ప్రధాన వార్తలు

బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్పై తన ఎక్స్ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.... క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్ చేశారాయన. .@ncbn గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ… pic.twitter.com/swvxxr9hse— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2025

''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్కు తన లేఖలో పేర్కొంది.

ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ఏకాదశి రా.1.17 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పునర్వసు ఉ.9.38 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.5.26 నుండి 7.00 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.19 వరకు, అమృత ఘడియలు: రా.2.46 నుండి 4.18 వరకు, మతత్రయ ఏకాదశి.సూర్యోదయం : 5.51సూర్యాస్తమయం : 6.00రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆనారోగ్య సూచనలు. శ్రమా«ధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం... పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.మిథునం... రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు మధ్యలో వాయిదా. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి. బంధువులతో సత్సంబంధాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.సింహం.... మిత్రులతో విరోధాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దైవదర్శనాలు. పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.కన్య....... కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.తుల... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.వృశ్చికం.... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.ధనుస్సు.. కుటుంబంలో సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.మకరం... కొత్త పనులకు శ్రీకారం. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కుంభం.. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మీనం... పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

ఉన్నంతలో ఉపశమనం
వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన మధ్యంతర ఆదేశాలు అటు పిటిషనర్లకూ, ఇటు కేంద్ర ప్రభుత్వానికీ పాక్షిక ఉపశమనం ఇచ్చాయి. చట్టంపై మొత్తంగా స్టే విధించకపోవటం కేంద్రానికి సంతృప్తి కలిగిస్తే, కొన్ని కీలకనిబంధనల అమలును నిలిపేయటం విపక్షాలకూ, పిటిషనర్లకూ సంతోషాన్నిచ్చింది. అయితే ఈ కేసులో పిటిషనర్ అయిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వంటివారు ఈ ఉత్తర్వులపై నిరాశ పడకపోలేదు. పిటిషనర్లలో ఒవైసీతోపాటు ఎంపీలు మహువా మొయిత్రా(టీఎంసీ), మనోజ్ కుమార్ ఝూ(ఆర్జేడీ), జియావుర్ రహమాన్(కాంగ్రెస్) ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ కూడా చట్టాన్ని సవాలు చేశాయి. మొన్న ఏప్రిల్లో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టంపై మొత్తం 65 పిటిషన్లు దాఖలయ్యాయంటేనే ఇదెంత వివాదాస్పదమైనదో అర్థమవుతుంది. చట్టం రాజ్యాంగబద్ధమో కాదో ఈ ఉత్తర్వులు తేల్చలేదు. తుది తీర్పు ఆ అంశాన్ని పరిశీలిస్తుంది. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగానికి గురవుతున్నాయనీ, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయనీ కేంద్రం భావించింది. వాటిని చక్కదిద్దే ఉద్దేశంతోనే సవరణలు తెచ్చామని చెప్పింది. ముఖ్యంగా రిజిస్టర్ కాకపోయినా నిరాటంకంగా వక్ఫ్ అధీనంలో ఉంటే ఆ ఆస్తులు దానికే చెందుతాయన్న (వక్ఫ్ బై యూజర్) భావనను ఈ చట్టం రద్దు చేసింది. ఇకపై వక్ఫ్ ఆస్తులకు లిఖిత పూర్వక దస్తావేజు ఉండి తీరాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఈ నిబంధనపై స్టే విధించేందుకు నిరాకరించింది. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నాయని చట్టసభ గుర్తించి, దాన్ని నివారించాలనుకోవటం ఏకపక్ష చర్య ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే వక్ఫ్ ఆస్తులకు 1995 నాటి చట్టం ఒక ప్రత్యేక ప్రతిపత్తినిచ్చింది. దాని ప్రకారం వక్ఫ్ ఆస్తి దురాక్రమణకు గురైందని ఏ దశలో గుర్తించినా దాని స్వాధీనానికి వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకోవచ్చు. తాజా సవరణ దీన్ని రద్దు చేయటాన్ని ధర్మాసనం సమర్థించింది. ఇతర ఆస్తులతో సమానంగా పరిగణించటం వివక్ష తొలగింపే అవుతుందని భావించింది.అన్య మతస్థులు కనీసం అయిదేళ్లుగా ఇస్లాం ఆచరణలో ఉంటేనే వక్ఫ్కు ఆస్తులు దానం చేయొచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే విధించటం ఒక రకంగా ఊరట. ఇస్లాం ఆచరణంటే ఏమిటో చట్టం వివరించకపోవటం, దాన్ని గుర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసే నిబంధనలు, అందుకోసం ఏర్పాటయ్యే వ్యవస్థ సంగతి తేలేవరకూ ఈ నిబంధన నిలిచిపోతుంది. పౌరులు తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగంలోని 300వ అధికరణం ఇచ్చింది. అన్య మతస్థులు వక్ఫ్ బోర్డుకు ఆస్తులివ్వరాదన్న నిబంధన దీన్ని ఉల్లంఘించటం లేదా? తుది తీర్పులోనైనా దీన్ని పరిశీలించక తప్పదు. వివాదాస్పద ఆస్తులపై వక్ఫ్ బోర్డుకూ, ప్రభుత్వాలకూ తగువు ఏర్పడినప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి నిర్ణయించవచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ నిబంధనలో మరో వైపరీత్యముంది. అసలు అలాంటి విచారణ మొదలైన మరుక్షణమే అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించటానికి వీల్లేదని చెబుతోంది. మొత్తానికి వివాదాలను ట్రైబ్యునల్స్ లేదా హైకోర్టులు మాత్రమే తేల్చాలనటం సరైన నిర్ణయం. అయితే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం కల్పించాలన్న నిబంధనను కొంత మార్పుతో అలాగే ఉంచటం సబబు కాదు. హిందూ, సిక్కు, క్రైస్తవ మతాలకు చెందిన సంస్థల్లో అన్య మతస్థులకు చోటు లేనప్పుడు, వక్ఫ్ బోర్డుల్లో మాత్రం ఎందుకుండాలి?వక్ఫ్ చట్టంలో సమస్యలున్నాయి... సరిచేయమని కోరేవారిలో ఆ మతస్థులూ ఉన్నారు. అలా చేసే ముందు ముస్లిం మతాచార్యులతో, ముస్లిం పర్సనల్ లా బోర్డుతో మాట్లాడాలి. పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. పార్లమెంటులో అలజడి రేగాక బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేశారు సరే... కానీ విపక్షాల అభ్యంతరాలను పట్టించుకున్నారా? సమర్థమైన, లోప రహితమైన విధానాలు తీసుకురాదల్చుకుంటే స్వాగతించాల్సిందే. కానీ ఆ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. అటువంటి చర్య ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది.

మేకులు మింగిన ఖైదీలు.. వైద్యానికి సహకరించకుండా హల్చల్
చోరీ కేసుల్లో అరెస్టై సంగారెడ్డి కారాగారాంలో ఉన్న ఇద్దరు ఖైదీలు.. మేకులు,బ్యాటరీలు మింగి హల్చల్ చేసిన ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే.. చోరీ కేసులో జైలుకొచ్చిన ఛావుస్,మధు ట్రబుల్ మేకర్లుగా ఉన్నారు. రెండురోజుల క్రితం అందుబాటులో ఉన్న మేకులు, టీవీరిమోట్కు ఉండే బ్యాటరీలు మింగి గుడ్లు తేలేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పతత్రికి తరలించారు. ఇద్దరూ రెండ్రోజులుగా వైద్యానికి సహకరించడం లేదని దగ్గరకు వచ్చేవారిపై ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారి కడుపులో ఉన్న బ్యాటరీలు,మేకులను శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని లేదంటే సెప్టిక్ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో ఉంటే బ్యాటరీలు పగిలితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై జైలు సూపరిటెండెంట్ కళాసాగర్ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులో లేరు.

జర్మనీని వెనక్కి నెట్టిన చైనా: మొదటిసారి టాప్ 10లోకి..
చైనాలోని పలు కంపెనీలు.. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ దేశం మొదటిసారి ఐక్యరాజ్యసమితి మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీస్ యాన్యువల్ ర్యాంకింగ్లో టాప్ 10లోకి ప్రవేశించింది. యూరప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని అధిగమించి ఈ రికార్డ్ కైవసం చేసుకుంది.2011 నుంచి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 78 సూచికల ఆధారంగా 139 ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) సర్వేలో చైనా 10వ స్థానంలో నిలిచింది.జాబితాలోని టాప్ 10 దేశాలలో.. వరుసగా స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, కొరియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనా ఉన్నాయి.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజర్మనీ ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని GII కో ఎడిటర్ 'సచా వున్ష్-విన్సెంట్ (Sacha Wunsch-Vincent) అన్నారు. కొత్త ర్యాంకింగ్.. అమెరికాలో ట్రంప్ పరిపాలన విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రతిబింబించలేదని అన్నారు.

‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తునాతునకలైనట్లు పాకిస్తాన్ జైషే మహమ్మద్ కమాండర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.తాజాగా, పాకిస్తాన్లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు. ఉర్దూలో కాశ్మీరీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్పూర్లో భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. జమ్మూకశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో ఏప్రిల్ 22 మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన మెరుపుదాడులతో ఈ ఉగ్రసంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసింది. ఆపరేషన్ సిందూర్తో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. వారితో పాటు జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బహవల్పూర్లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటిని పునర్నిర్మించుకునేందుకు పాక్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించింది.ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్లో భారత బలగాలు పీవోకే, పాకిస్తాన్లో ఎంతటి బీభత్సం సృష్టించాయో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వివరించడం చర్చాంశనీయంగా మారింది. 🚨 #Exclusive 🇵🇰👺Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces. Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy— OsintTV 📺 (@OsintTV) September 16, 2025 Markaz Subhan Allah, Bahawalpur (Punjab, Pakistan) was the headquarters of Jaish-e-Mohammad. This facility was a key hub for orchestrating terror operations, including the Pulwama attack on Feb 14, 2019. The perpetrators of the bombing were trained at this very site. Demolished. pic.twitter.com/zNhcMylVxW— Amit Malviya (@amitmalviya) May 7, 2025 4th Month Anniversary of Operation Sindoor. Enjoy Guys pic.twitter.com/fJAL3vQvsh— rae (@ChillamChilli) September 7, 2025

వివేకా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్జీ తెలిపారు.‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్ రన్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది. ఈ దశలో మేం చేసేది ఏం లేదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది.

కొన్స్టాస్ శతకం.. శ్రేయస్ సేనపై ఆసీస్ బ్యాటర్ల పైచేయి
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత్ ఏ జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 16) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ బ్యాటర్లు పైచేయి సాధించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (114 బంతుల్లో 109; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. మరో ఓపెనర్ క్యాంప్బెల్ కెల్లావే (97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వన్, టు డౌన్ బ్యాటర్లు నాథన్ మెక్స్వీని (1), ఒలివర్ పీక్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచినా.. ఆతర్వాత వచ్చిన కూపర్ కన్నోల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, సిక్స్) సత్తా చాటాడు. ఆట ముగిసే సమయానికి లియామ్ స్కాట్ 47, జోష్ ఫిలిప్ 3 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.టీ విరామం వరకు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన భారత బౌలర్లు.. ఆతర్వాత 26 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్పై పట్టు సాధించేలా కనిపించారు. అయితే ఈసారి కూపర్ కన్నోల్లీ-లియామ్ స్కాట్ భారత్ పైచేయి సాధించకుండా అడ్డు తగిలారు. వీరిద్దరు ఐదో వికెట్కు 109 పరుగులు జోడించి ఆసీస్ను పటిష్ట స్థితికి చేర్చారు. కన్నోల్లీ ఔటైనా లియామ్ స్కాట్ బాధ్యతగా ఆడుతూ ఆసీస్ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. అంతకుముందు కొన్స్టాస్-కెల్లావే జోడీ తొలి వికెట్కు 198 పరుగులు జోడించి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేసింది.గుర్నూర్ బ్రార్ భారత్కు తొలి బ్రేక్ అందించారు. కెల్లావేను ఔట్ చేశాడు. అనంతరం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే ఒక్కసారిగా చెలరేగాడు. స్వల్ప వ్యవధిలో కెప్టెన్ మెక్స్వీనిని, సెంచరీ హీరో కొన్స్టాస్ను పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత ఖలీల్ అహ్మద్ ఒలివర్ పీక్ను ఔట్ చేశాడు. అనంతరం కన్నోల్లీ, లియామ్ స్కాట్ భారత బౌలర్ల సహనాన్ని చాలాసేపు పరీక్షించారు. 333 పరుగుల వద్ద హర్ష్ భారత్కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న కన్నోల్లీని బోల్తా కొట్టించాడు.కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు (నాలుగు రోజుల మ్యాచ్లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే తొలి టెస్ట్ మొదలైంది. రెండో టెస్ట్ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్లో వన్డేలు జరుగుతాయి.

