హిడ్మా.. ఎన్కౌంటర్కు ముందు ఏం జరిగింది?
సాక్షి, అమరావతి: ఆపరేషన్ కగార్ కారణంగా ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా మృతి చెందారు. దీంతో, మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే, తాజాగా హిడ్మా.. ఓ జర్నలిస్టుకు రాసిన లేఖ తాజాగా బయటకు వచ్చింది. అందులో కీలక విషయాలను వెల్లడించారు.మావోయిస్టు కీలక నేత హిడ్మా.. గత కొన్ని రోజులుగా లొంగిపోయే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్లో ఉన్న ఒక జర్నలిస్ట్కు హిడ్మా లేఖ రాశారు. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్కు రావాలని నవంబర్ 10న జర్నలిస్ట్కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉంది.. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం.. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం.. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది’ అని లేఖలో రాసుకొచ్చాడు.ఇదిలా ఉండగా, హిడ్మా లేఖపై తాజాగా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా స్పందిస్తూ.. హిడ్మా లేఖ రాసిన విషయం మాకు తెలియదు. హిడ్మా ఎన్కౌంటర్లోనే చనిపోయాడు. అతడిని పట్టుకుని చంపామనేది అసత్యం. లొంగిపోయేందుకు వచ్చిన ఎవరినీ ఎన్కౌంటర్ చేయలేదు. ఎన్కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చు. మావోయిస్టులు లొంగిపోవాలి’ అని సూచించారు.
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టు.. సిద్దమవుతున్న స్పెషల్ పిచ్
గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్ తమ ప్రయోగాలకు ఫుల్స్టాప్ పెట్టింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో చావు దెబ్బ తినడంతో గౌహతి టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్ను తయారు చేయాలని క్యూరేటర్ను టీమ్ మేనెజ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కోల్కతాలో ఉపయోగించిన నల్ల మట్టి పిచ్లా కాకుండా.. రెడ్ సాయిల్ పిచ్లపై పేస్తో పాటు బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాక్లపై క్రాక్స్ కూడా ఎక్కువగా రావు. అంతేకాకుండా ఆట ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కూడా పిచ్ అనుకూలించే అవకాశముంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం, బీసీసీఐ ప్రధాన క్యూరేటర్ ఆశిష్ భౌమిక్ ఇప్పటికే పిచ్ను తాయారు చేయడం మొదలు పెట్టినట్లు సమాచారం."గౌహతిలోని పిచ్ ఎర్ర మట్టితో తయారు అవుతోంది. సాధారణంగా ఈ ట్రాక్పై స్పీడ్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా హోం సీజన్ ప్రారంభానికి ముందే తమ డిమాండ్లు స్పష్టంగా చెప్పింది. ఒకవేళ పిచ్లో టర్న్ ఉంటే వేగంతో ఎక్కువగా బౌన్స్ కూడా ఉంటుంది. ఎక్కువ అస్థిరమైన బౌన్స్ లేకుండా ఉండేలా క్యూరేటర్లు ప్రయత్నిస్తున్నారు" అని బీసీసీఐ అధికారి ఒకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో పేర్కొన్నారు. కాగా తొలి టెస్టు జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్పై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పై ఇరు జట్లు బ్యాటర్లు తేలిపోయారు. టెస్టు మొత్తంలో ఒక్క జట్టు కూడా 200 పరుగుల స్కోర్ దాటలేకపోయింది. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈడెన్ పిచ్ క్యూరేటర్కు సపోర్ట్గా నిలిచాడు. ఆ పిచ్ పూర్తిగా తన అభ్యర్థన మేరకే తయారు చేశారని గంభీర్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి పిచ్ కారణం కాదని, బ్యాటింగ్ వైఫల్యమేనని గౌతీ పేర్కొన్నాడు.
పసిడి హడల్.. వెండి తారుమారు!
దేశంలో బంగారం ధరలు మళ్లీ హడలెత్తించాయి. వెండి ధరలు తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) భారీగా పెరిగాయి. అలాగే వెండి ధరలు కూడా అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా: మల్లోజుల
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఇప్పటికే పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో తాజాగా మల్లోజుల వేణుగోపాల్ స్పందిస్తూ మావోయిస్టులు ఆయుధాలు వీడాలని వీడియో సందేశం పంపిచారు. ఈ సందర్బంగా మల్లోజుల.. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోతున్నారు. ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయి. దేశంలో పరిస్థితులు మారాయి.. మనం కూడా మారాలి. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నాను. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తను ఫోన్ చేయాలన్నారు. ఈ సందర్భంగా తన ఫోన్ 88560 38533 ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ కగార్’తో కకావికలమైన మావోయిస్టు పార్టీకి చివరి ఆశ కూడా ఆవిరైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు ఉద్యమం వెన్నెముక విరిగిపోయింది. పార్టీని దశాబ్దాలపాటు నడిపిన గణపతి పక్కకు తప్పుకోవడం.. అనంతరం ఉద్యమాన్ని దూకుడుగా నడిపించిన పార్టీ ప్రధాన కార్యదర్శి, సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఇక మిగిలిన ఒకే ఒక ఆశా కిరణం హిడ్మానే. నంబాల కేశవరావు అనంతరం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినా, పార్టీని దూకుడుగా నడిపించే క్రియాశీల బాధ్యత హిడ్మాకే అప్పగించారు. మిలటరీ ఆపరేషన్స్లో దిట్ట కావడంతోపాటు గిరిజనుడైన అతనికి దండకారణ్యంపై పూర్తి పట్టుంది. స్థానిక గిరిజనుల్లో విశేష ఆదరణ ఉంది.బతికుంటే తదుపరి సుప్రీం కమాండరే.. ఆపరేషన్ కగార్తో తుడిచి పెట్టుకుపోతున్న మావోయిస్టు పార్టీ హిడ్మాపైనే భవిష్యత్ ఆశలు పెట్టుకుంది. ఛత్తీస్గఢ్తోపాటు ఒడిశా, మహారాష్ట్రల్లోని గిరిజన ప్రాంతాలు ఆయనకు కొట్టినపిండి. మిలటరీ ఆపరేషన్స్ నిర్వహణపై నిర్ణయం, వ్యూహం, కార్యాచరణ అంతా హిడ్మానే చూసుకుంటారని చెబుతున్నారు. అంటే పార్టీ తర్వాత సుప్రీం కమాండర్ హిడ్మానేనని మావోయిస్టు పార్టీ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. మావోయిస్టు పార్టీకి గణపతి, నంబాల కేశవరావు, దేవ్ జీ వరుసగా ముగ్గురు తెలుగు వారు ప్రధాన కార్యదర్శులు అయ్యారు. తర్వాత హిడ్మా పార్టీ సుప్రీం కమాండర్ అయ్యుంటే.. తొలిసారి తెలుగేతర మావోయిస్టు, అందులోనూ గిరిజనుడు మొదటిసారి పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యేవాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ ఇక పూర్తిగా కొడిగట్టడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.
H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరు
‘పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి’: శ్రీధర వెంబు
శబరిమలలో తెలుగు స్వాములకు ఘోర అవమానం!
ఆధార్ కార్డుల్లో కొత్త మార్పులు..!!
ఆల్టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు! కెప్టెన్ ఎవరంటే..
మావోయిస్టుల ఎన్కౌంటర్.. హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
నాకు లవ్స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం: నాగచైతన్య
భారత్పై దాడికి జైష్ కుట్ర.. నిధుల సేకరణకు పిలుపు
ఎస్బీఐ కొత్త ప్రతిపాదన.. ఇలా చేయొచ్చు!
భారత్తో వన్డేలో శతక్కొట్టిన ఓపెనర్లు.. సౌతాఫ్రికా భారీ స్కోరు
తగ్గిన ధరలు: పసిడి ఊరట.. వెండి పతనం
సజ్జనార్ సార్కు నా రిక్వెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మడి రవి నాన్న
ఉదయం 5 గంటలకు ఈమెయిల్..
ఇమ్మడి రవి అరెస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఐ-బొమ్మ నుంచి మరో మెసేజ్!
దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు
రూ.750 కోట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్.. ఎక్కడంటే..
లాభాలతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా
వారణాసి టైటిల్.. రాజమౌళికి బిగ్ షాక్!
రాజకీయాలతో పాటు కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకున్న లాలూ కుమార్తె రోహిణి
'దమ్ము ఉంటే పట్టుకోండి' అన్నాడు.. పైరసీపై చిరంజీవి వ్యాఖ్యలు
అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని ప్రభుత్వాలు అంటుంటే.. ఏంటో అనుకున్నా!!
టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్కు మళ్లీ పిలుపు
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. కార్యజయం
ఈ రాశి వారికి ఉద్యోగయోగం.. ధనప్రాప్తి.. యత్నకార్యసిద్ధి
శుబ్మన్ గిల్ స్థానంలో ఊహించని ఆటగాడు!
లోపల తీవ్రంగా చర్చించుకుంటున్నారు!
ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన రైళ్లన్నీ ఫుల్!
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి పిలుపు.. ధన, వస్తులాభాలు
ఐబొమ్మ ఇమ్మడి రవికి మరో బిగ్ షాక్!
గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరు
‘పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి’: శ్రీధర వెంబు
శబరిమలలో తెలుగు స్వాములకు ఘోర అవమానం!
ఆధార్ కార్డుల్లో కొత్త మార్పులు..!!
ఆల్టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు! కెప్టెన్ ఎవరంటే..
మావోయిస్టుల ఎన్కౌంటర్.. హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
నాకు లవ్స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం: నాగచైతన్య
భారత్పై దాడికి జైష్ కుట్ర.. నిధుల సేకరణకు పిలుపు
ఎస్బీఐ కొత్త ప్రతిపాదన.. ఇలా చేయొచ్చు!
భారత్తో వన్డేలో శతక్కొట్టిన ఓపెనర్లు.. సౌతాఫ్రికా భారీ స్కోరు
తగ్గిన ధరలు: పసిడి ఊరట.. వెండి పతనం
సజ్జనార్ సార్కు నా రిక్వెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మడి రవి నాన్న
ఉదయం 5 గంటలకు ఈమెయిల్..
ఇమ్మడి రవి అరెస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఐ-బొమ్మ నుంచి మరో మెసేజ్!
దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు
రూ.750 కోట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్.. ఎక్కడంటే..
లాభాలతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా
వారణాసి టైటిల్.. రాజమౌళికి బిగ్ షాక్!
రాజకీయాలతో పాటు కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకున్న లాలూ కుమార్తె రోహిణి
'దమ్ము ఉంటే పట్టుకోండి' అన్నాడు.. పైరసీపై చిరంజీవి వ్యాఖ్యలు
అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని ప్రభుత్వాలు అంటుంటే.. ఏంటో అనుకున్నా!!
టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్కు మళ్లీ పిలుపు
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. కార్యజయం
ఈ రాశి వారికి ఉద్యోగయోగం.. ధనప్రాప్తి.. యత్నకార్యసిద్ధి
శుబ్మన్ గిల్ స్థానంలో ఊహించని ఆటగాడు!
లోపల తీవ్రంగా చర్చించుకుంటున్నారు!
ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన రైళ్లన్నీ ఫుల్!
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి పిలుపు.. ధన, వస్తులాభాలు
ఐబొమ్మ ఇమ్మడి రవికి మరో బిగ్ షాక్!
గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
ఫొటోలు
ముత్యపు పందిరి వాహనంపై అమ్మవారు
‘కిల్లర్’ మూవీ ఈవెంట్ లో మెరిసిన జ్యోతి రాయ్ (ఫోటోలు)
పుట్టపర్తి : కనుల పండువగా సత్యసాయి జయంతి వేడుకలు (ఫోటోలు)
జ్యోతి రాయ్ ‘కిల్లర్’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
కర్నూలు : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు... కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం (ఫొటోలు)
‘ప్రేమంటే’ సినిమా ప్రీ రిలీజ్.. ముఖ్య అతిథిగా నాగచైతన్య (ఫొటోలు)
ఆది-నిక్కీ.. క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్ (ఫొటోలు)
కెన్యాలోనే అనసూయ ఫ్యామిలీ.. మరిన్ని జ్ఞాపకాలు (ఫొటోలు)
'వారణాసి' బ్యూటీ ప్రియాంక చోప్రా గోవా ట్రిప్ (ఫొటోలు)
సినిమా
హిట్ మూవీ దర్శకుడితో సాయిపల్లవి మరోసారి?
