంది.ఈ పదిరోజులలో ఒకటైన తొమ్మిదవ రోజుకు అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. హజ్ యాత్రలో ఇది అత్యంత కీలకమైన రోజు. హజ్కు వెళ్లలేని వారు కూడా ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల గత సంవత్సరం, వచ్చే సంవత్సరం పాపాలు మన్నింపబడతాయని ప్రవక్త (స) వారు చెప్పారు. ఉపవాసం మనసుని నియంత్రించడంలో, ఆత్మశుద్ధి సాధించడంలో, భయభక్తులు పెంపుదలలో గొప్ప సాధనంగా ఉపకరిస్తుంది.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Jesus ఒక్కడే మీ తండ్రి
‘ఒక్కడే మీ తండ్రి’ అనునది అపొస్తలుల బోధ. వీరు యేసుక్రీస్తు దగ్గర మూడున్నర సంవత్సరాలపాటు ఆత్మసంబంధ జ్ఞానాన్ని గ్రహించారు. పామరులైన వీరంతా దేవుని బోధలు ఎలా చేయాలో క్రీస్తు అను మెస్సీయ వద్దనే నేర్చుకొన్నారు. క్రీస్తును గూర్చి’ఈయనే నా ప్రియ కుమారుడు అంటూ దేవుడు ఆకాశం నుండి పలికిన మాటలను ఆ దేవుని గొప్ప స్వరాన్ని పలుమార్లు విన్నారు. దేవుని చేత పరము నుండి ఈ భూలోకమునకు పంపబడిన ‘పరలోక దేవుని అపొస్తలుడైన యేసు అసాధారణ బోధ’, ఆ యేసు క్రీస్తు చేత ఈ సర్వ లోకములోనికి పంపబడిన పన్నెండు మంది శిష్యులనబడిన ’క్రీస్తువారి అపొస్తలుల బోధ’, యెరూషలేములోని ఆదిమ సంఘముగా చెప్పబడే ‘క్రీస్తు ప్రభువు సంఘం చేత ప్రపంచ దేశాలకు పంపబడిన’ సంఘపు అపొస్తలుల ఉపదేశం’ అంతా ఒక్కటే. ఇందులో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. ఇట్టి ఏకత్వం గల బోధ ఆనాడు భూలోకాన్ని తలకిందులు చేసింది. అపొస్తలులు మొదటగా చేసిన ప్రపంచ సువార్త పర్యటనలతోనే ప్రపంచాన్ని కదిలించారు. కారణం ఒక్కటే, ఎవరు ఏ మూలకు వెళ్ళి బోధించినా వారి వారి బోధలలో ఏకత్వం అనేది తేటగా పిరదర్శకంగా వెల్లడి కావడం. సత్యవాక్యమను సువార్తను ఇక్కడ పేతురు ప్రకటిస్తున్నా అక్కడ యోహాను వివరిస్తున్నా మరోచోట యాకోబు చెబుతూ ఉన్నా ఈ ముగ్గురి బోధలు ఒకేలా ఉండడం విశేషం. ఇదే అపొస్తలుల బోధనా విధానం ప్రత్యేకత. బోధలో ఏకత్వం లేదంటే, రాలేదంటే అది అపొస్తలుల బోధ కాదని సుస్పష్టంగా చాలా తేలిగ్గానే ఇట్టే చెప్పేయవచ్చు. ఇప్పుడైతే ఏ ముగ్గురి బోధలు విన్నా చదివినా బోధలు మూడు రకాలుగా ఉంటూ క్రైస్తవ సమాజాన్ని కలవరానికి గురిచేస్తూ ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నాయి. నేడు దేవోక్తులకు చోటివ్వని నాయకత్వాలు అంతటా ప్రబలుతున్నాయి. అందులో ఒకటి ‘నేను మీకు ఆత్మీయ తండ్రిని’ అనే నాయకత్వం. విస్తరించిన పచ్చని చెట్టువలె ఉన్న ఇలాంటి నాయకత్వాలు విచ్చిన్నమై పుచ్చిపట్టి నేలకూలడానికి అవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి (కీర్తన 37:35,36, 73:16–19). ఎందుకంటే, ఒకడు ఎన్నో ఆత్మలను రక్షించినా ఎంత ఆత్మ సంబంధిగా జీవించినా నెత్తిన తెల్లకీరిటం ఉన్నానూ అతడు ఆత్మీయ తండ్రి కాలేడు. యేసు అసాధారణ బోధ దీన్ని అనుమతించుట లేదు. ప్రభువైన క్రీస్తు ఇలా అంటున్నాడు. ‘పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును’(మత్త 15:13 ). దీని భావం ఏమంటే, వివిధ రకాల లేఖన విరుద్ధ కొత్త సిద్ధాంతాలు, నాయకత్వాలు, మానవ కల్పిత స్థాపిత సంఘాలు అనేవి సాటిలేని, ప్రత్యామ్నాయం లేని అపొస్తలుల బోధ ముందు అనగా, క్రీస్తు పరిశుద్ధులుగా పేర్గాంచిన అపొస్తలుల బోధ ముందు ఇవి నిలువలేవు. వ్యక్తుల బోధల ప్రతిభాపాటవాలు, ధన దాసత్వం, భక్తి హీనత వంటి అబద్ద బోధలు నాయకత్వాలుగా పరిణమిస్తూ చెలామణిలో ఉంటూ రాజ్యమేలుతున్నాయి. సత్యవాక్యం లోతుగా ఎరుగని కారణం చేతనే క్రై స్తవ్యంలో సత్య విషయమైన సత్య సంబంధిత ఈ ఆత్మ సంబంధ భావ దారిద్య్రం నేడు ఎందరినో పట్టి పీడిస్తోంది. ఆత్మీయ తండ్రిగా పిలిపించుకోవడం అనేది అది వ్యక్తులు సృష్టించుకొన్న వారి సొంత బోధ. పరలోక దేవుని అపొస్తలుడైన క్రీస్తు వారి అత్యున్నతమైన అసాధారణ బోధ ఏమంటే,‘మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరు సహోదరులు. భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు’ (మత్త 23 8, 9 ఎఫెసీ 4:6 ).– జేతమ్ -
Tripuranthakam భూలోక కైలాస క్షేత్రం : త్రిపురాంతకేశ్వరాలయం
శ్రీశైల(Srisailam) పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహా శైవధామమే త్రిపురాంతకం (Tripuranthakam). త్రిపురాంతకేశ్వరస్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువు దీరిన ఈ క్షేత్రం ప్రశాంతతకు పుట్టినిల్లుగా, ప్రకృతి అందాలకు నెలవుగా విరాజిల్లుతోంది. అలాంటి ఈ క్షేత్రం ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే త్రిపురాంతకంలో ప్రధాన ఆలయం త్రిపురాంత కేశ్వరస్వామి వారి ఆలయం. శ్రీశైల ద్వారాలలో ప్రథమం, ప్రధానమైనదిగా ఉన్న ఈ క్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పుద్వారంగా విరాజిల్లుతోంది. శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి అధిష్ఠాన దేవత అయిన బాలాత్రిపురసుందరి కూడా ఈ క్షేత్రంలోనే కొలువుదీరి ఉంది.కుమారగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు నెలవు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లతోపాటు ఘాట్రోడ్డు సదుపాయం ఉంది. ఆలయానికి వెళ్లే మార్గంలో వందలకొద్దీ శివలింగాలు దర్శనమిచ్చి ఇది భూలోక కైలాసమా అనే అనుభూతిని భక్తులకు కలిగిస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం శ్రీచక్రంపై నిర్మితమైంది. మది పులకించే సుందర మండపాలు, శిల్పాలు, మందిరాలతో ఈ ఆలయం అలరారుతుంది.పురాణగాథ: విఘ్నేశ్వరునికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తర్వాత కుమారస్వామి మనసు కలతచెంది కైలాసం వీడాడని, అలా కైలాసం వీడిన కుమారస్వామి త్రిపురాంతకానికి సమీపం లో గల కొండపై తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చిన పార్వతీపరమేశ్వరులు ఆనాటినుంచి అక్కడ కొలువై ఉంటామని వరమిచ్చారని ఇక్కడ స్థలపురాణ కథనం. దీనివల్లే ఈ క్షేత్రానికి కుమారగిరి అని పేరు వచ్చినట్టు తెలుస్తుంది.త్రిపురాసుర సంహారం జరిగిన క్షేత్రంత్రిపురాసుర సంహారం ఈ క్షేత్రంలోనే జరగడంవల్ల దీనికి త్రిపురాంతకమనే పేరు వచ్చింది. త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు, సిద్ధులు తాంత్రికులకు ఆవాస భూమిగా ఉన్నది ఈ క్షేత్రం. అలాంటి మహిమగల ఈ దేవాలయ ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయని, త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అనిపార్వతీదేవికి స్వయంగా ఆ పరమ శివుడే చెప్పాడని అంటారు. ఇక్కడ కొలువుదీరిన మహాదేవుడు త్రిపురాంతకేశ్వరస్వామిగా నీరాజనాలను అందుకుంటున్నాడు. అణువణువు శివ నామస్మరణంతో మారుమోగే ఈ ఆలయ గర్భాలయంలో త్రిపురాంతకేశ్వరస్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు.నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలుఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి. ప్రధానాలయం శ్రీ చక్రాకారంలో నిర్మించబడింది. శివాలయం ఈ ఆకారంలో నిర్మించటం చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయం ఇది. శ్రీ చక్రం శివ యోర్వపుః’’అంటే శివపార్వతుల శరీరమే శ్రీ చక్రం. స్వామి ఉగ్రరూపం కనుక తూర్పుగ్రామాలు తగలబడి పోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారిగుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. అమ్మవారు పార్వతీమాత. ఆలయ ప్రాంగణంలో అపరాధీశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశవస్వామి, చంద్రమౌళీశ్వరస్వామి, కుమారస్వామి, నగరేశ్వర స్వామి మందిరాలు దర్శనమిస్తాయి. ఆలయంలో ఒకపక్క అగస్త్య మహాముని నిర్మించాడని చెప్పబడుతున్న బిల్వ మార్గమొకటి ఉంది. దీనిని చీకటిగుహగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి ఈ మార్గంగుండానే వెళ్లేవారని ప్రతీతి. ఇక్కడే ఉన్న మండపంలో అలనాటి శాసనాలు దర్శనమిస్తాయి. ఇక్కడే మరోపక్క గణపతి మండపం ఉంది. దీనికి సమీపంలోనే నవగ్రహాలయం ఉంది. ఇంకా ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, శృంగి, భృంగి, నందీశ్వరుడితోపాటు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి.బాలా త్రిపుర సుందరీ ఆలయంత్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయానికి కింద చెరువులో బాలాత్రిపురసుందరి మాత ఆలయం ఉంది. బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వృశ్చికేశ్వరాలయం, ΄ాపనాశనం దర్శనమిస్తాయి. ఇవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటికి కొంచెం ముందుకు వెళితే కదంబ వనం ఉంది. ఉజ్జయిని, కోల్కతా, కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు. అమ్మవారు కదంబ వనవాసిని కావడంవల్లనే ఇక్కడిలా కదంబవనం ఉందని భక్తులు చెబుతారు.త్రిపురాసుర సంహారంలో త్రిలోచనునికి వింటికి (విల్లు) త్రిపురసుందరి ధనువై రాక్షస సంహారం చేసింది. అక్కడే ఆదిపరాశక్తి అనుగ్రహం కొరకు చేసిన చిదగ్ని హోమగుండంలో, బాలత్రిపుర సుందరి అంతర్లీనం కావడం జరిగింది.శివతేజోమయం త్రిపురాంతక క్షేత్రంఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని, స్వామివారిని పూజిస్తే సకలైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా శివ కైవల్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. భూలోక కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో కోటికి పైగా శివలింగాలు, నూటికి పైగా జలాశయాలున్నాయని చెబుతారు. ప్రతి సోమ, శుక్రవారాలలో విశేష ఉత్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు శ్రావణ మాసంలోప్రత్యేక ఉత్సవాలు కార్తీకంలో అభిషేకాలు సంతర్పణలు జరుగుతాయి.ఎక్కడ ఉంది: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి మార్కాపురం మీదుగా అలాగే గుంటూరు నుండి శ్రీశైలం వెళ్లు మార్గంలో ఈ త్రిపురాంతకం వెళ్లవచ్చును. – డి.వి.ఆర్ -
సాధుత్వానిదే పైచేయి
సత్వ రజ స్తమో గుణాలు సృష్టిలో ప్రధానంగా కనబడుతుంటాయి. సాధుత్వం సత్వగుణా నికీ, రాజసం రజోగుణానికీ, అజ్ఞానం తమో గుణానికీ ప్రతీకలు. అయితే సాధుత్వమే అన్నింటి కన్నా ఉత్తమం. అందుకు ఈ కథ ప్రతీక: ఉత్తర భారత దేశంలో ఒక సాధువు నదీతీరంలో ఆకులూ, అలములూ తింటూ తిరుగుతూ ఉంటాడు. విదేశీయుడైన ఒక రాజు ఆయన్ని చూసి జాలితో తన దేశం వస్తే కూడు, గూడు, గుడ్డతో పాటు సకల సౌకర్యాలూ సమకూర్చుతానని చెబు తాడు. దానికి సాధువు ఏమాత్రం ప్రలోభపడ కుండా ప్రశాంతంగా చిరునవ్వుతో ఆ ప్రతిపా దనను తిరస్కరించాడు. దీంతో రాజు అహం దెబ్బతిన్నది. అధికారం, ధనం, దర్పం ఉన్నవాడు కనుక క్రోధాంధుడయ్యాడు. తనకు తీరని అవమానం, తిరస్కారం కలిగినట్టు భావించి కోపంతో ‘ఇదిగో చంపేస్తా’నంటూ కత్తి పైకెత్తాడు. సాధువు ప్రసన్న వదనంతో ‘రాజా! అలాగే చంపుదువులే! కాని ఈ శరీరం నేను కాదే! దీనికి భిన్నంగా ఉన్న ఆత్మను చంపలేవు. అది ఆనంద స్వరూపం, నిత్యం, సత్యం. దాన్ని నేనెప్పుడూ అనుభవిస్తూ అదే నేనుగా అభేదంగా ఉంటున్నా. ఆత్మశక్తి నీవెరుగవు. దాన్ని నీవు జయించలేవు. ఈ శక్తి నీలోను, నీ కత్తిలోను, కనబడే ప్రతి వస్తువులోను అంతటా వ్యాపించి ఉంది. నీవు కూడా అదే అయి నప్పుడు, వేరే మరొకటి లేనప్పుడు, నీవు చంపగలిగింది ఏది?’ అని ప్రశ్నించాడు. రాజు పశ్చాత్తాపంతో క్షమించవలసిందిగా ప్రాధేయ పడ్డాడు. సాధువు వెంటనే అనుగ్రహించాడు. చూచారా! జ్ఞానసంపన్నులయిన సాధువుల ముందు కామక్రోధాల రాజసం ఏమైపోయిందో! -
నైవేద్య ఫలాలు: దేవుడికి ఎలాంటి నైవేద్యం సమర్పించడం మంచిదంటే..