రాహుల్ గాంధీపై షాషిద్ అఫ్రిది ప్రశంసలు
ఇస్లామాబాద్: పాక్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్గాంధీ తన చర్చల ద్వారా అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్లు మాత్రం (బీజేపీని ఉద్దేశిస్తూ).. మరో ఇజ్రాయెల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న ఒక్క ఇజ్రాయెల్ సరిపోదా? అని దుయ్యబట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆసియాకప్లో భారత్-పాక్లు తలపడ్డాయి. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారని వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు పాక్ ప్రస్తుత ఆటగాళ్లు,మాజీ ఆటగాళ్లు భారత్పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా సంస్థ సామ్మాటీవీ ఆసియాకప్పై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్లో షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాత్రం పాజిటివ్ మైండ్సెట్ కలిగిన నాయకుడు. సమస్యల పరిష్కారం కోసం సంభాషణే మార్గమని ఆయన నమ్ముతారు. కానీ బీజేపీ మాత్రం ఘర్షణ, విభజన వైపు మొగ్గుచూపుతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఒక ఇజ్రాయెల్ ఉంది. అది మత, భూభాగ, రాజకీయ వివాదాలతో నిండిన దేశం. మరొక ఇజ్రాయెల్ను సృష్టించాలన్నదే మీ ఉద్దేశమా? అని ప్రశ్నిస్తూ ఒక ఇజ్రాయెల్ చాలదా? ఇంకొకటి కావాలా?’ అంటూ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోను అస్త్రంగా పలువురు బీజేపీ నేతలు రాహుల్గాంధీపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి.. ఎక్స్ వేదికగా.. రాహుల్ గాంధీకి ఇప్పుడు కొత్త ఫ్యాన్బాయ్ దొరికాడు. అవమానానికి గురైన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ! అంటూ పేర్కొన్నారు. మరో బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. భారత్ను ద్వేషించే ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ. కాంగ్రెస్లో మిత్రులను కనుగొంటారు. జార్జ్ సోరస్ నుంచి షాహిద్ అఫ్రిదీ వరకు... ఐఎస్సీ అంటే ‘ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్’ అని దుయ్యబట్టారు. 🚨This is Fear From Indian Army & Leadership.Operation Sindoor they will never forget. pic.twitter.com/p77IwsCSiz— Lt Colonel Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) September 16, 2025
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మేకులు మింగిన ఖైదీలు.. వైద్యానికి సహకరించకుండా హల్చల్
''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
సోలో వేకేషన్లో అనసూయ చిల్.. మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ అనన్య నాగళ్ల!
రాహుల్ గాంధీపై షాషిద్ అఫ్రిది ప్రశంసలు
చావుకబురు ‘చల్లగా’.. అక్టోబర్ నుంచే ఎముకలు కొరికే చలి..
'పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్'.. ఫుల్ ఎంటర్టైనింగ్గా టీజర్
సిరీస్ కైవసం చేసుకున్న జింబాబ్వే
ఆగస్టులో వాహన అమ్మకాలు ఇలా..
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబో.. జిమ్లో యంగ్ టైగర్ను చూశారా!
తగ్గిన ధరలు.. పసిడి కొనుగోలుకు మంచి తరుణం!
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
బతుకమ్మ చీరెలొస్తున్నాయ్..
Telangana: మందుబాబులకు ఇక పండుగే !
ఈ గొడవంతా ఎందుకు సార్! ఉగ్రవాదులే మాకు ఆశ్రయమిచ్చారని చెప్పేస్తే సరి!
140 కోట్ల జనాభా ఉన్న దేశం మొక్క జొన్న కంకి కొనలేదా?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఒక్క కంకి కొను ప్లీజ్.. త్రీడేస్ నో ఫుడ్!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పనులలో పురోగతి
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. ప్రపంచ రికార్డు బద్దలు
‘మీడియా ముందుకు రావొద్దన్నారు మావాళ్లు!
అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సౌరవ్ గంగూలీ
అందరి టార్గెట్ ఒక్కడే.. 2వ వారం నామినేషన్స్లో ఎవరెవరంటే?
'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్కార్ట్
IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
పెద్ది 'రామ్ చరణ్' తల్లిగా సీనియర్ నటి
అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ
‘టీసీఎస్లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మేకులు మింగిన ఖైదీలు.. వైద్యానికి సహకరించకుండా హల్చల్
''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
సోలో వేకేషన్లో అనసూయ చిల్.. మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ అనన్య నాగళ్ల!
రాహుల్ గాంధీపై షాషిద్ అఫ్రిది ప్రశంసలు
చావుకబురు ‘చల్లగా’.. అక్టోబర్ నుంచే ఎముకలు కొరికే చలి..
'పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్'.. ఫుల్ ఎంటర్టైనింగ్గా టీజర్
సిరీస్ కైవసం చేసుకున్న జింబాబ్వే
ఆగస్టులో వాహన అమ్మకాలు ఇలా..
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబో.. జిమ్లో యంగ్ టైగర్ను చూశారా!
తగ్గిన ధరలు.. పసిడి కొనుగోలుకు మంచి తరుణం!
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
బతుకమ్మ చీరెలొస్తున్నాయ్..
Telangana: మందుబాబులకు ఇక పండుగే !
ఈ గొడవంతా ఎందుకు సార్! ఉగ్రవాదులే మాకు ఆశ్రయమిచ్చారని చెప్పేస్తే సరి!
140 కోట్ల జనాభా ఉన్న దేశం మొక్క జొన్న కంకి కొనలేదా?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఒక్క కంకి కొను ప్లీజ్.. త్రీడేస్ నో ఫుడ్!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పనులలో పురోగతి
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. ప్రపంచ రికార్డు బద్దలు
‘మీడియా ముందుకు రావొద్దన్నారు మావాళ్లు!
అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సౌరవ్ గంగూలీ
అందరి టార్గెట్ ఒక్కడే.. 2వ వారం నామినేషన్స్లో ఎవరెవరంటే?
'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్కార్ట్
IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
పెద్ది 'రామ్ చరణ్' తల్లిగా సీనియర్ నటి
అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ
‘టీసీఎస్లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’
సినిమా

నలుగురితో ప్రేమాయణం.. ముగ్గురితో పెళ్లి..ఇప్పుడు సింగిల్గానే స్టార్ హీరోయిన్!
చిత్రపరిశ్రమలో ప్రేమ వివాహాలు ఎంత కామనో.. విడాకులు అంతే కామన్. జీవితాంతం కలిసి ఉంటామంటూ గ్రాండ్గా పెళ్లి చేసుకొని..కొన్నాళ్లకే విడాకులకు అప్లై చేసిన జంటలు చాలానే ఉన్నాయి. ఇక లవ్ బ్రేకప్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇలా ప్రేమలో పడి..అలా విడిపోయిన వారు పదుల సంఖ్యల్లో ఉన్నారు. ప్రేమ, పెళ్లిళ్లపై విరక్తి కలిగి ఒంటరి జీవితమే బెటర్ అనుకొనే‘స్టార్స్’ సైతం ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ నటి సల్మా ఆఘా(Salma Agha) ఒకరు. నలుగురితో ప్రేమాయణం నడిపి..ముగ్గురిని పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఈ నటి..పర్సనల్ లైఫ్ ఓ విషాద ప్రేమకథ చిత్రాన్ని గుర్తు చేసేలా ఉంటుంది.1982లో వచ్చిన ‘నికాహ్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సల్మా.. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ‘దిల్ కే ఆర్మాన్’ అనే పాటను కూడా ఆలపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ‘కసమ్ పైదా కర్నేవాలేకీ’, ‘బాబీ’, ‘కోబ్రా’, ‘ఫూలన్ దేవి’'పతీ పత్నీ ఔర్ తవైఫ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించింది.ఇలా కెరీర్ పరంగా వరుస విజయాలతో ‘స్టార్’ హీరోయిన్గా ఎదిగిన సల్మా..వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస పరాజయాలే అందుకుంది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పడు లండన్ వ్యాపారవేత్త అయ్యాజ్ సిప్రాతో ఆమె ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు రిలేషన్లో ఉన్నా.. అది పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ నటుడు జావేద్ షేక్ని పెళ్లి చేసుకొని..కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. తర్వాత స్క్వాచ్ ప్లేయర్ రెహ్మత్ ఖాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. 2011లో దుబాయ్ వ్యాపారతవేత్త మంజర్ షాని పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్ల తర్వాత ఆయనకు కూడా విడాకులు ఇచ్చింది. 67 ఏళ్ల వయసు ఉన్న సల్మా ప్రస్తుతం ముంబైలో ఒంటరిగానే ఉంటుంది.

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ.. ఇంటర్నేషనల్ షూట్కు అంతా రెడీ!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో జతకట్టారు. కేజీఎఫ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా లోకేషన్స్ వెతుకుతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చేలా ఈ మూవీని విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అది నిజమేనని ఇవాల్టితో నిజమైంది.తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్కు వెళ్లారు. ప్రశాంత్ నీల్తో సినిమా షూటింగ్ కోసం వీసా అనుమతుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ట్విటర్లో షేర్ చేసింది. యంగ్ టైగర్తో ఉన్న ఫోటోలను పంచుకుంది.అమెరికా కాన్సులేట్కు విచ్చేసిన ఎన్టీఆర్ను స్వాగతించడం అనందంగా ఉందని లారా విలియమ్స్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్లో చిత్రీకరణ.. రాబోయే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం.. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్- నీల్ చిత్రం మూవీ షెడ్యూల్ త్వరలోనే అమెరికాకు షిఫ్ట్ కానుంది.కాగా... ప్రశాంత్ నీల్ కేజీఎఫ్లాగే కోలార్ గోల్డ్ ఫీల్డ్, సలార్లా ఖాన్సార్ ప్రాంతాలు ఉన్నట్లే ఈ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని టాక్. అందుకే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్లో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025

సోలో వేకేషన్లో అనసూయ చిల్.. మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ అనన్య నాగళ్ల!
కలర్ ఫుల్ శారీలో బిగ్బాస్ దివి...దక్ష లుక్లో మంచు లక్ష్మీ..వేకేషన్లో చిల్ అవుతోన్న అనసూయ..రెడ్ శారీలో బ్యూటీ హీరోయిన్ నిలాఖి పాత్ర లేటేస్ట్ లుక్..ఆరెంజ్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ..సాగర తీరాన శోభిత ధూలిపాళ్ల చిల్..మ్యాచ్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla)

కేబుల్ వైర్ చాలు ముఖం పచ్చడే... ఖుష్బూ స్ట్రాంగ్ రిప్లై
బరేలీలోని తన కుటుంబ నివాసం వెలుపల జరిగిన దిగ్భ్రాంతికరమైన కాల్పుల సంఘటన తర్వాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ కుమార్తె, బాలీవుడ్ నటి దిశా పటానీ(Disha Patani) సోదరి ఖుష్బూ పటానీ వీటికి తనదైన శైలిలో బలంగా బదులిచ్చారు. తన ఇన్ స్ట్రాగామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియోలో ఆమె తనను తాను రక్షించుకోవడానికి కేవలం ఒక డేటా కేబుల్ వంటి సాధారణ రోజువారీ వస్తువు కూడా సరిపోతుందంటూ తనను చంపుతామని బెదిరిస్తూన్న వర్గాలకు ఆమె పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు ప్రమాద క్షణాల్లో తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లోని సాధారణ వస్తువులనే ఎలా సృజనాత్మకంగా ఉపయోగించవచ్చో ఖుష్బూ ఈ వీడియోలో వివరంగా ప్రదర్శించింది. బెదిరింపు పరిస్థితులలో ప్రతిస్పందించడానికి ఎల్లప్పుడూ ఆయుధాలు లేదా యుద్ధ కళల్లో శిక్షణ వంటివి అవసరం లేదని ఈ వీడియోలో ఆమె హైలైట్ చేస్తుంది. బదులుగా, కొంత సమయస్ఫూర్తి, తెగింపు, చురుకుగా ప్రతిస్పందించడం వంటివి సరిపోతాయంటూ ఆమె సాటి మహిళలకు సందేశాన్ని అందించింది. ఒక డేటా కేబుల్ వైర్ను దానిలో పొదిగిన కొన్ని ఇనుప వస్తువులను ఆమె ఒక బలమైన ఆయుధంగా మార్చింది. ఆ వైర్ చూడడానికి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మరక్షణ సమయంలో ఎదుటి వ్యక్తి ముఖం పగలగొట్టడానికి సరిగ్గా సరిపోతుందని ఆమె స్పష్టం చేసింది. కాల్పుల అనంతరం ధైర్యంగా స్పందిస్తూ, ఖుష్బూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలామంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, తెగువను ప్రశంసించారు. ఆమె ఫాలోయర్స్ ఆమెను ఒక ఆధునిక యోథురాలుగా కొనియాడారు. ‘‘మేము ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాం మేడమ్’’ అంటూ మరికొందరు ప్రోత్సహించారు. ‘‘మేడమ్, మీరు అద్భుతంగా స్పందించారు. ఈ పరిస్థితుల్లో ఇలా బలంగా ఉండటానికి ధైర్యంతో పాటు సంకల్ప శక్తి అవసరం’’ అంటూ కొందరు ఆమెను పొగిడారు. ‘‘నిజంగా మేడమ్, మీరు మాకు చాలా స్ఫూర్తినిస్తున్నారు’’అంటూ మరికొందరు యువతులు ఆమెను కొనియాడారు. కొందరు ఆమె క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సహజంగానే కొందరు మాత్రం ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ ట్రోల్ చేశారు.మొత్తం మీద ఈ ఉదంతం ఇప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియని ఒక ప్రముఖ నటి సోదరిగా మాత్రమే గుర్తింపు పొందిన ఒక సాధారణ యువతిని సెలబ్రిటీగామార్చేసింది.బాలీవుడ్ని కుదిపేసిన ఈ కలకలానికి మూలం శుక్రవారం ఉదయం, బరేలీలోని సివిల్ లైన్లోని విల్లా నంబర్ 40 వెలుపల మోటారుబైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులుతో మొదలైంది, అక్కడ పఠానీ కుటుంబం నివసిస్తుంది. ఈ కాల్పులకు కారణం తామేనని ఓ అతివాద వర్గం ప్రకటించుకోవడంతో పాటు ఇకపై తమ మనోభావాలు దెబ్బతీస్తే పఠానీ కుటుంబంతో పాటు ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరికలు జారీ చేసింది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani)
న్యూస్ పాడ్కాస్ట్

ఏపీ ప్రజారోగ్య రంగంలో 2023 సెప్టెంబర్ 15 ఒక గొప్ప రోజు. సీఎంగా నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన రోజు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్య

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరిట అస్మదీయులకు సంపద సృష్టి... ఏపీలో ప్రైవేట్ పరమయ్యే కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57 లక్షల రూపాయల పైమాటే

‘ఎమ్మార్’ పేరిట ప్రజలను ఏమార్చే కుట్ర... ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం

కర్నూలులో 2 వేల 700 కోట్ల రూపాయల విలువైన స్థలంపై గురి...

ఆంధ్రప్రదేశ్లో వెయ్యి ఎకరాల దేవుడి భూముల స్వాహాపర్వం... అధికార తెలుగుదేశం పార్టీ నేతల కబ్జాకాండ

చంద్రబాబు సర్కార్ సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, చంద్రబాబు ముఠా ఆదాయం పెరుగుతోంది... వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్... ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై ఘన విజయం

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం...రోడ్డున పడ్డ రైతాంగం

ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా భూదోపిడీ... ఏపీఐఐసీకి చెందిన విలువైన వేలాది ఎకరాలు ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు పందేరం

- మద్యం అక్రమ కేసులో గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు బెయిల్. మిథున్రెడ్డికి మధ్యంతర బెయిల్
క్రీడలు

కొన్స్టాస్ శతకం.. శ్రేయస్ సేనపై ఆసీస్ బ్యాటర్ల పైచేయి
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత్ ఏ జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 16) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ బ్యాటర్లు పైచేయి సాధించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (114 బంతుల్లో 109; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. మరో ఓపెనర్ క్యాంప్బెల్ కెల్లావే (97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వన్, టు డౌన్ బ్యాటర్లు నాథన్ మెక్స్వీని (1), ఒలివర్ పీక్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచినా.. ఆతర్వాత వచ్చిన కూపర్ కన్నోల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, సిక్స్) సత్తా చాటాడు. ఆట ముగిసే సమయానికి లియామ్ స్కాట్ 47, జోష్ ఫిలిప్ 3 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.టీ విరామం వరకు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన భారత బౌలర్లు.. ఆతర్వాత 26 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్పై పట్టు సాధించేలా కనిపించారు. అయితే ఈసారి కూపర్ కన్నోల్లీ-లియామ్ స్కాట్ భారత్ పైచేయి సాధించకుండా అడ్డు తగిలారు. వీరిద్దరు ఐదో వికెట్కు 109 పరుగులు జోడించి ఆసీస్ను పటిష్ట స్థితికి చేర్చారు. కన్నోల్లీ ఔటైనా లియామ్ స్కాట్ బాధ్యతగా ఆడుతూ ఆసీస్ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. అంతకుముందు కొన్స్టాస్-కెల్లావే జోడీ తొలి వికెట్కు 198 పరుగులు జోడించి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేసింది.గుర్నూర్ బ్రార్ భారత్కు తొలి బ్రేక్ అందించారు. కెల్లావేను ఔట్ చేశాడు. అనంతరం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే ఒక్కసారిగా చెలరేగాడు. స్వల్ప వ్యవధిలో కెప్టెన్ మెక్స్వీనిని, సెంచరీ హీరో కొన్స్టాస్ను పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత ఖలీల్ అహ్మద్ ఒలివర్ పీక్ను ఔట్ చేశాడు. అనంతరం కన్నోల్లీ, లియామ్ స్కాట్ భారత బౌలర్ల సహనాన్ని చాలాసేపు పరీక్షించారు. 333 పరుగుల వద్ద హర్ష్ భారత్కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న కన్నోల్లీని బోల్తా కొట్టించాడు.కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు (నాలుగు రోజుల మ్యాచ్లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే తొలి టెస్ట్ మొదలైంది. రెండో టెస్ట్ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్లో వన్డేలు జరుగుతాయి.