ఇండస్ట్రీలో ఏ సినిమాలోనైనా సాయిపల్లవి హీరోయిన్గా చేస్తే ఆ సినిమా గ్యారెంటీ హిట్టే అన్నంతగా టాక్ ఉంది. తమిళంలో ఈమె నటించిన 'అమరన్' గతేడాది రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యేకించి సాయిపల్లవి నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈమె.. ప్రస్తుతం హిందీలో తీస్తున్న 'రామాయణ' అనే భారీ పాన్ ఇండియా మూవీలో సీతగా చేస్తోంది. దీంతో ఇప్పటికైతే దక్షిణాదిలో కొత్తగా మూవీస్ ఏం చేయట్లేదు. కానీ త్వరలో తమిళంలో కమ్ బ్యాక్ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తుంది.(ఇదీ చదవండి: నయనతార బర్త్ డే.. గిఫ్ట్గా ఖరీదైన రోల్స్ రాయిస్)సాయిపల్లవి గతంలో ధనుష్కు జోడీగా 'మారి 2' అనే సినిమా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఇదే యావరేజ్ అనిపించింది. ఈ హీరో ప్రస్తుతం 'అమరన్' దర్శకుడు తీస్తున్న కొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో హీరోయిన్గా మీనాక్షిచౌదరి, పూజాహెగ్డే పేర్లు పరిశీలించారు. కానీ ఇప్పుడు ఫైనల్గా సాయిపల్లవి అని ఫిక్సయ్యారట. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయిప్రస్తుతం ధనుష్ 'పోర్ తొళిల్' సినిమా ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో పూర్తవుతుంది. ఇంతలో తర్వాత మూవీలో సాయిపల్లవి నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు.(ఇదీ చదవండి: రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్రైలర్ రిలీజ్)
నయనతార బర్త్ డే.. గిఫ్ట్గా ఖరీదైన రోల్స్ రాయిస్
40 ఏళ్లు దాటినా సరే హీరోయిన్ నయనతార.. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో చిరంజీవి 'మన శివశంకరవరప్రసాద్', బాలకృష్ణ కొత్త సినిమా, యష్ 'టాక్సిక్'తో పాటు తమిళ, మలయాళ చిత్రాలు చెరో రెండు ఉన్నాయి. అసలు విషయానికొస్తే ఈసారి నయన్ తన పుట్టినరోజుని సింపుల్గా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. భర్త విఘ్నేశ్ నుంచి గిఫ్ట్ మాత్రం చాలా ఖరీదైనది వచ్చింది.గతంలో పలు రిలేషన్షిప్స్లో ఉన్న నయన్.. తర్వాత కాలంలో తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ని ప్రేమించింది. 2022లో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఏడాది నుంచి ప్రతిసారి నయన్ పుట్టినరోజుకి విఘ్నేశ్ ఖరీదైన కార్లని బహుమతిగా ఇస్తూనే ఉన్నాడు.2023లో రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెజ్ మేబాచ్, 2024 అంటే గతేడాది రూ.5 కోట్లు విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 కారుని విఘ్నేశ్ బహుమతిగా నయనతారకు ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా రూ.10 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్ర్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఆ ఫొటోలని విఘ్నేశ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial)
పైరసీ చేసేవాళ్లను ఎన్కౌంటర్ చేయాలి: నిర్మాత సి.కళ్యాణ్
పైరసీ చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేశారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్కి సినీ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వందలాది మంది కష్టం సినిమా. అలాంటి కష్టాన్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా ఉన్న సమయంలో.. యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటైంది. పైరసీని అరికట్టడం సాధ్యమేనా? అని అప్పుడు చాలామంది అడిగారు. మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలన్న బాధ్యతతో దానిని ప్రారంభించాం. కొందరు రిటైర్ పోలీసు అధికారులు అందులో భాగమయ్యారు.పైరసీ అరికట్టేందుకు ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసి పైరసీ సెల్ ఎంతో కృషి చేసింది. ఇక్కడే కాదు విదేశీ సినిమాల విషయంలోనూ పైరసీని అరికట్టేందుకు ఈ విభాగం ఎంతో పని చేసింది. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ దేశాలకు చెందిన సినీ పెద్దలను పైరసీ సెల్ని అభినందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ‘ఐబొమ్మ’ వాళ్లను పట్టుకోవడంతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు డిపార్ట్మెంట్కి టాలీవుడ్ తరపున ధన్యవాదాలు. పైరసీ అరికట్టడంతో ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తాం’ అన్నారు. ఫిలిం చాంబర్ అధ్యక్షకులు భరత్ భూషన్ మాట్లాడుతూ.. ‘ఛాంబర్ కు సంబంధించిన వీడియో పైరసీ సెల్ కూడా పైరసీకి అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తుంది. పైరసీ చేస్తున్న వాళ్ళను అరెస్ట్ చేసిన తెలంగాణా ప్రభుత్వానికి , సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు’ అన్నారు.చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... " పోలీస్ వారిని, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాలను పైరసీలో చూస్తున్నారు అంటున్నారు. కానీ ఈ పరిస్థితి వల్ల మిగతా చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే సినిమా క్యూబ్, యుఎఫ్ఓ వెళుతున్న సంగతి అర్థమవుతుంది. వారి సర్వర్లు బలంగా ఉండేలా చూసుకోవాలి" అని అన్నారు.వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ... "సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. అది టెక్నాలజీ మారుతూ వచ్చిన ప్రతిసారి పైరసీ కూడా రూపం మార్చుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం చాలెంజ్గా తీసుకుని పైరసీ చేసేవారిని పట్టుకోవడం జరిగింది. అది సినీ పరిశ్రమకు వరం. టికెట్ ధరలు కూడా కుటుంబంతో సహా వచ్చి చూసే విధంగా టికెట్ ధరలు ఉండేలా చూడాలి. పైరసీని పూర్తిగా అరికడితేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు" అని అన్నారు.
వారణాసి టైటిల్.. రాజమౌళికి బిగ్ షాక్!
దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ రేంజ్లో ఈవెంట్ను నిర్వహించారు. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళిని మించినవారు ఎవరూ ఉండరు. అత్యంత భారీ బడ్జెట్తో తీయడమే కాదు.. ఆ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడంలో మన దర్శకధీరుడే దిట్ట అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమా చేస్తున్న ఆయన టైటిల్ రివీల్ కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేశారు.కానీ ఈ వేదికపై రాజమౌళి చేసిన కామెంట్స్తో చిక్కుల్లో పడ్డారు. తాను దేవుళ్లను నమ్మనంటూ ఆయన చేసిన కామెంట్స్ హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి. దీంతో రాజమౌళిపై సరూర్నగర్ పోలీస్స్టేషన్లో రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇక సంగతి అటుంచితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్పై మరో వివాదం నెలకొంది. వారణాసి అనే టైటిల్ పేరును రాజమౌళి గ్లింప్స్ రిలీజ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా మూవీ టైటిల్పైనే వివాదం మొదలైంది. ఇప్పటికే హనుమంతునిపై వ్యాఖ్యలతో గ్లోబ్ట్రాటర్ ఈవెంట్పై విమర్శలు వస్తుండగా.. ఇప్పుడు అది కాస్తా వారణాసి టైటిల్వైపు మళ్లింది. ఈ మూవీ టైటిల్ తాము ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నామంటూ రామ భక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్ ఫిర్యాదు చేసింది. ఫిల్మ్ ఛాంబర్లో తన కంప్లైంట్ను సమర్పించింది. ఒకవైపు తన కామెంట్స్తో వివాదం ఎదుర్కొంటున్న రాజమౌళికి టైటిల్ రూపంలో మరోసారి చిక్కుల్లోపడ్డారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
న్యూస్ పాడ్కాస్ట్
భద్రతాబలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మడివి హిడ్మా. ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోలు సైతం మృతి
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలోగా నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగ ఉండండి.
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
క్రీడలు
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టు.. సిద్దమవుతున్న స్పెషల్ పిచ్
గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్ తమ ప్రయోగాలకు ఫుల్స్టాప్ పెట్టింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో చావు దెబ్బ తినడంతో గౌహతి టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్ను తయారు చేయాలని క్యూరేటర్ను టీమ్ మేనెజ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కోల్కతాలో ఉపయోగించిన నల్ల మట్టి పిచ్లా కాకుండా.. రెడ్ సాయిల్ పిచ్లపై పేస్తో పాటు బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాక్లపై క్రాక్స్ కూడా ఎక్కువగా రావు. అంతేకాకుండా ఆట ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కూడా పిచ్ అనుకూలించే అవకాశముంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం, బీసీసీఐ ప్రధాన క్యూరేటర్ ఆశిష్ భౌమిక్ ఇప్పటికే పిచ్ను తాయారు చేయడం మొదలు పెట్టినట్లు సమాచారం."గౌహతిలోని పిచ్ ఎర్ర మట్టితో తయారు అవుతోంది. సాధారణంగా ఈ ట్రాక్పై స్పీడ్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా హోం సీజన్ ప్రారంభానికి ముందే తమ డిమాండ్లు స్పష్టంగా చెప్పింది. ఒకవేళ పిచ్లో టర్న్ ఉంటే వేగంతో ఎక్కువగా బౌన్స్ కూడా ఉంటుంది. ఎక్కువ అస్థిరమైన బౌన్స్ లేకుండా ఉండేలా క్యూరేటర్లు ప్రయత్నిస్తున్నారు" అని బీసీసీఐ అధికారి ఒకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో పేర్కొన్నారు. కాగా తొలి టెస్టు జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్పై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పై ఇరు జట్లు బ్యాటర్లు తేలిపోయారు. టెస్టు మొత్తంలో ఒక్క జట్టు కూడా 200 పరుగుల స్కోర్ దాటలేకపోయింది. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈడెన్ పిచ్ క్యూరేటర్కు సపోర్ట్గా నిలిచాడు. ఆ పిచ్ పూర్తిగా తన అభ్యర్థన మేరకే తయారు చేశారని గంభీర్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి పిచ్ కారణం కాదని, బ్యాటింగ్ వైఫల్యమేనని గౌతీ పేర్కొన్నాడు.
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
సుదీర్ఘ కెరీర్లో బంగ్లాదేశ్ క్రికెట్కు మూలస్థంభంలా నిలిచిన ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఢాకా వేదికగా బుధవారం ఐర్లాండ్ (BAN vs IRE Test)తో మొదలైన టెస్టు మ్యాచ్ అతడి కెరీర్లో 100వది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ గుర్తింపు పొందాడు.కాగా 18 ఏళ్ల 17 రోజుల వయసులో మొదటి టెస్టు ఆడిన ముష్ఫికర్ రహీమ్.. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం (Lord's Stadium)లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. తర్వాతి రోజుల్లో బంగ్లా తరఫున అత్యంత కీలక ఆటగాడిగా అతడు ఎదిగాడు. మిడిలార్డర్ బ్యాటర్గాటెస్టుల్లో పెద్ద స్థాయికి చేరలేకపోయిన తన టీమ్ వరుస పరాజయాల్లో భాగమైన రహీమ్...జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ ఖాన్ తర్వాతవికెట్ కీపర్గా జట్టులోకి వచ్చినా... క్రమేణా తన బ్యాటింగ్కు మెరుగులు దిద్దుకొని కీపింగ్ వదిలేసి రెగ్యులర్ మిడిలార్డర్ బ్యాటర్గా ముష్ఫికర్ రహీమ్ సత్తా చాటాడు. సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ ఖాన్ తర్వాత టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న (20 ఏళ్ల 5 నెలల 25 రోజులు) ఆటగాడిగా అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడం విశేషం. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తరఫున 99 టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ 38.02 సగటుతో 6351 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్కు 34 టెస్టుల్లో కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించిన అతడు ...55 టెస్టుల్లో వికెట్ కీపర్గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ఐర్లాండ్రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు ఐర్లాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సెల్హైట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్.. ఐరిష్ జట్టును ఇన్నింగ్స్ మీద 47 పరుగుల తేడాతో ఓడించింది.ఇక బంగ్లా- ఐర్లాండ్ మధ్య బుధవారం ఢాకా వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామ సమయానికి బంగ్లాదేశ్ 31 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.ఓపెనర్లలో మహ్ముదుల్ హసన్ జాయ్ 34, షాద్మాన్ ఇస్లాం 35 పరుగులు చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో (8) విఫలమయ్యాడు.వన్డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్ (17*)కు తోడుగా ముష్ఫికర్ రహీమ్ (3*) క్రీజులో ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ ఆండీ మెక్బ్రిన్ మూడు వికెట్లు కూల్చాడు. చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు!
IPL 2026: ‘అతడొక డమ్మీ కెప్టెన్.. చేసేదంతా వేరొకరు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్ సందడి మొదలైపోయింది. ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు రిటెన్షన్, రిలీజ్ జాబితాలు విడుదల చేసి వేలానికి సిద్ధమైపోయాయి. అబుదాబి వేదికగా డిసెంబరు 16న జరుగనున్న వేలం పాటలో పాల్గొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎనిమిది జట్లు తమ కెప్టెన్లను ఖరారు చేశాయి. ఇందులో ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)నే తమ సారథిగా కొనసాగిస్తానని చెప్పడం విశేషం. రవీంద్ర జడేజాను ఇచ్చేసి.. రాజస్తాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్ (Sanju Samson)కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే, యాజమాన్యం మాత్రం రుతు వైపే మొగ్గుచూపింది.ఇప్పుడే జట్టులో చేరిన సంజూ శాంసన్ను ప్రస్తుతానికి వైస్ కెప్టెన్గా నియమించాలని సీఎస్కే మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడొక డమ్మీ కెప్టెన్.. రుతురాజ్ గైక్వాడ్ కేవలం పేపర్ మీద మాత్రమే సారథిగా కనిపిస్తాడని.. అతడొక డమ్మీ కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనినే మైదానం లోపల, వెలుపల నిజమైన సారథిగా వ్యవహరిస్తాడని కైఫ్ పేర్కొన్నాడు.‘‘ధోని బ్యాటింగ్ చేయడానికి తుదిజట్టులోకి రాడు. 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడానికి.. 20 ఓవర్ల పాటు కెప్టెన్సీ చేయడానికి మాత్రమే జట్టులో ఉంటాడు. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడాలో మైదానంలోనే మార్గదర్శనం చేస్తాడు.అంతా ధోని కనుసన్నల్లోనేగైక్వాడ్ను గైడ్ చేయడానికే ధోని మైదానంలో ఉంటాడు. మెంటార్గా, కెప్టెన్గా మాత్రమే ధోని మైదానంలో దిగుతాడు. పేపర్ మీద మాత్రం గైక్వాడ్ పేరు కెప్టెన్గా ఉంటుంది. అయితే, మైదానంలో, మైదానం వెలుపల అంతా ధోని కనుసన్నల్లోనే నడుస్తుంది.కాబట్టి ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడని అనుకోవడం పొరపాటే. తనకు తానుగా ధోని ఈ నిర్ణయం తీసుకుంటే తప్ప.. అతడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశమే లేదు’’ అని కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ధోని వారసుడిగాకాగా చెన్నైని ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ధోని. అయితే, 2022లో తన వారసుడిగా రవీంద్ర జడేజాను ధోని ప్రకటించగా.. వరుస మ్యాచ్లలో ఓటమి నేపథ్యంలో జడ్డూ మధ్యలోనే వైదొలిగాడు. దీంతో మళ్లీ ధోనినే పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత 2024లో రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. కానీ 2025లో గాయం వల్ల రుతు కూడా మధ్యలోనే దూరం కాగా.. మళ్లీ ధోనినే సారథిగా వ్యవహరించాడు. చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు!