భగవంతుడికి ప్రతిఒక్కరూ తమ శక్తిమేర నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే సత్వరం మన కోరికలు తీరుతాయో సవివరంగా తెలుసుకుందామా..!.కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) – భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.అరటి పండు – భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండుని గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.నేరేడు పండు – శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరోగ్య వంతులు అవుతారు.ద్రాక్ష పండు – భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.మామిడి పండు – దేవుడికి మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికి పంచి ఆ తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.అంజూర పండు – భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండును అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.సపోటా పండు – సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.యాపిల్ పండు – భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్య్రం తొలగి ధనవంతులు అవుతారు.కమలా పండు – భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచి΄ోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి.పనసపండు – పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనం, రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు. (చదవండి: Rohini Karte 2025: ఈ సమ్మర్లో రోహిణి కార్తె లేనట్టేనా..? ఆ టైంలోనే రోళ్లు పగిలేలా ఎండలు పెరగడానికి రీజన్) -
Kondagattu Anjanna అంజన్న కొండ.. భక్తులకు అండ
మల్యాల: ఆపదలో అభయాంజనేయస్వామిగా భక్తులకు అండగా నిలుస్తూ, కోరిన కోర్కెలు తీర్చుతున్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం(Kondagattu Anjaneya Swamy Temple) రాష్ట్రంలో వాహనాల పూజలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. నూతన వాహనాలు కొనుగోలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకొని, వాహన పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. సామాన్యుల నుంచి మొదలుకొని, ప్రముఖుల వరకు కొం డగట్టులోనే తమ వాహనాల పూజ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఏటా వాహన పూజల భక్తుల సంఖ్య పెరుగుతోంది. మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు జనేయస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది తరలి వస్తుండటంతో నిత్యం కొం డగట్టు భక్తులతో కిటకిటలాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి మంగళ, శనివారాల్లో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శిం చుకోవడంతోపాటు, నూతనంగా వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తూ, వాహన పూజలు చేసుకుంటున్నారు.మంగళ, శనివారాల్లో..కొండగట్టులో నిత్యం వాహన పూజలతోపాటు ప్రతి మంగళవారం, శనివారాల్లో నూతన వాహనాలకు వాహనదారులు పూజలు చేసుకుంటారు. రాష్ట్రవ్యా ప్తంగా హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ప్రాం తాల నుంచి వాహనాల కొనుగోలు అనంతరం స్వామివారిని దర్శించుకొని, వాహన పూజలు చేస్తుంటారు. ప్రతి వాహనానికి ఒక్కసారి అయినా అంజన్న సన్నిధిలో పూజ నిర్వహించాలని ఏటా వేలాదిమంది వాహనదారులు కొండగట్టులో తమ వాహనాలకు పూజలు నిర్వహిస్తున్నారు. కొం డగట్టులో ఏటా దసరా పండుగ రోజు వేలాది మం ది వాహనదారులు తమ వాహనాలకు పూజలు చేసుకుంటారు. (పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్)ఆంజనేయస్వామి అభయహస్తం..శ్రీరాముడికి వాహనం హనుమంతుడు.. ఎక్కడికి వెళ్లినా తిరుగులేని కార్యాలు సాధించిన ఘనుడు హనుమంతుడు. ఈ నేపథ్యంలో వాహనాలకు ఎటువంటి ఆటంకాలు, ప్రమాదాలు కలుగవని, శుభాలు కలుగుతాయనే విశ్వాసంతో భక్తులు తమవాహనాలను కొండగట్టులో పూజలు నిర్వహిస్తుం టారు. చొప్పదండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన వాహనానికి కూడా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహిం చారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా తన ఎన్నికల ప్రచారం కోసం కొనుగోలు చేసిన వారాహి వాహనానికి కొండగట్టులోనే పూజలు చేయించడం కొండగట్టు ప్రత్యేకతకు అద్దం పడుతోంది.ఇదీ చదవండి : స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులుఏటా రూ.20 లక్షల ఆదాయంకొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వాహన పూజలు నిర్వహించుకునేందుకు వాహనదారులు ఆసక్తి చూపుతుండటంతో ఏటా వాహన పూజ ఆదాయం పెరుగుతోంది. వాహన పూజల ద్వారా సుమారు రూ.20 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. వాహనదారుల సౌకర్యం కోసం, స్వామివారి ఉచిత గర్భగుడి ప్రవేశం కల్పించి, స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తే, రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది వాహనదారులు కొండగట్టులో వాహన పూజలతోపాటు, స్వామివారిని దర్శించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.వాహనదారులకు అభయం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నూతన వాహనాలతో పాటు ఏటా ప్రతి దసరా పండుగకు ఉపయోగించే వాహనాలకు కూడా పూజలు నిర్వహిస్తుంటారు. కొండగట్టులో వాహనాలకు పూజలు నిర్వహిస్తే, ఆంజనేయస్వామి అభయం ఇస్తారని, ఎటువం టి ప్రమాదాలు జరుగవని భక్తుల విశ్వాసం. వాహన పూజల కోసం రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చి, తమ వాహనాలకు పూజలు చేసుకుంటున్నారు.- రామకృష్ణకొండగట్టు ఆలయ ప్రధాన అర్చకుడుస్వామివారి గర్భగుడి దర్శనం కల్పించాలి కొండగట్టులో వాహన పూజలకు వచ్చే భక్తుల కుటుంబాలకు స్వామివారి గర్భగుడి ప్రవేశం కల్పిం చాలి. ఏటా వాహనాలకు స్వామి సన్నిధిలో పూజలు నిర్వహిస్తాం. వాహన పూజకు ముందు స్వామివారి దర్శనం కోసం వెళ్లడంతో క్యూ లైన్లలో నిలబడటంతో జాప్యం జరుగుతోంది. వాహనపూజలు చేసుకునే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని స్వామివారి గర్భగుడి దర్శనం కల్పించాలి. - కొక్కుల రఘు, మల్యాలచదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదా -
మత్స్యరూపం.. శుభ సంకల్పం
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం తెలంగాణలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచింది. చుట్టూ ఎత్తయిన గుట్టలు, పచ్చని పంట పొలాలు.. మధ్య కొత్తగట్టు. ఆ గుట్టపై మత్స్యగిరీంద్రస్వామి ఆలయం. దీన్ని వందల ఏళ్ల కిందట నిర్మించినదిగా చెబుతారు. స్వామివారి దర్శనంతో భక్తులు పునీతమవుతున్నారు. కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి పక్కన కరీంనగర్కు 30 కి.మీ., వరంగల్కు 40 కి.మీ. దూరంలో ఉంది. విష్ణుమూర్తి మత్స్యగిరీంద్ర స్వామి అవతారానికి ప్రతీకగా గుడిలోని గుహలో వెలసిన చేప భక్తులకు దర్శనమిస్తోంది. గుహలో చేప అవతారం సృష్టికి మూలమైన చతుర్వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు తస్కరించి సప్త సముద్రాల అవతల దాక్కున్నాడని, చతుర్వేదాలను పరిరక్షించేందుకు విష్ణుమూర్తి మత్స్యవతారంలో సముద్రాలను దాటి చతుర్వేదాలను పరిరక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి మత్సా్యవతారం ధరించాక కొత్తగట్టు గుట్టపై గుహలో చేప ప్రతిరూపంతో వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. గుహలో చేప ప్రతి ఇప్పటికీ ఉండగా అద్దం ఏర్పాటు చేసి ప్రతిబింబాన్ని భక్తులు వీక్షిస్తారు.ఆలయ ఉత్సవాలు.. ఆలయంలో మత్స్యగిరీంద్రస్వామి, నర్సింహస్వామి, గుట్టపై ఆంజనేయస్వామి, శివాలయం, కోనేరు ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. ఏటా మాఘమాసంలో మత్స్యగిరీంద్రస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భీషే్మకాదశి సందర్భంగా భూదేవి, నీలాదేవి సహ స్వామివారి కల్యాణం వైభవంగా జరుపుతారు. మాఘపౌర్ణమి సందర్భంగా జాతర, నాకబలి (పుష్పయాగం), కోనేరులో చక్రస్నానం వేదపండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహిస్తారు. అనుబంధ ఆలయాల్లో హనుమాన్ జయంతి, నర్సింహ జయంతి, మహాశివరాత్రి, జాగరణ, శివకల్యాణం, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.పోలు దండ వేసుకుంటే సంతానం.. సంతానం కలుగని దంపతులు నాకబలి రోజు పోలు దండలు వేసుకుంటే సంతానం కలుగుందని భక్తుల విశ్వాసం. ధ్వజారోహణం రోజు గరుడ ముద్దల కోసం భక్తులు ఎగబడతారు. గరుడ ముద్దల ప్రసాదం దక్కిన భక్తులకు స్వామివారు, అమ్మవారి చల్లని దీవెనలు ఉంటాయన్న నమ్మకంతో పాటు సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది.శేషం వంశస్తుల పూజలు మత్స్యగిరీంద్రస్వామికి శేషం వంశస్తులు 11 వందల ఏళ్లుగా స్వామివారిని పూజిస్తున్నట్లు స్థల పురాణం చెబుతోంది. ధూప, దీప, నైవేద్యం, బ్రహ్మోత్సవాల ప్రధాన అర్చకులు శేషం మురళీధరాచార్యులు సమక్షంలో జరుగుతున్నాయి.పోచమ్మను దర్శించుకుని గుట్టపైకి.. గుట్టకింద పోచమ్మ ఆలయంలో దర్శనం చేసుకుని ఘాట్రోడ్డుపై నుంచి ఆలయం చేరుకోవాలి. కోనేరులో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు మత్స్యగిరీంద్రస్వామి, చేప ప్రతిమను దర్శించుకుంటారు. పక్కనే ఉన్న నర్సింహస్వామికి పూజలుచేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఆంజనేయస్వామి, శివాలయంలో శివుడికి పూజలు చేస్తారు.చదవండి: ఆనంద ద్వీపం.. అభివృద్ధికి ఆమడ దూరంసాగని అభివృద్ధి.. తెలంగాణలో ఏకైక మత్స్యగిరీంద్రస్వామిగా ప్రసిద్ధి చెందిన కొత్తగట్టు ఆలయ ప్రాకారం నిర్మాణం 12 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. ఏడాది కిందట గాలిగోపురం నిర్మాణానికి దాతలు కాంట్రిబ్యూషన్ చెల్లించినా.. పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కల్యాణ మండపం, ఆంజనేయస్వామి, పోచమ్మ ఆలయాలను దాతలు నిర్మించారు. ప్రత్యేక ఆకర్షణగా భారీ విగ్రహం ఎన్హెచ్ఏ–563 రహదారి టోల్గేట్ కొత్తగట్టు ఆలయం వద్ద నిర్మిస్తున్నారు. భారీ మత్స్యగిరీంద్రస్వామి విగ్రహాన్ని కరీంనగర్–వరంగల్ రహదారి పక్కన గుట్టపై ఓ భక్తుడు నిర్మిస్తున్నారు. దీంతో ఈ విగ్రహం విద్యుత్ దీపాల కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పోలు దండలు వేసుకుంటే సంతానం ధ్వజారోహణం రోజు గరుడ ముద్దల ప్రసాదం స్వీకరించి, నాకబలి రోజు సంతానం కలుగని దంపతులు పోలు దండలు వేసుకుంటే సంతానం కలుగుతుందనేది ప్రగాఢ నమ్మకం. ఇలా చేసిన అనేకమంది దంపతులకు సంతానం కలిగింది. కోనేరులో పవిత్రస్నానాలు చేసి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. పంటలకు చీడపీడలు సోకితే కోనేరులో నీటిని చల్లుకుంటే వాటి ఉధృతి తగ్గుతుందని రైతులకు నమ్మకం. – శేషం మురళీధరాచార్యులు, ప్రధాన అర్చకుడు, మత్స్యగిరీంద్రస్వామి ఆలయం, కొత్తగట్టు -
గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!
గురుకులంలో గురువుగారు శిష్యులకు ‘చాణక్య నీతి’ పాఠం చెప్తున్నారు. ‘తృణం బ్రహ్మవిదః స్వర్గం,/ తృణం శూరస్య జీవితం,/ జితాక్షస్య తృణం నారీ,/ నిరీహస్య తృణం జగత్’ – అన్న శ్లోకం చదివారు. ‘బ్రహ్మవేత్తకు స్వర్గ సుఖాదులు తృణప్రాయం. శూరుడికి ప్రాణాలు లెక్కలోనివి కావు. జితేంద్రియుడికి అందాల అప్సరసయినా గడ్డిపరక పాటిగా కనిపిస్తుంది. కోరికలు లేని విరాగికి ఈ జగత్తే ఒక గడ్డిపోచతో సమానం’ అని అర్థం చెప్పారు.‘గురుదేవా! ఈ ప్రపంచంలో అన్నిటికంటే నిరర్థకమైనది గడ్డిపోచ అన్న అర్థం ఈ శ్లోకంలో కనిపిస్తున్నది కదా?’ అని అడిగాడొక కొంటె శిష్యుడు.‘పిచ్చితండ్రీ! అలాంటి అర్థాలనే పెడర్థాలు అంటారు. తృణం నిరర్థకం కాదు. బ్రహ్మవేత్తకూ, విరాగికీ దాని వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు. అంతవరకే! ఆ మాటకొస్తే గడ్డిపోచకు యతీంద్రుడి వల్ల ప్రయోజనం లేదు. అంతమాత్రాన ఆయన నిరర్థకుడవు తాడా? మాట వరసకు చెప్పిన మాటకు పెడర్థాలు తీయకూడదు.తృణం వల్ల చాలా ప్రయోజనం ఉంది. దాని ఆయుష్షు స్వల్ప కాలం. ఆ స్వల్పకాలం పొడుగునా అది తన ముగ్ధమైన అందాన్ని ప్రదర్శిస్తూ చూపరులకు కనువిందు చేస్తుంది. అవకాశముంటే, ఒక బుజ్జి పువ్వు కూడా పూసి, లోకాన్ని మురిపిస్తుంది. ఆఖరికి, ఏ గోమాతకో ఆహారంగా తనను తాను సమర్పించుకొని, ధన్యమౌతుంది. గడ్డిపరక తేలికయిన పదార్థమే కానీ, తేలిక చేయవలసిన పదార్థం కాదు. సృష్టిలో ఏ పదార్థమూ నిష్ప్రయోజనం కాదు. ప్రయోజనం అనేది వాడుకొనే వారిని బట్టి కూడా ఉంటుంది.మరొక విశేషం గమనించు. గడ్డిపోచను ఆవు ఆహారంగా తీసుకొంటే, ఆ ఆహారం ఆవు శరీరంలో పవిత్రమైన గోక్షీరంగా పరిణమించగలదు. అవునా? గోక్షీరాన్ని పాముకు ఆహారంగా పోస్తే, ఆ ఆహారం పాముశరీరంలో భయంకరమైన విషంగా మారుతున్నది. అలాంటప్పుడు, గంగి గోవు పాలు ఘనమైనవనీ, పచ్చగడ్డి పనికిమాలినదనీ భావించటం భావ్యంగా ఉంటుందా?ఈ సృష్టిలో ప్రతి పదార్థమూ ప్రత్యేకమే, విశేషమే! ప్రతి ప్రక్రియా ఈశ్వర విలాసమే. ఈశ్వర విలాసం మనకు పూర్తిగా ఎప్పటికీ అర్థం కాదు. కారణం, అందుకు మనకున్న గ్రహణశక్తి సరిపోదు. తన మేధ పరిమితి ఏమిటో తెలియని అమాయకుడు మాత్రమే తనకు అన్నీ తెలుసుననీ,తను సర్వమూ తెలుసుకోగలననీ మిడిసి పడుతుంటాడు. అందుకేఅలాంటి వారి జ్ఞానాన్ని మిడిమిడి జ్ఞానం అంటారు. అది సంపూర్ణ జ్ఞానం కాదు. సర్వజ్ఞత్వ లక్షణం కలవాడు సాంబమూర్తి ఒక్కడే!’ అని గురువు సమాధానం చెప్పారు.– ఎం. మారుతి శాస్త్రి -
ఈ సమ్మర్లో రోహిణి కార్తె లేనట్టేనా..?
రోహిణి కార్తె అనగానే అందరికి భయమే. తెలుగు పంచాంగం ప్రకారం రోహిణి కార్తె ఎప్పుడు మొదలవుతుందా అని టెన్షన్ పడుతుంటారు. ఈ టైంలో ఉండే ఎండలు మాములుగా ఉండావు. ఠారెత్తించేలా భగభగమంటాడు సూర్యుడి. వేసవిలో ఉండే భగభగ వేడి గాల్పులు ఒక ఎత్తు..ఒక్క ఈ రోహిణి కార్తెలో ఉండే ఎండలు ఒక లెవెల్. అయితే ఈ ఏడాది రోహిణి కార్తె మే 25 ఆదివారం నుంచి జూన్ 8, 2025న ముగుస్తోంది. అంటే దాదాపు 15 రోజుల వరకు ఉంటుందని పంచాంగం చెబుతోంది. ఈ ఏడాది వేసవికాలం తన సంప్రదాయ లక్షణాలకు తిలోదాకాలు ఇచ్చేసినట్లుగా ఉంది. సాధారణంగా మే నెలలో ప్రారంభమయ్యే రోహిణి కార్తె కాలంలో భూమి బంగాళా బండలా వేడెక్కి, రోళ్లు పగిలిపోవడం సహజం. అంతేగాదు ఈ పక్షం రోజుల్లో సూర్యుడి తీవ్రత తీవ్ర స్థాయికి చేరుకుని, కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఈ సందర్భంగా రోహిణి కార్తె అంటే ఏమిటి.. ఈ కాలంలో సూర్య భగవానుడు ఎందుకని తన ప్రతాపాన్ని చూపుతాడనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నక్షత్రాలు, గ్రహాలను బట్టి పంచాంగాన్ని రూపొందిస్తారు. జాతకాలను తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో సూర్యోదయం కాలానికి ఏ నక్షత్రం దగ్గరగా ఉంటే ఆరోజు ఆ నక్షత్రం పేరు పెట్టారు. అదే విధంగా పౌర్ణమి వేళ చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరును నిర్ణయించారు. ఇదిలా ఉండగా తెలుగు వారు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగాన్ని రూపొందించుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుస్తారు. ఈ లెక్కన సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు. అంటే ఏడాదికి 27 కార్తెలు. అంతేకాదు ఈ కార్తెలను అందరికీ అర్థమయ్యే విధంగా సామెతల రూపంలో రూపొందించారు. అందులో ఒకటే రోహిణి కార్తె.ఎందుకలా అంటారంటే..?రోహిణి కార్తె అనగా మే నెలలో సూర్య భగవానుడు మన నడి నెత్తి మీదకు వస్తాడంట. అంటే మాడు మధ్య భాగానికి వస్తాడు. అంతే కాకుండా చాలా ఉగ్రరూపంగా, చండ్ర ప్రచండడుగా మారిపోయి, నిప్పులు కక్కుతూతాడంట. అవి భూమిని తాకగానే, భూమి మీద ఉన్న తేమ హరించుకపోతుంది. మొత్తం వేడిగా మారిపోతుంది. అంతే కాకుండా రాళ్లలో కూడా ఉండే కాస్త తేమ కూడా ఇంకి పోయి రోళ్లకు పగుళ్లు ఏర్పడతాయని అంటున్నారు పెద్దలు. అందువలన ఈ కాలం రాగానే రోళ్లు పగులుతాయి అంటారంట.కానీ, రోహిణి కార్తెను మాత్రం చాలా ప్రత్యేకంగా భావిస్తారు. వేసవిలో వచ్చే రోహిణి కార్తెలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. వేసవిలో వచ్చే చివరి కార్తె ఇదే. రోహిణి కార్తె వెళ్లిన తర్వాత నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత వర్షాలు.. చల్లదనం.. ఆపై మనందరికీ తెలిసిందే.పురాణాలు ఏం చెబుతున్నాయంటే..రోహిణి కార్తె సమయంలో దానధర్మాలు చేయడం అత్యంత ఫలదాయకం అని.. పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో మూడు రకాల చెట్లను నాటడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటి గురించి పురాణాల్లో కూడా మునులు, రుషి పుంగవులు ప్రస్తావించారు. హిందూ మతంలో రావి చెట్టును పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. రావి చెట్టులో విష్ణువు, లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని చెబుతారు. కనుక రావి చెట్టును పూజించడం వల్ల పుణ్యమే కాకుండా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోహిణి కార్తెలో రావి చెట్టును నాటిన వ్యక్తి తన పూర్వీకుల ఆశీర్వాదం పొందుతాడు.రోహిణి కార్తె సమయంలో రావి చెట్టును నాటడం వలన సూర్యుని వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే సూర్యగ్రహాన్ని శాంతింపజేయడంలో రావి చెట్టు చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ చెట్టును నాటడం ద్వారా జాతకంలో సూర్యుని ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడతారు. సకల దేవతలు రావి చెట్టులో నివసిస్తారు. అందుకే రోహిణి కార్తె సమయంలో కనీసం ఒక రావి చెట్టును అయినా నాటడం వల్ల దేవతలు సంతోషిస్తారని, అనుగ్రహం కురిపిస్తారని విశ్వాసం.సనాతన ధర్మంలో జమ్మి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శనిశ్వరుడి ఇష్టమైన చెట్టుగా చెబుతాయి పురాణాలు. ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే.. ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. శని దోషం తొలగి అశుభాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం, మజ్జిగా, పండ్ల రసాలు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, రాగి జావ, ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. పైగా కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు , వేపుళ్ళు , పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు.నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్నిరకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి. తెల్లని రంగు కలిగినవి, తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. ముఖ్యంగా సాటి జీవులైన పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి వంటి సామాజిక కార్యక్రమాలు చేయడం వలన గ్రహదోషాలుపోయి సుఖసంతోషాలతో ఉంటారనేది పురణా వచనం. (చదవండి: అంబేద్కర్ యాత్ర... త్రినేత్రుడి దర్శనం) -
ఇహలోక త్రిమూర్తులు ఎవరో తెలుసా?
