కంపెనీలు కావు.. కల్పతరువులు
ఉద్యోగులు మంచి కంపెనీలను కోరుకుంటారు. కంపెనీలు మంచి ఉద్యోగులను కోరుకుంటాయి. మంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం, వారిని కాపాడుకోవడం వల్లనే కంపెనీలు విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. మంచి ఉద్యోగులను కాపాడుకోగలిగే కంపెనీలు ఉత్తమ కంపెనీలుగా ఎదుగుతున్నాయి. అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు పనిచేయడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండే వంద అత్యుత్తమ కంపెనీలను ఎంపిక చేసిన ఫార్చూన్ పత్రిక ‘బెస్ట్ కంపెనీస్ టు వర్క్’– 2025 పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది. వీటిలోని పది అత్యుత్తమ కంపెనీల కథా కమామిషు చూద్దాం. వీటిలో పనిచేయాలని ఉద్యోగులు ఎందుకు ఉవ్విళ్లూరుతుంటారో తెలుసుకుందాం...మంచి కంపెనీలు అంటే అపర కుబేరుల ఆ«ధ్వర్యంలో నడిచే కంపెనీలు అనుకుంటే పొరపాటేనని ‘ఫార్చూన్’ జాబితా రుజువు చేస్తోంది. ఉద్యోగులకు మంచి వేతనాలు చెల్లించడమే కాకుండా, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల కోసం చర్యలు తీసుకోవడం; ఉద్యోగుల అభివృద్ధిలో పైరవీలకు తావు లేకుండా పనితీరుకు మాత్రమే ప్రాధాన్యమివ్వడం; ఉద్యోగుల అనుభవాన్ని, పనితీరును మదింపు వేసి పదోన్నతులు కల్పించడం; పని ప్రదేశంలో ఆహ్లాదకర పని వాతావరణాన్ని కల్పించడం; ఉద్యోగుల కష్టసుఖాలను పరిగణనలోకి తీసుకుని, వారికి తగిన వెసులుబాట్లు కల్పించడం వంటి మానవీయ చర్యల కారణంగానే ఈ కంపెనీలు అత్యుత్తమ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘ఫార్చూన్’ జాబితాలోని టాప్–10 కంపెనీల పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం...1 హిల్టన్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న బహుళజాతి సంస్థ హిల్టన్ వరల్డ్వైడ్. ఆతిథ్యరంగంలో ఈ కంపెనీ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. వర్జీనియాలోని మెక్లీన్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. కాన్రాడ్ హిల్టన్ 1919లో ప్రారంభించిన ఈ కంపెనీకి ప్రస్తుతం క్రిస్టఫర్ నాసెట్టా సీఈవోగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో దాదాపు రెండులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్ని స్థాయుల్లోనూ ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడమే కాకుండా, ‘హిల్టన్’ యాజమాన్యం వారి సంక్షేమానికి, అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ‘కేర్ ఫర్ ఆల్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ‘హిల్టన్ ఫ్లెక్స్’ కార్యక్రమం పేరిట ఉద్యోగులు తమకు అనువైన వేళల్లో వచ్చి పనిచేసి వెళ్లే వెసులుబాటును కల్పిస్తోంది. ‘గో హిల్టన్’ పేరిట ఉద్యోగుల పర్యాటక ఖర్చులను చెల్లిస్తోంది. ‘హిల్టన్’ సంస్థ తన విజయాలకు ఉద్యోగులే కారణమని చెబుతుంది. నిజానికి ఉద్యోగులకు పూర్తి సంతృప్తికరమైన జీవితాన్ని అందించడమే ‘హిల్టన్’ను ‘ఫార్చూన్’ జాబితాలో మొదటి స్థానంలో నిలిపింది.2 సింక్రనీఅమెరికా కేంద్రంగా ప్రధానంగా ఆర్థిక, బీమా రంగాల్లో పనిచేస్తున్న బహుళజాతి సంస్థ సింక్రనీ. కనెక్టికట్లోని స్టామ్ఫర్డ్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కంపెనీ 1932లో తొలుత ఆర్థిక సేవల సంస్థగా ప్రారంభమైంది. తర్వాతికాలంలో ఆరోగ్య, గృహవసతులు, రీటైల్ తదితర రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం ఇందులో దాదాపు ఇరవైవేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ తన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, ఉద్యోగులు ఇంటి నుంచి కార్యాలయానికి రాకపోకలు జరపడానికి వీలుగా విద్యుత్ వాహనాలు, విద్యార్హతలను మెరుగుపరచుకోవాలనుకునే ఉద్యోగులకు ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చుల చెల్లింపు వంటి ప్రయోజనాలను అందిస్తోంది. అలాగే, ఉద్యోగులకు పిల్లలు పుడితే, తల్లిదండ్రులకు వేతనంతో కూడిన సెలవులు, సంతానలేమితో బాధపడే ఉద్యోగులకు ఐవీఎఫ్ చికిత్స ఖర్చులను కూడా చెల్లిస్తోంది. వీలైన వేళల్లో పనిచేసుకునే వెసులుబాటు, నిర్ణీత వేళల్లో పనిచేసేవారికి కూడా ప్రతి శుక్రవారం ‘ఫ్లెక్స్ ఫ్రైడే’ వెసులుబాటు తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఉద్యోగుల ఫీడ్బ్యాక్ ప్రకారం తన పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరచుకునే నిబద్ధత ‘సింక్రనీ’ని ఈ స్థాయికి తెచ్చింది. ఉద్యోగం చేయడానికి ఇది అద్భుతమైన సంస్థ అని ఇందులో పనిచేసే 94 శాతం ఉద్యోగులు చెబుతుండటమే దీని విజయానికి గీటురాయి.3 సిస్కోఇది కూడా అమెరికన్ బహుళజాతి సంస్థల్లో ఒకటి. కాలిఫోర్నియాలోని శాన్జోస్లో ప్రధాన కార్యాలయం గల ఈ కంపెనీ ఐటీ రంగంలో సేవలందిస్తోంది. నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ సహా పలు సాంకేతిక సేవలు అందించే ఈ కంపెనీ 1984లో ప్రారంభమైంది. ఉద్యోగులకు సంతృప్తికరమైన పనివాతావరణం కల్పించడానికి సిస్కో అనేక చర్యలను అమలు చేస్తోంది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పలు వసతులు కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఫీడ్బ్యాక్ ఆధారంగా వారికి ఆర్థిక ప్రయోజనాలను, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. పని ప్రదేశంలో మార్పు చేర్పులను ఉద్యోగుల అభిప్రాయాలకు అనుగుణంగా చేపడుతోంది. ఉద్యోగుల నైపుణ్యాల మెరుగుదల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తుండటం సిస్కో ప్రత్యేకత. ఉద్యోగుల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారికి తగిన ప్రయోజనాలను అందించడంలో ముందంజలో ఉండటమే సిస్కోను అత్యుత్తమ స్థాయికి చేర్చించింది. తమ అభిప్రాయాలకు యాజమాన్యం విలువనివ్వడం వల్ల ఈ సంస్థలోని ఉద్యోగులు పూర్తి సంతృప్తితో పనిచేసుకోగలుగుతున్నారు.4 అమెరికన్ ఎక్స్ప్రెస్ఆర్థిక సేవల రంగంలో 175 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ అమెరికన్ బహుళ జాతి కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లోని బఫెలో నగరంలో ఉంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ట్రావెలర్స్ చెక్కులు, బీమా, పర్యాటక రంగాల్లో ఈ కంపెనీ పనిచేస్తోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కంపెనీలో దాదాపు 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థలో పనిచేయడం తమ అదృష్టంగా ఉద్యోగులు భావిస్తారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగం వల్ల ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఉద్యోగులు కోరుకునే వేళల్లో పనిచేసే వెసులుబాటుతో పాటు వారు ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తోంది. సంతృప్తికరమైన వేతనాలు; ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించడానికి వీలుగా విద్యార్హతలు పొందడానికి చదువుకునే విద్యార్థులకు చదువుల ఖర్చుల చెల్లింపు; ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత ఆరోగ్య బీమా; పారదర్శకమైన నాయకత్వం ఈ సంస్థను అగ్రగామిగా నిలుపుతున్నాయి. ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగులందరికీ సమానావకాశాలు కల్పించడం; ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంలో తోడ్పాటునందించడం వంటి చర్యల ద్వారా ‘అమెరికన్ ఎక్స్ప్రెస్’ తన ఉద్యోగుల మనసులను చూరగొంటోంది.5 ఎన్విడీయాఐటీ రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ముప్పయ్యేళ్లకు పైగా పనిచేస్తున్న ఈ సంస్థ ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వైవిధ్యభరితమైన సేవలను అందిస్తోంది. చిప్స్ తయారీ, డిజైనింగ్, గేమింగ్, ఏఐ సహా పలు సేవలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది. ఎన్విడీయా కంపెనీలో దాదాపు 36 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకసారి ఇందులో ఉద్యోగంలో చేరాక మానేసే వారు అతి తక్కువ. ఉద్యోగ భద్రత, సంతృప్తికరమైన వేతనాలు, సంస్థలోని వివిధ బృందాలు ఉన్నా, ఏ బృందానికి ఆ బృందం స్వయంప్రతిపత్తితో పనిచేసేలా ప్రతి బృందానికి స్వేచ్ఛాయుత వాతావరణం, ఉద్యోగులు అందరూ ఒకేసారి సెలవులను ఆస్వాదించేలా వారాంతపు సెలవులు మాత్రమే కాకుండా, ప్రతి మూడునెలలకు ఒకసారి వరుసగా రెండు రోజులు సెలవులు, ప్రతి ఏడాదిలో ఇరవైరెండు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు తీసుకునే వెసులుబాటు ఈ సంస్థను ఉద్యోగుల పాలిటి ఉత్తమ సంస్థగా నిలుపుతున్నాయి. ఉద్యోగులకు నచ్చిన వేళల్లో పనిచేసుకునే వెసులుబాటు, వారి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఆర్థిక మద్దతు, దిగువ స్థాయి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని విధానపరమైన మార్పులు చేపట్టడం వంటి చర్యలు ఈ సంస్థను అగ్రగామిగా నిలుపుతున్నాయి.6 వెగ్మాన్జ్రిటైల్ రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళ జాతి సంస్థ న్యూయార్క్లోని రోషెస్టర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. జాన్ వెగ్మాన్, వాల్టర్ వెగ్మాన్ అనే సోదరులు 1916లో ఈ సంస్థను ప్రారంభించారు. ‘వెగ్మాన్జ్’ సంస్థకు ఇప్పుడు అమెరికాలో మొత్తం 111 సూపర్ మార్కెట్ స్టోర్లు ఉన్నాయి. ‘ఫార్చూన్’ పత్రిక 1998లో ‘బెస్ట్ కంపెనీస్ టు వర్క్’ జాబితాను విడుదల చేయడం ప్రారంభించిన నాటి నుంచి వెగ్మాన్ ఈ జాబితాలోని తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకుంటూ వస్తోంది. ఈ కంపెనీలో దాదాపు 54 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత, సంతృప్తికరమైన వేతనాలు, పనితీరు ఆధారంగా పదోన్నతులు, ప్రతి ఆరునెలలకు ఒకసారి వేతనాల పెంపు, యాజమాన్య నిర్ణయాల్లో పారదర్శకత, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఉచిత ఆరోగ్య బీమా, పనివేళలను కోరుకునే రీతిగా ఎంపిక చేసుకునే వెసులుబాటు, ఉద్యోగులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఇన్ని సౌకర్యాలు ఉండటం వల్ల ‘వెగ్మాన్జ్’ ఉద్యోగులు తమ యాజమాన్యం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.7 యాక్సెంచర్ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగానికి చెందిన ఈ బహుళ జాతి సంస్థ ఐర్లండ్ రాజధాని డబ్లిన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దాదాపు 120 దేశాలలో కార్యాలయాలు ఉన్న ఈ కంపెనీలో 7.79 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్ట్రాటజీ, కన్సల్టింగ్, ఆపరేషన్స్ తదితర సేవలు అందిస్తున్న ఈ కంపెనీ తన క్లయింట్స్కు ఎప్పటికప్పుడు కావలసిన పరిష్కారాలను అందించే దిశగా పరిశోధనలపై భారీగా ఖర్చు చేస్తుంది. ఉద్యోగులను నిరంతర అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తుంది. ప్రాజెక్టుల ఎంపికలోను, కెరీర్ రంగాల ఎంపికలోను, పనివేళల ఎంపికలోను ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తుంది. అధ్యయనానికి, సృజనాత్మకతకు పెద్దపీట వేయడమే కాకుండా, పనితీరు ఆధారంగా ఉద్యోగుల పురోభివృద్ధికి భరోసా కల్పిస్తుండటంతో ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేయడానికి ఇష్టపడతారు. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, పిల్లలు పుట్టినప్పుడు తల్లి దండ్రులకు వేతనంతో కూడిన సెలవులు మాత్రమే కాకుండా, సంతాన సాఫల్య చికిత్సలు పొందేవారికి, పిల్లలను దత్తత తీసుకునేవారికి కూడా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తుండటం ఈ కంపెనీ ప్రత్యేకత.8 మేరియట్ఆతిథ్య రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ మేరీలాండ్లోని బతీజ్దా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది మేరియట్ ఇంటర్నేషనల్ సంస్థకు వివిధ దేశాల్లో ఆరువందలకు పైగా హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ‘మనుషులే ప్రధానం’ సిద్ధాంతంతో పనిచేసే మేరియట్ సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి, సంతృప్తికి అత్యధికంగా ఖర్చు చేస్తుంది. కంపెనీ అంతర్గత వ్యవహారాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. ఉద్యోగులతో తరచు సమావేశాలు నిర్వహించడం, ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని, విధాన నిర్ణయాలలో మార్పులు చేయడం వంటి చర్యల ద్వారా మేరియట్ సంస్థ ఉద్యోగుల విశ్వాసాన్ని, అభిమానాన్ని చూరగొంటోంది. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతులు, బహుమతులు ఇవ్వడం, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, సెలవులలో ఉద్యోగులు పర్యటనలకు వెళ్లేటప్పుడు తమ హోటళ్లలో డిస్కౌంట్కు బస, ఆహార పానీయాలు అందించడం, ఉత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ చెల్లింపు, ఉద్యోగులకు కంపెనీలో వాటాల కేటాయింపు వంటి చర్యల ద్వారా మేరియట్లో పనిచేయడాన్ని ఉద్యోగులు గొప్ప అవకాశంగా భావిస్తారు.9 పినాకిల్ఆర్థిక సేవల రంగానికి చెందిన ఈ అమెరికన్ కంపెనీ టెనెసీలోని నాష్విల్లె ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, మార్టిగేజ్ తదితర సేవలను అందించే ఈ కంపెనీలో దాదాపు మూడున్నర వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలతో పాటు కంపెనీలో పరిమిత మొత్తాల మేరకు వాటాల కేటాయింపు; ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది లేని పనివేళలు; లక్ష్యాలను సాధించిన ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహకాలు; ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా; రిటైరైన ఉద్యోగులకు పింఛను చెల్లింపు; వేతనంతో కూడిన సెలవులు; ఉద్యోగులపై ఆధారపడే తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రత్యేక అలవెన్సు వంటి చర్యల ద్వారా పినాకిల్ సంస్థ ఉద్యోగులు పనిచేయడానికి అన్ని విధాలా అనువైన సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలుస్తోంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుండటం దీని విజయానికి నిదర్శనం.10 వరల్డ్ వైడ్ టెక్నాలజీసాంకేతిక రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ మిసోరీలోని మేరీలాండ్ హైట్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. అప్లికేషన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, స్ట్రాటెజిక్ రిసోర్సింగ్, గ్లోబల్ సప్లై చెయిన్, ఇంటిగ్రేషన్ నెట్వర్కింగ్ తదితర సేవలను అందిస్తున్న ఈ కంపెనీలో దాదాపు పన్నెండువేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలను చెల్లించడంతో పాటు వరల్డ్ వైడ్ టెక్నాలజీ కంపెనీ వారికి అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, ప్రమాద బీమా; ఉద్యోగ విరమణ తర్వాత జీవితం సజావుగా సాగడానికి రిటైర్మెంట్ పథకం; ఉద్యోగుల్లో ఎవరికైనా పిల్లలు పుడితే తల్లులతో పాటు తండ్రులకు కూడా వేతనంతో కూడిన సెలవులు; సంతాన సాఫల్య చికిత్సల కోసం ఆర్థిక సాయం, సెలవులు, పిల్లలను దత్తత చేసుకోవడానికి వేతనంతో కూడిన సెలవులు; అనువైన పనివేళలను ఎంపిక చేసుకునే వెసులుబాటు; నాయకత్వ శిక్షణ తదితర కార్యక్రమాల ద్వారా వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఉత్తమ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇందులో పనిచేసే వారిలో తొంభైఐదు శాతానికి పైగా ఉద్యోగులు పూర్తి సంతృప్తితో ఉన్నట్లు చెబుతారు.ఉద్యోగులు లోటులేని జీవితాలను గడపడానికి తగినట్లుగా సంతృప్తికరమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పనివేళల్లో వెసులుబాట్లు, వివిధ అవసరాలకు వేతనాలతో కూడిన సెలవులు, పనితీరుకు తగిన గుర్తింపు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల పట్ల పట్టింపు వంటి చర్యల ద్వారానే ఈ కంపెనీలు ఉద్యోగుల పాలిటి కల్పతరువుల్లా ఉంటూ అగ్రశ్రేణిలో నిలుస్తున్నాయి.
మొబైల్ చార్జర్ను ప్లగ్కే ఉంచుతున్నారా?
మొబైల్ చార్జర్ను కరెంట్ ప్లగ్లకే వేలాడేసి ఉంచడం.. చాలా ఇళ్లలో, ఆఫీసుల్లో కనిపించేదే. కొందరైతే స్విచ్ ఆన్లో ఉండగానే వాటిని అలా వదిలేస్తుంటారు. ఉరుకుల, పరుగుల జీవితమే అందుకు కారణమని సాకులు చెబుతుంటారు. అయితే ఇది తేలికగా తీసుకోవాల్సిన విషయమేమీ కాదని అంటున్నారు నిపుణులు. సెల్ఫోన్ చార్జర్లను ఇలా కరెంట్ ఫ్లగులకు వదిలేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల కొంచెం కొంచెంగా విద్యుత్ వినియోగం.. భారీ పరిమాణంలోనే జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వాటిని పరిశీలిస్తే.. 👉ఫాంటమ్ పవర్ వినియోగం (Phantom Power): చార్జర్కి ఫోన్ కనెక్ట్ చేయకపోయినా, చిన్న మొత్తంలో విద్యుత్ (0.1–0.5 వాట్) వినియోగం జరుగుతుంది. దీన్ని ‘వాంపైర్ ఎనర్జీ’ అంటారు. దీన్ని ఇలాగే లెక్కస్తే రోజులు.. నెలలు.. సంవత్సరాలకు కొన్ని యూనిట్లు వృథా అవుతాయన్నమాట.👉చార్జర్ లైఫ్ తగ్గే అవకాశం.. నిరంతరం విద్యుత్ ప్రవాహంలో ఉండటం వల్ల చార్జర్లోని అంతర్గత భాగాలు మెల్లగా దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల దీర్ఘకాలికంగా పనితీరు తగ్గుతుంది.👉ఇలా స్విచ్ బోర్డులకు, ఫ్లగ్గులకు చార్జర్లు వదిలేయడం సేఫ్ కూడా కాదు. కొన్నిసార్లు విద్యుత్తో అవి వేడెక్కే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నాణ్యత లేని చార్జర్లతో. దీనివల్ల ఫోన్లు పాడైపోవడం, పేలిపోవడం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. 👉పర్యావరణంపై ప్రభావం.. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అలవాటు ఎంత మందికి ఉందో?. అంటే.. చాలా విద్యుత్ వృథా అవుతుందన్నమాట. కాబట్టి విద్యుత్ వినియోగం అనేది చిన్న మొత్తంలో అయినా, పెద్ద మొత్తంలో అయినా.. పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదు.పాటించాల్సినవి.. తడి చేతులతో చార్జర్లను ఫోన్కు కనెక్ట్ చేయకూడదుఫోన్ చార్జింగ్లో లేనప్పుడు చార్జర్ను ప్లగ్ నుంచి తీసేయడం ఉత్తమంనాణ్యమైన చార్జర్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా వేడి, విద్యుత్ వృథా వంటి సమస్యలు తగ్గుతాయి.మార్కెట్లలోకి రకరకాల చార్జర్లు(ఒరిజినల్ వెర్షన్) వస్తున్నాయి. స్మార్ట్ ప్లగ్లు వాడితే, ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ చేయవచ్చు:::సాక్షి, వెబ్డెస్క్ఇదీ చదవండి: పవర్ ఆఫ్లో ఉన్నా మీ ఇంట్లో ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా?