సూర్యపై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్ (Mohammed Yousuf)పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ మండిపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ నుంచి ఇలాంటి చెత్త మాటలు ఊహించలేదన్నాడు. అయినా అతడి స్థాయికి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడనుకోలేదంటూ చురకలు అంటించాడు.ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం పాక్తో మ్యాచ్ ఆడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టీ20 పోరులో సూర్యకుమార్ సేన సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బీసీసీఐ కౌంటర్ అయితే, టాస్ సమయంలోగానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మద్దతుగా పాక్ ఆటగాళ్లతో షేక్హ్యాండ్కు నిరాకరించింది.దీనిని అవమానంగా భావించిన పాక్ జట్టు.. విషయాన్ని ఐసీసీ వరకు తీసుకువెళ్లగా.. కచ్చితంగా షేక్హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదంటూ బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కాడు.సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూషేక్హ్యాండ్ గురించి సామా టీవీలో మాట్లాడుతూ.. సూర్యకుమార్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూ పంది అనే అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అంపైర్లను అడ్డుపెట్టుకుని గెలిచారంటూ నిరాధార ఆరోపణలు చేశాడు. అతడి మాటలకు అక్కడున్న వాళ్లు పళ్ళు ఇకిలిస్తూ శునకానందం పొందారు.ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ స్పందించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు? వాళ్లు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటారు.మైదానంలో ఏం చేయాలో మాత్రం అది చేయరు. కానీ మైదానం వెలుపల ఇలాంటి పిచ్చి మాటలతో హైలైట్ అవుతారు. ప్రపంచం మొత్తం వీరిని గమనిస్తూనే ఉంది. ఇంతకంటే టీమిండియాను వారు ఏం చేయగలరు?ప్రతి ఒక్కరికి తమకంటూ గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. అయినా.. ఎవరైనా సరే తమ స్థాయికి తగ్గట్లే మాట్లాడతారు కదా!మా జట్టు గొప్పగా ఆడుతోందిఆట గురించి ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే. మీరు ఏదైనామాట్లాడాలనుకుంటే ఆట గురించి మాట్లాడండి. మా జట్టు గొప్పగా ఆడుతోంది. మీ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టి.. బాగా ఆడితే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు పొగుడుతారు. అంతేగానీ ఇతర జట్ల ఆటగాళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ అశోక్ అస్వాల్కర్ మొహ్మద్ యూసఫ్నకు గట్టిగానే చురకలు అంటించాడు.చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్

చరిత్రలో భారత్కు తొలి స్వర్ణం
స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం దక్కింది. చైనాలో జరుగుతున్న 2025 ఎడిషన్లో తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల యువ స్కేటర్ ఆనంద్కుమార్ వేల్కుమార్ భారత్కు ఈ అపురూప గౌరవాన్ని అందించాడు. 1000 మీటర్ల సీనియర్ స్ప్రింట్లో ఆనంద్కుమార్ వేల్కుమార్ 1:24.924 సెకన్ల టైమింగ్తో రేసును పూర్తి చేసి స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్కు తొలి స్వర్ణ పతకం సాధించి పెట్టాడు.ఇదే టోర్నీలో ఆనంద్కుమార్ 500 మీటర్ల స్ప్రింట్లో కాంస్య పతకం సాధించాడు. ఈ టోర్నీలో ఆనంద్కుమార్ సాధించిన విజయాలు భారతదేశంలో స్పీడ్ స్కేటింగ్కు కొత్త దిశను చూపించాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడలో భారత్కు పెద్దగా గుర్తింపు లేదు.ఆనంద్కుమార్ స్వర్ణం సాధించిన అనంతరం ప్రపంచం దృష్టి భారత్పై పడింది. అతని విజయాలు యూరప్, లాటిన్ అమెరికా, ఈస్ట్ ఆసియా ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేస్తూ, భారత రోలర్ స్పోర్ట్స్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాయి.ఆనంద్కుమార్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అతని విజయాలు దేశానికి గర్వకారణమని అన్నారు. ఆనంద్కుమార్ అంకితభావం, శ్రమ భారత యువతకు స్ఫూర్తిదాయకమని ఎక్స్ ద్వారా తెలిపారు.జూనియర్ విభాగంలో కృష్ శర్మకు స్వర్ణంస్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలోనూ భారత్కు స్వర్ణం దక్కింది. క్రిష్ శర్మ 1000 మీటర్ల స్ప్రింట్లో భారత్కు తొలి గోల్డ్ మెడల్ అందించాడు.

ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..! ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి.. జమైకా ‘చిరుత’ ఉసేన్ బోల్ట్ (Usain Bolt) పరిస్థితే ఇందుకు ఓ ఉదాహరణ. ఒకప్పుడు మెరుపు వేగంతో పరిగెత్తి రికార్డులు కొల్లగొట్టిన ఈ అథ్లెట్.. ఇప్పుడు పట్టుమని పది మెట్లు ఎక్కడానికి కూడా ఆయాసపడుతున్నాడట.తొమ్మిది స్వర్ణాలుఉసేన్ బోల్టే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. 100 మీ., 200 మీ.. 4*100 మీ రిలేలలో మూడు ఒలింపిక్స్లో మూడేసి చొప్పున తొమ్మిది స్వర్ణాలు గెలిచిన ఘనత ఉసేన్ బోల్ట్ది. 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్లో బోల్ట్ ఈ మేరకు పతకాలు గెలుచుకున్నాడు.అయితే, అనూహ్య రీతిలో 2017లో బోల్ట్ అథ్లెటిక్ ప్రయాణం అర్ధంతరంగా ముగిసిపోయింది. ఆ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 4*100 మీ రిలేలో పాల్గొన్న బోల్ట్.. కండరాలు పట్టేయడంతో సగం దూరంలోనే కుప్పకూలిపోయాడు. అథ్లెటిక్స్ ట్రాక్పై బోల్ట్ అద్భుత ప్రయాణం చివరకు అలా ముగిసిపోయింది.నాకేమీ పనిలేదుఇక బోల్ట్ ఇప్పుడు తన కుటుంబంతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. ది గార్డియన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పిల్లలు స్కూల్కు వెళ్లే సమయంలో.. వారిని చూసేందుకు నిద్రలేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తా.నిజానికి చేయడానికి నాకేమీ పనిలేదు. అలా చిల్ అవుతూ ఉంటా అంతే!.. కొన్నిసార్లు వర్కౌట్లు చేస్తుంటా. మూడ్ బాగుంటే వెబ్ సిరీస్లు చూస్తూ ఉంటా. పిల్లలు వచ్చేంత వరకు ఇలా టైమ్పాస్ చేస్తా.ఇంట్లోనే సినిమాలు చూస్తాఆ తర్వాత సమయమంతా వాళ్లతోనే.. నాపై విసుగు వచ్చేంత వరకు వారితో ఆడుతూనే ఉంటా. ఆ తర్వాత ఇంట్లోనే సినిమాలు చూస్తా. ఇక జిమ్లోనే ఎక్కువగా వర్కౌట్లు చేస్తా. కానీ అదైతే నాకు పెద్దగా ఇష్టం ఉండదు.ఆయాస పడుతున్నాకాకపోతే తప్పక వర్కౌట్లు చేస్తా. నిజానికి నేను రన్నింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నా. ఎందుకంటే.. మెట్లు ఎక్కేటపుడు శ్వాస సరిపోవడం లేదు. ఆయాస పడుతున్నా. అందుకే ఇకపై మరింత శ్రద్ధగా వర్కౌట్లు చేసి నా బ్రీత్ను సరి చేసుకుంటా’’ అని ఉసేన్ బోల్ట్ చెప్పుకొచ్చాడు.కాగా జమైకన్ ఇన్ఫ్లూయెన్సర్ కాసీ బెనెట్తో చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు 39 ఏళ్ల బోల్ట్. ఆమె ద్వారా.. అతడికి కూతురు ఒలింపియా (2020), కవల కుమారులు థండర్- సెయింట్ (2021) కలిగారు.చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్
బిజినెస్

రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్కు ముందే ఫుల్ డిమాండ్
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త ఎస్యూవీ విక్టోరిస్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 10.5 లక్షల నుంచి రూ. 19.99 లక్షలు (ఎక్స్షోరూం). ఈ కారు హైబ్రిడ్, ఫోర్ వీల్ డ్రైవ్, సీఎన్జీ, స్మార్ట్ హైబ్రిడ్ తదితర 21 వేరియంట్స్లో లభిస్తుంది. బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు 1,000 చొప్పున వస్తున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. ఇప్పటివరకు 10,000 బుకింగ్స్ వచ్చాయని వివరించారు.సెప్టెంబర్ 22 నుంచి విక్టోరిస్ అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మిడ్–సైజ్ ఎస్యూవీ మార్కెట్లో అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మిడ్ సైజ్ ఎస్యూవీలు 10 లక్షలు అమ్ముడవగా, 1.94 లక్షల యూనిట్లతో హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా అగ్రగామిగా ఉంది.ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు

‘ఒక్క క్లిక్తో బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం’
సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న టెక్నాలజీలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరస్థులు సామాన్య ప్రజలను టార్గెట్ చేసే వీలుందని ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతా వేదికగా హెచ్చరించారు. ఇటీవల జెమిని నానో బనానా మోడల్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.నానో బనానాగూగుల్ గత నెలలో జెమిని యాప్కు ‘నానో బనానా’ సంబంధించిన ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటింది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను సృష్టించింది. వేగం, కచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులకంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.సారీ ట్రెండ్..సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం నానో బనానా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది. తాజాగా బనానా మోడల్ తరహాలోనే ‘సారీ ట్రెండ్’ కూడా వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ టెక్నాలజీలను ఉపయోగించుకుని సామాన్య ప్రజలపై మోసాలకు ఒడిగట్టే అవకాశం ఉంటుందని, వెబ్సైట్ల్లో ఫొటోలు అప్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సజ్జనార్ చెప్పారు.నకిలీ వెబ్సైట్లు.. అనధికార యాప్లు..‘ఇంటర్నెట్లో ట్రెండింగ్ టాపిక్లతో జాగ్రత్తగా ఉండండి! నానో బనానా ట్రెండింగ్ క్రేజ్ ఉచ్చులోపడి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకుంటే, సైబర్ మోసాలు జరగడం ఖాయం. కేవలం ఒక్క క్లిక్తో మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నేరస్థుల చేతుల్లోకి చేరుతుంది. ఫొటోలు లేదా వ్యక్తిగత వివరాలను నకిలీ వెబ్సైట్లు లేదా అనధికార యాప్ల్లో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ ఫొటోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి’ అని సజ్జనార్ ఎక్స్తో చెప్పారు.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ

మళ్లీ తెరపైకి పని గంటల వివాదం: నెటిజన్లు ఫైర్!
వారానికి 72 గంటల పని వాదనలు సద్దుమణిగాయి అనుకునేలోపే.. మళ్లీ ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఏఐ స్టార్టప్ మెర్కోర్లో పనిచేస్తున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. వారానికి 72 నుంచి100 గంటలు పనిచేసిన తన అనుభవాన్ని పంచుకున్న తర్వాత ఇది చర్చకు దారితీసింది.మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి ప్రణవ్ మెహతా.. అన్ని కాలాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని అభివర్ణిస్తూ, వారానికి 72 గంటల పని అంటే మొదట్లో కొంత భయంగా అనిపించవచ్చు. అప్పుడప్పుడు ఇది 100 గంటలకు కూడా విస్తరిస్తుందని పేర్కొన్నాడు. వారానికి 40 గంటల పని, అనుకున్న లాభాలను అందించదని అన్నారు. మెర్కోర్ సీఈఓ బ్రెండన్ ఫుడీ చేసిన పోస్ట్కు ప్రతిస్పందనగా మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు.మెర్కోర్ సీఈఓ బ్రెండన్ ఫుడీ.. కంపెనీ ఆదాయం 17 నెలల్లోనే 1 నుంచి 500 మిలియన్లకు పెరిగింది. దీనిని ఎప్పటికప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని పేర్కొన్నాడు. కంపెనీ ఇప్పుడు 10 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానంవారానికి 72 గంటల పనిపై ప్రణవ్ మెహతా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకతకు దారితీశాయి. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు అధిక పని గంటలను కీర్తించడాన్ని విమర్శించారు. ఇంత ఎక్కువ గంటలు పనిచేయడం వెనుక ఉన్న మనస్తత్వాన్ని ఒకరు ప్రశ్నించగా.. ఎక్కువ పనిగంటలు వల్ల తలెత్తే ఇబ్బందులను గురించి పట్టించుకోరా, మీ ఉద్దేశం ఏమిటి? అని మరొకరు అన్నారు.Fastest growing company of all time.The 72-hour work week might sound daunting at first (occasionally stretches to 100)But the growth, the learning curve, the pace- is truly unmatched.A comfy 40-hour week won't offer the same upside. Not the same energy, not the same… https://t.co/m3K4xTWVBn— Pranav Mehta (@i_pranavmehta) September 15, 2025