ఒక వ్యక్తి జీవితంలో తల్లి, తండ్రి, గురువు– ఈ క్రమంలో ఈ ముగ్గురికీ అత్యంత గౌరవనీయమైన, పూజనీయమైన స్థానం ఇవ్వబడింది. జన్మనిస్తుంది కనుక తల్లి, జన్మకు కారకుడై, బాల్య, యవ్వన దశలలో పోషణ భారాన్ని వహించి, రక్షణను కలిగిస్తాడు కనుక తండ్రి, విద్యాబుద్ధులు నేర్పి సత్కార్యోన్ముఖుడిని, ప్రయోజకుడిని చేస్తాడు కనుక గురువు... సదా పూజనీయులనే అభిప్రాయాన్ని పండితులు, పూర్వ సాహిత్యవేత్తలు ప్రజలకు కలిగించారు. ఈ భావాన్ని ధ్రువీకరించిన వ్యాసుడి మహా భారతం, తల్లిదండ్రులను, గురువును పూజించడం వలన సమకూరే అధ్యాత్మిక, పారలౌకిక ప్రయోజనాలను గురించి, అనుశాసనిక పర్వం, సప్తమాధ్యాయంలోని ఈ క్రింది శ్లోకం ద్వారా, స్పష్టం చేసి చెప్పింది.యేన ప్రీణాతి పితరం తేన ప్రీతః ప్రజాపతిఃప్రీణాతి మాతరం యేన పృథివీ తేన పూజితా.యేన ప్రీణాత్యుపాధ్యాయం తేన స్యాద్ బ్రహ్మ పూజితమ్.ఒక వ్యక్తి తన తండ్రిని ప్రసన్నుడిని చేయడం ద్వారా ప్రజాపతినీ, తన తల్లిని పూజించడం ద్వారా భూదేవినీ, తన గురువును తృప్తి పరచడం ద్వారా బ్రహ్మదేవుడినీ పూజించిన వాడు అవుతున్నాడు అని పై శ్లోకం భావం. అలా, ఏ వ్యక్తి తన తల్లిని, తండ్రిని, గురువును గౌరవించడం, ఆదరించడం అన్న మూడు ధర్మాలను శ్రద్ధగా ఆచరిస్తాడో, ఆ వ్యక్తికి అన్ని ధర్మాలూ సక్రమంగా నిర్వర్తించబడిన ఫలం దక్కుతుందని, అలా కాక ఏ వ్యక్తి ద్వారా ఈ మూడు ధర్మాలు సరిగా ఆచరించబడక, అనాదరించబడతాయో, ఆ వ్యక్తి నిర్వర్తించే యజ్ఞయాగాది క్రియల వలన సమకూరే ఫలములన్నీ నిరుప యోగంగా, నిష్ఫలములుగా మారిపోతాయని కూడా ఆ సందర్భంలోనే పై శ్లోకానికి కొనసాగింపుగా చెప్పబడింది. మిగతా జీవితం ఎలా గడిచినా, వృద్ధాప్యంలో మనిషి తన సంతానం సహా యాన్నీ, ఆసరానూ కోరుకుంటాడు. ఆ రోజులలో, తాను కని, ప్రేమగా చూసుకుంటూ పెంచి, పెద్దచేసిన తన సంతానం చేతిలోనే అగౌరవానికి, నిర్లక్ష్యానికి గురికావడాన్ని మించిన మానసిక క్షోభ మనిషికి వేరే ఉండదు. వృద్ధాప్యంలో ఏ వ్యక్తికీ ఆ బాధ కలగకూడదన్న సదుద్దేశంతో చేసిన నియమాలు, చెప్పిన విషయాలు పైవి. మానవీయమైన ఈ ధార్మిక విధిని పాటించని సమాజానికి ఆధ్యాత్మిక పురోగతిఉండగలదనుకోలేము. – భట్టు వెంకటరావు -
పుణ్యకార్యం... పాపకార్యం
అర్థం తెలిసినా తెలియకపోయినా ఈమాటలని మాత్రం అందరూ తరచు వాడుతూనే ఉంటారు. ‘‘నీకు పుణ్యం ఉంటుంది బాబూ ఈ పని చేసి పెట్టు.’’ ‘‘పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు’’, ‘‘ఏ పూర్వ పుణ్యమో’’ ‘‘పాపం పుణ్యం దేవుడికే ఎరుక’’ ‘‘పాపం పండింది’’. ‘‘ఎవడి పాపాన వాడే పోతాడు.’’ ఇటువంటి సామెతలు, నానుడులు అందరి నోళ్లలోనూ నానుతూ ఉంటాయి. పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి? అన్నది ఎంతమందికి తెలుసు? ఏదో వ్రతం చేస్తే, పూజ చేస్తే, పుణ్యం వస్తుందిట! వ్రతం అవగానే ఇతరులని బాధ పెట్టినా కూడా పుణ్యం వస్తుందా? ఆలోచించాలి. పాప పుణ్యాలకు వ్యాసభగవానుడు చక్కని నిర్వచనం ఇచ్చాడు.‘‘అష్టాదశ పురాణసారం శ్లోకార్థేన ప్రవక్ష్యామిపరోపకారాయ పుణ్యం, పాపాయ పరపీడనం’’ ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం, అపకారం చేస్తే పాపం. పైగా ఇది పదునెనిమిది పురాణాల సారం అని కూడా చె΄్పాడు. ఏవేవో మహత్కార్యాలు చేయనవసరం లేదు. శక్తిమేరకు ఎవరికైనా సహాయం చేయటం, వీలైనంత వరకు ఎవరినీ బాధ పెట్టకుండా ఉండటం చేస్తే చాలు. మొదటి దానివల్ల పుణ్యం వస్తుంది. రెండవ దాని వల్ల పాపం రాకుండా ఉంటుంది. ఇవి ఎంత తేలిక అంటే చేయాలి అనిపించదు. మనిషికి పుణ్యం కావాలి. కాని, పుణ్యకార్యాలు చేయడు. ‘‘సత్కర్మంబు లెవ్వియు చేయ జాలరు కలియుగంబున మానవుల్’’ అంటాడు వ్యాసభగవానుడు భాగవతంప్రారంభంలో. పాపం వద్దు అనుకుంటాడు. కాని చెడ్డ పనులు మానలేడు. ఈ ఒక్కసారికే అని తనకి తాను సద్ది చెప్పుకుంటాడు. దీనికి దుర్యోధనుడు ఉదాహరణ. ‘‘నాకు ధర్మం తెలుసు. కాని, నా మనసు దానిమీదకి పోదు. నాకు అధర్మమూ తెలుసు. కాని, నా మనసు దాని నుండి మళ్లించలేను.’’ అంటాడు. ఈ లక్షణం అందరిలోనూ ఇంతో అంతో ఉంటుంది. కాని, ఆ సంగతి పైకి ధైర్యంగా చెప్పలేరు. కొంతమంది ఈ గుణం తమలో ఉన్నట్టు గుర్తించరు కూడా. తాము చేసేది ధర్మమే అని నమ్మేవారు కొంతమంది. మరికొంతమంది ధర్మం కాదని తెలిసినా సమర్థించుకుంటూ ఆత్మవంచన చేసుకునే వారు కూడా ఉన్నారు. వైద్యుడు దుష్టాంగాన్ని కత్తితో కోస్తాడు. అది పాపకార్యం అవుతుందా? యుద్ధంలో సైనికుడు శత్రువుని సంహరిస్తే, అది పుణ్యకార్యమే కాని, పాపం కాదు. చేసే పని ఉద్దేశం, దానివల్ల కలిగే ప్రయోజనం పాపమా? పుణ్యమా? అన్న దానిని నిర్ధారిస్తుంది. ఏ పనీ దాని అంతట అది మంచిది కాని, చెడ్డది కాని కాదు. ఫలితం మేలు కలిగిస్తుందా? హాని కలిగిస్తుందా అన్న దాని మీద ఆధార పడి ఉంటుంది. నవ్వి, పాటలు పాడి, బాధించే వారు లేరా? అది పాపమే కదా! భావనకేప్రాధాన్యం. కొన్నిసార్లు కఠినంగా మాట్లాడటం, ప్రవర్తించటం అవసరమే. దాని వల్ల పాపం చుట్టుకోదు. తమ్ముడు భ్రష్టుడై ఇల్లు గుల్ల చేసి వెళ్ళిపోయాడని తెలిసి పుట్టింటికి వచ్చిన నిగమశర్మ అక్క తల్లితండ్రులను ‘‘తీండ్ర గల వచన రచనా చమత్కారంబుల కొంత కొంత వంతకుం తొలంగించుచు ..’’ అంటాడు తెనాలి రామకృష్ణుడు. ఓదార్పు దుఃఖాన్ని, ఆత్మన్యూనతాభావాన్ని పెంచే అవకాశం ఉంది. తిక్కగా ఏడుస్తున్న పిల్లవాడిని తిక్క నుండి బయటకు తీసుకు రావటానికి చిన్న దెబ్బ వేయటం క్రూరకృత్యం అనలేము కదా! అప్పుడు స్పృహలోకి వచ్చి మామూలు ఏడుపు ఏడుస్తాడు. – డా.ఎన్. అనంతలక్ష్మి -
రామాయణం చూద్దాం పిల్లలూ...
మన దేశంలో రామాయణం తెలియని వారూ వానకు తడవని వారూ ఉండరు. సీతారాముల కథ రామాయణంగా వేల సంవత్సరాలుగా జనంలో ఉంది. రాముడు ఎందుకు దేవుడయ్యాడంటే రావణాసురుడనే రాక్షసుణ్ణి ఓడించాడు కాబట్టి. మీకు రామాయణం పై అవగాహన ఉండాలి. చదవడం ద్వారానే కాకుండా సినిమాలు చూడటం ద్వారా కూడా రామాయణం తెలుసుకోవచ్చు. తెలుగులో ఎన్నో మంచి సినిమాలు రామాయణంపై వచ్చాయి. అవి...రాముడిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆయన పితృవాక్య పరిపాలకుడు. అంటే తండ్రి చెప్పే మాట జవదాటడు. మన కన్నతండ్రిని గౌరవించే పద్ధతి అది. మీరు మీ నాన్న మాట వినకపోతే అది రాముడి మార్గం కాదు. అలాగే రాముడికి తన సోదరులంటే ఎంతో ఇష్టం. లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు... ఈ ముగ్గురిని ఎంతో అభిమానించాడు. భార్య సీతను ఎంతో గౌరవించాడు, ప్రేమించాడు. దుర్మార్గుడైన రావణాసురుడు ఆమెను ఎత్తుకొని పోతే సీత కోసం నిద్రాహారాలు మాని అన్వేషించాడు. అలాగే హనుమంతుడు వంటి బంటును ఎంతో ఆదరించాడు. రాముడు వీరుడు. శూరుడు. ప్రజలను గొప్పగా పాలించి ‘రామరాజ్యం చల్లని రాజ్యం’ అనిపించుకున్నాడు. ఇంకా రామాయణం చదివినా, చూసినా ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. మీరు ఆ సినిమాలు చూడండి... సెలవులు మరికొన్ని రోజులే ఉన్నాయి. అందుకే రోజుకు ఒక రామాయణం సినిమా చూడండి. మీకు భాష తెలియకపోయినా, పాత్రలు తెలియకపోయినా అమ్మనో, నాన్ననో, అమ్మమ్మనో అడగండి. ఈ సినిమాలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి.1. సీతారామ కల్యాణం:ఇది 1961లో వచ్చిన సినిమా. ఇందులో ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’ అనే గొప్ప పాట ఉంది. సీతా రాముల కల్యాణం, తర్వాత రావణాసురుడి ప్రవేశం అన్నీ మీరు చూడొచ్చు. ఆనాటి నటీనటులను తెలుసుకోవచ్చు. భాషను గమనించవచ్చు.2. లవకుశ: ఈ సినిమా తప్పక చూడాలి. తెలుగు వారందరూ ఈ సినిమా చూస్తారు. సీతారాములకు లవకుశులనే కుమారులు ఉన్నారని తెలుసు కదా. వారి గురించిన కథ ఇది. సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఉండి లవకుశులకు జన్మనివ్వగా వారు తమ తండ్రి అయిన రాముణ్ణి ఎలా చేరుకున్నారో ఈ సినిమాలో చూడొచ్చు. వాల్మీకిగా నటించిన నటుడి పేరు నాగయ్య గారు. ఆయన ఎంత చక్కగా నటిస్తారో, మాట్లాడతారో గమనించండి. అలాగే కుశ లవులుగా నటించిన బాల నటులను చూడండి. ఈ సినిమాలో ఎన్నో మంచి పాటలు ఉన్నాయి. వాటిని నేర్చుకొని పాడొచ్చు.3. సంపూర్ణ రామాయణం:పిల్లలూ... బాపు అనే దర్శకుడు 1972లో తీసిన సినిమా ఇది. రామాయణ గాథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. వాటి ఆధారంగా మనవారు సినిమాలు తీస్తుంటారు. అయితే ఈ సినిమా మాత్రం వాల్మీకి రామాయణాన్ని ప్రొమాణికంగా తీసుకుని అందులోని ఆరు కాండలను చూపుతుంది. అంటే వాల్మీకి రామాయణంగా రాసింది ఏమిటో తెలియాలంటే ఈ సినిమా చూస్తే సరిపోతుందన్న మాట. తప్పక చూడండి.4. శ్రీరామ పట్టాభిషేకం: రామాయణ గాథను ముఖ్య కాండలతో చూపిన మరో సినిమా ఇది. ఇందులో అయోధ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధ కాండలను సమగ్రంగా చూపించారు. వనవాసంలో ఉన్న సీతారాముల వద్దకు మాయలేడిని పంపి రాముడు దాని కోసం వెళ్లగా ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించుకునే ఘట్టం ఈ సినిమాలో మీరు చూడొచ్చు.5. రామాయణం: రామాయణ సినిమాల్లో పెద్దవాళ్లు పాత్రల్ని ధరిస్తారు. కాని అందరూ పిల్లలే రామాయణ పాత్రలు ధరిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో వచ్చినదే ‘రామాయణం’. ఇప్పుడు జూ.ఎన్టీఆర్గా మీ అందరికీ తెలిసిన తారక్ ఈ సినిమాలో రాముడిగా నటించాడు. గుణశేఖర్ దర్శకత్వం వహించగా ఎం.ఎస్.రెడ్డి నిర్మించారు. రామాయణం పూర్తి కథ ఈ సినిమాలో ఉంది. 1997లో ఈ సినిమా వచ్చింది.6. శ్రీ రామరాజ్యం: లవ–కుశుల కథపై వచ్చిన మరో సినిమా ఇది. ఇందులో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించడం విశేషం. ఇది కూడా దర్శకుడు బాపు తీసినదే. ఇందులో ‘జగదానంద కారకా’ అనే మంచి పాట ఉంది.ఇవే కాదు... ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్‘ కూడా రామాయణం మీదే. ఇప్పుడు మళ్లీ రామాయణం మీద భారీ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా ఒక సినిమా నిర్మాణంలో ఉంది. సూర్యచంద్రులు ఉన్నంత కాలం రామాయణం పై పుస్తకాలు, సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆ కథను మీరు ఎన్నిసార్లు తెలుసుకున్నా మరోసారి తెలుసుకుంటూనే ఉంటారు. అదీ దాని మహత్తు. -
జై హనుమాన్, వాడవాడలా హనుమజ్జయంతి వేడుకలు
చంపాపేట: చంపాపేట డివిజన్ కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ లావణ్య పర్యవేక్షణలో సింధూర అభిషేకం, ఆకుపూజ, అర్యనలు తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మన్సూరాబాద్లో.. మన్సూరాబాద్: మన్సూరాబాద్లో పలు ప్రాంతాల్లో గురువారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. మోహన్నగర్లో.. నాగోలు: హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తపేట డివిజన్ మోహన్నగర్లో హనుమాన్ యువసేన అధ్యక్షుడు యశ్పాల్గౌడ్ ఆధ్వర్యంలో హోమం, హనుమంతుడికి అభిõÙకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మధుసూదన్రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, నాయకులు భరత్ కుమార్ గౌడ్, గీతారెడ్డి, మహిపాల్ రెడ్డి, బొక్కబాల్ రెడ్డి, లింగాల నాగేశ్వరరావు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఐఎస్సదన్, సైదాబాద్ డివిజన్లలో.. సైదాబాద్: ఐఎస్సదన్, సైదాబాద్ డివిజన్ల పరిధిలోని పలు ఆలయాలు ఆధ్యాతి్మక శోభతో వెల్లివిరిసాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సైదాబాద్ శంకేశ్వరబజార్లోని శివాలయంలో నిర్వహించిన హోమంలో ఐఎస్సదన్ డివిజన్ కార్పొరేటర్ దంపతులు జంగం శ్వేతామధుకర్రెడ్డి పాల్గొన్నారు. సైదాబాద్ పూజలబస్తీలోని శ్రీశివాంజనేయ స్వామి దేవాలయంలో సుభాష్చందర్జీ పూజల్లో పాల్గొన్నారు. రామకృష్ణపురం డివిజన్లో.. దిల్సుఖ్నగర్: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన పూజల్లో ఆర్కేపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ దేప సురేఖ భాస్కర్రెడ్డి పాల్గొని మాలధారణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, పున్న నిర్మల గణేష్ బండి మధుసూదన్ రావు, తలాటి రమేష్ నేత, సురేష్ పాల్గొన్నారు. ఘనంగా హనుమాన్ జయంతి గోల్కొండ: హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. షేక్పేట్లోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా గోల్కొండ రిసాలబజార్లోని హనుమాన్ ఆలయంలో మహంకాళి ఆలయ పూజారి బి.సురేష్చారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి నిర్వహించారు. పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన... చాంద్రాయణగుట్ట: రాజన్నబావి ప్రాంతంలోని భవానీ శంకర ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో గురువారం 21 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా సర్వధర్మ సనాతన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రతిష్టించారు. శ్రీమఠం నరసింహాచార్య కాకునూరి రవి నారాయణ శర్మ, శ్రీ కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారికి వాయుస్తుతి పునశ్చరణతో అభిషేకం, 108 కలశాలతో పంచుముఖ ఆంజనేయ స్వామి వారికి కుంభాభిషేకం, అష్టోత్తర శతనామావళి, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె.వెంకటేష్లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అధ్యక్షుడు మధుసూదన్ రావు, ఫ్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రాజు ముదిరాజ్, మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఘనంగా తమలపాకు పూజ.. హనుమాన్ జయంతి సందర్భంగా లాల్దర్వాజా పూల్బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సంకట మోచన హనుమాన్ స్వామికి అభిషేకం తమలపాకు పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాశెట్టి లెనిన్బాబు దంపతులు, ట్రస్టీ వెంకటేశ్వర రావు, ప్రధాన అర్చకులు మోహనాచార్యులుతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోషామహల్లో.. అబిడ్స్: హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గోషామహల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సంతోష్ గుప్తా పాల్గొని పూజలు చేశారు. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. గోషామహల్, జాంబాగ్, ఆగాపురా, ఆసిఫ్నగర్, బేగంబజార్, ధూల్పేట్ తదితర ప్రాంతాల్లోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
Hanuman Jayanti 2025 భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