గంభీర్ ఆలోచించుకో.. మూడో స్థానానికి అతడు సరిపోడు: గంగూలీ
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు శనివారం(నవంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. తొలి టెస్టులో చేసిన తప్పిదాలను గౌహతిలో పునరావృతం చేయకూడదని భారత్ పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్మెంట్కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక సూచనలు చేశాడు. నంబర్ 3 స్ధానానికి వాషింగ్టన్ సుందర్ సరిపోడని, టాప్ 5లో కచ్చితంగా స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉండాలని దాదా అభిప్రాయపడ్డాడు. కాగా కోల్కతా టెస్టులో మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి 60 పరుగులు చేశాడు. వాస్తవానికి ఆ స్ధానం సాయి సుదర్శన్ది. ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన సుదర్శన్ స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో మాత్రం సత్తాచాటాడు.అయినప్పటికి సఫారీలతో తొలి టెస్టుకు సుదర్శన్ను టీమ్ మేనెజ్మెంట్ పక్కన పెట్టింది. దీంతో హెడ్ కోచ్ గంభీర్పై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తొలి టెస్టులో నలుగురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగింది."వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన క్రికెటర్. అతడికి మంచి ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్లో మూడో నంబర్ స్ధానానికి అతడు సరిపోడు. గతంలో చాలా మంది దిగ్గజాలు ఆ స్ధానంలో బ్యాటింగ్ చేశారు. దీర్ఘ కాల ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. టాప్-5లో కచ్చితంగా స్పెషలిస్టు బ్యాటర్లు ఉండాలి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ వంటి కఠిన పరిస్ధితుల్లో కూడా బ్యాటింగ్ చేస్తే సత్తా ఉన్న ఆటగాళ్లకి టాప్-5లో చోటు ఇవ్వాలి. గౌతమ్ గంభీర్ దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. తొలి టెస్టులో వాషి కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. పిచ్పై టర్న్ వున్నప్పటికి ప్రధాన స్పిన్నర్లు ముగ్గురు జట్టులో ఉంటే సరిపోతుంది" అని ఇండియా టూడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.చదవండి: 'ద్రవిడ్నే ట్రోల్ చేశారు.. ఇప్పుడు గంభీర్ ఒక లెక్కా'
బిజినెస్
3 నెలల్లో 10.39 లక్షల వాహనాలు సేల్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో ప్యాసింజర్, వాణిజ్య వాహన విక్రయాల పరంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య(సియామ్) తెలిపింది. ద్వి చక్రవాహన, త్రీ వీలర్స్ వాహన అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో ఉన్నట్లు పేర్కొంది.దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 10.39 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, అందులో వెస్ట్రన్ జోన్(మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, గోవాలతో పాటు కేంద్ర ప్రాంతాలు దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్)లో 3.44 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే క్యూ2లో మొత్తం 2.40 లక్షల యూనిట్లు వాణిజ్య వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో వెస్ట్రన్ జోన్లో అత్యధికంగా 92,000 యూనిట్లు సీవీల విక్రయాలు జరిగాయి. సియామ్ గణాంకాలు పరిశీలిస్తే... ఇదే ప్యాసింజర్ వాహన విభాగంలో రాష్ట్రాల పరంగా 1.31 లక్షల యూనిట్లతో మహారాష్ట్ర తొలిస్థానాన్ని దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ 1.00 లక్షలు, గుజరాత్ 87,901 యూనిట్లు తరువాత ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో కర్ణాటక 76,422 యూనిట్లు, కేరళ 69,609 యూనిట్లతో అయిదో స్థానంలో కొనసాగుతున్నాయి. వాణిజ్య వాహన విక్రయాల్లోనూ 37,091 యూనిట్లతో మహారాష్ట్ర హవా కొనసాగింది. గుజరాత్ 22,491 యూనిట్లు, ఉత్తరప్రదేశ్ 19,009 యూనిట్లు, తమిళనాడు 18,508 యూనిట్లు, మహారాష్ట్ర 16,743 యూనిట్లతో తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలోనే దేశవ్యాప్తంగా 55.62 లక్షల టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. ఇందులోనూ 19.33 లక్షల యూనిట్లతో వెస్ట్రన్ జోన్ ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్(6.92 లక్షలు) ప్రథమ స్థానం దక్కించుకుంది. మహారాష్ట్ర(6.29 లక్షలు), గుజరాత్(4.45 లక్షలు), తమిళనాడు(3.98 లక్షలు), రాజస్తాన్(3.60 లక్షలు) తరువాత స్థానాల్లో నిలిచాయి. దేశ వ్యాప్తంగా క్యూ2లో మొత్తం 2.29 లక్షల త్రి చక్రవాహనాలు అమ్ముడయ్యాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, కేరళ, ఏపీతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు పాండిచ్చేరి, లక్షదీ్వప్లో 77,00 యూనిట్లు విక్రయాలు జరిగాయి. రాష్ట్రాల వారీగా ఈ విభాగంలో 28,246 యూనిట్ల అమ్మకాలతో ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో ఉంది. తెలంగాణ (26,626 యూనిట్లు), గుజరాత్ (22,572 యూనిట్లు), మహారాష్ట్ర(21,100 యూనిట్లు), తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
జీడీపీ వృద్ధి 7.5 శాతాన్ని మించొచ్చు..
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో (జూలై–సెపె్టంబర్ త్రైమాసికం)7.5 శాతం మించి నమోదు కావొచ్చని ఎస్బీఐ పరిశోధన విభాగం అంచనా వేసింది. జీఎస్టీ రేట్ల తగ్గింపునకు తోడు, పండుగల సమయంలో విక్రయాలు బలంగా నమోదు కావడం మెరుగైన వృద్ధికి దారితీయొచ్చని పేర్కొంది. అలాగే, పెట్టుబడులు పుంజుకోవడం, గ్రామీణ వినియోగం కోలుకోవడాన్ని ప్రస్తావించింది.‘‘పండుగల నేపథ్యంలో అమ్మకాలకు సంబంధించి మంచి గణాంకాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలకు సంబంధించి వినియోగం, డిమాండ్ను సూచించే సంకేతాలు క్యూ1లో ఉన్న 70 శాతం నుంచి క్యూ2లో 83 శాతానికి పెరిగాయి. వీటి ఆధారంగా క్యూ2లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.5 శాతం లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చన్న అంచనాకు వచ్చాం’’అని ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం తన నివేదికలో పేర్కొంది.ఈ నెల చివర్లో క్యూ2 జీడీపీ గణాంకాలు విడుదల కానున్నాయి. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చన్నది ఆర్బీఐ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉండడం గమనార్హం. జోరుగా జీఎస్టీ వసూళ్లు.. నవంబర్ నెలకు జీడీపీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 6.8 శాతం అధికమని ఎస్బీఐ నివేదిక తెలిపింది. దిగుమతులపై ఐజీఎస్టీ, సెస్సు రూపంలో ఆదాయం రూ.51,000 కోట్లుగా ఉంటుందని.. దీంతో నవంబర్ నెలకు మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లను మించొచ్చని పేర్కొంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు గత నెలలో పండుగల విక్రయాలను గణనీయంగా పెంచడాన్ని గుర్తు చేసింది.క్రెడిట్ కార్డు, డెబిట్కార్డు వ్యయాలు సైతం దీన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. యుటిలిటీలు, సేవలపై 38 శాతం, సూపర్ మార్కెట్, గ్రోసరీ కొనుగోళ్లపై 17 శాతం, పర్యటనలపై 9 శాతం ఖర్చు చేసినట్టు తెలిపింది. పట్టణాల వారీగా క్రెడిట్ కార్డు వ్యయాలను పరిశీలించగా, డిమాండ్ అన్ని ప్రాంతాల్లోనూ అధికమైనట్టు పేర్కొంది. అన్ని పట్టణాల్లోనూ ఈ–కామర్స్ విక్రయాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ఇక్రా అంచనా 7 శాతం సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. సేవలు, వ్యవసాయ రంగంలో రెండో త్రైమాసికంలో కొంత జోరు తగ్గిందంటూ.. తయారీ, నిర్మాణ రంగం, సానుకూల బేస్ మద్దతుతో పారిశ్రామిక పనితీరు బలంగా ఉన్నట్టు తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరం క్యూ2లో జీడీపీ 5.6 శాతంగా ఉండడం గమనార్హం.క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2తో పోల్చి చూసినప్పుడు ప్రభుత్వ వ్యయాలు తక్కువగా ఉండడం జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపించొచ్చని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. అయినప్పటికీ పండుగల సీజన్లో అమ్మకాలు, జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ కారణంగా పెరిగిన అమ్మకాలు, టారిఫ్లు అమల్లోకి రావడానికి ముందుగా అమెరికాకు అధిక ఎగుమతులు జరగడం వృద్దికి మద్దతునివ్వొచ్చని చెప్పారు.
ఫిజిక్స్వాలా.. లిస్టింగ్ అదిరేలా!
ముంబై: ఎడ్టెక్ యూనికార్న్ ఫిజిక్స్వాలా కంపెనీ షేరు ఎక్స్చేంజీల్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఇష్యూ ధర(రూ.109)తో పోలిస్తే బీఎస్ఈలో 31.28% ప్రీమియంతో రూ.143 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 49% ఎగసి రూ.162 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 42% లాభంతో రూ.155 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 44,382.43 కోట్లుగా నమోదైంది.ఎమ్వీ ఫొటోవోల్టాయిక్.. ప్చ్సౌరశక్తి సంస్థ ఎమ్వీ ఫొటోవోల్టాయిక్ పవర్ షేరు ఇష్యూ ధర(రూ.217)తో పోలిస్తే ఎలాంటి లాభ, నష్టం లేకుండా ఫ్లాటుగా రూ.217 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.207 వద్ద కనిష్టాన్ని, రూ.228 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 1% స్వల్ప లాభంతో రూ.219 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.15,166 కోట్లుగా నమోదైంది
ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 278 పాయింట్లు కోల్పోయి 84,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 25,910 వద్ద నిలిచింది. దీంతో స్టాక్ సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లైంది. సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడవుతూ... ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 393 పాయింట్లు పతనమై 84,558 వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 25,876 వద్ద కనిష్టాలు తాకాయి.డిసెంబర్లో యూఎస్ ఫెడరల్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు రేకెత్తడంతో పాటు టెక్నాలజీ రంగంలో అధిక వాల్యుయేషన్ల ఆందోళలనతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియాలో జపాన్ 3.33%, కొరియా 3.43%, తైవాన్ 2.58%, హాంగ్కాంగ్ 2%, సింగపూర్, చైనా 1% క్షీణించాయి. యూరప్లో ఫ్రాన్స్ 1.7%, జర్మనీ 1.6%, బ్రిటన్ 1.3% నష్టపోయాయి.⇒ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్)లో తాజాగా పీఈ సంస్థ సయిఫ్ పార్ట్నర్స్ 1.86 శాతం వాటా విక్రయించింది. దీంతో పేటీఎమ్లో సయిఫ్ వాటా 15.33 శాతం నుంచి 13.47 శాతానికి తగ్గింది. షేరుకి రూ. 1,305 సగటు ధరలో రూ. 1,556 కోట్లకు అమ్మివేసింది. పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో 3% పతనమై రూ. 1,293 వద్ద ముగిసింది.
ఫ్యామిలీ
షేక్ హసీనా 'జమ్దానీ' చీరల వెనక ఇంత స్టోరీ ఉందా..!
బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపు అన్న అంశం చిలికి చిలికి గాలివానలా మారి..మాజీ ప్రధాని షేక్ హసినా ప్రభుత్వం కూలి, పదవిని కోల్పోవడం తోపాటు మరణశిక్ష పడేందుకు దారితీసింది. ఉక్కు మహిళగా కీర్తిగడించిన ఆమెను ఒక్కసారిగా నేరస్తురాలిలా నిలబెట్టి మరణశిక్ష విధించింది అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్. ఆ తీర్పుపై తనదైన శైలిలో షేక్ హసీనా స్పదించారు కూడా . దీన్ని ఆమె రాజకీయ ప్రేరేపిత తీర్పుగా అభివర్ణించారు కూడా. కాలం అనుకూలించకపోతే ఎంతటి శక్తిమంతమైన వాళ్లైనా నిర్వీర్యం అయిపోతారనేందుకు ఉదాహరణగా నిలిచిన షేక్ హాసినా దౌత్యపరమైన సంబంధాలను నెరిపేందుకు ఏం చేసేవారో తెలిస్తే విస్తుపోతారు. మరి ఆ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసినా..తన స్టైలిష్ లుక్తోనే ఆకట్టుకుంటారామె. ముఖ్యంగా ఆమె ధరించే జమ్దానీ చీరలు.. యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆ నేపథ్యంలోనే ఆమె ఈ చీరలను ధరించేవారా అని అంతా ఆశ్చర్యపోయేలా రాజకీయాలను ఫ్యాషన్ని మిళితం చేసిందామె. అంతేగాదు ఆమె కృషి ఫలితంగా చేతివృత్తుల వారికి ఉపాధి లభించడం తోపాటు పురాతన సాంస్కృతికి వారసత్వాన్ని పదిలపర్చుకునేలా.. ప్రపంచ దేశాలు దాని విశిష్టతను గుర్తించేందుకు దోహదపడింది.జమ్దానీ చీరలను బెంగాల్లో అత్యంత అద్భుతమైన వస్త్ర సంప్రదాయాలలో ఒకటిగాగా చెబుతుంటారు. చేతితోమాత్రమే నేసే గొప్ప కళాఖండంగా అలరారే ఈ చీరలు అంతర్జాతీయ దృష్టిని సైతం అమితంగా ఆకర్షించాయి. అందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణం. ఆమె చేసిన సాంస్కృతిక దౌత్య ప్రయత్నలేనని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. హసీనా మనం ధరించే దుస్తులే సంభాషిస్తాయి అని ప్రగాఢంగా విశ్వసించేవారామె. ఆ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సాంస్కృతిక కళా నైపుణ్యం, జాతీయ గర్వాన్ని ప్రతిబింబించేలా ఇలాంటి సాంప్రదాయ దుస్తులనే ఎంచుకునేవారామె. అంతర్జాతీయ వేదికపై జమ్దానీ మెరిసిన క్షణాలు..2014లో భారతదేశంలో సంబంధాలను బలోపేతం చేసే విషయమై ఈ చీరలోనే కనిపించారు. అంతేగాదు జూన్ 2014లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా హసీనాకు దక్షిణ భారత పట్టు చీరను బహూకరించగా, హసీనా జమ్దానీ చీరను బహూకరించింది.2015 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ను సందర్శించినప్పుడు హసీనా తెలుపు-బూడిద రంగుతో మిళితమైన జమ్దానీని ధరించింది. అజర్బైజాన్లో జరిగిన NAM సమ్మిట్లో హసీనా జమ్దానీ-ప్రేరేపిత బృందం బంగ్లాదేశ్ నేత సంప్రదాయాన్ని ప్రపంచ దౌత్య వేదికపై ఉంచింది.2021లో గ్లాస్గోలో జరిగిన COP26 వాతావరణ సదస్సులో నీలం బూడిదర రంగుతో కలగలసిన చీరలో మెరిసింది. అంతేగాదు అది నెట్టింట విపరీతంగా వైరల్ అయిన ఫోటోగా నిలిచింది.సెప్టెంబర్ 2022లో హసీనా నాలుగు రోజుల భారతదేశ పర్యటన ఒక శిఖరాగ్ర క్షణం అని చెప్పొచ్చు. ఆమె ఆ సమయంలో కూడా ఆ చీరలనే ఎంచుకోవడం అనేది వ్యాపార నాయకులల్లో చర్చనీయాంశంగా హైలెట్ అయ్యింది. G20 సమ్మిట్లో, హసీనా తిలక్ రంగు ధకై జమ్దానీని ధరించింది. ఇది భారతదేశంతో బంగ్లాదేశ్కి ఉన్న సంబంధాలను సూక్ష్మంగా నొక్కి చెబుతూనే ప్రపంచ వేదికపై ఈ కళను హైలైట్ చేసింది.న్యూ ఢిల్లీ, లండన్, బ్రస్సెల్స్, మ్యూనిచ్లోని నాయకులతో జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాలలో జమ్దానీ చీరలోనే కనిపించారు హసీనా. జమ్దానీ చరిత్రజమ్దానీ మూలాలు రెండు వేల సంవత్సరాల క్రితం పురాతన ఢాకా మగ్గాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ పేరు పర్షియన్ పదాలైన "జామ్" (పువ్వు) "డాని" (కుండీ) నుంచి వచ్చింది. చీరలలో ఉపయోగించే నేత నమూనాలు వాటి నుంచి తీసుకోవడంతోనే ఈ చీరకు ఆ పేరు వచ్చింది.జమ్దానిని ప్రత్యేకంగా నిలబెట్టేది శ్రమతో కూడిన "పారదర్శక నేత" సాంకేతికత. దీన్ని యాంత్రిక మద్దతు లేకుండా చేతితోనే తయారు చేస్తారు. అందువల్ల ఒక చీర తయారైందుకు నెలల తరబడి సమయం పడుతుంది. ఈ ప్రక్రియ చూసేందుకు తేలికగా కనిపించినా..చాలా క్లిష్టతరమైన చేతి పని. అయితే ఇదే జమ్దాని చీర పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విభిన్న వెర్షన్లు ఉన్నాయి. అయితే ప్రతి చీర వెనుక అపారమైన నైపుణ్యం, గంటల తరబడి శ్రమ తప్పక ఉంటుంది. అంతేగాదు ఇది ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన విలువైన చేసేత వస్త్రాల్లో ఒకటిగా పేరొందింది. అలాంటి చేనేత చీరను మాజీ ప్రధాని షేక్ హసీనా ధరించడంతో అంతర్జాతీయ ఆకర్షణ తోపాటు బంగ్లాదేశ్ స్వదేశీ నేత కార్మికులకు నేరుగా మద్దతు లభించినట్లయ్యింది కూడా. అలాగే ఈ చీరలకు భౌగోలిక(GI) గుర్తింపు సైతం లభించడం విశేషం. గతేడాది నిరసనల టైంలో కూడా..ఆగస్టు 2024లో, హసీనా రాజీనామా, బహిష్కరణకు దారితీసిన సందర్భంలో కూడా ఈ చీరలు వార్తల్లో హాట్టాపిక్గా మారాయి. ఎందుకంటే ఆ ఘటనలో సాముహిక నిరసనకారులు ఢాకాలోని ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించి ఆమె వార్డ్రోబ్లోని జమ్దానీ చీరలను ఎత్తకుపోవడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..)
కేన్సర్కు ఆహారం ఆన్సర్..!
ఇంగ్లిష్లోనూ తెలుగులోనూ కామన్గా ఓ సామెత ఉంది. అదే... ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్. అంటే చికిత్స కంటే నివారణ మేలు అని అర్థం. నిజమే... రోజూ ఆహారం తీసుకోక తప్పదు. అదే గనక ఆరోగ్యకరమైనది కావడంతోపాటు కేన్సర్ను నివారించేదైతే... అది కేవలం కేన్సర్నే కాదు... ఎంతో ఆత్మక్షోభనూ, మరెంతో వేదననూ నివారిస్తుంది. అంతేకాదు... భవిష్యత్తులో మందులకు పెట్టే బోలెడంత డబ్బునూ ఆదా చేస్తుంది. అన్నిటికంటే ముందుగా శారీరక బాధల నివారణతోపాటు మానసికమైన శాంతినీకాపాడుతుంది. అందుకే రోజూ ఎలాగూ తినే అవే ఆకుకూరలనూ, కాయగూరలనూ, పండ్లనూ మార్చి మార్చి తింటూ ఉంటే పై ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఏయే ఆహారపదార్థాలు ఏయే కేన్సర్లను నివారిస్తాయో, అలా నివారించడానికి వాటిల్లోని ఏ పోషకాలు తోడ్పడతాయో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. తద్వారా కేన్సర్ను నివారించుకుందాం...పండ్లు... ఆకుకూరలు... ఆహారపదార్థాలు... ఇలా మనం రోజూ తినే పదార్థాలతోనే కేన్సర్లను నివారించుకోవడం సాధ్యమనే అనడం కాకుండా వాటిల్లోని ఏయే పోషక విలువలు అలా జరిగిందేందుకు దోహదపడతాయో తెలుపుతున్నారు కేన్సర్పై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలూ, ఆహారనిపుణులు. పైగా ఏయే ఆహారపదార్థాల్లోని ఏ నిర్దిష్టమైన పోషకం కేన్సర్ను ఎలా నివారిస్తుందో తెలుసుకునేందుకు యూకేకు చెందిన ‘వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్’ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ అధ్యయనాల ద్వారా కేవలం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడం ద్వారానే చాలా సులువుగా కేన్సర్ను ఎలా నివారించగలమో తెలుసుకుందాం.పెదవులు, నోరు, ఫ్యారింగ్స్ కేన్సర్ నివారణకు... బాగా ముదురురంగులో ఉండే అన్ని రకాల పండ్లతోపాటు బాగా ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు పెదవులు, నోరు, ఫ్యారింగ్ కేన్సర్లను నివారిస్తాయి. అంతేకాదు... విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పండ్లు కూడా నోరు, ఫ్యారింగ్స్ కేన్సర్లను నివారిస్తాయి. ఉదాహరణకు విటమిన్–ఏ ఎక్కువగా ఉండే బొప్పాయి, క్యారట్, మామిడి వంటి తాజా పండ్లు నోరు, ఫ్యారింగ్స్, క్యాన్సర్లను నివారణకు తోడ్పడతాయి. టొమాటోలోని లైకోపిన్ కూడా ఈ తరహా క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుంది. అంతేకాదు... ఈ లైకోపిన్తో మరో ఉపయోగం కూడా ఉంది. ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలతోపాటు గుండెజబ్బులను నివారించే గుణం కూడా ఉంది.కంటి కేన్సర్ నివారణకు... ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్లతోపాటు గ్రీన్–టీ, బెర్రీ పండ్లు, పసుపు, విటమిన్–ఇ, విటమిన్–సి, విటమిన్–ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కంటి కేన్సర్లను సమర్థంగా నివారించవచ్చు. సెలీనియమ్, పీచుపదార్థాలు ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే బ్రెజిల్–నట్స్ కూడా కంటి క్యాన్సర్ నివారణకు తోడ్పతాయి.రొమ్ము కేన్సర్ నివారణకు... దానిమ్మ పండులోని ఎలాజిక్ యాసిడ్ అనే పోషకంలోని పాలీఫినాల్స్ రొమ్ముక్యాన్సర్ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే కెరొటినాయిడ్ అనే పోషకం ఎక్కువగా ఉండే పాలకూర, క్యారట్, బ్రాకలీలు కూడా రొమ్ముక్యాన్సర్ నివారణకు గణనీయంగా తోడ్పడతాయి. ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే గ్రీన్–టీ కూడా రొమ్ము క్యాన్సర్ నివారణకు చాలావరకు తోడ్పడుతుంది.గాల్బ్లాడర్ కేన్సర్ నివారణకు... ఊబకాయం / స్థూలకాయం రాకుండా ఆరోగ్యకరమైన పరిమితిలో బరువును నియంత్రించుకోవడమన్నది గాల్బ్లాడర్ క్యాన్సర్ నివారణకు బాగా తోడ్పడే అంశం. ఇలా బరువును నియంత్రించుకోవడం అన్నది కేవలం ఒక్క గాల్బ్లాడర్ కేన్సర్ నివారణకు మాత్రమే కాకుండా పెద్దపేగు, ప్రోస్టేట్, ఎండోమెట్రియమ్, మూత్రపిండాలు, రొమ్ము కేన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. ఇందుకోసం ఆరోగ్యకరంగా ఉండే కొవ్వులు తక్కువగా తీసుకుంటూ ఆకుకూరలు మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి.మూత్రాశయ (బ్లాడర్) కేన్సర్ల నివారణకు... క్రూసిఫెరస్ వెజిటబుల్స్ జాతిగా పేరుపడ్డ క్యాబేజీ, బ్రాకలీ వంటి ఆహారాలతో మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లోని యాండర్సన్ కేన్సర్ సెంటర్లో తేలిన అంశాలను బట్టి విటమిన్–ఇ లోని ఆల్ఫా టోకోఫెరాల్ అనే జీవరసాయనం బ్లాడర్ కేన్సర్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. పాలకూర, బాదాంలతోపాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్–ఇ మోతాదులు ఎక్కువ. ఇక మిరియాలలో ఉండే పోషకాలు కూడా బ్లాడర్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి. మూత్రపిండాల (కిడ్నీ) కేన్సర్ నివారణకు... నారింజ రంగులో ఉండే కూరగాయలు (ఉదాహరణ క్యారట్)తో పాటు టొమాటో, అల్లం, ఆప్రికాట్ వంటివి... మూత్రపిండాల (కిడ్నీ) క్యాన్సర్ నివారణకు బాగా తోడ్పడతాయి. కిడ్నీల ఇన్ఫ్లమేషన్ను బెర్రీ పండ్లు గణనీయంగా తగ్గిస్తాయి. ఫలితంగా కిడ్నీ జబ్బుల ముప్పు కూడా బాగా తగ్గిపోతుంది. ఇక పొట్టు తీయని ధాన్యాలు, నట్స్, బఠాణీ, చిక్కుళ్ల వంటి ఫైటేట్ అనే పోషకం ఉన్న ఆహారాలు మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) కేన్సర్ నివారణకు... ఆహారంలో విటమిన్–ఇ, విటమిన్–సి ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అని చర్య సర్విక్స్ క్యాన్సర్ నివారణకు బాగా ఉపకరిస్తుంది. ఉదాహరణకు క్యారట్, చిలగడదుంప, గుమ్మడి వంటి ఆహారాలతో దీన్ని చాలాబాగా నివారించవచ్చు. ఎలాజిక్ ఆసిడ్స్ అనేవి క్యాన్సర్ పెరుగుదలను అరికడతాయి. ఈ పోషకం స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, వాల్నట్, దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, కివీ పండ్లలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా (సర్విక్స్) కేన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. అయితే ఇక్కడ ఓ చిన్న జాగ్రత్త పాటించడం మేలు చేస్తుంది. అదేమిటంటే... చక్కెర మోతాదులు తక్కువగా ఉండే (లో–గ్లైసీమిక్) పండ్లైన దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లతో ఈ క్యాన్సర్ నివారణ మరింత తేలిక.తల, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్ల నివారణకు... పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ, తెల్లటి తొక్క కలిగి ఉండే పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారిస్తాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. అలాగే ఈ పండ్లలోనే మెరుపు కలిగి ఉండే (కొద్దిపాటి మెరుపుతో బ్రైట్గా ఉండే) తొక్కతో ఉండే పండ్లు ఈ హెడ్ అండ్ నెక్ కేన్సర్లను మరింత సమర్థంగా నివారిస్తాయి. ఉదాహరణకు... నారింజ, కివీ, జామ, పైనాపిల్ పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.బ్రెయిన్ కేన్సర్ కణుతుల నివారణకు... ఉల్లి, వెల్లుల్లి జాతికి చెందిన రెబ్బలలో మెదడు (బ్రెయిన్) కేన్సర్ను నివారించే గుణం ఎక్కువ. (అన్నట్టు వీటిలోని యాంటీ క్యాన్సర్ ΄ోషకాలు కేవలం బ్రెయిన్ కేన్సర్నే కాదు... ఇతరత్రా చాలా రకాల క్యాన్సర్ల నివారణకూ ఉపయోగపడతాయి). ఇక ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్నట్, లిన్సీడ్ ఆయిల్తో మెదడు కేన్సర్లు తేలిగ్గా, సమర్థంగా నివారితమవుతాయి. ఇవి కేన్సర్ నివారణతోపాటు వ్యక్తుల్లో వ్యాధి నివారణ వ్యవస్థను (ఇమ్యూనిటీని) పటిష్టం చేసేందుకూ ఉపయోడపడతాయి.ఒవేరియన్ కేన్సర్ నివారణకు... క్యారట్ల వంటి వాటితో పాటు పసుపురంగూ, నారింజరంగుల్లో ఉండే వెజిటబుల్స్తో (ఉదాహరణకు బెల్పెప్పర్ వంటివాటితో) ఒవేరియన్ క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. కెరటినాయిడ్స్ ఎక్కువగా ఉండే క్యారట్ వంటివి రోజూ అరకప్పు మోతాదులో రెండు సార్లు తీసుకోవడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చని అమెరికన్ కేన్సర్ సొసైటీ వంటి ప్రజోపయోగ, పరిశోధనల సంస్థల అధ్యయానాల్లో తేలింది.జీర్ణాశయ (స్టమక్) క్యాన్సర్ నివారణకు... జీర్ణాశయ (స్టమక్) కేన్సర్ నివారణకు కాప్సికమ్ (కూరగా వండటానికి ఉపయోగించే బెంగళూరు మిరప లేదా బెల్పెప్పర్)లో ఉండే ఫైటోకెమికల్స్ బాగా ఉపయోగపడతాయి. పరిమితంగా తీసుకునే మిరపకాయలు ’ మిర్చీ వంటి వాటితోపాటు మిరియాల పరిమిత వాడకం కూడా స్టమక్ క్యాన్సర్ను నివారిస్తాయి. ఆకుకూరలు, పొట్టుతో ఉండే ధాన్యాలు, తాజా పండ్లు అనేక కేన్సర్ల నివారణతో పాటు జీర్ణాశయ కేన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. జీర్ణాశయ క్యాన్సర్ నివారణకు ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించడమూ అవసరమే.కాలేయ కేన్సర్ నివారణకు... పాలీఫీనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ పండ్లు, విటమిన్–ఇ పుష్కలంగా ఉండే బెల్పెప్పర్, పాలకూర, బాదం వంటి ఆహార పదార్థాలు కాలేయ క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. ఇక నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె, కుసుమ నూనెలు కూడా కాలేయ కేన్సర్ నివారణకు దోహదపడతాయి. అయితే ఈ నూనెలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.ఎముక కేన్సర్ నివారణకు... యాంటీ ఆక్సిడెంట్స్ అనే పోషకాలు ఆక్సిడేషన్ ప్రక్రియతో వెలువడే విషయాలను (టాక్సిక్ మెటీరియల్స్ను) విరిచేస్తాయి. ఇలాంటి యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు... ఉదాహరణకు బెర్రీలు, చెర్రీలు, టొమాటో, బ్రాకలీ వంటివి ఎముక కేన్సర్ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ అనేక పోషకాలు పుష్కలంగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్లతోనూ ఎముక క్యాన్సర్లు బాగానే నివారితమవుతాయి. ఇక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, చేపలు, గుడ్లతోనూ ఎముక క్యాన్సర్ త్వరితంగా నివారితమవుతుంది.చివరగా... ఆహారం తీసుకోవడం అన్నది మన జీవక్రియల కోసం మనం రోజూ తప్పక చేసే పని అయినందున... ఆ ఆహారాన్నే తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్ల రూపంలో మరింత ఆరోగ్యకరంగా తీసుకోవడం వల్ల ఒకే సమయంలో రెండు సౌకర్యాలు సమకూరతాయి. అవి ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధకత మన సొంతం కావడంతో ఈ ఇమ్యూనిటీ కూడా క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందని గుర్తుంచుకోవాలి. ఇలా తీసుకున్న ఆహారం వల్ల ఒళ్లు పెరగకుండా తగినంత వ్యాయామమూ చేయడం వల్ల ఈ మార్గంలో క్యాన్సర్ నివారణ మరింత సమర్థంగా చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ రాజేష్ బొల్లం, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్నిర్వహణ యాసీన్
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయిన శబరిమల..! తొలిరోజే మెగా రికార్డు..
కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. మొన్న(ఆదివారం) సాయంత్రం నుంచే దర్శనాలు ప్రారంభం కావడంతో వేల సంఖ్యలో భక్తలు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. అయితే సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 41 రోజుల పాటు సాగే మండల పూజ కోసం..ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku)మండల పూజ) ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమై.. డిసెంబర్27న ముగియనుంది. ఆ నేపేథ్యంలోనే శబరిమల భక్తులతో కిటకిటలాడింది. తొలిరోజే భక్తజన సందోహం మెగా రికార్డు(1 లక్ష 25 వేలమందికి) రేంజ్లో అయ్యప్ప దర్శనానికి తరలివచ్చారు. అదీగాక ప్రస్తుతం 22 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం కోసం వర్చువల్గా బుక్ చేసుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ట్రావెన్కోర్ దేవస్థానం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది కూడా. కాగా, మండల సీజన్ కోసం ఆదివారం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోగా.. సోమవారం ఉదయం నుంచి నెయ్యాభిషేకాలు మొదలయ్యాయి. దీంతో.. ముర్ము ఇరుముడిలోని ముద్ర టెంకాయలోని నేతితో తొలుత అయ్యప్పకు అభిషేకం చేశారు. అలా.. మండల సీజన్లో తొలి నెయ్యాభిషేకం రాష్ట్రపతి ముర్ము చేయించినట్లయిందని టీడీబీ పేర్కొంది.(చదవండి: శబరిమలలో భారీ వర్షాలు..అయ్యప్ప భక్తులకు అలర్ట్!)
బీట్రూట్ మాస్క్తో మచ్చలేని అందం
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్, చర్మం ప్రకాశవంతంగా మారడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్లో ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్ చేసి, మృదువుగా, నిగారింపుగా ఉంచుతాయి. ఇంట్లోనే తక్కువ సమయంతో తయారు చేసుకునే బీట్రూట్ ఫేస్ మాస్క్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..బీట్రూట్ ముక్కలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. వడకట్టి తీసిన రసంలో రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, టీ స్పూన్ నిమ్మరసం కలపండి. దీనిలో కాటన్ బాల్ను ముంచాలి. దాంతో బీట్రూట్ రసాన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోతుంది. నిమ్మరసం వల్ల ముఖంపై ఉండే మచ్చలు తగ్గుతాయి. రోజ్ వాటర్ చర్మానికి సహజసిద్ధమైన తేమను అందిస్తుంది. అలోవెరా జెల్తో... బీట్రూట్ రసం తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, మచ్చలు తొలగియి చర్మం ఆరోగ్యంగా... అందంగా నిగనిగలాడుతుంది.(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..)
అంతర్జాతీయం
షేక్ హసీనాకు మరణశిక్ష
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్రసమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపుతో మొదలైన విద్యార్థుల ఉద్యమం చివరకు పదవీచ్యుత మహిళా ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ మరణశిక్ష విధింపునకు దారితీసింది. జూలై 15న విద్యార్థుల సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసి 1,400 మంది మరణాలకు హసీనా కారణమయ్యారంటూ దాఖలైన కేసులో ఆమెకు మరణశిక్ష విధిస్తూ ట్రిబ్యునల్ సంచలన తీర్పు వెలువరిచింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ మొహమ్మద్ గులామ్ మోర్తుజా మజూందార్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కోర్టు గతంలోనే ఆమె పారిపోయిన నేరుస్తురాలిగా ప్రకటించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నిర్దయగా ఆదేశాలు జారీచేసి భద్రతబలగాల సాయంతో ఉద్యమాన్ని అణిచివేశారని, వందల మంది మరణాలకు ప్రధాన బాధ్యురాలు అని ప్రభుత్వం అందించిన సాక్ష్యాధారాలతో రూఢీ అయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ వందల మరణాలకు, ఉద్యమాన్ని అణచివేత వ్యూహాలకు కర్త, కర్మ, క్రియ హసీనాయే. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న విద్యార్థులపైకి ఆమెకు చెందిన పార్టీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడులకు తెగబడేలా ఆమె రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చారు. దాడులు చేస్తున్న వారిని ఏమాత్రం కట్టడిచేయకుండా ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. నిరసనబాటపట్టిన వేలాది మంది విద్యార్థులపై మారణాయుధాలు, హెలికాప్టర్లతో దాడులు చేయించారు’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వంటి ఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నాటి హసీనా ప్రభుత్వంలో హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్షను ఖరారుచేసింది. మాజీ పోలీస్ ఉన్నతాధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ చౌదరి అబ్దుల్లా అల్–మమూన్కు ఐదేళ్ల శిక్ష విధించింది. ఆమెను అప్పగించాలన్న తాత్కాలిక సర్కార్గత ఏడాది ఆగస్ట్ 5న దేశం నుంచి పారిపోయి ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న అవామీ లీగ్ పార్టీ అధినేత్రి హసీనాను తమకు అప్పగించాలని భారత్ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ భారత్కు పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమాల్లను వెంటనే బంగ్లాదేశ్ ఉన్నతాధికారులకు అప్పగించండి. గతంలో మన రెండు శాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒడంబడికను గౌరవించాల్సిందే. కోర్టు తీర్పుతో దోషులుగా నిర్ధారణ అయిన ఖైదీలను మాకు భారత ప్రభుత్వం అప్పగించాలి. దోషులు అని తేలాకకూడా వాళ్లను ఆశ్రయం కల్పించడం స్నేహపూర్వక చర్య అనిపించుకోదు. ఇలాంటి ధోరణి న్యాయబద్ధంకాదు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ‘‘ఈ మేరకు మరోసారి భారత్కు అధికారికంగ లేఖ రాస్తాం. ఊచకోత కారకులకు ఇంకా ఆశ్రయం కల్పిస్తామని భారత్ మొండికేస్తే రెండుదేశాల మధ్య విరోధం పెరుగుతుంది’’ అని ప్రభుత్వ న్యాయ సలహాదారు అసిఫ్ నజ్రుల్ స్పష్టంచేశారు. దీనిపై భారత్ స్పందించింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.తీర్పు తర్వాత పలు చోట్ల ఘర్షణలుతమ పార్టీ చీఫ్ హసీనాకు మరణశిక్ష ఖరారుచేస్తూ తీర్పు వెలువడటంతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగా కీలక నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. దీంతో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ అనుకూల వర్గాలు సైతం రోడ్లమీదకొచ్చాయి. ఢాకాలో హసీనా తండ్రికి చెందిన భవనాన్ని కూల్చేందుకు యత్నించగా పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.ఉక్కు మహిళ నుంచి మరణశిక్ష దాకా..1947 సెప్టెంబర్ 28వ తేదీన నాటి తూర్పు పాకిస్తాన్లో హసీనా జన్మించారు. ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడి తర్వాత బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం సిద్దించేలా కృషిచేవారు. తర్వాత బంగ్లాప్రజలు ఆయనను జాతిపితగా కీర్తించారు. ఢాకా యూనివర్సిటీలో ఈమె చదువుకున్నారు. 1968లో అణుశాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను పెళ్లాడారు. 1975లో సైనిక తిరగుబాటు వేళ తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతం తర్వాత ఈమె దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటికే దివంగత దేశాధ్యక్షుడు జివుర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. వీరిద్దరినీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో పోరాడే బేగమ్లు అని పిలిచేవారు. 1996లో హసీనా తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. 2001లో ఓడినా 2008లో మళ్లీ పీఠం అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అంశం గతేడాది చిలికిచిలికి గాలివానగా, విద్యార్థి మహోద్యమంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే రహస్య జీవితం గడుపుతున్నారు.చట్టానికి ఎవరూ అతీతులు కారుతీర్పును స్వాగతిస్తూ యూనుస్ వ్యాఖ్యఢాకా: హసీనాకు పడిన మరణశిక్షను ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. తీర్పును స్వాగతిస్తున్నట్లు యూనుస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ ఈరోజు బంగ్లాదేశ్ వ్యాప్తంగా, దేశానికి ఆవల సైతం ప్రతిధ్వనించేలా దేశ న్యాయస్థానాలు అత్యంత స్పష్టమైన సందేశానిచ్చాయి. అధికారంలో ఉన్నా, లేకున్నా చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే ప్రాథమిక సూత్రం ఇక్కడ వర్తిస్తుందని న్యాయస్థానం మరోసారి గుర్తుచేసింది. గత జూలై, ఆగస్ట్లో ఉద్యమం వేళ ప్రాణాలు కోల్పోయిన, వేధింపులకు గురైన, ఇప్పటికీ మనోవ్యథను భరిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు వెలువడింది. ఏళ్ల తరబడి కొనసాగిన అణిచివేతతో పెళుసుబారిన ప్రజాస్వామ్య పునాదుల పునరుద్ధరణకు మేం కృషిచేస్తాం’’ అని యూనుస్ వ్యాఖ్యానించారు.హసీనాపై మోపిన కీలక ఆరోపణలు1. హత్య, హత్యాయత్నం, నిరసనకారులను చిత్రహింసలకు గురి చేయడం. విద్యార్థులపై దాడులను ప్రోత్సహించడం, దాడులను ఏమాత్రం అడ్డుకోకపోవడం2. హలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో నిరాయుధ విద్యార్థులపైకి మారణాయుధాలతో సైన్యం దాడిచేసేలా ఆదేశాలు ఇవ్వడం3. రంగ్పూర్లో బేగమ్ వర్సిటీ విద్యార్థి అబూ సయీద్ను అత్యంత దారుణంగా చంపేయడం4. ఆగస్ట్ 5న ఛంకార్పూర్లో ఆరుగురిని హత్యచేయడం, విద్యార్థులపై దాడి చేయాలని ప్రసంగాలు ఇవ్వడం5. ఆగస్ట్ 5న అషూలియాలో ఆరుగురు విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించడం, తర్వాత ఆధారాల్లేకుండా తగలబెట్టడం రాజకీయ ప్రేరేపిత తీర్పు ఇదితీర్పుపై ఘాటుగా స్పందించిన హసీనాతీర్పుపై 78 ఏళ్ల హసీనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత తీర్పు. ప్రజాతీర్పు పొందని ఎన్నికల్లో గెలవని ఒక అనామిక ప్రభుత్వం ఒత్తిడితో వెల్లడైన తీర్పు ఇది. ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్రస్థాయి భావజాలం ఏ స్థాయిలో తీర్పు కళ్లకుకడుతోంది. తీర్పు పూర్తిగా పక్షపాతధోరణితో, రాజకీయ కక్షతో వెలువర్చారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రధానిగా ఎన్నికైన నన్ను, అవామీ లీగ్ రాజకీయశక్తిని నిర్వర్యీంచేసే కుట్ర ఇది. పారదర్శకంగా కేసు నడవని, సాక్ష్యాధారాలను పరిశీలించని ఇలాంటి ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులకు నేను అస్సలు భయపడను. మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తమ చేతగానితనాన్ని ఈ తీర్పును సాకుగా చూపి అస్తవ్యస్తపాలనను అద్భుతంగా ఉందని చెప్పుకునే దుస్సాహసంచేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యా అల్లా!.. సౌదీలో మృత్యు ఘోష
న్యూఢిల్లీ/సాక్షి, నెట్వర్క్/సాక్షి,న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా సందర్శించుకోవాలనే తమ చిరకాల వాంఛను తీర్చుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన 45 మంది ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో 43 మంది నగరానికే చెందిన వారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టగా మంటలు చెలరేగడంతో అంతా సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున మదీనాకు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయాన్నే అందిన పిడుగుపాటు లాంటి వార్త నగర వాసుల్ని కలచివేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి కుమారులు, కుమార్తెలు, వారి పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మొత్తం 46 మంది బస్సులో ప్రయాణిస్తుండగా ఒక్కరు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. మరణించిన నగర వాసుల్లో 18 మంది పురుషులు, 26 మంది మహిళలు కాగా వీరిలో 10 మంది చిన్నారులు ఉన్నారు. వీరి మృతదేహాలను జెడ్డాలోని కింగ్ ఫహద్, కింగ్ సల్మాన్, అల్ మిఖత్ ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జెడ్డాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను మదీనాలోనే స్థానిక సంప్రదాయాల మేరకు ఖననం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల వద్ద జరిగిన రెండు ఘోర బస్సు ప్రమాదాలను మరిచిపోక ముందే మరో దుర్ఘటన జరగడం, ఏకంగా 44 మంది హైదరాబాదీలు మరణించడం నగరాన్ని కుదిపేసింది. సౌదీ ప్రమాదంలో బతికి బయటపడింది ఇతను ఒక్కడే.. ప్రయాణంలో డ్రైవర్ పక్కన కూర్చున్న అబ్దుల్ షోయబ్ మొత్తం 54 మంది యాత్రికులు ఉమ్రా యాత్ర కోసం నగరంలోని వివిధ ట్రావెల్ ఏజెన్సీల నుంచి మొత్తం 54 మంది ఈ నెల 9న బయలుదేరి వెళ్లారు. మక్కా సందర్శన అనంతరం నలుగురు అక్కడే ఆగిపోగా.. మరో నలుగురు కారులో మదీనాకు వెళ్లారు. మిగిలిన 46 మందీ బస్సులో మదీనా వెళ్తుండగా గమ్య స్థానానికి 25 కి.మీ దూరంలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 1:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బస్సు రోడ్డు పక్కన ఆగి ఉండగా, ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. అయితే ప్రమాదానికి కారణాలను సౌదీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జెడ్డాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు త్రెలిపారు. 8002440003 (టోల్ ఫ్రీ), 00966122614093, 00966126614276 00966556122301 (వాట్సాప్) హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జెడ్డా నుంచి అధికారుల బృందం ఘటనా స్థలికి, ఆస్పత్రులకు వెళ్లినట్లు అక్కడి కార్యాలయ వర్గాలు తెలిపాయి. రియాద్లోని ఎంబసీ కార్యాలయం కూడా సౌదీ అధికారులతో కలిసి పని చేస్తోంది. సౌదీ ప్రమాదం నేపథ్యంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. (కాంటాక్ట్ నంబర్లు.. వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ –+91 98719 99044, సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – +91 99583 22143, రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ –+91 96437 23157). ఇలావుండగా షెడ్యూల్ ప్రకారం యాత్రికుల బృందం ఈనెల 23న జెడ్డా నుంచి హైదరాబాద్కు బయలుదేరాల్సి ఉంది. ఈ మేరకు వీరికి విమాన టిక్కెట్లు సైతం బుక్ అయ్యాయి. ఉమ్రా యాత్ర సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఒకే కుటుంబంలోని 18 మంది గ్రూప్ ఫొటో ప్రధాని మోదీ సంతాపం ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘నేను తీవ్ర విచారంలో మునిగిపోయా. నా ఆలోచనలన్నీ ఆప్తుల్ని కోల్పోయిన వారి చుట్టూనే ఉన్నాయి. జెడ్డాలోని మన కాన్సులేట్, రియాద్లోని ఎంబసీ అవసరమైన సహాయ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాయి. ఇక్కడి మన అధికారులు కూడా సౌదీ అధికారులతో కలిసి పని చేస్తున్నారు..’ అంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రష్యా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి జైశంకర్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి సౌదీ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఢిల్లీలోని అధికారులు, సౌదీలోని రాయబారితోనూ మాట్లాడాలని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయకచర్యలు తీసుకోవాలని సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డిని ఆదేశించారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ శాఖ అధికారితో కూడిన ప్రతినిధి బృందం తక్షణమే సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లనుంది. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి సూచనల మేరకు అన్ని రకాలుగా అదుకుంటామని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చెప్పాట్టాలని సౌదీ అధికారులను కోరినట్లు మంత్రి అజారుద్దీన్ తెలిపారు. మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని, వారి కుటుంబాల నుంచి ఇద్దరిని అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్తో మాట్లాడి తగు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో మృతుల కుటుంబసభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు వీలుగా 79979 59754, 99129 19545 టోల్ ఫ్రీ నంబర్లతో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రమాదానికి సంబంధించిన సహాయ సహకారాల కోసం పోలీసు విభాగం తరఫున సంయుక్త పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్ పని చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎప్పుడూ ప్రమాదకరమే.. సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలాల నుంచి యాత్రికుల తరలింపు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా హజ్ యాత్ర సమయంలో రోడ్లన్నీ బస్సులతో కిటకిటలాడుతుంటాయి. ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఉంటాయి. 2023లో మక్కా నుంచి వెళ్తున్న ఓ బస్సును బ్రిడ్జిని ఢీకొట్టి మంటల్లో చిక్కుకోవడంతో 20 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 25 మంది గాయపడ్డారు. 2019లో ఓ బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో 35 మంది చనిపోయారు. సౌదీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం సాక్షి, అమరావతి: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు మరణించడం విచారకరమన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 45 మంది మృతి బాధాకరంఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది భారతీయులు దుర్మరణం చెందడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మృతిచెందిన వారిలో అత్యధిక మంది హైదరాబాద్కు చెందిన ముస్లిం యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. వారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. దిగ్భ్రాంతికి గురి చేసింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్రా యాత్రలో దుర్ఘటన దురదృష్టకరం రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాద దుర్ఘటనపై రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని ప్రారి్థస్తున్నట్లు పేర్కొన్నారు.ఏపీ వక్ఫ్బోర్డు చైర్మన్ సంతాపంసౌదీ అరేబియా ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అదేవిధంగా సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 45 మంది మృతి చెందడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.
సౌదీ ప్రమాదం: మృతదేహాలకు అక్కడే ఖననం?
రియాద్: సౌదీఅరేబియాలోని మదీనా సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతిచెందగా.. వారి మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన హైదరాబాదీల మృతదేహాలను వెనక్కి రప్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా.. సౌదీ చట్టాల ప్రకారం ఈ ప్రక్రియ కొంత క్లిష్టమైనదేనని తెలుస్తోంది. సౌదీలో మరణిస్తే.. పరిస్థితులు ఏమిటనేదానిపై ‘సాక్షి వెబ్’ ప్రత్యేక కథనం..సౌదీఅరేబియాతోపాటు.. ఇతర గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఒకేలా ఉంటాయి. అక్కడ ఎవరైనా మరణిస్తే.. వారి రక్తసంబంధీకుల అనుమతితోనే మృతదేహాల తరలింపు ఉంటుంది. లేనిపక్షంలో.. ఎన్ని సంవత్సరాలైనా అక్కడి ప్రభుత్వాలు మృతదేహాలను మార్చురీల్లో భద్రపరుస్తాయి. ఇటీవల బహ్రెయిన్లో ఇద్దరు తెలంగాణ, మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పౌరుల మృతదేహాలు ఐదేళ్లుగా అక్కడి మార్చురీల్లో ఉన్న వార్తలు పతాకశీర్షికలకెక్కిన విషయం తెలిసిందే..! రక్తసంబంధీకులు ప్రభుత్వాలను సంప్రదించాక.. భారతీయ ఎంబసీల నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తప్పనిసరి. ఆ తర్వాతే గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు మృతదేహాల తరలింపునకు అనుమతినిస్తాయి. ఆ అనుమతులు ఉంటేనే.. విమానయాన సంస్థలు మృతదేహాలను తరలించేందుకు అంగీకరిస్తాయి.మదీనా ప్రమాదంలో..మదీనా ప్రమాదంలో బస్సు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఐదారు గంటల పాటు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయినట్లు సౌదీలోని భారతీయులు ‘సాక్షి’కి వివరించారు. ఇప్పుడు మృతదేహాలను గుర్తించాలంటే.. డీఎన్ఏ పరీక్షలు మాత్రమే మార్గంగా ఉన్నాయి. అయితే.. ముస్లింలు ఎంతో ఖర్చును భరించి ఉమ్రా, హజ్ యాత్రలు చేస్తుంటారు.అలాంటి పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షల కోసం మృతుల సంబంధీకులు సౌదీ వరకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న విషయమే..! అయితే.. ఇక్కడ ఓ వెసులుబాటు ఉందని సౌదీలో పనిచేస్తున్న భారతీయులు చెబుతున్నారు. మన ప్రభుత్వాలు సౌదీ సర్కారును సంప్రదిస్తే.. మన దగ్గర ఉండే సౌదీఅరేబియా ఎంబసీ అధికారులు ఇక్కడే డీఎన్ఏ పరీక్షలు జరిపించి, వాటి నివేదికలను సౌదీకి పంపే అవకాశాలున్నాయంటున్నారు. సౌదీలో మరణించిన భారతీయుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది.అక్కడే అంత్యక్రియలు?ముస్లింల పంచసూత్రాల్లో రోజుకు ఐదుపూటలా నమాజు చేయడం, రంజాన్ మాసంలో ఉపవాసాలు, పేదలకు దానాలు(జకాత్)తోపాటు.. మక్కా యాత్ర కూడా ఒకటి. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనాలను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా అత్యంత పవిత్ర ప్రదేశాలుగా భావిస్తారు. అక్కడ మృతిచెందితే.. అది జన్నత్(స్వర్గం)కు మార్గంగా భావిస్తారు. ‘‘మక్కా యాత్ర సందర్భంగా అరాఫత్ పర్వతం వద్ద జరిగే తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే.. మృతుల కుటుంబీకులు ఇక్కడే ఖననం చేయాలని నిర్ణయిస్తారు.90% మంది భావన ఇదే. నాకు తెలిసి.. గత మక్కా యాత్ర సందర్భంగా మృతిచెందిన వారిలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మృతదేహాలను వేర్వేరు దేశాలకు తరలించారు’’ అని సౌదీలో ఉంటున్న కరీంనగర్ వాసి ఒకరు తెలిపారు. మదీనా సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో.. బంధుమిత్రులు మిగిలిన అవశేషాలను సౌదీలోనే ఖననం చేసే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘సౌదీలోనే ఖననం చేయాలంటే.. మృతుల బంధుమిత్రులు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. సౌదీ అధికారులు ఖననం చేయవచ్చంటూ ఇక్కడి ప్రొఫార్మాలో సమ్మతిపత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. ప్రభుత్వమే అన్ని లాంఛనాలతో ఖననాలు జరుపుతుంది’’ అని ఆయన వివరించారు.
షేక్ హసీనా భర్త ఎవరు, ఆయన దాచుకున్న అపురూపమైన గిఫ్ట్!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించి బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. హసీనాను దోషిగా నిర్ధారించిన కోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో హసీనా కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా భర్త డా.ఎం.ఎ. వాజెద్ మియా (Wazed Miah) గురించి తెలుసుకుందాం.షేక్ హసీనా పుట్టుక1947 సెప్టెంబరు 28న పాకిస్థాన్లోని తుంగిపారాలో షేక్ హసీనా జన్మించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, తొలి అధ్యక్షుడు జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఆమె తండ్రి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేది. హసీనా ఢాకా విశ్వవిద్యాలయం నుంచి బెంగాలీ సాహిత్యంలో హసీనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1968లో అణు శాస్త్రవేత్త ఎం.ఎ.వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. వీరికి సజీబ్ వాజెద్ జాయ్ అనే కొడుకు, సైమా వాజెద్ పుతుల్ అనే కుమార్తె ఉన్నారు.2004 ఆగస్టులో దేశ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనేడ్ దాడినుంచి తృటిలో తప్పించుకుంది హసీనా. 2006-2008 రాజకీయ సంక్షోభం మధ్య, హసీనా దోపిడీ ఆరోపణలపై అరెస్టైంది. విడుదలైన తర్వాత 2008 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 2014, 2018 ఎన్నికల్లోనూ అవామీ లీగ్ పార్టీని గెలిపించి ప్రధానిగా ఎన్నికై, ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన ఘనతను దక్కించుకుంది హసీనా. 2024లో స్వాతంత్య్ర పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం సందర్భంగా అల్లర్లు, విద్యార్థులపై అణచివేత, హింస ఆరోపణల కారణంగా ఆమెను నిరంకుశ నేతగా, దోషిగా పేర్కొంటూ కోర్టు మరణ శిక్ష విధించింది.ఉక్కు మహిళగా, తిరుగులేని నేతగాతన తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్ను నడిపించి, దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ను రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న ‘ఉక్కు మహిళ’ గా పేరుగాంచిన హసీనా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. తిరుగులేని నాయకురాలిగా నిలిచింది. ప్రతిపక్ష నాయకురాలిగా కూడా ప్రజాస్వామ్యం గొంతుకగా మారింది. పలు సార్లు గృహనిర్బంధాన్ని కూడా ఎదుర్కొంది. విద్యార్థి ఉద్యమం చిలికి చిలికి గాలివానలా ముదిరి బంగ్లాదేశ్లో అశాంతి నెలకొంది. అది చివరికి హసీనాను పదవి నుండి తొలగించే స్థాయికి చేరింది. దీంతో 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ నుండి పారిపోయి అప్పటి నుండి భారతదేశంలో తలదాచుకుంది. ఎవరీ ఎంఏ వాజెద్ మియాహసీనా భర్త వాజెద్ మియా సైన్స్ రంగంలో చాలా ప్రభావవంతమైన వ్యక్తి. తన కెరీర్ మొత్తంలో, అనేక ప్రభావవంతమైన పుస్తకాలను ప్రచురించారు. అణుశాస్త్రవేత్తగా ఎంతో కృషి చేశారు. 1942, ఫిబ్రవరి 16న రంగ్పూర్లోని పిర్గంజ్లో జన్మించారు వాజెద్ మియా. ఈయనను ప్రేమగా 'సుధా మియా' అని పిలుస్తారు. రంగ్పూర్లో విద్యను పూర్తి చేసిన తర్వాత, వాజెద్ మియా భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పొందారు , రెండింటిలోనూ టాప్గా నిలిచారు. తరువాత ఇంపీరియల్ కాలేజ్ లండన్ నుండి డిప్లొమా , UK లోని డర్హామ్ విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో PhD పొందారు.1963లో, మియా పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్లో ఉద్యోగంలో చేరారు. ఇటలీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియొరెటికల్ ఫిజిక్స్లో అసోసియేట్షిప్ తర్వాత, మియా పాకిస్తాన్కు తిరిగి వచ్చాడు. అనంతరం కరాచీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ప్రధాన శాస్త్రవేత్తగా చేరారు. అయితే, అతని భద్రతా అనుమతి రద్దు చేయడంతో అతను బంగ్లాదేశ్కు వలస వెళ్ళాడు.బంగ్లాదేశ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్గా బంగ్లాదేశ్కు తిరిగి వచ్చిన తర్వాత, మియాబంగ్లాదేశ్ అటామిక్ ఎనర్జీ కమిషన్లో గణనీయ మైన సేవలందించారు. వాటిలో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ , బంగబంధు షేక్ ముజిబ్కే ఘైర్ కిచ్చు ఘటానా ఓ బంగ్లాదేశ్ ఉన్నాయి. తరువాత బంగ్లాదేశ్ అణుశక్తి కమిషన్ ఛైర్మన్ అయ్యాడు. 1999లో పదవీ విరమణ చేశాడు.వాజెద్ మియా అరెస్టుఢాకా విశ్వవిద్యాలయంలో ఉన్న సమయంలో, వాజెద్ మియా రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు.. 1961 నుండి 1962 వరకు,ఫజ్లుల్ హక్ ముస్లిం హాల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.అయితే 1962 తూర్పు పాకిస్తాన్ విద్యా ఉద్యమంలో పాల్గొన్నందుకు కూడా అతను అరెస్టు అయ్యాడు. కాలేజీ రోజుల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ, విశ్వవిద్యాలయం తర్వాత అతను రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.వాజెద్ మియా - షేక్ హసీనాల వివాహం1967 నవంబర్ 17న వాజెద్ మియాను వివాహం చేసుకుంది హసీనా. అప్పటికి బంగ్లాదేశ్లోని ప్రతికూల రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ వివాహం చాలా సన్నిహితంగా జరిగింది. ఇదీ చదవండి: మరణ శిక్ష : మాజీ ప్రధాని షేక్ హసీనా తొలి స్పందనమామగారి బహుమతిని అపురూపంగావివాహ సమయంలో, హసీనా తండ్రి రెహమాన్ జైలులో ఉన్నారు. దీంతో జైలులోంచే కొత్త జంటను ఆశీర్వదించిన ఆయన తన అల్లుడు వాజెద్కు రోలెక్స్ గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. దానిని వాజెద్ తన జీవితాంతం విలువైన ఆస్తిగా, అపురూపంగా దాచుకున్నాడట. వాజెద్ మియా అస్తమయంరాజకీయ కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ, షేక్ ముజిబుర్ రెహమాన్ అల్లుడు లేదా షేక్ హసీనా భర్త అని అతను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అణు శాస్త్రవేత్తగా వాజెద్ తన తెలివితేటలతో ప్రత్యేకంగా నిలిచాడు. అయితే తీవ్ర గుండె సమస్యలతో పాటు మూత్రపిండ వైఫల్యం, మధుమేహం, ఉబ్బసం , అధిక రక్తపోటుతో బాధపడుతూ 66 ఏళ్ల వయసులో వాజెద్ 2009లో కన్నుమూశాడు. గొప్ప అణు శాస్త్రవేత్తగా మియా అందించిన సేవలను గొప్పగా, నిత్యం ప్రకాశించే లైట్హౌస్గా భావిస్తారు.
జాతీయం
పురుషులకూ ఒక రోజు..
అంతర్జాతీయంగా మహిళలకు ఒక ప్రత్యేకమైన రోజు ఉన్నట్లుగానే పురుషులకూ ఒక రోజు ఉందనే సంగతి మీకు తెలుసా? సమాజంలో మహిళలతో సమానంగా పురుషులకున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ, ఈ రోజును జరుపుకుంటారు. మరి.. ఆ దినోత్సవం ఎప్పుడనే వివరాల్లోకి వెళితే.. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men's Day) ప్రతి సంవత్సరం నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును 1999లో డాక్టర్ జెరోమ్ తిలక్సింగ్ ప్రారంభించారు. కుటుంబంలో, సమాజ నిర్మాణంలో పురుషులు, బాలుర సానుకూల సహకారాన్ని గుర్తించడం, వారి శ్రేయస్సుకు ప్రాధాన్యతనివ్వడమే ఈ దినోత్సవ లక్ష్యం. ప్రతి ఏటా ఒక నిర్దిష్ట థీమ్ను ఎంచుకుని పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచం ముందు ఉంచుతారు.పురుషుల సమస్యలపై చర్చ2025 అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ఇతివృత్తం ‘పురుషులు, బాలుర శ్రేయస్సును ప్రోత్సహించడం’(Celebrating Men and Boys). ఈ రోజున కేవలం పురుషుల విజయాలను మాత్రమే కాకుండా, వారి మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ, లింగ సమానత్వం తదితర అంశాలపై కూడా దృష్టి సారిస్తారు. తద్వారా వారికి అవసరమైన చోట సహాయం అందించడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ దినోత్సవం.. పురుషులు, బాలురు ఎదుర్కొంటున్న వివక్ష, సాంఘిక ఒత్తిళ్లు, సవాళ్లను బహిరంగంగా చర్చించడానికి అవకాశం కల్పిస్తుంది. డాక్టర్ తిలక్సింగ్ అభిప్రాయం ప్రకారం.. లింగ సమానత్వాన్ని గుర్తించి, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి ఈరోజు తోడ్పడుతుంది. నవంబర్ 19న ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లోని పురుష రోల్ మోడల్స్ను గౌరవించాలని, పురుషుల శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించడానికి కృషి చేయాలని తిలక్సింగ్ కోరారు.స్ఫూర్తిదాయక పురుషులను గుర్తుచేసుకుంటూ..డాక్టర్ జెరోమ్ తిలక్సింగ్ ట్రినిడాడ్, టొబాగోకు చెందిన చరిత్రకారుడు, విద్యావేత్త. ఆయన 1999లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని (ఐఎండీ)ప్రారంభించారు. ఆయన తన తండ్రి పుట్టినరోజును గౌరవిస్తూ, ఈ దినోత్సవాన్ని మొదలుపెట్టారు. అలాగే సమాజంలోని స్ఫూర్తిదాయక పురుషులను గుర్తుచేసుకోవడం లక్ష్యంగా ఈ దినోత్సవానికి శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సమాంతరంగా సమాజంలో పురుషుల సహకారాన్ని గుర్తించడం లక్ష్యంగా ఈ దినోత్సవం ప్రారంభమయ్యింది. భారత్తో డాక్టర్ తిలక్సింగ్ అనుబంధండాక్టర్ తిలక్సింగ్ మూలాలు భారతదేశంతో ముడిపడి ఉన్నాయి. ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో నివసిస్తున్న ఇండో-కరేబియన్ డయాస్పోరా (భారతీయ సంతతి)లో భాగంగా ఉన్నారు. ఆయన పూర్వీకులు 19వ శతాబ్దంలో ఒప్పంద కార్మికులుగా భారతదేశం నుండి కరేబియన్కు వలస వచ్చారు. వెస్టిండీస్ విశ్వవిద్యాలయంలో చరిత్ర లెక్చరర్గా సాగించిన తిలక్సింగ్ పరిశోధనలు ప్రధానంగా ఇండో-కరేబియన్ చరిత్రపై కేంద్రీకృతమయ్యాయి. ఆయన భారతీయ వలసలు, సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చారు. ఆయన ప్రారంభించిన ఐఎండీ దార్శనికతను భారతదేశం స్వీకరించింది. తద్వారా తిలక్సింగ్ సందేశం ఆయన పూర్వీకుల దేశంలో ఒక సామాజిక ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవంతో పాటు, డాక్టర్ తిలక్సింగ్ ప్రపంచ బాలల దినోత్సవాన్ని కూడా ప్రారంభించారు. సమాజంలో బాలురు ఎదుర్కొంటున్న నిర్లక్ష్యం, బెదిరింపులు, మార్గదర్శకత్వ లేమి తదితర సమస్యలపై దృష్టి సారించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
తెలంగాణ ‘జల’ జయకేతనం!
సాక్షి, న్యూఢిల్లీ: జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు–2024లో తెలంగాణ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’విభాగంలో తెలంగాణ టాప్లో నిలిచి సత్తా చాటింది. సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అధికారులు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. 5.20 లక్షల పనులు.. అద్భుత ప్రగతి కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో 5,20,362 జల సంరక్షణ పనులను పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలు, సంఘాలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేస్తూ.. రూఫ్టాప్ వాన నీటి సంరక్షణ, చెరువులు, కుంటలు, బావుల పునరుద్ధరణలో రాష్ట్రం చూపిన చొరవకు ఈ గుర్తింపు లభించింది. జిల్లాల విభాగంలో మనదే హవా.. జిల్లాల విభాగంలో (దక్షిణ జోన్–కేటగిరీ 1) తెలంగాణ జిల్లాలదే ఏకచక్రాధిపత్యం నడిచింది. మొదటి మూడు స్థానాలను మన జిల్లాలే కైవసం చేసుకోవడం విశేషం. ఆదిలాబాద్, నల్లగొండ, మంచిర్యాల జిల్లాలు టాప్–3 జిల్లాలుగా నిలిచాయి. ఈ మూడు జిల్లాలకు మొదటి కేటగిరీ కింద ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున, మొత్తం రూ.6 కోట్ల నగదు బహుమతి దక్కింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జల సంరక్షణ చర్యలు చేపట్టినందుకు గాను.. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. ఇందుకు గాను రూ.2 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. కేటగిరీల వారీగా మెరిసిన జిల్లాలు..కేటగిరీ–2 (దక్షిణ జోన్): వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచి.. ఒక్కో జిల్లా రూ.కోటి చొప్పున బహుమతిని గెలుచుకున్నాయి. కేటగిరీ–3: భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాలు 1, 3 ర్యాంకుల్లో నిలిచి.. చెరో రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నాయి. అవార్డులు స్వీకరించిన అధికారులు వీరే.. శ్రీజన (ఐఏఎస్): పీఆర్, ఆర్డీ కమిషనర్ (రాష్ట్రం తరఫున) కె.అశోక్ కుమార్ రెడ్డి: ఎండీ, జలమండలి రాజర్షి షా: కలెక్టర్, ఆదిలాబాద్ జె.శ్రీనివాస్: అడిషనల్ కలెక్టర్, నల్లగొండ కుమార్ దీపక్: కలెక్టర్, మంచిర్యాల సత్యశారద: కలెక్టర్, వరంగల్, అభిలాష అభినవ్: కలెక్టర్, నిర్మల్ రిజ్వాన్ బాషా షేక్: కలెక్టర్, జనగామ జితేశ్ వి.పాటిల్: కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం బి.విజయేందిర: కలెక్టర్, మహబూబ్నగర్ అలాగే పలు జిల్లాలకు నోడల్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘం అధికారి సతీశ్కూ అవార్డు దక్కింది.
గ్యాంగ్స్టర్ అన్మోల్ను అప్పగించిన అమెరికా
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో కీలక నిందితుడు, గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణో య్ను అమెరికా నుంచి రప్పిస్తున్నట్లు మంగళవారం ముంబై పోలీసులు తెలిపారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ఏప్రిల్ 2024లో జరిగిన కాల్పుల కేసులోనూ ఇతడు వాంటెడ్గా ఉన్నాడన్నారు. అమెరికా నుంచి ఇతడు బుధవారం ఢిల్లీకి చేరుకుంటాడని పోలీసులు వివరించారు. అన్మోల్ బిష్ణోయ్పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులున్నాయని, ముందుగా అతడిని ఎవరికి అప్పగించాలనేది కేంద్రం నిర్ణయిస్తుందన్నారు. తాము కూడా అతడి కస్టడీని కోరుతామన్నారు.అమెరికా, కెనడా మధ్య రాకపోకలు సాగిస్తున్న అన్మోల్ బిష్ణోయ్ను ఇటీవల కెనడా అధికారులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడి వద్ద ఫోర్జరీ చేసిన రష్యా పాస్పోర్టు ఉన్నట్లు సమాచారం. ఇతడి తలపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. 2022లో జరిగిన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ ఇతడి పేరు బయటకు వచ్చింది. 2024 అక్టోబర్ 12వ తేదీ రాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన కుమారుడు జీషన్తో కలిసి ఉండగా మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండగులు కాల్చి చంపడం తెల్సిందే.
ఎన్డీఏ పక్షనేతగా నేడు నితీశ్ ఎన్నిక
పట్నా: బిహార్ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతంచేసుకున్న ఎన్డీఏ కూటమి పార్టీలు సీఎం నితీశ్కుమార్ను బుధవారం తమ ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకోను న్నాయి. నవంబర్ 20న పదోసారి సీఎంగా నితీశ్ ప్రమాణం చేయబోతుండటంతో ఒకరోజు ముందే ఆయన అధికార పక్షనేతగా ఎంపిక ఖరారైంది. బుధవారం ఉదయం 11 గంటలకు పట్నాలో జేడీ(యూ) శాసనసభాపక్ష పార్టీ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో నితీశ్ను తమ పక్షనేతగా ఎన్నికోనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ పక్షనేత హోదాలో మధ్యాహ్నం 3.30గంటలకు బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహహ్మద్ ఖాన్ను కలిసి నితీశ్ తన రాజీనామా లేఖను అందజేయనున్నారు.కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని తెలియజేస్తూ సంబంధిత లేఖను గవర్నర్కు నితీశ్ అందజేయనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి బుధవారంతో ముగియనుంది. పట్నాలో చారిత్రక గాంధీ మైదాన్లో 20న జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో నితీశ్తోపాటు తామూ ప్రమాణంచేస్తామంటూ మంత్రుల బెర్తుల కోసం పైరవీలు హఠాత్తుగా ఊపందుకున్నాయి. కూటమి పార్టీల మధ్య దీనిపై మల్లగుల్లాలు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 14 మందిని కేబినెట్లోకి తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీ స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ముఖ్య నేతలు ఆశిస్తున్నారు.అయితే తమ నేతకే స్పీకర్ పదవి దక్కాలని బీజేపీ, జేడీ(యూ) రాష్ట్రనేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. జేడీ(యూ) తరఫున విజయ్ చౌదరి, బీజేపీ తరఫున ప్రేమ్ కుమార్ స్పీకర్ పీఠంపై కన్నేశారు. బీజేపీ, జేడీయూల నుంచి తలో ఐదారుగురు కొత్త వాళ్లకు కేబినెట్లో స్థానం కల్పించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. మాహ్నర్ నుంచి గెలిచిన జేడీయూ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు ఉమేశ్ కుష్వాహాను కేబినెట్లోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రులందరికీ అవకాశం ఇవ్వాలని జేడీయూ భావిస్తుండగా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని బీజేపీ వాదిస్తోంది. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ(ఆర్వీ) నుంచి ముగ్గురికి, జితన్ రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం నుంచి ఒకరికి అవకాశం దక్కవచ్చు.ఆర్ఎల్ఎం పార్టీ నేతలకూ మంత్రి పదవి వరించే వీలుంది. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, పలువురు మంత్రులు, ప్రధాన కార్యదర్శి ప్రత్యాయ అమృత్ కుమార్ గాంధీ మైదాన్లో మంగళవారం ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పా ట్లను దగ్గరుండి సమీక్షించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన నున్నారు. వీవీఐపీల తాకిడి ఎక్కువ ఉండటంతో గాంధీమైదాన్ చుట్టూతా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎన్ఆర్ఐ
జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి
ముగ్గురు కళాశాల డ్రాపౌట్లు 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి ప్రవేశించారు. తద్వారా మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ రికార్డును చెరిపేశారు. ఫోర్బ్స్ ప్రకారం, మెర్కోర్ (Mercor )అనే AI-ఆధారిత రిక్రూటింగ్స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురుస్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా,ప్రపంచంలోనే అతి చిన్న బిలియనీర్లుగా నిలిచారు. ఈ ముగ్గురూ, స్వయంకృషితో బిలయనీర్లుగా ఎదిగారు. వీరిలో హిరేమత్ భారతీయసంతతికి చెందినవాడు కావడం విశేషం. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మెర్కోర్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 88,560.68 కోట్లకు (10 బిలియన్ డాలర్లు)గా ఉంది. 350 మిలియన్ల డాలర్ల తాజా నిధులతో కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి ఎగిసింది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా ఈ ముగ్గురూ నిలిచారు. మెర్కోర్ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.ఈ ముగ్గురి ప్రయాణంకాలిఫోర్నియాలోని శాన్జోస్లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బోయిస్ స్కూలు నుంచే మొదలైంది.అక్కడ డిబేట్ టీమ్లో టాప్ మెంబర్స్గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచు కున్న తొలి వ్యక్తులు.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో మెర్కోర్పై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి చదువును విడిచి పెట్టాల్సి వచ్చింది. మెర్కోర్లో పని చేయకపోతే, రెండు నెలల క్రితమే పట్టభద్రుడయ్యేవాడినని, ఇంతలోనే తన జీవితం 180-డిగ్రీల యు-టర్న్ తీసుకుందని పేర్కొన్నాడు. అలాగే సూర్య మిధా జార్జ్టౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్న సమయంలోనే బ్రెండన్ ఫుడీని కలిశాడు. దీంతో హిరేమత్తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు. అలా వారి అభిరుచులు కలిసి, నైపుణ్యాన్ని మేళవించి మెర్కోర్ నాంది పలికింది. ప్రపంచ రికార్డుకు దారి తీసింది.
అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావుకి అరుదైన గౌరవం
ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావు కావేటిని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అంతర్జాతీయ న్యాయ సేవల్లో విశేష కృషి చేసినందుకు గాను డా. శ్రీనివాస్ రావు కావేటికి ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ ఇంటర్నేషనల్ కౌన్సెల్ లీడర్షిప్ ఇన్ ది యూఎస్ ఆఫ్ 2025’ అవార్డు దక్కింది. ‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ డా. శ్రీనివాస్ రావు కావేటికి ఈ అవార్డును అందించింది.‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ అందించిన ఈ గౌరవం, భారతీయ చట్టాలను అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలతో సమన్వయం చేయడంలో డా. కావేటి చేసిన అసాధారణ కృషికి దక్కిన గుర్తింపు అని చెప్పవచ్చు. అంతర్జాతీయ న్యాయ సేవలలో కావేటి లా సంస్థ ఎంతో పేరొందింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా అడుగుపెట్టిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాలలో సొలిసిటర్గా, నోటరీ పబ్లిక్గా సేవలందించారు.ఆయన స్థాపించిన కావేటి లా ఫర్మ్.. అమెరికా, భారతదేశం, యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో సేవలందిస్తోంది. కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, బిజినెస్ ఇమ్మిగ్రేషన్ వంటి కీలక రంగాలలో సరిహద్దులు దాటి క్లయింట్లకు సేవలను అందిస్తోంది. ఒకే గొడుగు కింద స్థానిక, అంతర్జాతీయ న్యాయ సేవలను అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు న్యాయ విద్యతో పాటు ఎంబీఏ, జర్నలిజంలో మాస్టర్స్ పట్టాలను కూడా పొందారు. న్యాయ విద్యార్థులకు, చార్టర్డ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తూ గ్లోబల్ ఎడ్యుకేటర్గా కూడా ఆయన గుర్తింపు పొందారు.(చదవండి: ఘనంగా 'ఆటా' 19 మహాసభలు కిక్ ఆఫ్ వేడుడ
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
క్రైమ్
లడ్డూ ఇస్తానని చెప్పి బంధువు అత్యాచారయత్నం
హిందూపురం: పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. లడ్డూ ఇస్తానని ఆశ చూపి పసిమొగ్గపై కామాంధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. స్థానికులు విషయం తెలుసుకుని కామాంధునికి దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ కాలనీలో చేనేత కార్మికుడు నివాసం ఉంటున్నాడు. ఈయన భార్య రెండేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాల ముగించుకుని పెద్దనాన్న ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి సొంతింటికి వస్తుండగా వరుసకు తాత అయిన గోపీ అనే 55 ఏళ్ల వ్యక్తి బాలికను పిలిచి.. లడ్డూ ప్రసాదమిస్తానని ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపు వేసి.. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించబోయాడు. బాలిక భయపడిపోయి గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో ఎవరో బయట నుంచి పిలవడంతో గోపీ తలుపు కొద్దిగా తెరవగానే సందులోంచి బాలిక బయటకు పరుగులు తీసి ఇంటికి చేరుకుంది. తల్లిలేని ఆ బాలిక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడ్చుకుంటూ కూర్చుండిపోయింది. పొరుగింటి మహిళ దగ్గరకు తీసుకుని విషయం ఆరా తీసింది. పాపను సముదాయించి కాలనీవాసులతో కలిసి గోపీ ఇంటికి వెళ్లి నిలదీశారు. స్తంభానికి కట్టేసి చితకబాది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రోజు రాత్రి గోపీని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన బాలికను వైద్య పరీక్షలకు పంపాల్సిన పోలీసులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, సీపీఎం, కేవీపీఎస్ నాయకులతో కలిసి చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. కామాంధున్ని కఠినంగా శిక్షించాలి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం చేయాలని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి వీఆర్ రాము, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షురాలు జ్యోతమ్మ మాట్లాడుతూ బాధితురాలిని ఆస్పత్రికి తరలించడంలో పోలీసులు, చికిత్స అందించడంలో వైద్య సిబ్బంది చేసిన నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పసిపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేకు ఇన్చార్జ్ తహసీల్దార్ మైనుద్దీన్కు వినతిపత్రం అందించారు.
భర్తను కాదని.. ఎల్రక్టీషియన్తో వివాహేతర సంబంధం
మంగళగిరి టౌన్: వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... పెనమలూరు మండలం పెదపులిపాకలో శంకరరెడ్డి తన భార్య లక్ష్మీపార్వతి (29)తో ఉంటున్నాడు. మిఠాయి కార్కానాలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఎనిమిది నెలల క్రితం మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అయిదు నెలల క్రితం మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని గ్రామానికి లక్ష్మీపార్వతి వచ్చింది. స్థానికంగా ఎల్రక్టీషియన్గా పనిచేసే మహేష్తో పరిచయం ఏర్పడింది. మంగళగిరి మండలం పరిధిలోని యర్రబాలెంలో ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న శంకరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం లక్ష్మీపార్వతి నివాసానికి వెళ్లి గొడవ పడ్డాడు. పెద్దగా వాగ్వాదం జరిగింది. లక్ష్మీపార్వతి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లింది. శంకరరెడ్డి కూడా ఆమెను వెంబడించి లోపలికి వెళ్లి గడి పెట్టాడు. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ సీఐ బ్రహ్మం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని వైద్యశాలకు పంపారు. శంకరరెడ్డి పరారీలో ఉన్నాడని, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదేం అఘాయిత్యం నాన్నా?
పశ్చిమ గోదావరి జిల్లా: కన్నతండ్రే కూతురిపై రెండేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయం బయటపెడితే తాను పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించాడు. పెరవలి మండలం పిట్టల వేమవరం గ్రామంలో ఈ దారుణం జరుగగా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. నిందితుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్లుగా పెద్ద కుమార్తెను బెదిరిస్తూ అఘాయిత్యం చేస్తుండగా ఇటీవల కుమార్తెలో మార్పు రావటంతో తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లింది.అక్కడ పరీక్షల్లో కుమార్తె గర్భ నిరోధక మాత్రలు వాడినట్లు తేలటంతో ఇంటికి వచ్చి కుమార్తెను నిలదీయగా తండ్రే ఈ దురాగతానికి పాల్పడినట్లు చెప్పింది. దీనితో భర్తను నిలదీయగా ఈ విషయం బయట చెబితే తాను పురుగు మందు తాగుతానని బెదిరించాడు. నువ్వు చచ్చినా ఫర్వాలేదు అని చెప్పి ఆమె కుమార్తెలతో సహా ఈ నెల 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో విషయం ఎక్కడ బయటపడుతోందనని డ్రైవర్ పురుగు మందు తాగాడు. స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతుర్లతో సహా పుట్టింటికి వెళ్లిన నిందితుడి భార్య ఈ నెల 15వ తేదీన పెనుమంట్ర పోలీసులను ఆశ్రయించింది. అక్కడ జీరో ఎఫ్ఆర్ఐ నమోదు చేసి పెరవలి పోలీసు స్టేషన్కు 16వ తేదీన పంపించారు. దీంతో ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నిందితుడు ఆసుపత్రి నుంచే పరారీ అయ్యాడని అధికారులు చెబుతున్నారు. భార్య, బాధిత బాలిక, నాన్నమ్మ, చుట్టుపక్కల కుటుంబాలను డీఎస్పీ దేవకుమార్ విచారించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడని, మద్యానికి బానిసైన అతను కుటుంబ సభ్యులను రోజూ ఏదో రకంగా బాధపెడుతూ, చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అతన్ని త్వరలోనే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
ఎందుకిలా చేశావు తండ్రీ!
వెన్నలాంటి మనసుండే ‘నాన్న’ కన్నపిల్లల పాలిట ఇంత కర్కశంగా ప్రవర్తించడమేమిటి? వేలు పట్టి నడిపించడానికి బదులు మెడపట్టి నదిలోకి గెంటేయడమేమిటì ? ఒక జీవితకాలం భరోసా ఇవ్వాల్సిన తండ్రే జీవితాన్ని చిదిమేయడమేమిటి? నాన్నతనానికి మచ్చ తెచ్చిన ఈ ఘటనలు మానవత్వాన్ని ఎగతాళి చేశాయి.మలికిపురం: తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచవలసిన తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు వారిని ఎందుకు చంపాలను కున్నాడో అర్థంకాక జనం ఆశ్చర్యపోతున్నారు. తాను చని పోవడంతో పాటు అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులను గోదావరిలోకి నెట్టేయడం పలువురిని కలచివేసింది. రెండు గ్రామాల్లో విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి శిరిగినీడి దుర్గాప్రసాద్ (38) తన ఇద్దరు సంతానాన్ని సోమవారం సాయంత్రం దిండి – చించినాడ వంతెన పై నుంచి నదిలోకి తోసి తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు గాలించగా దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్(14) మృతదేహాలు మంగళవారం లభ్యం అయ్యాయి. కుమార్తె జాహ్నవి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రెండు గ్రామాలలో విషాదం రోజూ పాఠశాలలకు అందరితో కలిసి ఎంతో సరదాగా వెళ్లే ఆ చిన్నారులు గోదావరిలో పడిపోయారనే దుర్వార్త రెండు గ్రామాలలో పెను విషాదం నింపింది. మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, పక్కనే ఉన్న విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన రేకపల్లి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వారు, బంధువులు చెబుతున్నారు. పక్కపక్క గ్రామాలు కావడంతో అత్తింటి వద్ద, పుట్టింటి వద్ద కూడా భార్యాభర్తలు, పిల్లలు ఉండేవారు. కుమారుడు మోహిత్ తొమ్మిదో తరగతి, కుమార్తె జాహ్నవి నాలుగో తరగతి చదువుతున్నారు.పలు అనుమానాలు దుర్గాప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. దుర్గాప్రసాద్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో అతను ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదా? లేక తాను ఎక్కడైనా తెచ్చిన డబ్బు ఇవ్వలేక ఇబ్బంది పడ్డాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోవడానికి ముందు రోజు కూడా అత్త వారింటి వద్ద కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. సోమవారం సాయంత్రం ఆధార్ కార్డుల అప్డేట్ అంటూ చిన్నారులను బైక్పై తీసుకెళ్లిన దుర్గాప్రసాద్ దిండి– చించినాడ వంతెనపై బైక్, సెల్ఫోన్, పర్సు ఉంచి పిల్లలను నదిలో తోసేసి తాను కూడా దూకేశాడు. కారణాలు తెలియనప్పటికీ ఇద్దరు చిన్నారులను చంపాలనుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై రాజోలు సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక విచారణ చేశామని, కుటుంబ కలహాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని తాము భావిస్తున్నట్లు చెప్పారు.
వీడియోలు
ధనుష్ దర్శకత్వంలో రజనీ..
బాబా బోధనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి
సత్య సాయిబాబా గురించి ఆసక్తికర అంశాలు చెప్పిన ఐశ్వర్య రాయ్
Venkatarami: ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్నారు.. చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి
లొంగి పోవాలనుకుంటే.. నాకు ఫోన్ చేయండి
మావోయిస్టులు పట్టుబడిన ఇంటి నుంచి సాక్షి సంచలన రిపోర్ట్
కోటి సంతకాల సేకరణ @పాణ్యం
Margani Bharath: ఎవరిని బెదిరిస్తావ్ బుర్ర లేకుండా మాట్లాడకు..
కథ ముగిసింది.. శ్రీలంక పారిపోతూ పోలీసులకు బుక్కయ్యాడు
మావోయిస్టుల ఖేల్ ఖతం.. క్లైమాక్స్ కు ఆపరేషన్ కగార్

