వీళ్లంతా ‘హిట్’ దర్శకులే.. కానీ సినిమాల్లేవు!
చిత్ర పరిశ్రమలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక్కడ జాతకాలు తారుమారు కావడానికి ఒక్క శుక్రవారం చాలు. సక్సెస్ ఉంటేనే అవకాశాలు వస్తాయి. అదే ఫ్లాపులొస్తే.. గతంలో బ్లాక్ బస్టర్స్ అందించినా.. కొత్త ప్రాజెక్టు అయితే చేతికి రాదు. ముఖ్యంగా దర్శకుల విషయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఫ్లాపులున్న దర్శకుడితో సినిమా చేసేందుకు అటు నిర్మాతలు..ఇటు హీరోలు వెనకడుగు వేస్తుంటారు. ఒక్కప్పుడు వాళ్లు వరుస హిట్లు అందించినా.. ఫ్లాపులొస్తే అది ‘గత చరిత్ర’గానే మిగిలిపోతుంది. అలా ఒకప్పుడు చరిత్ర సృష్టించి..ఇప్పుడు హిట్ కోసం ఎదురు చూస్తున్న దర్శకులపై ఓ లుక్కేద్దాం.కొరటాల శివ:2013లో 'మిర్చి'తో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన శివ, మహేష్ బాబు ‘శ్రీమంతుడు' (2015), ఎన్టీఆర్ 'జనతా గారేజ్' (2016), 'భరత్ అనే నేను' (2018)లతో వరుస హిట్లు అందించి స్టార్ డైరెక్ట్గా మారిపోయాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్తో తీసిన ‘ఆచార్య(2022)’ డిజాస్టర్ అయింది. దీంతో కొరటాలపై నెగెటివ్ టాక్ మొదలైంది. ఎన్టీఆర్తో తీయాల్సిన దేవర కూడా పట్టాలెక్కదనుకున్నారు. కానీ ఆచార్య రిలీజ్కి ముందే దేవర చిత్రం ఫిక్స్ అయిపోయింది. శివపై నమ్మకంతో ఎన్టీఆర్ చాన్స్ ఇచ్చాడు. ఆ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్గా నిలిచినా..క్రెడిట్ మాత్రం ఎన్టీఆర్కే వెళ్లింది.ఇక దేవర 2 ఉంటుందని ప్రకటించి..ఏడాదిన్నర అవుతుంది. కొరటాల చేతిలో అదొక్క ప్రాజెక్టే ఉంది. కానీ అది కూడా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది. కృష్ణ వంశీఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ కృష్ణ వంశీ. ఒకప్పుడు ఆయన సినిమా అంటే మినిమమ్ హిట్ అనే గ్యారెంటీ ఉండేది. కానీ ఇప్పుడు కృష్ణ వంశీ సినిమా అంటే..కనీస ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. ‘నక్షత్రం’(2017) అనే సినిమా తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకొని ‘రంగమర్తాండ’అనే సినిమాతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి విమర్శకులు ప్రశంసలు అయితే దక్కాయి కానీ..కలెక్షన్స్ మాత్రం రాలేదు. రంగమార్తండ తర్వాత కృష్ణ వంశీ నుంచి మరో చిత్రం రాలేదు.వీవీ వినాయక్..హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో వీవీ వినాయక్ స్పెషలిస్ట్. ఆది, దిల్, ఠాకూర్, బన్నీ, లక్ష్మీ, యోగి, కృష్ణ, ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను టాలీవుడ్కి అందించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. టాలీవుడ్లో ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘ఇంటిలిజెంట్’. సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ 2018 ఫిబ్రవరి 9న విడుదలైంది. ఆ చిత్రం తర్వాత తెలుగులో మరో తెలుగు సినిమా చేయలేదు. ‘ఛత్రపతి’చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్లో హిందీలో రీమేక్ చేశాడు. 2023లో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత వినాయక్ నుంచి మరో చిత్రం రాలేదు. వెంకటేశ్లో ఓ సినిమా ఉంటుందని టాక్ నడుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన రాలేదు. సురేందర్ రెడ్డి‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ సినిమాలో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. కానీ 2023లో వచ్చిన ‘ఏజెంట్’ డిజాస్టర్ కావడంతో.. సురేందర్ రెడ్డికి అవకాశాలు తగ్గిపోయాయి. రవితేజతో ఓ సినిమా ఉంటుందని టాక్ ఉంది. కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు.వంశీ పైడీపల్లిమున్నా’ (2007) మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు వంశీ పైడీపల్లి. కెరీర్ మొత్తంలో ఆయన తీసిన తెలుగు సినిమాలు కేవలం ఐదు(మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) మాత్రమే. అవన్నీ సూపర్ హిట్ చిత్రాలే. అదే ఊపుతో తమిళ్లో విజయ్తో ‘వారిసు’(తెలుగులో వారసుడు) తెరకెక్కించాడు. 2023లో విడుదలైన ఈ చిత్రం తమిళ్లో సూపర్ హిట్ అయినా..తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. ఈ చిత్రం తర్వాత కూడా వంశీ నుంచి మరో సినిమా రాలేదు.శ్రీను వైట్లస్టార్ హీరోలతో కూడా కామెడీ చిత్రాలను తీసి నవ్వించిన స్టార్ డైరెక్ట శ్రీనువైట్ల. ఒకప్పడు ఆయన సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేశాయి. కానీ గత కొన్నాళ్లుగా ఆయన ఖాతాలో హిట్ లేదు. గోపిచంద్ ‘విశ్వం’తో కమ్ బ్యాక్ అవుతాడని అనుకుంటే.. అది భారీ డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన చేతిలో కొత్త ప్రాజెక్టులేవి లేదు. మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ తీస్తాడనే పుకార్లు వచ్చాయి. చర్చలు కూడా జరిగాయి. కానీ విశ్వం రిలీజ్ తర్వాత ఢీ సీక్వెల్ని పక్కన పెట్టేశారు. వీరితో పాటు శ్రీకాంత్ అడ్డాల, శివ నిర్వాణ, పరశురాం లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా కొత్త కబురు చెప్పట్లేదు. మరి వీరి నుంచి బ్లాక్ బస్టర్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.
కోటి సంతకాల సేకరణ.. ఊరూ వాడా ఉద్యమ వేడి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గిరిజన గూడేల నుంచి నియోజకవర్గ కేంద్రాల దాకా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు బాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో భారీగా పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఊరూ వాడా ఉద్యమ వేడి రగిలింది.
ఉల్లి, వెల్లుల్లి తెచ్చిన తంటా, 11 ఏళ్ల బంధానికి స్వస్తి
ఆరోజు గుజరాత్ హైకోర్టు గది నిశ్శబ్దంగా ఉంది.. కానీ అక్కడున్న ప్రతి ఒక్కరి చెవుల్లో రెండు పేర్లే మారుమోగుతున్నాయి.. అవి ఉల్లి, వెల్లుల్లి. దశాబ్దానికి పైగా సాగిన వైవాహిక బంధం, విడాకులకు దారి తీయడానికి కారణం ఈ రెండు వంట గది పదార్థాలే అంటే ఎవరైనా నమ్ముతారా?.. వంట గదిలో మొదలైన ఈ ’ఘాటైన’ పోరు, దశాబ్దానికి పైగా సాగిన బంధానికి విడాకులతో తెరదించింది. 2002లో ఒక్కటైన ఓ జంటకు.. అప్పటి వరకూ తమ భోజన అలవాట్లలోని తేడా ఒక సమస్యగా అనిపించలేదు. భార్య స్వామినారాయణ్ భక్తురాలు కావడంతో, మత నిబంధనల ప్రకారం ఉల్లి, వెల్లుల్లిని దూరంగా ఉంచేది. కానీ, భర్త, అత్తగారు మాత్రం వాటిని యథావిధిగా తీసుకునేవారు. మెల్లగా.. ఈ ’రుచుల’ తేడా వారి బంధంలో చిచ్చు పెట్టింది. ఆలుమగల బంధంలో చీలిక తెచ్చింది. ఇంట్లో వేర్వేరుగా వంట చేసు కోవడం సర్వసాధారణమైంది. దాంతో ఆ ఇంట్లో ఆనందానికి బదులు అశాంతి పెరగడం మొదలైంది. అది ఉద్రిక్తతకు దారితీయడంతో భార్య బిడ్డను తీసుకుని అత్తారింటిని వీడింది. 2013లో భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేస్తూ, ఆమె రాజీ పడకపోవడం క్రూరత్వమని వాదించాడు. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత, 2024లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భర్త భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ భార్య గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో జరిగిన విచారణలో భార్య తరపు న్యాయవాది వాదిస్తూ.. మతపరమైన ఆహార నియమాలను భర్త పట్టించుకోకుండా, వాటి ప్రభావాన్ని పెంచి చూపారని వాదించారు. కాగా, తాము, తమ తల్లి ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఉల్లి, వెల్లుల్లి లేని వంటలు వండి పెట్టినా.. ఆమె వైఖరి మారలేదని, అందుకే సమస్య కొనసాగిందని భర్త వివరించారు. ఒకానొక దశలో ఉద్రిక్తత కారణంగా ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పుపదకొండేళ్ల బంధానికి బీటలు ఒక చిన్న ఆహారపు అలవాటు..వ్యక్తిగత నమ్మకంగా మొదలై, రెండు కుటుంబాలను విడదీసింది. చివరికి, దశాబ్దానికి పైగా సాగిన బంధం.. శూన్యమైన అంగీకారంతో ముగిసింది. ఆ రోజు కోర్టు గదిలో ఒక్కసారిగా ఉద్వేగం అలముకుంది. అర్థంపర్థం లేని పోరాటంతో ఇద్దరు దంపతులు కోల్పోయిన 11 ఏళ్ల విలువైన జీవితం.. అక్కడున్న వారి మనసుల్ని భారంగా మార్చింది. విడాకులకు సరే.. అయితే, హైకోర్టులో వాదనల సందర్భంగా భార్య అనూహ్యనిర్ణయం తీసుకుంది. తాను విడాకులను వ్యతిరేకించడం లేదని కోర్టుకు తెలియజేసింది. దాంతో భర్త కూడా..చెల్లించాల్సిన భరణం మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో.. కోర్టులో జమ చేయడానికి అంగీకరించారు. దంపతుల మధ్య పరస్పర అంగీకారం కుదరడంతో, హైకోర్టు భార్య పిటిషన్ను కొట్టివేసింది.ఫ్యామిలీ కోర్టిచ్చిన విడాకుల ఉత్తర్వును సమర్థించింది. – సాక్షి, నేషనల్ డెస్క్
న్యూజిలాండ్కు భారీ షాక్
వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్ బ్లెయిర్ టిక్నర్ దారుణంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కివీస్ జట్టు స్వదేశంలో వెస్టిండీస్ (NZ vs WI)తో ఆల్ ఫార్మాట్ సిరీస్లు ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత ఐదు టీ20ల సిరీస్ను 3-1తో గెలిచిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అనంతరం క్రైస్ట్చర్చ్ వేదికగా తొలి టెస్టులో కివీస్ విజయం సాధించే దిశగా పయనించగా.. అద్భుత పోరాటంతో విండీస్ మ్యాచ్ను డ్రా చేసుకుంది.205 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్కు దిగింది. కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక 75 ఓవర్లు ఆడి కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయింది.నాలుగు వికెట్లతో చెలరేగిన టిక్నర్ విండీస్ ఓపెనర్లు జాన్ కాంప్బెల్ (44), బ్రాండన్ కింగ్ (33) ఓ మోస్తరుగా రాణించగా.. షాయీ హోప్ (48) కూడా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు. ఇక కివీస్ బౌలర్లలో పేసర్లు బ్లెయిర్ టిక్నర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మైకేల్ రే మూడు వికెట్లు పడగొట్టాడు.మరోవైపు.. జేకబ్ డఫీ ఒక వికెట్ తీయగా.. స్పిన్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) సైతం ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్ టెయిలెండర్ ఆండర్సన్ ఫిలిప్ (5) రనౌట్ రూపంలో కివీస్కు ఓ వికెట్ దక్కింది. నొప్పితో విలవిల్లాడుతూఇదిలా ఉంటే.. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 66వ ఓవర్లో మైకేల్ రే బంతితో రంగంలోకి దిగగా.. ట్రవిన్ ఇమ్లాచ్ ఫైన్ లెగ్ దిశగా బాల్ను గాల్లోకి లేపాడు. ఇంతలో ఫీల్డర్ టిక్నర్ బంతిని ఆపే క్రమంలో పల్టీ కొట్టాడు. ఈ క్రమంలో తన ఎడమ భుజం (Shoulder Injury)పై భారం మొత్తం పడగా.. నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో పడుకుండిపోయాడు.ఏడ్చేసిన బౌలర్!దీంతో కివీస్ శిబిరంలో ఆందోళన చెలరేగగా.. టిక్నర్ పరిస్థితి చూసి బౌలర్ మైకేల్ దాదాపుగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతలో ఫిజియో వచ్చి టిక్నర్ను మైదానం వెలుపలికి తీసుకువెళ్లగా.. అటు నుంచి అటే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టిక్నర్ ఎడమ భుజం విరిగినట్లు వార్తలు వస్తున్నాయి.మరోవైపు.. బుధవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 9 ఓవర్లలో కివీస్ 24 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ టామ్ లాథమ్ 7, డెవాన్ కాన్వే 16 పరుగులతో క్రీజులో నిలిచారు. విండీస్ కంటే కివీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్గా తొలిరోజు ఆతిథ్య న్యూజిలాండ్దే పైచేయి కాగా.. టిక్నర్ గాయం ఆందోళనకరంగా పరిణమించింది. చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు
2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు
టికెట్ రేట్లు పెంచుతుంటే చర్యలెందుకు తీసుకోలేదు?
దినేశ్ కార్తీక్కు మరో కీలక పదవి
‘ఓయూకు రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలి’
రూమర్స్ నిజం చేశారు.. డేటింగ్పై నటి కృతిక క్లారిటీ
రాగులు ఆరోగ్యానికి ఇంత మంచిదా..? అందుకే ఉపాసన అలా..
ఇండిగో సంక్షోభం: హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో
సెలక్ట్ కాకుండా అడ్డుకుంటావా?.. కోచ్పై క్రికెటర్ల పాశవిక దాడి!
ఇండస్ట్రీలో అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు: నటి యామిని భాస్కర్
'బిగ్బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు
నెహ్రూ విశ్వాస ఘాతుకం
బంగారం తియ్యగా.. వెండి చేదుగా..!!