కీ చెయిన్ కెమెరా.. ధర ఎంతంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వస్తువుల పరిమాణంలో, అందుకు ఉపయోగించే పరికరాల్లో మార్పులొస్తున్నాయి. గతంలో పెద్ద రూమ్ సైజ్లో ఉండే కంప్యూటర్ ఇప్పుడు మడిచి జేబులో పెట్టుకునేంత సైజ్లోకి మారిపోయింది. సాంకేతిక విభిన్న విభాగాల్లో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఇది కెమెరా తయారీ పరిశ్రమలోనూ విశేష మార్పులకు నాంది పలికింది. గతంలో సూట్కేస్ సైజ్లో ఉండే కెమెరాలు టెక్నాలజీ సాయంతో ప్రస్తుతం ‘కీ చెయిన్’ సైజ్లోకి వచ్చేశాయి. అవును.. కేవలం 30 గ్రాముల బరువుండే కెమెరాను కొడాక్ కంపెనీ ‘చార్మెరా’ పేరుతో ఇటీవల ఆవిష్కరించింది.కొడాక్ చార్మెరా ఫీచర్లు..ఇది ఒక మినీ కెమెరా.దీని ధర కేవలం 30 డాలర్లు(సుమారు రూ.2,500). రిటైలర్ను అనుసరించి ధరలో మార్పులుంటాయని గమనించాలి.దీన్ని ‘బ్లైండ్ బాక్స్’ల్లో విక్రయిస్తున్నారు. (ఇది డిలివరీ అయ్యే వరకు రంగు / డిజైన్ తెలియదు).ఇది 30 గ్రాముల బరువు ఉంటుంది.1.6 మెగా పిక్సెల్ కెమెరా సామర్థ్యం ఉండి, జేపీఈజీ ఫార్మాట్లో ఫొటోలు (1440×1440) సేవ్ చేస్తుంది.30fps ఈవీఐ వీడియోఎస్సీడీ స్క్రీన్ + వ్యూఫైండర్యూఎస్బీ టైప్-C ఛార్జింగ్.మైక్రో ఎస్డీ స్లాట్ (128GB వరకు)ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్
ఫ్యామిలీ

నొప్పిని పోగొట్టే ‘అయాన్’
‘నొప్పి’ని తగ్గించేందుకు వైద్య శాస్త్రంలో నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా నొప్పికి విరుగుడు కనిపెట్టడంలో ఇంకా పూర్తి విజయాన్ని సాధించలేకపోయారు. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్, గాయాలు... ఇవన్నీ మనిషికి నొప్పి కలిగిస్తాయి. శరీరంలో నొప్పి, సందేశాలను అణచివేసే రసాయనాలు ప్రవేశపెడితే ఈ నొప్పికి విరుగుడుగా ఉంటుంది. శరీరంలో నొప్పికి విరుగుడుగా ‘విద్యుత్ చికిత్స’ ఉత్తమమని పరిశోధకులు గుర్తించారు. శరీరంలోకి బలహీనమైన విద్యుత్ను ప్రసారం చేస్తే అది మత్తు మందులా పనిచేసి రోగికి నొప్పి తెలియకుండా చేస్తుంది.నొప్పిని కల్గించే ప్రేరణలను మందగింపచేయడమే గాక మెదడుకు సమచారం వెళ్లకుండా ఈ విద్యుత్ నిరోధిస్తుంది. దీనినే ‘ఎలక్ట్రిక్ స్టిములేషన్’ పద్ధతి అంటారు. మన భారతీయ పరిశోధకుడు ఒకాయన ‘అయాన్ వైద్య చికిత్స’ రూపొందించారు. ఈ చికిత్స వలన అనేక మంది రోగులు నొప్పి నుండి విముక్తి పొందినట్లు ఆయన ప్రకటించారు. అమెరికాలోని వైద్య పరిశోధకులు ఈ ‘అయాన్ వైద్య చికిత్స’ బాగా పనిచేస్తోందని చెప్పారు. మూడవ డిగ్రీ స్థాయి వరకు శరీరం కాలిన రోగులకు విద్యుదావేశం కాబడిన గాలిని తగిలేటట్లు చేస్తే కొంతమేర స్వస్థత చేకూరిందని తెలియ జేశారు. అంటే నొప్పికి విద్యుత్ ఒక ‘బామ్’గా పనికి వస్తుందన్నమాట. విద్యుత్ పరికరాల సహాయంతో ఋణవిద్యుదావేశం గల గాలిని తయారు చేశారు. ఈ గాలిని బాగా పోగుచేసి నొప్పిగల ప్రదేశం మీదకు పంపారు. ఫలితంగా నొప్పి తగ్గినట్లు వారు గుర్తించారు.ఈ అయాన్లు గల గాలి వైద్యంతో కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు వంటి వాటిని నయం చేయడానికి ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. శరీరానికి గాయం అయితే ఆ ప్రాంతంలో నొప్పి ఉంటుంది. ఎందుకంటే అక్కడి జీవకణాలకు విద్యుత్ నిరోధం తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా ఆ ప్రాంతంలో ఏర్పడే ద్రవపదార్థాలకు విద్యుత్ వాహకత్వం ఉంటుంది. రష్యాలోని పరిశోధకులు ఈ నిజాలు తెలుసుకుని తక్కువ విద్యుత్ నిరోధం గల జీవకణం పైకి విద్యుత్ను ప్రవహింప చేశారు. ఫలితంగా అది తిరిగి విద్యుత్ నిరోధక శక్తిని పుంజుకుంది. ‘ఇదే నొప్పి నివారణకు విద్యుత్ ఉపయోగపడుతున్న తీరు’ అని వివరించారు.చదవండి: డయాబెటిస్ రోగుల కాళ్లకు దెబ్బ తగిలితే ఏం చేయాలి?ఈ చికిత్స వలన నొప్పి తగ్గిన వారిలో మళ్ళీ నొప్పి పునరావృతం కాలేదు. రోగి విద్యుత్ చికిత్స సమయంలో గాని ఆ తరువాత నాలుగు గంటల వరకు గానీ ఎటువంటి లోహపు వస్తువులనూ తాకకూడదు. నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోకూడదు. రబ్బరు తొడుగులు ధరించి రోగి చికిత్స చేయించుకోవాలి. లేకపోతే రోగికి సరఫరా చేసిన విద్యుత్ ఎర్త్ అయిపోతుంది.– డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ, పాపులర్ సైన్స్ రచయిత

హ్యాట్సాఫ్ జ్వాలా గుత్తా..! అమ్మతనానికి ఆదర్శంగా..
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ దంపతులు ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా తల్లిపాలకు దూరమైన శిశువులు అకాల అనారోగాల బారిన పడకుండా తన వంతుగా తల్లిపాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ తల్లిపాల డ్రైవ్లో అందరూ పాలుపంచుకునేలా ప్రేరేపించేలా ఆమె తల్లిపాలను దానం చేశారు. జ్వాలా ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. "అంతేగాదు తల్లిపాలు బిడ్డల ప్రాణాలను కాపాడుతుంది, పైగా అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తుంది. మన దానం చేసే పాలు ఓ బిడ్డ జీవితాన్ని ఆరోగ్యంగా మార్చేస్తాయి. అలాంటి పాలను దానం చేసేందుకు ప్రతి అమ్మ ముందుకు రావాలి. పైగా ఈ పాలు అవసరం ఉన్న కుటుంబం పాలిట దేవతా లేక హీరోగా ఉంటారు. అందువల్ల దయచేసి పాల బ్యాంకుకి మద్దతివ్వండి. "అంటూ పోస్లులో రాసుకొచ్చారామె. ఇకజ్వాల ఇప్పటివరకు 30 లీటర్ల తల్లిపాలను దానం చేసినట్లు తెలిపారు. అంతేగాదు ఆమె విశాల హృదయానికి ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు. అంతేగాదు. దీనిపై అందరు అవగాహన పెంచుకోవాలంటూ పోస్టులు పెట్టారు. కాగా జ్వాల గుత్త.. నటుడు విష్ణు విశాల్ను 22 ఏప్రిల్ 2021న వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి అయ్యింది. జ్వాల తన ఆడపిల్లకు పాలు ఇచ్చిన తర్వాత తన పాలన్నింటినీ దానం చేస్తుంది. భారతదేశంలో మొదటిసారిగా, ఒక అథ్లెట్ ఈ విధంగా తన పాలను దానం చేయడం నిజంగా స్ఫూర్తిదాయకమంటూ అందరు ఆమెను ప్రశంసిస్తున్నారు. చదవండి: కలం'.. కలకాలం..! పాఠకులతో నేరుగా రచయితల సంభాషణ

'కలం'.. కలకాలం..! పాఠకులతో నేరుగా రచయితల సంభాషణ
ఒకప్పుడు రచయిత తాను రాసిన నవలలను ప్రచురణ సంస్థ ద్వారా మార్కెట్లోకి విడుదల చేసి పాఠకుల చెంతకు చేర్చేవాడు. లేదంటే అప్పట్లో వచ్చిన వారపత్రికలు, సీరియళ్లు తదితర మాధ్యమాల ద్వారా తన నవల ఇతివృత్తాన్ని పాఠకులతో పంచుకునేవారు. ప్రస్తుతం వారపత్రికలు ఆదరణ కోల్పోవడం, సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగా రచయితలు నేరుగా పాఠకులతో సంభాషించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తద్వారా పుస్తక ప్రియుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇలా హైదరాబాద్లో రచయితలను, పాఠకులను ఒక చోటకు చేర్చేందుకు పలు క్లబ్స్ సైతం ఏర్పాటయ్యాయి. అంతేకాదు వాటికి డిమాండ్ కూడా పెరుగుతోంది. నవలలను పాఠకుడికి చేర్చడం, పాఠకుడి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, తద్వారా పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకోవడం ప్రస్తుతం ట్రెండ్గా నడుస్తోంది. దశాబ్దం క్రితం రచయితలు పాఠకులతో ముచ్చటించడానికి తమ నవలను పరిచయం చేయడానికి అక్షర పుస్తక విక్రయశాలతో పాటు, సప్తపరి్ణ, లా మకాన్, రవీంద్ర భారతి, ఆంధ్ర సారస్వత పరిషత్, విశాలాంధ్ర బుక్హౌస్, స్టార్ హోటళ్లు, ప్రసాద్ ల్యాబ్స్, ప్రెస్క్లబ్స్ తదితర వేదికలను ఎంచుకునేవారు. ప్రస్తుతం వీటితోపాటు ఈ క్లబ్స్ కూడా రచయితలకు బాసటగా నిలుస్తున్నాయి. ఆఫ్లైన్ క్లబ్ పేరుతో..పాఠకులతో నేరుగా ముచ్చటించేందుకు పలువురు రచయితలు ఎదురు చూస్తున్న తరుణంలో కొన్ని క్లబ్స్ వేదికలుగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే ఆఫ్లైన్ క్లబ్ పేరిట కొంత మంది యువతీ, యువకులు ఓ క్లబ్ను ఏర్పాటుచేసి, రచయితలను ఆహా్వనిస్తూ.. పాఠకులతో ముచ్చటించే సదావకాశాన్ని కలిగిస్తున్నాయి. ఇందుకోసం వీరు స్టార్ హోటళ్లను, పెద్ద పెద్ద హాళ్లను ఎంచుకోకుండా ఆసక్తిగలవారు ఉండేచోటనే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం కెఫేలు బుక్ చేసుకుంటూ నెల రోజుల ముందు నుంచే ఆ రచయితతో మాట్లాడుతూ ఫలానా తేదీన రచయితతో ఇంటరాక్షన్ ఉంటుందని తెలియజేయడం, ఆ తర్వాత పరస్పర భావాలు పంచుకోవడానికి వేదికగా నిలుస్తున్నారు.యువ రచయితల సంఖ్య పెరుగుతోంది.. ఔత్సాహిక యువ రచయితలను ప్రోత్సహిస్తూ.. పాఠకులను, రచయితలను ఒకే వేదికపై చేర్చి ఓ గొప్ప సాహిత్య సంఘాన్ని నిర్మించాలన్నదే లక్ష్యం. ఇప్పటి వరకూ ఎందరో రచయితలతో ఈ ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహించాం. నగరంలో యువ రచయితల సంఖ్య పెరుగుతోంది. పాఠకులతో ముచ్చటించాలనుకునే రచయితలు ఇన్స్టా ద్వారా ఆఫ్లైన్ క్లబ్లోగానీ, ఆథర్ బ్యాంటర్ క్లబ్లోగానీ సంప్రదించవచ్చు. – బిశ్వరూప్ బారిక, ఆఫ్లైన్ క్లబ్ వ్యవస్థాకురాలుపాఠకులు ఉత్సాహంగా సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు ఇటీవల యువ రచయిత చైతన్య ముంగందతో ఆయన రాసిన ‘ప్రేమ కావ్యం’ నవలపై క్లబ్లో ముచ్చటించాం. జూబ్లీహిల్స్లోని ఓ కెఫే దీనికి వేదికైంది. ఈ ప్రేమ కావ్యం ఓ మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆశయాలు, బాధ్యతలు, సంబంధాలను సమతుల్యం చేస్తూ.. ఓ విద్యార్థి ప్రొఫెషనల్గా మారడాన్ని చిత్రీకరించింది. పాఠకులు ఎంతో ఉత్సాహంగా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. – మహ్మద్ నుష్రత్ ఖాద్రిపాఠకులతో ప్రత్యేక సెషన్స్..తాము రాసిన నవల సారాంశాన్ని, అందులోని పాత్రలను కూలంకషంగా చర్చించేందుకు పాఠకులు ముందుకొస్తున్నారు. పలువురు రచయితల తమ పుస్తక ప్రయాణాన్ని, ఆ పుస్తకాల్లోని కథల సారాంశాన్ని చర్చిస్తున్నారు. ఆఫ్లైన్ క్లబ్స్ ఇన్స్టాలో చురుకుగా ఉంటూ కొత్త రచయితలను ప్రోత్సహించడమే కాకుండా పాత రచయితలను కూడా ఈ వేదికలకు దగ్గరచేస్తున్నారు. ప్రతి సెషన్ కూడా పుస్తక సంతకంతో ముగుస్తుస్తోంది. ఇది రచయితలకు, పాఠకులకు ఒక మధురానుభూతిని కల్పిస్తుంది. కెఫేల్లో కాఫీ విత్ ఆథర్ పేరుతో ఇటీవల కాలంలో ఈ తరహా కార్యక్రమాలు జోరందుకున్నాయి. గొప్ప అనుభూతినిచ్చింది.. ‘ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రెయిన్ బో’ అనే పుస్తకాన్ని రచించా. ఇది భావోద్వేగ ప్రేమకు ప్రతీక. నిజజీవిత సమస్యలు, సామాజిక అంచనాలు తాకుతుంది. పోరాటాలు, భావోద్వేగాలను అన్వేషిస్తూ ఆశను కలిగిస్తుంది. కష్టాల ద్వారా ప్రేమ బలాన్ని చూపుతుంది. ఆఫ్లైన్ క్లబ్ ద్వారా పాఠకులతో నేరుగా ముఖాముఖిలో పాల్గొన్నా. వారి అభిప్రాయాలను విని, సందేహాలను నివృత్తి చేశా. రాయడం కన్నా.. సారాంశాన్ని పాఠకులతో పంచుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. – కావ్య కృష్ణన్, రచయిత్రిఆవిష్కరణ కేంద్రాలుగా..రచయితలు, పాఠకులను ఒక చోట చేర్చడం, ఆఫ్లైన్ క్లబ్ రచయితల సమావేశాలు ఏర్పాటు చేయడం, రచయితలను, పాఠకులను ఒక చోట చేర్చడం నగరంలో కొంతకాలంగా జరుగుతున్న ట్రెండ్. వారానికోమారు గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, బేగంపేట, కూకట్పల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో రచయితలతో సమావేశాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. పాఠకుల నుంచి వస్తున్న ఆదరణను రచయితలు కూడా ఆస్వాదిస్తున్నారు. (చదవండి: 22 నుంచి నవకర్ నవరాత్రి ఉత్సవ్)