రాయదుర్గం: హనుమంతుడి జయంతిని ఆలయాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జీపీఆర్ఏ క్వార్టర్స్లోని రాజరాజేశ్వరి సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామికి, గచ్చిబౌలోని శివసాయిక్షేత్రంలో ఆంజనేయస్వామికి, ఇందిరానగర్లోని ఇంటర్నేషనల్ శ్రీహనుమాన్ ధామ్ ఆశ్రమ్ ఆలయంలో, మధురానగర్, ఖాజాగూడ, నానక్రాం గూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, గౌలిదొడ్డి, గోపన్పల్లి, టెలికామ్నగర్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిõÙకాలు, అర్చనలు, ఆకుపూజ, ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇదిలావుండగా గచ్చిబౌలిలోని శివసాయిక్షేత్రంలో హనుమాన్ హోమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా ఆకుపూజ, వడమాలతో అలంకారం చేశారు. పెద్ద సంఖ్యలో స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. మియాపూర్లో.. మియాపూర్: మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణనగర్కాలనీ, మియాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గాందీ, కార్పొరేటర్ శ్రీకాంత్తో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గాం«దీ, కార్పొరేటర్ శ్రీకాంత్ను సన్మానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఆంజనేయస్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. చుట్టు పక్కల కాలనీల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సుభాష్ చంద్రబోస్నగర్ కాలనీలో.. చందానగర్: హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్నగర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గాంధీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్యాదవ్, సాంబశివారావు, బృందరావు, అంకరావు, సత్యం, రామకృష్ణ, వెంకటేష్, రవి, అప్పలరాజు, ఆలయ కమిటి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
Ego అహం పతనానికి నాంది
గర్వం, అహంకారం అన్నవి మహాచెడ్డ దుర్గుణాలు. మానవులకు ఏవిధంగానూ శోభించని లక్షణాలు. నిజానికి ఇవి షైతాన్ గుణాలు. కేవలం అహం కారణంగానే దైవానికి అవిధేయుడై దుర్మార్గుల్లో కలిసి పొయ్యాడు, ధూర్తుడిగా మిగిలి పోయాడు. దైవం మానవుణ్ణి సృష్టించిన తరువాత, అందరూ అతనికి సజ్దా (సాష్టాంగ ప్రణామం) చెయ్యాలని ఆదేశించాడు. కాని షైతాన్ చెయ్యలేదు. ఈ విషయం పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది.: ’ ... ఆ తర్వాత మేము ఆదంకు గౌరవ సూచకంగా అభివాదం చెయ్యండని దైవదూతలను ఆదేశించాము. అప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ అభివాదం చేశారు. ఇబ్లీసు తనేదో గొప్పవాణ్ణన్న అహంకారంతో విర్రవీగుతూ, తిరస్కరించి అవిధేయుడై పొయ్యాడు.’(2 – 34). అల్ ఆరాఫ్ సూరా 11, 12 వాక్యాల్లో, సాద్ సూరా 73, 74, 75 లో కూడా ఈ ప్రస్తావన ఉంది.అహం అంటే.., తానే గొప్పవాడినని భావించడం. ఇతరులను తక్కువగా, హీనంగా చూడడం. అన్నీ, అంతా తనకే తెలుసని, ఇతరులకేమీ తెలియదని తల΄ోయడం. షైతాన్ ఇక్కడ రెండు తప్పులు చేశాడు. ఒకటి: దైవాదేశాన్ని తిరస్కరించాడు. రెండు: ఆదిమానవుణ్ణి తనకన్నా తక్కువ వాడుగా, నీచుడిగా చూశాడు. అంటే, తన సృజన అగ్నితో జరిగింది కాబట్టి, మట్టితో సృష్టించబడిన వాడికంటే తానే గొప్పవాడినన్న అహం అతడి సత్యతిరస్కారానికి కారణమైంది. ఈ విధంగా వాడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు.సత్యాన్ని సత్యంగా అంగీకరించాలంటే, ఇతరులను గౌరవ దృష్టితో చూడగలగాలంటే, ’అందరి’ కన్నా గొప్పవాడయిన సృష్టికర్త ఆదేశాలను పాలించగలగాలి. కాని అతనిలోని అహం మరెవ్వరినీ తనకన్నా గొప్పవాడుగా అంగీకరించడానికి ఒప్పుకోదు. సమాజంలో తనకో గొప్పస్థానం ప్రాప్తం కావాలని కోరుకుంటాడు. మరెవరూ తన స్థాయికి, కనీసం తన దరిదాపుల్లోకి రావడాన్నీ సహించలేడు. అంతా తనకే తెలుసునని, ఎదుటివారికి ఏమీ తెలియదని, తనమాటే చెల్లుబాటు కావాలని అభిలషిస్తాడు. ఈ వైఖరి సరయినది కానప్పటికీ, ఎదురు దెబ్బలు తగులుతున్న ప్పటికీ అతనిలోని ’ అహం ’ తప్పుడు వైఖరి గురించి ఆలోచించే అవకాశమే ఇవ్వదు. మంచి అనేది ఉంటే అది తనలోనే ఉందని, ఇతరులు చేరుకోక ముందే తాను దాన్ని అంది పుచ్చుకుంటానని అతను భావిస్తాడు. ఎదుటి వారిలోని ఏమంచినీ, ఏ నైతిక సుగుణాన్నీ అతను అంగీకరించడు. నైతిక వర్తను డైనా, సౌజన్యశీలుడైనా అంతా తానేనని తల΄ోస్తాడు.చదవండి: Ashtavakra అష్టావక్ర సందేశంఇలాంటివారు తమ అహంకార వైఖరి కారణంగా తమను తామే నష్టపరుచుకుంటారు తప్ప మరొకటి కాదు. ఇదంతా తమకే అంతా తెలుసు, ఎదుటి వారికి ఏమీ తెలియదనుకున్న ఫలితం. వారి మనసులో తామేదో గొప్పవాళ్ళమన్న అహంకార భావం తిష్ట వేసుకొని ఉంటుంది. ఇది ఎంతమాత్రం మంచి విధానంకాదు. గర్వం, అహంకారం లాంటి దుర్లక్షణాల నుండి దైవం అందరినీ కాపాడాలని కోరుకుందాం.ఇదీ చదవండి: ఎవడు వివేకి? ఎవడు అవివేకి? -
ఎవడు వివేకి? ఎవడు అవివేకి?
వివేకి లోక విషయాల్లోని దోషాన్ని గ్రహిస్తాడు. అలౌకికాన్ని ఆరాధిస్తాడు. అవివేకి అజ్ఞానంతో లౌకిక విషయాసక్తుడై అలౌకిక సత్యాన్ని ఆలోచించలేడు. పైగా లౌకిక విషయ సుఖమే సత్యంగా భావించి దాన్ని అనుభవిస్తూండటం వివేకమనుకుంటాడు. అటువంటి వారు అతితెలివితో భ్రాంతచిత్తులయి తమాషాగా ప్రవర్తిస్తారు. అలాంటి కథ ఇది:మిక్కిలి తెలివి గల ఒక రాజు ఉన్నాడు. మనిషి మంచివాడే. కాక పోతే కొంచెం వక్రంగా ఆలోచిస్తాడు. అందుకే అందరికంటే వివేక హీనుడెవడో చూచి వాడికి సన్మానం చేయాలనుకుంటాడు. అటువంటివాడిని తీసుకురమ్మని సేవకులను రాజ్యం నలుమూలలకూ పంపాడు. అతి కష్టం మీద రాజసేవకులు ఏ పనీ చేయని, ఎవరి తోనూ మాట్లాడని, చింపిరి గుడ్డలు కట్టుకొని ఆకులు అలములుతింటూ తిరుగాడేవాడిని తీసుకొస్తారు. రాజు కూడా అవివేకి ఇతడే అని సంతోషించి సన్మానంలో ఒక వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని అతనికి బహూకరించాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజుకు తీవ్రమైన రోగం వచ్చింది. ఎవరూ వైద్యం చేయలేమని చేతులెత్తేసిన సమయంలో అవి వేకిగా సన్మానితుడైన మనిషి వచ్చి రాజు రోగాన్ని నయం చేస్తానన్నాడు. చదవండి: Ashtavakra అష్టావక్ర సందేశంఅయితే వైద్యం ప్రారంభించే ముందు... ‘ఓ రాజా! మీరింతవరకూ సుఖాలెన్నో అనుభవిస్తూ వచ్చారు. మరి మీరు చనిపోతే మీ శరీరం ఈ సుఖభోగాల ననుభవించలేదు కదా! అందువల్ల మర ణించే ముందైనా, ఇప్పటినుంచే ఆ భోగాలన్నింటినీ వదిలిపెట్టి ఉండగలరా చెప్పండి?’ అన్నాడు. ‘ఇంతవరకు అలవాటు పడిన ఈ భోగాలను వదలి ఉండలేను’ అని సమాధానం చెప్పాడు రాజు. ‘రాజా! నేను ఆకులలములు తింటూ ఏవో గుడ్డ పీలికలు కట్టుకొని, కటిక నేలపై పడుకొంటూ ఇప్పటికీ సుఖంగానే ఉన్నాను. మరి నాకు కష్టం, సుఖం వేరుగా కనబడలేదు. నాకెంతో తృప్తిగా ఉంది. కానీ మీరు, ప్రాణాంతకమైన రోగం వచ్చినా రక్షించలేని ఈ సుఖాలను, కొంతకాలమైనా వదిలి పెట్టలేకపోతున్నారు. అన్నీ ఉన్నా మీకు తృప్తిలేదు. విషయ సుఖలాలసత ఇంకా కోరుతున్న మీరు, సిసలైన అవివేకులు. కనుక మీరు నాకిచ్చిన వజ్రపుటుంగరం తిరిగి మీకే ఇస్తున్నాను తీసుకోండి’ అని ఉంగరం ఇస్తూ తన యోగదృష్టి పాతంతోనే రాజుకు పరిపూర్ణమైన ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించాడాయన.చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?ఆయన ఎవరో కాదు. సర్వసిద్ధులూ కలిగిన ’అవధూత’. ‘విరతి రాత్మరతి శ్చేతి వివేకస్య పరమం లక్షణమ్’. విషయసుఖాలపై వైరాగ్యముండటం, సర్వదా ఆత్మానుసంధానంతో ఉండటమూ వివేకానికి లక్షణమని అర్థం. అవధూత స్థితి ఇలాంటిది. కనుక గురూపదేశంతో ప్రతి ఒక్కరూ సుఖదుఃఖ సమభావన సాధించాలి.-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
హనుమ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాసం
సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యంచేసే తెగువ, అసాధారణ కార్యదక్షత, భయాన్నీ, నిరాశానిస్పృహలను దరిచేరనివ్వని ధీశక్తి... ఈ లక్షణాలకు తోడు ఎదుటివారిని ప్రభావితం చేయగలిగే వాక్పటుత్వం... ఇవన్నీ కలబోసుకున్న ఒక విశిష్ఠ వ్యక్తి హనుమ. కేవలం ఆయనను దైవంగా పూజించడంతో సరిపెట్టుకోకుండా ఆయన బుద్ధిబలం, దేనినైనా సాధించి తీరాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యం, దేహ దారుఢ్యం వంటి వాటిని అలవరచుకోగలగాలి. నేడు హనుమజ్జయంతి సందర్భంగా ఆయనలోని వ్యక్తిత్వ వికాస కోణాన్ని చర్చించుకుందాం.జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతం మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. అయినా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరం మీద నుంచి చూసి భయపడిపోతున్న సుగ్రీవునికి ధైర్యం చెప్పేప్రయత్నం చేస్తాడు హనుమ ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే సుగ్రీవునికే కాదు మనకు కూడా నిర్భయత్వాన్ని అలవరచుకోవాలనే పాఠం చెప్పే గురువుగా.. మంత్రిగా... సన్మిత్రుడిగా దర్శనమిస్తాడు. ‘సుగ్రీవా! నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని భయపడితే ఎలాగయ్యా.. నడక చేత, అవయవాల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు?‘ ఈ విధంగా హనుమ తొలిసారిగా కనిపించగానే నిర్భీకతను బోధించే గురువుగా దర్శనమిస్తాడు.సమయోచిత వేష భాషలుఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేషధారణ అవసరమని చెపుతూ ఉంటాం. సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక యతి వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా! తాను స్వతహాగా అత్యంత శక్తిమంతుడైనా వ్యక్తి కంటే ధర్మం గొప్పది అని నమ్మిన వాడు గనకనే అధర్మపరుడైన వాలితో కాక సుగ్రీవునితోనే వుంటాడు ఆంజనేయుడు. అతను మాట్లడిన నాలుగు మాటలకే మురిసి పోతాడు తానే పెద్ద వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు. హనుమంతుని సంభాషణా చాతుర్యాన్ని గురించి ‘‘చూశావా లక్ష్మణా, ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనకి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమలు నిష్కారణంగా కదలడం లేదు, లలాటం అదరడం లేదు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని అనవసరంగా కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నాడు’’ అని రాముడు తన సోదరుడైన లక్ష్మణునితో చెబుతాడు. అంటే దీనిని బట్టి మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి.ఆయన జీవితమే ఓ పాఠ్యపుస్తకంనేను చేపట్టిన కార్యం అసాధ్యమేమో అని భయపడుతూ ఉండిపోతే ఏ కార్యం కూడా సాధ్యం కాదు... ఉదాహరణకు హనుమకు అప్పగించిన పనినే తీసుకోండి. సీతను అతను ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎలాఉంటుందో తెలియదు. ఆమెను ఎత్తికెళ్ళింది ఎవరో తెలియదు ఎక్కడ దాచి ఉంచాడో తెలియదు. ఐనా నెల రోజులలో ఆమె ఆచూకీ తెలుసుకొని వస్తానని బయలుదేరతాడు హనుమంతుడు. అంటే సవాళ్లను స్వీకరించి వాటిని సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అనే అంశాన్ని నేర్చుకోవడానికి హనుమ జీవితమే మనకు ఒక పెద్ద ఉదాహరణ. వినయగుణ సంపన్నుడుసముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమ ప్రవర్తన చూసి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేర్చుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేటంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ ఎగిసి ఎగిసి పడలేదు. శ్రేయాంసి బహు విఘ్నాని అని ఉత్తమ కార్యంలో అనేక విఘ్నాలు ఎదురవుతూనే ఉంటాయి. అవాంతరాలను ఎదుర్కొని కార్య సాధన చేయడమెలాగో, తొణకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కపెట్టడమెలాగో హనుమనే మనకు చేసి చూపించాడు. మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి ΄÷మ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలంగా కనిపించే విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి. భుజబలాన్నీ, బుద్ధి బలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటి లోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం ఇది ఒక గొప్ప కళ. అశోక వనంలో సీతతో మాట్లాడుతున్నప్పుడు చూడాలి హనుమ చాతుర్యం. ‘అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా‘ అన్న పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి.సమర్థుడైన కార్యసాధకుడుఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమ దగ్గర నేర్చుకోవాలి. అంతిమ విజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవ తీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి. సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు. కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించే అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం. అక్కడికక్కడ నిర్ణయాలను తీసుకోగలగడం ఒక సమర్థుడైన కార్యసాధకుడి లక్షణం. హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వ వికాస లక్షణాలనూ, సకారాత్మక ఆలోచనా విధానాన్నీ, యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. సంభాషణా చతురుడులంక నుంచి తిరిగి వచ్చిన తరువాత దూరంనించే ‘దృష్టా సీతా‘ అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు. అలాకాకుండా మైనాకుడూ, సరమా, సింహికా, లంఖిణీ అని నస మొదలు పెడితే వినేవారికి ఆందోళన. పెరిగిపోవడం ఖాయం. అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాతుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీద కూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇదీ మనం నేర్చుకోవాలి హనుమ దగ్గర. ఎలాంటి వారికైనా సహజంగానే పరిస్థితుల ్రపాబల్యం వల్ల ఒక్కొక్కసారి దారుణమైన ఆవేదన, గ్లాని కలుగుతూ ఉంటాయి గానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలిగి, నిర్వేదం నుంచి తక్షణమే బయటపడగలిగితేనే ఏదైనా సాధించగలం. – డి.వి.ఆర్. -
Ashtavakra అష్టావక్ర సందేశం
మహాభారతంలో నీతులను నేర్పించే కథలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే అది నిత్యనూతనంగా కనపడుతుంది. అందులో ఒక కథను చూద్దాం. ఏకపాదుడు మహా తపశ్శాలి. గొప్ప విద్వాంసుడు. రాత్రింబవళ్ళు శిష్యుల చేత వేదాధ్యయనం, విద్యాభ్యాసం చేయిస్తుండేవాడు. అతడి భార్య సుజాత గర్భవతిగా ఉన్నపుడు గర్భంలోని శిశువు తండ్రితో, ‘నువ్వు రాత్రింబగళ్ళు విరామం లేకుండా శిష్యుల చేత వేదాధ్యయనం చేయిస్తున్నావు. నిద్ర లేకపోవడం వల్ల, విసుగు చేత వాళ్ళు అధ్యయనం చేసే వేదంలో దోషాలుంటున్నాయి. అలాంటి విద్య నేర్చుకోవడం వల్ల ప్రయోజనమేమిటి?’ అని అన్నాడు. అప్పుడు ఏకపాదుడు, ‘నువ్వు వేదాధ్యయనంలో దోషాలెన్నడమంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించి నట్లుంది. అధిక ప్రసంగం చేసి వేదాన్ని వక్రంగా విమర్శించావు కాబట్టి ‘అష్టావక్రుడవై పుట్టు’ అని శపించాడు. అతడు అలాగే పుట్టాడు. ఆ తర్వాత ఏకపాదుడు జనకమహారాజు ఆస్థానంలో వంది అనే వేదపండితునితో వాదించి, ఓడి, బందీ అయ్యాడు. అష్టావక్రుడు పోయి వందితో వాదించి, ఓడించి తన తండ్రిని విడిపించి ఇంటికి తెచ్చాడు. (పుటలు 296–297–అరణ్యపర్వము–శ్రీమదాంధ్ర మహాభారతము, రామకృష్ణ మఠం).ఇదీ చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?నేడు ఎందరో తల్లితండ్రులు, కోచింగ్ సెంటర్ వాండ్లు వాళ్ళ పిల్లలకు, విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలని విరామంలేకుండా వారిని ఉదయం నుంచి రాత్రి వరకు చదివిస్తున్నారు. వారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నారు. ఆ పిల్లలు మానసిక రోగాలకు శారీరక రోగాలకు గురువుతున్నారు. ర్యాంకుల మాట దేవుడెరుగు. వారు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. అట్టి విద్య వల్ల ప్రయోజనం లేదంటుంది ఈ కథ. ఇక మహా తపశ్శాలి అయిన ఏకపాదుడు కోపానికి గురై కన్న కొడుక్కే శాపమిచ్చాడు. కోపం దుష్పలితాలను ఇస్తుందని హెచ్చరిస్తుంది ఈ కథ. శపించిన తండ్రినే విడిపించుకొని తెచ్చాడు కొడుకు. తల్లితండ్రులపై అలాంటి ప్రేమ సంతానానికి ఉండాలని బోధిస్తుంది ఈ కథ.– రాచమడుగు శ్రీనివాసులు -
అశ్వినీ దేవతలు ఎవరు?
అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరు దయార్ద్ర హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర, ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని, విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఉంటాయని పురాణ వర్ణితం.వీరు విరాట్పురుషుని నాసికాభాగంలో ఉంటారు. వీరిసోదరి ఉష. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యం అంటే బంగారంతో నిర్మితమైనది. ఆ రథాన్ని అధ్వరాశ్వాలనే మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అవి తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి. ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరం గా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠధ్వని... శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! ఈ క్షణమే సచ్చిదానందంనీవు ‘ఈ క్షణం’లో ఉన్నప్పుడు కాలం, ప్రదేశం అనేవే ఉండవు. అవి లేనప్పుడు దుఃఖం కూడా ఉండదు. ఈ క్షణంలో ఉన్నపుడు నీవే దైవం. అదే అత్మసాక్షాత్కార స్థితి. సచ్చిదానంద స్థితిలో ఉంటావు. నీవే దైవమైనప్పుడు నీ గురించి ఎవరేమి అనుకున్నా నీకు చెందదు కదా! అసలు వ్యక్తి అనేదే మనస్సు కల్పితం. ఈ క్షణంలో మనస్సు–శరీరం అనేవే ఉండవు. శరీరం–మనస్సు అనేవి కాలం–ప్రదేశము అనేవాటితో కలిసే ఉంటాయి. శరీరం ప్రదేశానికి సంబంధించినదైతే, మనస్సు కాలానికి సంబంధించినది. నీవు ఈ దేశకాలాలకు అతీతమైన స్థితిలో ఉండాలి ఎల్లప్పుడూ. అంటే అతి సూక్ష్మమైన ‘ఈ క్షణం’లో ఉండాలి. అంటే ఆత్మతో ఉండాలి. ఆ స్థితిలో నీవు అనంతుడివి. పుట్టుకలేదు, చావుకూడా లేదు. కేవలం ఒక శుద్ధ చైతన్యానివి. వ్యక్తివి కావు.ఈ స్థితిలో నీవు విశ్వచైతన్యంతో నేరుగా అనుసంధానమై ఉంటావు. పరమానందంలో ఉంటావు. ఈ క్షణంలో నీవు ఆత్మవు. ఈ క్షణం నుండి మళ్ళితే శరీరమే నేను, మనస్సు నేను అనే భ్రమలో ఉంటావు. అదే దుఃఖానికి మూలం. అందుకే దైవం ఆనందస్వరూపం అంటారు. నిర్గుణం, నిరాకారం, నశ్వరం, సర్వవ్యాపితం, ఆద్యంత రహితం అంటారే, దానికి కారణం ఇదే. మరి నీవు దైవం కావాలంటే ఈ క్షణంలో కదా ఉండాలి! ఆత్మస్థితిలో కదా ఉండాలి! నశించి΄ోయే భౌతిక ప్రపంచంలో దైవాన్ని వెదికితే దానికి అతీతమైన దైవత్వాన్ని ఎలా పొందగలవు? మనస్సుకు అతీతంగా ఎదుగు. దైవత్వాన్ని చేరకుండా అడ్డుపడుతున్నది ఈ మనస్సే. నీ శక్తులన్నింటినీ నీ మూలం వైపుకు మళ్ళించు.-స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
పుష్కర సరస్వతికి ప్రణామం
ప్రతి నదికి ఏడాదికి ఒక్కసారి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతిలో ఆయా రాశులు ప్రవేశించడంతో ఆ నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈనెల 15న గురువారం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఉదయం 5.44 గంటలకు సరస్వతినదికి పుష్కరాలు ఆరంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...సరస్వతీ నది పుష్కరాలు (Saraswati River Pushkaralu) ఉత్తరాదిలో నాలుగుచోట్ల, దక్షిణాది లో తెలంగాణలోని కాళేశ్వరంలో మాత్రమే జరుగుతున్నాయి. నది పుట్టినచోటుగా గుర్తించిన ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, ఉత్తర్ప్రదేశ్లోని గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని)నదులుగా భావించే ప్రయాగ్రాజ్, గుజరాత్లోని సోమనాథ్, రాజస్థాన్లోని పుష్కర్ వద్ద సరస్వతీనదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర స్నానం..పుణ్యఫలం..పుష్కర స్నానం... ఎంతో పుణ్య ఫలం. నది స్నానాలు చేస్తే మానవ జీవన గమనంలో తెలిసో, తెలియకో చేసిన పాపాలు తొలగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు..తర్పణలు, పిండప్రదానాలు..సాధారణంగా నదీస్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధకర్మ పిండప్రదాన కర్మలు చేసి పితృదేవతలను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటిరోజు హిరణ్య శ్రాద్ధం తొమ్మిదోరోజు అన్నశ్రాద్ధం. పన్నెండో రోజు ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు. పుష్కరకాల స్నానం..నీరు నారాయణ స్వరూపం. అందుకే ఆయన స్పర్శతో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. తీర్థ, నదీస్నానాలు ఉత్తమం. దానికన్నా పుష్కరస్నానం ఉత్తమోత్తమం. ఆ సమయంలో దేవతలంతా వుష్కరుడితో నదిలో ప్రవేశిస్తారని విశ్వాసం. పుష్కరకాలంలో స్నానమాచరిస్తే 12 సంవత్సరాల కాలం 12 నదుల్లో స్నానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాల్లో లిఖించబడింది.నదికి వాయినాలు..సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయనాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వాసం, చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మెట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు.12 రోజులు హోమాలు..మే 15 గురువారం శ్రీ దత్తా త్రేయ, శ్రీ కార్తవీర్యార్జున హోమం, 16న శుక్రవారం సంకష్ట హర గణపతి హోమం, 17న శనివారం శ్రీ హయగ్రీవ, శ్రీ స్వయంవర పార్వతి హోమం, 18న ఆదివారం శ్రీ పుత్ర కామేష్టి హోమం జరిగాయి. నేడు మేధా దక్షిణామూర్తి మహా అమృత మృత్యుంజయ హోమం, మంగళవారం కాలభైరవ హోమం, బుధవారం సుదర్శన హోమం, గురువారం శ్రీ సూక్త హోమం, శుక్ర వారం పురుష సూక్త హోమం, శనివారం నవగ్రహ, శ్రీ మత్స్య హోమం, ఆదివారం శ్రీ రుద్రహోమం, 26, సోమవారం చండి హోమాలు నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. 12 రోజులు హారతి..12 రోజులపాటు సరస్వతిఘాట్ వద్ద కాశీకి చెందిన ఏడుగురు పండితులచే తొమ్మిది నవ రత్నమాలిక హారతులను ఇస్తున్నారు. హారతి వీక్షణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. హారతి ఇవ్వడానికి ఏడు గద్దెలు ఏర్పాటు చేసి ఏడు జీవనదులు గంగా, యమున, గోదావరి, నర్మద, సింధు, సరస్వతి, కావేరి పేర్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల పుష్కర స్నానాలు..పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేస్తున్నారు. పుష్కర ప్రారంభం మే 15న మొదటి రోజు శ్రీ గురుమద నానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్కు చెందిన మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. మూడవ రోజు మే 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా శంకరభారతీ మహాస్వామి, నేడు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివార్లు పుష్కర స్నానం ఆచరిస్తారు.17 అడుగుల ఏకశిల సరస్వతిమాత విగ్రహంసరస్వతి ఘాటులో 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో శిల్పులు ప్రత్యేకంగా రూపు దిద్దారు. ఆ విగ్రహం చుట్టూరా నాలుగు వేదమూర్తులయిన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సరస్వతినది పుష్కరాల సందర్భంగా 15న సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. – షేక్ వలీ హైదర్, సాక్షి, కాళేశ్వరం (భూపాలపల్లి జిల్లా) -
Life is short: కోపాన్ని జయించిన వాడే యోగి
ధృతరాష్ట్రుడు విదురుడితో మాట్లాడుతూ ‘మనుషుల ఆయువు వంద సంవత్సరాలైనా అతి తక్కువ మందే వందేళ్ళు జీవిస్తున్నారు. ఎక్కువ మంది వందేళ్ళ లోపే మరణిస్తున్నారు. ఎందుకు? దీని గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు’ అన్నాడు.అందుకు విదురుడు, ఆరు అంశాలే మనిషి ఆయుష్షును తగ్గిస్తున్నా యన్నాడు. అవి – అహంకారం, అదే పనిగా వాగుతూ ఉండటం, త్యాగ గుణం లేకపోవడం, కోపావేశాలు, స్వార్థబుద్ధి, మిత్రులకు నమ్మక ద్రోహం చేయడం! ఏ విధంగా చూసినా ఈ ఆరూ ఎవరికీ మంచివి కావన్నాడు. ‘నేనే గట్టివాడిని, నేనే ధనవంతుడిని, నేనే దాతను, నేనే మంచివాడిని, ఇతరులు దుష్టులు’ అని అనుకోవడంతో గర్వం తలకె క్కుతుంది. గర్విష్టిని భగవంతుడు శీఘ్రమే అంతం చేసేస్తాడు. కనుక గర్వం లేకుండా ఉండటానికి తన లోని లోపాలను, తప్పులను చూసుకోవాలి. అదేపనిగా మాట్లాడేవాడు అనవసరమైన విషయాలను గురించి మాట్లాడి లేని పోని కయ్యాలకు కాలుదువ్వుతాడు. అందుకే పరమాత్మ భగవద్గీతలో ‘పరుషమైన మాటలు మాట్లాడకపోవడం మంచిది. నిజమైనది ఏదో, ప్రియమైనది ఏదో, మంచిది ఏదో తెలుసుకుని మాట్లాడాలి’ అన్నాడు.అన్నింటినీ మనమే అనుభవించాలనే ఆశ వల్ల మనలో త్యాగం చేయాలనే ఆలోచన పుట్టదు. ‘మనం ఈ ప్రపంచంలో పుట్టిందే మన కోసం కాదు, ఇతరులకు సాయం చేయడానికే’ అని తెలుసుకుంటే త్యాగ గుణం అలవడుతుంది. మనిషికి ప్రథమ శత్రువు కోపం. కోపాన్ని జయించిన వాడే యోగి. అతనే ప్రపంచంలో సుఖపడతాడు. ఎవరు చెడు చేసినా ఎవరు మనల్ని కోపగించుకున్నా వాటిని సహించడం అలవాటు చేసుకోవాలి. స్వార్థమే అన్ని చెడులకూ కారణం. దీని నుంచి ఇవతలకు రావాలంటే మనలో మానవత్వం రవ్వంతైనా ఉండాలి. ఇక చివరగా, మిత్రులకు నమ్మక ద్రోహం చేయడం ఏ విధంగానూ సబబు కాదు. భగవంతుడు గీతలో చెప్పినట్లు అందరితోనూ మంచిగా ఉండాలి. ద్రోహచింతన తగదు. కరుణ ఉండాలి.– యామిజాల జగదీశ్ -
పాప ప్రక్షాళన కోసం.. అద్భుతమైన ఆలయం
పురాణ పరిచయం పెద్దగా లేని ఈ యువతరంలో కూడా చలనచిత్రాల పుణ్యమా అని బాగా తెలిసిన ΄ పౌరాణిక పాత్ర చిత్రగుప్తుడు. యముడికి ధర్మనిర్వహణలో సహాయకుడిగా, భూలోకవాసుల మరణానంతరం వారి పాప పుణ్యాలకు పద్దులు రాసే వ్యక్తిగా చిత్రగుప్తుడు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించిన కథనం మీ కోసం.ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లేవి. ఇలా వెళ్లిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు. ఎందుకంటే ఎవరు ఎంత పాపం చేసింది సరిగా నిర్ణయించలేక పోయేవాడు. దీంతో తన ఇబ్బందిని యమధర్మరాజు సృష్టికర్త అయిన అయిన బ్రహ్మకు విన్నవించాడు. సమస్య పరిష్కారం కోసం బ్రహ్మ యోగనిద్రలోకి వెళ్లాడు. కళ్లుతెరిచిన తర్వాత ఆయనకు ఎదురుగా ఓ ఆజానుబాహుడు కనిపించాడు. చేతిలో పుస్తకం, ఘటం ( కలం), నడుముకు కత్తి ఉన్నాయి. తర్వాత తన దివ్యదృష్టితో జరిగిన విషయం తెలుసుకొంటాడు. ఆ వ్యక్తి తన చిత్తం (శరీరం)లో గుప్తంగా (గుప్తంగా) నివాసమున్నవాడని అర్థమవుతుంది. అతనికి చిత్రగుప్తుడని పేరుపెడతాడు. అటుపై నీవు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో రహస్యంగా ఉంటూ వారి మంచి చెడులను గూర్చి తెలుసుకొంటూ ఉంటావు.ఈ విషయాలన్నీ యమధర్మరాజుకు చెబుతూ పాపాత్ములకు శిక్షలు పడేవిధంగా సహాయపడతావు. అదేవిధంగా ఏక కాలంలో కొన్ని కోట్ల రూ΄ాలను ధరించే శక్తి కూడా నీకు ఉంటుందని బ్రహ్మ చిత్రగుప్తుడికి వరమిస్తాడు. అంతేకాకుండా చిత్రగుప్తుడికి ఈ విషయంలో సహాయపడటానికి కొంతమంది సహాయకులుగా కూడా ఉంటారు. వారిలో బ్రహ్మమానసపుత్రులైన శ్రవణులు. శ్రవణులు ఈ భూలోకం పైనే కాకుండాపాతాళ, మత్స్య, స్వర్గ లోకాల్లో కూడా వివహరిస్తూ జీవుల పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియ జేస్తూ ఉంటారు. అందువల్లే ఈ విశ్వంలోని జీవుల పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతున్నాడని గరుడ పురాణం చెబుతోంది.చిత్రగుప్తుడికి కూడా గుడులున్నాయంటే ఆశ్చర్యమే. మనదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలోనూ, తమిళనాడులోని కంచిలోనూ చిత్రగుప్తుడికి గుడులు ఉన్నాయి. తెలంగాణలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది.చిత్రగుప్తుని సంస్కృతంలో కాయస్త్ అంటారు. చిత్రగుప్తుడు హిందువులలోని కాయస్త్ కులానికి చెందినవాడిగా అందరూ భావిస్తుంటారు. కాయస్తుల కులదైవం కూడా చిత్రగుప్తుడే. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు ΄ పొందదడానికి చిత్రగుప్తుడిని పూజిస్తారు. చిత్రగుప్తుడి పూజలో ఉపయోగించే వస్తువులు కలం, కాగితం, సిరా, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చక్కెర, గంధం చెక్క. ఆవాలు, నువ్వులు, తమల పాకులు. హైదరాబాద్లోని చిత్రగుప్తుని ఆలయంలో దీపావళి రెండో రోజు ఘనంగా ఉత్సవం జరుగుతుంది. మామూలు రోజుల్లో పెద్దగా పూజలు జరగవు. దీపావళి రెండో రోజు యమద్వితీయ సందర్భంగా, ఆ రోజు చిత్రగుప్తుడి పుట్టినరోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది. ఆయనకు విశేషపూజలను చేస్తారు. దీన్నే భాయ్ దూజ్ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం ఇక్కడ అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్ళి, సంతానం ఇలా అనేక సమస్యలకు పరిష్కారం కోసం భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. కేతుగ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు చేస్తారు. స్త్రీల వ్రతాలలో చిత్రగుప్తుడి నోము కూడా ఉంది. (నిద్ర.. గురక.. గుండెపోటు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?)మనుషుల పాప పుణ్యాలను అనుసరించి వారికి శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మనకు తెలిసిందే. యముడికి భారత దేశంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. వీటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇదిలా ఉండగా ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాపపుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్కగట్టలేడు కదా. ఆయనకు ఈ విషయంలో సహకారం అందించేది చిత్రగుప్తుడు. మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకుపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరనుకుంటారు, కానీ మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేసేది చిత్రగుప్తుడేనని గరుడ పురాణం చెబుతుంది. (Gayatri Mantra : విశిష్టత ఏంటి? తెలుసుకుందాం!) -
Gayatri Mantra : విశిష్టత ఏంటి? అర్థం తెలుసుకుందాం!