జీహెచ్ఎంసీ వార్డులు 300కు పెంపు
వరుణ్ సందేశ్- ప్రియాంక జైన్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
‘ఇదొక మంత్రం’.. ‘వందేమాతరం’చర్చలో ప్రధాని మోదీ
ఎస్ఐఆర్పై లోక్సభలో వాడీవేడీగా చర్చ
పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు షాకిచ్చిన యూకే
సిల్వర్ సునామీ.. పసిడి ధరల తుపాను!!
స్టాలిన్కు గుణపాఠం తప్పదు.. దద్దరిల్లిన విజయ్ సభ
శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యువతి : బరాత్, వైభవంగా వేడుక
ఆస్తి మొత్తం తిరుమలకు ఇచ్చిన నటి.. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణం
వారం రోజులు.. ముంబై అష్టకష్టాలు
ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్ జీడీపీ కంటే ఎక్కువ!
బెంగాల్ ఎన్నికల కోసమే ఈ డ్రామా
కమాండర్ మజ్జీతో సహా భారీగా మావోయిస్టుల లొంగుబాటు
ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్ జర్నీ
ఆమె కాలాన్ని బంధించింది
తారుమారైన బంగారం, వెండి ధరలు..
చీరలకు సహజ రంగులను అందించే నది..!
ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ
2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు
టికెట్ రేట్లు పెంచుతుంటే చర్యలెందుకు తీసుకోలేదు?
దినేశ్ కార్తీక్కు మరో కీలక పదవి
‘ఓయూకు రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలి’
రూమర్స్ నిజం చేశారు.. డేటింగ్పై నటి కృతిక క్లారిటీ
రాగులు ఆరోగ్యానికి ఇంత మంచిదా..? అందుకే ఉపాసన అలా..
ఇండిగో సంక్షోభం: హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో
సెలక్ట్ కాకుండా అడ్డుకుంటావా?.. కోచ్పై క్రికెటర్ల పాశవిక దాడి!
ఇండస్ట్రీలో అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు: నటి యామిని భాస్కర్
'బిగ్బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు
నెహ్రూ విశ్వాస ఘాతుకం
బంగారం తియ్యగా.. వెండి చేదుగా..!!
జీహెచ్ఎంసీ వార్డులు 300కు పెంపు
వరుణ్ సందేశ్- ప్రియాంక జైన్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
‘ఇదొక మంత్రం’.. ‘వందేమాతరం’చర్చలో ప్రధాని మోదీ
ఎస్ఐఆర్పై లోక్సభలో వాడీవేడీగా చర్చ
పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు షాకిచ్చిన యూకే
సిల్వర్ సునామీ.. పసిడి ధరల తుపాను!!
స్టాలిన్కు గుణపాఠం తప్పదు.. దద్దరిల్లిన విజయ్ సభ
శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యువతి : బరాత్, వైభవంగా వేడుక
ఆస్తి మొత్తం తిరుమలకు ఇచ్చిన నటి.. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణం
వారం రోజులు.. ముంబై అష్టకష్టాలు
ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్ జీడీపీ కంటే ఎక్కువ!
బెంగాల్ ఎన్నికల కోసమే ఈ డ్రామా
కమాండర్ మజ్జీతో సహా భారీగా మావోయిస్టుల లొంగుబాటు
ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్ జర్నీ
ఆమె కాలాన్ని బంధించింది
తారుమారైన బంగారం, వెండి ధరలు..
చీరలకు సహజ రంగులను అందించే నది..!
ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ
ఫొటోలు
విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)
'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)
ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)
‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘నయనం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
హార్దిక్ పాండ్యా సూపర్ షో...తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
గ్లోబల్ సమిట్లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. డే2 స్పెషల్ ఎట్రాక్షన్స్ ఇవిగో (ఫొటోలు)
స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్ బ్యూటీ లుక్ (ఫొటోలు)
ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)
సినిమా
కల్యాణ్ డ్యూటీ చేసేది మాతోనే.. తనను తొలగించలేదు!
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే ఉంది. అయితే తనూజ కన్నడ అమ్మాయి అని ట్రోల్ చేస్తుంటే పవన్ కల్యాణ్ పడాల అసలు ఆర్మీ జవానే కాదని విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్.. ఇండియన్ ఆర్మీలో లేడని సీఆర్పీఎఫ్ (కేంద్ర రిజర్వు పోలీస్ దళం) అని ఓ సుందర్ అనే జవాన్ ఓ వీడియో చేశారు. కల్యాణ్ ఫ్రెండ్ క్లారిటీఅంతేకాకుండా కల్యాణ్ బయటకు వచ్చి 90 రోజులు అయిపోయింది కాబట్టి అతడిని విధుల నుంచి కూడా తొలగించి ఉంటారని పేర్కొన్నారు. ఈ వివాదంపై పవన్ కల్యాణ్ ఫ్రెండ్, సీఆర్పీఎఫ్ పోలీస్ మణికంఠ స్పందించాడు. కల్యాణ్ పడాలను ఎవరూ విధుల్లో నుంచి తీసేయలేదు. పర్మిషన్ తీసుకునే బిగ్బాస్కు వచ్చాడు. పెట్టిన లీవులన్నీ అయిపోయినా సరే ఏదైనా అత్యవసరం ఉందంటే దాన్ని పొడిగిస్తారు. కల్యాణ్ను తొలగించలేదుమాతో పాటు డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి మాకు తెలుసు.. తనను తీసేయలేదు. తనను తీసేయాలంటే అతడి సంతకం కచ్చితంగా ఉండాలి. కల్యాణ్ వెళ్లిపోవాలన్నా సరే.. సోల్జర్ను తొలగించడం అంత ఈజీ అయితే కాదు. దానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. పవన్ కల్యాణ్.. మొదట్లో తాను ఒక సోల్జర్ అని చెప్పుకున్నాడు. కానీ ఈ జర్నీలో తనెప్పుడూ సోల్జర్ అని చెప్పి, ఓట్లేయమని అడుక్కోలేదు. నాగార్జున అడిగితేనే..బిగ్బాస్ షోలో తన గేమ్, ప్రవర్తన చూసి ఓట్లేయండి. అతడెప్పుడూ సోల్జర్ అని చెప్పి సింపతీ కార్డు ఉపయోగించలేదు. నాగార్జున సార్.. కల్యాణ్, ఒకసారి సెల్యూట్ కొట్టి చూపించు అని అడిగాడు. అప్పుడు మాత్రమే కల్యాణ్ సెల్యూట్ కొట్టి చూపించాడు. అంతే తప్ప అందులో ఏం లేదు. తనను బ్యాడ్ చేయకండి. తను చాలా బాగా ఆడుతున్నాడు అని పేర్కొన్నారు. ఈ వీడియోను పవన్ కల్యాణ్ టీమ్ అతడి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.యూటర్న్అలాగే కల్యాణ్ (Pawan Kalyan Padala)ను విమర్శించిన ఎస్జే సుందర్ అనే జవాన్ సైతం యూటర్న్ తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీ అయినా, సీఆర్పీఎఫ్ అయినా, ఏ డిఫెన్స్ ఫోర్స్ అయినా.. చేసేది దేశసేవే. వన్స్ ఎ సోల్జర్.. ఆల్వేస్ సోల్జర్. వీలైతే గెలిపించండి అని వీడియో చేశారు. మొత్తానికి ఈ రెండు వీడియోలతో కల్యాణ్పై వివాదానికి ఫుల్స్టాప్ పడి, నెగెటివిటీ తగ్గుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. కాగా సీఆ్పీఎఫ్.. దేశ అంత్గత భద్రతను కాపాడుతుంది. శాంతి భద్రతల విధుల్లో, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో సీఆర్పీఎఫ్ను వినియోగిస్తారు. View this post on Instagram A post shared by Pavan Kalyan Padala (@kalyanpadala881) View this post on Instagram A post shared by Sundara Rao Jadde (@sj_______sundar)
జానీ మాస్టర్ భార్య ఘన విజయం
బంజారాహిల్స్: తెలుగు ఫిలిం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి జోసఫ్ ప్రకాష్పై 29 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రముఖుల అండదండలు లేకుండానే విజయం సాధించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో సుమలత అలియాస్ అయేషాకు 228 ఓట్లు వచ్చాయి. మొత్తం 510 ఓట్లకుగాను 439 ఓట్లు పోలవగా, జోసఫ్ ప్రకాష్ మాస్టర్కు 199 ఓట్లు దక్కాయి జనరల్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు, ట్రెజరర్గా పి.చిరంజీవి, ఉపాధ్యక్షులుగా ఎ.సురేష్, ఎం.రాజు, జాయింట్ సెక్రటరీలుగా కె.కిరణ్కుమార్, ఎ.రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివకృష్ణ, మెంబర్లుగా కె.సతీష్ గౌడ్, సురేష్, బి.సుమన్, ఎల్.కృష్ణ, ఏ.మనోహర్, ఆర్.బోస్, వేదాంత మాస్టర్, ఈసీ మహిళా విభాగంలో కే.శ్రీదేవి, ఎస్.శృతి గెలుపొందారు.
రోడ్డు మీద దయనీయ స్థితిలో శ్యామల.. కాపాడిన పోలీసులు
తెలుగు నటి పావలా శ్యామల పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా మారుతోంది. అటు ఆరోగ్య సమ్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో దినదినగండంగా బతుకు వెల్లదీస్తోంది. పైసా ఆదాయం లేకపోవడం.. దానికి తోడు ఆదుకునేవారే కరువు అవడంతో ఆమె జీవితమే ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పలువురు సాయం చేసినా అది తాత్కాలిక ఉపశమనం కలిగించిందే తప్ప ఆమె బతుకు మాత్రం చక్కబడలేదు.రోడ్డు మీదకు శ్యామలగత కొంతకాలంగా శ్యామల.. మంచానికే పరిమితమైన కూతురితో కలిసి ఓ హోమ్లో నివసిస్తోంది. ఇటీవల ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో తాను కూడా కదల్లేని స్థితికి చేరుకుంది. దీంతో మంచానికే పరిమితమైన తల్లీకూతుర్లకు తాము సేవలు చేయలేమంటూ సదరు హోమ్ నిర్వాహకులు వారిద్దరినీ బయటకు పంపినట్లు తెలుస్తోంది. తమను ఆదుకునేవారు లేక నిరాశలో కూరుకుపోయిన శ్యామల.. దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఓ వార్త వైరలవుతోంది.పోలీస్ సాయంతో..రోడ్డుపై దయనీయ పరిస్థితిలో ఉన్న వారిని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది గమనించి తిరుమలగిరి ఏసీపీ రమేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి తల్లీకూతుర్లిద్దరినీ ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్ (స్వచ్చంద సంస్థ)లో చేర్పించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు రామకృష్ణ.. శ్యామలతో పాటు ఆమె కూతురికి ఆశ్రయం కల్పించి అన్ని సేవలు అందిస్తామని ప్రకటించాడు.ఆదుకోండిపావల శ్యామల (Pavala Syamala) దాదాపు 300 సినిమాల్లో నటించింది. వెండితెరపై గయ్యాలి గంపగా, కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను విషం తాగి చావడానికి సిద్ధమే కానీ కూతుర్ని చంపుకోలేకపోతున్నాననంది. చికిత్స చేయించుకునేందుకు డబ్బుల్లేవని, ఆదుకోమని ఎన్నోసార్లు మొర పెట్టుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలోనూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఈ వారం పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ 'కాంత', 'ఎఫ్ 1' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీతో పాటు 'త్రీ రోజెస్' అనే తెలుగు వెబ్ సిరీస్ సీజన్ 2 ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని పేర్కొన్నారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుందనేది చూద్దాం.సీనియర్ హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక.. తమిళంలో హీరోయిన్గా చేసిన లేటెస్ట్ మూవీ 'ఆరోమలే'. కిషన్ హీరోగా నటించాడు. నవంబరు 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. హౌస్ఫుల్స్ కూడా బాగానే అయ్యాయి. నెల పూర్తయిందో లేదో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ శుక్రవారం (డిసెంబరు 12) నుంచి హాట్స్టార్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. బయట దేశాల్లో సింప్లీ సౌత్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.'ఆరోమలే' విషయానికొస్తే.. ప్రేమ అనేది సినిమాల్లో చూపించినట్లు ఉంటుందని నమ్మే కుర్రాడు అజిత్ (కిషన్). స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమిస్తాడు కానీ అపర్థాల వల్ల బ్రేకప్ అవుతుంది. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఓ మ్యాట్రిమోనీ ఏజెన్సీలో ఉద్యోగానికి చేరతాడు. అక్కడ ఇతడి బాస్ అంజలి (శివాత్మిక)తో సమస్యలొస్తాయి. ఈమె.. ప్రేమ అనేది లాజిక్ అని నమ్మే టైపు. అలా ప్రేమ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్న వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా? అజిత్కి మూవీ టైపు ప్రేమ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ. ప్రేమ అనే ఎమోషన్స్ని చూపిస్తూనే కామెడీ కూడా బాగుందనే టాక్ అయితే వచ్చింది. ఓటీటీలోకి వచ్చాక తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?Fall in love. Laugh out Loud..❤️😂 #Aaromaley from Nov 12#Aaromaley streaming from Dec 12 only on #JioHotstar#AaromaleyOnJioHotstar #AaromaleyStreamingFromDec12 #JioHotstarTamil @kishendas @ShivathmikaR @SarangThiagu #HarshathKhan pic.twitter.com/Phe82tuBti— JioHotstar Tamil (@JioHotstartam) December 10, 2025
క్రీడలు
Ashes: మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును బుధవారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్తో తిరిగి ఆసీస్ టీమ్తో చేరినట్లు వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఈ ఒక్క మార్పు (కమిన్స్ చేరిక) జరిగినట్లు తెలిపింది.2-0తో ఆధిక్యంలో ఆసీస్ కాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో దుమ్ములేపుతోంది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన కంగారూలు.. రెండో టెస్టులోనూ విజయం సాధించారు. బ్రిస్బేన్ వేదికగా పింక్ బాల్తో (డే- నైట్ మ్యాచ్) జరిగిన ఈ మ్యాచ్లోనూ ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేశారు.అదరగొట్టారుఇంగ్లండ్తో తొలి టెస్టులో మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి మిచెల్ స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. నాలుగో ఇన్నింగ్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ (83 బంతుల్లో 123)తో ఓపెనర్గా వచ్చిన ట్రవిస్ హెడ్ (Travis Head) ఇరగదీశాడు. ఇక రెండో టెస్టులోనూ స్టార్క్ మొత్తంగా ఎనిమిది వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఆ ఇద్దరూ దూరంఇదిలా ఉంటే.. ఆసీస్ పేసర్ జోష్ హాజల్వుడ్ (Josh Hazlewood)... ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ‘యాషెస్’ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. కండరాల గాయంతో ఇప్పటికే జరిగిన రెండు టెస్టులకు దూరమైన హాజల్వుడ్ మిగిలిన మూడు మ్యాచ్లకు సైతం అందుబాటులో ఉండబోడని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ మెక్డొనాల్డ్ మంగళవారం వెల్లడించాడు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు అతడు ఫిట్నెస్ సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ‘ఈ సిరీస్కు హాజల్వుడ్ దూరమయ్యాడు. ఇక ఇప్పుడు అతడి దృష్టి అంతా టీ20 వరల్డ్కప్ పైనే’ అని మెక్డొనాల్డ్ అన్నాడు. డిసెంబరు 17 నుంచి అడిలైడ్ వేదికగామరోవైపు.. గాయంతో తొలి రెండు మ్యాచ్లూ ఆడని రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్... డిసెంబరు 17 నుంచి అడిలైడ్ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ రెండు మ్యాచ్ల్లో ఆసీస్కు సారథిగా వ్యవహరించగా... కమిన్స్ రాకతో అతడు కేవలం బ్యాటర్గా బరిలోకి దిగనున్నాడు.గత రెండు టెస్టుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మిచెల్ స్టార్క్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేయగా... ఇప్పుడు కమిన్స్ రాకతో కంగారూల పేస్ బలం మరింత పేరగనుంది. ఇక ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్ అనంతరం గాయంతో జట్టుకు దూరమైన వుడ్... మిగిలిన మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ఇంగ్లండ్తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటనప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్.చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు
చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్ తప్పు చేశాడా?