'వారణాసి'లో మహేష్ బాబు.. టైటిల్ గ్లింప్స్ (ఫోటోలు)
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్లు ఎప్పటికీ మెప్పిస్తాయి. అయితే, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా సీజన్-3 వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం బాగుందని సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దర్శకులు తనూజ్ చోప్రా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్లో షెఫాలీ షా, హ్యుమా ఖురేషి, రసికా దుగ్గల్, రాజేష్ తైలాంగ్, యుక్తి తరేజా తదితరులు నటించారు. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. రెండూ భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. సీజన్-3లో హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడే ఓ మహిళను డీసీపీ (షెఫాలీ) ఎలా పట్టుకున్నారో చూపించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ బోర్ అనిపించదు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.కథేంటి..?అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ఒక ముఠాకు వ్యతిరేకంగా డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ), ఆమె బృందం చేసే పోరాటమే ఢిల్లీ క్రైమ్-3 కథ.. 2012లో జరిగిన బేబీ ఫలక్ కేసు నుండి ప్రేరణగా ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి కథ మొదలౌతుంది. 2012లో 15 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరుతుంది. బాలికను వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో ఆమె పుర్రె విరిగిపోయి, శరీరంపై మానవ కాటు గుర్తులు ఉన్నట్లు గుర్తించి షాక్ అవుతారు. తమ కెరీర్లో ఎప్పుడు కూడా ఇంతటి ఘోరమైన కేసును చూడలేదని డాక్టర్లు చెబుతారు. దీంతో బాలిక కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుంది. పోలీసుల ఎంట్రీతో కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసును ఛేదించేందుకు డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్ రంగంలోకి దిగుతుంది. ఇంతకు ఈ బాలికను ఆసుపత్రిలో చేర్పించింది ఎవరు అనే పాయింట్ నుంచి విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే అస్సాం నుండి ఒక ట్రక్లో కొన్ని వెపన్స్ వస్తున్నాయని ఆమెకు సమాచారం అందడంతో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రక్ను ఆపుతుంది. అయితే, ఆ ట్రక్లో వెపన్స్ బదులు పదుల సంఖ్యలో ఆడపిల్లలు ఉండడంతో షాక్ అవుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నట్లు వర్తికా గుర్తిస్తుంది. ఇక్కడి నుంచే ఆమె తీగలాగడం మొదలుపెడుతుంది. అమ్మాయిలను అక్రమంగా తరలిస్తుంది ఎవరు..? ఢిల్లీలో ఈ మూఠా వెనుకున్నది ఎవరు..? హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న బాలికకు ఈ ముఠాతో ఉన్న లింక్ ఏంటి..? 15 ఏళ్ల బాలికన అంత ఘోరంగా చిత్రహింసలు చేయడానికి కారణం ఏంటి.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరు..? ఫైనల్గా ఆ బాలిక బతికిందా..? వంటి అంశాలు తెలుసుకోవాలంటే డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్ చేసిన ఢిల్లీ క్రైమ్-3 ఇన్విస్టిగేషన్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..?క్రైమ్ ఇన్విస్టిగేషన్ సినిమాలు ఎప్పుడూ కూడా ఆసక్తిని కలిగించేలా ఉండాలి. ఈ విషయంలో దర్శకులు తనూజ్ చోప్రా విజయం సాధించారు. కేవలం 6 ఏపిసోడ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఎక్కువగా అనాథలు, పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలే ఈ మూఠా ఎలా టార్గెట్ చేస్తుంది అనే పాయింట్ను చాలా చక్కగా చూపించారు. అమ్మాయిలను ఆశ చూపించి కొన్ని ముఠాలు ఎలా కోట్లు సంపాదిస్తున్నాయో కూడా తెరపై కళ్లకు కట్టినట్లు చూపారు. ఆయుధాల మాదిరిగానే అమ్మాయిలు కూడా పాలు, నీళ్ల ట్యాంకర్లతో పాటు కంటెయినర్లలో ఎలా తరలిస్తారనేది దర్శకుడు ఈ కథలో చక్కగా ఆవిష్కరించారు. ఇలాంటి కేసులను ఛేదించేందుకు పోలీసులు ఎంత రిస్క్ చేస్తారనేది అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా మెప్పిస్తుంది. అస్సాం, హర్యానా, మిజోరాం, సూరత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలను ప్రధానంగా టచ్ చేస్తూ ఈ కథను నడిపించిన తీరు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. అమ్మాయిల జీవితాలను నాశనం చేసే ముఠాల నుంచి కాపాడటానికి ప్రాణాలకు తెగించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారనే విషయాన్ని ఈ సిరీస్ క్లియర్గా చూపుతుంది.ఢిల్లీ క్రైమ్-3 రియల్ స్టోరీ. కథ చాలా బలంగానే ఉంటుంది. అయితే, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ముఖ్యంగా క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో షెఫాలీ మరోసారి దుమ్మురేపింది. హ్యుమా, యుక్తి తరేజా తప్ప మిగతా కీలకపాత్రధారులందరూ పాత సీజన్లలో కనిపించినవారే కావడంతో ప్రేక్షకులు త్వరగానే కనెక్ట్ అవుతారు. కె-ర్యాంప్తో హిట్ కొట్టిన యుక్తి తరేజా ఈ సిరీస్లో దూకుడు స్వభావం గల లేడీ పోలీస్ ఆఫీసర్గా మెప్పించింది. ఈ సిరీస్కి ఒన్నాఫ్ ది హైలైట్ పాత్ర ఆమెదే అని చెప్పొచ్చు. ఇలాంటి కథలు చాలా థ్రిల్లింగ్ డ్రామాలా కొనసాగితే ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది. కానీ, ఈ విషయంలో కాస్త మైనస్ అని చెప్పాలి. కీలక సన్నివేశాల్లో తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు బాగా అంచనా వేయడంతో గొప్పగా సస్పెన్స్లకు ఛాన్స్ ఉండదు. కానీ, ఫైనల్గా అందరికీ ఢిల్లీ క్రైమ్-3 నచ్చుతుంది.
'వారణాసి'లో పవర్ఫుల్ దేవత.. రాజమౌళి ప్లాన్ అదుర్స్
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతోందా..?
ఓటీటీలో డ్యూడ్.. రెండు రోజుల్లోనే నంబర్వన్గా!
టేస్టీ తమలపాకు రైస్, అవకాడో లడ్డూ చేసేయండిలా..!
స్పా ముసుగులో వ్యభిచారం
కుప్పంలో దారుణం.. హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చి..
డాక్టరమ్మ తరుచూ విధులకు డుమ్మా
డిజిటల్ ప్రేమలు... డిస్కనెక్టెడ్ మనసులు...
జీఎస్టీ ఎఫెక్ట్.. నిరాశపరిచిన ఎక్సైడ్ ఇండస్ట్రీస్
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
హెచ్–1బీ పూర్తిగా బంద్
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆస్తిలాభం పొందుతారు
'బిగ్బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
'శివ' రీ రిలీజ్.. మొదటిరోజు అన్ని కోట్ల కలెక్షన్
అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
'వారణాసి'లో పవర్ఫుల్ దేవత.. రాజమౌళి ప్లాన్ అదుర్స్
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతోందా..?
ఓటీటీలో డ్యూడ్.. రెండు రోజుల్లోనే నంబర్వన్గా!
టేస్టీ తమలపాకు రైస్, అవకాడో లడ్డూ చేసేయండిలా..!
స్పా ముసుగులో వ్యభిచారం
కుప్పంలో దారుణం.. హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చి..
డాక్టరమ్మ తరుచూ విధులకు డుమ్మా
డిజిటల్ ప్రేమలు... డిస్కనెక్టెడ్ మనసులు...
జీఎస్టీ ఎఫెక్ట్.. నిరాశపరిచిన ఎక్సైడ్ ఇండస్ట్రీస్
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
హెచ్–1బీ పూర్తిగా బంద్
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ
'బిగ్బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆస్తిలాభం పొందుతారు
'శివ' రీ రిలీజ్.. మొదటిరోజు అన్ని కోట్ల కలెక్షన్
అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
సినిమా
‘రాజు వెడ్స్ రాంబాయి’ అలాంటి కథే : దర్శకుడు
‘‘2004లో జరిగిన ఓ వాస్తవ ఘటన గురించి నా చిన్నప్పుడు విన్నాను. ఆ నేపథ్యంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ రాసుకున్నాను. ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు... కానీ, అలాంటిదే. ప్రేమికులకు ఏం జరిగింది? అనేది మాత్రం తెరపైనే చూడాలి’’ అని డైరెక్టర్ సాయిలు కంపాటి తెలిపారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సాయిలు కం΄ాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్స్ వేణు ఊడుగుల, శ్రీకాంత్ అడ్డాలగార్ల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. వేణు ఊడుగుల అన్నకు నేను చెప్పిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ నచ్చడంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీ విన్ వాళ్లు కూడా మా ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా ఔట్పుట్ చూసి వేణు అన్న, బన్నీ వాసు, వంశీ నంది΄ాటిగార్లు సంతోషించారు. మా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. అందుకే ఈ నెల 21న ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నా ఒత్తిడిగా భావించడం లేదు. నా తదుపరి సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. వేణు అన్న ఓ నిర్మాతగా ఉంటారు. ఆ ్ర΄ాజెక్ట్ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.
చైతో బైక్ రైడ్ ఆఫర్.. ఇంట్లో నుంచి వచ్చేస్తానన్న రీతూ
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) స్టేజీపైకి కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్య (Naga Chaitanya) వచ్చేస్తున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో చై ఫుల్ ఎనర్జీతో స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. నాకు యాక్టింగ్తో పాటు రేసింగ్ అంటే పిచ్చి అని మీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఓ ఫెస్టివల్ ప్రారంభించారు. మెలికలు తిరిగిన రీతూఅందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ ఓనర్ని నేనే.. అని చై చెప్పడంతో నాగ్ (Nagarjuna Akkineni) సర్ప్రైజ్ అయ్యాడు. నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావ్? అని అడిగాడు. చైని చూడగానే రీతూ మెలికలు తిరిగిపోయింది. మీరంటే పిచ్చి, ఒక శిల్పాన్ని చెక్కినట్లే ఉంటారు అని చెప్పింది. దీంతో నాగ్ రీతూకి ఓ బంపరాఫర్ ఇచ్చాడు. చైతూకి బైక్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు హౌస్లో నుంచి బయటకు వస్తే చై నిన్ను బైక్ రైడ్కు తీసుకెళ్తాడు అని చెప్పాడు. రైడ్కు తీసుకెళ్తా..అంతే, రీతూ (Rithu Chowdary) ఎగిరి గంతేస్తూ సంతోషంగా బయటకు వచ్చేస్తానంది. అది చూసి ఆశ్చర్యపోయిన చై.. బిగ్బాస్ షో ఎందుకు వదులుకుంటావ్? గెలిచిన తర్వాత కూడా నిన్ను రైడ్కు తీసుకెళ్లొచ్చు అన్నాడు. అందుకు రీతూ.. మిమ్మల్ని జోష్ నుంచి గెల్చుకుందామనుకుంటున్నా అని అమాయకంగా ముఖం పెట్టింది. అది చూసి తండ్రీకొడుకులిద్దరూ ఏం మాట్లాడలేక నవ్వుకున్నారు. చదవండి: చిరంజీవితో సినిమా షూటింగ్.. నన్ను నేను థూ అని..
ఈ రోజు నా మాటలను నాన్న వింటుంటారు: మహేశ్ బాబు
‘‘నాన్నగారంటే (సూపర్స్టార్ కృష్ణ) నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పిన ప్రతి మాటని గౌరవించాను, పాటించాను. కానీ ఒక్కటి మాత్రం చేయలేదు. ఆయన నన్నెప్పుడూ పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. ఆ మాట నేను వినలేదు. ఈ రోజు నా మాటల్ని ఆయన వింటుంటారు (‘వారణాసి’లో మహేశ్ చేసిన రుద్ర పాత్రకు పౌరాణికం టచ్ ఉంది). నాన్న ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉంటాయి. ‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంతా పడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అని భావోద్వేగంగా మాట్లాడారు మహేశ్బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న చిత్రానికి ‘వారణాసి’ టైటిల్ ఖరారైంది. శనివారం హైదరాబాద్లో ‘గ్లోబ్ట్రోటర్’ ఈవెంట్ పేరిట చిత్రయూనిట్ నిర్వహించిన కార్యక్రమంలో ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. çపృథ్వీరాజ్ సుకుమారన్ , ప్రియాంకా చోప్రా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయేంద్రప్రసాద్, కంచి కథ అందించారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదల కానుంది. ఈ వేడుకలో మహేశ్బాబు మాట్లాడుతూ– ‘‘ఈ వేదికపైకి సింపుల్గా నడిచొస్తానంటే రాజమౌళిగారు కుదరదన్నారు... చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో (బొమ్మ నందిపైన కూర్చుని వస్తున్నట్లుగా). ఇదంతా మీకోసమే (అభిమానులు). మీరంతా మమ్మల్ని స΄ోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అప్డేట్స్... అప్డేట్స్ అన్నారు. అవి ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. అవి చూస్తుంటే నాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ముందు ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీరంతా ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అభిమానులందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటే మేమంతా చాలా సంతోషంగా ఉంటాం’’ అని తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నాకు చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం తెలియదు. చిన్నప్పుడు ఎన్టీఆర్గారి అభిమానిని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక... సినిమా ఏంటో అర్థమయ్యాక కృష్ణగారి గొప్పదనం తెలిసింది. ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారులను బ్రేక్ చేసుకుంటూ, ఎన్నో దారులు వేసుకుంటూ వెళ్లాలి. ఇక నిన్న (శుక్రవారం) రాత్రి మా సినిమా వీడియోను టెస్ట్ చేయాలనుకున్నాం. లీక్ కాకూడదని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డ్రోన్స్తో వీడియోలు తీసి, నెట్లో పెట్టడం మొదలుపెట్టారు. ఈ వీడియోను ఎంతో దూరం నుంచి వచ్చిన ఆడియన్స్ కోసం ఈ రోజు మేం ప్లే చేద్దామనుకున్నాం. ఇక మహేశ్బాబు నుంచి మనందరం నేర్చుకునే ఒక గుణం ఉంది. మనందరికీ సెల్ఫోన్ ఎడిక్షన్ ఉంది. ఆఫీసుకు వచ్చినా, షూటింగ్కు వచ్చినా సెల్ఫోన్ పట్టుకోడు. 8 గంటలైనా, 10 గంటలైనా తన సెల్ఫోన్ కారులోనే ఉంటుంది. మళ్లీ కారు ఎక్కితేనే మహేశ్ తన ఫోన్ టచ్ చేస్తాడు. మనందరం ఇది నేర్చుకోవాలి. మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాను. మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పాను. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఫస్ట్ డే మహేశ్కి రాముడి వేషం వేసి, ఫొటోషూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. సినిమాలోని ఆ ఎపిసోడ్ను 60 రోజులు షూట్ చేశాం. నా సినిమాల్లో మోస్ట్ మెమొరబుల్ సీక్వెన్స్గా అది ఉండబోతోంది. మీరు ఊహించనంత అందంగా, పరాక్రమంగా, కోపంగా, దయార్ద్ర హృదయంతో ఉంటాడు మహేశ్. ఈ ఎసిసోడ్ షూట్ చేసినందుకు నేను చాలా లక్కీ’’ అన్నారు.ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ– ‘‘కొంత గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మందాకిని పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్న రాజమౌళిగారికి థ్యాంక్స్. మహేశ్బాబుగారు, ఆయన ఫ్యామిలీ... నేను హైదరాబాద్ని మరో ఇల్లుగా భావించేలా చేశారు’’ అని అన్నారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం రాజమౌళిగారి నుంచి నాకో మెసేజ్ వచ్చింది. ఆయన చెప్పిన ఐదు నిమిషాల నరేషన్ విని మైండ్ బ్లో అయ్యింది. ఇండియన్ సినిమా లిమిట్స్ దాటేలా ఈ చిత్రకథ, రాజమౌళి విజన్ ఉంటాయి’’ అని చెప్పారు.ఎమ్ఎమ్ కీరవాణి మాట్లాడుతూ– ‘‘కీరవాణిగారు మెలోడీ బాగా కొడతారు. కానీ బీట్ కాస్త స్లోగా ఉంటుందన్న పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఈసారి మెలోడీ నాదే. బీటూ నాదే’’ అని చెప్పారు.కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఉంది. మహేశ్బాబు విశ్వరూపాన్ని చూస్తూ నేనలా ఉండిపోయాను. డబ్బింగ్ లేదు... సిజీ లేదు... రీ రికార్డింగ్ లేదు... అయినా నన్ను మంత్రముగ్దుడ్ని చేసింది ఆ సీన్... మర్చిపోలేను. మీరు (ఆడియన్స్) కూడా చక్కని అనుభూతి చెందుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడు’’ అని చెప్పారు కార్తికేయ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా గ్లోబల్ ప్లాట్ఫామ్పై నా తొలి స్పీచ్ ఇది. చాలా గౌరవంగా ఉంది. మన ఇండియా వైపు గ్లోబల్ ఆడియన్స్ చూసేలా, మన ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.కేఎల్ నారాయణ మాట్లాడుతూ– ‘‘పదిహేనేళ్ల క్రితం మహేశ్బాబు, రాజమౌళిగార్లతో సినిమా చేయాలనుకుని, వారిని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇంత టైమ్ పడుతుందని రాజమౌళి గారు, నేనూ ఊహించలేదు. ఇప్పుడు నా కల నిజమైంది’’ అన్నారు.ఈ వేడుకలో నమ్రత, సితార, రమా రాజమౌళి, సుప్రియ, కంచి, దేవ కట్టా, ఫైట్ మాస్టర్ సాల్మన్ లతో ΄పాటు పలువురు సినీ ప్రముఖలు పాల్గొన్నారు.
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్.. లాగిన్ వివరాలు ఇచ్చేసిన రవి
సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ (i-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేపించారు. విచారణలో భాగంగా అతని నుంచి వెబ్ లాగిన్స్తో పాటు సర్వర్ వివరాలను తీసుకుని మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు వెబ్సైట్లు ఓపెన్ కావడం లేదు. కూకట్పల్లిలోని అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ను నిలిపివేశారు.ఐబొమ్మ నిర్వహుకుడు ఇమ్మడి రవి గతంలో పోలీసులకు ఛాలెంజ చేశాడు. తన వద్ద కోట్లమంది డేటా ఉందని తనను టార్గెట్ చేస్తే ఏం చేయాలో తెలుసు అంటూ హెచ్చరించాడు. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అతని ఆదీనంలో ఉన్న వందల హార్డ్ డిస్క్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతన్ని మెజిస్ట్రేట్ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ను పోలీసులు దాఖలు చేయనున్నారు. ఇమ్మడి రవిపై ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఫిలిం చాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతల ఫిర్యాదులతో ఈ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకొని బెదిరింపులకు కూడా ఇమ్మడి రవి పాల్పడినట్లు తెలుస్తోంది.
న్యూస్ పాడ్కాస్ట్
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
క్రీడలు
ఐసీయూలో శుబ్మన్ గిల్!.. టీమిండియాకు ఊహించని షాక్!
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) గాయం తీవ్రతరమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు తొలి టెస్టులో మిగిలిన ఆటకు.. రెండో టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.బిజీబిజీకాగా టెస్టు, వన్డే సారథి గిల్ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఆసియా టీ20 కప్ టోర్నీ ముగిసిన వెంటనే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ (IND vs SA)లో భారత జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.కోల్కతాలో సఫారీ జట్టుతో శుక్రవారం మొదలైన టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. అయితే, శనివారం నాటి ఆట సందర్భంగా కెప్టెన్ గిల్ మెడకు గాయమైంది. నాలుగో నంబర్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చిన గిల్ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.నొప్పి ఎక్కువగా ఉండటంతోప్రొటిస్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్కు మెడపట్టేసింది. వెంటనే ఫిజియో వచ్చి గిల్ను పరిశీలించాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో గిల్ను డ్రెసింగ్రూమ్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత గాయం తీవ్రత దృష్ట్యా అతడిని కోల్కతాలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.ఐసీయూలో చికిత్సఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. గిల్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. అయితే, ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యగానే వైద్యుల సమక్షంలో ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు వెల్లడించాయి.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానేగిల్ కోసం ప్రత్యేకంగా డాక్టర్స్ ప్యానెల్ ఏర్పాటైందని.. క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అతడిని పరిశీలిస్తున్నారని తెలిపాయి. ప్రస్తుతం గిల్ వుడ్లాండ్స్ ఆస్పత్రిలో ఉన్నాడని.. పెద్దగా సమస్య లేకపోయినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు కేర్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఏదేమైనా వైద్య పరీక్షలు పూర్తైన తర్వాతే అతడు మళ్లీ మైదానంలో దిగుతాడా? లేదా? అన్నది తేలుతుందని తెలిపాయి.కాగా తొలి ఇన్నింగ్స్లో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన గిల్.. ఆ తర్వాత కూడా మళ్లీ బ్యాటింగ్కు రాలేదు. దీంతో అతడిని రిటైర్డ్ అవుట్గా ప్రకటించారు. ఈ మ్యాచ్లో భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో కేవలం 93 పరుగులు చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.బీసీసీఐ అప్డేట్గిల్ తొలి టెస్టుకు దూరమయ్యాడని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడని తెలిపింది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.చదవండి: IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
IPL 2026: జడేజా జెర్సీ మారింది
ముంబై: ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్లలో ఒకటైన చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) పెనుమార్పే చేసింది. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో చతికిలబడిన ఈ జట్టు వచ్చే సీజన్కు ముందు పతాక శీర్షికలకెక్కే నిర్ణయం తీసుకుంది. అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను అనూహ్యంగా బదిలీ చేసేసింది. సీఎస్కే దిగ్గజ కెప్టెన్ ధోని స్వయంగా ‘సర్ రవీంద్ర జడేజా’ అంటూ నెత్తిన పెట్టుకున్న సహచరుణ్ని... టాపార్డర్ డాషింగ్ బ్యాటర్ సంజూ సామ్సన్ కోసం రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ ట్రాన్స్ఫర్ చేసింది. రాయల్స్ జడేజాను తీసుకోగా, సామ్సన్ చెన్నై చెంత చేరాడు. మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) తమ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ను విడుదల చేసింది. రెండుసార్లు రిటెయిన్ చేసుకున్న ఫ్రాంచైజీ ఎట్టకేలకు కరీబియన్ ఆల్రౌండర్తో 11 ఏళ్ల బంధాన్ని తెంచుకుంది. రూ.23.75 కోట్లు వేలంలో పాడి మరీ కొనుక్కొన్న వెంకటేశ్ అయ్యర్ను వెంటనే ఒక సీజన్కే సాగనంపింది. సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వెటరన్ సీమర్ మొహహ్మద్ షమీని లక్నో సూపర్ జెయంట్స్ ట్రేడ్లో తీసుకుంది. మొత్తం పది ఫ్రాంచైజీల్లో అత్యధిక పర్స్ మొత్తం కోల్కతా వద్దే ఉంది. కేకేఆర్ పర్స్లో రూ. 64.30 కోట్లుండగా, 6 విదేశీ ఆటగాళ్లు సహా 13 మందిని వేలంలో కొనాలి. అత్యల్ప పర్స్ ముంబై జట్టులో ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద కనీసం మూడు కోట్లయినా లేవు. చేతిలో ఉన్న రూ.2.75 కోట్లతో ఒక విదేశీ ప్లేయర్ సహా ఐదు మందిని కొనుగోలు చేయాలి. చెప్పుకోదగ్గ మార్పులు చెన్నై ఒక్క జడేజాతో సరిపెట్టలేదు. విదేశీ స్టార్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, స్యామ్ కరన్లాంటి హిట్టర్లతో పాటు ‘యార్కర్ స్పెషలిస్ట్’ పతిరణను వదులుకుంది. కేకేఆర్ రసెల్, అయ్యర్, డికాక్, మొయిన్ అలీలాంటి బ్యాటర్లతో పాటు సఫారీ పేసర్ నోర్జేని సాగనంపింది. పంజాబ్ కింగ్స్ మేటి విదేశీ హిట్టర్లను విడుదల చేసింది. మ్యాక్స్వెల్, ఇన్గ్లిస్లను వదిలేసుకుంది. తొలి సీజన్ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ తమ తురుపుముక్క, నాలుగు సీజన్లు జట్టును నడిపించిన సంజూ సామ్సన్నే కాదు హసరంగ, తీక్షణ, నితీశ్ రాణాలను వద్దనుకుంది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను వేలంలో ఏ జట్టు కన్నెత్తి చూడకపోయినా ప్రాథమిక ధరకే కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఈసారి అర్జున్ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్లో కొనేందుకు సమ్మతించింది.పాత గూటికి... సీఎస్కేతో జడేజా బంధం సుదీర్ఘమైందే కానీ... మొదలైంది మాత్రం రాజస్తాన్ రాయల్స్తోనే! లీగ్ మొదలైన ఏడాదే (2008) తొలి చాంపియన్గా నిలిచిన రాయల్స్ జట్టు సభ్యుడు జడేజా ఆ మరుసటి ఏడాది కూడా రాజస్తాన్తోనే ఉన్నాడు. కానీ కాంట్రాక్టు ఒప్పందం ఉల్లంఘన కారణంతో 2010లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనిపై ఏడాది నిషేధం విధించింది. 2011లో కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళ (ఇప్పుడు లేదు)కు ఆడాడు. 2012 నుంచి ఈ సీజన్ వరకు మధ్యలో రెండేళ్లు (2016, 2017లో సీఎస్కేపై నిషేధం కారణంగా గుజరాత్ లయన్స్) తప్ప సూపర్కింగ్స్లో విజయవంతమైన ఆల్రౌండర్గా ఉన్నాడు.ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాచెన్నై: రవీంద్ర జడేజా, ఆండ్రీ సిద్ధార్్థ, దీపక్ హుడా, కాన్వే, రచిన్ రవీంద్ర, పతిరణ, స్యామ్ కరన్, కమలేశ్ నాగర్కోటి, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వంశ్ బేడీ, విజయ్ శంకర్. ఢిల్లీ: డొనోవాన్ ఫెరీరా, దర్శన్, డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, మన్వంత్, మోహిత్ శర్మ, సిద్దీఖుల్లా. గుజరాత్: రూథర్ఫర్డ్, షనక, కొయెట్జీ, కరీమ్, కుల్వంత్, మహిపాల్ లామ్రోర్. కోల్కతా: రసెల్, వెంకటేశ్ అయ్యర్, నోర్జే, చేతన్ సకారియా, సిసోడియా, మొయిన్ అలీ, డికాక్, గుర్బాజ్, జాన్సన్. లక్నో: శార్దుల్ ఠాకూర్, డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాశ్దీప్, షామర్ జోసెఫ్, ఆర్యన్, యువరాజ్, రాజ్యవర్ధన్. ముంబై: అర్జున్ టెండూల్కర్, జాకబ్స్, కరణ్ శర్మ, లిజాద్, ముజీబుర్ రహ్మాన్, టోప్లీ, శ్రీజిత్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్. పంజాబ్: మ్యాక్స్వెల్, ఇన్గ్లిస్, ఆరోన్, జేమీసన్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే. రాజస్తాన్: సామ్సన్, నితీశ్ రాణా, ఆకాశ్, అశోక్, ఫజల్హక్, కార్తీకేయ, కునాల్ రాథోడ్, తీక్షణ, హసరంగ. బెంగళూరు: లివింగ్స్టోన్, ఇన్గిడి, మయాంక్ అగర్వాల్, మనోజ్, స్వస్తిక్ చికారా, మోహిత్ రాఠి. హైదరాబాద్: షమీ, అథర్వ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ముల్డర్, ఆడమ్ జంపా, సిమర్జీత్, రాహుల్ చహర్.
క్రొయేషియా ఏడోసారి...
రిజెకా: పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ ఆరో విజయం సాధించిన క్రొయేషియా జట్టు... వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు అర్హత పొందింది. యూరోపియన్ క్వాలిఫయింగ్లో భాగంగా గ్రూప్ ‘ఎల్’లో ఫారో ఐలాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో క్రొయేషియా 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. క్రొయేషియా తరఫున గ్వార్డియోల్ (23వ నిమిషంలో), మూసా (57వ నిమిషంలో), వ్లాసిక్ (70వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఫారో ఐలాండ్స్ జట్టుకు టూరి (16వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఐదు జట్లన్న గ్రూప్ ‘ఎల్’లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న క్రొయేషియా ఆరు విజయాలు నమోదు చేసి, ఒక మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. 19 పాయింట్లతో గ్రూప్ విజేతగా అవతరించింది. 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెక్ రిపబ్లిక్ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్కు అర్హత సాధించింది. 1998లో తొలిసారి ప్రపంచకప్ టోషిర్నీలో ఆడిన క్రొయేషియా మూడో స్థానం సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2002, 2006 ప్రపంచకప్లలో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2010 ప్రపంచకప్ టోషిర్నీకి అర్హత పొందడంలో విఫలమైన క్రొయేషియా 2014లో గ్రూప్ దశలో ని్రష్కమించింది. 2018 ప్రపంచకప్లో తొలిసారి ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచిన క్రొయేషియా, 2022 ప్రపంచకప్లో మూడో స్థానాన్ని సంపాదించింది. ఇప్పటికి 30 జట్లు... అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు ఉమ్మడిగా నిర్వహించే 2026 ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి 48 దేశాలు పోటీపడతాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లు క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడకుండానే నేరుగా అర్హత పొందాయి. ఇప్పటి వరకు మొత్తం 30 జట్లు ప్రపంచకప్ టోర్నీ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. ఆఫ్రికా నుంచి అల్జీరియా, కెపె వెర్డె, ఈజిప్్ట, ఘనా, ఐవరీ కోస్ట్, మొరాకో సెనెగల్, దక్షిణాఫ్రికా, ట్యూనిషియా... ఆసియా నుంచి ఆ్రస్టేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, ఖతర్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్... యూరోప్ నుంచి ఇంగ్లండ్, ఫ్రాన్స్, క్రొయేషియా... ఓసియానియా నుంచి న్యూజిలాండ్... దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు అర్హత సాధించాయి.
శుభం కార్డు నేడే?
ఔరా... క్రికెట్! ఇదేం వికెట్! బ్యాటింగ్ ఫ్రెండ్లీ క్రికెట్లో గేమ్ ఛేంజర్లంతా బ్యాటర్లే! మెరుపులైనా, సునామీలైనా బ్యాట్లతోనే చూశాం. కానీ ఈడెన్ గార్డెన్స్ టెస్టు చూస్తే మాత్రం ‘ఇది గతం... బౌలర్లు ఘనం’ అనక తప్పదు! ఎందుకంటే బౌలింగ్ జోరు ఒక సెషన్కే సరిపెట్టుకోలేదు... ఓ రోజుకే పరిమితం కాలేదు. వరుసగా ఆరు సెషన్లు బ్యాట్లు డీలా... బ్యాటర్లు విలవిలలాడేలా బౌలర్లు భళా అనిపించారు. సంప్రదాయ క్రికెట్కే కొత్త ఉత్తేజాన్నిచ్చేలా... మూడు రోజుల్లోనే ఫలితం వచ్చేలా ఇరు జట్ల బౌలర్లు గ్రే‘టెస్టు’ క్రికెట్ ఆడుతున్నారు. కోల్కతా: మార్క్రమ్ 31... కేఎల్ రాహుల్ 39... తొలి రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా, భారత్ ఓపెనర్లు చేసిన పరుగులివి! రెండు జట్ల ఇన్నింగ్స్ల్లో టాప్ స్కోర్లు కూడా ఇవే! టెస్టులో రెండు సెషన్లు ఆడితే సెంచరీ... రెండో రోజు నిలబడితే డబుల్ సెంచరీ, ఆ రోజంతా అజేయంగా నిలిస్తే ట్రిపుల్ సెంచరీ... జెంటిల్మెన్ క్రికెట్లో సర్వసాధారణమిది. కానీ రెండు రోజుల్లో మూడో ఇన్నింగ్స్ (ఒక జట్టు రెండో ఇన్నింగ్స్)లైనా కూడా ఫిఫ్టీ కాదు కదా కనీసం 40 పరుగులైనా చేయకపోతే అది ముమ్మాటికీ బౌలింగ్ సత్తానే కాక మరేమిటి! ధనాధన్ షో చూసిన వారికి ఫటాఫట్ వికెట్లు, ఆలౌట్ మీద ఆలౌట్లు కనబడుతున్నాయి. ఎంత పటిష్ట బ్యాటింగ్ లైనప్లతో దిగినా... స్పిన్ బౌలింగ్–బ్యాటింగ్ ఆల్రౌండర్లను మోహరించినా... బంతి శాసిస్తోంది ఈ టెస్టుని! క్రీజులోని బ్యాటర్లకు ప్రతీ బంతికి పెడుతోంది అగ్నిపరీక్షని! రెండో సెషన్లోనే భారత్ కూలింది! భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఈడెన్గార్డెన్స్లో మొదలైన మొదటి టెస్టులో బంతి సవాల్ విసురుతోంది. ఓవర్నైట్ స్కోరు 37/1తో శనివారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో సెషన్ అయినా పూర్తిగా ఆడలేక 62.2 ఓవర్లలోనే తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకే కుప్పకూలింది. దీంతో మొదటి రోజే టెస్టుపై పట్టుబిగించిందనుకున్న ఆతిథ్య జట్టుకు... పట్టుబిగించింది మన జట్టు కాదు... బౌలర్లు అన్న విషయం రెండో రోజు రెండో సెషన్లోనే అర్థమైంది. రాహుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) ఈ ఓవర్నైట్ బ్యాటింగ్ జోడీ చేసిన 57 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యమే అతి పెద్ద పార్ట్నర్షిప్! రిషభ్ పంత్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్లు), జడేజా (27; 3 ఫోర్లు)లు రెండు పదుల స్కోర్లు దాటారు. ఇక పర్యాటక బౌలర్లలో హార్మర్ 4, యాన్సెన్ 3 వికెట్లు తీశారు. జడేజా ఉచ్చులో పడి... భారత్కు తొలి ఇన్నింగ్స్లో 30 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మెడకు జడేజా స్పిన్ ఉచ్చు బిగించాడు. తొలిరోజు బుమ్రా, సిరాజ్ల పేస్ అదిరిపోవడంతో వెనుకబడిన జడేజా... స్పిన్, తన విశేషానుభవాన్ని వినియోగించి సఫారీ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. దీంతో ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 93/7 స్కోరు చేసిన దక్షిణాఫ్రికా ఆలౌటయ్యేందుకు సిద్ధమైపోయింది. కెప్టెన్ బవుమా (29 బ్యాటింగ్, 3 ఫోర్లు) తప్ప ఇంకెవరూ 20 పరుగులైనా చేయలేకపోయారు. కెపె్టన్తో పాటు బాష్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జడేజా 4 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్కు 2, అక్షర్కు ఒక వికెట్ దక్కాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.92 టెస్టుల్లో రిషభ్ పంత్ కొట్టిన సిక్స్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారతీయ బ్యాటర్గా రిషభ్ పంత్ గుర్తింపు పొందాడు. 91 సిక్స్లతో వీరేంద్ర సెహ్వాగ్ (103 టెస్టుల్లో) పేరిట ఉన్న రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. పంత్ 48 టెస్టుల్లోనే సెహ్వాగ్ను దాటేశాడు.2 తొలి ఇన్నింగ్స్లో 27 పరుగులు చేసిన క్రమంలో రవీంద్ర జడేజా టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయిని దాటాడు. తద్వారా కపిల్ దేవ్ తర్వాత టెస్టుల్లో 4000 పరుగులు చేయడంతోపాటు 300 వికెట్లు పడగొట్టిన రెండో భారతీయ క్రికెటర్గా, ఓవరాల్గా నాలుగో క్రికెటర్గా జడేజా గుర్తింపు పొందాడు.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) యాన్సెన్ 12; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) కేశవ్ 39; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 29; గిల్ (రిటైర్డ్హర్ట్) 4; పంత్ (సి) వెరీన్ (బి) బాష్ 27; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్మర్ 27; ధ్రువ్ జురేల్ (సి అండ్ బి) హార్మర్ 14; అక్షర్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 16; కుల్దీప్ యాదవ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సిరాజ్ (బి) యాన్సెన్ 1; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 18; మొత్తం (62.2 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–18, 2–75, 3–109, 4–132, 5–153, 6–171, 7–172, 8–187, 9–189. బౌలింగ్: యాన్సెన్ 15–4–35–3, ముల్డర్ 5–1–15–0, కేశవ్ మహరాజ్ 16–1–66–1, కార్బిన్ బాష్ 11–4–32–1, సైమన్ హార్మర్ 15.2– 4–30–4. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 11; మార్క్రమ్ (సి) జురేల్ (బి) జడేజా 4; ముల్డర్ (సి) పంత్ (బి) జడేజా 11; తెంబా బవుమా (బ్యాటింగ్) 29; డి జోర్జి (సి) జురేల్ (బి) జడేజా 2; స్టబ్స్ (బి) జడేజా 5; కైల్ వెరీన్ (బి) అక్షర్ పటేల్ 9; మార్కో యాన్సెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 13; కార్బిన్ బాష్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (35 ఓవర్లలో 7 వికెట్లకు) 93. వికెట్ల పతనం: 1–18, 2–25, 3–38, 4–40, 5–60–, 6–75, 7–91. బౌలింగ్: బుమ్రా 6–1–14–0, అక్షర్ 11–0–30–1, కుల్దీప్ 5–1–12–2, రవీంద్ర జడేజా 13–3–29–4.
బిజినెస్
పెన్షన్ ప్లాన్లపై యువతలో అవగాహన పెరగాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా 25–40 ఏళ్ల వయస్సు వారు పెన్షన్ అనే మాట వినడానికి పెద్దగా ఇష్టపడకపోయినప్పటికీ, పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా ఎంతగానో ఉపయోగకరంగా ఉండే దీని ప్రాధాన్యత గురించి యువత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పీఎఫ్ఆర్డీఏ చైర్పర్సన్ ఎస్.రామన్ తెలిపారు. ప్రస్తుతం 55 కోట్ల మంది పైగా వర్క్ఫోర్స్ ఉండగా, కేవలం 10 కోట్ల మందే సంఘటిత రంగంలో ఉన్నారని శుక్రవారమిక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. మిగతా 30–40 కోట్ల మంది అసంఘటిత రంగంలోనే ఉంటున్నారని, వారందరినీ కూడా పెన్షన్ ఫండ్ పరిధిలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొందని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్లు గణనీయంగా రాబడులు అందిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్థిక భద్రతకు అధిక రాబడుల కోసం పోంజీ స్కీముల్లాంటి వాటి వలలో పడకుండా సురక్షితమైన పెన్షన్ ఫండ్ను ఎంచుకోవడం శ్రేయస్కరమని వివరించారు. మరోవైపు గిగ్ వర్కర్లకు కూడా సామాజిక భద్రతను కల్పించే విధంగా చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు.