గ్రీన్ ట్రయాంగిల్..! ప్రకృతి చెక్కిన అద్భుతం..
ప్రకృతికి పక్షపాతం కొంచెం ఎక్కువే. దక్షిణాదిన కేరళను అక్కున చేర్చుకుంది. ఉత్తరాన ఉత్తరాఖండ్ను ఒడిలో దాచుకుంది. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అనే భుజకీర్తి ఒకరిది. ‘దేవభూమి’ అనే అతిశయం మరొకరిది. ఆ రెండు రాష్ట్రాల్లో పుట్టని వాళ్లేం చేయాలి? వీలయినప్పుడు అక్కడికి వెళ్లి చూసి రావాలి? హైదరాబాద్లో రైలెక్కి ఢిల్లీలో రైలు దిగుదాం. ఢిల్లీలో బస్సెక్కి ఉత్తరాఖండ్ టూర్కి చెక్కేద్దాం. ఇది... మూడు వేల అడుగుల ఎత్తు మొదలు... ఏడు వేల అడుగుల ఎత్తుకు సాగే ప్రయాణం.1వ రోజుఉదయం ఆరు గంటలకు ట్రైన్ నంబర్ 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. 2వ రోజు ఉదయం 7.40 గంటలకు ఢిల్లీ స్టేషన్కు చేరుతుంది. హోటల్లో రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తరవాత కార్బెట్కు ప్రయాణం. కార్బెట్కు చేసేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్కడ హోటల్ గదిలో చెక్, రాత్రి భోజనం, బస.3వ రోజుతెల్లవారు జామున లేచి కార్బెట్ సఫారీకి వెళ్లడం, జలపాతాల వీక్షణం తర్వాత హోటల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్, రిఫ్రెష్మెంట్ తర్వాత గది చెక్ అవుట్ చేయాలి. నైనితాల్కు ప్రయాణం. నైనితాల్లో హోటల్లో చెక్ ఇన్, రాత్రి భోజనం, బస అక్కడే.వేటగాడి జ్ఞాపకం!చందమామ కథల్లో చెప్పుకున్నట్లు కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి కాదు కానీ ఇది దట్టమైన అటవీప్రదేశం అని చెప్పడంలో సందేహం లేదు. బ్రిటిష్ పాలన కాలంలో ఏర్పాటయిన నేషనల్ పార్క్ ఇది. తొలి తొలి నేషనల్ పార్క్ కూడా. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిమ్ కార్బెట్ పార్కుగా పేరు మార్చుకుంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం. నిజానికి పులులను సంరక్షించడంలో జిమ్ కార్బెట్ పాత్ర ఏమీ లేదు. ఇతడు గొప్ప వేటగాడు. కుమావ్ రీజియన్లో మనుషులకు హాని కలిగిస్తున్న పులులను, చిరుత పులులను హతమార్చిన ఘనత ఇతడిది. తన పులుల వేట కథనాలను రాశాడు కూడా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సఫారీలో మనకు పులులు, ఏనుగుల గుంపులు, జింకలు, రకరకాల పక్షులు కనువిందు చేస్తాయి. నగరవాసుల ఈ టూర్ ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్గా మిగులుతుంది. ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన శివాలిక్ రీజియన్ ఉంది. అటవీప్రదేశంలో పర్వతసానువులు, జలపాతాలు కూడా ఉన్నాయి. అడవి మధ్యలో ప్రవహిస్తున్న రామ్ గంగ నది, దాహం తీర్చుకోవడానికి నది తీరానికి వచ్చిన జంతువులను చూస్తూ పిల్లలు కేరింతలు కొడతారు. వన్య్రప్రాణుల సంరక్షణ కోసం ఎకో టూరిజమ్ పాలసీ అమలులో ఉంది. కాబట్టి ప్రకృతికి, వన్య్రప్రాణులకు హాని కలిగించే వస్తువులను అనుమతించరు. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత నైనితాల్ లోని పర్యాటక ప్రదేశాల సందర్శనం. రాత్రి బస నైనితాల్లో.ప్రకృతి అద్భుతం ఈ నయనం!నైనితాట్ పట్టణానికి పౌరాణిక ప్రాశస్త్యంతోపాటు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ (వింటర్ క్యాపిటల్, వింటర్ సెషన్స్), నైనితాల్ సమ్మర్ క్యాపిటల్, అలాగే జ్యూడిషియల్ క్యాపిటల్ కూడా, గవర్నర్ బంగ్లా కూడా నైనితాల్లోనే. తాల్ అంటే సరస్సు, నయనం (కన్ను) ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ తటాకానికి నైనితాల్ అని పేరు. ప్రకృతి దేవత రూపంలో కొలిచే సంస్కృతిలో భాగంగా నెలకొన్న నయనాదేవి (నైనాదేవి) ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఒక పర్వత శిఖరానికి నైనా పీక్ అని పేరు. అది ఎనిమిది వేల అడుగులకు పైగా ఉంటుంది. చర్చ్, ప్రాచీన కాల నిర్మాణశైలి మసీదు నిర్మాణశైలి సునిశితంగా ఉంటుంది. హనుమాన్ ఘరి ఆలయం నైనితాల్లోని మాల్ రోడ్లో ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం మంచి వ్యూ ΄ాయింట్. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలు అద్ధుతంగా ఉంటాయి. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలను కూడా చూడవచ్చు.5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత అల్మోరా, ముక్తేశ్వర్ దిశగా ప్రయాణం. దర్శనం తర్వాత తిరిగి నైనితాల్కు చేరాలి. రాత్రి బస నైనితాల్లో.ఇక్కడ ఆది మానవుడు నివసించాడు!అల్మోరాలో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు ఇది ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వచ్చిన ప్రముఖుల పాదముద్రలే పర్యాటక ప్రదేశాలు. స్వామి వివేకానందుడు ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతల «మధ్య ధ్యానం చేసుకోవడానికి సరైన ప్రదేశంగా ఎంచుకున్నాడు. మహాభారత కాలంలో కూడా ఈ ప్రదేశం ప్రస్తావన ఉంది. అది కేవలం పుక్కిటి పురాణం కాదనడానికి నిదర్శనంగా చంద్ రాజవంశం నివసించిన భవనాలున్నాయి.రాజభవనాలంటే మనకు రాజస్థాన్ కోటలు, ప్యాలెస్లే గుర్తొస్తాయి. కానీ ఇక్కడి రాజభవనాన్ని చూస్తే రాజు అత్యంత నిరాడంబరంగా జీవించాడనిపిస్తుంది. పెద్ద రాతి గోడలు, ఆకు పచ్చ రంగు రేకులతో ఏటవాటు పైకప్పు భవనమే చంద్ రాజవంశపు కోట. కుమావ్ పర్వతశ్రేణుల్లో రాజ్యాన్ని స్థాపించి అల్మోరా రాజధానిగా పాలించారు. ప్రాచీనకాలంలో ఇక్కడ మనుషులు నివసించారని నిరూపించే లఖుదియార్ గుహలున్నాయి. క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోనీ పూర్వికులు అల్మోరా వాసులే.అదిగో మంచుకొండ ముక్తేశ్వర్ శైవ క్షేత్రం. ఇక్కడి శివుడిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని చెబుతారు. ఉత్తరాఖండ్ పర్యటనలో హిమాలయాలు పర్యాటకులతో దోబూచులాడుతూ ఉంటాయి. పర్వత సానువుల మధ్య ప్రయాణం సాగుతున్నప్పుడు కొంత మేర ఆకాశాన్నంటే శిఖరాలతో ప్రపంచంతో సంబంధాలు తెగి΄ోయినట్లయినిపిస్తాయి. ఒక మలుపు తిరగ్గానే సూర్యకిరణాలతో ధగధగలాడుతూ మంచుకొండలు దర్శనమిస్తాయి. కొండవాలులో ప్రయాణిస్తున్నప్పుడు లోయలు వెన్నులో భయాన్ని పుట్టిస్తాయి. గూగుల్ సెర్చ్ చేస్తే ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్నామని చూపిస్తుంది. ఇక భయాన్ని అదిమిపెట్టి లోయవైపు చూడకుండా కొండంత అండగా కనిపిస్తున్న కొండనే చూస్తూ ముందుకు సాగిపోవాలి.6వ రోజుబ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం గది చెక్ అవుట్ చేసి ఢిల్లీకి ప్రయాణం. ఢిల్లీ చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్షరధామ్ టెంపుల్ సందర్శనం తర్వాత హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస.లోహరహిత నిర్మాణంఅక్షరధామ్ ఆలయం విశాలమైన నిర్మాణం. ఇది స్వామి నారాయణ ఆలయం. ఈ ఆలయాన్ని ్ర΄ాచీన భారత శిల్పశాస్త్రాన్ని అనుసరించి నిర్మించారు. ఇంత భారీ నిర్మాణంలో ఎక్కడా లోహాలను ఉపయోగించలేదు. అందుకే పిల్లర్లు ఎక్కువగా కనిపిస్తాయి. 234 స్తంభాలున్నాయి. ఒక్కొక్క స్తంభం మీద సునిశితమైన శిల్పచాతుర్యమయం. ఉత్తరాది నిర్మాణాలకు పాలరాయి ఒక వరం అనే చె΄్పాలి. పాలరాతితో పూలరెక్కలను కూడా అంతే సున్నితంగా చెక్కగలిగిన నిపుణులు ఉండడం మనదేశ గొప్పదనం. అందుకే పాలరాతి ఆలయాలకు వెళ్లినప్పుడు చుట్టూ చూసి సరిపెట్టుకోకుండా తలెత్తి పైకప్పును కూడా చూడాలి. అక్షరధామ్ ఆలయ సందర్శనంలో వాటర్ ఫౌంటెయిన్లు, లేజర్ షోలను మిస్ కాకూడదు.7వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత కుతుబ్మినార్, లోటస్ టెంపుల్ సందర్శనం, మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. నాలుగు గంటలకు 12724 నంబర్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతుంది. ఎనిమిదవ రోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ స్టేషన్కు చేరుతుంది.ఏనాటిదో ఈ మినార్!కుతుబ్ మినార్ నిర్మాణం గురించి చరిత్ర తవ్వకాల్లో కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అప్పటికప్పుడు ఓ చిన్న వివాదం, ఆ తర్వాత సమసి΄ోవడం, కొత్త వాస్తవాలను స్వీకరించడం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని క్రీ.శ పన్నెండవ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడనే ఆధారాలను కొట్టి పారేస్తూ ఐదవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్యుడు నిర్మించాడనే ఆధారాలు వ్యక్తమయ్యాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలను కొనసాగిస్తోంది. ఈ వాస్తవాలెలా ఉన్నప్పటికీ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఓ గొప్ప నిర్మాణ విశేషం. అందుకే యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది.ధ్యాన కలువప్రతి ఆర్కిటెక్చర్ స్టూడెంట్ చూడాల్సిన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ లేదు. కలువ రెక్కల లోపల లోహపు కడ్డీల ఆధారంగా నిర్మించారు. గొప్ప ఆధ్యాత్మికత అన్వేషణలో భాగంగా ధ్యానం కోసం నిర్మించిన బహాయీ ధ్యానమందిరం ఇది. లోటస్ టెంపుల్ గిన్నిస్ రికార్డు సాధించిన ఆలయం. ఈ ఆలయం, నిర్మాణ వైశిష్ట్యాలను వివరిస్తూ ఐదు వందల వ్యాసాలు, వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ప్రాంగణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ శబ్దం వినిపించదు. నిర్వహకులు పిన్డ్రాప్ సైలెన్స్ మెయింటెయిన్ చేస్తారు. చక్కటి గార్డెన్ల మధ్య మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్లి కొద్ది సేపు ధ్యానం చేసి బయటకు రావడం గొప్ప అనుభూతినిస్తుంది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..)
ఫొటోలు


హీరో ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా బ్రిగిడ సాగా (ఫొటోలు)


సీలేరు అందాలు చూసొద్దాం రండీ..! (ఫొటోలు)


సాగర తీరాన అక్కినేని కోడలు శోభిత ధూలిపాల (ఫొటోలు)


11వ శతాబ్దపు చారిత్రక కట్టడం.. టాలీవుడ్ హీరోయిన్ ఫిదా (ఫొటోలు)


అనసూయ ‘పవర్ డ్రెస్సింగ్’..చీర ఇలా కూడా కడతారా? (ఫోటోలు)


యాంకర్ సుమ ఇంట్లో ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)


కిక్ ఇచ్చేలా 'దిశా పటాని' ఫోజులు.. ట్రెండింగ్లో (ఫోటోలు)


తలలేని భైరవ కొండన్న విగ్రహం.. మొండి భైరవకోన ఆలయం (ఫొటోలు)


సూర్య బర్త్డే గిఫ్ట్ అదిరిపోయిందిగా.. దేవిషాతో కలిసి సెలబ్రేషన్స్ (ఫోటోలు)


'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
అంతర్జాతీయం

టారిఫ్లతో సమస్య మరింత సంక్లిష్టం
బీజింగ్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీగా టారిఫ్లు విధించాలంటూ జీ7 దేశాలకు అమెరికా ప్రభుత్వం పిలుపు ఇవ్వడాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఖండించారు. టారిఫ్లు, ఆంక్షలు సమస్యను మరింత సంక్లిష్టంగా మారుస్తాయే తప్ప ఒరిగేదేమీ ఉండదని అన్నారు. ఎలాంటి యుద్ధాల్లో తాము పాల్గొనడం లేదన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా యుద్ధాలకు ముగింపు పలకాలన్నదే తమ విధానమని ఉద్ఘాటించారు. టారిఫ్లను పెంచాలన్న ఆలోచన ఎవరకీ మేలు చేయదని అన్నారు. అమెరికా ట్రెజరీ సెక్రెటరీ బెస్సెంట్ జీ7 దేశాల ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడుతూ.. భారత్, చైనాలో టారిఫ్లు పెంచాలని సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగిసిపోవాలని నిజంగా కోరుకుంటే తాము చెప్పినట్లు చేయాలని పేర్కొన్నారు. దీనిపై వాంగ్ యీ స్పందించారు. చైనా బాధ్యతయుతమైన అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. శాంతి, భద్రత వంటి అంశాల్లో చైనాకు మంచి రికార్డు ఉందన్నారు.

140 కోట్ల జనాభా ఉన్న దేశం మొక్క జొన్న కంకి కొనలేదా?
న్యూయార్క్: భారత్పై అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ కక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల జనాభా ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న భారతదేశం అమెరికా నుంచి ఒక్క మొక్కజొన్న కంకి కూడా కొనడంలేదని వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గించాలి లేదా తమ నుంచి వ్యాపారపరంగా ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకోవాలని భారత్కు తేల్చిచెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లుట్నిక్ మాట్లాడారు. కొన్ని దేశాల విషయంలో స్నేహం ఒకవైపు నుంచే కొనసాగుతోందని అన్నారు. తాము స్నేహం చేస్తున్న దేశాలు తమను వాడుకొని లాభపడుతున్నాయని విమర్శించారు. వారి ఉత్పత్తులను అమెరికాలో విక్రయించుకుంటూ, అమెరికా ఉత్పత్తులను మాత్రం వారి దేశాల్లో అనుమతించడం లేదని తప్పుపట్టారు. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్లో అమెరికాకు ప్రవేశం కల్పించడం లేదన్నారు. బంధం అనేది ఇరువైపుల నుంచి ఉండాలని తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు గుర్తుచేశారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అమెరికా నుంచి ఒక్క మొక్కజొన్న కంకి కూడా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇండియాది తప్పుడు విధానం కాదా? అని ప్రశ్నించారు. ఇండియా ఉత్పత్తులను అమెరికాలోకి అనుమతిస్తున్నామని, అదే పని ఇండియా ఎందుకు చేయడం లేదని పేర్కొన్నారు. పైగా తమ ఉత్పత్తులపై ఇండియాలో టారిఫ్లు అధికంగా ఉన్నాయని ఆక్షేపించారు. ఎదుటివారు మనకు ఎలాంటి మర్యాద ఇస్తారో మనం కూడా వారికి అలాంటి మర్యాదే ఇవ్వాలన్నది అమెరికా విధానమని లుట్నిక్ స్పష్టంచేశారు.

వలసల వ్యతిరేక ర్యాలీ హింసాత్మకం
లండన్: వలసదారులకు వ్యతిరేకంగా యునైటెడ్ కింగ్డమ్(యూకే) రాజధాని లండన్లో చేపట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. విదేశీయులను బయటకు పంపించాలన్న డిమాండ్తో అతివాద నేత టామీ రాబిన్సన్ పిలుపు మేరకు శనివారం జరిగిన ర్యాలీలో ఏకంగా 1,50,000 మంది పాల్గొన్నారు. ‘యునైట్ ద కింగ్డమ్ ర్యాలీ’ పేరిట సెంట్రల్ లండన్లో కదం తొక్కారు. పార్లమెంట్ సమీపంలోనే భారీ ప్రదర్శన నిర్వహించారు. అడ్డుకునేందుకు ప్రయతి్నంచిన పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారుల దాడిలో 26 మంది పోలీసులు గాయపడినట్లు మెట్రోపాలిటన్ పోలీసు విభాగం అధికారులు తెలిపారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. పోలీసులపై నిరసనకారులు నీళ్ల సీసాలతోపాటు చేతికందిన వస్తువులు విసిరేశారని, దూరంగా నెట్టేయడానికి ప్రయతి్నంచారని పేర్కొన్నారు. హింస ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, లండన్లో జరిగిన ఘర్షణకు సంబంధించిన 24 మందిని అరెస్టుచేశారు. వారిపై వివిధ అభియోగాలు నమోదు చేశారు. 25 మందిని అరెస్టు చేసినట్లు తొలుత ప్రకటించగా, ఆదివారం ఆ సంఖ్యను 24గా సవరించారు. నిరసన తెలపడం చట్టబద్ధమైన హక్కు అయినప్పటికీ కొందరు హింసకు పాల్పడాలన్న ఉద్దేశంతో ర్యాలీలో పాల్గొన్నారని ఓ పోలీసు అధికారి చెప్పారు. పోలీసులపై జరిగిన దాడిని హోం సెక్రెటరీ షబానా మహమూద్ ఖండించారు. చట్టాన్ని ఉల్లంఘించివారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మరోవైపు జాత్యహంకారానికి వ్యతిరేకంగా లండన్లో మరో ర్యాలీ సైతం జరిగింది. ‘స్టాండ్ అప్ టు రేసిజం’ పేరిట జరిగిన ఈ ర్యాలీలో 5,000 మందికిపైగా జనం పాల్గొన్నారు. వలసదారులను వ్యతిరేకించడం, వారిపై కక్షగట్టడం సరైంది కాదంటూ నినదించారు.వలసల వల్ల విధ్వంసమే: ఎలాన్ మస్క్ లండన్లో నిర్వహించిన యాంటీ ఇమ్మిగ్రేషన్ ర్యాలీని టెస్లా సంస్థ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సమరి్థంచారు. వలసదారులను వ్యతిరేకించేవారికి పూర్తి మద్దతు ప్రకటించారు. నిరసనకారులను ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. నియంత్రణ లేని వలసల వల్ల దేశానికి భారీ నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. యూకేలో ప్రభుత్వాన్ని మార్చేసే దిశగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ను రద్దుచేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మితిమీరిన వలసల కారణంగా దేశం విధ్వంసం అంచున ఉన్నట్లు హెచ్చరించారు. ఇప్పుడున్నవి రెండే మార్గాలని తేల్చిచెప్పాలి. పోరాటం చేయాలని, లేదంటే చచ్చిపోయే పరిస్థితి వస్తుందని స్పష్టంచేశారు. పోరాటమా? మరణమా? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వం వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ మార్పును తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎందుకీ నిరసనలు? యూకేలో వలసదారుల పట్ల స్థానికుల్లో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోంది. లండన్ శివారులో ఇటీవల 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురైంది. ఇథియోపియా నుంచి వలసవచ్చిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తేలింది. దాంతో వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఇమ్మిగ్రెంట్లు తలదాచుకుంటున్న ఇళ్లు, హోటళ్లను జనం ముట్టడించారు. వలసదారుల కారణంగా ఇంగ్లండ్ సంస్కృతి నాశనమవుతోందని జనం మండిపడుతున్నారు. తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తచేస్తున్నారు. మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పడుతోందని అంటున్నారు. వలసదారులను వారి స్వదేశాలకు పంపించాలని పట్టుబడుతున్నారు. అవకాశాలు స్థానికులకే దక్కాలని అంటున్నారు. నిరసనలకు లొంగేది లేదు: స్టార్మర్ వలసలదారుల వ్యతిరేక నిరసనలకు బ్రిటన్ ఎప్పటికీ తలవంచబోదని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆదివారం స్పష్టంచేశారు. లండన్లో జరిగిన హింసను ఖండించారు. జాతీయ జెండాను ముసుగుగా కప్పుకొని హింసాకాండకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎరుపు, తెలుపు ఇంగ్లిష్ జెండా దేశ వైవిధ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. చర్మం రంగు లేదా నేపథ్యం ఆధారంగా పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని, వారిని వ్యతిరేకించడాన్ని సహించబోమని స్టార్మర్ హెచ్చరించారు.

నేపాల్ తాత్కాలిక ప్రధాని కర్కీ సంచలన ప్రకటన
ఖాట్మాండ్: నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కీ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, ప్రధాని సుశీలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనల్లో భాగంగా ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా.. నేపాల్లో నిరసనలు, ఆందోళనల వేళ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. తాను అధికారాన్ని అనుభవించేందుకు రాలేదని తెలిపారు. ఆరు నెలలకు మించి ఈ పదవిలో ఉండబోమని, ఆ తర్వాత కొత్త పార్లమెంట్కు బాధ్యతలను అందిస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే బాధ్యతలు చేపట్టాం. దేశ పునర్నిర్మాణానికి ప్రజలందరి సహకారం అవసరమని, వారి మద్దతు లేకుండా తాము విజయం సాధించలేమని అన్నారు. ఇక, ఈరోజు తాత్కాలిక ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది.Kathmandu: Days after taking charge as the interim Nepal Prime Minister, Sushila Karki says, "Those involved in the incident of vandalism will be investigated.'' she said, "My team and I are not here to taste the power. We won't stay for more than 6 months. We will hand over… pic.twitter.com/dg1WhdniyJ— The Truth India (@thetruthin) September 14, 2025ఇదే సమయంలో ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా ‘అమరవీరులు’గా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నారు. అధికారం కోసం కాకుండా దేశాన్ని తిరిగి గాడిన పెట్టడానికే తాము వచ్చినట్టు వెల్లడించారు. దీంతో, ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నేపాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
జాతీయం

మహాఘఠ్బంధన్లో లుకలుకలు..!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్బంధన్లో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మహాఘఠ్బంధన్ను వేరుపడి ఒంటరి పోరు చేసేందుకు ఆమ్ఆద్మీ పార్టీ నిర్ణయించగా, అదే దారిలో ఆర్జేడీ సైతం పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్ది వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నా..ఇప్పటివరకు సీట్ల పంపకాలు ఖరారు కాకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముఖం చాటేస్తుండటంతో కాంగ్రెస్పై గుర్రుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చేసిన ప్రకటన ఘట్బంధన్ మైత్రిని ప్రశ్నార్థకం చేస్తోంది. అవినీతి.. కులాల లెక్కలు బిహార్లో 1980 వరకు కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శక్తిగా ఉండేది. 1990లో లాలూప్రసాద్ యాదవ్, నితీశ్కుమార్ వంటి ప్రాంతీయ నేతల ఆవిర్భావంతో కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. చేసేది లేక వారి దయాదాక్షిణ్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతూ వస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మిత్రపక్షమైన ఆర్జేడీతో కలిసి ఈ ఎన్నికల్లో బిహార్లో తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంతో మొన్నటివరకు ముందుకెళ్లింది. గత ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు గాను 75 స్థానాల్లో గెలిచింది. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీకి గరిష్ట స్థానాలు దక్కుతాయని, తానే సీఎం అభ్యర్థిని అవుతాననే ఉత్సాహంతో తేజస్వీ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఇటీవలే ఓట్ చోరీపై రెండు వారాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహాఘఠ్బంధన్ తరఫున తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా తప్పించుకున్నారు. తేజస్వి స్వయంగా తనను తాను బిహార్ సీఎంఅభ్యర్థిగా ప్రకటించుకుంటున్నా, కాంగ్రెస్ మాత్రం మిన్నకుండిపోయింది. ఇటీవలే కాంగ్రెస్ బిహార్ ఇన్చార్జి కృష్ణ అల్లవేరు మాట్లాడుతూ ప్రజలే సీఎంను నిర్ణయిస్తారని ప్రకటించడంతో గందరగోళం ఇంకాస్త పెరిగింది. కాంగ్రెస్ అంచనా వేరే.. తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో కాంగ్రెస్కు బిహార్లో తమ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉండాలన్నది పార్టీ దీర్ఘకాలిక వ్యూహంలా ఉంది. గడిచిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ 9 స్థానాలకు గానూ 3 స్థానాలను గెలుచుకోవడం, ఇటీవలి ఓటర్ అధికార్ యాత్రతో కాంగ్రెస్పై ప్రజల్లో ఆదరణ పెరగడంతో కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే అదనుగా పార్టీని బలోపేతం చేసుకోవడం సులువని పార్టీ విశ్వసిస్తోంది. ఈ సమయంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఆర్జేడీ బలపడి, కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే భావన ఉంది. గత ఎన్నికల్లో కేవలం 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. తేజస్విని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తే సీట్ల బేరసారాల్లో కాంగ్రెస్కు నష్టం వాటిల్లుతుంది. అదీగాక లాలూప్రసాద్ యాదవ్తో పాటు తేజస్వియాదవ్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వయంగా తేజస్విపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద నేత నుంచి దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాల్లో గట్టి పట్టుంటే, కాంగ్రెస్కు అగ్రవర్ణాలతో పాటు ముస్లిం, దళిత ఓట్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా ఎన్డీఏ పక్షాల వైపు మొగ్గు చూపుతుంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తేజస్విని పక్కనపెడుతుండటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండ్రోజుల కిందట 243 స్థానాల్లో తాము పోటీలో ఉంటామనే ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించలేదు. ప్రస్తుత ఈ పరిణామాలు ఎటువైపు మళ్లుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

కార్లతో సమానంగా ఏసీల కాలుష్యం
న్యూఢిల్లీ: ఎండల తీవ్రత పెరిగిన కొద్దీ దేశంలో ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒకప్పటి విలాస ఉపకరణం నేడు ముఖ్యావసరంగా మారింది. ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఏసీ ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఇళ్లలోనూ కనిపిస్తోంది. అయితే, కారు మాదిరిగానే ఏసీకూడా వాతావరణం మరింత వేడెక్కేందుకు కారణమవుతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. వాతావరణం కోణంలో చూస్తే ఏసీ కూడా ప్రమాదకరమైన గృహోపకరణమేనని ఢిల్లీకి చెందిన ఐఫారెస్ట్ సంస్థ సర్వే తేల్చింది. ఇంకా ఏం చెప్పిందంటే.. 2030 నాటికి భారత్లో గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేసే అతిపెద్ద గృహోపకరణంగా ఎయిర్ కండిషనర్లు మారనున్నాయి. దేశంలో 2035 నాటికి వాతావరణంలో కలిసే కార్బన్ డయాక్సైడ్ రెట్టింపయ్యి 329 మిలియన్ టన్నులకు చేరుకోనుంది. 2024లో ఒక్క ఏడాదిలోనే ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) 156 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమాన ఉద్గారాలను విడుదల చేశాయని, ఇది దేశంలోని అన్ని ప్రయాణికుల కార్ల ఉద్గారాలకు సమానమని వెల్లడైంది. ఇందులో 52 మిలియన్ టన్నుల ఉద్గారాలు కూలింగ్ గ్యాస్ లీకేజీల (రెఫ్రిజిరెంట్లు) వల్లనే జరిగాయని పేర్కొంది. 2035 నాటికి ఏసీల వల్ల విడుదలయ్యే మొత్తం ఉద్గారాలు 329 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వాటితో పోలిస్తే రెట్టింపునకు మించి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఒక ఏసీని రెండేళ్లకోసారి గ్యాస్ రీఫిల్ చేయిస్తే, అది ఓ కారు విడుదల చేసేంత ఉద్గారాలను విడుదల చేస్తుంది. వాతావరణ పరంగా చూస్తే ఏసీ కూడా కారు లాంటిదే, అంతే ప్రమాదకరమైందని ఐఫారెస్ట్ అధ్యక్షుడు, సీఈవో చంద్ర భూషణ్ చెప్పారు. రెఫ్రిజిరెంట్ల తయారీదారులు ఉద్గారాలను మరింతగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఒత్తిడిపెంచాలి. ప్రభుత్వం జాతీయ రెఫ్రిజిరెంట్ డేటాబేస్ ఏర్పాటు చేయాలి. వాతావరణంపై తీవ్రప్రభావాన్ని తగ్గించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ చర్యలతో వచ్చే దశాబ్దంలో 500–650 మిలియన్ టన్నుల రెఫ్రిజిరెంట్ ఉద్గారాలను తగ్గించవచ్చని, వాటి విలువ 25 నుంచి 33 బిలియన్ల డాలర్ల కార్బన్ క్రెడిట్లుగా ఉండొచ్చని ఐఫారెస్ట్ నివేదిక పేర్కొంది. అలాగే, వినియోగదారులు 10 బిలియన్ డాలర్ల వరకు రీఫిల్లింగ్ ఖర్చులు ఆదా చేసుకోగలరని తెలిపింది. ఏసీ వాడకం ఎలా ఉంటుందంటే..2024లో 62 మిలియన్లు ఉన్న ఏసీలు, 2035 నాటికి 245 మిలియన్లకు చేరనున్నాయి. వార్షిక విక్రయాలు సైతం 14 మిలియన్ల నుంచి 40 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. 2020 నుంచి ఏసీల విక్రయాలు ఏడాదికి 15 నుంచి 20% చొప్పున పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో నగరీకరణ, వ్యక్తుల ఆదాయాల్లో పెరుగుదల, పెరిగిన ఎండల తీవ్రత తదితరాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి. సర్వే ఎలా జరిపారంటే..ఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, పుణె, జైపూర్ నగరాల్లో 3,100 కుటుంబాలపై ఈ సర్వే చేపట్టారు. ఆయా నివాసాలు, కార్యాలయాల్లోని 80% ఏసీలు ఐదేళ్ల లోపు తయారైనవి. ఇందులో 87% కుటుంబాలు ఒకే ఏసీ కలిగి ఉండగా, 13% మంది రెండు, అంతకంటే ఎక్కువ ఏసీలను వాడుతున్నారు. చెన్నై, జైపూర్, కోల్కతా, పుణెల్లోని ఎక్కువ కుటుంబాలు ఒకటికి మించి ఏసీలను కలిగి ఉన్నాయి. కోల్కతా, జైపూర్, పుణె వాసులు ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సైతం నివేదిక వెల్లడించింది. రెఫ్రిజిరెంట్ రీఫిల్లింగ్ భారత్లో రీఫిల్లింగ్ ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. సాధారణంగా ఏసీలను ఐదేళ్లకోసారి రీఫిల్ చేస్తే సరిపోతుంది. కానీ, భారత్లో సగటున 40% ఏసీలు ఏటా రీఫిల్ అవుతున్నాయి. ఐదేళ్లకు మించి ఉన్న ఏసీలలో 80%కు పైగా ఏటా రీఫిల్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. వినియోగదారులు 2024లో రూ.7,000 కోట్ల విలువైన రెఫ్రిజిరెంట్ల రీఫిల్లింగ్ చేసుకున్నారు. ఇది 2035 నాటికి రూ. 27,540 కోట్లకు పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది.హానికరమైన రెఫ్రిజిరెంట్లు దేశంలో ప్రధానంగా వాడే హెచ్ఎఫ్సీ–32 అనే గ్యాస్, కార్బన్ డయాక్సైడ్ కంటే 675 రెట్లు ఎక్కువ ఉష్ణతాపాన్ని కలుగ జేస్తుంది. 2024లో రెఫ్రిజిరెంట్ లీకేజీల వల్ల 52 మిలియన్ టన్నుల ఉద్గారాలు వెలువడగా, 2035 నాటికి ఇది 84 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది.వినియోగం తీరు ఎలా ఉంది? దేశంలో కుటుంబాలు సగటున ఏసీని రోజుకు 4 గంటల పాటు వాడుతున్నాయి. వేసవిలో ఎక్కువగా 7.7 గంటలపాటు వాడుతున్నారు. వర్షాకాలంలో 3.2 గంటలు మాత్రమే వినియోగించుకుంటున్నారు. దాదాపు 98% కుటుంబాలు 3 స్టార్ నుంచి 5 స్టార్ రేటెడ్ ఏసీలు వాడుతున్నారు. త్రీస్టార్ ఏసీలు 60% ఇళ్లలో ఉంటే 5 స్టార్ ఏసీలు 28% మంది వినియోగిస్తున్నారు.థర్మోస్టాట్ సెట్టింగ్స్ దేశంలో సగటున 67% కుటుంబాలు ఏసీని 23నిసెల్సియస్–25సెల్సియస్ మధ్య ఉంచుతున్నాయి. కేవలం 33% మాత్రమే 22 సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేస్తున్నారు. వీరిలో అత్యధికులు ఢిల్లీ, ముంబయి, పుణెకు చెందినవారేనని సర్వేలో తేలింది. విద్యుత్ వినియోగంపై ప్రజలు జాగ్రత్తగా ఉన్నా, రెఫ్రిజిరెంట్ల విషయంలో అవగాహన తక్కువగా ఉంది. ప్లాస్టిక్ లాగే రెఫ్రిజిరెంట్ల జీవిత కాలంపై కూడా సమగ్ర అవగాహన అవసరమని ఐఫారెస్ట్ చైర్మన్ చంద్ర భూషణ్ అంటున్నారు.

నలుగురిలో ఒకరు ట్యూషన్కు!
పాఠశాల విద్యార్థుల్లో దాదాపు నలుగురిలో ఒకరు ఇప్పుడు ట్యూషన్లు లేదా ప్రైవేట్ కోచింగ్ మీద ఆధారపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంది. ట్యూషన్ల కోసం ఏటా ప్రతి విద్యార్థిపై చేస్తున్న సగటు వ్యయం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండింతలు అధికంగా ఉండడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్జాతీయ నమూనా సర్వే (ఎన్స్ ఎస్ఎస్) 80వ రౌండ్ కింద కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్–జూన్ మధ్య విద్యపై సమగ్ర సర్వే చేపట్టింది. అడ్మిషన్ల విషయంలో గ్రామీణ భారతంలో ప్రభుత్వ పాఠశాలలదే పైచేయిగా ఉందని సర్వే తేల్చింది. పట్టణ ప్రాంత కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నాయి అంతేకాదు మార్కుల వేటలో భాగంగా తమ పిల్లలను ట్యూషన్లకూ పంపిస్తున్నాయి.ట్యూషన్ల కోసం వ్యయంప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలో 27 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే పట్టణాల్లో 30.7%, గ్రామీణ భారత్లో 25.5% మంది ప్రైవేట్ కోచింగ్పై ఆధారపడ్డారు. దేశంలో సగటున ఒక్కో విద్యార్థి ట్యూషన్స్ కోసం రూ.2,409 వెచ్చిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్ కోసం సగటు ఖర్చు రూ.1,793 కాగా, పట్టణాల్లో రూ.3,988 అవుతున్నట్టు అంచనా. ఇంటర్ స్థాయిలో పట్టణ కుటుంబాలు కోచింగ్ కోసం ఒక్కో విద్యార్థికి రూ.9,950 ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.4,548.పట్టణాల్లో ప్రైవేట్ విద్యకు..గ్రామీణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 33.9% మంది ప్రైవేట్, ఇతర సంస్థలలో చదువుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 30.1% మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 70% మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. మొత్తంగా దేశ సగటు చూ స్తే.. అడ్మిషన్లలో 55.9% వాటా ప్రభుత్వ పాఠశాలలదేనని సర్వే పేర్కొంది.పట్టణ ప్రాంతాల్లో అధికంప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు ఉండవు. కానీ, ట్యూషన్లు, ర వాణా, స్టేషనరీ, ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రైవేటులో అయితే వీటికి ఫీజు, యూనిఫాం వంటివి అదనంగా చేరతాయి. దీంతో ప్రతి విద్యా ర్థికి అవుతున్న వార్షిక వ్యయం రూ.23,470గా సర్వే అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.8,382గా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే.. పట్టణ ప్రాంత విద్యార్థికి రూ.4,128, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,639 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వేతర పాఠశాలల విషయంలో ఇది.. పట్టణప్రాంతాల్లో రూ.31,782, గ్రామీణ ప్రాంతాల్లో 19,554గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఫీజుల కోసం చేస్తున్న సగటు వార్షిక వ్యయం రూ.15,143 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,979.⇒ ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థుల విషయంలో దేశంలో 37% మంది ప్రైవేట్ కోచింగ్కు సై అంటున్నారు. పట్టణాల్లోని ఇంటర్ స్టూడెంట్స్లో 44.6 మంది ట్యూషన్లకు వెళ్తున్నారు.⇒ ప్రైవేట్ ట్యూషన్స్ కోసం దేశంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు సగటున ఏటా రూ.6,384 ఖర్చు పెడుతున్నారు. ⇒ కోచింగ్ సంస్థలు చెల్లించిన వస్తు, సేవల పన్ను 2019–20లో రూ.2,240 కోట్లు. 2023–24కి వచ్చేసరికి ఇది రూ.5,517 కోట్లకు చేరింది.⇒ కోచింగ్ కోసం అమ్మాయిల కంటే అబ్బాయిలు కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఏటా అమ్మాయిలు రూ.2,227, అబ్బాయిలు రూ.2,572 వ్యయం చేస్తున్నట్టు సర్వే పేర్కొంది.

దేశభద్రతలో ఆత్మనిర్భరత
కోల్కతా: దేశ భద్రత విషయంలో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం సైనిక దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. సైన్యం, నేవీ, వైమానిక దళాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగాలని సూచించారు. కోల్కతాలో సోమవారం ఆయన 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ (సీసీసీ)ను ప్రారంభించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు కోసం మార్పు: సీసీసీలో సైనిక దళాల్లో గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన సంస్కరణలను ప్రధాని సమీక్షించారు. వచ్చే రెండు సంవత్సరాల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్లో సైనిక దళాలు చూపిన తెగువను ప్రధాని ప్రశంసించారు. ‘సంస్కరణల సంవత్సరం– భవిష్యత్తు కోసం మార్పు’ అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో సైనిక, ఆయుధ పరంగా స్వయంసమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. భారత త్రివిధ దళాలు జాతి నిర్మాణంతోపాటు కల్లోల ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ప్రకృతి విపత్తుల సమయంలో దళాల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోవాలంటే దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని, సైనిక పరంగా స్వయంసమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
ఎన్ఆర్ఐ

తానా “తెలుగుభాషా యువభేరి” విజయవంతం
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన “తెలుగుభాషా యువభేరి” భారీ విజయం. డాలస్, టెక్సస్లో తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 83వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శ్రీ గిడుగు వెంకట రామమూర్తి (ఆగస్ట్ 29) 162వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిగిన “తెలుగుభాషా యువభేరి” ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలుగు వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది, ఉపాధ్యాయుడు,అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు తెలుగును గ్రాంధిక భాషనుంచి వ్యావహారిక భాషగా మార్చే ప్రయత్నంలో గిడుగు చేసిన కృషిని సోదాహరణంగా వివరించి ఘన నివాళులర్పించారు.“ఈ నాటి ఈ కార్యక్రమంలో 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్ధినీ విద్యార్దుల నుంచి ఎం.బి.బి.ఎస్ చదువుతున్న విద్యార్ధుల వరకు కేవలం తెలుగుభాషలో ప్రావీణ్యమే గాక, అవధానాలు చేసే స్థాయికి ఎదగిన యువతీయువకులు చూపిన సాహితీ ప్రతిభ, వెదజల్లిన సాహితీ పరిమళాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి అన్నారు. ఈ ప్రయాణంలో పసితనం నుంచే వీరిలో తెలుగుభాషపై ఆసక్తి, అనురక్తి కలిగించడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణ, ముఖ్యంగా అవధాన విద్యా వికాస పరిషత్ పోషించిన గురుతరమైన పాత్ర ఎంతైనా కొనియాడదగ్గవి అన్నారు” డా. తోటకూర ప్రసాద్ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ సినీగీత రచయిత తిపిర్నేని కళ్యాణచక్రవర్తి మాట్లాడుతూ “నేను పట్టాలు పొందింది తెలుగులో కాదు, చదువుకున్నది ఎం టెక్, ఎం.బి.ఏ. ఐనప్పటికీ తన తాత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలలో గురువుల శిక్షణ తనకు తెలుగు భాషామాధుర్యాన్ని చవిచూసే అవకాశం కల్పించి, నేడు తెలుగు సినిమా రంగంలో దాదాపు వంద పాటలు వ్రాసే స్థాయికి తీసకు వెళ్ళాయన్నారు. కనుక చిన్నతనంనుండే పిల్లలకు తెలుగు నేర్పే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు” విశిష్టఅతిథులు పాల్గొన్న అద్దంకి వనీజ, 9వ తరగతి విద్యార్ధిని, విజయవాడ - “ఘనమైన గద్యం”; అష్టావధాని వింజమూరి సంకీర్త్, 9వ తరగతి విద్యార్ధి, హైదరాబాద్ (వింజమూరు, నల్గొండ జిల్లా) - “శతక సాహిత్యం”; బులుసు రమ్యశ్రీ, 10వ తరగతి విద్యార్ధిని (భీమడోలు, ఏలూరు జిల్లా) - “ఆధునిక సాహిత్యం”; శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ, బి.ఏ విద్యార్ధి, తిరుపతి - “ఉదాహరణకావ్యవైభవం”; అష్టావధాని యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పి.హెచ్.డి విద్యార్ధి, తిరుపతి (బల్లిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా) - “అవధానంలో సామాజిక దృక్పధం”; అష్టావధాని డా. బోరెల్లి హర్ష, బి.డి.ఎస్, దంతవైద్యులు, కర్నూలు - “వర్ణన”; అష్టావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్, ఎం.టెక్ విద్యార్ధి, ఐఐటి, ఖరగ్పూర్ (హైదరాబాద్) - “నిషిద్ధాక్షరి”; అష్టావధాని గట్టెడి విశ్వంత్, పి.హెచ్.డి విద్యార్ధి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (మెట్పల్లి, జగిత్యాల జిల్లా) - “తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలు”; అష్టావధాని బాణావత్ నితిన్ నాయక్, బి.టెక్, ఐఐఐటి, బాసర (నిజామాబాద్) - “అవధాన విద్య-ఒక సమీక్ష” అష్టావధాని సుసర్ల సుధన్వ, ఎం.బి.బి.ఎస్ విద్యార్ధి, చెన్నై (హైదరాబాద్) – “సమస్యాపూరణం” అనే అంశాల మీద అద్భుత ప్రసంగాలుచేసి అందరినీ ఆశ్చ్యర్య పరచారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో ఈ కార్యక్రమంలో ఈ యువతీ యువకులు చూపిన భాషా పాండిత్య ప్రతిభ చూస్తుంటే తెలుగు భాష భవిష్యత్తుకు ఏ ప్రమాదం లేదనే ఆశ కలుగుతోందన్నారు. పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లింకులో వీక్షించవచ్చు https://www.youtube.com/live/DqCQES2BcwM?si=eRcIZ3B-NFxtUcMX(చదవండి: ఖతర్లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం)

బాపట్లలో విషాదం.. అమెరికాలో లోకేశ్ మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. అమెరికాలో బాపట్లకు చెందిన లోకేష్(21) మృతిచెందారు. స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయి పాటిబండ్ల లోకేష్ చనిపోయాడు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా లోకేష్ను గుర్తించారు. కాగా, ఉన్నత చదువుల కోసం లోకేశ్.. అమెరికా వెళ్లాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఖతర్లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం
ఖతర్లో తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దోహాలోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ తెలుగు లిటరేచర్ క్లబ్ అనుబంధ సంస్థలైన తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి, ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమం తెలుగు సంఘాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన, గొప్ప భాషలలో ఒకటైన "తెలుగు" భాషను గౌరవిస్తూ, గొప్ప తెలుగు కవి, వ్యవహారిక భాష శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజునాడు నాలుగు తెలుగు సంస్థలు - హరీష్ రెడ్డి (అధ్యక్షులు - TKS), శ్రీనివాస్ గద్దె (అధ్యక్షులు - TPS), నాగ లక్ష్మి (ఉపాధ్యక్షులు - TJQ), విక్రమ్ సుఖవాసి (ఆపద్ధర్మ అధ్యక్షులు - AKV) నాయకత్వంలో ఈ వేడుకను దిగ్విజయముగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులతో పాటు, ఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలుగు భాషాభిమానులు, వర్ధమాన కవులు, తెలుగు పండితులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, వివిధ కూరగాయలు, పండ్ల పేర్లను ఉపయోగించి అందమైన తెలుగు కథా కథనాలతో, వేమన పద్యాలు, తెలుగు పొడుపు కథలు/మెదడును చురుకుగా ఉంచే ఆటలతో, ఆశక్తికరమైన సంభాషణలతో తెలుగు భాషలో వారి సృజనాత్మకతను ప్రదర్శించారు. అంతేగాక, ప్రపంచ వేదికపై వివిధ రంగాలలో తెలుగు ప్రజల విజయాలు,వారి కృషిని గురించి కొనియాడారు. తెలుగు భాష పై నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.గిడుగు వెంకట రామమూర్తి గారి కవిత్వాన్ని, ఇంకా వారి గ్రామంలో కొనసాగుతున్న సంస్కృతిని వివరిస్తూ.. తాము ఆ గ్రామానికి చెందినవారమని ఒక ప్రేక్షకురాలు గర్వంగా చెప్పినప్పుడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమం తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమంలో అత్యధిక యువత భాగస్వామ్యం కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మన సంస్కృతి ప్రస్తుత తరానికి వారసత్వంగా అందుతోందని ఆశించటం అతిశయోక్తి కాదనిపించింది. ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం మాతృదేశానికి దూరంగా ఉంటున్న యువత తమ మూలాలను గుర్తించి గౌరవించడం అని తెలియ చేశారు.ఈ కార్యక్రమం ఐసిసి తెలుగు లిటరేచర్ క్లబ్, హెచ్ఆర్, అడ్మిన్ అండ్ కాన్సులర్ హెడ్ రాకేష్ వాఘ్ హృదయపూర్వక స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. ఖతర్లో తెలుగు సమాజం తమ సంస్కృతిని నిరంతరం సజీవంగా ఉంచడంలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఐసిసి జనరల్ సెక్రటరీ అబ్రహం కె జోసెఫ్ తన అధ్యక్ష ప్రసంగంలో వివిధ వర్గాలు ఐక్యతను పెంపొందించడంలో భాష ప్రముఖమైన పాత్ర వహిస్తుందని నొక్కి చెప్పారు. ప్రపంచ స్థాయి కవులు, తత్వవేత్తలు, కళాకారులను తయారుచేసే తెలుగు వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే వారి రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.ఐసిసి అనుబంధ విభాగాధిపతి రవీంద్ర ప్రసాద్, ఐసిసి అంతర్గత కార్యకలాపాల విభాగాధిపతి వెంకప్ప భాగవతుల ప్రత్యేక అభినందన ప్రసంగాలు చేశారు. సాహిత్యంలో మాట్లాడే మాండలికాన్ని ఉపయోగించడం కోసం ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ తెలుగు రచయిత, సామాజిక సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవం శాశ్వత వారసత్వాన్ని, తెలుగు సాహిత్య సాంస్కృతిక సంపదను ప్రవాసులలోని పిల్లలు, యువతకు అందించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించిన సౌమ్య, శిరీష, హారిక, నాగలక్ష్మి గార్లకు ఐ సి సి నాలుగు తెలుగు సంస్థల తరపున అభినందనలు తెలియజేశారు.(చదవండి: వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ)

షార్జా, సౌదీలో వైఎస్సార్కు ఘన నివాళి
సింహాద్రిపురం/కడప కార్పొరేషన్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఏఈలోని షార్జాలో మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రసన్న సోమిరెడ్డి, కోటేశ్వరరెడ్డి నేతృత్వంలో తెలుగు ప్రజలు మంగళవారం వైఎస్సార్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.అనంతరం వైఎస్సార్ అభిమాని జిలాన్ బాషా మాట్లాడుతూ వైఎస్సార్ (YSR) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఆయన చూపిన దారి ఎప్పటికీ తమకు ప్రేరణ అని పేర్కొన్నారు. అనంతరం అభిమానులు వైఎస్సార్ స్మృతులను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు శ్రీనివాస్ చౌదరి, అక్రమ్ బాషా, బ్రహ్మానంద రెడ్డి, నాగ ప్రతాప్ రెడ్డి, కర్ణ, పవన్, గంగిరెడ్డి, క్రాంతికుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివలింగా రెడ్డి, హనుమంత్ రెడ్డి, తాజుద్దీన్, సత్య, అంజాద్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో...డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్ధంతిని సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించారు. జుబైల్ ప్రాంతంలో అనుయాకినో కంపెనీ క్యాంపులో కడప పట్టణానికి చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనుయాకినో కంపెనీలో పని చేసే సుమారు 50 మంది కార్మికులకు అన్నదానం చేశారు.చదవండి: విదేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళులు ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు తాజుద్దీన్, అబ్రార్, ఖ్వాజా, బాషా, సలాం బాషా, మతివ్, అఫ్జల్, ఆతిఫ్, ముహమ్మద్, జాఫర్, ఫర్ ఖాన్, ఫైరోజ్, అసిమ్, ఫైసల్ తదితరులతో పాటు కిషోర్, సంతోష్, శ్రీను పాల్గొన్నారు.
క్రైమ్

ప్రియుడు అనిల్తో కలిసి భర్త చెవులు కోసిన భార్య
మహబూబాబాద్ రూరల్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ఓ భార్య యత్నించగా.. తీవ్ర గాయా లతో భర్త తప్పించుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మేడ ప్రసాద్కు జిల్లాలోని కొత్తగూడ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన రష్మితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడు పుట్టినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగారం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మద్దెల అనిల్తో రషి్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో భర్త ప్రసాద్ను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ప్రియుడు అనిల్ను రష్మి ఫోన్ చేసి పిలిపించింది.నిద్రిస్తున్న ప్రసాద్ను రషి్మ వెనుక నుంచి అదిమిపట్టుకోగా అనిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపేందుకు ప్రయతి్నంచాడు. తప్పించుకునే ప్రయత్నంలో ప్రసాద్కు ఎడమ చెవి, ఎడమ చేయి, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు, తండ్రి పాపయ్య అక్కడికి చేరుకుని అనిల్ను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనిల్, రష్మిని అదుపులోకి తీసుకుని మహబూబాబాద్ రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రసాద్ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

హీరోయిన్లా ఉన్నావంటూ..
శివాజీనగర: బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు తరచూ జరుగుతున్నాయి. కాలేజీ విద్యార్థినిని ఆటో డ్రైవర్ వేధించిన ఘటన వెలుగుచూసింది. 8న పుట్టేనహళ్లి ఠాణాలో యువతి (19) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్ హనుమంతప్ప తళవార్పై కేసు నమోదు చేశారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేందుకు విద్యారి్థని ర్యాపిడో ద్వారా ఆటోని బుక్ చేసింది. సాయంత్రం 5.15 గంటల సమయంలో ఆమెను ఇంటివద్ద డ్రాప్ చేసిన డ్రైవర్, నీవు సినిమా హీరోయిన్లా ఉన్నావు, బ్యాగ్ను ఇంటివరకు మోసుకురావాలా అని వ్యాఖ్యలు చేశాడు. ఆమెకు దగ్గరగా వెళ్లి నీకు జ్వరం ఉందా అని ఆమె చెంపను తాకాడు. యువతి అడ్డుచెబుతున్నా అసభ్యంగా ప్రవర్తించసాగాడు, ఆమె భయంతో ఆటో డ్రైవర్ను నెట్టివేసి ఇంటిలోకి పరుగులు తీసింది. ఆటోడ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

‘అయ్యో పాపం.. ప్రాణం పోగొట్టుకునేందుకేనా 600కిలోమీటర్లు ప్రయాణించింది’
జైపూర్: ప్రియుడిని పెళ్లికి ఒప్పించేందుకు 600 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ మహిళ… చివరికి శవమై కనిపించింది. ఈ విషాద కథపై నెటిజన్లు ‘అయ్యో పాపం..ప్రేమ కోసం అంత దూరం ప్రయాణించి చివరికి ప్రాణం పోగొట్టుకుందా?’ అంటూ నిట్టూరుస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం..రాజస్థాన్లోని ఝుంఝునుకు చెందిన ముఖేష్ కుమారి అంగన్వాడీ సూపర్వైజర్గా విధులు నిర్వహించేది. పదేళ్ల క్రితం తన భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమారి ఆమె భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్లో అదే రాష్ట్రంలోని బర్మార్లో టీచర్గా విధులు నిర్వహించే మనారామ్తో మెటాలో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో చాటింగ్, వాట్సాప్లో వీడియో కాలింగ్లతో ఏడాదిపాటు మునిగిపోయారు. చివరికి ఆ ప్రేమను పెళ్లిగా మారుద్దామని అనుకున్నారు.ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పించేందుకు ఝుంఝును నుంచి 600కిలోమీటర్ల దూరంలో ఉన్న మనారామ్ను కలిసేందుకు కుమారి కారులో బయలుదేరింది. మనారామ్ ఇంటికి చేరుకుని, అతని కుటుంబ సభ్యులకు వారి సంబంధం గురించి వివరించింది. దీంతో కుమారిపై మనారామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సమస్యను పరిష్కరించమని కోరుతూ స్థానిక పోలీసుల సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత సాయంత్ర రోజు అలా మాట్లాడుకుందాం పదా అంటూ కుమారిని బయటకు తీసుకుకెళ్లాడు మనారామ్. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. మనరామ్ ఓ రాడ్డుతో కుమారి తలపై మోదీ ప్రాణాలు తీశాడు. ఆనవాళ్లన్నీ ధ్వంసం చేశాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కుమారిని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ప్రమాదం జరిగిందని నమ్మేలా కారును సైడ్ కాలువలోకి పోనిచ్చాడు. ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు(ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తెలిపాడు). మరుసటి రోజు ఉదయం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తన తరుఫు లాయర్ను పురమాయించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తొలుత బాధితురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు భావించారు.అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కుమారి ప్రాణం తీసింది మనారామ్ అని నిర్ధారించుకున్నారు. కుమారి హత్య జరిగే సమయంలో నిందితుడు మనరామ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటం అనుమానం పోలీసులకు అతనిపై అనుమానం మొదలైంది. ఆ అనుమానంతో మనారామ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం భయట పడింది. కుమారిని హత్య చేసింది మనారామ్నేనని తేల్చారు. కుమారి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.

పట్టపగలు వివాహిత దారుణ హత్య
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్లో ఆదివారం పూసల రమాదేవి(35) దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన రమాదేవిని .. పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ సుమారు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకన్నారు. వీరికి ఒక కుమారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9), జ్యోత్స్న ఉన్నారు. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్ ఇంటికి చేరుకుంది. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కత్తితో రమాదేవిపై కృపాకర్ దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య అనంతరం కృపాకర్, అతడి తల్లిదండ్రులు పరారయ్యారు. అయితే, తల్లిదండ్రులు మంథని పోలీసుస్టేషన్లో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కృపాకర్ కోసం ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణామని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై వివరించారు. పంచాయితీయే ప్రాణం తీసిందా? ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్న రమాదేవి ఆదివారం అత్తగారింటికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. సెంటినరికాలనీకి చెందిన ఒకమతపెద్ద ద్వారా కృపాకర్ రాయబరం చేయడంతో రమాదేవిని అక్కడకు వచి్చందని, మతపెద్ద సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. ఆ తర్వాత రమాదేవి వకీల్పల్లి ప్లాట్స్కాలనీకి చేరుగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈక్రమంలోన అత్తగారింటి ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడిపోయిందని స్థానికులు కంటతడి పెట్టారు. క్షణికావేశంలో భార్యను చంపండంతో ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కుటుంబ కలహాలు పచ్చనికాపురంలో చిచ్చుపెట్టడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు.
వీడియోలు


సీఎం సార్.. ఇదిగో ప్రూఫ్ జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు


లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు


గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను దున్నేసిన రైతు


పులివెందుల మెడికల్ కాలేజీ డ్రోన్ విజువల్స్


పాక్ మొసలి కన్నీరు.. చుక్కలు చూపించిన భారత్!


బిగ్ బాస్ కి వెళ్లే ముందు నాతో ఒక్కటే చెప్పాడు


Eluru: కొబ్బరి నీళ్లు తెమ్మని చెప్పి రెండు కిలోల బంగారంతో పరార్


కొల్లు రవీంద్ర బండారం మొత్తం బయటపెట్టిన పేర్ని నాని..


బిగ్ డీల్..! భారత్ అమెరికా వాణిజ్య చర్చలు..


పాడేరు మెడికల్ సీట్లు చంద్రబాబు తీసుకొచ్చారా.. ? పెద్ద అబద్ధం: అప్పలరాజు