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 సందర్భంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ వంద వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్గా రికార్డు సాధించాడు.175 పరుగులుకటక్ వేదికగా సౌతాఫ్రికా (IND vs SA T20Is)తో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ కుప్పకూలినా హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్)కు తోడు తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు స్కోరు చేయగలిగింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రాణించిన బౌలర్లుభారత బౌలర్లలో పేసర్లు అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh), జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు.. పేస్బౌలింగ్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ మ్యాచ్లో సఫారీ స్టార్, టాప్ రన్ స్కోరర్ డెవాల్డ్ బ్రెవిస్ (22)ను అవుట్ చేయడం ద్వారా.. బుమ్రా వంద వికెట్ల క్లబ్లో చేరాడు. అదే విధంగా.. కేశవ్ మహరాజ్ (0)ను కూడా పెవిలియన్కు పంపాడు.Boom boom, Bumrah! 🤩😎Wicket number 100 in T20Is for #JaspritBumrah! Simply inevitable 👏🇮🇳#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/MuSZfrfh3L— Star Sports (@StarSportsIndia) December 9, 2025అంపైర్ తప్పు చేశాడా?సఫారీ జట్టు ఇన్నింగ్స్లో బుమ్రా పదకొండో ఓవర్లో బరిలోకి దిగగా.. రెండో బంతిని బ్రెవిస్ ఎదుర్కొన్నాడు. ఫుల్ స్వింగ్తో బంతిని వేసే క్రమంలో బుమ్రా క్రీజు లైన్ దాటేసినట్లుగా కనిపించింది. దీంతో ఫ్రంట్-ఫుట్ నోబాల్ కోసం చెక్ చేయగా.. బుమ్రా షూ భాగం క్రీజు లోపలే ఉన్నందున దానిని ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో పరిశీలించకుండానే బ్రెవిస్ను థర్డ్ అంపైర్ పెవిలియన్కు పంపి తప్పు చేశాడంటూ సౌతాఫ్రికా జట్టు అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. బుమ్రా కంటే ముందుగా.. అర్ష్దీప్ టీమిండియా తరఫున టీ20లలో వంద వికెట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.టెస్టు, వన్డే, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లు వీరేలసిత్ మలింగ (శ్రీలంక)టిమ్ సౌతీ (న్యూజిలాండ్)షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)షాహిన్ ఆఫ్రిది (పాకిస్తాన్)జస్ప్రీత్ బుమ్రా (ఇండియా).చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్At least show us another angle pic.twitter.com/NjDZ2lcxQT— Werner (@Werries_) December 9, 2025
సంజూ శాంసన్ పెద్దన్న లాంటోడు.. సై అంటే సై!
సంజూ శాంసన్.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మీదే చర్చ నడుస్తోంది. టీమిండియా టీ20 ఓపెనర్గా శుబ్మన్ గిల్ తిరిగి రావడంతో సంజూ స్థానం గల్లంతైంది. ఒకవేళ తుదిజట్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు చోటు దక్కినా.. వన్డౌన్లో... ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపి యాజమాన్యం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి.ఫలితంగా.. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ స్థానాన్ని జితేశ్ శర్మ(Jitesh Sharma) భర్తీ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గానూ రాణించడం అతడికి అదనపు ప్రయోజనంగా మారింది. కాబట్టే సంజూ కంటే జితేశ్ వైపే తాము మొగ్గుచూపుతున్నట్లు టీమిండియా నాయకత్వ బృందం సంకేతాలు ఇచ్చింది కూడా!వికెట్ కీపర్గా జితేశ్కే పెద్ద పీటఇక సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ సంజూ (Sanju Samson)ను కాదని జితేశ్ను ఆడించింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్గా జితేశ్కే పెద్ద పీట వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై జితేశ్ శర్మ స్పందించాడు.నాకు పెద్దన్న లాంటివాడు‘‘నిజం చెప్పాలంటే.. సంజూ నాకు పెద్దన్న లాంటివాడు. ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. జట్టుకు కూడా అదే మంచిది. భారత్లో టాలెంట్కు కొదవలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.సంజూ భయ్యా గొప్ప ప్లేయర్. ఆయనతో నేను పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడే నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతాను. మేము ఇద్దరం టీమిండియాకు ఆడాలనే కోరుకుంటాం. మేము సోదరుల లాంటి వాళ్లం. మా అనుభవాలను పరస్పరం పంచుకుంటాం.టీమిండియాలో స్థానం కోసం సై అంటే సై!అతడు నాకు చాలా సాయం చేశాడు. సలహాలు ఇస్తాడు. ఒకవేళ అతడితోనే నాకు పోటీ అంటే.. బెస్ట్ ఇచ్చి ఢీకొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను’’ అని 32 ఏళ్ల జితేశ్ శర్మ.. 31 ఏళ్ల సంజూ గురించి చెప్పుకొచ్చాడు. 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄6⃣, 4⃣, 6⃣Hardik Pandya 🤝 Jitesh Sharma Updates ▶️ https://t.co/tiemfwcNPh#TeamIndia | #INDvSA | @hardikpandya7 | @jiteshsharma_ | @IDFCFIRSTBank pic.twitter.com/806L1KmQac— BCCI (@BCCI) December 9, 2025భారత్ ఘన విజయంకాగా కటక్ వేదికగా మంగళవారం తొలి టీ20లో టీమిండియా సౌతాఫ్రికాను 101 పరుగులతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో జితేశ్ ఎనిమిదో స్థానంలో వచ్చి 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు నాలుగు డిస్మిసల్స్లో భాగమై కీపర్గానూ సత్తా చాటాడు.మరోవైపు.. ఓపెనర్ గిల్ (4) విఫలమయ్యాడు. కాగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 59 నాటౌట్)కి తోడు.. బౌలర్లు రాణించడంతో టీమిండియాకు విజయం సాధ్యమైంది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ముందంజ వేసింది. చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్Total dominance from Team India! 💥🇮🇳#SouthAfrica suffer their lowest T20I score as #India storm to a 101-run win their 3rd highest margin of victory against SA to go 1–0 up in the series! 💪#INDvSA 👉 2nd T20I 👉 11th DEC, 6 PM onwards pic.twitter.com/uwoZvWJa6Y— Star Sports (@StarSportsIndia) December 9, 2025
‘నిన్ను తప్పిస్తారన్న ఆలోచనే ఉండదు.. కానీ ఇక్కడ అలా కాదు’
టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్ ఓపెనింగ్ బ్యాటర్గా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్లో మార్కో యాన్సెన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20లలో ఓపెనర్గా గిల్ కంటే మెరుగైన రికార్డు ఉన్నా.. సంజూ శాంసన్ (Sanju Samson)ను కావాలనే బలి చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ షాన్ పొలాక్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.నిన్ను తప్పిస్తారన్న ఊహే ఉండదుక్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో ఇలాంటి వాళ్లు ఎలా ఆడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి అక్కడ.. జట్టులో ప్రధాన ఆటగాడు అతడే. అతడిని జట్టు నుంచి తప్పిస్తారన్న ఊహ కూడా ఉండదు. కాబట్టి ఒత్తిడీ తక్కువే.కానీ ఇక్కడ అలా కాదుకానీ టీమిండియాకు వచ్చే సరికి కథ మారుతుంది. ఇక్కడ జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. కాబట్టి బ్యాటర్ మైండ్సెట్ మారిపోతుంది. కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. బాగా ఆడకుంటే జట్టులో స్థానం గల్లంతు అవుతుందనే ఆందోళన ఉంటుంది.కనీసం ఒక్క హాఫ్ సెంచరీఅయితే, శుబ్మన్ గిల్ విషయం మాత్రం ఇందుకు భిన్నం. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో మెరుగైన స్కోరు సాధించకపోవడం అతడిని నిరాశపరిచి ఉండవచ్చు. ప్రతి మూడు- నాలుగు మ్యాచ్లలో అతడు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా చేయాలి.లేదంటే విమర్శలు తప్పవు. ఐపీఎల్లో మాదిరి ఇక్కడా ఉంటుంది అనుకోవడం పొరపాటు. వరుసగా విఫలమైతే ఇక్కడ మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చు’’ అని షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు. వరుస మ్యాచ్లలో ఫెయిలైనాకాగా టీమిండియా టెస్టు, వన్డే సారథి అయిన గిల్ను.. టీ20లలోనూ కెప్టెన్గా చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే వరుస మ్యాచ్లలో ఫెయిలైనా అవకాశాలు ఇస్తూనే ఉంది. అయితే, ఇందుకోసం సంజూ బలికావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 స్కోర్లు👉వేదిక: బారాబతి స్టేడియం, కటక్, ఒడిశా.👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 175/6(20)👉సౌతాఫ్రికా స్కోరు: 74(12.3)👉 ఫలితం: 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై భారత్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్, ఒక వికెట్).చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే అంకెల గారడీ. చంద్రబాబు జీఎస్డీపీ ముందస్తు అంచనాలపై వైఎస్ జగన్ ధ్వజం
తెలంగాణ రైజింగ్ విజన్ సాధిస్తాం... గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
నేటి నుంచే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు... ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో సర్వం సిద్ధం
‘ఇండిగో’ నిర్వాకంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల అష్టకష్టాలు... మంచినీళ్లు, ఆహారం కోసం వరద బాధితుల తరహాలో ఫుడ్ కోర్డుల ముందు నిరీక్షణ
ఉన్నత శిఖరాలకు మన బంధం. ఇండియా-రష్యా సదస్సులో సంయుక్త ప్రకటన చేసిన మోదీ, పుతిన్
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సక్రమంగా ఎక్కడ అమలు చేశారు?. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జీవో సాక్షిగా చంద్రబాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు... విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఆ కాలేజీలకు రాష్ట్ర ఖజానా నుంచి వంద కోట్ల రూపాయలు దోచిపెట్టే కుతంత్రం
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
బిజినెస్
ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్ జీడీపీ కంటే ఎక్కువ!
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రుణం పెరుగుతూ వస్తోంది. విస్తరణ, రీఫైనాన్స్ లేదా పెట్టుబడి అవసరాల కోసం కంపెనీలు రుణాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, ఆదాయం తగ్గినప్పుడు ఈ రుణాలు భారీ భారంగా మారుతాయి. కొన్నిసార్లు సంస్థలు నిలదొక్కుకోవడానికి ఆస్తుల అమ్మకం లేదా విభాగాల మూసివేతల వరకు వెళ్తాయి.ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రుణాన్ని పరిశీలిస్తే కళ్లు చెదిరే అంకెలు బయటపడుతున్నాయి. అత్యధిక రుణభారంతో ఉన్న టాప్ 10 కంపెనీలలో ఐదు చైనా, మూడు అమెరికా, ఒకటి ఫ్రాన్స్, ఒకటి కెనడా దేశాలకు చెందినవి. అమెరికా తన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజాలతో ఈ జాబితాలో ఆధిపత్యం చెలాయిస్తోంది.ప్రపంచంలోనే అత్యంత రుణం ఈ కంపెనీదే..అమెరికన్ మార్టగేజ్ సంస్థ ‘ఫెన్నీ మే’ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రుణం ఉన్న కంపెనీగా నిలిచింది. దీని రుణ భారం 4.21 ట్రిలియన్ డాలర్లు. ఇది భారతదేశ జీడీపీ కంటే అధికం. అంతేకాదు.. యూకే, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ, కెనడా వంటి దేశాల జీడీపీకన్నా కూడా ఎక్కువ.అప్పుల్లో టాప్ 10 కంపెనీలుర్యాంక్కంపనీదేశంమొత్తం రుణం1ఫెన్నీ మేఅమెరికా$4.21 ట్రిలియన్2ఫ్రెడ్డీ మాక్అమెరికా$3.349 ట్రిలియన్3జేపీ మోర్గాన్ చేజ్అమెరికా$496.55 బిలియన్4అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనాచైనా$494.86 బిలియన్5చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్చైనా$479.33 బిలియన్6బిఎన్పి పరిబాస్ఫ్రాన్స్$473.67 బిలియన్7ఐసిబిసిచైనా$445.05 బిలియన్8బ్యాంక్ ఆఫ్ చైనాచైనా$400.70 బిలియన్9సిటిక్ లిమిటెడ్చైనా$386.79 బిలియన్10రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడాకెనడా$377.70 బిలియన్భారత్లో అంబానీ కంపెనీ టాప్భారతదేశంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక రుణభారం ఉన్న సంస్థ. దీని మొత్తం రుణం 43.24 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.3.8 లక్షల కోట్లు. ఇది భారత కార్పొరేట్ రంగం చేపడుతున్న భారీ పెట్టుబడి ప్రణాళికలు, వృద్ధి లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.కార్పొరేట్ రుణం అవకాశమా.. సవాలా?కార్పొరేట్ రుణం విస్తరణకు ఉపయోగపడినా, సరైన నిర్వహణ లేకపోతే ఇది భారీ ఆర్థిక సవాలుగా మారుతుంది. ప్రపంచంలోని అత్యంత రుణపడి ఉన్న కంపెనీలు, అధిక రుణభారం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తున్నాయి.