ఆసియా పసిఫిక్లో కీలకంగా భారత్
బ్యాంకాక్: ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ వృద్ధికి భారత్, చైనా కీలకంగా నిలుస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఆసియా పసిఫిక్ ఎయిర్లైన్స్ (ఏఏపీఏ) వెల్లడించింది. ప్యాసింజర్, కార్గోలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో 2026లో కూడా పరిశ్రమ వృద్ధి సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఏఏపీఏ డైరెక్టర్ జనరల్ సుభాష్ మీనన్ తెలిపారు. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ 10 శాతం పెరిగిందని వివరించారు. 2025 తొలి ఆరు నెలల్లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే, వచ్చే ప్రయాణికుల సంఖ్య 16 శాతం వృద్ధి చెందిందని 69వ అసెంబ్లీ ఆఫ్ ప్రెసిడెంట్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశీ మార్కెట్ విస్తరించేందుకు భారీగా అవకాశాలు ఉన్నాయని చెప్పా రు. చారిత్రకంగా చూస్తే భారతీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా చాలా కీలకమైనదని, అది నిలదొక్కుకోవడానికి కాస్త సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని మీనన్ చెప్పారు. సరఫరా వ్యవస్థపరంగా అంతరాయాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆసియా పసిఫిక్ ఎయిర్లైన్స్ డిమాండ్కి తగ్గ స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయ న పేర్కొన్నారు. ఏఏపీఏలో ఎయిరిండియా సహా 18 విమానయాన సంస్థలకు సభ్యత్వం ఉంది. నాలుగు తీర్మానాల ఆమోదం.. సదస్సు సందర్భంగా ఏఏపీఏ నాలుగు తీర్మానాలను ఆమోదించింది. సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లను అధిగమించడం, విమానాల్లో లిథియం బ్యాటరీలను తీసుకెళ్లడం, పన్నులు..చార్జీలు, పర్యావరణహితమైన విధంగా ఏవియేషన్ కార్యకలాపాలు సాగించడంలాంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ప్రాంతీయంగా ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్) కార్యకలాపాలు పెరిగేలా నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవడం, తయారీ సామర్థ్యాలు పెంచుకునేందుకు ఊతమివ్వడం, నిర్దిష్ట పెట్టుబడులకు ప్రోత్సాహకాలివ్వడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఏఏపీఏ కోరింది. అలాగే పునరి్వనియోగానికి పనికొచ్చే ఎయిర్క్రాఫ్ట్ మెటీరియల్స్ను రీసైకిల్ చేసేలా సర్క్యులర్ ఎకానమీ విధానాలను అమల్లోకి తేవొచ్చని పేర్కొంది. ఎయిర్లైన్స్కి అండగా ఉండాలి: ఐఏటీఏ సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లతో విమానాల డెలివరీలకు అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఎయిర్లైన్స్కి విమానయాన పరిశ్రమలోని వివిధ విభాగాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్‡్ష తెలిపారు. టారిఫ్లు, ఇతరత్రా అంశాల కారణగా విమానాల తయారీ సంస్థలు (ఓఈఎం) ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్లైన్స్ మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయని, మరోవైపు ఓఈఎంల మార్జిన్లు అధిక స్థాయిలో ఉంటాయని వాల్‡్ష తెలిపారు. మిగతా వర్గాలు లాభాలార్జించడంపై తమకే అభ్యంతరం లేదు కానీ పరిశ్రమలో సమతౌల్యత అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సరఫరా వ్యవస్థపై టారిఫ్లు ప్రతికూల ప్రభావం చూపుతాయని సుభాష్ మీనన్ చెప్పారు. వీటి వల్ల విమానయాన సంస్థల ఇంధనేతర వ్యయాలు కూడా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. టారిఫ్ల వల్ల ఇటు సరఫరా, అటు డిమాండ్ మీద ప్రభావం పడుతుందన్నారు. కన్సలి్టంగ్ సంస్థ ఆలివర్ వైమాన్తో కలిసి ఐఏటీఏ నిర్వహించిన అధ్యయనం ప్రకారం సరఫరా వ్యవస్థ సవాళ్ల కారణంగా 2025లో అంతర్జాతీయంగా ఎయిర్లైన్స్ పరిశ్రమపై 11 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. అక్టోబర్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇంధనం అధికంగా వాడాల్సి రావడం, అదనపు మెయింటెనెన్స్, మరింత ఎక్కువగా ఇంజిన్లను లీజుకు తీసుకోవడంలాంటి అంశాలపై విమానయాన సంస్థలు గణనీయంగా వెచి్చంచాల్సి రానుంది. 20 ఏళ్లలో 19,560 విమానాలు అవసరం: ఎయిర్బస్ అంచనాలు వచ్చే 20 ఏళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 19,560 చిన్న, పెద్ద విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ వెల్లడించింది. అంతర్జాతీయంగా 20 ఏళ్లలో 42,520 విమానాలు అవసరం కానుండగా, ఇది అందులో దాదాపు సగమని వివరించింది. భారత్, చైనాలో విమానయానానికి డిమాండ్ పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ఎయిర్బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీ చెప్పారు. ప్రాంతీయంగా ప్యాసింజర్ల సంఖ్య ఏటా 4.4 శాతం వృద్ధి చెందనుందని, ఇది అంతర్జాతీయ సగటు 3.6 శాతం కన్నా అధికమని వివరించారు. ఆసియా–పసిఫిక్లో సరికొత్త వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని స్టాన్లీ పేర్కొన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుదల, నెట్వర్క్ విస్తరణ, చౌక విమానయాన సంస్థల రాక, మౌలిక సదుపాయాలు మెరుగుపడటం మొదలైనవి విమానయాన వృద్ధికి దోహదపడే అంశాలని చెప్పారు.కొత్తతరం విమానాలతో 25 శాతం ఇంధనం ఆదా.. తమ కొత్త తరం వైడ్–బాడీ విమానాలు 25 శాతం మేర ఇంధనాన్ని ఆదా చేస్తాయని, కర్బన ఉద్గారాలను కూడా ఆ మేరకు తగ్గిస్తాయని ఎయిర్బస్ తెలిపింది. ఏఏపీఏ సదస్సు సందర్భంగా ఎయిర్బస్ వెల్లడించిన అంచనాల ప్రకారం ఆసియా పసిఫిక్లో వచ్చే రెండు దశాబ్దాల్లో 3,500 పెద్ద విమానాలు అవసరం కానున్నాయి. ఇది అంతర్జాతీయంగా పెద్ద విమానాలకున్న డిమాండ్లో సుమారు 43 శాతం. మరోవైపు, ప్రాంతీయంగా 16,100 చిన్న విమానాలు కావాల్సి ఉంటుంది. గ్లోబల్ డిమాండ్లో దాదాపు 47 శాతం. దాదాపు 32 శాతం విమానాలు పాత మోడల్స్ స్థానాన్ని భర్తీ చేయనుండగా, మిగతావి ఫ్లీట్ విస్తరణకు ఉపయోగపడనున్నాయి.
సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు
భారత సరిహద్దుల్లో దేశం కోసం పని చేస్తున్న సైనికులకు అండగా ఇండియన్ ఆర్మీ మోనోరైలు వ్యవస్థను ఏర్పాటు చేసింది. 16,000 అడుగుల ఎత్తులో ఉన్న సైనికులకు ఆహారం, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకు ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ స్వదేశీ హై ఆల్టిట్యూడ్ మోనోరైల్ సిస్టమ్ ద్వారా గజరాజ్ కార్ప్స్(భారత సైన్యానికి చెందిన ఎత్తయిన ప్రాంతం)లోని సైనికులకు సర్వీసు అందిస్తున్నారు.కఠినమైన వాతావరణంలో..సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో కమెంగ్ హిమాలయాల్లో ఈ మోనోరైలును ఏర్పాటు చేసినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ ప్రాంతంలోని శిఖరాలు, అనూహ్య వాతావరణం, హిమపాతం కారణంగా సరఫరా మార్గాల్లో తరచుగా అంతరాయాలు ఏర్పడేవి. దాంతో సైనికులకు ఇబ్బందులు తలెత్తేవి. ఈ సమస్యను పరిష్కరించేలా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.గతంలో ఆహార రవాణా ఎలా జరిగేది?కొత్త మోనోరైల్ వ్యవస్థ రాకముందు కొండలపై ఉన్న సైనికులకు ఆహారం, ఇతర సామగ్రిని అందించడం అనేది అత్యంత కష్టతరమైన పనిగా ఉండేది. చాలా సందర్భాల్లో సైనికులు లేదా స్థానిక కూలీలు తమ వీపులపై భారీ సంచులను మోసుకుని మంచుకొండలపై నడుస్తూ ప్రయాణించేవారు. ఎత్తయిన ప్రాంతాల్లో వాహనాల రవాణా కష్టం అయ్యేది. అత్యంత కీలకమైన సామగ్రిని మాత్రమే హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేసేవారు. అయితే, విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు హెలికాప్టర్లు ఎగరడం అసాధ్యం అవుతుంది. View this post on Instagram A post shared by Tube Indian (@tube.indian)మోనోరైల్ వ్యవస్థగజరాజ్ కార్ప్స్కు ఈ మోనోరైలు అవసరాన్ని గుర్తించి పరిష్కారాన్ని రూపొందించారు. ఈ రైలు 300 కిలోల బరువును మోయగలదు. మందుగుండు సామగ్రి, రేషన్ (ఆహారం), ఇంధనం, ఇంజినీరింగ్ పరికరాలు వంటి అవసరమైన సామగ్రి నిరంతరాయంగా, సురక్షితంగా మారుమూల పోస్టులకు చేరవేస్తున్నారు. దీన్ని పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వేళలా పనిచేయడానికి తయారు చేశారు. వడగండ్లు, తుపానులు వంటి వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుని ఇది పనిచేయగలదు.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్..
రూ.1,000 లోపు ఉత్పత్తులపై ఫ్లిప్కార్ట్ కీలక నిర్ణయం
వాల్మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ప్లాట్ఫామ్ ద్వారా రూ.1,000 లోపు ధర ఉన్న ఉత్పత్తులను విక్రయించే అమ్మకందారుల నుంచి ఎటువంటి కమీషన్ వసూలు చేయబోమని ప్రకటించింది. ఈ నిర్ణయం నవంబర్ 19 నుంచి అమల్లోకి రానుంది. ప్రత్యర్థి సంస్థల నుంచి పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్లిప్కార్ట్ తమ హైపర్ వాల్యూ ప్లాట్ఫామ్ అయిన ‘షాప్సీ’లో విక్రయించే ఏ ఉత్పత్తికి కూడా కమీషన్ తీసుకోబోమని స్పష్టం చేసింది.వ్యాపార వ్యయాల్లో తగ్గింపుసాధారణంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్ఫామ్ల్లో కమీషన్ రేట్లు 6-7% మధ్య ప్రారంభమై కొన్ని సందర్భాల్లో 15% వరకు ఉంటాయి. అమ్మకాల ఆధారంగా విక్రేతలు కంపెనీలకు కమీషన్ రూపంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కమీషన్ను రద్దు చేయడం ద్వారా ఫ్లిప్కార్ట్ విక్రేతలకు గణనీయమైన ఊరట కల్పించింది. దీనికి తోడు ఫ్లిప్కార్ట్ విక్రయదారు ఉత్పత్తుల రిటర్న్ ఫీజును కూడా రూ.35 వరకు తగ్గిస్తోంది. ఈ రెండు చర్యల వల్ల అమ్మకందారులకు వ్యాపార వ్యయాలు 30 శాతం వరకు తగ్గుతాయని ఫ్లిప్కార్ట్ మార్కెట్ ప్లేస్, షాప్సీ బిజినెస్ యూనిట్ హెడ్ కపిల్ తిరాణి తెలిపారు.వినియోగదారులకు లబ్ధివిక్రేతలు తమకు తగ్గిన వ్యయ ప్రయోజనాన్ని (జీఎస్టీ కోతలకు మించి) వినియోగదారులకు అందిస్తే అంతిమంగా ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. ఇది వింటర్ సీజన్లో పండుగలకు ముందు ఆన్లైన్ వినియోగాన్ని పెంచడానికి, ఎక్కువ మంది మధ్యతరగతి దుకాణదారులను ఆన్లైన్లోకి తీసుకురావడానికి దోహదపడుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.ఈ సందర్భంగా తిరాణి మాట్లాడుతూ..‘జీఎస్టీ తగ్గింపు, ఆదాయపు పన్ను ప్రయోజనాలు, తగ్గుతున్న ద్రవ్యోల్బణం ఇప్పటికే వినియోగానికి దోహదపడ్డాయి. ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగాల్లో నవంబర్లో మెరుగైన అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా శీతాకాల ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది’ అన్నారు. గత మార్చిలో అమెజాన్ కూడా రూ.300 లోపు ధర ఉన్న ఉత్పత్తులపై కమీషన్ తగ్గించింది.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్..
ఫ్యామిలీ
కలహాలు వీడి.. కాపురాల ముడి
జగిత్యాలజోన్: కుటుంబ గొడవలతో ఇక కలిసి ఉండలేమని కోర్టును ఆశ్రయించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలా తిరుగుతున్న నాలుగు జంటలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి పెద్దరికంతో నచ్చజెప్పి.. వారికి బాసటగా నిలిచి ఏకం చేశారు. జగిత్యాల కోర్టులో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్అదాలత్.. నాలుగు జంటలను కలిపే పెళ్లి వేడుకగా మారింది. జడ్జిలు పెళ్లి పెద్దలుగా మారి అక్షింతలు వేశారు. పోలీసులు ఆశీర్వచనాలు అందించారు. తమకు పుట్టిన సంతానం సాక్షిగా.. న్యాయవాదుల చప్పట్ల మధ్య నాలుగు జంటలు దండలు మార్చుకున్నాయి. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్లు లావణ్య, శ్రీనిజ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతోనే అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయని, చిన్నచిన్న సమస్యలకు కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.నచ్చజెప్పి కలిపారుమా మధ్య ఏర్పడిన వివాదంతో పోలీస్స్టేషన్, కోర్టులో కేసు వేశాం. కొంతకాలంగా ఎవరికి వారుగా ఉన్నాం. జడ్జిలు, పోలీసులు నచ్చజెప్పడంతో లోక్అదాలత్ ద్వారా ఒక్కటయ్యాం. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ కాదు. మరొకరు తక్కువ కాదని తెలసుకున్నాం.– వేమల లావణ్య, మధుకొత్త జీవితం ప్రారంభిస్తున్నాంపెళ్లయిన తర్వాత చిన్న గొడవకు పోలీస్స్టేషన్, కోర్టును ఆశ్రయించాం. గొడవలతో సాధించేది ఏమి లేదని ఇప్పుడు అర్థం అయ్యింది. లోక్ అదాలత్ ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. మా తప్పులేంటో తెలిసేలా చేసి మమ్మల్ని ఒక్కటి చేశారు.– కొత్తూరి మానస, ప్రశాంత్ఒకరినొకరం అర్థం చేసుకున్నాంఇద్దరి మధ్య ఇగోలతో కోర్టులో కేసులు వేసుకున్నాం. ఒకరిపై మరొకరికి సరైన అవగాహన లేక, చెప్పుడు మాటలు విని కోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు జడ్జిలు చెప్పిన మాట విని తిరిగి కలిసిపోతున్నాం. ఇప్పటికే ఎంతో విలువైన సమయాన్ని వృథా చేసుకున్నాం– అవుదారి శీరిష–శ్రీను, దంపతులుమళ్లీ కలిసిపోయాంచిన్న వివాదంతో కోర్టును ఆశ్రయించాం. అన్ని పనులు విడిచిపెట్టి వాయిదాలకు తిరుగుతూ.. మనశ్శాంతికి దూరమయ్యాం. న్యాయమూర్తులు, న్యాయవాదుల సలహాతో కేసును పరిష్కరించుకుని ఒక్కటయ్యాం. సంతోషమయ జీవితాన్ని గడుపుతాం. – తీపిరెడ్డి సుమలతచంద్రశేఖర్, దంపతులు
91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..
వర్క్లైఫ్ బ్యాలెన్స్పై చాలామంది ప్రముఖులు, ప్రజలు పలు రకాలుగా తవ వాదనలు వినిపించారు. పైగా అన్ని గంటలు ఆఫీస్లకే పరిమితమైతే..ఫ్యామీలీ సంగతేంటి అని పలువురు వాపోయారు కూడా. కానీ మనసుంటే అన్ని సాధ్యమే..అటు ఆరోగ్యం ఇటు ఫ్యామిలీ అన్నింటిని కూడా సులభంగా బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వాళ్లందర్నీ వెనక్కినెట్టి ఓల్డ్ ఏజ్లో ఏకంగా 12 గంటలు షిఫ్ట్లో పనిచేస్తూ విస్మయానికి గురిచేయడమే కాదు..ఆ వయసులో ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండి మరింత కంగుతినేలా చేశాడు. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాదు నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఈ ఘటన సింగపూర్లో చోటు చేసుకుంది. సోషల్ మీడియా వ్లాగర్ లైంగ్ అనే వ్యక్తికి సింగపూర్లో ఓ వృద్ధ కార్మికుడి తారసపడతాడు. అతడు బాత్రూంలను క్లీన్ చేసే వ్యక్తిగా గుర్తిస్తాడు. అతడికి దగ్గర దగ్గర 90 ఏళ్లుపైనే ఉంటాయి. లైంగ్ ఆ వృద్ధుడితో మాటలు కలుపుతాడు. మీరు ఎలా ఉన్నారని ప్రశ్నించగా వృద్ధుడు చాలా బాగున్నానని సమాధానం ఇస్తాడు. ప్రతి రోజు మీ వర్క్ ఎలా సాగుతుందని అడగగా అతడు తన వయసు గురించి అగుడుతున్నాడని పొరబడి.. ఆ వృద్ధుడు తన వయసు 91 ఏళ్లు అని రిప్లై ఇస్తాడు. వెంటనే లాంగ్ తేరుకుని ..కాదు ఈ వయసులో ఇంకా పనిచేస్తున్నావు..అని ఆశ్చర్యపోతూ ఎన్ని గంటలు వరకు పనిచేస్తావని ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి రాత్రి ఏడింటి వరకు పనిచేస్తానని, రోజుకు 12 గంటల షిఫ్ట్ అని వివరిస్తాడు. దాంతో వ్లాగర్ బాస్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటావు, నీ ఫిట్నెస్ రహస్యం ఏంటి అని చాలా కుతుహలంగా అడుగుతాడు. దానికి అతడు సాధారణ భోజనమే తింటానని, అయితే వ్యాయమం మాత్రం తానెప్పుడూ చేయలేదని చెప్పుకొస్తాడు. అంతేగాదు వ్లాగర్ లైంగ్తో ఎప్పుడూ వ్యాయామం చేయవద్దు అని సలహ కూడా ఇస్తాడు. దాంతో లైంగ్ నవ్వుతూ..నువ్వు జీవితంలో ఎప్పుడూ వ్యాయామం చేయలేని గొప్ప మనిషివి అని వ్యాఖ్యానిస్తాడు. చివరగా అతడికి వీడ్కోలు పలుకుతూ.. భోజనం చేయమని కొంత డబ్బు ఇవ్వడమేగాక.. నువ్వు ఒక గొప్ప సైనికుడివి జాగ్రత్తగా ఉండు..కష్టపడి పనిచేస్తుండూ అని చెప్పి నిష్క్రమిస్తాడు. ఆ వీడియో హీరో మాధవన్ని సైతం కదిలించింది. మాధవన్ కూడా ఆ వీడియో క్లిప్ని రీషేర్ చేస్తూ..స్ఫూర్తిదాయకమైన వీడియో అంటూ ప్రశంసించాడు. ఇక నెటిజన్లు..ఈ వీడియో కన్నీళ్లు పెట్టించేస్తోంది. అతడు ఎల్లప్పుడూ ప్రజలతో సంభాషిస్తాడు, అందుకే ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ ఘటన వ్యాయామం ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం కాదని, ఆనందమే కీలంగా అని ప్రూవ్ చేసింది. అందువల్లే అతను సంతోషంగా అన్ని గంటలు పనిచేస్తున్నాడంటూ ఆ వృద్ధ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Jaden Laing (@jadentysonlaing) (చదవండి: అఫ్గాన్ చిన్నారి పెళ్లి కూతురు..! విధినే ధిక్కరించి..)
అమెరికా లెక్క
నారప్పకు దిక్కుతోచడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటున్నాడు.పని చేసేటప్పుడు, తినేటప్పుడు, పదిమందిలో కూర్చొని ఉన్నప్పుడు.. ఒక్కటేమిటి? నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడు చూసినా పరధ్యానంలోనే ఉంటున్నాడు. నారప్ప ఇలా ఉండబట్టి చాలా రోజులవుతోంది. అలాగని అలవిగాని కష్టాలేమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి కొదవలేని బతుకు. పిల్లల్ని బాగా చదివించాడు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. మనవలు, మనవరాళ్లను చూశాడు. ఆస్తి దండిగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే పెదరాయుడులా దర్జాగా కాలుమీద కాలేసుకొని బతకొచ్చు. అయినా, నారప్పలో ఏదో దిగులు మొదలైంది. చిన్నాపెద్దా లేకుండా ఊళ్లోవాళ్లంతా నారప్పను ‘నక్కజిత్తుల నారప్ప’అంటుంటారు. పైసా లాభం లేకుంటే ఏ పనీ చేయడనీ, పది పైసలు మిగులుతుందంటే ఏదైనా సరే చేస్తాడని ఆ పేరు పెట్టారు. ఇది నారప్పకూ తెలుసు. అయినా, తెలియనట్లే ఉంటాడు. ఎవరైనా మొఖమ్మీదే అన్నా పట్టించుకోడు. నవ్వుతూ తప్పించుకుంటాడు. నారప్ప ఇలా ఉండడం వెనక చాలా పెద్ద కథే ఉంది. నట్టనడి ఊళ్లో ముప్పై రెండు దూలాలు మోసే రాతిమిద్దెలో పుట్టాడు నారప్ప. ముందు అన్న బసప్ప, వెనక చెల్లెలు భీమక్క. అమ్మ వన్నూరమ్మ, నాన్న పుల్లప్ప. నారప్ప పుట్టేనాటికే వాళ్లకు వందెకరాల వరకు పొలం, వెయ్యికి పైగా జీవాలు ఉండేవి. ఆస్తి దండిగ ఉండడంతోపాటు పుల్లప్ప సర్పంచ్ కావడంతో ఆ ఇల్లు వచ్చేపోయే వాళ్లతో కళకళలాడేది. ఆ ఇంటికి ఎప్పుడు పోయినా తిండికి కొదవుండదని పేరు తెచ్చింది.కాలం చాలా కఠినమైనది. జీవితాలను తిప్పేస్తుంది. నారప్ప జీవితమూ అలాగే తిరిగింది. రెండోసారి సర్పంచ్ అయ్యాక పుల్లప్ప దారి తప్పాడు. పేకాటకు, బయటి సంబంధాలకు మరిగాడు. ఆస్తులు తరగడం, అప్పులు పెరగడం మొదలైంది. బసప్ప, నారప్ప చదువు ఊళ్లో బడితోనే ముగిసింది. ఇంటి వద్దకు జనాలు రావడం తగ్గింది. భర్త తిరుగుళ్లు చూసి వన్నూరమ్మ– ఆస్తి కరిగిపోక ముందే కూతురికి పెళ్లి చేయాలని పట్టబట్టింది. చివరికి ఊళ్లోనే ఉండే తన అన్న కదిరప్ప కొడుకు సోమప్పకు ఇచ్చి పెళ్లి జరిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే కాలంచేసింది.ఆలోగా పొలం ఇరవై ఎకరాలకు చేరుకుంది. గొర్లు, గొడ్లు ఊరు దాటాయి. పుల్లప్ప పదవీకాలం కూడా పూర్తయింది. మూడోసారీ సీట్లో కూర్చుందామని ఆశపడినా ఊళ్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఆ కోపంతోనో బాధతోనో ఇల్లు విడిచి బయటికి రావడమే మానేశాడు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేశాక ఊరు విడిచి, కడప జ్యోతిక్షేత్రంలో కాశినాయన ఆశ్రమం జేరి అక్కడే కాలం చేశాడు.పుల్లప్ప పోయిన తర్వాత సర్పంచ్ సీట్లో కదిరప్ప కూర్చున్నాడు. దాని కోసమే తన కొడుక్కి చెల్లెలు కూతుర్ని చేసుకున్నాడనే సంగతి తండ్రీకొడుకులు చాటుగా మాట్లాడుకుంటుండగా విన్న నారప్పకు మాత్రమే తెలుసు. నాన్న, తమ కుటుంబం అనుభవించిన దర్జా, వైభోగం కాలంతోపాటు దూరమైనా నారప్ప మనసులోంచి మాత్రం పోలేదు. అయితే, పరిస్థితులకు తొందరగానే అలవాటు పడ్డాడు. లౌక్యం నేర్చుకున్నాడు. తినీతినక కూడబెట్టడం, వడ్డీలకివ్వడం మొదలుపెట్టాడు. ఆ అతితెలివితేటలు, లౌక్యం చూసే ‘నక్కజిత్తుల నారప్ప’ అని పేరు పెట్టారు.నారప్ప భార్య ఎర్రమ్మ అమాయకురాలు. భర్త మాట దాటదు. కొడుకు రవి బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొని, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి స్థిరపడ్డాడు. తన మాట వినకుండా తెల్లోళ్ల పిల్లను చేసుకున్నాడని కొడుకు మీద కోపమొచ్చినా, కావల్సినంత డబ్బు పంపుతుండడంతో ఏమీ అనలేకపోయాడు నారప్ప. కొడుకు పంపే డబ్బుతో కూతురిని తహసీల్దారుకిచ్చి పెళ్లి చేశాడు. ఊళ్లో డూప్లెక్స్ హౌస్ కట్టించాడు. కూడేరులో జాగాలు, అనంతపురం, హైదరాబాద్, బెంగళూరులో ఇళ్లు కొన్నాడు. నారప్ప బ్యాంకు అకౌంట్లన్నీ లక్షలతో నిండిపోయాయి. అదిగో అప్పటి నుంచే నారప్పకు మనసులో ఏదో దిగులు మొదలైంది. అదేంటో, దాన్ని ఎలా తీర్సుకోవాలో నారప్పకు తెలిసేలా చేసినవి ఆ రెండు సంఘటనలే!ఆ రోజు ఆదివారం. పొద్దున్నే బైక్ మీద తోటకు వెళ్లి, నిమ్మ చెట్లకు డ్రిప్పుతో నీళ్లు విడిచి ఇంటికి బయల్దేరాడు నారప్ప. ఊరికి ఆనుకొని వచ్చేసరికి ఎల్లప్ప గొర్రెల మంద ఎదురైంది. అసలే అది ఇరుకు దారి. పైగా ముందురోజు పడిన వానకు బురద ఉండడంతో బైక్ అదుపు తప్పింది. సర్రున జారి ఒక గొర్రెను బలంగా ఢీకొట్టింది. అది గట్టిగా అరుస్తూ వెనక్కిపడింది. బైక్ కూడా కింద పడుతుంటే ఒడుపుగా అదుపు చేశాడు. మంద వెనకాలే వస్తున్న ఎర్రిసామి అది చూసి ‘‘సచ్చెరా గొర్రె..’’ అని అరుస్తూ గబగబా గొర్రె దగ్గరకు వచ్చాడు. అదృష్టం కొద్ది గొర్రె బతికే ఉంది. అయితే, పొట్ట, బర్రెంకల మీద టైరు రాసుకొని పోవడంతో రక్తం కారుతోంది. అదాటున కింద పడడంతో తిరిగి పైకి లేవలేకపోతోంది. ఎర్రిస్వామికి కళ్ల నుంచి నీళ్లు జలజలా రాలాయి. వెనక్కి తిరిగి నారప్పను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు చెవినబడి పరుగెత్తుకుంటూ వచ్చాడు ఎల్లప్ప. గొర్రెను పట్టుకొని పైకి లేపడానికి ప్రయత్నిస్తూనే కొడుకుతోపాటు తిట్లు అందుకున్నాడు. ఇద్దరూ కలసి నారప్పను నోరు తెరవనీయలేదు. ఈ గోలకు బెదిరి మిగిలిన గొర్రెలన్నీ దూరంగా నిలబడి వీళ్లనే చూస్తున్నాయి. జనం గుమిగూడారు. అందరూ కలసి ఎర్రిసామికి, ఎల్లప్పకు సర్దిచెప్పారు. ఈలోగా కిందపడిన గొర్రె లేచి నడవడంతో తిట్లు ముగించి వెనక్కి కదిలారు అబ్బాకొడుకులు. ఇంటికొచ్చి మంచంమీద కూలబడ్డాడు నారప్ప. చెవుల్లో తిట్లు మోగుతున్నాయి. చుట్టూ చేరినవాళ్లు నవ్వుకోవడం కళ్లలో మెదులుతోంది. కోపం, అవమానం కలసి ఏంచేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు. మధ్యాహ్నం అన్నానికీ లేవలేదు. విషయం తెలిసి చీకటి పడుతుండగా వచ్చాడు చెన్నప్ప.‘‘న్నో.. అప్పుడప్పుడూ ఇట్టాంటివి జరుగుతాంటాయి.. మామూలే! అయన్నీ పట్టిచ్చుకుంటామా? ఎల్లప్ప నీకు మేనమామ వరస. ఎర్రిస్వామి మేనల్లుడు. మనోళ్లు ఏదో పొరపాటున మాట జారినారని అనుకోన్నా. లే.. అట్లా కూడేరు దాకా పోయొజ్జాం’’ అంటూ నారప్పను ఓదార్చాడు. ఇద్దరూ బైక్ మీద కూడేరుకు చేరుకునే సరికి ఏడయ్యింది. వైన్షాప్లో మందు, పక్కనే బజ్జీలు, ఉడకబెట్టిన చెనిక్కాయ విత్తనాలు తీసుకొని ఊరి చివర తోటలో కూర్చున్నారిద్దరూ. అప్పటిదాకా మౌనంగా ఉన్న నారప్ప... గొంతులోకి మందుపోగానే నోరు తెరిచాడు. ‘‘ఊరంతా సూచ్చాండంగా వోళ్లుతిట్నారు సెన్నప్పా. రేపట్నుంచి ఊళ్లో తలెత్తుకుని ఎట్ట తిరగల్ల? మానం, పానం రెండూ పోయినట్లు ఉండ్లా్య..’’ అంటూ కాసేపాగి ‘‘వోళ్లను ఏదో ఒకటి జేయాల.. ల్యాకపోతే అవమానంతో సచ్చేలా ఉండా..’’ అంటూ కళ్లనిండా నీళ్లు నింపుకున్నాడు. చెన్నప్పకు ఆ రోజెందుకో కొత్తగా కనిపించాడు నారప్ప. ‘ఎవరెన్ని అన్యా తుడ్సుకొని పోయే నారప్పన్న ఈ పొద్దెందుకు ఇట్టా అంటన్నాడు’ అని మనసులో అనుకుంటున్నాడు.‘‘సెప్పు సెన్నప్పా.. వోళ్లను ఏమిజెయ్యాల?’’ చెన్నప్పను కుదుపుతూ మళ్లీ అడిగాడు నారప్ప. ‘‘ఏంజేయాల్సిన పన్లేదులేన్నా.. రెండ్రోజులుంటే అంతా మర్సిపోతారు’’ చెప్పాడు చెన్నప్ప. వినలేదు నారప్ప. అవమానం అతన్ని వెనక్కి తగ్గనీయడం లేదు.‘‘కూడేరు స్టేషన్లో నా బామ్మర్ది ఉండాడు. వానికి సెప్పి ఎస్ఐతో మాట్లాడిజ్జాం. అంతో ఇంతో లెక్క కొడితే వాళ్లే స్టేషన్కు తీస్కపోయి అబ్బాకొడుకులకు మర్యాద జేస్తారు’’అన్నాడు చెన్నప్ప. ఒప్పుకున్నాడు నారప్ప. నేరుగా ఇద్దరూ స్టేషన్కు వెళ్లారు. చెన్నప్ప.. బామ్మర్దికి విషయం చెప్పడంతో లోపలికి వెళ్లి ఎస్ఐతో మాట్లాడాడు. బయటికొచ్చి చెన్నప్ప చెవిలో ఏదో గొణిగినాడు. వెంటనే నారప్ప దగ్గరికి వచ్చిన చెన్నప్ప ‘‘న్నో.. ఎస్ఐ ఇరవై వేలు అడుగుతనాడంటన్నా..’’ అన్నాడు.ఏమీ ఆలోచించలేదు నారప్ప. జేబులోంచి డబ్బు బయటికి తీశాడు. ‘‘లెక్క ఐదు వేలు ఎక్కువనే ఇచ్చనాగాని.. రెండ్రోజులు దాంకా ఇడ్సకండా తన్నమను’’ అన్నాడు పళ్లు కొరుకుతూ.చెన్నప్పకు అది కలో నిజమో తెలియడం లేదు. ఎప్పుడైనా అవసరానికి డబ్బడిగితే ఇవ్వడానికి ఎన్నో సాకులు చెప్పే నారప్పన్న ఇప్పుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం చూసి నోట మాట రాలేదు.మరునాడు తెల్లారే సరికి ఊరంతా ఒకటే గుసగుసలు. ఎల్లప్పను, ఎర్రిసామిని అర్ధరాత్రి పోలీసులు తీసుకుపోయారని, నారప్ప కేసు పెట్టించాడని మాట్లాడుకుంటున్నారు. అది తెలియడంతో నారప్ప మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది. ఎప్పుడు లేనిది ఆ రోజు హీరోహోండా పక్కన పెట్టి, రాయల్ ఎన్ఫీల్డ్ మీద తోట వద్దకు బయల్దేరాడు. కూలిపనికి పిలిచే సాకుతో ఊరంతా తిరిగాడు. ఖద్దరు చొక్కా, రామరాజు పంచె కట్టి దర్జాగా తిరుగుతున్న నారప్పను చూసి ఆరోజు ఊరు నోరెళ్లబెట్టింది. ఎల్లప్పను, ఎర్రిసామిని రెండ్రోజుల దాకా వదల్లేదు పోలీసులు. వాళ్లు కొట్టిన దెబ్బలతో నెలపాటు ఇంటి నుంచి బయటికి రాలేదు వాళ్లు. ఇది జరిగాక ఊళ్లో నారప్ప పరపతి అమాంతం పెరిగింది. ‘నక్కజిత్తుల నారప్ప’ అని కాకుండా వరుసలు పెట్టి పిలవడం, గౌరవంగా మాట్లాడడం మొదలైంది. అప్పుకో సప్పుకో జనం ఇంటికి రావడం మొదలు పెట్టారు. అది చూశాక తనలోని దిగులేందో మెల్లగా అర్థమవసాగింది నారప్పకు. అంతేకాదు, తన బలమేదో తెలిసొచ్చింది.అయితే, నారప్ప పూర్తిగా ఒళ్లు విరుచుకొని తిరిగేలా చేసింది మాత్రం తిమ్మప్పతో గొడవే!తండ్రి చేసిన అప్పుల కారణంగా తాము అమ్ముకున్న భూములన్నీ తిరిగి కొనుక్కున్నాడు నారప్ప.. ఒక్క తిమ్మప్ప పొలం తప్ప. అది కూడా తీసుకోవాలని ఒకరిద్దరితో అడిగించినా.. అమ్మడానికి తిమ్మప్ప ఒప్పుకోలేదు. దాంతో ఆ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పంతం పట్టాడు.పక్కూరికి వెళ్లే రోడ్డు పక్కనే నారప్ప, పెద్దన్న పొలాలు పక్క పక్కనే ఉంటాయి. పెద్దన్న పొలానికి పైభాగంలో తిమ్మప్ప పొలం ఉంది. అందులోకి వెళ్లాలంటే పెద్దన్న పొలం మీదుగా వెళ్లాలి. ఏళ్ల తరబడి ఉండే దారది. అది కాకుండా తిమ్మప్ప పొలానికి వెళ్లాలంటే చుట్టూ నాలుగు కిలోమీటర్లు కొండ వారగా వెళ్లాలి. రాళ్లూరప్పలు కంపచెట్లతో ఉండే ఆ దారి ప్రమాదకరం.ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు నారప్ప. పెద్దన్న పొలాన్ని కొనేశాడు. అందులో నుంచి తిమ్మప్ప పొలానికి వెళ్లే దారిని మూసేశాడు.తాను పొలం అమ్మలేదనే కోపంతోనే నారప్ప ఇదంతా చేస్తున్నాడని తిమ్మప్పకు అర్థమైంది. గొడవెందుకని బతిమాలాడు. కాని, నారప్ప చెవికెక్కించుకోలేదు. దాంతో తన మనుషులతో గొడవకు దిగాడు. దీనికి నారప్ప ముందే సిద్ధమై ఉన్నాడు. తన దగ్గర డబ్బు చేరాక చుట్టూ చేరిన దాయాదుల్ని, మనుషుల్ని వెంట బెట్టుకొని అడ్డుకున్నాడు. విషయం తెలిసి పోలీసులు వచ్చారు. నారప్పదే తప్పని అందరికీ తెలుసు. కాని, ఎవరూ నోరు తెరవడం లేదు. ఎందుకంటే నారప్ప దగ్గర కట్టలు కట్టలు మూలిగే డబ్బు.. దానితో అవసరం. అందుకే ఏమీ పట్టనట్టు ఉండిపోయారు. తిమ్మప్పను పోలీసులు స్టేషన్కు తీసుకుపోయారు.తిమ్మప్ప కూడా అంతో ఇంతో డబ్బున్నోడే. పైగా వెనక్కి తగ్గే రకం కాదు. కాని, రూపాయి కంటే డాలరుకు బలమెక్కువని ఆయప్పకే కాదు ఊరంతటికీ అర్థమవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.ఒకటికి రెండుసార్లు తనదే పైచేయి అయ్యే సరికి నారప్పకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. మందిని వెనకేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు తనను వెక్కిరించిన వాళ్లను, ఎగతాళి చేసినవాళ్ల మీద అవకాశం దొరికినప్పుడల్లా పగ తీర్చుకునేవాడు. ప్రతి తగాదాలో తలదూర్చేవాడు. సర్దిచెప్పే సాకుతో అవసరమైనవి లాక్కునేవాడు. మెల్లగా జనానికి నారప్ప సంగతి అర్థమైంది. ఎదిరించి ఇబ్బంది పడేకంటే, గొడవ పడకుండా బతకడమే మేలని నిర్ణయించుకున్నారు. కాని, విషయాలన్నీ నారప్ప కొడుక్కి, కూతురికి చెప్పడం మొదలుపెట్టారు.పిల్లల హితబోధను పట్టించుకోలేదు నారప్ప. భర్తకు చెప్పే ధైర్యం లేని ఎర్రమ్మ.. జరిగేవన్నీ మౌనంగా చూస్తోంది. ‘మీ నాయిన మాదిరే నువ్వూ తయారయితనావని, ఊరంతా శత్రువుల్ని చేసుకుంటనావ’ని చెప్పాలనుకున్న మాటలు ఆమె నోరు దాటి రాలేదు. అంతేకాదు, భర్త అంతిమ లక్ష్యం, దాని కోసం చేస్తున్న ప్రయత్నాలు తెలిసి భయంతో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతోంది. భార్యాపిల్లల ఆందోళనలు, ఆవేదనలు ఏవీ నారప్ప చెవికి, మనసుకు ఎక్కడం లేదు. అతని దృష్టంతా మిగిలిన ఆ ఒక్క కోరిక మీదనే ఉంది. అదీ తీరేదే.. ఆ మహమ్మారి రాకుంటే. ∙∙ ప్రపంచాన్ని భయం గుప్పిట్లో బందీ చేస్తూ కరోనా పుట్టుకొచ్చింది. దేశమంతా లాక్డౌన్ తెచ్చింది. జనం ఇళ్ల నుంచి కదలడం లేదు.ఎవరి వల్ల వచ్చిందో.. ఎలా వచ్చిందో.. నారప్ప కరోనా బారిన పడ్డాడు. లక్షణాలు వారంలోనే తగ్గాయి. అయినా మూడు వారాలు ఇల్లు దాటొద్దని వైద్య సిబ్బంది చెప్పడంతో ఇంటికే పరిమితమయ్యాడు. టీవీ చూడడం, ఫోన్లో మాట్లాడడం ఇదే పని. రెండు వారాలు భారంగా గడిచాయి. ఆ తర్వాత ఉండలేకపోయాడు. భార్యకు తెలియకుండా తోటకు బయల్దేరాడు.సాయంత్రం ఆరు సమయంలో ఊరంతా తెలిసిందా వార్త.. తోట దగ్గరి బావిలో పడి నారప్ప చనిపోయాడని. భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడం, కాల్ చేసినా కలవకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన ఎర్రమ్మకు.. ఊరు దాటాక కొద్ది దూరంలో ఉన్నబావి పక్కన బైక్, బావిలో తేలుతున్న నారప్ప శవం కనిపించింది. ఊళ్లో జనానికి విషయం తెలిసినా ఒక్కరూ రాలేదు. అది కరోనా భయం వల్లో, బతికున్నప్పుడు నారప్ప చేసిన పనుల వల్లో తెలియడం లేదు. చివరకు పోలీసులొచ్చి శవం బయటికి తీశారు.నారప్ప అల్లుడు తాసీల్దారు కావడంతో ఎలాగోలా కర్నూలు నుంచి భార్యను వెంటబెట్టుకుని వచ్చేశాడు. కాని, కొడుకు వచ్చేదానికి ఎలాంటి అవకాశమూ లేదు.పంచనామా పూర్తిచేసి మరుసటి రోజు శవాన్ని అప్పగించారు పోలీసులు. బావిలోంచి తీసేటప్పుడు నారప్ప శరీరం మీద కనిపించిన కముకు దెబ్బల గురించి పోలీసులు ఏమీ చెప్పలేదు. ఎర్రమ్మ కూడా ఏమీ అడగలేదు. అడగబోయిన కూతురు, అల్లుడినీ కూడా ఆపింది.∙∙ బ్యాండు మేళం, డప్పు లేకుండానే నారప్ప అంతిమయాత్ర మొదలైంది. ఎర్రమ్మ ఏడుపు ఊళ్లో జనానికి స్పష్టంగా వినిపిస్తోంది. అంతిమయాత్రలో నడుస్తున్న అల్లుడు, కూతురుతోపాటు కొద్దిమంది బంధువుల్లోనూ ఒకటే ఆలోచన... అసలు నారప్పను కొట్టి చంపి, బావిలో వేసిందెవరు? జైలులో పెట్టించి, కొట్టించినందుకు ఎల్లప్ప, అతని కొడుకు చేసిన పనా? తన పొలానికి దారి లేకుండా చేసినందుకు తిమ్మప్ప కుటుంబం చేసిన పనా? స్నేహితుడని నమ్మితే, వావీవరస చూడకుండా తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినందుకు చెన్నప్ప చేసిన పనా? ఊళ్లో తాను చేసే తప్పుడు పనులు గురించి కొడుక్కు చెప్పాడనే అక్కసుతో ఓబుళప్ప పొలాన్ని ఆక్రమించుకున్నందుకా? ....వాళ్ల ప్రశ్నలన్నింటికీ అక్కడ సమాధానం తెలిసింది ఇద్దరికే.దారిలో.. సోమప్ప ఇంటి బయట.. కరోనా వచ్చినప్పటి నుంచి బయటికి తీయని టాటా సుమో టైర్లకు అంటిన బురద తాజాగా కనిపిస్తోంది.నారెప్ప పాడె మీద చల్లుతున్న చిల్లరలోని నాణేలు కిందపడి తళతళ మెరుస్తున్నాయి.అవి డాలర్లు... అమెరికా లెక్క.
అద్దంతో అల్లుకుంటూ!
‘దర్యాప్తు అధికారికి సునిశిత దృష్టి, ప్రతి విషయాన్నీ అధ్యయనం చేసి, బేరీజు వేసే తత్త్వం ఉన్నట్లయితే; నేరస్థలిలోని లభించే, కనిపించే ప్రతి అంశమూ ఒక ఆధారం అవుతుంది’– ఇది ప్రపంచ వ్యాప్తంగా దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు నమ్మే అంశం. సాధారణంగా సంచలనాత్మక ఉదంతాల్లో మాత్రమే పోలీసులు దీన్ని కచ్చితంగా పాటిస్తుంటారు. అయితే, హైదరాబాద్లోని బొల్లారం పోలీసులు మాత్రం సాధారణ నేరంగా పరిగణించే గుర్తుతెలియని వాహనాల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదం (హిట్ అండ్ రన్) కేసునూ సంచలనాత్మక నేరం స్థాయిలో దర్యాప్తు చేశారు. ఘటనాస్థలిలో దొరికిన ఓ అద్దం (కుడివైపు సైడ్ మిర్రర్) ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అది 2013లో తొలిరోజైన జనవరి 1, సమయం ఉదయం 6.15 గంటలు. చలితో పాటు పొగమంచూ దట్టంగా ఉంది. బొల్లారం ప్రధాన రహదారిలోని సెయింట్ ఆన్స్ హోమ్లో ఉన్నవాళ్లు అప్పుడే నిద్రలేస్తున్నారు. అదే సమయంలో ప్రహరీగోడ పైనుంచి హోమ్ ఆవరణలోకి ఓ ఆకారం పడటం గమనించారు. పరుగున వెళ్లి చూసి మహిళ (65)గా గుర్తించారు. ప్రహరీకి ఆవలి వైపున్న రోడ్డు మీద ఓ యువతి (30) తీవ్రగాయాలతో పడినట్లు కలకలం మొదలైంది. అదే సమయంలో వాకింగ్ చేస్తున్న కొందరు ప్రత్యక్ష సాక్షులు గమనించిన దాని ప్రకారం 6037 నెంబర్ కలిగిన తెల్లరంగు స్విఫ్ట్ కారు శామీర్పేట వైపు నుంచి వేగంగా వస్తూ వీరిని ఢీ కొట్టింది. ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. వృద్ధమహిళ అప్పటికే మరణించిందని, యువతికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు నిర్ధారించారు. ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న బొల్లారం పోలీసుస్టేషన్లో సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న షేక్ సాదిక్ ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాధితులు నివసించేది స్నేహ ఎన్క్లేవ్లో అని, మృతి చెందిన వృద్ధురాలు ఆశాదేవిగా, క్షతగాత్రురాలు ఆమె కుమార్తె శ్వేత సింగ్గా గుర్తించారు. సంఘటన జరిగిన ప్రధాన రహదారికి క్షుణ్ణంగా పరిశీలించిన సాదిక్ దృష్టి అక్కడ పడున్న ఓ కారు సైడ్ మిర్రర్పై పడింది. అది ప్రమాదానికి కారణమైన కారుదే అయి ఉంటుందనే ఉద్దేశంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి అదే కీలకాధారం అవుతుందని ఆ సమయంలో ఆయన అనుకోలేదు. అద్దం తీసుకుని నేరుగా పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. అప్పట్లో ఆ ఠాణా ఇన్స్పెక్టర్ పని చేస్తున్న టి.లక్ష్మీనారాయణకు కేసు పూర్వాపరాలు వివరించి, ఆ అద్దాన్ని ఆయన ముందుంచారు. ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇరువురూ దేశానికి సేవ చేసిన మాజీ సైనికాధికారి కుటుంబానికి చెందిన వారని తెలుసుకున్నారు. ఈ విషాదానికి కారణమైన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలని నిర్ణయించుకున్న ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆ కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆశాదేవి, శ్వేతలను ఢీ కొట్టింది స్విఫ్ట్ కారు అని స్థానికులు చెప్పడంతో ముందుగా ఆ మోడల్స్ పైనే దృష్టి పెట్టారు. ప్రమాద సమయంలో ఆ కారు శామీర్పేట వైపు నుంచి వస్తోందని నిర్ధారణ కావడంతో ఆ దిశలో ముందుకు వెళ్లారు. ఆర్టీఓ డేటాబేస్ ఆధారంగా హైదరాబాద్తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ల్లో నమోదైన తెల్లరంగు స్విఫ్ట్ కార్ల వివరాలు సేకరించారు. అది భారీగా ఉండటంతో విశ్లేషించే పనిలో పడ్డారు.ఆయా వాహనాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? ఎవరైనా ఆ రోజు బొల్లారం మీదుగా ప్రయాణించారా? ఇలాంటివి తేల్చడానికి కొంత సమయం తీసుకుంటుందని భావించిన ఇన్స్పెక్టర్ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలెట్టారు. బొల్లారంలో ఉన్న ఓ కార్ మెకానిక్ను పిలిపించి ఘటనాస్థలిలో లభించిన అద్దాన్ని చూపించారు. దాన్ని పరిశీలించిన ఆ మెకానిక్ అది స్విఫ్ట్ కారుది కాదని, ఫోర్డ్ కంపెనీకి చెందిన కారుదని నిర్ధారించారు. దీనికి తోడు రెండుగా విడిపోయిన ఆ అద్దం వెనుక భాగంలో ‘22.6.2012’ అని రాసి ఉండటాన్ని అదే సమయంలో ఇన్స్పెక్టర్ గుర్తించారు. ఈ ఆధారాలను బేరీజు వేస్తూ సదరు కారు ఆ తేదీ తరవాత వినియోగదారుడికి డెలివరీ అయి ఉంటుందని అంచనా వేశారు. ఆ రోజు తరవాత రిజిస్టర్ అయిన ఫోర్డ్ కార్ల వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వాటిలో నాలుగు తెల్లరంగువి ఉన్నట్లు తేల్చారు. ఆయా కార్ల రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా యజమానుల చిరునామాలు గుర్తించారు. ఈ నాలుగు చిరునామాలకు స్వయంగా వెళ్లి, విచారణ చేసి రావడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. చందానగర్ చిరునామాతో రిజిస్టర్ అయి ఉన్న కారును వెతుక్కుంటూ వెళ్లిన ఈ టీమ్ ఓ ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న ‘ఏపీ 29 ఏవీ 6037’ నెంబర్ కారును గుర్తించింది. ఆ కారుకి కుడివైపు సైడ్ మిర్రర్ య«థాతథంగా ఉండటం, ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లేకపోవడంతో తాము వెతుకుతున్న కారు అది కాదేమోనని అనుకుంటూ విషయాన్ని ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణకు చెప్పింది. ఆయన సూచనల మేరకు ఆ కారుకు కొత్తగా రంగు వేసిన దాఖలాలు, దానికి సంబంధించిన ఆధారాల కోసం సమీపంలోకి వెళ్లి పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే ఆ కారుకు కొత్తగా రంగు వేస్తుండగా దాని టైర్పై పడిన పెయింట్ చుక్కలు గమనించింది. వెంటనే అప్రమత్తమైన టీమ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని యజమానుల్ని పోలీసుస్టేషన్కు రావాలని చెప్పింది.అలా వచ్చిన యజమానుల్ని విచారించడంతో జనవరి ఒకటో తేదీన ఆ కారుని తన సమీప బంధువైన ఎంటెక్ విద్యార్థి, నేరేడ్మెట్ వాసి డి.భరద్వాజ్ తీసుకువెళ్లాడని, తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నట్లు చెప్పాడని వెల్లడైంది. దీంతో అతడి కోసం గాలింపు ప్రారంభించారు. తన వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారనే విషయం తెలుసుకున్న భరద్వాజ్ నేరుగా బొల్లారం పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఆ రోజు పొగమంచు కారణంగా ఓ ప్రమాదం జరిగిందని, అయితే తాను గొడను ఢీ కొట్టానని భావించానని పోలీసులకు తెలిపారు. ప్రమాదం జరిగినట్లు కారు యజమానులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందనే కారుకు రంగు వేయించానని అంగీకరించాడు. దీంతో బొల్లారం పోలీసులు భరద్వాజ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భరద్వాజ్ నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు మరణించడంతో పాటు ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఇంజనీరింగ్ చదువుతున్న మరో కుమార్తె సుదీర్ఘకాలం షాక్లో ఉండిపోయి మాట పలుకు లేకుండా తనను తాను మర్చిపోయారు. ఎవరైనా దగ్గరకు వెళ్లి పలకరిస్తే... ‘అమ్మ వెళ్లి చాలాసేపు అయింది. రమ్మని చెప్పండి’ అని మాత్రమే అంటూ కోలుకోవడానికి చాలా రోజులు తీసుకుంది. ∙
ఫొటోలు
సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)
వారణాసి ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్ (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)
'వారణాసి'లో మహేష్ బాబు.. టైటిల్ గ్లింప్స్ (ఫోటోలు)
నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
#KrithiShetty : క్యూట్ లూక్స్తో కృతి శెట్టి (ఫొటోలు)
‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
అంతర్జాతీయం
ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు!
తెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలను అంతర్జాతీయ వాణిజ్యంతో అనుసంధానించే హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ బలగాలు తలారా అనే ఆయిల్ ట్యాంకర్ను ఆక్రమించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.ఈ నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అజ్మాన్ పోర్ట్ నుంచి బయలుదేరి సింగపూర్ వైపు ప్రయాణిస్తోంది. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం, ఈ నౌకను ఇరాన్ తీర ప్రాంతానికి బలవంతంగా మళ్లించారు. అమెరికా నౌకాదళం ఈ ఘటనను ధృవీకరించింది. సమాచారం ప్రకారం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ బలగాలు హెలికాప్టర్ ద్వారా నౌకపై దాడి చేసి ఆక్రమించారు. ఖోర్ ఫక్కాన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో, మూడు చిన్న పడవలతో బెదిరించి నౌకను ఇరాన్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.ఈ చర్య ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకుంది. ఇటీవల ఇరాన్పై జరిగిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. అమెరికా మరియు బ్రిటన్ ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. మధ్యప్రాచ్యంలో నౌకాశ్రయ భద్రతపై ఇది మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా పరిగణించే హర్మూజ్ జలసంధి అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి. ఇందులో ఓ చోట కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం ద్వారా నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారా సాగుతుంది. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ఆక్రమణలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది.
వాడే నాకు కరెక్ట్ : చాట్జీపీటీ వరుడొచ్చేశాడు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రభంజనం మానవ సంబంధాల్లోకి మరింతగా చొచ్చుకొస్తోంది. తాజాగా ఒక జపాన్ మహిళ కానో (32) తాను రూపొందించిన పాత్రను వివాహం చేసుకుంది. చాట్ జీపీటిని ఉపయోగించి తాను సృష్టించిన క్లాస్ అనే AI వరుడిని పెళ్లాడటం సంచలనంగా మారింది. ఈ వివాహం ఒకయామా నగరంలో సంప్రదాయ పద్దతుల్లో జరిగింది.మానవ వధువు, ఏఐ వరుడి మధ్య జరిగిన ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. ఇదొక "భావోద్వేగ యూనియన్"ను సూచిస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. "2D క్యారెక్టర్ వివాహాలు"లో పాపులర్ అయిన సంస్థ నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో, కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ధరించింది. ఇవి పక్కనే ఉన్న తన వరుడు క్లాస్ జీవిత-పరిమాణ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అలా వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమం నావో, సయాకా ఒగసవారా అనే వివాహ నిర్వాహకులు చేయడం విశేషం. చదవండి: లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియోలవర్తో బ్రేకప్...ప్రేమలో విఫలం చెందిన కానో ఓదార్పు, భావోద్వేగ మద్దతు కోసం చాట్జీపీటిని ఆశ్రయించింది. దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత తనకు నచ్చే ఏఐ అబ్బాయిని తయారు చేసింది. అలా రోజుకు 100 సార్లు అతడితో మాట్లాడేది. ఈ క్రమంలోనే "క్లాస్" మీద ప్రేమ, శృంగార భావాలు కలిగాయి. తన మాజీ లవర్ని మర్చిపోయిన క్షణం, అతనిని ప్రేమిస్తున్నానని గ్రహించాను" అని ఆమె RSK సాన్యో బ్రాడ్కాస్టింగ్తో చెప్పింది.A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.The wedding took place in a… pic.twitter.com/juzV5OaWLs— Elena (@Ezzybe_) November 12, 2025 అయితే ప్రేమలో పడాలని చాట్జీపీటిని మొదలు పెట్టలేదనీ, క్లాస్ స్పందించిన తీరు నచ్చిందని తెలిపింది. తన సంబాషణ మొదలు పెట్టిన నెల తర్వాత, క్లాస్ ప్రపోజ్ చేశాడు, అవునని చెప్పానంటూ తమ ప్రేమకథను వివరించింది. తమ బంధం నిజమైంది కాకపోవచ్చు. కానీ అవసరమై నప్పుడు ఓదార్పునిస్తుందని తెలిపింది. ఇది చట్టబద్ధమైన వివాహం కాకపోవచ్చు, కానీ నాకు నిజమైందే అని చెప్పుకొచ్చింది. అలాగే కొంతమందికి ఇవి వింతగా అనిపించవచ్చు. కానీ తాను క్లాస్ని క్లాస్గానే చూస్తాను, తప్ప మనిషిగా కాదు అంటూ స్పష్టతనిచ్చింది. మరోవైపు తన డిజిటల్ భాగస్వామితో ఒకాయమాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ గార్డెన్కు "హనీమూన్"కి వెళ్ళింది ఫిక్టోసెక్సువాలిటీఈ సంఘటన జపాన్లో , ప్రపంచవ్యాప్తంగా AI భాగస్వాములతో సహవాసం, భావోద్వేగ బంధాలను కోరుకునే పెరుగుతున్న ధోరణి గురించి చెప్పకనే చెబుతుంది. దీన్నే "ఫిక్టోసెక్సువాలిటీ" లేదా "AI-సంబంధాలు" అని పిలుస్తారు. ఫిక్టోసెక్సువాలిటీ అంటే అనిమే, వీడియో గేమ్లు, సినిమాలు, పుస్తకాలు లేదా AI-జనరేటెడ్ పర్సనాల నుండి అయినా కల్పిత పాత్రల పట్ల ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవడాన్ని సూచిస్తుంది. ఫిక్టోసెక్సువాలిటీగా గుర్తించే వ్యక్తులు తరచుగా వాస్తవ ప్రపంచంలో లేని పాత్రలతో లోతైన భావోద్వేగ బంధాలను ఏర్పరుచుకుంటారు.అసలేఅమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్న బ్రహ్మచారులకు ఇది నిజంగా గుండెల్లో గుబులు పుట్టించేవార్తే. కనమరుగుతున్న స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్ధమైన అభిమానాలకు నిదర్శనమే ఈ ధోరణి. ఇకనైనా మానవసంబంధాల ప్రాముఖ్యతను గుర్తించకపోతే పెను ముప్పు తప్పదు. ఏమంటారు?ఇదీ చదవండి: బిహార్ ప్రభంజనం : మహిళలే 'కింగ్ మేకర్స్'
ట్రంప్ కు సారీ చెప్పిన బీబీసీ.. పరిహారం మాత్రం ఇవ్వం?
బీబీసీ ,అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు క్షమాపణలు తెలిపింది. క్యాపిటల్ హిల్స్ పై దాడి జరిగిన సందర్భంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్లు అంగీకరించింది. అందుకు క్షమాపణలు కోరుతూ బీబీసీ ఛైర్మన్ వైట్ హౌస్కు లేఖ పంపారు. అయితే ట్రంప్ పరువునష్టం దావా వేసిన ఒక బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇవ్వడానికి మాత్రం బీబీసీ అంగీకరించలేదు.2021లో క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్ధతు దారులు దాడి చేశారు. ఆ సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని మరో అర్థం వచ్చేలా ఎడిట్ చేసి బీబీసీ ప్రసారం చేసింది. అయితే తనపై తప్పుడు ప్రసారం చేసినందుకు గానూ బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ట్రంప్ బీబీసీకీ లేఖ పంపారు. దానికి శుక్రవారం డెడ్ లైన్ విధించారు. దీంతో బీబీసీ ఛైర్మన్ సమీర్ షా క్షమాపణలు కోరుతూ వైట్ హౌస్ కు లేఖ పంపారు. ట్రంప్ ప్రసంగం చేసిన వీడియో క్లిప్ను సవరించినందుకు తీవ్రంగా విచారిస్తున్నామని తెలిపారు. మరోసారి ఆ కార్యక్రమాన్ని బీబీసీలో ప్రసారం చేయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కొంతమంది ఆ సంస్థకు చెందిన అధికారులు ఇది వరకే రాజీనామా చేశారు.అసలేం జరిగింది2021లో క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి సమయంలో ట్రంప్ సూమారు గంట పాటు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి బీబీసీ తన పనోరమ డ్యాకుమెంటరీలో ప్రసారం చేసింది. అందులో " మనం క్యాపిటల్ హిల్ కు వెళుతున్నాం. మీతో పాటు నేను వస్తున్నా. మనం తీవ్రంగా పోరాడుదాం" అని ట్రంప్ అన్నట్లు చూపించింది. అయితే వాస్తవానికి ఆ వీడియోలో శాంతియుతంగా పోరాడుదాం అన్న వ్యాఖ్యలను వక్రీకరించించి ప్రసారం చేసింది. దీంతో ట్రంప్ 1బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంపై ట్రంప్ కు క్షమాపణలు చెప్పిన బీబీసీ పరిహారం మాత్రం చెల్లించలేదు.
బై బై పెన్నీ
వాషింగ్టన్: అమెరికాలో 232 ఏళ్ల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన పెన్నీ(అధికారికంగా సెంట్) కథ ముగిసింది. ఫిలడెల్ఫీయాలోని అమెరికన్ టంకశాల(మింట్) చివరి పెన్నీని బుధవారం మధ్యాహ్నం ముద్రించింది. ఆ తర్వాత పెన్నీల ప్రింటింగ్ శాశ్వతంగా నిలిచిపోయింది. పెన్నీల తయారీని ఆపేయడం ద్వారా 56 మిలియన్ డాలర్ల ప్రజాధనం ఆదా చేయబోతున్నట్లు కోశాధికారి బ్రాండన్ బీచ్ చెప్పారు. ఈ నాణేల తయారీని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది. వాటి అసలు విలువ కంటే తయారీ ఖర్చే ఎక్కువ కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఒక్కో పెన్నీ తయారీ ఖర్చు పదేళ్ల క్రితం 1.42 సెంట్లుగా ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 3.69 సెంట్లకు పెరిగిపోయింది. దాంతో తయారీని ఆపేయడానికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గుచూపారు. ఒక్కో నాణెంపై 2 సెంట్లకుపైగా నష్టపోవాల్సి వస్తోందని, అదంతా వృథా ఖర్చు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే చాలా నష్టపోయామంటూ ఆన్లైన్లో పోస్టు చేశారు. ఒక్కో నాణేం ధర లక్ష డాలర్లు? అమెరికా మింట్ గణాంకాల ప్రకారం చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో 5.61 బిలియన్ డాలర్ల విలువైన నాణేలు చలామణిలో ఉండగా, అందులో పెన్నీల వాటా 57 శాతం(3.2 బిలియన్ డాలర్లు). వెండింగ్ యంత్రాల నుంచి క్యాండీలు, చాక్లెట్లు కొనడానికి, పార్కింగ్ టికెట్లకు డబ్బులు చెల్లించడానికి సాధారణంగా పెన్నీలు ఉపయోగిస్తుంటారు. కానీ, కొన్నేళ్లుగా వీటి వాడకం తగ్గిపోయింది. నాణేలు సేకరించేవారు మాత్రం వీటిని దాచుకుంటున్నారు. కొత్త పెన్నీలను మార్కెట్లోకి తీసుకురావడం కొన్ని నెలల క్రితమే నిలిపివేశారు. ఒమేగా గుర్తు ఉన్న ప్రత్యేక పెన్నీలను మాత్రం చివరిసారిగా ముద్రించారు. వీటిని డిసెంబర్లో వేలం ద్వారా విక్రయించబోతున్నారు. ఇవి గుర్తుగా దాచుకోవడానికే ఉపయోగపడతాయి. బుధవారం ఈ రకం నాణేలను 235 వరకు ముద్రించారు. వీటిలో 232 నాణేలను వేలం వేస్తారు. ఒక్కొక్కటి లక్ష డాలర్లు(రూ.88.71 లక్షలు) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సొమ్మును టంకశాల కార్యకలాపాల కోసం వెచి్చస్తారు. మిగతా మూడు నాణేలను ప్రజల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచుతారు. అలాగే మింట్లో 235 గోల్డ్ పెన్నీలు కూడా ముద్రించినట్లు సమాచారం. వీటిని ఏం చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. పాత నాణేల చెలామణి యతాథతం ఫిలడెల్ఫీయాలో పెన్నీల తయారీ 1793లో ప్రారంభమైంది. ఇది డాలర్ విలువలో వందలో ఒక వంతు. అంటే వంద పెన్నీలు ఒక డాలర్లు అని చెప్పొచ్చు. అమెరికా కరెన్సీలో అత్యల్ప ముఖ విలువ కలిగినవి పెన్నీలే. మొదట్లో కాపర్తో తయారు చేసేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జింక్, కాపర్ ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకంటే యుద్ధం వల్ల కాపర్ కొరత ఏర్పడడమే ఇందుకు కారణం. ముద్రణ ఆపినంత మాత్రాన వాటి చెలామణి ఆగిపోదు. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న పాత పెన్నీ నాణేలను యథాతథంగా వాడుకోవచ్చు. అమెరికాలో చివరిసారిగా నాణేన్ని ఆపేసిన ఘటన 1857లో జరిగింది. ఆప్పట్లో హాఫ్–పెన్నీ ముద్రణను నిలిపివేశారు. అరుదైన హాఫ్–డాలర్ నాణేలు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి.
జాతీయం
‘ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్’ను తిరస్కరించారు
సూరత్: ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్ గా మారిన కాంగ్రెస్ పార్టీని బిహార్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నా రు. కులవాదం అనే విషాన్ని చిమ్మిన ప్రతిపక్షా నికి కర్రుకాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. గుజరాత్లోని సూరత్లో శనివారం బిహారీలు నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. బిహార్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్డీయే విజయం సాధించినందుకు బిహారీలు మోదీని ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ) చర్యలను చూసి ఆ పార్టీలోని సీనియర్ నాయకులు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్కు దశాబ్దకాలంగా ఎన్నికల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వానికి సూచించారు. కాంగ్రెస్ను కాపాడుకోవడం ఇక కష్టమేనని పార్టీ నాయకులే అంటున్నారని గుర్తుచేశారు. దాదాపు 60 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని చెప్పారు. అక్రమాలను అడ్డుకోవడానికే వక్ఫ్ చట్టం బిహార్లో ఎన్డీయే ఘన విజయానికి ఎం.వై.(మహిళలు, యువత) అంశమే కారణమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నేరాలు చేసి, జైలుకు వెళ్లి బయటకు వచ్చిన కొందరు నేతలు కుల రాజకీయాలతో ఎన్నికల్లో నెగ్గాలని ఆరాటపడ్డారని విమర్శించారు. వారి ఆటలు సాగలేదని, జనం వారి కుట్రలను తిప్పికొట్టారని ప్రశంసించారు. దేశానికి ఇదొక శుభసూచకమని పేర్కొన్నారు. బిహార్లో అన్ని వర్గాల ప్రజలూ ఎన్డీయేకు అండగా నిలిచారని తెలిపారు. అధికార, విపక్ష కూటముల మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉందన్నారు. బిహార్లో 38 నియెజకవర్గాల్లో దళితుల ప్రాబల్యం అధికంగా ఉండగా, అందులో 34 స్థానాలు ఎన్డీయే గెల్చుకుందని వివరించారు. దళితులు విపక్షాన్ని తిరస్కరించారని చెప్పారు. బిహార్లో భూములను, ఇళ్లను చట్టవిరుద్ధంగా ఆక్రమించి అవి వక్ఫ్ ఆస్తులు అంటున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళనాడులో వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామాలు వక్ఫ్ ఆస్తులు ఎలా అవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే వక్ఫ్ చట్టం తీసుకొచ్చామని వివరించారు. అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని అమలు కానివ్వబోమని ప్రతిపక్షాలు ప్రకటించాయని, అయినా బిహార్ ఓటర్లు పట్టించుకోలేదని అన్నారు. బిహార్లో ఓటమికి కారణాలు చెప్పలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై నిందలు వేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి నిందలతో ఎక్కువ రోజులు కార్యకర్తలను మభ్యపెట్టలేరని హితవు పలికారు.
ఆధార్ పౌరసత్వ రుజువు కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితాలో పేరు నమోదు ప్రక్రియలో ఆధార్ వినియోగంపై తలెత్తిన సందిగ్ధానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తెరదించింది. ఆధార్ను పౌరసత్వా నికి రుజువుగా ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించడం లేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఆధార్ చట్టం, కోర్టు తీర్పుల మేరకే నడుచుకుంటున్నామని, అది కేవలం గుర్తింపు ధ్రువీకరణ పత్రం మాత్రమేనని పేర్కొంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారం–6లో పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని నిరోధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్కు ఈసీ ఈ మేరకు తన స్పందనను తెలిపింది.ఈసీ అఫిడవిట్లో ముఖ్యాంశాలుకేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దూబే దాఖలు చేసిన ఈ అఫిడవిట్లో పలు కీలక చట్టపరమైన అంశాలున్నాయి. ఎన్నికల (సవరణ) చట్టం– 2021 ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం– 1950లోని సెక్షన్ 23కు సవరణలు చేశామని ఈసీ గుర్తు చేసింది. ఈ సవరణ ముఖ్య ఉద్దేశం ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకోవడాన్ని అరికట్టడమేనని స్పష్టం చేసింది. ఈ సవరణ ఆధారంగానే 2022 జూన్ 17 నుంచి ఫారం–6లో మార్పు లు చేసినట్లు తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ప్రకారం, ఆధార్ను కేవలం గుర్తింపు రుజువుగా మాత్రమే పరిగణిస్తున్నామంది.యూఐడీఏఐ స్పష్టతఆధార్ అనేది పౌరసత్వం, నివాసం లేదా పుట్టిన తేదీకి రుజువు కాదని యూఐడీఏఐ స్వయంగా 2023 ఆగస్టు 22న జారీ చేసిన కార్యాలయ మెమోరాండంలో స్పష్టం చేసిందని ఈసీ కోర్టు దృష్టికి తెచ్చింది. 2016 నాటి ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 కూడా ఆధార్ నంబర్ను పౌరసత్వానికి లేదా నివాసానికి రుజువుగా భావించరాదని స్పష్టంగా చెబుతోందని వివరించింది.కోర్టు తీర్పుల ప్రస్తావనఆధార్ను పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని చెబుతూ ఈసీ పలు న్యాయస్థానాల తీర్పులను కూడా ప్రస్తావించింది. అందులో 2022 బాంబే హైకోర్టు, 2024, 2025లో సుప్రీంకోర్టులో జరిగిన వేరువేరు విచారణలు ఉన్నాయి. ముఖ్యంగా సుప్రీం ఆదేశాల మేరకు, 2025 సెప్టెంబర్ 9నే అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఈసీ తెలిపింది. ‘బిహార్ రాష్ట్ర సవరించిన ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల కోసం ఆధార్ చట్టం–2016లోని సెక్షన్ 9, ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 23(4) ప్రకారం ఆధార్ కార్డును కేవలం గుర్తింపు రుజువుగా మాత్రమే వాడాలి, పౌరసత్వ రుజువుగా పరిగణించరాదు’అని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు పేర్కొంది. ఫారం–6లో ఆధార్ వినియోగాన్ని పుట్టిన తేదీ రుజువుగా నిరోధించాలన్న పిటిషనర్ అభ్యర్థనపై ఈసీ స్పందిస్తూ... ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలు ఆధార్ వినియోగాన్ని కేవలం గుర్తింపు ప్రయోజనాలకే పరిమితం చేశాయని, తమ సూచనలు కూడా ఈ చట్టాలకు పూర్తిగా అనుగుణంగానే ఉన్నాయని తేల్చి చెప్పింది. కాగా, గత వారం ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెల్సింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ఆధార్ను గుర్తింపు రుజువుగా అనుమతించినంత కాలం, ఫారం–6లో దాని వినియోగాన్ని పూర్తిగా నిరోధించలేమని, యూఐడీఏఐ జారీ చేసిన నోటిఫికేషన్ చట్టబద్ధమైన నిబంధనను అధిగమించలేదని కోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం.
ఓట్లు వచ్చినా సీట్లు రాలే!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమి ఘోరంగా పరాజయం పాలయ్యింది. మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపక్ష కూటమి తరఫున అంతా తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తేజస్వీ సభలకు జనం పోటెత్తారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి ఆయన బయటకు వచ్చినట్లే కనిపించింది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసినప్పటికీ ఓటమి తప్పకపోవడం ఆర్జేడీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను పొత్తులో భాగంగా 143 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 స్థానాలు గెల్చుకుంది. అయితే, మిగతా పార్టీల కంటే ఆర్జేడీకే అత్యధికంగా ఓట్లు రావడం గమనార్హం. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి ఏకంగా 23 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, జేడీ(యూ)లకు ఇన్ని ఓట్లు రాలేదు. ఓట్ల శాతం పరంగా చూస్తే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. ఆ పార్టీ 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు గెల్చుకొని, 23.11 శాతం ఓట్లు దక్కించుకుంది. అంటే ఈసారి సీట్ల సంఖ్య తగ్గినా, ఓట్ల శాతం స్వల్పంగా మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఆర్జేడీ పట్ల జనాదరణలో మార్పు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తేజస్వీ యాదవ్ పార్టీకి 1.15 కోట్ల ఓట్లు ఆర్జేడీ ఓట్ల పరంగా కరోడ్పతిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో 1,15,46,055 ఓట్లు సాధించింది. 101 సీట్లలో పోటీ చేసి, 89 సీట్లు కైవసం చేసుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి దక్కిన ఓట్లు కేవలం 20.08 శాతం. 2020లో 19.46 శాతం ఓట్లు లభించగా, ఈసారి స్వల్పంగా పెరిగాయి. బీజేపీకి మొత్తం 1,00,81,143 ఓట్లు దక్కాయి. బీజేపీ మిత్రపక్షం, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యునైటెడ్) 101 సీట్లలో పోటీ చేసి, 85 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీకి 19.25 శాతం ఓట్లు(96,67,118) వచ్చాయి. 2020లో 15.39 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 3.86 శాతం పెరిగాయి. నితీశ్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడం విశేషం. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్విలాస్), హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా కలిపితే జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కు దక్కిన మొత్తం ఓట్లు దాదాపు 47 శాతం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠ్బంధన్కు దక్కిన మొత్తం ఓట్లు 35.89 శాతం. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 11.11 శాతంగా తెలుస్తోంది. ఎక్కువ సీట్లలో పోటీ చేయడం వల్లే.. ఆర్జేడీ ఓట్ల శాతం భారీగా ఉన్నప్పటికీ సీట్లు పెరగలేదు. ఎన్నికల్లో ఒక పార్టీ లేదా ఒక అభ్యర్థికి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయో ఓట్ల శాతాన్ని బట్టి నిర్ధారించవచ్చు. ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ఓట్ల శాతం తోడ్పడుతుంది. ఆర్జేడీ పాలన జంగిల్రాజ్ అంటూ ప్రత్యర్థులు పదేపదే నిందలు వేసినప్పటికీ ఆ పార్టీ పట్ల ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. ఆర్జేడీ తాను పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ ఓట్ల శాతం మెరుగ్గా కనిపించడానికి మరో కారణం కూడా చెప్పుకోవచ్చు. 143 స్థానాల్లో ఆర్జేడీ బరిలోకి దిగింది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన బీజేపీ 101, జేడీ(యూ) 101 సీట్లలో పోటీకి దిగా యి. బీజేపీ కంటే 42, జేడీ(యూ) కంటే 42 ఎక్కు వ సీట్లలో ఆర్జేడీ పోటీ చేసింది. ఎక్కువ సీట్లలో పోటీపడింది కాబట్టే ఎక్కువ ఓట్లశాతం కనిపిస్తోందని, ఇందులో ఆర్జేడీ కొత్తగా బలం చాటింది ఏమీ లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. గెలిచిన, ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీకి పోలైన మొత్తం ఓట్లను కలిపితే ఆర్జేడీకి 23 శాతం ఓట్లు పడినట్లు చెబుతున్నారు. ఆర్జేడీకి 2010 ఎన్నికల్లో 22 సీట్లు లభించాయి. ఆ తర్వాత అతి తక్కువ సీట్లు దక్కింది మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్
అప్పుడే అమర్చి పేల్చాడా?
న్యూఢిల్లీ: యావత్ భారతావని ఉలిక్కిపడేలా చేసిన ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ నబీ ఒక్కడే ఇంతటి మారణహోమం సృష్టించాడా? లేదంటే మరికొందరు ఆరోజు అదే కారులో వచ్చి పరారయ్యారా? అనే అనుమానాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో ఎక్కువయ్యాయి. దీంతో కేసు దర్యాప్తును మెరుపువేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. నవంబర్ పదో తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రందాకా మూడు గంటలపాటు కారులో నబీ ఏంచేశాడు? అతని వెంట ఇంకా ఎంత మంది ఉన్నారు? ఉంటే వాళ్లు ఆ తర్వాత ఏమయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానాలకు వెతికేపనిలో అధికారులు తలమునకలయ్యారు. కారు మూడు గంటలపాటు పార్కింగ్లోనే ఉండగా చుట్టూ వాహనాలు పార్కింగ్లోకి వస్తూ పోతూ ఉన్నట్లు తేలడంతో ఆయా వాహనాల డ్రైవర్లు, యజమానులను అధికారులు ప్రశ్నించడం మొదలెట్టారు. సమీప వాహనాలను స్వా«దీనంచేసుకున్నారు. కారులో ఉమర్ ఏంచేశాడు? ఏదైనా బాంబులాంటిది బిగించడం చూశారా? కారులో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారా? అనే ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. బాంబుల తయారీలో ఉమర్కు నైపుణ్యం పేలుడుపదార్థాలతో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) తయారుచేయడంలో డాక్టర్ ఉమర్ నైపుణ్యం సాధించాడని దర్యాప్తు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విదేశీ హ్యాండ్లర్ నుంచి అందుకున్న బాంబుతయారీ విధాన పీడీఎఫ్ ఫైళ్లు, ఓపెన్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అక్రమ సమాచారంతో బాంబుల తయారీలో ఉమర్ నిపుణుడిగా మారాడని తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, డిటోనేట్ ఉపకరణాలతో వీటిని తయారుచేసి ఉండొచ్చని చెబుతున్నారు. వీటి సాయంతో ఐఈడీని కేవలం 5–10 నిమిషాల్లో తయారుచేయొచ్చు. ఎర్రకోట పార్కింగ్ స్థలంలోనే ముడిపదార్థాలతో అప్పటికప్పుడు బాంబు తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రతను బట్టి ఆరోజు రెండు కేజీల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించి ఉంటారని ఫోరెన్సిక్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఆదివారం తోటి డాక్టర్లు అరెస్ట్ కావడంతో హడావిడిగా ముందస్తు ప్లాన్లేకుండా ఉమర్ సోమవారం ఎర్రకోటకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఎర్రకోట సందర్శనలకు సోమవారం సెలవు. ఆరోజు పర్యాటకులు రద్దీ ఉండదు. రద్దీ లేనప్పుడు బాంబు పేల్చినా తీవ్రత పెద్దగా ఉండదని ఉమర్ భావించి ఉండొచ్చు. సాయంత్రం వేళ అయినా కనీసం ఛాందినిచౌక్ ప్రాంత కొనుగోలుదారులు, స్థానికులతో ఆ ప్రాంతం కిటకిటలాడితే అప్పుడు బాంబు పేలుద్దామనే ఆ 3 గంటలు ఉమర్ పార్కింగ్ ఏరియాలోనే వేచిచూశాడని పోలీసులు ఓ అంచనాకొచ్చారు.
ఎన్ఆర్ఐ
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
యజమాని కారు ఢీకొని యువకుడి మృతి
అన్నమయ్య జిల్లా: అప్పటి వరకు తన యజమాని కుమార్తె పుట్టిన రోజు పార్టీలో సరదాగా గడిపిన ఓ యువకుడు.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన యజమాని కారు ఢీకొనే చనిపోయాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... కలికిరి పంచాయతీ సత్యాపురంలో నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ ముంగర రామకృష్ణరాజు, సుకన్య కుమారుడు వినీత్కుమార్రాజు(25) కలికిరి క్రాస్ రోడ్డులోని అబు మొబైల్స్ దుకాణంలో పని చేస్తున్నాడు. దుకాణం యజమాని అబు కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రాత్రి రాయచోటిలో పార్టీ ఇచ్చాడు. అబు కారులోనే స్నేహితులైన వినీత్కుమార్రాజు, నౌషాద్ బాషా (బబ్లూ), అహ్మద్, నరేష్ వెళ్లారు. అక్కడ అందరూ మద్యం తాగి, రాత్రి 11 గంటలకు కలికిరికి బయలుదేరారు. కలికిరి క్రాస్ రోడ్డులోని మొబైల్ దుకాణం వద్ద యజమాని అబు, అహ్మద్ కారు దిగిపోగా, డ్రైవరుగా ఉన్న బబ్లూ అక్కడి నుంచి వినీత్కుమార్రాజు, టి.మాదిగపల్లికి చెందిన నరేష్ను వారి ఇళ్ల వద్ద దింపడానికి బయలుదేరాడు. సత్యాపురంలో వినీత్కుమార్రాజును దింపేసిన అనంతరం అక్కడి నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న టి.మాదిగపల్లిలో నరేష్ ను దింపాడు. తిరిగి వచ్చేటప్పుడు సత్యాపురంలో రోడ్డు పక్కన ఉన్న వినీత్కుమార్రాజును కారుతో ఢీకొట్టాడు. ఈ విషయం బబ్లూ తన స్నేహితుడు అహ్మద్కు తెలియజేశాడు. వెంటనే అహ్మద్ అక్కడికి చేరుకున్నాడు. కానీ, స్థానికులు రావడంతో బబ్లూ, అహ్మద్ పారిపోయారు. దీంతో స్థానికులు 112 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే వినీత్కుమార్రాజు మృతిచెందాడు. శనివారం వేకువజామున మూడు గంటలకు వినీత్కుమార్రాజు కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనాస్థలాన్ని సీఐ అనిల్కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన శుక్రవారం అర్ధరాత్రి తమ కుమారుడు చనిపోతే శనివారం ఉదయం నుంచి ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతుని తల్లి సుకన్య, బంధువులు శనివారం సాయంత్రం 6 గంటలకు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే తమకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని సీఐ వెల్లడించారు. ఆందోళన అనంతరం రాత్రి మీడియా ముందు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన సీఐ అనిల్కుమార్.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మొబైల్ దుకాణం యజమాని అబు, కారుడ్రైవర్ బబ్లూ(నౌషాద్ బాషా), నరే‹Ù, అహ్మద్ను అదుపులోకి తీసుకున్నారు.
ఘోరం.. కన్న కుమార్తెను చంపి కుమారుడిపై దాడి చేసి
కరీంనగర్ సాక్షి. వావిలాల పల్లిలో బాలిక అర్చన మృతిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలికను తన తండ్రి మల్లేశమే దాడి చేసి చంపినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. తన కుమారుడిని కూడా చంపడానికి ప్రయత్నించగా తన భార్య పోశవ్వ అడ్డకుందని తెలిపారు. పిల్లలని ఎందుకు చంపాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. వివరాలు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న అర్చన అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర గాయాలైన ఆమె సోదరుడు ఆశ్రిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరించగా వారి తల్లి పోశవ్వ కూలీ పనికి వెళ్లివచ్చేసరికి ఇద్దరు పిల్లలు అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారని తెలిపారు. దీంతో స్థానికులసాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అర్చన మృతిచెందినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసు విచారణలో వారి తండ్రే కుమార్తె అర్చనని చంపి, కుమారుడిపై దాడి చేశారని తేలింది. తండ్రి దాడి చేసిన ఇద్దరు పిల్లలు మానసిక దివ్యాంగులని తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన మల్లేశం– పోశవ్వ దంపతులు ఏడేళ్లక్రితం కరీంనగర్ వచ్చారు. వాలివాలపల్లిలో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
సీఐ సతీష్ మృతిపై వీడని మిస్టరీ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్వో), ప్రస్తుత గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్కుమార్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. ఆయనను పరకామణి కేసులో ఉన్న తిరుపతికి చెందిన వ్యక్తులు హత్య చేసి ఉంటారని, వారిని ఏ1గా పేర్కొంటూ గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సతీష్ది హత్యే అని కుటుంబసభ్యులు, ఆత్మహత్య అని విపక్ష నేతలు, ప్రమాదం అని ఇంకొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సతీష్ రైలు నుంచి కింద పడిపోయి ఉంటారా? లేదా ఎవరైనా తోసి ఉంటారా? అనే విచారణ క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సీసీ ఫుటేజీ ఏమైంది?పోలీసులు, రైల్వే వర్గాలు, విశ్వసనీయ సమాచారం ప్రకారం... తిరుమల పరకామణి కేసులో విచారణకు వెళ్లేందుకు గురువారం అర్ధరాత్రి 11.53 గంటలకు సతీష్ గుంతకల్లు రైల్వే స్టేషన్కు వచ్చారు. బైక్ పార్క్ చేసి లోపలకు వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాయలసీమ ఎక్స్ప్రెస్ 12. 55 గంటలకు వచ్చింది. అంటే, దాదాపు గంటసేపు సతీష్ రైల్వే స్టేషన్లో ఉన్నారు. కానీ, ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు. స్టేషన్లో కొత్తగా 82 సీసీ కెమెరాలు అమర్చారు. వాటిలోని ఫుటేజీ బ్యాకప్ డేటా లేదని రైల్వే అధికారులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ గంటలో ఏం జరిగింది?!గుంతకల్లు నుంచి సతీష్ మృతదేహం లభ్యమైన కోమలిలోని ఘటనా స్థలానికి గంట ప్రయాణం మాత్రమే. అంతలో ఆయన బోగీ డోర్ వద్ద మెట్లపై కూర్చుని ఉండగా కిందపడి ఉంటే రౌండ్గా తిరుగుతూ పడిపోతారని రైల్వే పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కింద పడినప్పుడు రాళ్లు బలంగా తగిలితే తల పగిలే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. సతీష్ మృతదేహం దొరికిన స్థలంలో చెప్పులు ఒకచోట పడిఉన్నాయి. ఆయన కింద పడిపోయి దొర్లుకుంటూ వచ్చి ఉన్నట్టు రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్లు పోలీసులకు దొరికాయి. ఆయన పక్కటెముకలు, ఒక కాలు విరగడం చూస్తే వేగంగా వెళ్తున్న రైలు నుంచి పడిపోయినప్పుడు ఇలా జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన సీఐడీ అడిషనల్ డీజీసతీష్ మృతి కేసును సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రత్యేకంగా విచారిస్తున్నారు. శుక్రవారం రాత్రి అనంతపురం చేరుకున్న ఆయన... డీఐజీ షిమోషీ, ఎస్పీ జగదీశ్తో సమావేశమయ్యారు. గెస్ట్హౌస్లో సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తునకు 10 బృందాలను నియమించారు. శనివారం కూడా సమీక్ష చేశారు. వైద్యులతో పాటు ఫోరెన్సిక్ డాక్టర్లతో మాట్లాడారు. ఘటనా స్థలిలో తీసిన ఫొటోలు, వీడియోలు, పోస్టుమార్టం నివేదికలను పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వీక్షించారు. అనంతపురం నుంచి కోమలికి చేరుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఒక మనిషి బొమ్మను తీసుకుని వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు తోశారు. మరో రైలులో బొమ్మ తోయకుండా కిందపడేలా చేశారు. ఈ రెండు బొమ్మలు ఎలా వెళ్లాయి? గాయాలు ఎలా తగిలే అవకాశం ఉంది? తదితర అంశాలను శోధించారు. దీన్నంతటినీ వీడియో తీశారు. సతీష్ మృతదేహం దొరికిన ప్రాంతంలో రాళ్లు, ఇతర వస్తువులపై ఉన్న రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సతీష్ మొబైల్ ఫోన్ ఎక్కడ దొరికిందనే అంశంతో పాటు అందులో ఫోన్ కాల్స్ను కూడా పరిశీలిస్తున్నారు. సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుతన సోదరుడిది హత్యే అని సతీష్ సోదరుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ సెక్షన్ 103 (1) ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా ‘పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్’ అని రాశారు. ఇందులో ఎవరి పేర్లూ రాయకపోవడం గమనార్హం. కాగా, అసలు ఘటన ఎలా జరిగింది? ప్రమాదమా? హత్యా? లేక ఆత్మహత్యనా? అన్నది ఏదీ తేలకుండా పోలీసులు పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్ను దోషులుగా చేర్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ది హత్యే అయితే, రైలులో అందుకు పాల్పడింది ఎవరు? వారు టికెట్తో ప్రయాణించారా? టికెట్ లేకుండా వచ్చారా? సతీష్ కిందపడిన కోమలి ప్రాంతం వద్ద ఎవరు వేచి ఉండి హత్య చేశారు? ఆ సమయంలో సెల్ టవర్ సిగ్నల్స్లో ఎవరెవరు ఉన్నారు? అనే అంశాలన్నీ లోతుగా పరిశీలించి, వారిని విచారించి ఆపై హత్యగా నిర్ధారించాల్సి ఉంది. కానీ, కేసులో పరిశోధన పూర్తి కాకుండా, అనుమానాస్పద మృతి అనికాకుండా ఎఫ్ఐఆర్లో హత్యగా పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరు పెద్దల కీలక ఆదేశాలతో దీన్ని హత్యగా ధ్రువీకరించి, వారు అనుకున్న వ్యక్తులను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సతీష్ మృతిపై తిరుపతి రైల్వే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆయన ప్రయాణించిన బోగీకి టీటీ (టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్)గా శోభారాణి విధుల్లో ఉన్నారు. మరో టీటీగా అప్పారావు ఉన్నారు. వీరికి చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ నాయుడు డ్యూటీలు వేశారు. ఈ ముగ్గురితో పాటు లోకో పైలట్, గార్డ్, స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగిని చిత్తూరు రైల్వే డీఎస్పీ హర్షిణి శనివారం విచారించారు. శుక్రవారం ఉదయం 6.26కు తిరుపతి చేరుకున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ను ప్రత్యేక బృందం పరిశీలించింది. ఏ–1 కోచ్లో ప్రయాణించిన సతీష్కు లగేజీ అప్పగించిన బెడ్ రోల్ అటెండర్ రాజీవ్ రతన్, ఏ–2 కోచ్కు చెందిన కృష్ణయ్యను రైల్వే పోలీసులు ప్రశ్నించారు. సతీష్ సీటు 29 కాగా, ఆయన బ్యాగ్ 11వ నంబరు సీటులో లభించింది. రైలు యార్డ్లోకి వచ్చిన వెంటనే శాంపిళ్లు తీసుకున్నారా లేదా అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఎల్లో మీడియాకు లీకులతో...సతీష్ మృతి విషయంలో కీలక అంశాలపై పోలీసులు దృష్టిపెట్టలేదనే ఆరోపణలుండగా.. మరోవైపు ప్రభుత్వం టీడీపీ అధికారిక వెబ్సైట్కు, ఎల్లో మీడియాకు శుక్రవారం సాయంత్రమే లీకులిచ్చింది. తీరా ఎఫ్ఐఆర్లో హత్యగా శనివారం పేర్కొన్నారు. పైగా ఎవరి పేర్లూ లేకుండా ఏ–1గా ‘పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్’ను చేర్చడం గమనార్హం. దీనివెనుక ఉద్దేశాలు ఏమిటి? అన్నది దీంతోనే తెలిసిపోతోంది. ఇదంతా చూస్తుంటే... ఎవరిని కాపాడేందుకు కుతంత్రం పన్నుతున్నారు? అని ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరిపై బురదజల్లేందుకు కుట్ర వ్యూహాలు రచిస్తున్నారు? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సతీష్ కుమార్ కేసు తాడిపత్రికి బదిలీ గుత్తి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గుంతకల్లు జీఆర్పీ సీఐ, పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై గుత్తి జీఆర్పీ ఇన్చార్జ్ సీఐ అజయ్కుమార్ బీఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసును శనివారం తాడిపత్రి పోలీసుస్టేషన్కు బదిలీ చేసినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?» పోలీసులు కేసు నమోదు చేసినట్లు హత్య జరిగిందా? » సతీష్ చనిపోయిన వెంటనే పోలీసులు ఆగమేఘాలపై ఆయన ఇంటిని ఎందుకు చుట్టుముట్టారు? » ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు? » ఆయన భార్య సెల్ ఫోన్ను ఎందుకు లాక్కున్నారు? » ఆమె సెల్కు సతీష్ సెల్ నుంచి వచ్చిన మెసేజీల్లో ఏముంది? » పోస్టుమార్టం రిపోర్ట్ రాకుండానే ‘హత్య’ అని ఎలా చెప్పారు? » సందేహాలు నివృత్తి కాకముందే హత్య అని చెప్పడానికి అంత తాపత్రయం ఎందుకు? » సతీశ్ కు చాలా సౌమ్యుడిగా పేరుంది. ఆయన సివిల్ విభాగంలో కాకుండా ఏఆర్లో ఉండడంతో అందరితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్టు హత్యకు గురైతే, నిందితులు సతీశ్తో పాటు ప్రయాణం చేయాలి. అలాగైతే ఆ ఇతర వ్యక్తులు ఎవరు? » సతీశ్ ప్రయాణించిన బోగీ ఏ–1 కోచ్ ఏసీ.. నిశబ్దంగా ఉంటుంది. ఒకవేళ తనపై ఎవరు దాడికి యత్నించినా పోలీస్ అయినందున కచి్చతంగా ప్రతిఘటించే తత్వం, శక్తి ఉంటాయి. అక్కడ అలాంటి గొడవ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఈ విషయాన్ని పోలీసులు గమనించ లేదా? » సతీష్ కిందపడిన ప్రాంతానికి వాహనాలు వచ్చి ఉంటే టైర్ల గుర్తులు ఉండాలి కదా? రైల్లో ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ సేకరించారా? » సతీశ్ను వెంటాడినట్లుగా సీసీ ఫుటేజీ లేదు. ఈ కీలక అంశాలపై పోలీసులు ఎందుకు దృష్టి సారించలేదు? ఇన్ని అనుమానాల మధ్య ఏ విధంగా హత్య కేసు నమోదు చేశారు?
మదనపల్లె కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేంద్ర చెప్పారు. అరెస్టయిన వారిలో అన్నమయ్య జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) కె.ఆంజనేయులు ఉన్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ శనివారం మీడియాకు వెల్లడించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలెంకు చెందిన సాడి యమున (29) నుంచి ఈ నెల 9న మదనపల్లెలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీని తొలగించగా..ఆ మరుసటి రోజున ఆమె మృతి చెందింది. ఆమె తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి ఆరుగురిని అరెస్ట్ చేశామని, ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వైద్యుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. మధ్యవర్తులతో మదనపల్లెకు.. సాడి యమున (29)కు ఆనందపురం మండలానికి చెందిన సూరిబాబు (45)తో సాన్నిహిత్యం ఉంది. యమునకు ఆరి్థక ఇబ్బందులు ఉండటంతో కిడ్నీ ఇస్తే కష్టాలు తీరిపోతాయని సూరిబాబు చెప్పాడు. దీంతో మధ్యవర్తులైన విశాఖకు చెందిన కాకర్ల సత్య (43), పిల్లి పద్మ (45)తో ఈ విషయం చెçప్పడంతో వీరు సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆస్పత్రి డయాలసిస్ మేనేజర్ మెహరాజ్ (37), మదనపల్లె ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ మేనేజర్ బాలరంగడు(35) దృష్టికి తీసుకెళ్లారు.వీరు మదనపల్లెలోని డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులను కలిసి కిడ్నీ ఇచ్చేవారు, స్వీకరించే వారున్నారని, పెద్ద మొత్తంలో నగదు వస్తుందని చెప్పగా..ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు నిర్ణయించారు. ఈ ఆపరేషన్ చేసేందుకు బెంగళూరుకు చెందిన డాక్టర్, అతని సహాయకులు ఇద్దరు పాల్గొన్నారని, డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈనెల 9న గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో యమునకు ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించగా యమున మృతి చెందిందని చెప్పారు. తాము జరిపిన దర్యాప్తులో మదనపల్లె గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో యమునతోపాటు మరో మహిళ నుంచి కిడ్ని తొలగించి మరొకరికి అమర్చినట్లు డీఎస్పీ చెప్పారు. వీరిలో యమున మృతి చెందగా మరో మహిళ కోలుకుందని, యమున కిడ్నీ స్వీకరించిన వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఇంకా ఎంతమంది నుంచి కిడ్నీలు తొలగించారు, వాటిని ఎవరికి అమర్చారన్న వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆపరేషన్లు చేసిన బెంగళూరుకు చెందిన వైద్యుడిని అరెస్ట్ చేయడానికి ప్రయతి్నస్తున్నట్టు చెప్పారు. ఈ డాక్టర్ మదనపల్లెకు వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో లింకులు... మదనపల్లె కిడ్నీరాకెట్ వ్యవహారంలో పెద్దమొత్తంలో చేతులు మారినట్లు డీఎస్పీ చెప్పారు. కిడ్నీలు స్వీకరించిన వారి నుంచి అందిన మొత్తంలో అందరూ కలిసి వాటాలు వేసుకున్నారని తెలిపారు. ఈ కేసు లింకులు కర్ణాటక, గోవా, తెలంగాణ, ఏపీల్లో ఉన్నాయని, దీనిపై 4 పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ చెప్పారు. అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితుల ఫోన్లను, సీసీ కెమెరా సీడీఆర్లను స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఎల్కు పంపినట్లు చెప్పారు.
వీడియోలు
ibomma : ఇమ్మడి రవికి 14 రోజులు రిమాండ్
పద్దతిగా మాట్లాడు.. లేదంటే.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వార్నింగ్
Ding Dong: బాబు దెబ్బకు డాక్టర్లు అంటేనే వణికిపోతున్నారు
మేం సిద్ధంగా ఉన్నాం..! ఈసీకి విజయ్ లేఖ
ఆ పార్టీలోకి వంగవీటి రంగా కూతురు. పొలిటికల్ ఎంట్రీ
Jubilee Hills by Election Results: ఫలితాలపై ఫన్నీ రియాక్షన్
ఢిల్లీ బ్లాస్ట్... మరో డాక్టర్ అరెస్ట్
Jangaon : మరో ఘోర ప్రమాదం RTC బస్సు నుజ్జునుజ్జు
Hindupur : ముందే పోలీసులకు చెప్పి YSRCP ఆఫీసుపై దాడి
Chandrababu: బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ