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ అనేది గాయత్రి మంత్రం. ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైంది.వేదాల ప్రకారం సవితా దేవి గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత. గాయత్రీ మంత్రం ప్రాచీనమైనది. నాలుగు వేదాల సృష్టికి ముందు బ్రహ్మ 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రాన్ని రచించాడని చెబుతారు.ఈ గాయత్రీ మంత్రం సవితా దేవిని, సూర్యదేవుని కీర్తిస్తూ, సూర్య (పింగళా) నాడిని ముఖ్యంగా స్వాధిష్టాన చక్రాన్ని చైతన్యపరచడానికి చదివే మంత్రం. సుమారు 5000 సం.క్రితం విశ్వామిత్రునిచే స్తుతింపబడిన ఈ మంత్రం ఋగ్వేదంలోనిది. గాయత్రి మంత్ర పరమార్థం ఏమిటో, ఎప్పుడు ఆ మంత్ర పఠనం చేయాలో అనే అవగాహన వుండడం మంచిది. అతి సర్వత్రా వర్జయేత్ .. ఏది అతిగా చేయడం, ఆచరించడం శ్రేయస్కరం కాదు. దానివలన ఒక్కోసారి ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చు. గాయత్రి మంత్రం మన సూక్ష్మ నాడీవ్యవస్థలోని చక్రాలలో ఉన్న పంచ మహాభూతాల సారాన్ని మనకుబోధిస్తుంది. మంత్రాల గురించి చాలా పెద్ద శాస్త్రమే ఉందని చెప్పవచ్చు. మానవ అంతర్గత సూక్ష్మశరీర వ్యవస్థలో చక్రాలలోనూ, నాడులలోను దేవీదేవతలు అధిష్టాన దేవతలుగా ఉంటారు. దేవీకవచంలో చెప్పినట్లు మన శరీరంలోని అంగప్రత్యంగాలన్నీ కూడా ఏదో ఒక దేవత అధీనంలో ఉండి వారి చేత రక్షింపబడుతుంటాయి. మన సమస్య ఏ అవయవంలో ఉంటే ఆయా అవయవానికి సంబంధించిన అదిష్టాన దేవతా మంత్రాన్ని పఠించుకుని ఆ దేవతని సంతృప్తిపరుచుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చును. అంటే మనకున్న సమస్య కాలికి అయితే, వైద్యం చేతికి చేసినట్లు కాకుండా మన ప్రార్థన కూడా ఏ ఏ చక్రాలలో, లేదా ఏ నాడిలో లోపం వుందో వాటికి సంబంధించిన అధిష్టాన దేవీ దేవతలను ప్రసన్నం చేసుకునేదిలా ఉండాలి. మన శరీరంలోని కుడి పార్శ్వపు నాడి (పింగళా నాడి)లో గాయత్రి దేవి నివాస స్థానం ఉంటుంది. నా అంతటి వాడు లేడనే అత్యహంకారం వలన ఈ పింగళా నాడి సమస్యకు లోనవుతుంది. దీనివలన ఈ నాడి అసమతుల్యతకు లోనై అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అలా కుడి పార్శ్వంలో సమస్యలు ఉన్నవారు అతిగా గాయత్రి మంత్ర పారాయణ చేయటం వలన వారు మరింత కోపిష్టిగా, అహంకారిగా మారి విజ్ఞతను కోల్పోయే అవకాశం ఉంది. పూర్వ కాలంలో ఎంతో కఠోర తపస్సు చేసి భగవంతుని అనుగ్రహం పొందిన మునీశ్వరులు, ఋషులలో కొందరు ఇటువంటి కారణం చేతనే భగవంతుని ఆగ్రహానికి గురయ్యారని మనకు తెలిసున్నదే. పంచ మహాభూతాలైన మూలకాలన్నీ మన కుడి పార్శ్వంలో ఉన్న పింగళనాడిలో నిక్షిప్తమై ఉంటాయి. గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలు మన చక్రాలలోని పంచ భూత తత్వాలతో అనుసంధానిపబడి ఉంటాయి. ఇదే గాయత్రి మంత్ర విశిష్టత, పరమార్థం.కుండలినీ జాగృతి చెంది బ్రహ్మ రంధ్రం ఛేదించుకుని వచ్చి సహస్రారం మీద భగవంతుని పరమ చైతన్యశక్తితో ఏకీకృతమైనప్పుడు మనం ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందుతాం. అలా ఆత్మసాక్షాత్కారంపొంది సహజయోగ సాధన చేస్తున్న వారికి గాయత్రి మంత్రం ప్రాధాన్యత గాయత్రి మంత్రోచ్ఛారణ ఫలితం బాగా అవగతమవుతుంది. – డా. పి. రాకేశ్( శ్రీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
అంజన్న సన్నిధిలో ఆధ్యాత్మిక పరిమళాలు
భక్తుల కొంగు బంగారం కొండగట్టు అంజన్న క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తుండటంతో నిత్య కల్యాణం.. పచ్చ తోరణంలా ఆలయ పరిసరాలు ఆంజనేయ స్మరణతో మార్మోగుతున్నాయి. ప్రతి మంగళవారం, శనివారాల్లో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో విరాజిల్లుతోంది. హైందవ సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి పండగ స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తుండటంతో ఆలయానికి వచ్చే భక్తులు పండుగలో పాలుపంచుకుంటూ తరిస్తున్నారు.జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వివిధ రకాల ఔషధ మూలికలతో కూడిన ఏపుగా పెరిగిన చెట్లు, నల్లని బండరాళ్లు, వర్షాకాలంలో నల్లని బండరాళ్ల మధ్య నుంచి పారే జలపాతాలు, ప్రకృతి ఒడిలో సేదతీరుతూ, భక్తులు పరవశించిపోతున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన ప్రతి మంగళవారం, శనివారాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.ఏటా చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతులతో సుమారు నాలుగు నెలలపాటు లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది నిర్వహించిన చిన్న జయంతికి సుమారు రెండున్నర లక్షలకుపైగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు.ఆగని నిత్య హారతులు.. గ్రహపీడితులు, దీర్ఘకాలిక, మానసిక వ్యాధిగ్రస్తులు, సంతానం లేని మహిళలు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 11 రోజులు, 21 రోజులు నిద్రిస్తే సమస్యలు దూరం అవుతాయని భక్తులు స్వామివారి సన్నిధిలో నిద్రిస్తుంటారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళ్లలో భక్తులు స్వామివారి భజనలు చేసి, హారతులు ఇస్తుంటారు. శతాబ్దాలుగా నిత్య హారతులు కొనసాగుతున్నాయి. కరోనా సమయంలో కూడా నిత్య హారతులు కొనసాగాయి.నిత్య సామూహిక అభిషేకాలు.. సత్యనారాయణ వ్రతం ఆంజనేయస్వామి ఆలయంలో నిత్యం సామూహిక ఆంజనేయస్వామి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం, శనివారాల్లో దంపతులు ఆంజనేయస్వామి చిన్న విగ్రహానికి సామూహికంగా స్వామివారి ప్రతిమకు అభిషేకం నిర్వహిస్తారు.కొబ్బరి ముడుపులు ప్రత్యేకం.. సహజంగా హనుమాన్ దీక్షాపరులు స్వామివారికి, భక్తులు తమ కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కడుతుంటారు. తమ మానవ ప్రయత్నంతోపాటు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో కొబ్బరి ముడుపులు కడితే తమ కోరిక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రత్యేకంగా ఎన్నికల వేళల్లో రాజకీయ నాయకులు స్వామివారిని దర్శించుకొని, ముడుపులు కట్టడం ఆనవాయితీగా మారింది. ఓం శ్రీ ఆంజనేయాయ నమః కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయేలా ఆలయ అధికారులు మైకులు ఏర్పాటు చేశారు. కొండగట్టు (Kondagattu) ఆలయ పరిసరాల్లో ఆంజనేయస్వామి నామస్తోత్రం ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఆలయానికి వచ్చే భక్తుల్లో ఆధ్యాత్మిక పరిమళాలు పెంపొందిస్తోంది. ప్రధాన ద్వారం మొదలుకొని, ఘాట్ రోడ్డు వెంట స్వామి వారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగిపోతోంది.కొండగట్టులో దర్శనీయ స్థలాలు.. ఆంజనేయస్వామి ఆలయానికి పశ్చిమాన బేతాళ స్వామి ఆలయంతోపాటు సీతారామ ఆలయాన్ని సందర్శించి, భక్తులు పూజలు చేస్తుంటారు. బేతాళస్వామిని క్షేత్రపాలకుడిగా పూజిస్తారు. స్వామివారి ఆలయ పొలిమేరల్లో బొజ్జ పోతన్న ఆలయం కలదు. భక్తులు తైలాభిషేకం, ఫలపుష్పాభిషేకం నిర్వహిస్తుంటారు. రామావతార సమయంలో సీతామాత తన కష్టాలు తలచి, విలపించగా, రాలిన కన్నీరు గుంటలుగా మారి, సీతమ్మ గుంటలుగా ప్రసిద్ధి చెందినట్లుగా భక్తులు విశ్వసిస్తారు. సంతానం లేని దంపతులు స్వామి వారిని పూజిస్తే జన్మించిన బిడ్డకు కొండల రాయుడిగా నామకరణం చేయగా, ఆలయానికి ఈశాన్యంలో పెద్ద పెద్ద బండరాళ్లను కోటమాదిరిగా ఏర్పాటు చేశారు. కొండల్రాయుడి గుర్రలు డెక్కల ముద్రలు, బండరాళ్లపై చిన్న జలాశయం ఆనవాళ్లు దర్శనమిస్తాయి. చదవండి: డయాబెటిస్ని చిటికెలో నయం చేసే గుడి.. ఎక్కడుందంటే?నూతనంగా నిర్మించిన కోనేరు సమీపంలో పెద్ద పెద్ద బండరాళ్లతో ఏర్పాటు చేసిన గుహలో మునులు తపస్సు చేసుకునేవారని ప్రసిద్ధి. భక్తులు ఒక్కరు మాత్రమే వెళ్లగలిగేంత దారి నుంచి గుహలోకి వెళ్లి, గుహలో వెలుగుతున్న దీపాన్ని భక్తులు దర్శిస్తుంటారు.భక్తుల కొంగు బంగారం ఆంజనేయస్వామి కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయి. ప్రకృతి ఒడిలోని కొండగట్టులో వివిధ రకాల ఔషధ మూలికల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి, ఆలయంలో నిర్వహించే నిత్య హారతులు, అభిషేకాలు చేస్తూ ఆధ్యాత్మికతతో స్వామివారి సన్నిధిలో నిద్రించిన వారి కోరిన కోర్కెలు తీర్చే ఆంజనేయస్వామి భక్తుల పాలిట కొంగుబంగారం. – తిరుకోవెల కపీందర్, కొండగట్టు ఆలయ స్థానాచార్యులు -
డయాబెటిస్ని చిటికెలో నయం చేసే గుడి.. ఎక్కడుందంటే?
భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా. మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్తో బాధపడుతున్నారు. అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే మాయమై పోతుందట. అందుకోసం నిత్యం వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇంతకీ అది ఏ దేవుడు ఆలయం?. ఎక్కడ కొలువై ఉంది?..ఇదంతా నిజమేనా..? వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం..!.తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నీడమంగళం సమీపంలోని కోవిల్ వెన్ని అనే గ్రామంలో ఉంది. తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి 26 కి.మీ. మీ. అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది. చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అనిపిలుస్తారు. ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వరర్గా, పార్వతి దేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు. ఇది స్వయంభూ దేవాలయం. ఈ శివుడు చూడటానికి చెరకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు. ఒకప్పుడూ ఈ ప్రదేశం చెరకు (కరుంబు), వెన్ని(నందివర్ధనం చెట్టు) చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంభేశ్వరర్ అని పిలుస్తారు.మధుమేహం ఎలా నయం అవుతుందంటే..ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయం కొలువై ఉన్న శివలింగం దాదాపు ఐదు వేల ఏళ్లనాటి పురాతనమైన లింగం. దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. నిజమేనా అంటే..?ఈ ఆలయానికి కేవలం భారతదేశం నుంచే గాక, విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడకి వచ్చి ఈ స్వామిని దర్శించుకుని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారని కథలు కథలుగా చెబుతుంటారు. అది నిజమేనా కాదా అని పరీక్షించి మరీ తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరు భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అది నిజమని నిరూపితమవ్వడంతో ఇదేలా జరుగుతుందని విస్తుపోతున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆలయాన్ని దర్శించి..మధుమేహం వ్యాధి నుంచి బయటపడండి.గమనిక: ఇది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం. దానినే మేము ఇక్కడ వార్తగా ఇచ్చాము. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం (చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర) -
భక్తుల కొంగుబంగారం ముక్తీశ్వరుడు పుష్కరాలు : ఇక్కడి స్పెషల్ ఏంటంటే..?
రాష్ట్రంలోని మహాప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన మహాక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులతో నిత్యం పూజలందుకుంటూ విరాజిల్లుతోంది. ఈ క్రమంలో ఈనెల 15నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కర శోభను సంతరించుకోనుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టం పై రెండు శివలింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈలింగాలలో ఒకటి కాలుడు (యముడు), ముక్తీశ్వరుడు(శివుడు)గా వెలిసినట్లు పురాణాలు పేర్కొంటున్నా యి. ముక్తీశ్వర లింగానికి రెండు నాశికారంధ్రాలు ఉంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్లు పోసి నా బయటకు కనిపించవు. ఆ నీరు సొరంగ మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని పూర్వీకులు తెలుపుతున్నారు. గర్భగుడికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు, నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజ స్తంభాలు, నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్రం విశేషం. కాళేశ్వరం క్షేత్రం గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత, ఆదిలాబాద్ నుంచి గోదావరి, అంతర్వాహిణి సరస్వతీ నదులు కలిసిన క్షేత్రం కాళేశ్వరమని ప్రాచుర్యంలో ఉంది. కాళేశ్వరం క్షేత్ర నిర్మాణం..పూర్వం యమ ధర్మరాజు ఓ కార్యం నిమిత్తం స్వర్గలోకంలో ఇంద్రుడి వద్దకు వెళ్లాడు. ఇంద్రలోకంలోని వైభవాలు చూశాడు. ప్రజలు ఇక్కడ సుఖసంతోషంగా ఉంటూ యమ లోకానికి రావడానికి ఇష్టపడడం లేదు. వీరంతా ఆ మహాశివుడిని పూజిస్తున్నట్లు తెలుసుకున్నాడు. మహాశివుడిని పూజిస్తే కోరికలు తీరుతాయని గ్రహించి ముక్తీశ్వర ఆలయం ఎదుట 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. ముక్తీశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజును తపస్సు ఎందుకు చేస్తున్నావు..నీ కోరిక ఏంటని ప్రశ్నించాడు.అందుకు యమధర్మరాజు నీవు భక్తులకు సర్వపాపాలు తొలగించి సుఖసంతోషాలను ప్రసాదిస్తూ కైలాసానికి పంపుతున్నావు. యమలోకంలో నాకు పని లేకుండా పోయిందని పేర్కొన్నాడు. అందుకోసం ముక్తీశ్వరాలయంలో నీ లింగం పక్కనే నాకు చోటు కల్పించి భక్తులు నీకంటే ముందు నన్నే పూజించాలని ముక్తీశ్వరుడితో వేడుకున్నాడు. అందుకు ముక్తీశ్వరుడు తన పక్కన ఆలయంలో చోటు కల్పించాడు. అందుకే కాలుడు, ముక్తీశ్వరుడు ఇద్దరు వెలిసిన నేపథ్యంలో ‘కాళేశ్వరం’ అనే పేరు వచ్చినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా కాళేశ్వరమనే పట్టణం నిర్మింతమైంది. ఈ ఆలయంలో ఒకే పానవట్టం పై ఓవైపు యముడు, మరోవైపు శివుడు కొలువయ్యారు. ముందు యముడి(కాలుడు)ని కొలిచిన తర్వాతే శివు(ఈశ్వరుడు)డిని భక్తులు ఆరాధిస్తారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం భక్తజనులతో ప్రాచుర్యంలోకి వచ్చిందని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రధానాలయంతో పాటు మహాసరస్వతి, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయాల్లో భక్తులు పూజలు చేస్తారు.శ్రాద్ధ త్రికోటి సరస్వతీనది పుష్కరాలుశ్రాద్ధ త్రికోటి సరస్వతీనది పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. నదిలో స్నానమాచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా పితృదేవతలకు తీర్థశ్రాద్ధాలు, పిండప్రదానాలు ముఖ్యం. సంకల్ప స్నానాలు చేయాలి. నదీపూజ తప్పని సరి చేయాలి. -పనకంటి ఫణీంద్రశర్మ, ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానంప్రయాగ కన్నా త్రివేణి స్నానం గొప్పనదిలో 12 రోజుల పాటు స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. 33 కోట్ల దేవతామూర్తులు నది జలాల్లో సంచరిస్తారు. పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. త్రివేణి సంగమం కలిసే చోట అంతర్వాహిణి సరస్వతీనదిలో పుష్కర స్నానం చేస్తే ప్రయాగ నది కన్నా కోటిరెట్ల పుణ్యమని పురాణాల్లో ఉంది. పుష్కర స్నానంతో సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. -త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, రిటైర్డ్ ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానం -
జూన్ 2న మహారాజు పల్లకీ మహాయాత్ర ప్రారంభం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పండరీపురంలో జరగనున్న ఆషాడీ ఏకాదశి మహోత్సవం సందర్భంగా శ్రీసంత్ గజానన్ మహారాజ్ పల్లకీ యాత్ర జూన్ 2న ఉదయం 7 గంటలకు షేగావ్ నుంచి వైభవంగా ప్రారంభమవుతుంది. శతాబ్దాలనాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ యాత్ర 56వ సంవత్సరంలోకి ప్రవేశించింది. డప్పులు, మృదంగాల శబ్దాలతో, చేతుల్లో భగవద్ ధర్మ పతాకాలు పట్టుకుని హరినామ జపం చేస్తూ వందలాది మంది వార్కారీలు ఈ పుణ్య యాత్రలో భాగమవుతున్నారు. ఈ పల్లకీ ఊరేగింపు ద్వారా భక్తులు విఠోబా దర్శనం చేసుకునేందుకు పండరీపురం చేరుకుంటారు. ఈ యాత్రలో జెండా మోసే వారు, గాయకులు, ముండాగ్ వాయించే కళాకారులు, సేవకులు కలిపి సుమారు 700 మంది పాల్గొంటున్నారు. యాత్రలో ఒక వినికారి, ఒక తల్కారి, ఒక జెండా మోసేవాడు తదితరులు క్రమశిక్షణతో నడుస్తూ ప్రతి గ్రామంలో భజన, కీర్తన, ఉపన్యాసాల ద్వారా భగవద్ధర్మాన్ని వ్యాప్తి చేస్తారు. వర్షం అయినా, ఎండ అయినా, చలి అయినా వార్కారీలు హరినామ స్మరణతో ముందుకు సాగుతారు. జూన్ 2న నాగజారి శ్రీ క్షేత్రం నుంచి మొదలయ్యే ఈ యాత్ర 33 రోజుల పాటు సాగి జూలై 4న పండరీపురానికి చేరుకుంటుంది. మంగళవేదం వద్ద చివరి బస అనంతరం శ్రీ పల్లకీ పండరీపురం ప్రవేశిస్తుంది. అక్కడ జూలై 4 నుంచి 9 వరకు ఉత్సవాల్లో పాల్గొని, జూలై 10న తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర షేగావ్లో జూలై 31న యాత్ర ముగియనుంది. ఈ యాత్రలో పరాస్, గైగావ్, అకోలా, పర్లి, అంబజోగై, షోలాపూర్ వంటి అనేక పట్టణాలు, గ్రామాలు భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రతి రోజు ఉదయం హరిపథ్, భజనలు, శ్రీచి ఆరతి వంటి కార్యక్రమాలతో ఈ యాత్ర ప్రత్యేకంగా సాగుతోంది. పండరీభూమి అడుగుపెట్టే ముందు వార్కారీలు అక్కడి మట్టిని నుదుటిపై పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటారు. యాత్ర ముగిసే వరకు వారి నడకదారిలో విఠల్ విఠల్ నినాదమే ప్రతిధ్వనిస్తుంది. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో -
ఆధ్యాత్మికథ దేని విలువ దానిదే!
ఒక గ్రామంలోని రచ్చబండ వద్ద ఓ ఆధ్యాత్మికవేత్త ప్రవచనం చెబుతూ ఉన్నాడు. అందులో భాగంగా ‘‘ఈ సృష్టిలోని విషయాలు మనకి అంత సులభంగా అర్థం కావు. ఈ సృష్టిలో అన్నీ విలువైనవే. ప్రతి ఒక్కటీ ఏదో ఒక కారణంగా సృష్టింపబడుతుంది. మనకి ఉపయోగపడదని, మనకి తెలియదని దేన్నీ వృథాగా భావించ కూడదు’’ అని చెప్పాడు.అప్పుడే ఒక పశువుల కాపరి అడవినుంచి జీవాలను ఇంటికి తోలుకుని వెళ్తున్నాడు. ఆధ్యాత్మికవేత్త ఉపన్యాసం విని కొద్దిసేపు ఆగి ‘‘ఈ మేక మెడ దగ్గర రెండు లింగాలు ఉన్నాయి. ఇవి దేనికి పనికి వస్తాయి. తోలుకూ మాంసానికీ రెండిటికీ పనికి రానివి కదా ఇవి’’ అని నిష్టూరంగా అడిగాడు.చిరునవ్వు నవ్విన ఆధ్యాత్మికవేత్త ‘‘సృష్టి రహస్యాలు కనుక్కోవడం కష్టం. అవి ఎందుకు సృష్టింప బడ్డాయో మనకు తెలియకపోవచ్చు. నీకు బాగా అర్థమయ్యేట్లు నేను విన్న ఒక పాత కథ చెబుతాను విను.పూర్వం ఒక ఋషి ఉండేవాడు. అతడి తపశ్శక్తి వల్ల అతడికి కొన్ని శక్తులు వచ్చాయి. తను ఏది కోరుకుంటే అది జరిగేది. ఆ ఋషి ఒకరోజున నదీ స్నానం చేసి లేస్తున్నప్పుడు తన ముక్కు వెంట్రుకలు దట్టంగా పెరగడం గమనించాడు. కొంచెం అసౌకర్యంగా భావించాడు. ‘దేనికి పనికివస్తాయి ఇవి? ఇవి లేకుంటే మాత్రం నేను జీవించలేనా’ అని భావించి అవన్నీ రాలిపోయేట్లు కోరుకున్నాడు. అతడు కోరినట్లే జరిగింది. అది జరిగిన కొద్దిసేపటికే ఉచ్చ్వాసనిశ్వాసలు తీసుకోవడం కష్టమయ్యింది. రోజురోజుకీ ఆ ఋషి ఆరోగ్యం క్షీణించి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. చిన్న వెంట్రుకలైనా దాని విలువ దానికి ఉందని గుర్తించకపోవడం వల్ల జరిగిన అనర్థం అది.కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదీ ఏదో ఒక కార్య నిమిత్తం సృష్టింపబడిందే. కాకుంటే మనం వాటి ప్రయోజ నాలన్నిటినీ గుర్తించలేము. మనకు, మన ఆలోచనలకూ పరిమితులు ఉన్నాయి. కాబట్టి సృష్టి మర్మాలను మనం గౌరవించక తప్పదు’’ అని వివరించాడు.‘అది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు అలా ఉండకూడదు అని ఆలోచించి లాభం లేదు. ఉన్నది ఉన్నట్లు స్వీకరించడం ఉత్తమం’ అని గ్రహించిన పశువుల కాపరి జీవాలను తోలుకుని ఇంటివైపు నడిచాడు. – ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
Vaishakh Purnima 2025 మానవాళికి మహాబోధకుడు
వైశాఖ పౌర్ణమి వైష్ణవులకు, శైవులకూ కూడా ఎంతో పర్వదినం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించడం, పన్నిద్దరు ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్ జన్మించినది కూడా వైశాఖ పున్నమినాడే కావడం విష్ణుభక్తులకు ఉల్లాసభరితమైతే, ఎనిమిది పాదాలతో, సువర్ణ సదృశమైన రెక్కలతో, సింహపుదేహంతో ఉన్న శివుని రూపమైన శరభేశ్వరుడి అవతరించినది ఈరోజే కావడం శైవులకు సంతోషకారణం. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభ రూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈ రోజు విశిష్టమే! సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈనాడు సముద్రస్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దధ్యోజనం (పెరుగన్నం), గొడుగు, ఉదకుంభం లాంటివి దానం చేయడం పుణ్యప్రదం. (నేడు వైశాఖ పున్నమి) ఎల్లప్పుడూ రాగద్వేషాలతో, కామక్రోధాలతో, హింసతో, సతమతమవుతున్న మానవాళిని జాగృత పరచటానికి ఉద్భవించిన మహాపురుషుడు గౌతవుబుద్ధుడు. ఆయన అసలు పేరు సిద్ధార్థ గౌతవుుడు. కపిలవస్తును ఏలే శుద్ధోధన చక్రవర్తికి, ఆయన పట్టపురాణి వుహావూయాదేవికి ౖవైశాఖ శుద్ధపూర్ణివునాడు జన్మించాడు. అతడు పుట్టిన ఏడోరోజునే తల్లి వురణించడంతో పినతల్లి గౌతమి, తానే తల్లి అయి పెంచింది.కొడుకు పుట్టగానే తండ్రి శుద్ధోధనుడు జాతకం చూపించాడు. జాతకం ప్రకారం అతడు వుహాచక్రవర్తి కాని, వుహాప్రవక్త కాని అవుతాడని పండితులు చెప్పారు. తన పుత్రుడు చక్రవర్తి కావాలని ఆశించిన తండ్రి, అతనికి కష్టాలు, బాధలు అంటే ఏమిటో తెలియకుండా పెంచాడు. అంతేకాదు, అతనికి పదహారవ ఏటనే అంతే ఈడుగల యశోధరతో వివాహం జరిపించాడు.కొంతకాలం గడిచిందిఒకనాడు నగర వ్యాహ్యాళికి రథంపై వెళ్లిన సిద్ధార్థునికి దారిలో నాలుగు దృశ్యాలు ఎదురయ్యాయి. అవి ఒక వుుసలివాడు, ఒక రోగి, ఒక శవం, ఒక శవుణుడు. అసలే ఆలోచనాపరుడైన అతని వునసులో ఇవి పెద్ద అలజడినే రేపాయి. వూనవ#లు ఎదుర్కొనే ఈ దుఃఖాన్ని ఎలాగైనా పరిష్కరించి తీరాలనుకున్నాడు. నాలుగో దృశ్యం సన్యాసి – అతనికి వూర్గాన్ని స్ఫురింపజేసింది. అప్పటికప్పుడే సన్యసించాలని, తపస్సు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.గౌతముడు బుద్ధుడయిన వేళ...అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు. అప్పుడే ఆయనకు రాహులుడనే పుత్రుడు జన్మించాడు. ఆ రాత్రే అడవికి పయనవుయ్యాడు. ప్రపంచం అంతా మెుద్దు నిద్దరోతోంది. వూయనిద్రలో నుంచి సిద్ధార్థుడొక్కడే మేల్కొన్నాడు, ప్రపంచాన్ని నిద్ర లేపటానికి. అడవికి వెళ్లి ఆరు సంవత్సరాలు వూనవాళి దుఃఖం గురించి ఆలోచించాడు. చివరకు జ్ఞానోదయమైంది. అప్పటికాయన వయస్సు 35 సంవత్సరాలు.ఇదీ చదవండి: ఆధ్యాత్మికథ దేని విలువ దానిదే!జననం మరణం ఒకే రోజుతనకు జ్ఞానోదయం అయిన తరవాత తాను కనుగొన్న ధర్మాన్ని రాజు, పేద, ఉన్నత, దళిత, కుల, వర్గ, వుతభేదాలను పట్టించుకోకుండా 45 సంవత్సరాల పాటు నిరంత రాయంగా బోధించాడు ఆయన జన్మించినది, జ్ఞానోదయం కలిగింది. నిర్వాణం చెందిందీ కూడా వైశాఖ పున్నమినాడే. అందుకే ఈ పున్నమిని బుద్ధపున్నమి అని అంటారు.ప్రపంచాన్ని మేల్కొలిపిన ఆ బోధలు ఏమిటి?ప్రపంచాన్ని పరివర్తన దిశగా నడిపేందుకు బుద్ధుడు నాలుగు సత్యాలను బోధించాడు. వీటిని ఆర్యసత్యాలంటారు. వీటిల్లో మెుదటిది... దుఃఖం. అంటే ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. రెండో సత్యం... దీనికి కారణం తృష్ణ. వుూడో సత్యం... దుఃఖాన్ని తొలగించే వీలుంది. నాలుగో సత్యం... దుఃఖాన్ని తొలగించే వూర్గం ఉంది. ఆ వూర్గమే ఆర్య అష్టాంగవూర్గం. ఈ నాలుగు సత్యాలను చెప్పడంలో బుద్ధుడు ఒక శాస్త్రీయ విధానాన్ని అనుసరించాడు. అదే కార్యకారణ సిద్ధాంతం. బుద్ధునికి వుుందే ఈ సిద్ధాంతం ఉన్నా దానికి ఒక శాస్త్రీయ ప్రాపదికను ఏర్పాటు చేసినది మాత్రం ఆయనే. బుద్ధుడు ప్రపంచానికి అందించిన ఆలోచనా విధానం పూర్తిగా శాస్త్రీయమైనది. హేతుబద్ధమైనది.దుఃఖం అంటే ఏమిటి? బుద్ధుడు ప్రపంచంలో దుఃఖం ఉందన్నాడు. ఆ దుఃఖ భావనను చాలావుంది అపార్థం చేసుకున్నారు. దుఃఖం అంటే వునం వూవుూలుగా శోకం, ఏడుపు, పెడబొబ్బలు అనుకుంటాం. శోకం దుఃఖంలో భాగమే అయినా, దుఃఖం అర్థం అది కాదు. ‘దుఃఖం’ అంటే తొలగించాల్సిన ఖాళీ. అంటే ప్రతి వునిషిలోనూ తొలగించవలసిన అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి లేని వూనవ#డు ఉండడు. ఇలా ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది. ఈ విధమైన ఆ ‘ఖాళీ’నే ఆధునికులు దురవస్థ అంటున్నారు. దీనిని పరిష్కరించటానికి తృష్ణను తొలగించాలన్నాడు. ఆ తృష్ణ పోవాలంటే ‘స్వార్థం’ లేకుండా ఉండాలి. స్వార్థం లేకుండా ఉండాలంటే ‘నేను’ అనే భావన ఉండకూడదు. ‘నేను’ లేకుండా ఉండాలంటే, ‘ఆత్మ’ లేకుండా ఉండాలి. అందుకే ఆయన ‘అనాత్మ’వాదాన్ని ప్రవేశపెట్టాడు. ఇది బుద్ధుడు మానవాళికి చేసిన వుహోపదేశం.మతాతీతమైన సత్యాలుమానవుడు మానవుడు మనగలగాలంటే ఏం చేయాలో బోధించాడు బుద్ధుడు. వాటికే పంచశీలాలని పేరు. 1)ప్రాణం తీయకు 2) దొంగతనం చేయకు 3) అబద్ధాలాడకు 4) కావుంతో చరించకు 5) వుద్యం సేవించకు– వీటిని ఏ వుతం కూడా కాదనలేదు. ఈ సత్యాలు వుతాతీతాలు. సవూజం సజావ#గా, కందెన వేసిన బండిచక్రంలా సాఫీగా సాగాలంటే పంచశీలాలను పాటించడం ఎంతో అవసరం. బుద్ధుడు తాత్విక చింతనలోనూ, వునోవిజ్ఞానశాస్త్రంలోనూ, సవూజ సంక్షేవుంలోనూ, వుూలాలకు వెళ్లి, అంతకువుుందు ఎవరూ చూడని, ఆలోచించని ఎన్నో విషయాలను వూనవ కల్యాణం కోసం అందించిన మహనీయుడు. వునిషికే మహనీయుడిగా పట్టంకట్టిన ఆ మానవతావాది ప్రతిపాదించిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు అర్పించే అసలైన నివాళి. బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి– డి.వి.ఆర్. భాస్కర్ -
Rahu Ketu రాహుకేతువుల కథ
భారతీయ సంస్కృతిలో సూర్య, చంద్రగ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకు ఈ కథ ఒక కారణం: విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచిపెడుతుంటాడు. రాక్షసులకు సుర మాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు. దీనిని దక్షప్రజాపతి శాపవశంతో రాహువు తెలుసుకునిఅసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్య చంద్రులు కను సైగలతో విష్ణువుకి తెలియ జేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు.తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల, మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో ‘మహాత్మా! అకారణంగా నా కంఠాన్ని తెగగొట్టావు. నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా’అని అడుగుతాడు.రాహువు మాటలు విన్న విష్ణువు మనసు కరుగుతుంది. ‘సరే జరిగిపోయిన దానినే తలచి బాధ పడడం తగదు. అది విధివిధానం. నీకేం కావాలో కోరుకో’ అంటాడు విష్ణువు. అప్పుడు రాహువు ‘దేవా! సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరిని మింగడానికి నాకు అనుమతి ఇవ్వు’ అంటాడు.ఇదీ చదవండి: వెయిటర్ టు కరోడ్పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీఅందుకు విష్ణువు ‘నువ్వు సూర్యచంద్రులను మింగితే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి. ఏడాదిలో ఏదైనా ఓ అమావాస్యనాడు సూర్యుడిని, పౌర్ణమినాడు చంద్రుడిని మింగి వెంటనే విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టకపోతే నీ తల వెయ్యి ముక్కలయి చనిపోతావు. సూర్యచంద్రులు నీకు చేసిన తప్పుకు వారికీ శిక్ష చాలు’ అంటాడు.రాహువుకు తల, మొండెం వేర్వేరు అయినప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరిద్దరయ్యారు. తల కేతువుగా సూర్యుడిని మింగడానికి, మొండెం రాహువుగా చంద్రుని మింగడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ విధంగా సూర్యచంద్రులు రాహుకేతువుల పాల్పడి గ్రహణాలు మొద లయ్యాయని పురాణ కథ. అయితే గ్రహణాలు ఏర్పడడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయన్నది గమనించాలి. – యామిజాల జగదీశ్ -
దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నాం.. చూడాలంటే...!
భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే, మనం ఆయన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? మనం సినిమా చూడడానికి ప్రదర్శన శాల (సినిమా హాలు)కు వెళ్లినప్పుడు తెరపై చిత్రాలు ఏ విధంగా కనపడతాయో కొంత అవగాహన ఉంది కదా! ఒక చిన్నగదిలోయంత్రాన్ని (ప్రొజెక్టర్) నడిపిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించి తెరపై బొమ్మలు పడేలా చేస్తాడు ఒక వ్యక్తి. అతడు లేకుండా సినిమా ప్రదర్శన సాధ్యమే కాదు. సినిమా నడిపే వ్యక్తి మాత్రం మనకు కనబడకుండా ఉంటాడు. నీవు అతనిని కలవాలని అనుకుంటే అతడితో పరిచయం ఉన్నవాని (మధ్యవర్తి) సహాయంతో కలవవచ్చు. ఆ సినిమా నడిపే అతనితో స్నేహం పెంచుకొన్న తర్వాత నీకు ఇష్టం వచ్చినప్పుడు అతని గదిలోకి ప్రవేశించవచ్చు, అతనితో మాట్లాడ వచ్చు కదా!ఈ ప్రపంచమే ఒక విశాలమైన చిత్ర ప్రద ర్శనశాల. దీనియందు మనకు ఎప్పుడూ సంభ వించే సంఘటనలే ప్రదర్శనలు. సినిమాలో ఉన్నట్లు, ఇక్కడ కూడా యంత్రాన్ని నడిపించేవాడు ఉన్నాడు. అతను కూడా కనిపించడు. సరైన పరికరాలు, మధ్యవర్తి ఉంటేనే ఆయన కనిపిస్తాడు. ఈ సందర్భంలో మైత్రి అంటే ‘భక్తి’ అని పిలిచే ఒక సాధనాన్ని ఈ కార్య సాధనలో ఉపయోగిస్తూ సద్గురువు అనే మధ్యవర్తి ద్వారా భగవంతుని చూడవచ్చు. సద్గురువు సహాయంతో భగవంతుని దర్శించుకొన్నవారుఎందరో ఉన్నారు. అటువంటివారి అనుభవాలే మన పవిత్రగ్రంథాల్లో దృష్టాంతాలుగా ఉన్నాయి. భగవంతుని దర్శించుకొనదల చిన వారికి పూర్వం భక్తులు ఏ బాటలో నడచి భగవత్ సాక్షాత్కారాన్ని పొందారో అటువంటివారు నడచిన మార్గాన్ని ఇతిహాసాలు తేట తెల్లం చేస్తున్నాయి. ఆ మార్గంలోనే భక్తి విశ్వాసాలు, ధైర్యంతో నీవు నడచిన ట్లయితే గమ్యాన్ని చేరుకోగలవు. నిన్ను చెడగొడుతున్న సందేహాలు అన్నీ అప్పుడు తొలగిపోతాయి.శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
వేంకటేశ్వర సుప్రభాతం@కౌసల్యా.. అని ఆరంభం కావడంలో అంతరార్థం?
కౌసల్యా సుప్రజా రామా ..ఈ సుప్రభాతం ఈ నాటిది కాదు. ఏడువందల సంవత్సరాలుగా గానం చేస్తున్నాం. సుప్రజ అంటే మంచి బిడ్డ. కౌసల్య ముద్దు బిడ్డ ఐన రామా! అని విశ్వామిత్ర మహర్షి పిలుపు.రాముణ్ణి మేల్కొలిపేటప్పుడు కౌసల్య మహర్షికి ఎందుకు గుర్తు వచ్చిందో తెలుసుకుందాం. ఆ అమ్మ పెంపకంలో రాముడు లోకాభిరాముడయ్యాడు. ప్రతిరోజూ ఆమె మేలుకొలుపుతో లోకాన్ని చూసేవాడు. ఆ తల్లిని తలచుకుంటూ... ఆమె ముఖం చూస్తూనే రోజూ నిద్ర లేస్తాడు కౌసల్య ముద్దుబిడ్డ రాముడు. శ్రీ రాముడిలో తల్లి పెంపకంలోని ధైర్యం, కర్తవ్య అవ్యగ్రతలను మహర్షి దర్శించాడు. అందుచేత ఆ పిలుపు. ఆ శ్రీ రాముడే ఆ శ్రీ కృష్ణుడే ఈ కలియుగ వైకుంఠంలో ఆర్త రక్షా దీక్షితుడైన శ్రీ వేంకటేశ్వరుడు అని సుప్రభాత దర్శనం చేసుకొనే పుణ్యాత్ములందరికీ తెలియజేస్తూ మీరు ఆ వైకుంఠుణ్ణే ఈ రూపంలో చూడండి! అని సూచిస్తున్నారు వేంకటేశ్వర సుప్రభాతాన్ని రచించిన ప్రతివాది భయంకర హస్తిగిరి(కంచి) నాథన్ అణ్ణన్ ఆచార్యులు. దశావతారాలతో ఈ భువికి వచ్చిన ఆర్తత్రాణ పరాయణుడూ ఈయనే అని జ్ఞప్తి చేశాడాయన. ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు -
Fear & Emotions : భయానికి మూలం
మన దుఃఖాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఒక నీటిబుడగను సృష్టించుకుని మనమే అందులో చిక్కుకుంటున్నాం. శరీరము–మనస్సులే నేను అనే భ్రమను కల్పించుకుని సుఖదుఃఖాల చట్రంలో చిక్కుకునిపోయాం. నీవు శుద్ధచైతన్యంగా ఉన్నప్పుడు దుఃఖమనేదే లేదు. కేవలం సచ్చిదానందమే ఉంది. మనమే నమ్మకాలను కల్పించుకొని భయమని, దుఃఖమని, కుంగుబాటని వేదన చెందుతున్నాం. కొన్ని జన్మల నుంచి నమ్మకాలను బలపరచుకుంటూ వస్తున్నాం. నేను శరీరము–మనస్సు అని నమ్ముతున్నాం. నిజానికి నీవు వ్యక్తివి కావు. ఈ వ్యక్తికి మూలం ఏది? ఆత్మనే మూలం. అది అనందనిలయం. మరి దుఃఖం ఎందుకు వచ్చింది అంటే నీవు ఆత్మవని మరచి వ్యక్తిని అని నమ్ముతున్నావు గనుక. చైతన్యానికి ద్వంద్వాలు లేవు. చైతన్యం భిన్నత్వాన్ని అనుభవించటానికి ఒక రూపంలో వ్యక్తమయ్యింది. దానికి నేను అనేది అవసరం. అక్కడ ఎరుక మాత్రమే ఉండాలి. కానీ నేను శరీరం అనే నమ్మకాన్ని కల్పించుకొని తన నిజతత్వాన్ని మరచిపోయింది. సుఖదుఃఖాల్లో కూరుకుపోయింది. ఆలోచనలు, భావోద్వేగాలు, గుర్తింపు, నమ్మకాలు, ఇష్టాఇష్టాలు వంటి వాటితో వ్యక్తి మొదలైనాడు. నిజానికి ఆ చూసేవాడు వ్యక్తే కాదు. వాడికి దుఃఖం, భయం అనేవే లేవు. అది కేవలం సాక్షీ చైతన్యం. కానీ మనం చూసేవాడు, చూడబడేది అనే ఇద్దరుగా తయారైనాము. చూసేవాడు చైతన్యం, చూడబడేది శరీరం–మనస్సు. నేనే శరీరమనే భ్రమ కల్పించుకొని, శరీర అనుభవాలతో కలిసిపోయి రాగద్వేషాలను కల్పించుకొని, భయం, దుఃఖం, కోపం, ద్వేషం అనేవి ఊహించుకుంటున్నాం. నిజమైన నిన్ను ఎవరైనా భయపెట్టగలరా? కేవలం నీ నమ్మకం వల్లనే భయపడుతున్నావు. ఎక్కడికి పారిపోగలవు నీవు? శరీరం–మనస్సులకు మూలమే నీవు. నీవే అనంత చైతన్యం. నిన్ను ఏ సమస్య ఐనా, ఏ రోగమైనా ఏమీ చేయలేదు. శరీరానుభవాలను సాక్షిగా గమనిస్తూ ఉండు. సదా నీ నిజతత్వం పట్ల ఎరుకతో ఉండు. నీవు అనంత శక్తిమంతుడివి. నిత్యం సచ్చిదానందంలో ఉండాలి. (దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు)వ్యక్తిగా ఒక చిన్న పరిధినే నేను అనుకున్నప్పుడే భయం, దుఃఖం ఉంటాయి. అప్పుడే నీకు అభద్రత ఉంటుంది. తోడుకావాలి, కుటుంబం కావాలి, స్నేహితులు కావాలి అని కోరుకుంటావు. ఇదంతా భయం వల్లనే. నీవు చైతన్యంగా ఉన్నప్పుడు నీకు ఏమీ అవసరం లేదు. నీవు సంపూర్ణ భద్రతలోనే ఉంటావు. నీకు అవసరమైనవి సమకూరుతూ ఉంటాయి. నేను కర్తను కాను, కర్మను కాను, క్రియను కాను అనే భావనలో ఉండాలి. సాక్షిగా ఉండాలి. నీ ముందున్న జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తూ అత్మతత్వంలో ఉండేటప్పుడు నీలో నిరాశ, నిస్పహ, బాధ, విసుగు లాంటివి ఎలా ఉంటాయి? భిన్నత్వాన్ని అనుభవించటానికే చైతన్యం శరీరరూ΄ాన్ని సంతరించుకుంది. ఆ శరీరమే నేను అనుకోవడం నీ భ్రమ. భిన్నత్వాన్ని యథాతథంగా సాక్షీభావంతో సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉండాలి.– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
Inspiration దశరథుడి మంత్రి మండలి
రాచరికాలు నడిచిన ప్రాచీన కాలంలో కూడా సమర్థులైన పాలకులెవరూ నిరంకుశులుగా, నియంతలుగా, కేవలం తమ ఇచ్చ వచ్చినట్టు పరిపాలించటం ఉండేది కాదు. మన పురాణేతిహాసాలలో ప్రసిద్ధులైన రాజులందరూ, రాజ్య పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలను, మేధావులయిన తమ మంత్రుల బృందాలతోనూ, ఇతర నిపుణులతోనూ, అవసరమయితే పౌర ప్రముఖులతోనూ, సామంతులతోనూ, జానపదులతోనూ విస్తృతంగా చర్చించిన తరవాతే తీసుకొనేవాళ్ళని కనిపిస్తుంది. అల్పబుద్ధులూ, ఆసురీ స్వభావులు మాత్రమే అధికార మదాంధకారంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా, నిరంకుశంగా, ఇష్టారాజ్యంగా పాలించి, అందరినీ అవస్థలు పెట్టి, అపయశస్సు కూడగట్టుకొని, ఆయువు తీరగానే కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు.దశరథుడు అరవయి వేల సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన చేశాడని రామాయణం చెబుతుంది. ఏ కీలక నిర్ణయమైనా, ఆయన సంబంధితులందరితో విస్తృతంగా చర్చించిగానీ తీసుకొనేవాడు కాదు అని వాల్మీకి వక్కాణించాడు. దశరథుడికి ఒక సమర్థమైన మంత్రిమండలి ఉండేది. వాళ్ళలో ప్రధానమైన మంత్రులు ఎనిమిది మంది: ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళుగాక, దశరథుడికి వసిష్ఠుడు, వామదేవుడు ముఖ్య పురోహితులుగా, ధర్మ నిర్దేశకులుగా, గురువులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ నేపథ్యం గురించి ఎంతో పరిశోధన జరిపించిన తరవాతే, దశ రథుడు తన మంత్రులను నియమించుకొనేవాడు. వాళ్ళు ఎన్నో పరీక్షలు నెగ్గవలసి ఉండేది. అందుకే ఆ మంత్రులందరూ పరువు ప్రతిష్ఠలు కలవారుగా, సంస్కా రులుగా, శాస్త్ర జ్ఞాన నిష్ణాతులుగా ఉండేవారు. వాళ్ళు కుశాగ్ర బుద్ధులు, విద్యావంతులు, లోకజ్ఞులు, నీతి వేత్తలు. ఎప్పుడూ రాజు శ్రేయస్సునూ, రాజ్య శ్రేయస్సునూ కాంక్షించే నిస్వార్థపరులు, నిజాయతీపరులు. అపరాధులయితే, సొంత పుత్రుల నయినా నియమానుసారం దండించే నిష్పక్షపాతులు. ఇంతటి నిపుణులతో, నీతిమంతులతో, ధర్మజ్ఞులతో అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించిన తరవాతే అన్ని ముఖ్యమైన నిర్ణయాలూ తీసుకోవటం జరిగేది. కనకనే దశరథుడి సుదీర్ఘ పాలనలో ప్రజలంతా ధర్మమార్గంలో తృప్తిగా, సుఖశాంతులతో జీవించారు అని వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది.– ఎం. మారుతి శాస్త్రి -
Dharmakirti గెలిచేది..నిలిచేది ధర్మమే...సత్యమే!
బౌద్ధమతాన్ని తార్కికంగా వివరించిన ప్రముఖ ఆచార్యుల్లో ధర్మకీర్తి ఒకడు. నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్య ధర్మపాలునికి శిష్యుడై విద్యను ఆర్జిం భిక్షువయ్యాడు. దేశమంతా పర్యటించి అనేక చర్చల్లో, సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొన్నాడు. వాదంలో ధర్మ కీర్తిచే ఓడింపబడినవారు తమ ఓటమిని హుందాగా అంగీకరించకపోగా అవమానించడానికి పూనుకున్నారు. ఆయన రంన తాళపత్ర గ్రంథాలను సేకరిం, వాటిని కట్టగా కట్టి, కుక్క తోకకు ముడివేసి ఆ కుక్క పరుగులు తీసేట్టు దాన్ని గట్టి గట్టిగా కేకలు వేశారు. భయంతో ఆ కుక్క విచ్చలవిడిగా అటూ, ఇటూ పరుగులు పెట్టింది. దాని తోకకు కట్టిన ధర్మకీర్తి రచనలున్న తాళ పత్రాలు చిందరవందరై గాలి వీచి అన్ని దిక్కులకు ఎగిరిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసి ధర్మ కీర్తి ప్రత్యర్థులు పగలబడి నవ్వుతూ ధర్మకీర్తిని హేళన చేసి, చులకనగా మాట్లాడారు. ఈ దెబ్బకు ఆయన దిగులు పడి కాళ్ళ బేరానికి వస్తాడని వారు ఆశించారు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా, ‘ఈనాడు, ఈ నా గ్రంథాలు ఎలాగైతే అన్ని దిక్కులకు ఎగిరిపోతున్నవో, అలాగే ఒక నాటికి నా భావాలు, నా కీర్తి దశ దిశలకు వ్యాపించి తీరుతుంది’ అన్నాడు. అది అక్షరాలా నిజమైంది. ధర్మమే జయించింది. సత్యమే గెలిచింది.టిబెట్లో నేటికీ బౌద్ధ భిక్షువులు ధర్మకీర్తి రచనలను పరమ ప్రామాణికమైనవిగా భావించి ఆయనను గౌరవిస్తారు. రాహుల్ సాంకృత్యాయన్ ధర్మకీర్తిని శ్లాఘిస్తూ ‘విమర్శనాత్మకమైన వాదనా పటిమలోనూ, విస్పష్టమైన విశ్లేషణలోనూ, స్పష్టమైన భావుకతలోనూ ఆయనను మించిన వారు లేరు’ అంటారు. ‘న్యాయ బిందు’, ‘హేతుబిందు’ వంటి ఎనిమిది గ్రంథాలు ధర్మకీర్తి కీర్తి ప్రతిష్ఠలను గగనానికి చేర్చాయి.– రాచమడుగు శ్రీనివాసులు