స్మార్ట్ ఫోన్ రేట్లకు రెక్కలు
సాక్షి, బిజినెస్ డెస్క్ : మెమరీ, స్టోరేజ్ చిప్లకు కొరత నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల రేట్లకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలను పెంచేయగా మరికొన్ని అదే బాటలో ఉన్నాయి. డివైజ్లలో పర్మనెంట్ డేటాను నిల్వచేసే సెమీకండక్టర్ చిప్లను అమర్చే స్టోరేజ్ మాడ్యూల్స్ ధర నెలవారీగా, సామర్థ్యాన్ని బట్టి 20–60 శాతం మేర పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీల నుంచి భారీగా డిమాండ్ నెలకొనడంతో 1టీబీ (టెరాబైట్) మాడ్యూల్స్ కొరత తీవ్రంగా ఉంటోందని వివరించారు. అదే సమయంలో పాత టెక్నాలజీల నుంచి పరిశ్రమ దశలవారీగా నిష్క్రమిస్తున్న కొద్దీ 512 జీబీ మాడ్యూల్స్ రేట్లు సుమారు 65 శాతం పెరిగాయి. తీవ్ర కొరత కారణంగా 256 జీబీ మాడ్యూల్స్ ధరలు కూడా పెరుగుతున్నాయి. స్టోరేజ్ మాడ్యూల్స్తో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ, తాత్కాలిక, హై–స్పీడ్ డేటాను స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్స్, ఇతరత్రా డివైజ్లలో నిల్వ చేసేందుకు ఉపయోగించే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ (డీఆర్ఏఎం) మాడ్యూల్స్పైనా ప్రభావం పడుతోంది. డీఆర్ఏఎం రేట్లు 18–25 శాతం పెరిగాయి. వేఫర్ల కొరతకు సంబంధించిన పరిస్థితులు ఇప్పుడప్పుడే మెరుగుపడే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. దీంతో కాంట్రాక్ట్ ధరలు వచ్చే ఏడాది కూడా పెరిగే అవకాశమే ఉందని వివరించారు. బడ్జెట్ సెగ్మెంట్పై ప్రభావం.. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం, మెమరీ చిప్ల ధరలు ఈ ఏడాది ఇప్పటికే 50 శాతం పెరిగాయి. 2025 నాలుగో త్రైమాసికంలో ఇవి మరో 30 శాతం జంప్ చేయొచ్చని, అలాగే 2026 తొలినాళ్లలో ఇంకో 20 శాతం పెరగొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ప్రధాన స్రవంతిలో ఉపయోగించే ఉత్పత్తులకు మెమరీ మాడ్యూల్స్ సరఫరాను తగ్గించి ఏఐ అప్లికేషన్స్కి అధునాతన చిప్లను సరఫరా చేయడంపై సప్లయర్లు మరింతగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమని నిపుణులు పేర్కొన్నారు. మైక్రాన్లాంటి కంపెనీలు ఏఐకి ప్రాధాన్యమిస్తూ కన్జూమర్ మెమరీ ప్రోడక్టుల తయారీని నిలిపివేయనున్నట్లు ఇటీవల ప్రకటించాయి.దీనితో బడ్జెట్ స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్పై అత్యధికంగా ప్రభావం పడుతోందని నిపుణులు వివరించారు. అయితే, మధ్య స్థాయి నుంచి హై–ఎండ్ డివైజ్లపైనా ధరలపరమైన ఒత్తిడి నెలకొంటోందని పేర్కొన్నారు. వివో, ఒప్పో, రియల్మీ, ట్రాన్షన్లాంటి స్మార్ట్ఫోన్ బ్రాండ్లు ఇప్పటికే తమ ప్రస్తుత మోడల్స్పై రేట్లను రూ. 500 నుంచి రూ. 2,000 వరకు పెంచాయి. ముడి వస్తువుల రేట్లు పెరుగుతుండటంతో, కొత్తగా లాంచ్ చేసే వాటి ధర గత రేటు కన్నా మరో 10 శాతం అధికంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 2026 ప్రథమార్ధంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని రిటైలర్లు అంచనా వేస్తున్నారు.పీసీలకు కూడా సెగ..డెస్్క టాప్ పీసీలు, నోట్బుక్ల విడిభాగాలకు కూడా కొరత నెలకొంది. దీంతో వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం చాలా మోడల్స్కి సంబంధించి మెటీరియల్స్ వ్యయం 15 శాతం పైగా పెరిగింది. దీంతో కంపెనీల మార్జిన్లపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో డెల్, అసూస్, లెనొవొ, హెచ్పీ లాంటి కంపెనీలన్నీ మరింతగా రేట్లను పెంచే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది.రాబోయే రోజుల్లో ఎదురయ్యే కొరతను అధిగమించేందుకు అసూస్, లెనొవొ తదితర సంస్థలు తమ మెమరీ చిప్ల నిల్వలను పెంచుకుంటున్నాయి. అయినప్పటికీ వ్యయాలు మాత్రం తగ్గటం లేదు. దీంతో డెల్ లాంటి సంస్థలు తమ ఉత్పత్తుల ధరలు 15–20 శాతం మేర పెరగొచ్చని వెల్లడించాయి. ఇలా ధరల పెరుగుదల వల్ల డిమాండ్ నెమ్మదించి, అమ్మకాల వృద్ధిపైనా ప్రభావం పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ధనవంతులు కావడం ఎలా'' అనే విషయం వెల్లడించారు.ధనవంతుడిని $లో కొలుస్తారు.సంపన్నుడిని TIMEలో కొలుస్తారు.ఉదాహరణకు ఒక ధనవంతుడు ఇలా అనవచ్చు: “నా దగ్గర బ్యాంకులో $1 మిలియన్ ఉంది.ఒక సంపన్నుడు ఇలా అనవచ్చు: “నేను ఈ రోజు పని చేయకపోయినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు నెలలు జీవించగలను.ఇప్పుడు చెప్పు.. నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించడానికి పనిచేస్తున్నావా?, లేక దీర్ఘకాలంగా సంపదను నిర్మించుకుని నిజమైన ధనవంతుడు కావడానికి పనిచేస్తున్నావా?. ధనవంతుడు డబ్బు సంపాదించాలి, సంపన్నుడి కోసం డబ్బు పనిచేస్తుందని కియోసాకి పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.ఆర్థిక సంక్షోభం సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి మీరు ఏమి చేస్తారు?. ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కఠినమైన ఆర్థిక పరిస్థితులు తలత్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు అని కియోసాకి ట్వీట్ ముగించారు.LESSON # 7:: How to get richer as the world economies crash:Are you working to get rich or are you working to get wealthy?Definitions: Rich is measured in $.Wealth is measured in TIME.For example a rich person might say: “I have $1 million in the bank.”A wealthy…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 8, 2025
అమెరికా టారిఫ్స్: చరిత్ర సృష్టించిన చైనా..!
అమెరికా టారిఫ్లు చైనా వాణిజ్య జైత్రయాత్రకు బ్రేకులు వేయలేకపోయాయి. ప్రపంచ దేశాలతో వాణిజ్యం ఎలా చేయాలో తనను చూసి నేర్చుకోండన్నట్టుగా.. డ్రాగన్ వాణిజ్య మిగులును అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.90 లక్షల కోట్లు) వాణిజ్య మిగులును సాధించిన తొలి దేశంగా చైనా చరిత్రను సృష్టించింది.ఈ ఏడాది చైనా 3.6 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, ఇదే సమయంలో 2.6 ట్రిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. 2010లో ప్రపంచ దేశాలతో చైనా వాణిజ్య మిగులు 0.18 ట్రిలియన్ డాలర్లుగానే ఉంది. 2015 నాటికి 0.59 ట్రిలియన్ డాలర్లు, 2025 నాటికి 1.08 ట్రిలియన్ డాలర్లకు పెంచుకోవడం ద్వారా తయారీలో సూపర్ పవర్గా కొనసాగుతోంది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగానే చైనాపై టారిఫ్లు బాదేయడం తెలిసిందే. ఈ టారిఫ్ల కారణంగా అమెరికాకు చైనా వస్తు ఎగుమతులు నవంబర్లో 29 శాతం పడిపోయాయి. వరుసగా ఎనిమిదో నెల చైనా నుంచి యూఎస్కు ఎగుమతులు క్షీణతను చూశాయి. అమెరికా బెదిరింపులకు డ్రాగన్ ఏమాత్రం బెదరలేదు. సరికదా తన వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకోవడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.
ఫ్యామిలీ
ఆర్డర్లు కాదు ఇన్స్పిరేషన్ డెలివరీ చేస్తోంది!
‘నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, ధైర్యం ఉండాలి. జీవనోత్సాహం ఉండాలి. అవి రెండూ ఉంటే అన్నీ వస్తాయి’ అంటారు. 52 సంవత్సరాల వీణాదేవి దగ్గర అవి ఉన్నాయి. వీణ 50 శాతం శారీరక వైకల్యం ఉన్న మహిళ. ఆమె తన వైకల్యం గురించి బాధపడుతూ కూర్చోలేదు. ‘ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు. ఏదో ఒక పని చేయాలి’ అని గట్టిగా అనుకుంది. గత కొన్ని నెలల నుంచి జెప్టో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తోంది.‘కష్టం అనిపించడం లేదా?’ అని ఎవ రైనా అడిగితే... ‘ఖాళీగా కూర్చుంటేనే నాకు చాలా కష్టం’ అని నవ్వుతూ చెబుతుంది. నటి, మోడల్ మలైకా అరోరా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. వీడియోలో అరోరా వీణతో మాట్లాడుతూ కనిపిస్తుంది.‘ఇలాంటి మహిళను చూడడం నాకు ఇదే మొదటిసారి. చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటాం. వద్దు. గయ్స్... జీవితం చాలా విలువైనది. ఆమె కస్టమర్ల ఆర్డర్ను డెలివరీ చేయడం లేదు. ఇన్స్పిరేషన్ను డెలివరీ చేస్తోంది’ అని రాసింది అరోరా.ప్రౌడ్ ఆఫ్ హర్’: ‘మహిళలు సంకల్పిస్తే ఎన్ని అడ్డంకులు ఉన్నా అధిగమించి తాము అనుకున్నది సాధించగలరు’ ఇలాంటి మాటలతో కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది.
తీర్పు ఏదైనా...పోరుకు ప్రశంస
శక్తిమంతులతో పోరాడే సమయంలో పోరాటమే విజయంతో సమానం. ఆ తర్వాత దక్కిన న్యాయం సంతృప్తిని ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. కేరళ సూపర్స్టార్ దిలీప్ తనపై అత్యాచారం చేసేందుకు ఒక గ్యాంగ్తో కుట్ర పన్నాడని ఆరోపించి సుదీర్ఘకాలం పోరాడిన నటి (తెలుగులో కూడా నటించింది) చివరకు డిసెంబర్ 8న జడ్జిమెంట్ వినగలిగింది. మొత్తం 15 మంది నిందితులున్న ఈ కేసులో 1 నుంచి 6 వరకు ఉన్న నిందితులను కోర్టు దోషులుగా ఖరారు చేసి 8వ నిందితుడైన దిలీప్ను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై వ్యాఖ్యలు వినిపిస్తున్నా కేరళను కంపింప చేసి ఎన్నో సవాళ్లు తట్టుకుని పోరాడిన నటిని ముందు ప్రశంసించాల్సి ఉంది.తాను పని చేసే రంగంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఒక బాధితురాలు విశ్వసిస్తే ఆమె చేసే పోరాటానికి ఎన్ని అవరోధాలు ఉంటాయి? మలయాళ సూపర్స్టార్ దిలీప్ పన్నిన కుట్ర వల్లే తన మీద అత్యాచారం జరిగిందని న్యాయపోరాటానికి దిగిన మలయాళ నటి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చివరకు ‘తీర్పు’ను సాధించింది. అయితే ఆ తీర్పులో తనకు దక్కిన న్యాయం పాక్షికమా? సంపూర్ణమా అనేది చర్చే అయినా... ఇంతవరకూ ఆమె వెరవక నిలబడటం చాలా గొప్ప సంగతి. స్ఫూర్తిదాయకమైన పోరాటం.→ అసలేం జరిగింది?మలయాళ నటి ‘ఎం’ (కథనం కోసం పెట్టిన పేరు) ఫిబ్రవరి 17, 2017న త్రిషూర్లోని తన ఇంటి నుంచి కొచ్చి వెళుతున్నప్పుడు రాత్రి వేళ ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనంతో ఢీకొట్టిన కొంతమంది ఆమె వాహనంలోకి జొరపడ్డారు. ఆ తర్వాత కొచ్చి అంతా తిప్పుతూ ‘ఎం’ను దుర్బాష లాడారు. వారిలో పల్సన్ సుని అనే పాత నేరస్తుడు ఆమె మీద అత్యాచారం చేయడమే కాదు అదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత ఒక దర్శకుడి ఇంటి ముందు ఆమెను పడేసి ఉడాయించాడు. దర్శకుడి సహాయంతో అదే రోజు ‘ఎం’ కేసు నమోదు చేసింది.→ తర్వాత ఏం జరిగింది?మొదట పోలీసులు ఇదో బ్లాక్మెయిల్ దందా చేసే వారి పని అని భావించారు. అయితే అత్యాచార సమయంలో పల్సర్ సుని ‘ఎం’తో ‘నేను కొటేషన్ అందుకోవడం వల్లే ఈ పని చేస్తున్నాను’ అన్నాడు. కొటేషన్ అంటే సుపారీ. అయితే ఈ సుపారీ సంగతి వెంటనే పోలీసుల దృష్టికి రాలేదు. బాధితురాలు ఇది కీలకమైన కామెంట్గా గమనించలేదు.→ అరెస్టులుపోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. వీరిలో పల్సర్ సునితో పాటు ‘ఎం’ వాహన డ్రైవర్ ఇంకా ఆరు గురు ఉన్నారు. మే 1, 2017 నాటికి ‘ది విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ పేరుతో మలయాళ నటీమణులు ఒక బృందంగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలిసి మలయాళ పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ గురించి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. జూన్, 2017 నాటికి విష్ణు అనే వ్యక్తి తాను పల్సర్ సునీ జైల్మేట్నని జైలులో అతడు ఈ కేసు వెనుక నటుడు దిలీప్ ఉన్నాడన్న సంగతి చెప్పాడని బయటకు వెల్లడి చేయడంతో గగ్గోలు మొదలైంది. మరోవైపు ‘కొటేషన్ డబ్బు బేలెన్స్ చెల్లించమని’ పల్సర్ సుని రాసినట్టుగా చెప్పే లెటర్ బయటకు ‘లీక్ అయ్యింది’. దాంతో ఈ అత్యాచారం కుట్రలో దిలీప్ ఉన్నాడన్న విషయం బయటకు వచ్చి కేరళలో కంపనలు పుట్టాయి. జనం రెండుగా చీలి వాదులాడుకున్నారు. ‘ఎం’ను దుర్బాషలాడారు. జూన్ 24, 2017న దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు.→ దిలీప్పై ఆరోపణ ఎందుకు?నటుడు దిలీప్, నటి మంజు వారియర్ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే దిలీప్కు మరో నటి కావ్య మాధవన్తో సంబంధం ఉన్నట్టు మంజుకు అనుమానం వచ్చింది. కాని ఏ ఆధారం దొరకలేదు. అయితే దిలీప్కు, కావ్యా మాధవన్కు ఉమ్మడి స్నేహితురాలైన ‘ఎం’కు ఈ విషయం తెలిసి ఉండొచ్చనే ఉద్దేశంతో మంజు ‘ఎం’ను నిలదీసింది. ‘ఎం’ ఆ సంబంధాన్ని బయట పెట్టిందని సమాచారం. తనకు స్నేహితురాలిగా ఉంటూ తన పెళ్లిలో చిచ్చు పెట్టిన ‘ఎం’ మీద ఆనాటి నుంచి కోపం పెట్టుకున్న దిలీప్ సమయం కోసం ఎదురు చూశాడని ఆరోపణ. ఈలోపు 2015లో మంజు, దిలీప్లు విడాకులు తీసుకున్నారు. 2016లో దిలీప్, కావ్య వివాహం చేసుకున్నారు. 2017లో ‘ఎం’ మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నదనగా ఈ ఘటన జరిగింది. ఈ పూర్వరంగం అంతా ‘ఎం’ను దిలీప్ దీని వెనుక ఉన్నాడని విశ్వసించేలా చేసింది. అయితే దిలీప్ ముందు నుంచీ ఇదంతా తన ప్రతిష్టను తట్టుకోలేని శక్తులు చేసిన కుట్రగా కొట్టేస్తూ వచ్చాడు. 84 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన దిలీప్ తనే ఈ కేసులో సి.బి.ఐ. విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు వరకూ వెళ్లాడు.→ 2018లో విచారణ మొదలుఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో హనీ ఎం.వర్గీస్ అనే మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో 2018లో విచారణ మొదలైంది. అయితే ఈ జడ్జి మీద తనకు విశ్వాసం లేదని బాధిత నటి కేరళ హైకోర్టు కూ, సుప్రింకోర్టుకూ వెళ్లి న్యాయమూర్తిని మార్చమని అభ్యర్థించింది. అయితే న్యాయమూర్తి మార్పు జరగలేదు. విచారణలో స్వచ్ఛతపై అసంతృప్తితో 2022 నాటికి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరుగా కేసు నుంచి తప్పుకున్నారు. చాలా మంది సాక్షులు మొదట బాధితురాలి పక్షాన స్టేట్మెంట్స్ ఇచ్చి కాలక్రమంలో అడ్డం తిరిగారు. సత్వర విచార జరగాల్సిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్లింది. దిలీప్ ఉపయోగించిన ఫోన్లు, ఇతర ఫోన్లు ‘టాంపర్’ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అత్యాచార దృశ్యాలు చిత్రీకరించిన ఫోను ‘మాయమైంది’. వీటన్నింటి మధ్య కేసు నత్తనడక నడవగా స్వయంగా సుప్రిం కోర్టు రంగంలో దిగి కేసును తొందరగా ముగించమని హెచ్చరించాల్సి వచ్చింది. చివరకు 2022లో ‘ఎం’ తనకు తానే బయటకు వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకుంది. కేరళ ప్రభుత్వం విధించిన హేమ కమిటీ మలయాళ పరిశ్రమలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలను బయటకు వెల్లడి చేయడంతో మరో దుమారం లేచింది. ఇవన్నీ అయ్యాక తుదకు డిసెంబర్ 8, 2025న తీర్పు వెలువడింది. ఇందులో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. 7 నుంచి 15 వరకూ ఉన్న నిందితులను వదిలిపెట్టింది. 8వ నిందితుడైన దిలీప్కు ప్రస్తుతానికి విముక్తి దొరికింది. అయితే దీని మీద విస్తృతంగా వ్యాఖ్యలు, విమర్శలు వినపడుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఈ తీర్పును చాలెంజ్ చేస్తామని చెప్పింది. బాధిత ‘ఎం’ కూడా పై కోర్టుకు వెళ్లవచ్చు. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా బలవంతులపై బాధిత మహిళల పోరాటం ఆగవలసిన అవసరం లేదని ‘ఎం’ నిరూపించింది. ఆమె స్థయిర్యం వల్లే ఇంతవరకైనా వచ్చింది. ఇక మీదట ఆమె చేయబోయే పోరాటం మరో తీర్పును ప్రసాదించవచ్చు. వేచి చూద్దాం.
లెదర్.. లైటింగ్.. అదరహో
ఇంటికి అందం గృహోపకరణం. ఆ గృహోపకరణాన్ని ఆకర్షణీయమైన డిజైన్గా రూపొందిస్తే అది ద్విగుణీకృతమవుతుంది. అలాంటి వాటిని ‘లెదర్’తో తయారు చేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు రాయదుర్గంలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్డీడీఐ–హెచ్) హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు. తమ సెమిస్టర్లో భాగంగా ప్రాజెక్టుల రూపకల్పనలో విద్యార్థులు ఎఫ్డీడీఐ–హెచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. తేజ్లోహిత్ రెడ్డి చొరవ, ఫ్యాకల్టీ ప్రతినిధుల ప్రోత్సాహంతో వీటిని తయారు చేశారు. బెడ్ ల్యాంపులు, గోడకు వేలాడదీసే ల్యాంప్లలో వాడిన లెదర్పై రకరకాల చిత్రాలు వేసి అందులో అమర్చిన ల్యాంప్ వెలిగిస్తే రంగు రంగుల చిత్రం చూడచక్కగా కనిపిస్తూ విద్యార్థుల ప్రతిభకు పట్టం టడుతోంది. గోడకు, ఇంటి ముందు వేలాడ దీసేలా ల్యాంప్లకు చుట్టూరా లెదర్ను అమర్చి దానికి రంగులు వేయడంతో ‘ట్రెండీ’గా కనిపిస్తోంది. (చదవండి: జంటలకు ఐవీఎఫ్ వైఫల్యం వర్రీ ఉండదు..! క్లినిక్లు కూడా..)
జంటలకు ఐవీఎఫ్ వైఫల్యం వర్రీ ఉండదు..! క్లినిక్లు కూడా..
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్లలో ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నైలలో కెరీర్ ప్లానింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు ఐటీ జంటలు. దాంతో ఆ తర్వాత పేరెంట్స్గా మారలేకపోతున్నాం అని బాధపడుతున్న జంటలెందరో. సుదీర్ఘ పనిగంటలు, జీవనశైలి మార్పులు, ఆలస్యంగా వివాహం, పని ఒత్తిడి తదితర కారణాలతో చాలా జంటలు తమ సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. చివకికి ఏక్లినిక్ని సంప్రదిస్తే మంచిదన్న టెన్షన్తో సన్నిహితులు, బంధువులు సూచనలను ఆశ్రయిస్తారు. చివరికి అక్కడ ఈ ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తారు. ఆఖరికి అందులో కూడా వరుస ఫెయిలర్స్ చూసి విసిగివేసారిన దంపతులెందరో. కొందరు మాత్రం పట్టుదలతో తల్లిందండ్రలవ్వగా మరికొందరికి మాతం అదొక కలగానే మిగిలిపోతుంది. ఆ సమస్యను చక్కబెట్టేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ మరో ముందడుగు వేసింది. సహజంగా గర్భం దాల్చలేక ఇబ్బందిపడి క్లినిక్లను ఆశ్రయిస్తే ఆఖరికి ఐపీఎఫ్లో కూడా నిరాశను ఎదుర్కొన్న జంటలకు ఊరటనిచ్చేలా..భావోద్వేగ మద్దతను అందిస్తోంది ఒయాసిస్ ఆస్పత్రి. సౌకర్యవంతమైన టెలి-కన్సల్టేషన్లతో మద్దతిస్తోంది దంపతులకు. అంతేగాదు సంతానోత్పత్తి సంరక్షణ వృత్తిపరమైన నిబద్ధతలతో సమలేఖనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అన్ని ఆస్పత్రులు అమలు చేసేందుకు ముందుకొస్తే.. చాలా జంటలకు తల్లిందండ్రులు అయ్యే అవ్వకాశం ఉంటుందని పేర్కొంది. డాక్టర్ వరలక్ష్మి యాకసిరి, ప్రాంతీయ వైద్య విభాగాధిపతి, ఒయాసిస్ ఫెర్టిలిటీ చదవండి: అతి పిన్న వయస్కురాలైన యువ బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు..
అంతర్జాతీయం
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. 20 మంది సజీవ దహనం!
ఇండోనేషియా రాజధాని జకార్తలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి.. 20 మంది దాకా సజీవ దహనం అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.సెంట్రల్ జకార్తాలోని ఓ భవనంలో మంగళవారం మధ్యాహ్నా సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు శరవేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సహయక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల్లో 15 మంది పురుషులు, ఐదుగుర మహిళలు ఉన్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం సంభవించిన భవనంలో టెర్రా డ్రోన్ ఇండోనేషియా అనే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్థానిక టీవీ చానెల్స్ ప్రసారం చేస్తున్న విజువల్స్లో .. అగ్నిమాపక సిబ్బంది బాధితులను బయటకు తీసుకువస్తూ.. కొందరి బాడీ బ్యాగ్లను మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పై అంతస్తుల నుండి కొంతమంది ఉద్యోగులు పోర్టబుల్ లాడర్లు ఉపయోగించి బయటకు తప్పించుకున్న విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సహాయం కోసం కొందరు బిల్డింగ్ పైన నిల్చున్న దృశ్యాలు నెట్టింటకు చేరుతున్నాయి.#இந்தோனேசியா தலைநகர் #ஜகார்த்தா-வில் வணிக கட்டிடம் ஒன்றில் இன்று ஏற்பட்ட தீ விபத்தில் 5 பெண்கள், 15 ஆண்கள் என குறைந்தது 20 பேர் பலியாகியுள்ளனர்.#indonesia #jakarta #FireAccident pic.twitter.com/yh9wKi6V0G— patrikai.com (@Patrikaidotcom) December 9, 2025ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. లంచ్ టైంలో ఘటన చోటు చేసుకుందని ప్రాణాలతో బయటపడిన కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి సహాయక చర్యలు ముగిశాకే ప్రమాదంపై ఓ స్పష్టమైన ప్రకటన చేయస్తామని అధికారులు అంటున్నారు.
Israel: యుద్ధ విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న గణాంకాలు
జెరూసలేం: ఇజ్రాయెల్కు పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్తో గాజా స్ట్రిప్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం తీవ్ర విషాదాన్ని తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పునరావాస విభాగం తాజాగా విడుదల చేసిన గణాంకాల కన్నీరు కంటతడి పెట్టిస్తున్నాయి.మానసిక అనారోగ్యంతో..ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పునరావాస విభాగం తెలిపిన గణాంకాల ప్రకారం, 2023 అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 22,000 మంది గాయపడిన సైనికులకు చికిత్స అందించారు. వీరిలో అత్యధికంగా 58 శాతం మంది పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD), ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది పునరావాస కేంద్రాలకు తీవ్రమైన భారంగా పరిణమించింది.అన్ని విభాగాలవారూ..పునరావాస విభాగం ప్రస్తుత. గత యుద్ధాలలో గాయపడిన వారితో సహా మొత్తం 82,400 మంది గాయపడిన మాజీ సైనికులకు సేవలు అందిస్తోంది. ఈ సంఖ్యలో 9 శాతం మంది మహిళా సైనికులు ఉన్నారు. గాయపడిన మొత్తం అనుభవజ్ఞులు( సీనియర్లు)లో అత్యధికంగా 48 శాతం మంది వారి తప్పనిసరి సైనిక సేవ (Compulsory Service) సమయంలో గాయపడగా, 26 శాతం మంది రిజర్వ్ డ్యూటీలో, 13 శాతం మంది కెరీర్ సర్వీస్లో, తొమ్మిది శాతం మంది పోలీసు సిబ్బందిగా ఉన్న సమయంలో గాయపడ్డారని విభాగం తెలిపింది.వీల్చైర్కే పరిమితమై..పునరావాస విభాగంలో తీవ్రమైన గాయాలు, వైకల్యాలతో బాధపడుతున్న అనుభవజ్ఞుల సంఖ్య గణనీయంగా ఉంది. వీరిలో 873 మంది వీల్చైర్కే పరిమితమయ్యారు. వీరిలో 132 మంది అక్టోబర్ 7 తర్వాత గాయపడ్డారు. అత్యంత తీవ్రమైన గాయం స్థాయి (100% కంటే ఎక్కువ వైకల్యం) ఉన్నవారు 612 మంది ఉండగా, వీరిలో ప్రస్తుత యుద్ధంలో 64 మంది గాయపడ్డారు. అలాగే, 115 మంది అంధత్వంతో బాధపడుతున్నారు (ప్రస్తుత యుద్ధంలో ఐదుగురు), 1,061 మంది అంగవైకల్యం (Amputations) పొందినవారు ఉన్నారు, వీరిలో గత రెండేళ్ల యుద్ధంలో 88 మంది గాయపడ్డారు.చికిత్సకు రూ. 23,130 కోట్లుపునరావాస కేంద్రాలపై పెరుగుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని, 2026 చివరి నాటికి మరో 10,000 మంది గాయపడిన మాజీ సైనికులను కేంద్రాలు స్వీకరిస్తాయని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది, వీరిలో ఎక్కువ మంది PTSD వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు, పునరావాస శాఖ మొత్తం బడ్జెట్ $2.57 బిలియన్లు(₹23,130 కోట్లు) గా ఉంది. ఇందులో $1.27 బిలియన్లు(₹11,444 కోట్లు) ప్రత్యేకంగా మానసిక ఆనారోగ్యంతో బాధపడుతున్న వారి చికిత్సకు కేటాయించారు.మృతులెందరు?మాజీ సైనికుల సంరక్షణలో అనేక సవాళ్లు ఉన్నాయని మంత్రిత్వ శాఖ గుర్తించింది, ముఖ్యంగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతి 750 మంది రోగులకు కేవలం ఒకే పునరావాస సిబ్బంది అందుబాటులో ఉన్నాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖలు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేశాయి. నగరాల వారీగా చూస్తే, మోదీన్ నగరంలో అత్యధిక సంఖ్యలో గాయపడిన మాజీ సైనికులు ఉన్నారు. 2023 అక్టోబర్ 7 నుండి ఇప్పటివరకు, మొత్తం 922 మంది సైనికులు, అధికారులు, రిజర్విస్టులు, వందల మంది స్థానిక భద్రతా అధికారులు మృతి చెందారు. వీరిలో దాదాపు 331 మంది హమాస్ ప్రారంభ ఉగ్రవాద దాడిలో గాజా స్ట్రిప్ సరిహద్దులో మరణించగా, 471 మంది హమాస్ ఆధీనంలోని సరిహద్దుల్లో జరిగిన భూ ఆపరేషన్లలో మృతి చెందారు. వివిధ ఉగ్రవాద దాడులు, ఘర్షణల్లో 70 మంది ఇజ్రాయెల్ పోలీసు అధికారులు మృతిచెందారు. ఇది కూడా చదవండి: Tamil Nadu: ఈడీ చేతికి టెండర్ స్కాం.. సంచలన వివరాలు వెల్లడి
సౌదీ సంచలన నిర్ణయం.. వారికి ఇక రోజూ పండగే..
రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ముస్లిమేతర నివాసితులకు మద్యం విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు పలు కఠిన నిబంధనలు విధించింది. దేశీయంగా తీసుకున్న ఆర్థిక పరివర్తన లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు సౌదీ ప్రయత్నిస్తోంది. దేశంలోని రియాద్లో ఏర్పాటు చేసిన ఏకైక మద్యం దుకాణంలోకి ప్రవేశించేందుకు ముస్లిమేతర నివాసితులు తమ ధృవీకరణ పత్రాన్ని చూపించాల్ని ఉంటుంది. అంతకుముందు విదేశీ దౌత్యవేత్తల కోసం ప్రారంభించిన ఈ దుకాణం ఇటీవల ప్రీమియం రెసిడెన్సీ హోదా కలిగిన ముస్లిమేతరులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ దుకాణంలో కొనుగోళ్లు కేవలం నెలవారీ పాయింట్-బేస్డ్ అలవెన్స్ సిస్టమ్ కింద మాత్రమే చేయవచ్చని సమాచారం. కాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్తో పాటు ఇతర నగరాల్లో కూడా కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు మద్యం యాక్సెస్ను సులభతరం చేసే దిశగా తీసుకుంటున్న చర్యలలో భాగమని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రభుత్వం నుండి ఈ మార్పులపై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.రియాద్ను వ్యాపార, పెట్టుబడులకు పోటీ కేంద్రంగా మార్చడానికి సౌదీ అరేబియా విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడం అనేది విజన్ 2030 లో భాగంగా ఉంది. ఆర్థిక పరివర్తన లక్ష్యాలకు దీనిని కీలకంగా సౌదీ అరేబియా భావిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల మహిళల డ్రైవింగ్పై నిషేధాన్ని రద్దు చేసింది. అలాగే ప్రజా వినోదం, సంగీతం తదితర రంగాలలో మహిళల ప్రవేశానికి అనుమతులు మంజూరు చేసింది. దేశంలోని పర్యాటక రంగాన్ని కూడా మరింతగా ప్రోత్సహిస్తోంది. ఇది కూడా చదవండి: లడఖ్లో చైనా గూఢచారి?.. ఫోరెన్సిక్ పరీక్షకు ఫోన్
ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. భారత్పై సుంకాలకు రెడీ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్ను దెబ్బతీసేలాంటి నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ రైతుల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు ట్రంప్ సర్కారు భారత బియ్యం, కెనడియన్ ఎరువులతో సహా వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలను విధించే దిశగా యోచిస్తున్నది. సబ్సిడీ పొందిన విదేశీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని, దేశీయ ధరలను దిగజారుస్తున్నాయని అమెరికన్ రైతులు వైట్ హౌస్ రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ ఎదుట ఆరోపించారు. రైతుల వినతిని పరిగణలోకి తీసుకున్న ట్రంప్ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ట్రంప్ అమెరికన్ రైతుల కోసం $12 బిలియన్ల (₹1,08,156 కోట్లు) బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు నేరుగా ట్రంప్తో మాట్లాడారు. భారతదేశం లాంటి దేశాలు తమ బియ్యాన్ని యూఎస్ మార్కెట్లలోకి తక్కువ ధరలకు డంపింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. ఇది తమకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ట్రంప్ స్పందిస్తూ తమ దేశ మార్కెట్లలోకి అన్యాయంగా వస్తువులను డంపింగ్ చేస్తూ, పలు దేశాలు తమను మోసం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.లూసియానాలోని కెన్నెడీ రైస్ మిల్ సీఈఓ మెరిల్ కెన్నెడీ, డంపింగ్కు ప్రధాన కారకులుగా భారతదేశం, థాయిలాండ్, చైనాలను చూపించారు. చైనా బియ్యం అమెరికా ప్రధాన భూభాగానికి బదులుగా ప్యూర్టో రికో(టెరిటరీ)లోకి తరలిపోతున్నదని తెలిపారు. ఇది తమకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. అమెరికా రైతులకు అన్యాయమైన పోటీనిస్తున్న దేశాల పేర్లను రాయమని ట్రంప్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ను ఆదేశించారు. భారతదేశం తన బియ్యం పరిశ్రమను చట్టవిరుద్ధమైన సబ్సిడీలతో ఎలా ప్రోత్సహిస్తుందో కెన్నెడీ వివరించడానికి ప్రయత్నించగా, ట్రంప్ అడ్డుకుంటూ తనకు దేశాల పేర్లు చెప్పాలని కోరారు.ట్రెజరీ కార్యదర్శి బెస్సెంట్ భారతదేశం, థాయిలాండ్ చైనాలను ఎత్తిచూపారు. వెంటనే ట్రంప్ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వాణిజ్య ఒప్పందాల కోసం కెనడా, భారతదేశం రెండూ అమెరికాతో సంబంధాలను స్థిరీకరించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా డిప్యూటీ యూఎస్టీఆర్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయ సీనియర్ ప్రతినిధి బృందం త్వరలో భారతదేశంతో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించనుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూడా చదవండి: అవినీతి చీకట్లో.. దేశాల ఆర్థిక పతనం
జాతీయం
వందేమాతరంను విభజించడం వల్లే దేశం ముక్కలు
న్యూఢిల్లీ: వందేమాతర గీతానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాంగ్రెస్ రక్తంలోనే ఉందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ వందేమాతర గీతాన్ని బుజ్జగింపు రాజకీయాల కోసం రెండుగా విడగొట్టడమే దేశ విభజనకు కారణమైందని, లేకుంటే దేశం ముక్కలై ఉండేది కాదని వ్యాఖ్యానించారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభలో మంగళవారం చేపట్టిన చర్చను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. వందేమాతరం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ 1937లో జవహర్లాల్ నెహ్రూ ఈ గీతాన్ని రెండు ముక్కలుగా చేసి, కేవలం రెండు చరణాలకే పరిమితం చేశారన్నారు.బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఆయన అలా చేసినట్లు చాలా మంది భావించారని, వందేమాతరంను రెండుగా విభజించకుంటే దేశం ముక్కలయ్యేది కాదని కూడా అనుకున్నారని తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్ అలాంటి రాజకీయాలు చేస్తోందన్నారు. వందేమాతర గీతం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించిందన్నారు. జాతీయ గీతాన్ని త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలతో ప్రతిపక్షం ముడిపెట్టడాన్ని ఆయన నిరసించారు. దేశ సాంస్కృతిక జాతీయవాదాన్ని మేలుకొల్పిన మంత్రం వందేమాతరమని ఆయన చెప్పారు.స్వాతంత్య్రోద్యమ సమయంలో ఆ గీతం ఎలాంటి ప్రముఖ పాత్ర పోషించిందో నేటికీ ఆ గీతానికి అంతే ప్రాముఖ్యత ఉందన్నారు. భవిష్యత్ వికసిత్ భారత్కు కూడా వందేమాతరం ఎంతో అవసరమైందని చెప్పారు. ఇతర అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకే వందేమాతరంపై ప్రభుత్వం చర్చకు పెట్టిందని చాలా మంది కాంగ్రెస్ సభ్యులు అనుకుంటున్నారన్న ఆయన.. కీలక అంశాలపై చర్చకు ప్రభుత్వం ఎన్నడూ భయపడలేదన్నారు. పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయకుండా, సరిగ్గా కార్యకలాపాలు జరగనిస్తే అన్ని అంశాలపైనా చర్చకు అవకాశమేర్పడుతుందని అమిత్ షా తెలిపారు.
బ్యాలెట్ పేపర్కు మళ్లుదాం: లోక్సభలో విపక్షాలు
న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో ఈవీఎంల వినియోగానికి స్వస్తిపలికి మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని మంగళవారం ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో జరిగిన చర్చలో విపక్షాలు డిమాండ్చేశాయి. ఈ మేరకు పలు విపక్షపార్టీల ఎంపీలు మాట్లాడారు. ‘‘ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చాంతాడంత క్యూ లైన్లలో నిల్చునే ప్రతి ఒక్క ఓటరులో తమ ఓటు సద్వినియోగం అవుతోందన్న భరోసాను కల్పించాలి. ఈవీఎంలతో మోసగిస్తున్నారని నేను చెప్పడంలేదు. కానీ ఈవీఎంలను దుర్వినియోగం చేయొచ్చు అనేది మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను.ఈవీఎంలపై ఓటర్లలో గూడుకట్టుకుపోయిన అపోహలను తొలగించాలంటే రెండే మార్గాలున్నాయి. ఈవీఎం ఓట్లకు సరిసమానంగా వీవీప్యాట్ చిట్టీలను అన్నింటినీ లెక్కించాలి. లేదంటే ఈవీఎంలను పక్కనపడేసి మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్లాలి. పేపర్ బ్యాలెట్ విధానమే అత్యంత ఉత్తమం. ఎందుకంటే సాంకేతికంగా ఎంతో పురోగమించిన జపాన్, అమెరికా సైతం ఈవీఎంలాంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలను పక్కనబెట్టేసి పేపర్బ్యాలెట్కు జై కొట్టాయి. ఎంతకాదన్నా ఈవీఎంలు అనేది మెషీన్లు. ఎలాంటి మెషీన్లో అయినా మార్పులు చేయొచ్చు’’ అని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. ‘‘ పేపర్ బ్యాలెట్ పట్ల ఓటర్లలో ఎంతో విశ్వసనీయత, నమ్మకం ఉన్నాయి. బ్యాలెట్ విధానం మంచిది’’ అని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘‘మీట అయితే ఓటరు నొక్కుతున్నాడుగానీ తన ఓటు ఎటు పోతుందనేది ఇప్పటికీ అతనికి ఇక చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈవీఎంలో ఇదే స్పష్టత కరువైంది. ఓటరు మదిలో సూక్ష్మస్థాయి అనుమానం ఉన్నాసరే దానిని నివృత్తిచేయాల్సిందే. అనుమానాలతో ఎన్నికల క్రతువును కొనసాగించడం నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదు’’ అని శివసేన (యూబీటీ) నేత అనిల్ దేశాయ్ అన్నారు. సీపీఐ(ఎం) నేత ఆమ్రా రామ్, రాష్ట్రయ జనతాదళ్ ఎంపీ అభయ్ కుమార్ సిన్హా సైతం ఇదే వాదనకు తమ మద్దతు ప్రకటించారు. 2004 ఏడాది నుంచి ఐదు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించిన విషయం విదితమే.
సాయంత్రం 6 దాటాక 51 లక్షల ఓట్లా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని, అప్పుడే గెలిచిన వారికైనా, ఓడిన వారికైనా వ్యవస్థపై నమ్మకం ఉంటుందని వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత, ఎంపీ పీవీ మిథున్రెడ్డి చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో జరిగిన వింత పోకడలను ఎండగట్టారు. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశాలే ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్వైపు వెళుతుంటే.. మనం ఇంకా ఈవీఎంలను పట్టుకుని వేళ్లాడటంలో అర్థం లేదని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై మిథున్రెడ్డి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 కోట్ల 38 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 15 శాతం ఓట్లు.. అంటే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. రాష్ట్ర చరిత్రలో 2014లోగానీ, 2019లోగానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆకస్మిక పెరుగుదల ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదు. ఒడిశాలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి’ అని ఆయన సభ దృష్టికి తెచ్చారు. చార్జింగ్ పెరగడం.. స్లిప్పులు తగులబెట్టడం..‘విజయనగరంలో కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ 99 శాతంగా ఉంది. కానీ పోలింగ్ రోజున అది 60 శాతమే ఉంది. వాడకం తర్వాత బ్యాటరీ చార్జింగ్ తగ్గాలి. కానీ, ఎలా పెరుగుతుంది? అని మా మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ నుంచి స్పందన లేదు. స్ట్రాంగ్రూమ్ సీసీటీవీ ఫుటేజీ అడిగితే ఇవ్వలేదు. కనీసం వీవీపాట్ స్లిప్పులు లెక్కించమని అడిగితే.. వాటిని తగులబెట్టేశాం, ధ్వంసం చేశాం అని సమాధానం ఇచ్చారు. అనుమానం ఉన్న ఈవీఎంలను కాకుండా వేరేవాటిపై మాక్ పోలింగ్ నిర్వహించారు’ అని మిథున్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పోలింగ్ బూత్లో మరీ విడ్డూరం ‘హిందూపురం నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్లో మరీ విడ్డూరం జరిగింది. ఒకేరోజు, ఒకే సమయాన జరిగిన ఎన్నికల్లో.. ఒక బూత్లో మా ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు వచ్చాయి. కానీ అదే బూత్లో మా ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. అక్కడ మాకు ఐదుగురు ఏజెంట్లున్నారు. వాళ్ల కుటుంబసభ్యుల ఓట్లే 30 వరకు ఉంటాయి. గత 30 ఏళ్లుగా మేము గెలుస్తున్న బూత్ అది. ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు పడినచోట, ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక్క ఓటు పడటం ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది’ అని చెప్పారు. అమెరికానే బ్యాలెట్ వైపు వెళ్తోందిటెక్నాలజీలో ఎంతో ముందున్న ఎలాన్ మస్క్ వంటి వారే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్నారని, అమెరికాలో 92 శాతం ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీదే జరుగుతున్నాయని మిథున్రెడ్డి చెప్పారు. నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, ఫిన్లాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ ఈవీఎంలను రద్దుచేసి బ్యాలెట్ పేపర్కు మళ్లాయని తెలిపారు. ‘నేను మూడుసార్లు ఎంపీగా గెలిచింది ఈవీఎంల మీదనే అయినా, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్లో వెబ్కాస్టింగ్ ఉండాలని, ఆ ఫుటేజీని అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని మిథున్రెడ్డి సూచించారు.కేంద్రమంత్రి పెమ్మసానిపై మిథున్రెడ్డి సెటైర్లుఎస్ఐఆర్పై జరిగిన చర్చలో మిథున్రెడ్డి మాట్లాడుతుండగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అడ్డుపడ్డారు. దీంతో ‘ఉపాధిహామీ పథకం డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్రంలోని కూలీల పరిస్థితులపై నీకు సరైన అవగాహన లేదు. బ్యాలెట్ పేపర్ విషయంపై మాట్లాడుతుండగా ఈ విషయంలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు’ అంటూ మిథున్రెడ్డి ప్రతిఘటించారు. ‘లేదు వచ్చాయి, అయ్యాయి’ అంటూ పెమ్మసాని ఏదో చెప్పబోతుండగా.. ‘ఎలా వచ్చాయి? బస్సులో వచ్చాయా?’ అంటూ మిథున్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉపాధిహామీ నిధులపై మిథున్రెడ్డి ప్రస్తావించిన సమయంలో కూటమి ఎంపీలు ఎవరూ నోరు మెదపకపోవడం, పెమ్మసానికి సపోర్ట్గా మాట్లాడకపోవడం గమనార్హం.
ఎస్ఐఆర్ పాతదే: మేఘ్వాల్
న్యూఢిల్లీ: ఎస్ఐఆర్ పేరిట మోదీ సర్కార్ మరోమారు పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి తెగిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేసిన లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీకి ప్రభుత్వం తరఫున బీజేపీ నేతలు దీటైన జవాబులిచ్చారు. మంగళవారం లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చలో ప్రభుత్వం తరఫున న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్సింగ్ మేఘ్వాల్ మాట్లాడారు. ‘‘ వాస్తవానికి తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ను ఓడించాలనే దుర్బుద్ధితో ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడింది.ఈవీఎంలు, ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు గుప్పిస్తోందిగానీ సహేతుక కారణాలను వెల్లడించలేక చతికిలపడింది. 1952 నుంచి 2002 ఏడాదిదాకా ఎస్ఐఆర్ను పలుమార్లు చేపట్టారు. ఇది కొత్తదేమీ కాదు. గత 2 దశాబ్దాలుగా ఎస్ఐ ఆర్ నిర్వహించట్లే రు. దీంతో వల సలు, మరణాలు, సవరణలు, పట్ట ణీకర కారణాలతో ఓటర్ల జాబితాలో మార్పులొచ్చాయి.వాస్తవాలు ప్రతిబింబించేలా పారదర్శకంగా ఎస్ఐఆర్ను తాజాగా చేపట్టాల్సిన సమయం వచ్చింది. అందుకే బిహార్లో పూర్తిచేశాం. మిగతా రాష్ట్రాల్లోనూ చేస్తాం. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు సూచించిన కమిటీ అనేది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకే నూతన చట్టం తెచ్చాం’’ అని మేఘ్వాల్ చెప్పారు.ఈవీఎంలు రాజీవ్ హయాంలోనే..ఈవీఎంలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న రాహుల్గాంధీ వ్యాఖ్యలపై జార్ఖండ్ నేత, గోధా నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తప్పుబట్టారు. ‘‘ఈవీఎంలపై విపక్ష పార్టీలు యాగీచేస్తున్నాయి. వాస్తవానికి నాటి ప్రధాని రాజీవ్గాంధీ హయాంలో 1987లో పైలట్ ప్రాజెక్ట్గా ఈవీఎంలను పరీక్షించారు. 1991లో కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఎన్నికల్లో ఉపయోగించారు. ఇప్పుడు విమర్శిస్తున్న ఇదే కాంగ్రెస్లోని ఆనాటి నేతలు ఈవీఎంలను వేనోళ్ల పొగిడారు. అత్యంత పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ పరికరం ఇదేనని ఆకాశానికి ఎత్తేశారు. రిగ్గింగ్ను నివారించేందుకు ఈవీఎంలే సరైన పరిష్కారమని 1961లో కమిటీ సైతం అభిప్రాయపడింది’’ అని దూబే.. రాహుల్కు దీటైన బదులిచ్చారు.
ఎన్ఆర్ఐ
వచ్చేనెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆటా వేడుకలు
గత ఇరవై సంవత్సరాలుగా ఆటా వేడుకలు పేరుతో అమెరికా తెలుగు సంఘం ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదిలిపెట్టి నిర్విరామంగా నిర్వహిస్తుంది. తెలుగు భాష, సాహిత్యాలను ప్రేమిస్తూ విశేష కృషి చేస్తూ వస్తున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆటా వేడుకలు ఘనంగా జరగటం విశేషం.ఆటా సేవల్లో భాగమైన సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాల్లాంటి మరెన్నో రంగాల్లో పలు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన మిషన్ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, ఆటా తెలుగు తేజాన్ని నాలుగు దిశల విస్తరింప చేస్తూ ఉన్నది. విశ్వఖ్యాతిగా మన తెలుగును బహుళ ప్రచారం చేస్తూ భవిష్యత్తు తరాలను ప్రభావితపరుస్తూ ఉన్నది. తేనెలొలుకు తెలుగు తియ్యదనాన్ని ప్రచారం చేస్తూ తెలుగు మాతృభాష గల ప్రజలను, భాషాభిమానులను ఆకర్షిస్తూ ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తు నిర్మాణానికి ఎంతగానో ఈ ఆటా వేడుకలు ఉపయోగపడుతున్నాయి.ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లసహాయ సహకారాలతో, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ & ఆటా వేడుకల కమిటీ చైర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటా వేడుకలు జరగబోతున్నాయి.డిసెంబర్ 12 - రంగా రెడ్డి జిల్లాలో స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు డిసెంబర్ 13: – సంగారెడ్డి - ఐఐటీలో స్టార్ట్ అప్ పిచ్ డిసెంబర్ 14: – హైదరాబాద్ లో సాహిత్య కార్యక్రమండిసెంబర్ 16–17: బిజినెస్ సెమినార్స్ - హైదరాబాద్, విశాఖపట్నండిసెంబర్ 20–23: స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు , స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి , ,వాటర్ ప్లాంట్ మరియు ఉమెన్స్ హెల్త్ క్యాంప్స్.డిసెంబర్ 24–25: పిల్లల కొరకు హెల్త్ క్యాంప్స్ మరియు చారిటబుల్ ప్రోగ్రామ్స్డిసెంబర్ 27: గ్రాండ్ ఫినాలే రవీంద్ర భారతి లో - సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటా అవార్డ్స్ ప్రధానంరెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగే అన్ని కార్యక్రమాలని ముగించుకుని హైద్రాబాద్లోని రవీంద్రభారతిలో జరిగే గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు ఎందరో కళాకారులు. చివరగా రుచికరమైన విందు భోజనంతో ముగియబోయే ఈ వేడుకలు అమెరికాలో బాల్టిమోర్ నగరంలో జులై 31 - ఆగష్టు 2 జరగబోయే ఆటా మహాసభల సన్నాహాల కోసం అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆటా ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు రెండూ రాష్ట్రాలలో నిర్వహిచటం గమనార్హం. డిసెంబర్ మాసంలో నిర్వహించే ఆటా వేడుకలలో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గోవాలిసిందిగా ఆటా బోర్డ్ విజ్ఞప్తి చేసింది. తమ గ్రామాలూ, పట్టణాలలో సేవ కార్యక్రమాలు చేయాలనుకునే వారు www.ataworld.org సంప్రదించవలిసిందిగా కోరారు.
అమెరికాలో ఆంధ్రా తల్లి,కొడుకుల హత్య కేసులో ట్విస్ట్
అనూహ్య పరిస్థితుల్లో భార్య బిడ్డలు చనిపోయి కనిపించారు. తీరని దుఃఖంలో ఉండగానే నువ్వే నిందితుడని బంధువులు ఆరోపించారు. అనుమానాలున్నాయంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్ల తరువాత అసలు నిజం తెలిసింది. సంచలనంగా మారిన ఈ స్టోరీ వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.2017, మార్చి 23, ఆంధ్రప్రదేశ్కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్మెంట్లోశవాలై కనిపించారు. మహిళ భర్త నర్రా హనుమంతరావునే ప్రాథమికంగా నిందితుడిగా భావించారు. కానీ అనూహ్యం ఎనిమిదేళ్ల తరువాత నజీర్ హమీద్ అనే వ్యక్తిపై అభియోగాలు మోసారు. న్యూజెర్సీలోని ఒక కంపెనీలో శశికళ నర్రా భర్త సహోద్యోగే ఈ హత్యలకు పాల్పడినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు.శశికళ, అనిష్ హత్యఏపీకి చెందిన నర్రా హనుమంతరావు న్యూజెర్సీలోని మాపుల్ షేడ్లోని ఫాక్స్ మేడో అపార్ట్మెంట్స్లో భార్య శశికళ నర్రా(38), 6 ఏళ్ల కుమారుడు అనిష్తో కలిసి ఉండేవారు. ఒక రోజు ఆఫీసునుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు ఒళ్లంతా రక్తమోడుతూ తీవ్రమైన కత్తిపోట్లతో చనిపోయి కనిపించారు. వెంటనే హనుమంత రావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు హనుమంతరావును అరెస్ట్ చేశారు. ఈ సమయంలో దర్యాప్తు అధికారులు తమ విచారణలో భాగంగా సంఘటనా స్థలంనుంచి రక్తపు మరకల నమూనాలను సేకరించి, డీఎన్ఏ పరీక్షలు చేయించారు. అయితే అది హనుమంతరావు డీఎన్ఏతో మ్యాచ్ కాకపోవడంతో ఇది మరో మలుపు తిరిగింది.ఎలా ఛేదించారంటే..బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పాట్రిక్ థోర్న్టన్ అందించిన వివరాల ప్రకారం హనుమంతరావు ఇంటికి సమీపంలోనే ఉండే హమీద్ మధ్య గొడవలు ఉన్నట్టు గురించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో పనిచేస్తున్న సమయంలో హను నర్రాను వేధించినట్లు గతంలో నజీర్ హమీద్ పై ఆరోపణలు రావడంతో ఆ వైపుగా దర్యాప్తు మెుదలుపెట్టారు. డీఎన్ఏ నమూనాను సేకరించాలనే ఉద్దేశంతో అధికారులు 2024లో కోర్టుకు వెళ్లారు. కాగ్నిజెంట్ కంపెనీ,హమీద్కు జారీ చేసిన ల్యాప్టాప్ను తమకు పంపమని కోరారు. చివరికి ల్యాప్టాప్ నుండి డీఎన్ఏ సేకరించారు అధికారులు. నేరస్థలంలో దొరికిన నమూనాతో హమీద్ డీఎన్ఏ సరిపోలడంతో గుట్టు రట్టయింది.మరోవైపు జంట హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ ఇండియాకు చెక్కేశాడు. అయినా కాగ్నిజెంట్ ఉద్యోగిగా కొనసాగాడు. అంతేకాదు అమెరికా పోలీసులు హమీద్ డీఎన్ఏ కోసం చాలాసార్లు ప్రయత్నించారు. భారతీయ అధికారుల ద్వారా సంప్రదించినా స్పందించలేదు. చివరికి అతడి ల్యాప్ట్యాప్ మీద నమూనాల ఆధారంగా కేసును ఛేదించారు. మరోవైపు హమీద్ను అమెరికాకు రప్పించేందుకు భారత విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరుఈ దారుణమైన హత్యల వెనుక హమీద్ ఉద్దేశం ఏమిటనేది దర్యాప్తు అధికారులకు స్పష్టత లేదు కానీ హనుమంతరావుపై కోపంతోనే అతడి భార్య శశికళ, కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఇన్వెస్టర్ల క్యూ : కొత్త ఐటీ నగరం వచ్చేస్తోంది!
గ్రామాలను దత్తత తీసుకున్న శంకర నేత్రాలయ USA మిల్వాకీ దాతలు
శంకర నేత్రాలయ USA నిర్వహించిన మిల్వాకీలో ఒక చిరస్మరణీయ రాత్రి, అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు మద్దతుగా $50,000(రూ. 43 లక్షలు) దాక సేకరించారు. భారతదేశంలోని పేద వర్గాలకు కంటి శస్త్రచికిత్సలు చేయడానికి రూపొందించబడిన అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమానికి మద్దతుగా శంకర నేత్రాలయ USA లైట్ మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించడంతో పెవాకీలోని విస్కాన్సిన్ హిందూ దేవాలయం సంస్కృతి, కరుణల శక్తిమంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఈ కార్యక్రమం దాదాపు ౩50 మంది ప్రేక్షకులతో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంలో సమాజం, కళ, సేవ, శక్తిని ప్రదర్శించింది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్-మిల్వాకీ సత్య జగదీష్ బాదం ఇలా పంచుకున్నారు. “మిల్వాకీ సేవా స్ఫూర్తితో పసిగడుతుంది. ఈ రాత్రి, మేము కలిసి వచ్చాం. కేవలం సేకరించడానికికాదు, ఉమ్మడి ఉద్దేశ్యం ద్వారా జీవితాలను ప్రకాశవంతం చేయడానికి.” "శంకర నేత్రాలయ USA టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లోకి తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. దృష్టి లోపాలతో బాధపడుతున్న నిరుపేద వ్యక్తులకు సేవ చేయాలనే మా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మిల్వాకీ నుంచి ఉత్సాహభరితమైన మద్దతు మాకు ప్రోత్సాహాన్నిచ్చింది" అని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందూర్తి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం జయప్రదం కావడంలో..పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ సత్య జగదీష్ బాదం, కమిటీ సభ్యులు డాక్టర్ హరి బండ్ల, పోలిరెడ్డి గంటా, చాప్టర్ లీడ్స్ మహేష్ బేలా మరియు అర్జున్ సత్యవరపు, వాలంటీర్లు ఆనంద్ అడవి, సాయి యార్లగడ్డ, రవి నాదెళ్ల, శ్రీని కిలిచేటి, చండీ ప్రసాద్, క్రాంతి మల్రెడ్డి, గుప్తా కళ్లేపల్లి, పవన్ శ్రీభాష్యం, విజయ్ వల్లూరి, చంద్రశేఖర్ గుడిసె, కరుణాకర్ రెడ్డి దాసరి, రత్నాకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, కొండారెడ్డి, వెంకట్ శశి కొద్దంరెడ్డి, వౌనద్ శవధరి, వెంకట్ జాలరి రెడ్డి రెడ్డి, గోపాల్ గారు, రాజా బాబు నేతి, విక్రాంత్ రెడ్డి, గోపాల్ సింగ్, శ్రీనివాస్ నిమ్మ, రంజిత్, శ్రావణి మీసరగండ, వాసవి బాదం, ప్రీతి, కీర్తి, లావణ్య, సునీత, పావని గంట, చంద్రిక, సంతోషి, భాను, సరోజిని, కావ్య వి, రాధిక పెబ్బేటి, శరణ్య రాఘవ, శరణ్య జాలరి, కిరణ్య జ్ఙాపక ముత్తూరు, డీఎస్ రెడ్డి, రవి కుమార్ గుంత, రమేష్ పుసునూరు, శ్రీనివాస్ యూర్కేరి, ప్రమోద్ అల్లాణి, పవన్ జంపాని, ప్రీతి శర్మ, అనిల్ పబ్బిశెట్టి. రాజ్ వధేరాజ్, యాజులు దువ్వూరు, ఫణి చప్పిడి, దుర్గ, ధనలక్ష్మి, కార్తీక్ పాసెం, భారతి కొల్లి, ఉమాదేవి పువ్వాడి, దుర్గా బండారుపల్లి, వెంకట కుందూరి, డా. రెడ్డి ఊరిమిండి, మూర్తీ రేకపల్లి,శ్యాంఅప్పాలి, వంశీ ఏరువారం, రత్నకుమార్కవుటూరు, త్యాగరాజన్, దీన్ దయాళన్, సురేశ్ కుమార్లు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన బృందం శంకర నేత్రాలయ సేవా లక్ష్యం పట్ల అంకితభావం, సహకారం, భాగస్వామ్య నిబద్ధతను ఉదహరించారు. చంద్ర మౌళి తమ వందన సమర్పణలో కార్యక్రమ వ్యాఖ్యాతలు మాలతి కర్రి, శ్రీ వల్లిల సహకారాన్ని గుర్తించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు .
సింగపూర్లో కార్తీకమాస స్వరారాధన
సింగపూర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సాంస్కృతిక సంస్థ "శ్రీ సాంస్కృతిక కళాసారథి", ఈ పవిత్ర కార్తీకమాస సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో శనివారం "కార్తీకమాస స్వరారాధన" అనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు. పోలండ్ దేశస్తుడైన యువ గాయకుడు (Zach)బుజ్జి పాత తెలుగు సినిమాలలోని ఘంటసాల పాడిన శివ భక్తిగీతాలను, శివతాండవ స్తోత్రాన్ని పాడి వినిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ సంస్థ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే సింగపూర్ గాయని గాయకులతో పాటుగా మాతృభాష తెలుగు కానీ ఒక విదేశీయుడైన బాలుడు చక్కగా తెలుగు భక్తి పాటలు నేర్చుకొని పాడడం చాలా అభినందనీయం" అని తెలియజేశారు.డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ ప్రసంగంలో మాట్లాడుతూ కార్తీకమాసంలో వచ్చే వివిధ పర్వదినాల గురించి ఆయా రోజులలో ఆచరించే పూజలు, వాటి వెనుక ఉన్న కథలు, ప్రత్యేకతలు, కారణాల గురించి సోదాహరణంగా విశ్లేషిస్తూ వివరిస్తూ, అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా, అన్ని వయసుల వారికి అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో తెలియజేశారు.సంస్థ ప్రధాన నిర్వహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభా సమన్వయం చేయగా, సుబ్బు వి పాలకుర్తి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సభలో, సింగపూర్ గాయనీగాయకులు విద్యాధరి కాపవరపు, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, శేషుకుమారి యడవల్లి, షర్మిల చిత్రాడ, స్నిగ్ధ ఆకుండి, శ్రీవాణి, చంద్రహాస్ ఆనంద్, హరి మానస శివ భక్తిగీతాలను ఆలపించారు. వానిలో త్యాగరాజ కృతులు వంటి సంప్రదాయ సంగీతం, శివపదం గీతాలు, చలనచిత్ర గీతాలు, లలిత గీతాలు కూడా ఉండడం విశేషం.కల్చరల్ టీవీ సాంకేతిక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం ఎప్పటివలే అన్నిదేశాల తెలుగు ప్రజల మన్ననలు అందుకుంది. (చదవండి: జపాన్లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు)
క్రైమ్
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
వీరబల్లి : సోమవరం పంచాయతీలోని సోమవరం వడ్డిపల్లిలో దీపిక (16) అనే మైనర్ బాలిక అనుమానాసపద స్థితిలో మంగళవారం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. దీపిక తల్లిదండ్రులు రెండు నెలల నుంచి సోమవరం వడ్డిపల్లిలో నాగేంద్ర అనే యజమాని దగ్గర ఎనుములు మేపుతూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వారు నివాసం ఉంటున్న రేకుల గదిలో అనుమానాస్పద స్థితిలో దీపిక మృతి చెందింది. బాలిక తల్లి లక్ష్మీదేవిది కోడూరు నియోజకవర్గంలోని సిద్దారెడ్డిగారిపల్లి కాగా ఈమె మొదట వివాహం చేసుకున్న భర్తను వదిలేసి వీరబల్లి మండలం, సోమవరం వడ్డిపల్లికి చెందిన నాగరాజును రెండో వివాహం చేసుకుంది. వీరు ఎనుములు మేపుకుంటూ ఉండేవారు. నెల క్రితం సొంత ఊరికి వెళ్లి మొదటి భర్త దగ్గర ఉన్న దీపికను తీసుకు లక్ష్మిదేవి వడ్డిపల్లికి వచ్చింది. ఇంతలోనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక..
నల్లగొండ, మర్రిగూడ: పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్లో జరిగింది. టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, రమణమ్మ దంపతుల కుమార్తె శ్రుతి (20) నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ.. స్థానికంగా రవీంద్రనగర్లోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటోంది. శ్రుతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా, ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంటికి వెళ్తానని హాస్టల్ వార్డెన్కు లీవ్ లెటర్ రాసి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. బాత్రూమ్లో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రుతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అనంతలో అయ్యప్ప మాలధారుడి దారుణ హత్య
బుక్కరాయసముద్రం: ఇద్దరు అయ్యప్ప మాలధారుల మధ్య ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. బుక్కరాయసముద్రం వీర భద్రకాలనీలో నివాసం ఉంటున్న జయమ్మ, ఆంజనేయులు కుమారుడు సాయి చరణ్(20) అదే కాలనీకి చెందిన ధన్రాజ్, తాడిపత్రి మండలం బుగ్గకు చెందిన సంతోష్ స్నేహితులు. చరణ్ మేజర్ కాగా, ధనరాజ్, సంతోష్ మైనర్లు. వీరంతా అనంతపురంలోని కూరగాయల మార్కెట్లో రోజువారీ కూలి పనులకు వెళ్తున్నారు. ఇటీవల ముగ్గురూ అయ్యప్ప మాలధారణ చేశారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన సంతోష్, ధనరాజ్, చరణ్ ద్విచక్రవాహనంలో రెడ్డిపల్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో సాయి చరణ్, సంతోష్ మధ్య వివాదం రేగింది. మాటామాటా పెరిగి ఇద్దరూ ఘర్షణకు దిగారు. దీంతో ధన్రాజ్ ఇరువురినీ విడిపించి సర్ది చెప్పాడు. అనంతరం సాయి చరణ్ మరోసారి బావిలోకి దిగగా, సంతోష్ చరణ్పై బండరాళ్లు వేశాడు. తీవ్రంగా గాయపడిన సాయిచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సంతోష్ బెదిరించడంతో ధనరాజ్ భయపడిపోయాడు. అనంతరం ఇరువురు ఇళ్లకు వెళ్లిపోయారు. మూడు రోజులైనా కుమారుడి ఆచూకీ కనిపించకపోవడంతో సాయిచరణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కళ్లముందే స్నేహితుడు చనిపోవడంతో తీవ్రంగా మధనపడిన ధనరాజ్ రెండురోజుల తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సాయి చరణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని వెంటబెట్టుకుని మంగళవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సాయి చరణ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు
దుబాయ్ బ్లూచిప్ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రూ.1500 కోట్ల కుంభకోణం కేసులో నటుడు సోనూసూద్ , రెజ్లర్ గ్రేట్ ఖలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇటీవల అరెస్ట్ అయిన UAEలో అతిపెద్ద పెట్టుబడి మోసానికి పాల్పడిన వ్యాపారవేత్త రవీంద్ర నాథ్ సోనిని 7 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బ్లూ చిప్ కంపెనీల ద్వారా రూ.1500 కోట్ల మెగా స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో భాగంగా నటుడు సోను సూద్ , గ్రేట్ ఖలీ ఇద్దరూ కంపెనీని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపారు. వారు బ్లూ చిప్ కంపెనీని ప్రమోషన్స్, ప్రచారం చేశారా లేదా అనేది స్టేట్మెంట్లను రికార్డ్ చేయమని కోరారు. ఇద్దరూ బ్లూ చిప్ కంపెనీని ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు అజారుద్దీన్ పేరు కూడా చర్చనీయాంశమైంది, సోనూ సూద్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రవీంద్ర సోని కంపెనీ ఈవెంట్లలో పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోను బాధితులు దుబాయ్ నుండి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు పంపారు. ఈ వీడియోలను పరిశీలించిన అనంతరం అజారుద్దీన్కు కూడా నోటీసు పంపవచ్చని పోలీసులు చెబుతున్నారు.ఏడీసీపీ నాయకత్వంలో SITపోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఈ భారీ మోసం కేసును దర్యాప్తు చేయడానికి ఒక SITని ఏర్పాటు చేశారు. ADCP అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రవీంద్ర సోనీకి సంబంధించిన ఎనిమిది క్రిప్టో ఖాతాల వివరాలను సేకరించారు. దీనిలో ప్రవాస భారతీయులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయంలో ఢిల్లీ , డెహ్రాడూన్తో సహా 22 ప్రదేశాలలో ఖాతాలను సిట్ గుర్తించింది. ఈ కేసులో SIT దుబాయ్ పోలీసులతో కూడా సంప్రదిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు, రవీంద్ర సోనిపై 17 మంది ముందుకు వచ్చారు. వీరిలో దుబాయ్లో నివసిస్తున్న ముగ్గురు బాధితులు కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్అసలేంటీ రవీంద్ర సోనీ కసుఢిల్లీలోని మాల్వియా నగర్కు చెందిన సోని కొన్నేళ్ల క్రితం దుబాయ్కు మకాం మార్చి 12 షెల్ కంపెనీలను స్థాపించాడు, వాటిలో ఒకటి ‘బ్లూ చిప్ ట్రేడింగ్’ కంపెనీ. హై-ఎండ్ ఫారెక్స్ ట్రేడింగ్ ముసుగులో, 30–40శాతం తక్షణ రాబడి హామీలతో ప్రవాస భారతీయులను ఆకర్షించాడు. భారతదేశంలోనూ, దుబాయ్లోనూ వందలాది భారతీయులను మోసాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్కాం బహుళ దేశాలకు విస్తరించి ఉందని, క్రిప్టోకరెన్సీ లాండరింగ్, హవాలా మార్గాలు ఉన్నాయని, జాతీయ భద్రతాపరమైన చిక్కులు కలిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కనీసం 400–500 మంది పెట్టుబడిదారులను ఈ కంపెనీ మోసంచేసి దాదాపు రూ. రూ. 1500 కోట్లు వసూలు చేసిందని అనుమానిస్తున్నారు. దుబాయ్లో ఒకటి, అలీఘర్, కాన్పూర్ నగర్, ఢిల్లీ,పానిపట్లలో ఒక్కొక్కటి సహా అతనిపై ఐదు ఎఫ్ఐఆర్లు ఇప్పటికే నమోదయ్యాయి.ఈ స్కాం ఎలా బయట పడిందిబ్లూచిప్, 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్లపై పెట్టుబడిపై నెలకు 3 శాతం - లేదా సంవత్సరానికి 36 శాతం - "గ్యారంటీ" రాబడిని ప్రకటించాడు. మొదటి కొన్ని సంవత్సరాలుగా, క్రమం తప్పకుండా రిటర్న్లను చెల్లించి అందర్నీ నమ్మించాడు. అకస్మాత్తుగా నిధులను వ్యక్తిగత ఖాతాలు, క్రిప్టోకరెన్సీలు మరియు ఆఫ్షోర్ ఛానెల్లలోకి మళ్లించేవాడని ఆరోపించారు. అయితే ఈ కంపెనీ 2024లో దివాలా తీసింది. దీంతో వందలాది ఎన్ఆర్ఐలు భారీ ఎత్తున నష్టపోయారు. దీనిపై జనవరి 5న ఢిల్లీ నివాసి అబ్దుల్ కరీం తనపై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 30న, డెహ్రాడూన్లో కాన్పూర్ పోలీసులు సోనిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ నగర్లోని లా & ఆర్డర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ సమాచారం ప్రకారం వారు ఆర్డర్ చేసిన ఫుడ్ చిరునామా ఆధారంగా సోని బస చేసిన రహస్య ప్రదేశాన్ని గుర్తించారు.
వీడియోలు
KTR: ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది
IndiGo Flight Crisis: ఇండిగోకు DGCA బిగ్ షాక్.. విమానాల సంఖ్య తగ్గింపు
Tipparamalli Jamalapurnamma: వైఎస్ జగన్ లేటెస్ట్ విజువల్స్
Kodali Nani Speech: జగన్ను మళ్ళీ సీఎం చేసేందుకు.. రంగంలోకి కొడాలి నాని
ఇది ఆరంభం మాత్రమే..! చంద్రబాబుకి పెద్దిరెడ్డి వార్నింగ్
Minor Girl: సికింద్రాబాద్ లో దారుణం 13 ఏళ్ల బాలికపై..!
భారత బియ్యంపై సుంకాలకు సిద్ధమవుతున్న ట్రంప్
Gudivada Amarnath: చంద్రబాబు, లోకేష్ ని చూస్తూ.. ఆనందించడమే పవన్ పని!
MLA Sundarapu: రికార్డింగ్ డాన్స్ లపై నిషేధం అంటూనే.. మరోవైపు యథేచ్ఛగా రికార్డింగ్ డాన్స్
రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం

