రేవంత్కు పాత వాసనలు పోనట్టుంది!
ఈనాడు గ్రూపు అధినేత, దివంగత రామోజీరావు ఎన్నడూ ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో చెప్పినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ చెప్పిన ఈ మాటలను ఉమ్మడి ఏపీ రాజకీయాలను, విభజిత ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను గమనించిన వారెవ్వరూ నమ్మరనే చెప్పాలి.రేవంత్తోపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రామోజీ గుణగణాలను కీర్తిస్తూ ప్రజల పక్షాన నిలిచిన యోధుడు అని పేర్కొన్నారు. ఇలాంటి ఫంక్షన్స్లో ప్రశంసలు సహజం. కాని అవి అతిశయోక్తులుగా మారినప్పుడు, నమ్మదగినవిగా లేనప్పుడు, వాస్తవాలకు దూరంగా ఉన్నప్పుడే చర్చనీయాంశం అవుతాయి. 2009 శాసనసభ ఎన్నికల ఫలితాలు రావడానికి నెల రోజుల ముందు టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కూటమి గెలుస్తుందన్న అంచనాతో, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారన్న నమ్మకంతో ఆ రోజుల్లో టీడీపీలో ఉన్న రేవంత్, మరో ముగ్గురు నేతలు రామోజీని కలిశారట.ఆ సందర్భంలో వీరు ప్రస్తావన చేయడానికి ముందే తానెప్పుడూ ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుకు చెప్పలేదని రామోజీ అన్నారట. మంత్రులుగా కన్నా ఎమ్మెల్యేలుగానే రాణిస్తారని తన దగ్గరకు వచ్చేవారికి సూచిస్తానని ఆయన చెప్పారని రేవంత్ వివరించారు. నిజానికి ఈ అంశంపై రేవంత్ కు క్లారిటీ ఉండదని అనుకోనవసరం లేదు. రామోజీ ఇలాంటివి ప్రోత్సహించరని రేవంత్, ఇతర టీడీపీ నేతలు భావించి ఉంటే అసలు ఆయనను కలిసేవారు కాదు కదా! రామోజీ ఏమి చెబితే అది చంద్రబాబు వింటారన్న అభిప్రాయమో, నమ్మకమో లేకుండా వీరు వెళతారా? రామోజీ మీడియా రంగ ప్రవేశం, ఆ తర్వాత రాజకీయాలను ప్రభావితం చేసిన తీరు పరిశీలనార్హమే. ఆయన తెలివిగా వ్యాపారాన్ని,రాజకీయాలను కలగలిపి తనకు అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు.1970లలో ఈనాడు మీడియా ఎదుగుదలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సహకారం తీసుకున్న విషయం వయసులో చిన్నవాడైన రేవంత్కు తెలియకపోవచ్చు. 1982లో ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో రామోజీ ఆ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీకి మద్దతు ఇస్తూ అది చారిత్రక అవసరమని తన జర్నలిస్టులకు ఉద్బోధించారు. తెలుగుదేశం పార్టీ తన మీడియావల్లే అధికారంలోకి వచ్చిందన్న భావనను కల్పించగలిగారు. కానీ ఎన్టీరామారావుకు ఎన్.టి.రామారావుకు, ఆ పార్టీలో పలువురికి ఇది అంతగా నచ్చలేదు. ఎన్టీఆర్ బొమ్మలను తన పత్రికలో ముద్రిస్తూ రామోజీ సర్కులేషన్ పెంచుకున్నారన్నది వారి భావన. ఒక సందర్భంలో ఈ విషయమై ఎన్టీఆర్ వద్ద చర్చ కూడా జరిగింది.1983 శాసనసభ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల ఎంపికలో ఈనాడు సిబ్బంది గణనీయ పాత్ర పోషించింది. నియోజకవర్గాలలో టీడీపీ టిక్కెట్ కోరుకుంటున్న అభ్యర్ధులపై సర్వేలు నిర్వహించి ఎన్టీఆర్కు తమ సిఫారసులను అందించేవారు. ఒక మీడియా సంస్థ ఇలా రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పనిచేయడం కరెక్టేనా? ఎమ్మెల్యే అభ్యర్ధులనే నిర్ణయించినవారు మంత్రి పదవులను కనీసం కొందరికైనా చెప్పి ఉండరంటే నమ్మగలమా? టీడీపీ పక్షాన పనిచేస్తే ప్రజల పక్షాన పనిచేసినట్లు అవుతుందేమో చంద్రబాబే వివరించాలి. అప్పట్లో వామపక్షాలు, జనత, లోక్దళ్ వంటి పార్టీలు కూటమిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవి. సరిగ్గా ఆ టైమ్లో ఎన్టీఆర్ రంగ ప్రవేశంతో రాజకీయం మారిపోయింది. దాంతో టీడీపీ, వామపక్షాల మధ్య పొత్తు ప్రయత్నాలు జరిగాయి. ఆ చర్చలు కూడా రామోజీ నివాసంలో జరిగాయని చెబుతారు. టీడీపీ గెలిచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అప్పడప్పుడూ రామోజీని నివాసంలో కలుస్తుండేవారు. టీడీపీ విజయం సాధించడం, కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయిన ఎన్.టి.ఆర్. అల్లుడు చంద్రబాబు నాయుడు టీడీపీలోకి వచ్చేశారు. అప్పట్లో చంద్రబాబుపై కూడా ఈనాడు మీడియాలో కొంత వ్యతిరేక కథనాలు వచ్చేవి. కార్టూన్లు కూడా వేసేవారు, కాని తదుపరి కాలంలో ఎన్టీఆర్కు రామోజీకి మధ్య సంబంధాలు దెబ్బతినడం మొదలైంది. ఒక భవన నిర్మాణ అనుమతి విషయంలో వీరిద్దరికి తేడా వచ్చిందని ఆ రోజుల్లో ప్రచారం జరిగింది. అలాగే రామోజీ తాను చెప్పినట్లు జరగాలని ఆశించేవారట. దానికి ఎన్టీఆర్ అంగీకరించలేదని అంటారు. ఈ లోగా చంద్రబాబు వ్యూహాత్మకంగా రామోజీని కలిసి తనపై వ్యతిరేకత లేకుండా చేసుకోగలిగారు. కారణం ఏమైనా కాని 1989 ఎన్నికల సమయంలో ఈనాడు టీడీపీకి అనుకూలంగా లైన్ తీసుకోలేదని చెప్పాలి. ఆ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు సీఎంలు రామోజీతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి యత్నించకపోలేదు. కొన్నిసార్లు వారికి అనుకూలంగా వ్యహరించే వారు. అందులో తన వ్యాపార ప్రయోజనాలను కూడా చూసుకునేవారు. అంతేకాక కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల్లోని కొందరు నాయకులను ఆకట్టుకుని వారితో సంబంధాలు నెరపేవారు. అంతేకాదు.కొందరు ఐఏఎస్ అధికారులకు కూడా ప్రత్యేక విందులు ఇచ్చేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు మరికొందరు టీడీపీ నేతలు తరచు రామోజీని సంప్రదించేవారు. మీడియా రంగంలో ఒక మెరుపులా వచ్చిన ఉదయం దినపత్రికను ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సరిగా నడపలేక కాంగ్రెస్ ఎంపీ, మద్యం వ్యాపారి మాగుంట సుబ్బరామిరెడ్డికి బదలాయించారు. సరిగ్గా ఆ తరుణంలోనే నెల్లూరు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమానికి రామోజీ మద్దతు ఇచ్చారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమాగమంలో వివిధ రాజకీయ పక్షాల నేతలను ఆహ్వానించి ఒక కార్యక్రమం పెట్టారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్, ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, విపక్ష నేత ఎన్టీఆర్ తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ స్పీచ్ విన్న తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి నచ్చక విజయభాస్కరరెడ్డి సభ నుంచి నిష్క్రమించారు. ఈనాడు మీడియాలో నిత్యం కొన్ని పేజీలు కేటాయించి సారా వ్యతిరేక ఉద్యమ వార్తలు ఇస్తుండే వారు. ఆ క్రమంలో కోట్ల ప్రభుత్వం సారాను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఈనాడు మీడియా ప్రచారం ఆగుతుందని ఆయన భావించారు. కాని రామోజీ ఆపలేదు. సంపూర్ణ మద్య నిషేధం చేయాలన్న డిమాండ్తో వార్తలు ఇచ్చేవారు. పలు చోట్ల కృత్రిమ ఆందోళనలు సృష్టించి ఆ వార్తలను కూడా ఇస్తుండేవారు. దీనిపై కోట్లకు అసంతృప్తి ఉండేది. తాను రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటుకు సహకరించి, కీలకమైన భూమి సుమారు పదెకరాలు కేటాయించానని అయినా రామోజీ ద్రోహ చింతనతో వ్యహరించారని కోట్ల వాపోయేవారు. ఇదంతా మాగుంటను దృష్టిలో పెట్టుకునే చేశారని చాలా మంది నమ్ముతారు. అప్పటికే మాగుంట మద్యం వ్యాపారంలో ఉండడంతో, ఆ డబ్బుతో పత్రికను సక్సెస్ చేస్తే తనకు నష్టం అని ఆయన భావించే ఇలా సంపూర్ణ మద్య నిషేధం నినాదం ఎత్తుకున్నారన్నది పలువురి భావన. ఇంతలో ఎన్టీఆర్ ఇదే నినాదంతో జనంలోకి వెళ్లారు.1994లో అన్ని కలిసి వచ్చి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఒక దశలో రామోజీరావు సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశారు. దాని అనుపానుల మీద అభిప్రాయ సేకరణ కూడా చేశారు. కాని ఎందువల్లో ముందుకు తీసుకువెళ్లలేదు. 1994లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ వస్తుందని రామోజీ ఊహించలేదు. కొన్నిసీట్లు తక్కువ వస్తే ప్రత్యామ్నాయంగా రాజకీయం ఎలా చేయాలన్న దానిపై చంద్రబాబు వంటివారితో చర్చలు జరిగాయని కూడా ఆరోజుల్లో వినిపించేది. కాని అనూహ్య స్థాయిలో ఎన్టీఆర్ గెలిచారు. రామోజీతో తిరిగి ఎన్టీఆర్కు సత్సంబందాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కూడా కొన్నిసార్లు చొరవ తీసుకున్నారు. అవన్ని పెద్దగా ఫలించలేదు. ఈలోగా ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిలపై ఈనాడులో దారుణమైన కార్టూన్లు వేయించడం, సంపాదకీయాలు రాయడం వంటివి జరిగాయి. తదుపరి టీడీపీలో జరిగిన పరిణామాలలో చంద్రబాబు కొమ్ముకాశారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ను పదవిచ్యుతుడిని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడంలో రామోజీ ముఖ్య భూమిక పోషించారు. చంద్రబాబు సీఎం అయ్యాక రామోజీ ఏమి అనుకుంటే అది జరిగేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం చంద్రబాబు ప్రతి వారం రామోజీ ఇంటికి వెళ్లేవారు. ఇద్దరూ ప్రభుత్వ పార్టీ విషయాలను మాట్లాడుకునేవారు. అప్పుడే ఈయనకు రాజగురు అన్న పేరు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మంత్రుల పేర్లు సిఫారస్ చేశారా ? లేదా? అన్నది చర్చకాదు. స్వతంత్రంగా ఉండవలసిన మీడియాను ఒక పార్టీకి అనుబంధంగా మార్చడం సరైనదేనా? అంశాల మీద రాయడం వేరు. స్వతంత్ర మీడియా ముసుగులో ఒక పార్టీ కొమ్ము కాయడం వేరు. చంద్రబాబు నాయుడు కేబినెట్లో రామోజీ ఎవరిని సిఫారస్ చేయలేదన్నది మాత్రం అసత్యం. గుంటూరు జిల్లా టీడీపీ నేతకు మంత్రి పదవి రావడంలో, 2014 తర్వాత మరో ముఖ్యమైన పదవి రావడంలో రామోజీ పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. చంద్రబాబు మద్య నిషేధం ఎత్తి వేసినా ఒక సంపాదకీయం రాసేసి సరిపెట్టుకోవడంలో ఆయనకు ఉన్న హోటళ్లు, రామోజీ ఫిలిం సిటీ వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు. రింగ్ రోడ్డులో తన భూమి కొంత కోల్పోవలసి వస్తోందన్న కోపంతో వైఎస్సార్పై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తారు. ఒక సందర్భంలో ‘‘ఉల్టాచోర్, కొత్వాల్ కో డాంటే’’ అంటూ ఒక సంపాదకీయం రాశారు. ఆ సమయంలోనే రామోజీ మార్గదర్శి ఫైనాన్స్లో చట్టవిరుద్దంగా సాగుతున్న డిపాజిట్ల సేకరణ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వెలుగులోకి తెచ్చారు. దానిపై వైఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి వైఎస్ కుటుంబంపై రామోజీ పగపట్టినట్లు వ్యవహరిస్తూ వచ్చారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్పై కూడా అదే ద్వేషంతో విష ప్రచారం చేస్తూ వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయినా, విపక్షంలో ఉన్నా ఇదే పద్దతి అనుసరిస్తుంటుంది. చంద్రబాబు ఏమి చేసినా సమర్థిస్తూ టీడీపీని భుజాన వేసుకుని ఈనాడు మీడియా పనిచేస్తోంది. ఆ రోజుల్లో టీడీపీలో రామోజీని రాజగురు అని కూడా సంబోధించే వారు .ఈనాడు మీడియాకు చంద్రబాబు విధేయుడుగా ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం తన పాత వాసనలు మరవలేకపోతున్నారేమో అనిపిస్తుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
'భారత్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది'
''టీమిండియాను సొంతగడ్డపై ఓడించలేరని ఒకప్పుడు అంటుండేవారు. కానీ ఇప్పుడు ఏ జట్టు అయినా భారత్లో భారత్ను ఓడించగలదు'' అంటూ ఇండియా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోరాట పటిమ లేకుండా ప్రత్యర్థికి దాసోహమవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా సొంతగడ్డపై టీమిండియా భారీ ఓటమి అభిమానులను మరింత కుంగదీసింది.అన్ని విభాగాల్లో పైచేయి సాధించి టీమిండియాను సొంత గడ్డపై ఓడించిన దక్షిణాఫ్రికాపై క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాతికేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవడమే కాకుండా, వైట్వాష్ చేయడంతో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ విజయానికి సఫారీలు అన్నివిధాలా అర్హులని కితాబిస్తున్నారు. ఇక, భారత్ ఘోర వైఫల్యానికి హెచ్కోచ్ గౌతమ్ గంభీర్ ప్రధాన కారకుడని టీమిండియా ఫ్యాన్స్ నిందిస్తున్నారు. భారత టెస్టు క్రికెట్ను నాశనం చేశాడని ఫైర్ అవుతున్నారు.నెటిజనుల మండిపాటుటీమిండియా (Team India) ఓటమిపై సోషల్ మీడియాలో నెటిజనులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గువాహటిలో ఇండియన్ టెస్టు క్రికెట్ ఈరోజు చనిపోయిందంటూ ఘాటు కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు సొంత గడ్డపై భారత జట్టుతో క్రికెట్ ఆడటానికి ప్రత్యర్థి జట్లు భయపడేవని, కానీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారు అయ్యాయని వాపోతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా, అశ్విన్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పుడు టీమిండియాకు సొంతగడ్డపై ఓటమి అనేది ఊహల్లోకి కూడా వచ్చేది కాదని పేర్కొంటున్నారు. చదవండి: అందుకే ఓడిపోయాం.. ఓటమి నిరాశపరిచిందన్న పంత్సొంత గడ్డపై టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో నెటిజనులు మీమ్స్, సైటర్లతో విరుచుకుపడుతున్నారు. వీడియోలు, కామెంట్లతో పాటు గణాంకాలను జత చేసి టీమిండియా ఓటమిపై బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా ఓడిపోతారా అన్నట్టుగా ఆవేదన వెలిబుచ్చుతున్నారు. #INDvSA India in India pic.twitter.com/6PG6ylLI4a— ARMSB 🇮🇳 (@armsb_in) November 26, 2025They came,They saw,And Destroyed Indian Test Team 😆Once upon a time, India was undefeated on their home soil, but now any team can beat India in India 🤪- Who is responsible for India's Decline ?#IndianCricket pic.twitter.com/U2LfPOYsR9— Ankit Sharma (@AnkitsharmaINC) November 26, 2025With these four players in the team, no one could have even imagined defeating India in India. 🔥 pic.twitter.com/M19zalfUuS— Rajat (@RajatMemes_) November 26, 2025Lord Bavuma, 1st Proteas captain to whitewash India in India 🥳🥳🥳🥳🥳 #INDvSA #IndianCricket pic.twitter.com/XsluVHhDCO— Noko (@TruthOrPeace_) November 26, 2025Tamba Bavuma became 1st South Africa captain to win a test series in India in 25 years . Defeating India in IndiaUndefeated in the test as a captain.#INDvsSA #GautamGambhir#SAvsIND #IndianCricket pic.twitter.com/F3Uh8YRW9z— Innocent Indian (@InnocentIndiann) November 26, 2025Highest target Set by Team against India in India in Test549 - 🇿🇦 at Guwahati,2025*543 - 🇦🇺 at Nagpur,2004467 - 🇿🇦 at Eden Gardens,1996457 - 🇦🇺 at Bengaluru,2004452 - 🏴 at Chennai,1934447 - 🏝️ at Chennai,1959444 - 🏝️ at Kanpur,1958441 - 🇦🇺 at Pune,2017#INDvSA pic.twitter.com/dhbg0BuLXn— CricBeat (@Cric_beat) November 25, 2025History Created In Gautam Gambhir Era.India In India : pic.twitter.com/hiGcgHmqS1— Mr.CricGuy 🏏 (@mrcricguy) November 26, 2025
ఇంతకన్నా అవమానం ఉంటుందా?: నిర్మాత ఎమోషనల్
ఒక్క షో ఆడదన్నారు.. ఈరోజు జనం మా సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు దర్శకనిర్మాత వేణు ఊడుగుల. ఈయన రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai Movie). అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. మంగళవారం నాడు సినిమా సక్సెస్ మీట్ జరగ్గా ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణుతో పాటు దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్, బివిఎస్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దొంగల్లా పరిగెట్టారుఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. సినిమాను కొంతమందికి చూపించాం. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లాంటి పెద్దమనిషిని పిలిచాం. వాళ్లతోపాటు ఓ ఐదుగురు చెప్పా పెట్టకుండా వచ్చారు. వారిని మేము పిలవనేలేదు. ఇంటర్వెల్ అవగానే సడన్గా లేచి వెళ్లిపోయారు. దొంగల్లాగా పరిగెడుతున్నారు. వాళ్లు నాక్కూడా పరిచయం ఉన్నవాళ్లే! థియేటర్లో అంతమంది ఎదుట అలా వెళ్లిపోతుంటే వారి మూడ్ చెడిపోదా? ఒక ఫిలింమేకర్కు ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా అవమానం ఇంకేదైనా ఉంటుందా? అదసలు మర్యాదగా ఉందా?గుండెల్లో పెట్టుకున్నారుమావాళ్లేమన్నారంటే.. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, పోనివ్వండి అన్నారు. వెళ్లిపోయాక రెండుమూడు రోజులు నెగెటివ్ ప్రచారం చేశారు. వాడు డైరెక్టరే కాదు, సినిమా తీయడమే రాలేదు. అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు. కానీ, ఈరోజు జనాలు సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు. సినిమా హిట్టయిందన్న బలుపుతో ఇదంతా చెప్పడం లేదు. సినిమాకు కనీస మర్యాద ఇవ్వాలని చెప్తున్నాను అంతే! ఎవరు ప్రివ్యూకి పిలిచినా వెళ్లండి, కానీ మధ్యలో వచ్చేయకండి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
YS Jagan: చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతోంది
వైఎస్సార్ కడపలో కొనసాగుతోన్న వైఎస్ జగన్ రెండోరోజు పర్యటనపర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో వివాహ కార్యక్రమానికి హాజరుఅనంతరం బ్రాహ్మణపల్లె అరటి తోటల పరిశీలన, రైతులతో మాట్లాడటంపులివెందులలో లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శవేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాస సందర్శనసాయంత్రం 7 గంటల వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్రాత్రి పులివెందులలోనే బసగురువారం ఉదయం 8 గంటలకు తిరుగు ప్రయాణం
టాప్ 5లో ఉండేది వీళ్లే.. ఆ కంటెస్టెంట్స్కు ఛాన్సే లేదు!
సమయం ఆసన్నమైంది మిత్రమా..
'భారత్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది'
S.I.Rను ఆపలేం, కానీ..: సుప్రీం కోర్టు
పక్కా ప్లానింగ్..! ఇయర్ ఎండ్ వేడుకలకు ట్రావెల్స్ సందడి..
రేవంత్కు పాత వాసనలు పోనట్టుంది!
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్
హైదరాబాద్లో నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
అందుకే ఓడిపోయాం.. ఓటమి కాస్త నిరాశపరిచింది: పంత్
ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్': అమిత్ షా
చలిలో వెచ్చని టీ తాగుతున్న స్టార్ హీరోలు (ఫోటోలు)
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
ఈ రాశివారికి కొత్త అవకాశాలు, సంఘంలో గౌరవమర్యాదలు
బంగారం ధరలు: ‘కొత్త’ మార్క్ తప్పదా?
ముందు మనం రైతులకు ఏం చేశామో చెప్పమంటున్నారు ‘సార్’!
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
రైతన్న కోసం ఎంతో చేశానని అలా శూన్యంలోకి చూపిస్తున్నాడేంటీ!!
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
ఈ రాశివారు ఊహలు నిజం చేసుకుంటారు, ఆస్తిలాభం
కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన
డోంట్ వర్రీ సార్! అవి మీ దగ్గరకు రావడానికి భయపడతాయ్లేండి!!
శాంతంగా ఉన్న సింహాన్ని గెలికితే ఏమవుతుందో చూడండి
...మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేదు!!
మనకు అమరావతి కంటే వైజాగ్ బాగా గిట్టుబాటు అయ్యేలా ఉంది!
బెస్ట్ హారర్ సినిమా.. ఎట్టకేలకు తెలుగులో స్ట్రీమింగ్
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
మంటకలిసిపోతున్న బంధుత్వాలు
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు
ఇమ్మడి రవి ఒక్కడే ఐబొమ్మతో..
టాప్ 5లో ఉండేది వీళ్లే.. ఆ కంటెస్టెంట్స్కు ఛాన్సే లేదు!
సమయం ఆసన్నమైంది మిత్రమా..
'భారత్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది'
S.I.Rను ఆపలేం, కానీ..: సుప్రీం కోర్టు
పక్కా ప్లానింగ్..! ఇయర్ ఎండ్ వేడుకలకు ట్రావెల్స్ సందడి..
రేవంత్కు పాత వాసనలు పోనట్టుంది!
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్
హైదరాబాద్లో నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
అందుకే ఓడిపోయాం.. ఓటమి కాస్త నిరాశపరిచింది: పంత్
ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్': అమిత్ షా
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
ఈ రాశివారికి కొత్త అవకాశాలు, సంఘంలో గౌరవమర్యాదలు
బంగారం ధరలు: ‘కొత్త’ మార్క్ తప్పదా?
ముందు మనం రైతులకు ఏం చేశామో చెప్పమంటున్నారు ‘సార్’!
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
రైతన్న కోసం ఎంతో చేశానని అలా శూన్యంలోకి చూపిస్తున్నాడేంటీ!!
ఈ రాశివారు ఊహలు నిజం చేసుకుంటారు, ఆస్తిలాభం
కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన
డోంట్ వర్రీ సార్! అవి మీ దగ్గరకు రావడానికి భయపడతాయ్లేండి!!
మనకు అమరావతి కంటే వైజాగ్ బాగా గిట్టుబాటు అయ్యేలా ఉంది!
...మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేదు!!
బెస్ట్ హారర్ సినిమా.. ఎట్టకేలకు తెలుగులో స్ట్రీమింగ్
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
మంటకలిసిపోతున్న బంధుత్వాలు
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు
ఇమ్మడి రవి ఒక్కడే ఐబొమ్మతో..
ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది
మరీ ఇంత అజ్ఞాత విరాళాలు ఇస్తుంటే అనుమానాలెందుకు రావ్ సర్!
ఫొటోలు
బ్రాహ్మణపల్లి అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
పులివెందులలో వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన (ఫొటోలు)
‘16 రోజుల పండుగ’ సినిమా ఓపెనింగ్.. కీలక పాత్రలో రేణు దేశాయ్ (ఫొటోలు)
హీరోయిన్ రాశి సింగ్ అందాలు... శారీ ఫోటోషూట్ చూశారా? (ఫొటోలు)
దటీజ్ వైఎస్ జగన్ (ఫొటోలు)
పులివెందులలో జనసందోహం నడుమ వైఎస్ జగన్ (చిత్రాలు)
తిరుచానూరు : పంచమి తీర్థం..పులకించిన జనం (ఫొటోలు)
ఆత్మీయుడి కొడుకు పెళ్లి వేడుకలో మెరిసిన అంబానీ కుటుంబం (ఫొటోలు)
మరింత గ్లామరస్గా అనసూయ లేటేస్ట్ లుక్ (ఫొటోలు)
23 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న బుల్లితెర జంట (ఫొటోలు)
సినిమా
ప్రభాస్ 'రాజాసాబ్'లో ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ నటి మాత్రం.. హీరోయిన్ అవకాశం ఇవ్వడం కోసం ఫోన్ చేస్తే ప్రాంక్ అనుకుంది. తర్వాత ఎంక్వైరీ చేసి నమ్మకం తెచ్చుకుంది. ఈ మొత్తం విషయాన్ని స్వయంగానే సదరు నటి బయటపెట్టింది. ఆ మూవీ 'రాజాసాబ్' కాగా.. నటి పేరు రిద్ధి కుమార్. ఇంతకీ అసలేం జరిగింది?మహారాష్ట్రకు చెందిన రిద్ధి కుమార్.. 'లవర్' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. 2018లో వచ్చిన ఈ మూవీలో రాజ్ తరుణ్ హీరో. దీని తర్వాత మలయాళ, మరాఠీ భాషల్లో తలో మూవీ చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. 2022లో వచ్చిన 'రాధేశ్యామ్'లో అతిథి పాత్రలో కనిపించింది. అనంతరం హిందీలో ఒకటి రెండు మూవీస్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా రిద్ధి చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)''రాజాసాబ్' చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్కేన్.. నాకు ఓసారి కాల్ చేశారు. మేం ప్రభాస్తో ఓ సినిమా చేస్తున్నాం. నిన్ను హీరోయిన్గా అనుకుంటున్నాం అని చెప్పారు. మొదట ఇదంతా నేను నమ్మలేదు. ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నా. మా మేనేజర్ని ఫోన్ చేసి కనుక్కుంటే నిజమని క్లారిటీ వచ్చింది. తర్వాత లుక్ టెస్ట్, ఆడిషన్ చేసి నన్ను తీసుకున్నారు' అని రిద్ధి కుమార్.. 'రాజాసాబ్'లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది.ప్రభాస్ నటించిన ఈ ఫాంటసీ కామెడీ మూవీకి మారుతి దర్శకత్వం వహించారు. రిద్ధి కుమార్తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా వేశారు. జనవరి 9న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్గా తొలి పాట రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్తో పాటు రిద్ధి కుమార్ కనిపించింది.(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాత ఎమోషనల్)Riddhi - Her being Part of #TheRajaSaab: 😂❤️🔥Got Call from SKN garu: “We’re making Film with #Prabhas, we want you as Heroine.” Thought it was a prank! Called my manager to verify. They asked “Do you know Prabhas?” I said “Yes of course!” Gave look test, auditioned & Here I'm. pic.twitter.com/Latj2XAXbI— Prabhas (@HereForDarling) November 25, 2025
ఇంతకన్నా అవమానం ఉంటుందా?: నిర్మాత ఎమోషనల్
ఒక్క షో ఆడదన్నారు.. ఈరోజు జనం మా సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు దర్శకనిర్మాత వేణు ఊడుగుల. ఈయన రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai Movie). అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. మంగళవారం నాడు సినిమా సక్సెస్ మీట్ జరగ్గా ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణుతో పాటు దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్, బివిఎస్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దొంగల్లా పరిగెట్టారుఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. సినిమాను కొంతమందికి చూపించాం. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లాంటి పెద్దమనిషిని పిలిచాం. వాళ్లతోపాటు ఓ ఐదుగురు చెప్పా పెట్టకుండా వచ్చారు. వారిని మేము పిలవనేలేదు. ఇంటర్వెల్ అవగానే సడన్గా లేచి వెళ్లిపోయారు. దొంగల్లాగా పరిగెడుతున్నారు. వాళ్లు నాక్కూడా పరిచయం ఉన్నవాళ్లే! థియేటర్లో అంతమంది ఎదుట అలా వెళ్లిపోతుంటే వారి మూడ్ చెడిపోదా? ఒక ఫిలింమేకర్కు ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా అవమానం ఇంకేదైనా ఉంటుందా? అదసలు మర్యాదగా ఉందా?గుండెల్లో పెట్టుకున్నారుమావాళ్లేమన్నారంటే.. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, పోనివ్వండి అన్నారు. వెళ్లిపోయాక రెండుమూడు రోజులు నెగెటివ్ ప్రచారం చేశారు. వాడు డైరెక్టరే కాదు, సినిమా తీయడమే రాలేదు. అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు. కానీ, ఈరోజు జనాలు సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు. సినిమా హిట్టయిందన్న బలుపుతో ఇదంతా చెప్పడం లేదు. సినిమాకు కనీస మర్యాద ఇవ్వాలని చెప్తున్నాను అంతే! ఎవరు ప్రివ్యూకి పిలిచినా వెళ్లండి, కానీ మధ్యలో వచ్చేయకండి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా
రీసెంట్ టైంలో ప్రేమకథలతో సినిమాలు తీస్తున్నప్పటికీ బోల్డ్, రొమాంటిక్ కాన్సెప్ట్లు ఎక్కువగా తీస్తున్నారు. అలా ఈ నెల ప్రారంభంలో వచ్చిన మూవీ 'ప్రేమిస్తున్నా'. పలు హిట్ సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ప్రీతీ నేహా అనే అమ్మాయి హీరోయిన్గా చేసింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: నీ ప్రేమ మళ్లీ కావాలి బాపూ.. తెలుగు దర్శకుడి ఇంట్లో విషాదం) సాత్విక్, ప్రీతీ నేహా జంటగా నటించిన ఈ రొమాంటిక్ బోల్డ్ సినిమాకు భాను దర్శకత్వం వహించారు. నవంబరు 7న థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ పరంగా బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ స్టార్స్ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు వారాల్లోనే అంటే ఈ శుక్రవారం (నవంబరు 28) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ బోల్డ్ లవ్ స్టోరీ సినిమాలంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి.'ప్రేమిస్తున్నా' విషయానికొస్తే.. రైల్వేలో చిన్న ఉద్యోగం చేసే శారద, తన కొడుకుని (సాత్విక్ వర్మ) అల్లారుముద్దుగా పెంచుతుంది. బదిలీపై ఘట్కేసర్లోని రైల్వే కాలనీకి శారద కుటుంబం షిఫ్ట్ అవుతుంది. అదే కాలనీకి చెందిన అమ్మాయి (ప్రీతీ నేహా) వీళ్లకు సాయం చేయడానికి వస్తుంది. ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడిన సాత్విక్.. 'నీతో రొమాన్స్ చేయాలని ఉంది' అని తొలి పరిచయంలోనే అడిగేస్తాడు. అమ్మాయి దీన్ని సిల్లీగా తీసుకుంటుంది. సాత్విక్ మాత్రం టైమ్ టేబుల్ వేసుకొని మరీ, ఆమెని ఫాలో అవుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో సాత్విక్తో అమ్మాయి రొమాన్స్కి ఒప్పుకొంటుంది. కానీ కండీషన్ పెడుతుంది. ఆ కండీషన్ ఏంటి? ప్రాణంగా ప్రేమించిన వాడిని ప్రీతీ ఎందుకు దూరం పెట్టింది? అమ్మాయి కోసం అతడు పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'మాస్ జాతర'తో పాటు ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)
నీ ప్రేమ మళ్లీ కావాలి బాపూ.. దర్శకుడు భావోద్వేగం
తెలుగు దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కిష్టయ్య (73) మరణించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. కిష్టయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తండ్రి మరణవార్తను సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులుబాపును తల్చుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. బాపు.. నువ్ లేకుండానే తెల్లారింది. నువ్ లేకుండానే ఓదెల లేచింది.. నువ్ లేకుండానే ఇల్లూ లేచింది. కల్లాపితో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిచింది.. “ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు.. “ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు. ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులు విని నీ గుండె మళ్లీ కదిలితే ఎంత బావుండు! చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10km ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది. భుజంపై ఎత్తుకెళ్లావ్గంగుల కనకయ్య చుక్కల థియేటర్ లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నిన్నే కదా అనిపిస్తోంది. నువ్ నేర్పిన ఎడ్ల బండి నడక.. మనం దున్నిన జంబు అరక.. పత్తి మందుకు పంపు.. పల్లి చేను లో సద్ది.. మిరప నారుతో నాటు.. బురద పొలం లో జలగల తో పాట్లు.. ఇక అన్నీ జ్ఞాపకాలేనా? దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు.. మేమొచ్చామని బగార, నీర కల్లు ఏర్పాట్లు.. ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా? నీ ప్రేమ నాకు మళ్లీ కావాలిఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్ లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి.. నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్ళకీ పిల్లలున్నారు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో.. కానీ మళ్లీ రా.. అంటూ ఎమోషనలయ్యాడు. సంపత్ నంది విషయానికి వస్తే ఏమైంది ఈవేళతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ సినిమాలకు తెరకెక్కించాడు. ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2, బ్లాక్ రోజ్ చిత్రాలకు కథ అందించాడు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా 'భోగి' సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Sampath Nandi (@isampathnandi)
క్రీడలు
ధనాధన్ ధమాకా
హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం మొత్తం కన్నేసే ఐపీఎల్లో ఫ్రాంచైజీల కంట... వేలం పంట పండించుకునేందుకు యువ ఆటగాళ్లకు చక్కని అవకాశమిది. నేటి నుంచి జరిగే దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుపులు మెరిపించేందుకు భారత కుర్రాళ్లు సై అంటున్నారు. కుర్రాళ్లతో పోటీ పడేందుకు, తిరిగి టీమిండియా తరఫున పునరాగమనం చేసేందుకు భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా సన్నద్ధమవుతున్నాడు. ఇతనొక్కడే కాదు... మరో 74 రోజుల్లోనే ఐసీసీ టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, సంజూ సామ్సన్, శార్దుల్ ఠాకూర్లతో పాటు తెరమరుగైన పృథ్వీ షా కూడా ముస్తాక్ అలీ టోర్నీ బరిలోకి దిగుతున్నాడు. బరోడా బలం పాండ్యా హార్దిక్ పాండ్యా ఆసియా కప్ సందర్భంగా కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో టైటిల్ గెలిచిన సూర్యకుమార్ జట్టులో లేడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న ఈ ఆల్రౌండర్ ఫామ్పై ఎవరికి ఏ అనుమానాలు లేకపోయినా... భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమివ్వబోయే టి20 మెగా ఈవెంట్కు మధ్యలో ఉన్నది ఒకే ఒక్క టి20 సిరీస్ దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 9న మొదలవుతుంది. దీంతో ఫిట్నెస్ నిరూపించుకునేందుకు హార్దిక్కు ఈ టోర్నీ కీలకంగా మారింది. అతనింకా బరోడా జట్టుతో చేరకపోయినప్పటికీ ఎక్కువ మ్యాచ్లు ఆడేందుకు సిద్ధంగానే ఉన్నట్లు కోచ్ ముకుంద్ పర్మార్ వెల్లడించారు. ముంబై తరఫున సూర్యకుమార్ గ్రూప్ దశ మ్యాచ్లన్నీ ఆడేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. సహచరుడు శివమ్ దూబే సైతం ముంబైకి సై అంటున్నాడు. అయితే డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి శార్దుల్ ఠాకూర్ సారథ్యం వహిస్తున్నాడు. ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి తమిళనాడు కెప్టెన్గా, సంజూ సామ్సన్ కేరళ కెప్టెన్గా తమ జట్లను నడిపించనున్నారు.ఐపీఎల్పైనే వృథ్వీ ఆశలుఐపీఎల్ సహా టీమిండియా తరఫున ఆడిన పృథ్వీ షా చాన్నాళ్లుగా ఫామ్ లేమి, ఫిట్నెస్, ప్రవర్తన సరళి బాగోలేక జాతీయ జట్టుతో పాటు సొంత ముంబై జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు మహారాష్ట్ర తరఫున రంజీలాడుతున్న పృథ్వీ... టీమిండియా బెర్త్ సంగతి దేవుడెరుగు ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీల కంటపడితే చాలనే ఆశతో ముస్తాక్ అలీ టోర్నీలో మెరిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. నేటి నుంచి హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్కతా, లక్నో వేదికల్లో ఈ దేశవాళీ టి20 టోర్నీ జరుగుతుంది. ఏ గ్రూప్లో ఎవరున్నారంటే...గ్రూప్ ‘ఎ’ (8): ఆంధ్ర, అస్సాం, ఛత్తీస్గఢ్, కేరళ, ముంబై, ఒడిశా, రైల్వేస్, విదర్భ. గ్రూప్ ‘బి’ (8): హైదరాబాద్, బిహార్, చండీగఢ్, గోవా, జమ్మూ కశీ్మర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. గ్రూప్ ‘సి’ (8): బరోడా, బెంగాల్, గుజరాత్, హరియాణా, హిమాచల్ప్రదేశ్, పుదుచ్చేరి, పంజాబ్, సర్వీసెస్. గ్రూప్ ‘డి’ (8): ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, రాజస్తాన్, సౌరాష్ట్ర, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్. టోర్నీ జరిగేదిలా... మొత్తం 32 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో 8 జట్లకు చోటు కల్పించారు. గ్రూప్లోని ఒక జట్టు మిగతా ఏడు జట్లతో ఒక్కోసారి తలపడుతుంది. గ్రూప్ దశ మ్యాచ్లు ముగిశాక... నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (8) ‘సూపర్ లీగ్’ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ లీగ్కు అర్హత పొందిన 8 జట్లను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. గ్రూప్ ‘ఎ’లో 4 జట్లు... గ్రూప్ ‘బి’లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్ లీగ్’ మ్యాచ్లు ముగిశాక గ్రూప్ ‘ఎ’ విజేత... గ్రూప్ ‘బి’ విజేత ఫైనల్కు అర్హత సాధిస్తాయి. మ్యాచ్లు ఎక్కడంటే... గ్రూప్ దశ లీగ్ మ్యాచ్లు దేశంలోని నాలుగు వేదికల్లో జరుగుతాయి. గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లను లక్నోలో... గ్రూప్ ‘బి’ మ్యాచ్లను కోల్కతాలో... గ్రూప్ ‘సి’ మ్యాచ్లను హైదరా బాద్లో... గ్రూప్ ‘డి’ మ్యాచ్లను అహ్మదాబాద్లో ఏర్పాటు చేశారు. ‘సూపర్ లీగ్’ మ్యాచ్లకు, ఫైనల్ మ్యాచ్కు ఇండోర్ ఆతిథ్యమిస్తుంది. గ్రూప్ దశ లీగ్ మ్యాచ్లు డిసెంబర్ 10వ తేదీ వరకు జరుగుతాయి. ‘సూపర్ లీగ్’ మ్యాచ్లు డిసెంబర్ 12 నుంచి 16 వరకు నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 18న జరుగుతుంది.
కొన్ని మార్చుకున్నా... ఇంకొన్ని నేర్చుకున్నా!
న్యూఢిల్లీ: వైఫల్యాలను అధిగమించేందుకు నేర్చుకున్న పాఠాలు, మార్చుకున్న ఆటతీరే ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టైటిల్ విజయానికి కారణమని భారత నంబర్వన్ షట్లర్ లక్ష్యసేన్ అన్నాడు. పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం తన గుండెను బద్దలు చేసిందని, తన ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసిందని... దీంతో శారీరక ఫిట్నెస్, మానసిక స్థైర్యంపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని 24 ఏళ్ల ఈ భారత బ్యాడ్మింటన్ స్టార్ చెప్పాడు. ‘పారిస్’లో కాంస్య పతకం కోసం గట్టిగానే పోరాడినా... చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకెదురైన అనుభవాలు, ఆటలో లక్ష్యాలు లక్ష్య సేన్ మాటల్లోనే... ఫలితాలు పక్కనబెట్టి... నాకెదురైన చేదు అనుభవాలు నాలోని స్ఫూర్తిని కొరవడేలా చేశాయి. దీంతో నా పంథా మార్చుకున్నా. ఫలితాల కోసం కాదు... ముందు ఆటతీరును మెరుగు పర్చుకోవడం కోసమే ఆడటం మొదలుపెట్టాను. దీంతో ఈ సీజన్లో టైటిల్స్లో వెనుకబడినప్పటికీ ఆటలో మార్పు, ఫిట్నెస్లో మెరుగుదల, మానసిక బలం అన్ని సానుకూలంగా మలచుకున్నాను. ఇవే తాజా విజయానికి కారణం. పోటీ పెరిగింది బ్యాడ్మింటన్లో పోటీ బాగా పెరిగింది. ఎంతో మంది మేటి షట్లర్లు వస్తున్నారు. నిలకడగా రాణిస్తున్నారు. మనం కూడా దీటుగా తయారు కావాలి. అదే ఉత్సాహంతో ఆటను కొనసాగించాలి. వచ్చే ఏడాది మాకెంతో కీలకం. రెగ్యులర్ ఈవెంట్లతో పాటు అంతర్జాతీయ టోర్నీలున్నాయి. ఫిట్నెస్, నిలకడ ఎంతో ముఖ్యం. అయితే ప్రస్తుతానికి ఒక్కో టోర్నీ ఆడటంపైనే దృష్టి పెట్టాను. వైవిధ్యం చూపించాల్సిందే సీనియర్ సర్క్యూట్లోకి వచ్చి మూణ్నాలుగేళ్లవుతోంది. ప్రత్యర్థులకు మన ఆట ఏంటో ఈ పాటికే అర్థమై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైవిధ్యం చూపించాల్సిందే. నా కోచ్ యూ యంగ్ సాంగ్ కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాడు. ఫిట్నెస్తో చురుకుదనం, షాట్ల వైవిధ్యంతో ఆటతీరు నన్ను మేటిగా మార్చుతుంది. అందుకే ఇప్పుడు ఒకప్పటిలా కాకుండా కొత్తగా ఆడేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నా. పూర్తి వైవిధ్యమైన ఆటతీరును కనబరచడంపైనే ఉత్సాహంగా ఉన్నా.
మరో పరాభవం పిలుస్తోంది!
పుష్కర కాలం పాటు సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఓడిపోని జట్టు ఇప్పుడు 12 నెలల వ్యవధిలో రెండో సిరీస్ పరాజయానికి చేరువైంది. స్వదేశీ పిచ్లపై పరుగుల వరద పారించి ప్రత్యర్థికి సవాల్ విసిరే టీమ్ ఇప్పుడు సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో పరువు కోసం పోరాడుతోంది. టెస్టులో చివరి రోజు ఒక్కో బంతి గండంలా కనిపిస్తుంటే... మ్యాచ్ను కాపాడుకునేందుకు విదేశీ జట్లు పడిన పాట్లు ఎన్నో చూశాం. ఇప్పుడు మన జట్టు సరిగ్గా అలాగే కనిపిస్తోంది. అవతలి వైపు బౌలర్లు చెలరేగిపోతుంటే ఎనిమిది వికెట్లతో రోజంతా నిలిచి బేలగా ‘డ్రా’ కోసం ఆడాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఏ రకంగానూ సాధ్యం కాదు కాబట్టి సిరీస్ ఓటమి అనేది ఖాయమైపోయింది. ఇక తేడా 0–1తోనా లేక 0–2తోనే అని తేలడమే మిగిలింది! ఏదైనా అద్భుతం జరిగి ఓటమి నుంచి తప్పించుకుంటారేమో అనే ఆశ ఉన్నా... ఈ సిరీస్లో భారత్ ఆట చూస్తే అలాంటి నమ్మకం కూడా కనిపించడం లేదు. గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లోనూ భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. 549 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6) అవుట్ కాగా... ప్రస్తుతం సాయి సుదర్శన్ (2 బ్యాటింగ్), కుల్దీప్ యాదవ్ (4 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ఆఖరి రోజు భారత్ మరో 522 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 26/0తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్ను 78.3 ఓవర్లలో 5 వికెట్లకు 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (180 బంతుల్లో 94; 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... టోనీ జోర్జి (68 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. భారత బౌలర్లలో జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మంగళవారం ఆటలో జడేజాకు వికెట్లు దక్కిన తీరు, ఆ తర్వాత హార్మర్ బౌలింగ్లో రాహుల్ బౌల్డ్ అయిన బంతిని చూస్తే చివరి రోజు పిచ్పై అనూహ్యమైన టర్న్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో మన బ్యాటర్లు రోజంతా నిలవడం కూడా అసాధ్యం కావచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితిని బట్టి 80 ఓవర్ల ఆట మాత్రమే జరిగే అవకాశం ఉంది. కీలక భాగస్వామ్యాలు... ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యం ఉన్నా... దక్షిణాఫ్రికా వేగంగా ఆడి డిక్లేర్ చేసే ప్రయత్నం చేయలేదు. సాధారణ టెస్టు ఇన్నింగ్స్ తరహాలోనే బ్యాటర్లు పట్టుదలగా క్రీజ్లో నిలిచి జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు జోడించారు. ఫలితంగా ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. తొలి వికెట్కు 59 పరుగులు జోడించిన తర్వాత ఓపెనర్లు రికెల్టన్ (64 బంతుల్లో 35; 4 ఫోర్లు), మార్క్రమ్ (84 బంతుల్లో 29; 3 ఫోర్లు)లను తక్కువ వ్యవధిలో వెనక్కి పంపించగా, బవుమా (3)ను సుందర్ లెగ్ స్లిప్ ఉచ్చులో పడేశాడు. అయితే స్టబ్స్, జోర్జి కలిసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరి భాగస్వామ్యం 27 ఓవర్ల పాటు సాగింది. 129 బంతుల్లో స్టబ్స్ అర్ధ సెంచరీని చేరుకోగా, జడేజా బౌలింగ్లో స్వీప్ చేసే ప్రయత్నంలో జోర్జి అర్ధసెంచరీ కోల్పోయాడు. లంచ్ విరామ సమయానికే దక్షిణాఫ్రికా ఆధిక్యం 508 పరుగులకు చేరింది. అయినా సరే ఆ జట్టు డిక్లేర్ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. విరామం తర్వాత స్టబ్స్ జోరు పెంచాడు. తాను ఆడిన తర్వాతి 24 బంతుల్లో 34 పరుగులు రాబట్టిన అతను సెంచరీకి చేరువయ్యాడు. అయితే జడేజా ఓవర్లో సిక్స్ బాది 94కు చేరిన అతను మరో సిక్స్కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. దాంతో బవుమా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. అదే తడబాటు... రెండో ఇన్నింగ్స్ను జైస్వాల్ కొంత ధాటిగా మొదలు పెట్టినా, రాహుల్ వికెట్ కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిచ్చాడు. అయితే మరోసారి యాన్సెన్ చక్కటి బంతితో జైస్వాల్ను అవుట్ చేసి పతనానికి శ్రీకారం చుట్టగా... హార్మర్ స్పిన్కు రాహుల్ స్టంప్ కూలింది. తొలి ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఆడిన భారత బ్యాటర్ కుల్దీప్ ఈసారి కూడా డిఫెన్స్ ఆడే పాత్రను పోషిస్తూ 22 బంతులు సమర్థంగా ఎదుర్కొన్నాడు. సాయి, కుల్దీప్ కలిసి 39 బంతులు ఆడి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. దక్షిణాఫ్రికా ఆలస్యంగా డిక్లేర్ చేసినట్లు అనిపించినా... జట్టు తీసిన 2 వికెట్లు వారి నిర్ణయాన్ని సరైందిగా నిరూపించాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489; భారత్ తొలి ఇన్నింగ్స్: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సిరాజ్ (బి) జడేజా 35; మార్క్రమ్ (బి) జడేజా 29; స్టబ్స్ (బి) జడేజా 94; బవుమా (సి) నితీశ్ (బి) సుందర్ 3; జోర్జి (ఎల్బీ) (బి) జడేజా 49; ముల్డర్ (నాటౌట్) 35; ఎక్స్ట్రాలు 15; మొత్తం (78.3 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్) 260. వికెట్ల పతనం: 1–59, 2–74, 3–77, 4–178, 5–260. బౌలింగ్: బుమ్రా 6–0–22–0, సిరాజ్ 5–1–19–0, జడేజా 28.3–3–62–4, కుల్దీప్ 12–0–48–0, సుందర్ 22–2–67–1, జైస్వాల్ 1–0–9–0, నితీశ్ రెడ్డి 4–0–24–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 13; రాహుల్ (బి) హార్మర్ 6; సుదర్శన్ (బ్యాటింగ్) 2; కుల్దీప్ (బ్యాటింగ్) 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 27. వికెట్ల పతనం: 1–17, 2–21. బౌలింగ్: యాన్సెన్ 5–2–14–1, ముల్డర్ 4–1–6–0, హార్మర్ 3.5–2–1–1, మహరాజ్ 3–1–5–0.
ఫిబ్రవరి 15న పాక్తో భారత్ పోరు
ముంబై: భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నీలో పోరుకు రంగం సిద్ధమైంది. 2026 టి20 వరల్డ్ కప్లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో టీమిండియా తలపడుతుంది. మార్చి 8న అహ్మదాబాద్లో జరిగే ఫైనల్తో వరల్డ్ కప్ ముగుస్తుంది. ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్ను ఐసీసీ చైర్మన్ జై షా విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టు హోదాలో భారత్ ఫిబ్రవరి 7న ముంబైలో జరిగే టోర్నీ తొలి పోరులో అమెరికాతో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో... ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్తో భారత్ లీగ్ దశను ముగిస్తుంది. గత టోర్నీ తరహాలోనే మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, అమెరికాతో పాటు నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. లీగ్ దశ తర్వాత తమ గ్రూప్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు తర్వాతి దశ ‘సూపర్–8’కు అర్హత సాధిస్తాయి. ‘సూపర్–8’కు చేరిన 8 జట్లను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్–8’ మ్యాచ్ల తర్వాత రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మార్చి 3న తొలి సెమీఫైనల్... మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. మార్చి 8న జరిగే ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. ఎనిమిది వేదికలు ఖరారు... టి20 వరల్డ్ కప్లో భాగంగా మొత్తం 55 మ్యాచ్లు జరుగుతాయి. మొత్తం 8 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. భారత్లో అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నైలలో మ్యాచ్లు నిర్వహించనుండగా... శ్రీలంకలో కొలంబో (ప్రేమదాస), కొలంబో (ఎస్ఎస్సీ), పల్లెకెలెలను వేదికలుగా నిర్ణయించారు. గతంలోనే ఐసీసీ స్పష్టం చేసినట్లుగా పాక్ జట్టు తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. సెమీఫైనల్ మ్యాచ్లకు కోల్కతా, ముంబై వేదికలు కాగా... ఒకవేళ పాక్ సెమీస్ చేరితే ఆ జట్టు తమ సెమీఫైనల్ను కోల్కతాలో కాకుండా కొలంబోలోనే ఆడుతుంది. పాక్ ఫైనల్ చేరినా ఇదే వర్తిస్తుంది. భారత్, పాక్ ఏ దశలో తలపడినా...ఆ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే నిర్వహిస్తారు. బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ... భారత మాజీ కెప్టెన్, 2 టి20 ప్రపంచకప్ల విజేత రోహిత్ శర్మను ఐసీసీ 2026 టి20 వరల్డ్ కప్ ప్రచారకర్తగా నియమించింది. తన కొత్త పాత్ర పట్ల రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఆటగాడిగా కొనసాగుతున్న సమయంలో ఇలా ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించలేదని తెలిసింది. నాకు దక్కిన ఈ గౌరవం పట్ల ఆనందంగా ఉన్నా. 9 వరల్డ్ కప్లు ఆడిన తర్వాత ఆటగాడిగా మైదానంలో కాకుండా ప్రేక్షకుడిగా భారత్ ఆడే టి20 మ్యాచ్లను చూడటం కొత్తగా అనిపించడం ఖాయం’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా, భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల జట్టు కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ పాల్గొన్నారు.గ్రూప్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా. గ్రూప్ ‘బి’: ఆ్రస్టేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్. గ్రూప్ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.గ్రూప్ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ.
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఆంధ్రప్రదేశ్లో ఐటీ ముసుగులో రియల్ దందా...
ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచిందెక్కడ?... ఏపీ సీఎం చంద్రబాబుపై ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు మార్గదర్శకాలు విడుదల, జీవో జారీ చేసిన ప్రభుత్వం
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా?... సీఎం చంద్రబాబు
ఉప్పొంగిన అభిమానం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హైదరాబాద్లో ఘన స్వాగతం
మనమంతా సాయి మార్గంలో నడుద్దాం... శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
భద్రతాబలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మడివి హిడ్మా. ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోలు సైతం మృతి
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలోగా నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగ ఉండండి.
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బిజినెస్
ఏఐ వ్యూహంలో భారత్ కీలకం
టోక్యో: గ్లోబల్ ఐటీ సేవల దిగ్గజం ఎన్టీటీ తమ కృత్రిమ మేథ (ఏఐ) వ్యూహాలకు సంబంధించి భారత్ అత్యంత కీలక మార్కెట్గా నిలుస్తోందని వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇండియేఏఐ మిషన్ మొదలైనవి ఇందుకు దన్నుగా ఉంటున్నాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ వపర్మ్యాన్ తెలిపారు. దేశీయంగా డేటా సెంటర్ విభాగంలో తమకు 30 శాతం మార్కెట్ వాటా ఉందని, సమీప భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ నిపుణులకు భారత్ మాకు హబ్గా నిలుస్తోంది. అలాగే ఇక్కడి డెలివరీ సెంటర్కి మా ఆసియా పసిఫిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుబంధంగా పని చేస్తోంది. భారత్లో ప్రతిభావంతులైన యువత లభ్యత ఎక్కువగా ఉంటుంది. వారికి శిక్షణనివ్వడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం‘ అని జాన్ తెలిపారు. దేశీయంగా బీసీజీ, యాక్సెంచర్, డెలాయిట్లాంటి సంస్థలు తమకు ప్రధాన పోటీదార్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో డేటా సెంటర్లతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలాంటి ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు జాన్ చెప్పారు. కేవలం డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలనే కాకుండా ఏఐ, కన్సల్టింగ్ సామర్థ్యాలను కూడా పటిష్టం చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా రంగాలతో పాటు కన్సలి్టంగ్ మొదలైన విభాగాలపైనా ఇన్వెస్ట్ చేశామని జాన్ వివరించారు. నవంబర్ 19 నుంచి 26 మధ్యన టోక్యోలో నిర్వహించిన ఎన్టీటీ ఆర్అండ్డీ ఫోరమ్లో ఎన్టీటీ గ్రూప్ కంపెనీలు 100కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సెక్యూరిటీ, మొబిలిటీ తదితర విభాగాలకు చెందిన సొల్యూషన్స్ వీటిలో ఉన్నాయి.
భారత వృద్ధి అంచనాలకు బూస్ట్
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచాలను ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఎగువకు సవరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.3 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వ్యక్తీకరించగా, తాజాగా దీన్ని 7 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటు (7.8 శాతం) నమోదు కావడం, ప్రపంచ వృద్ధి, వాణిజ్యంపై అమెరికా టారిఫ్ల పెంపు ప్రభావం అనుకున్నంత లేకపోవడం 2025–26 వృద్ధి అంచాలను పెంచడానికి కారణాలుగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.8 శాతంగా ఉండొచ్చన్నది ఆర్బీఐ అంచనా.ఇంతకంటే మెరుగ్గా ఇండ్–రా అంచనాలుండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది. తాము జూలైలో ప్రకటించిన అంచనాల అనంతరం దేశీయంగా, అంతర్జాతీయంగా పరిణామాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నట్టు ఇండ్–రా తెలిపింది. ద్రవ్యోల్బణం చాలా వేగంగా తగ్గుముఖం పట్టడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగడం, జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ అంశాలను ఇండ్–రా ముఖ్య ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్ పంత్ ప్రస్తావించారు. ముఖ్యంగా జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాలకంటే ఎంతో అధికంగా నమోదు కావడం, అమెరికా టారిఫ్ల ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై ఏమంత లేకపోవడం వృద్ధి అంచనాల పెంపులో ప్రధానపాత్ర పోషించినట్టు ఇండ్–రా తెలిపింది. సానుకూల పరిస్థితులు.. ‘‘భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం వేగంగా పట్టాలెక్కడం, శీతాకాలంలో సానుకూల వాతావరణ పరిస్థితులు జీడీపీ వృద్ధి రేటును 7 శాతానికి తీసుకెళతాయి. ఒకవేళ డిమాండ్ కోలుకోవడం (వినియోగం; పెట్టుబడులు) అన్నది అంచనాలకంటే తక్కువగా ఉంటే కనుక అది జీడీపీ వృద్ధి అంచనాలను కిందకు తీసుకెళ్లొచ్చు’’అని ఇండ్–రా తెలిపింది. జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ, తక్కువ ద్రవ్యోల్బణంతో తుది ప్రైవేటు వినియోగం 2025–26లో 7.4 శాతం పెరగొచ్చని పేర్కొంది. ‘‘అమెరికాకు ఎగుమతులు సెపె్టంబర్లో 11.9 శాతం (గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు), అక్టోబర్లో 8.9 శాతం చొప్పున తగ్గాయి.ఎగుమతులు 2024–25లో సగటున నెలవారీ 7.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చూస్తే నెలవారీ సగటు 7.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కానీ సెప్టెంబర్–అక్టోబర్ కాలాన్నే పరిశీలించి చూస్తే నెలవారీ ఎగుమతులు 5.9 బిలియన్ డాలర్లకు (టారిఫ్ల కారణంగా) తగ్గాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారం కావడం లేదంటే భారత ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను గుర్తించడం అన్నది ఎగుమతులు పుంజుకోవడానికి కీలకం’’అని ఇండ్–రా తన నివేదికలో పేర్కొంది.
అదానీ ఎంటర్ప్రైజెస్ రైట్స్ ఇష్యూ
న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్ రైట్స్ ఇష్యూ ప్రారంభమైంది. షేరుకి రూ. 1,800 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 24,930 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా 13.85 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. తద్వారా దేశీయంగా అతిపెద్ద రైట్స్ ఇష్యూలలో ఒకటిగా నిలవనుంది. రైట్స్కు అనుమతించిన ధరతో పోలిస్తే 24 శాతం డిస్కౌంట్లో వీటిని జారీ చేయనుంది. డిసెంబర్ 10న ఇష్యూ ముగియనుంది.రైట్స్లో భాగంగా వాటాదారులవద్దగల ప్రతీ 25 షేర్లకుగాను 3 షేర్లు ఆఫర్ చేస్తోంది. ప్రమోటర్లుసహా వాటాదారులందరికీ ఆఫర్ వర్తిస్తుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లవాటా 74 శాతంకాగా.. వాటాదారులు తొలుత ఒక్కో షేరుకి రైట్స్ ధరలో 50 శాతం(రూ. 900) చొప్పున చెల్లించవలసి ఉంటుంది. మిగిలిన రూ. 900 తదుపరి రెండు దశలలో చెల్లించవలసి ఉంటుంది. రైట్స్ ప్రారంభం నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు బీఎస్ఈలో 2.7 శాతం క్షీణించి రూ. 2,334 వద్ద ముగిసింది.
సిల్వర్ ఈటీఎఫ్ల మెరుపులు
’’అలుపెరుగకుండా పరుగుతీస్తున్న బంగారం బాటలోనే వెండిలో కూడా పెట్టుబడులు చేపట్టేందుకు మూడేళ్ల క్రితం దేశీయంగా ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ప్రొడక్టు (ఈటీపీ)లకు తెరతీశారు. వీటిలో ఈటీఎఫ్లు ప్రధాన భాగం. దీంతో 2022లో వెండి ఈటీఎఫ్లు ఊపిరిపోసుకున్నాయి. తొలి దశలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంగా ఇవి జోరందుకున్నాయి. దీంతో 2007లోనే ప్రారంభమైన పసిడి ఈటీఎఫ్లను వెనక్కి నెడుతూ వెండి ఈటీఎఫ్లు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహా లు బంగారం, వెండిలో పెట్టుబడులకు వీలుగా రూపొందించిన ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు)కు ఆదరణ పెరుగుతోంది. ప్రపంచ దేశాలలో బంగారం వినియోగంలో భారత్, చైనాలు టాప్ ర్యాంకులో నిలుస్తుంటే.. వస్తురూపేణా (ఫిజికల్) వెండి కొనుగోళ్లకు సైతం భారత్ రెండో ర్యాంకులో నిలుస్తోంది. దేశీయంగా ఇటీవల ఈటీఎఫ్ల ప్రవేశంతో ప్రధానంగా వెండిలో పెట్టుబడులు అధికమయ్యాయి.పసిడి ధరల ర్యాలీతో పోలిస్తే కొద్ది నెలలుగా వెండి వెనుకబాటు దీనికి కారణమైనట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల కొద్ది నెలలుగా సౌర విద్యుదుత్పత్తితోపాటు.. ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్ వాహన తయారీ, వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ వెండి ధరలకు జోష్నివ్వనున్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశాయి. ఫలితంగా ఇటీవల వెండిలో ఫిజికల్ కొనుగోళ్లు, ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు వివరించాయి. 200 శాతం జూమ్ 2022తో పోలిస్తే సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 200 శాతం దూసుకెళ్లాయి. న్యూయార్క్ సిల్వర్ ఇన్స్టిట్యూట్ వివరాల ప్రకారం ఈ కాలంలో దేశీ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 18 రెట్లు ఎగశాయి. ఈ బాటలో గత 18 నెలల్లో పెట్టుబడులు భారీగా జంప్చేశాయి. తాజాగా వెండి హోల్డింగ్స్ 5.8 కోట్ల ఔ న్స్లు (1,800 టన్నులు)ను దాటాయి. 2024 చివరితో పోలిస్తే ఇది 51 శాతం అధికం! పెట్టుబడుల దూకుడు మూడేళ్ల క్రితం(2022 తొలి త్రైమాసికం) వెండి ఈటీఎఫ్లు ప్రవేశపెట్టినప్పుడు హోల్డింగ్స్ 2.1 మిలియన్ ఔన్స్లు (65 టన్నులు) మాత్రమే. తదుపరి పెట్టుబడులు ఊపందుకోవడంతో 2024 చివరి క్వార్టర్కల్లా 3.8 కోట్ల ఔన్స్ల (1,183 టన్నులు)కు చేరాయి. ఇది వార్షికంగా 200 శాతం వృద్ధికాగా.. ఒక్క 2024లోనే 2.51 కోట్ల ఔన్స్ల (782 టన్నులు) పెట్టుబడులు జత కలిశాయి. ఆపై వెండి ఈటీఎఫ్లు మరింత జోరందుకున్నాయి. పసిడి వెనుకడుగు వెండి ఈటీఎఫ్లతో పోలిస్తే ఇన్వెస్టర్లు పసిడి ఈటీఎఫ్లలో పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇందుకు బంగారం కాయిన్లు, ఆభరణాల(ఫిజికల్) కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభావం చూపుతోంది. ఫలితంగా 2007లో ప్రారంభమైన గోల్డ్ ఈటీఎఫ్ల హోల్డింగ్స్ 2 మిలియన్ ఔన్స్ల(64 టన్నులు)కు చేరినట్లు తెలియజేశాయి. 2024లో గోల్డ్ ఈటీఎఫ్లలో కేవలం 0.5 మిలియన్ ఔన్స్లు(15 ట న్నులు) జమయ్యాయి. అయితే 2024కల్లా గత నాలుగేళ్ల కాలంలో ఇవి 27.4 టన్నుల నుంచి 54.5 టన్నులకు పుంజుకున్నాయి. 2025లో కొనుగోళ్లు మరింత పెరిగాయి. కాగా.. ఈ ఏడాది(2025)లో ఇప్పటివరకూ వెండి ధరలు 75 శాతం దూసుకెళ్లగా.. పసిడి 55 శాతం బలపడిన విషయం విదితమే.పసిడి రూ. 3,500 జూమ్⇒ ఢిల్లీలో రూ. 1,28,900కి గోల్డ్ ⇒ వెండి కూడా రూ. 5,800 అప్ న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి పరు గు తీశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం 99.9% స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ. 3,500 పెరి గి రూ. 1,28,900కి చేరింది. వెండి ధర కూడా కిలోకి రూ. 5,800 పెరిగి రూ. 1,60,800కి చేరింది. మరోవైపు, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ పసిడి కాంట్రాక్టు ధర రూ. 1,458 ఎగిసి ఒక దశలో రూ. 1,25,312 వద్ద ట్రేడయ్యింది. వెండి కూడా రూ. 2,583 మేర ఎగిసి రూ. 1,57,065 వద్ద ట్రేడయ్యింది. న్యూయార్క్ కామెక్స్లో పసిడి డిసెంబర్ కాంట్రాక్టు ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 47.8 డాలర్లు పెరిగి 4,142 డాలర్ల స్థాయిని తాకింది. సిల్వర్ ఫ్యూచర్స్ రేటు 1.94 శాతం పెరిగి 51.30 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.
ఫ్యామిలీ
లోపం ఐరన్.. అదే సైరన్..
నగరవాసుల్లో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కలంగా ఐరన్ అందించే ఉత్పత్తులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) హెల్త్ లిమిటెడ్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ పాపన అన్నారు. ఐరన్ లోపానికి పరిష్కారం అందించే లివోజెన్ ఐరన్ గమ్మీస్ నగర మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐరన్ తక్కువగా ఉండడం వల్ల అలసట, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు భారీగా పెరిగాయని, వీటి నివారణకు వీలుగా మహిళల రోజువారీ ఐరన్ అవసరాలు తీర్చే విధంగా ఈ గమ్మీస్ రూపొందించినట్లు వివరించారు. (చదవండి: Smriti Mandhanas Father: ఆ లక్షణాలు గుండెపోటుకి సంకేతమా..? యాంజియోప్లాస్టీ ఎందుకు?)
ప్రెషర్..టెన్షన్! మానసిక భాషలో భాగమైన ఒత్తిడి
హైదరాబాద్ మహా నగరం.. టెక్ సిటీ, ఫుడ్ హబ్, కల్చర్ సెంటర్ మాత్రమే కాదు ఈ జనరేషన్ మెంటల్ హెల్త్ను అత్యంత సీరియస్గా తీసుకుంటున్న నగరం కూడా. వేగంగా మారుతున్న లైఫ్స్టైల్, టార్గెట్స్, హడావిడిగా నడిచే టైమ్లైన్.. ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో ఒత్తిడిని అందరికీ దగ్గర చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆందోళన, నిరాశ, కోపం వంటి భావోద్వేగాలు నేటి ఆధునికుల్లో సర్వసాధారణం అవుతున్నాయి. ఇది మానసిక, శారీరక ఒత్తిడిని సూచించే మానసిక భాషల్లో ఒక భాగం. అయితే ఇది మోతాదుకు మించి ఉంటే ప్రతికూల ప్రభావాలను కలిగించే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో తరచూ వినిపించే ‘డెడ్లైన్’, ‘రోలౌట్’, ‘క్లయింట్ ప్రెషర్’ వంటి మాటలు ఈ తరానికి అలవాటైపోతున్నాయి. దీంతో అనేక మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు. ఆయా సమస్యల నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుత తరంలో ఉరుకుల పరుగుల జీవితం మామూలే. మరీ ముఖ్యంగా నిమిషాలను, సెకన్లను లెక్కబెట్టుకుంటూ.. డెడ్లైన్ పేరుతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరం ఒత్తిడిని అర్థం చేసుకోడానికి, వారికి బాసటగా నిలవడానికి, సరైన క్రమంలో గైడ్ చేయడానికి వ్యక్తులు లేదా వ్వవస్థలు వంటి సాంకేతిక వేదికల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి తరుణంలో మెంటల్ హెల్త్ కోసం సపోర్ట్ సిస్టమ్లు వినూత్న సాంకేతిక వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో గివ్ మీ ఫైవ్ (జీఎం–5) అనే టెక్నికల్ ప్లాట్ఫాం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల ఇంటర్నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ వీక్ నేపథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో ఐదువేల మంది యువత, విద్యార్థులపై ఒత్తిడి ప్రభావంపై సర్వే నిర్వహించింది. ఈ ఒత్తిడి సమస్యల పరిష్కారానికి జీఎం–5 టెక్నాలజీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.పలు నగరాల్లో అధ్యయనం.. హైదరాబాద్ వంటి నగరాల్లో యువతలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గివ్ మీ ఫైవ్ (జీఎం–5) బృందం తెలంగాణ, కర్ణాటకలోని ఐదువేల మంది యువత, విద్యార్థులపై ప్రత్యేక సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ఏదో ఒక మెంటల్ హెల్త్ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఇలాంటి వారిలో నిద్రలేమి, పరీక్షల ఒత్తిడి, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ వంటి కారణాలతో చదువులపై ఇతర అంశాలపై దృష్టి సారించలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రతి నగరంలోనూ యువతలో ఇలాంటి ఒత్తిడి సమస్యల సర్వసాధారణం అయిపోయింది. థెరపీల కోసం విదేశాలకు.. ప్రస్తుత తరం, మరీ ముఖ్యంగా నగరవాసుల్లో ఒత్తిడికి లోనయ్యేవారు బ్రెజిల్ వంటి కొన్ని విదేశాల్లో థెరపీలకు వెళ్లడం సాధారణ విషయం. అంతేకాకుండా వ్యక్తిగత స్పేస్కు ప్రాధాన్యం ఎక్కువ. కానీ దేశంలో మానసిక ఆరోగ్యంలో కుటుంబం, సమాజం, అంచనాలు, బాధ్యతలు వంటి పలు అంశాలు భాగమేనని ఈ బృందం చెబుతోంది. ఇది మనల్ని బలంగా నిలబెట్టినా, కొన్నిసార్లు ఒత్తిడిని తెచ్చిపెడుతుంది. ఈ మిక్స్డ్ ఎకోసిస్టమ్లో టెక్నాలజీ ఆధారిత ఫ్యామిలీ–ఇన్క్లూజివ్ సొల్యూషన్ చాలా అవసరమని వారు పేర్కొన్నారు. అదే సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రోగ్రెసివ్ దారి ఎంచుకుంటున్న నగరం హైదరాబాద్. కాస్తో కూస్తో వెల్నెస్ మీద శ్రద్ధ పెరుగుతుంది. సైకిల్ ట్రాక్స్, మారి్నంగ్ వాక్స్, హెల్దీ కెఫేలు, మెంటల్ హెల్త్ ఔట్రీచ్ ప్రోగ్రామ్లు వంటివి ప్రస్తుతం యువతలో ట్రెండ్ అవుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఫలితాలను అందించట్లేదనేది వాస్తవ సత్యం. భావోద్వేగాలను ట్రాక్ చేస్తుంది.. టెక్నాలజీ – వెల్నెస్ కలిసిన అద్భుత స్థలం భాగ్యనగరం. ఇందులో భాగంగానే గివ్ మీ ఫైవ్ యాప్ భారత బీటా లాంచ్ కోసం హైదరాబాద్ను ఎంచుకుంది. ఇక్కడి కుటుంబ బంధాలు, ఆతీ్మయత బాగుంటాయి. ఇదే మెంటల్ హెల్త్కు పెద్ద సపోర్ట్ సిస్టమ్. నర్వేలో భాగంగా రూపొందించిన ఈ యాప్ వచ్చే యేడాది జనవరి–ఫిబ్రవరిలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. 10 నుంచి 50 ఏళ్ల వరకూం అందుబాటులో ఉంటుంది. రోజూ ఐదు సులభమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చి వారి సోషల్ గ్రాఫ్ను అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఫీచర్గా కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్ ‘కంపానియన్’లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఇంట్లో, ఆఫీసులో, ఫ్రెండ్స్ మధ్య ఒక సెన్స్ ఆఫ్ కేర్, రెగ్యులర్ చెక్కిన్కు దోహదపడుతుంది. సమాధానాల ఆధారంగా భావోద్వేగాలను అర్థం చేసుకుని పరిష్కారాలను సూచిస్తుంది. ఏఐ ఆధారిత సూచనలు, ఫ్యామిలీ–ఫ్రెండ్స్తో కమ్యూనిటీ సపోర్ట్ ఇస్తుంది. – డాక్టర్.లీసా ఫాహే, సైకాలజిస్ట్ ఆస్ట్రేలియా పర్సనల్ స్పేస్ తప్పనిసరి.. ఒత్తిడిని జయించాలంటే ప్రతిఒక్కరికీ పర్సనల్ స్పేస్ తప్పనిసరి అని, ఇది మానసకి, శారీరక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో యువత చాట్ జీపీటీ వంటి ప్లాట్ఫామ్స్లో తమ భావాలను పంచుకుంటున్న తరుణంలో మెంటల్ హెల్త్కు ఒక సేఫ్ డిజిటల్ స్పేస్ ఉండటం ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు. ఈ తరుణంలో ఓఏఎమ్ (ఓమ్) రూపొందించిన గివ్ మీ ఫైవ్ (జీఎం–5) యాప్ ఒత్తిడి నియంత్రణకు దోహదపడనుందని భావిస్తున్నారు. భావోద్వేగాలు వ్యక్తం చేయలేనివారు, గిల్టీ ఫీల్ ఉన్నవారు.. బిజీగా ఉండి వ్యక్తిగత, మానసిక స్థిరత్వంపై చొరవ చూపని వారికి ఈ యాప్ కొత్త సపోరి్టవ్ స్పేస్ అందించనుందని భావిస్తున్నారు. (చదవండి: హై రిస్క్ ప్రెగ్నెన్సీస్..ఇవీ జాగ్రత్తలు..!)
హై రిస్క్ ప్రెగ్నెన్సీస్..ఇవీ జాగ్రత్తలు..!
ఒక్కమాటలో చెప్పాలంటే కాబోయే ప్రతి మాతృమూర్తి తాలూకు గర్భధారణా అలాగే ప్రసవంలో ఎంతోకొంత రిస్క్ ఉండనే ఉండవచ్చు.అయితే కొందరి గర్భధారణలు (ప్రెగ్నెన్సీలు) చాలా రిస్క్తో కూడుకున్నవే అవుతాయి. ఉదాహరణ ఒక మహిళకు హైబీపీ, డయాబెటిస్ లేదా గుండెజబ్బులు ఉండటం... ఒకవేళ ఆమె 35 ఏళ్లు దాటాక లేట్గా గర్భవతి కావడం... ఇలాంటి సందర్భాల్లో ఆమె గర్భధారణ అన్నది ప్రసవం వరకూ చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన సందర్భం అవుతుంది. ఇటీవల దాదాపు ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతుండటంతో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతుండటంతో) రిస్క్ అనేది చాలావరకు తగ్గినప్పటికీ... కొన్ని గర్భధారణల్లో ఏ సందర్భంలో ఎటుపోయి ఎటువస్తుందో చెప్పలేని పరిస్థితీ, ఎలాంటి ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయో తెలియని అనిశ్చితి ఉండనే ఉంటుంది. ఇలాంటివాటినే హై రిస్క్ ప్రెగ్నెన్సీలుగా చెప్పవచ్చు. ఏయే సందర్భాలను ‘హై రిస్క్ ప్రెగ్నెన్సీలు’గా పరిగణిస్తారో, ఆ సందర్భాల్లో చేయించాల్సిన వైద్యపరీక్షలు, స్కాన్లతో సాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.ఇటీవల వైద్యవిజ్ఞానశాస్త్రాల్లో చాలా అభివృద్ధి చోటుచేసుకుంది. ఇంత పురోభివృద్ధి తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం గర్భం ఎంత మేర నిలుస్తుందో చెప్పలేని సందర్భాలు ఎప్పుడూ ఉంటాయి. అది తల్లీ బిడ్డా ఇద్దరికీ కాస్తంత ప్రమాదకరంగా మారే అవకాశాలూ పొంచి ఉంటాయి. అలా తల్లికి గానీ లేదా కడుపులోని బిడ్డకుగానీ... ఒక్కోసారి ఈ ఇద్దరికీ సురక్షితమని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎన్నో రకాల కాంప్లికేషన్లు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి గర్భధారణను ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా చెప్పవచ్చు.ఎవరెవరిలో హైరిస్క్ ముప్పు ఉంటుందంటే... ప్రధానంగా ఈ కింద పేర్కొన్న మహిళలు ‘హై–రిస్క్ ప్రెగ్నెన్సీ’ కిందికి వస్తారని చెప్పవచ్చుదాదాపు 35 ఏళ్లు దాటాక (35 – 40 ఏళ్ల మధ్య వయసులో) గర్భవతులైనవారు.ఇప్పుడు గర్భవతిగా ఉన్న ఆ మహిళకు గతంలో వరసగా అబార్షన్లు కావడం లేదా పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడం వంటి వైద్యచరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. మహిళలకు తాము గర్భందాల్చక ముందే అధిక రక్త΄ోటు(హైబీపీ), మధుమేహం (డయాబెటిస్), గుండెజబ్బులు, ధైరాయిడ్ సమస్య, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, మూర్ఛ (ఎపిలెప్సీ) వంటి ఆరోగ్య సవస్యలు ఉన్నవారు. ముందుగా డయాబెటిస్ లేనప్పటికీ గర్భధారణ తర్వాత మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), హైబీపీ కనిపించిన మహిళలు.గర్భధారణకు సంబంధించిన సమస్యలు... అంటే... గర్భంలో కవలలు లేదా ట్రిప్లెట్స్ ఉండటం, స్కాన్ చేసినప్పుడు బిడ్డకు ఆరోగ్యపరమైన సమస్యలుగానీ లేదా లోపాలుగానీ ఉన్నట్లు తెలిసిన సందర్భాల్లో, కడుపులో బిడ్డకు ఎదుగుదల సమస్యలు ఉండటం, బిడ్డలో జన్యుపరమైన లోపాలుండటం... వంటి సందర్భాల్లో. సాధారణ మహిళలతో పోలిస్తే... ఈ తరహా వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీలు) ఉన్నవాళ్లను ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’ కేటగిరీలోకి వస్తారని చెప్పవచ్చు.హై రిస్క్ ప్రెగ్నెన్సీ...తెలుసుకోవడం ఇలా...ఒక మహిళ హైరిస్క్ గ్రూప్ కిందికి వచ్చే వస్తుందా అన్న విషయం నిర్ధారణ చేసుకోడానికి ఈ కింద పేర్కొన్న అంశాలు సహాయపడతాయి. వీటి సహాయంతో ఒక మహిళ తాను హైరిస్క్ ప్రెగ్నెన్సీ జాబితాలోకి వస్తుందా రాదా అన్నది తనకు తానే తెలుసుకోవచ్చు. గర్భధారణ నాటికి 35 ఏళ్ల వయసు మించి ఉండటం. దీనివల్ల సాధారణ మహిళలతో ΄ోలిస్తే... ఇలా లేట్గా గర్భధారణ జరగడంతో పుట్టే పిల్లల్లో క్రోమోజోమ్స్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కేవలం బాగా ఆలస్యంగా జరిగిన గర్భధారణలోనే కాకుండా... ఒకవేళ ఓ అమ్మాయి 18 ఏళ్ల లోపు చిన్నవయసు బాలిక కావడం, చిన్న వయసులోనే ఆమెకు గర్భధారణ జరిగినప్పుడు కూడా పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపించే అవకాశాలుండటంతో దీన్నీ హైరిస్క్గానే పరిగణించాలి. ఒకవేళ గర్భంలో ఒకరికంటే మించి (అంటే... కవలలు లేదా ట్రిప్లెట్స్) ఉండటం వల్ల హైబీపీ రావడం లేదా నెలలు నిండకముందే ప్రసవం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. గర్భంలోని బిడ్డకు ఎదుగుదల లోపాలు ఉన్నప్పుడు. గర్భధారణ జరిగిన మహిళలకు హైబీపీ, చక్కెరవ్యాధి (డయాబెటిస్), గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్య, ఆటోఇమ్యూన్ సమస్యలు, మూర్ఛ వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు. ఇప్పటికే ఓసారి ఒక మహిళకు జన్యుపరమైన సమస్యలున్న బిడ్డ ఉండటం లేదా... ఆ బిడ్డకు గుండెజబ్బుగానీ, లోపంతో కూడిన ఎముకల కారణంగా బిడ్డకు వైకల్యం రావడం వంటి ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. మహిళకు గర్భధారణ వ్యవస్థలో పెద్ద గడ్డలు (ఫైబ్రాయిడ్స్) వంటివి వచ్చిన వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. గతంలో తరచూ అబార్షన్లు కావడం, మునుపు పిండం గర్భసంచిలో కాక... బయట ట్యూబుల్లోనే పెరగడం, గతంలో నెలలు పూర్తిగా నిండకముందే ప్రసవం జరగడం (ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రిమెచ్యూర్ బర్త్), గతంలో బిడ్డ లోపలే చనిపోవడం వంటి మెడికల్ హిస్టరీ ఉంటే... హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల అవి బిడ్డకు సోకే అవకాశాలున్నప్పుడు. పిల్లలు కలగడానికి చాలాకాలం చికిత్స తీసుకున్న తర్వాత గర్భం రావడం... ఇక్కడ పేర్కొన్న సందర్భాల్లో ఒక మహిళ గర్భందాల్చితే దాన్ని ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా చెప్పవచ్చు. ఇలాంటి మహిళలకు గర్భధారణ సమయంలోనూ లేదా ప్రసవం సమయంలోనూ అనేక రకాల కాంప్లికేషన్లు కనిపించే అవకాశాలు ఎక్కువ. ఈ కాంప్లికేషన్లను రెండు రకాలుగా నివారించవచ్చు. మొదటిది మహిళ తానంతట తానే కొన్ని జాగ్రత్తలూ, సూచనలు పాటించి కాంప్లికేషన్లను నివారించుకోవడం, రెండోది వైద్యనిపుణుల సహాయంతో కాంప్లికేషన్లు నివారించుకోవడం. మహిళలు తమకు తాముగా ప్రెగ్నెన్సీ రిస్క్ల తాలూకు కాంప్లికేషన్ల నివారించుకోవడమిలా...హైరిస్క్ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగానే ఒకసారి ‘ప్రీ– కన్సెప్షనల్ కౌన్సెలింగ్’ కోసం డాక్టర్ను సంప్రదించాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు... దాదాపు మూడు నెలల ముందునుంచే కనీసం రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం... (ఈ ఫోలిక్ యాసిడ్ మాత్రను గర్భం దాల్చాక కూడా పూర్తి గర్భధారణ టైమ్ మొత్తం వాడాలి. గర్భం ధరించిన సమయంలో వీలైనంతవరకు ఎలాంటి మందులూ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే... ప్రతి మందునూ తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు వాళ్లకు తెలిసి మాత్రమే తీసుకోవాలి. కొందరు మహిళలకు మూర్ఛ (ఎపిలెప్సీ), హైబీపీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే... గర్భం వచ్చినట్లు తెలియగానే కొందరు మహిళలు తాము వాడే మందుల్ని తమంతట తామే ఆపేస్తారు. అది తల్లీ, బిడ్డా ఇద్దరికీ ప్రమాదకరం. కాబట్టి తామేవైనా మందులు వాడాలన్నా లేదా అంతకుముందునుంచి వాడుతున్న మందులు ఆపేయాలన్నీ డాక్టర్ను సంప్రదించాకే ఆ పని చేయాలి. ఎందుకంటే హైబీపీ, మూర్చ (ఎపిలెప్సీ) వంటి వ్యాధులున్న మహిళలకు డాక్టర్లు వారి గర్భధారణ తసమయంలో వాడుతున్న మందులను గానీ లేదా వాటి మోతాదులనుగానీ మారుస్తారు. గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా డాక్టర్తో నిత్యం డాక్టర్లు సూచించిన పరీక్షలు చేయిస్తూ ఉండాలి. కనీసం నెలలో ఒకసారైనా లేదా పరిస్థితి తీవ్రతను బట్టి డాక్టర్లు సూచించిన వ్యవధిలో డాక్టర్ను కలిసి అవసరమైన పరీక్షలు చేయిస్తుండాలి. ఏడో నెల దాటాక ఈ పరీక్షలు మరింత తరచుగా చేయించాల్సి రావచ్చు. సరైన టైముల్లో సరైన టీకాలు (ప్రాపర్ ఇమ్యూనైజేషన్) తీసుకోవాలి. మహిళలు తమ ఎత్తుకు తగినట్లుగా తమ ఆరోగ్య నిర్వహణకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం, ఇందుకు సరైన ఆహార నియమాలు పాటించడం, అవసరమైన శారీరక వ్యాయామాలను చేయడం అవసరం. ఈ వ్యాయామాలు మరింత శ్రమ కలిగించేలా ఉండకూడదు. కొన్నిరకాల హైరిస్క్ ప్రెగ్నెన్సీల్లో డాక్టర్ బెడ్రెస్ట్ తీసుకోమని అంటే... దాన్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే బెడ్రెస్ట్ అంటే పూర్తిగా మంచానికే పరిమితం కావడం కాదు. డాక్టర్ సలహా మేరకు కాబోయే తల్లి ఏమేరకు శారీరక శ్రమ చేయాలో... అలాగే ఏ మేరకు విశ్రాంతి తీసుకోవాలో చెబుతారు. దాన్ని అక్షరాలా పాటించాలి.వైద్యనిపుణులూ, సిబ్బంది సహాయంతో కాంప్లికేషన్ల నివారణ ఇలా... హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల ప్రసవ సమయంలో కలిగే దుష్పరిణామాలు, ప్రమాదకర పరిస్థితుల (కాంప్లికేషన్స్)ను నివారించడమన్నది ఈ రోజుల్లో చాలావరకు సాధ్యమే. ఇలాంటి రిస్క్లు ఉన్న మహిళలు... ఫిజీషియన్, ఎండోక్రినాలజిస్ట్, గుండెజబ్బుల నిపుణుడు, రుమటాలజిస్ట్, నరాల నిపుణుడు అందుబాటులో ఉండే హయ్యర్ మెడికల్ సెంటర్లలో తమ ప్రసవం జరిగేలా చూసుకోవడం మంచిది. ఫలితంగా ఆ మహిళకు అవసరం ఉన్న వైద్య చికిత్సలను బట్టి ఆ ప్రసవాన్నీ ఎలా ΄్లాన్ చేయాలో అన్నది వైద్యనిపుణులు చర్చించుకుని ఆ మేరకు సురక్షిత ప్రసవం జరగడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోడానికి, వాటిని అమలు చేయడానికి వీలవుతుంది. గర్భిణుల్లో రొటీన్ రక్తపరీక్షలకు తోడుగా... ఆమెకు తన రెండో నెలలోనే రక్తంలో చక్కెర మోతాదులను నిర్ధారణ చేసే పరీక్ష, థైరాయిడ్ పరీక్ష వంటివి నిర్వహిస్తే... పుట్టబోయే బిడ్డ, కాబోయే తల్లి తాలూకు ఆరోగ్య పరిస్థితిని ముందునుంచే తెలుసుకుంటూ ముందస్తు చికిత్స చేయడం... తద్వారా తర్వాతి కాంప్లికేషన్లను నిరోధించడమన్నది చాలావరకు సాధ్యమవుతుంది. ఇక మూత్రపిండాల (కిడ్నీ) సమస్య ఉన్న మహిళలు, హైబీపీ ఉన్నవాళ్లు, థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు, తరచూ అబార్షన్లు అయినవారు గర్భధారణకు ముందే కొన్ని రక్త పరీక్షలు చేయించడం అవసరం, ప్రెగ్నెన్సీ సమయంలో 7–8 వారాలప్పుడే కొన్ని ఇంజెక్షన్లు వాడటం ద్వారా మున్ముందు చోటుచేసుకోబోయే చాలా రకాల ప్రమాదాలను (కాంప్లికేషన్లను) నివారించవచ్చు. స్కాన్ల సహాయంతో... అల్ట్రాసౌండ్ స్కాన్ సహాయంతో ముందుగానే గర్భంలోపల ఉన్న పరిస్థితిని తెలుసుకుని తగిన చికిత్స చేయడంతో టు... లోపాలు సరిదిద్దడానికీ ఆ స్కాన్లు ఉపయోగపడతాయి. బిడ్డలోని వైకల్యాలను, అసా«ధారణ పరిస్థితులనూ, లో΄ాలను తెలుసుకునేందుకు స్కాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.అల్ట్రాసౌండ్ స్కాన్తో 11–14 వారాల సమయంతో గర్భధారణ నిర్దిష్టంగా ఎప్పుడు జరిగింది, గర్భంలోపల ఉన్న బిడ్డ ఒకరా, కవలలా, ఒకవేళ కవలలైతే ఒక వాళ్లు ఒకే అండం నుంచా లేక రెండు వేర్వేరు అండాల నుంచా అన్నది తెలుస్తుంది. న్యూకల్ ట్రాన్సు్యలెన్సీ స్కాన్ వల్ల చిన్నారిలో క్రోమోజోమ్కు సంబంధించిన లోపాలు ఏవైనా ఉంటే అవి పిండ దశలోనే తెలిసి΄ోతాయి. బిడ్డ స్వరూపం (స్ట్రక్చర్) ఎలా ఉందో కూడా కొంతవరకు తెలుస్తుంది. ఇది ఒక రకమైన స్క్రీనింగ్ పరీక్ష. ఇక 20–22 వారాలప్పుడు చేసే రొటీన్ స్కాన్ వల్ల చిన్నారి పూర్తి స్వరూపం (స్ట్రక్చర్) తెలుస్తుంది. అన్ని అవయవాలూ సక్రమంగా రూ΄÷ందాయో లేదో కూడా తెలిసిపోతుంది. క్రమం తప్పకుండా చేయించే స్కాన్ల వల్ల బిడ్డ మెదడు వంటి అత్యంత ప్రధాన అవయవాల్లో రక్తప్రసరణ వంటి కీలక అంశాలు తెలుస్తాయి. ఫలితంగా పిండదశలోనే ఏవైనా లో΄ాలు ఉంటే వాటిని చక్కదిద్దే అవకాశాలుంటాయి. ఇలాంటి పలు రకాల స్కాన్ల కాంబినేషన్లతో ఒక ప్రెగ్నెన్సీలో రిస్క్ మోతాదు ఎంత అన్నది నిర్థారణ చేస్తారు. దాన్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీది హైరిస్కా, తక్కువ రిస్కా, లేదా రిస్కేమీ లేదా అన్నది దాదాపు 90 శాతం వరకు చెప్పగలుగుతారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ చికిత్సలూ అందుబాటులో... గర్భధారణ సమయంలో ఎదురయ్యే రిస్క్లకు ఇప్పుడు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో నియోనేటల్ చికిత్స ప్రక్రియలు చాలా అడ్వాన్స్ అవ్వడం వల్ల ఇలాంటి బేబీస్కు ఇప్పుడు అన్ని రకాల చికిత్సలు అందిస్తూ వాళ్లు మామూలుగానే మనుగడ సాధించేలా చేయవచ్చు. గతంలో వాళ్లకు న్యూరలాజికల్ సమస్యలు వస్తాయనే భావన ఉండేది. ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో అలాంటి సమస్యలనూ చాలావరకు అధిగమించవచ్చు. అలాంటి పిల్లల్లో కొన్ని అవయవాలు అంటే ఉదాహరణకు ఊపిరితిత్తులు అభివృద్ధి కావు. అప్పుడు కొన్ని ఇంజెక్షన్లను ఇవ్వడం ద్వారా ఊపిరితిత్తులను పూర్తిగా అభివృద్ధి చెందేలా చేయవచ్చు. అయితే ఇలాంటి చికిత్సలు– అన్ని అధునాతన సదు΄ాయాలు ఉన్న చికిత్స కేంద్రాల్లో ఉంచి తగిన పరిచర్యలు చేయడం ద్వారా బిడ్డనూ, తల్లినీ సంరక్షించవచ్చు. అలాగే బిడ్డ మానసిక ఎదుగుదలకు, తెలివితేటలకూ థైరాయిడ్ హార్మోన్లు అవసరం. అలాంటప్పుడు తల్లిలో థైరాయిడ్ లోపాలుంటే వాటిని సరైన సమయంలో పసిగట్టి చికిత్స అందించడం ద్వారా మంచి మానసిక ఆరోగ్యం, తెలివితేటలు ఉండే బిడ్డను కనేలా చేయవచ్చు. కాబోయే తల్లికి బీపీ, షుగర్ వంటివి ఉన్నట్లయితే వాటిని సమర్థంగా నియంత్రణలో పెట్టి తల్లినీ, బిడ్డనూ సంరక్షించవచ్చు. అందుకే... హైరిస్క్ ప్రెగ్నెన్సీలలో తల్లినీ, బిడ్డనూ సురక్షితంగా ఉంచాలంటే... ముందునుంచే మంచి వైద్యపర్యవేక్షణతో పాటు... కాబోయే తల్లికీ కొంత ప్రాథమిక పరిజ్ఞానం, కొన్ని అంశాలపై అవగాహన, పరిజ్ఞానం ఉండటం అవసరం. అలాంటివి వైద్య నిపుణులు తమ కౌన్సెలింగ్ సమయంలో చెబుతూ ఆమెకూ పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. డాక్టర్ శ్రుతి రెడ్డి పొద్దుటూరు కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్ – లాపరోస్కోపిక్ సర్జన్ (చదవండి: Farah Khan: వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..)
బాలీవుడ్ హీ మేన్
‘ధరమ్ జీ’ ‘ధరమ్ పాజీ’ ‘వీరూ’ ‘ధరమ్ వీర్’... అంటూ ఇండస్ట్రీ, ప్రేక్షకులూ యాభై ఏళ్లుగా ప్రేమగా పిలుచుకున్న బాలీవుడ్ హీమేన్ ధర్మేంద్ర కన్నుమూశారు. రొమాంటిక్ సినిమాలతో మొదలు యాక్షన్ సినిమాల వరకు అన్నీ చేసి ‘సకల నటనా వల్లభుడు’ అనిపించుకున్న ధర్మేంద్ర మృతితో ఒక శకం ముగిసింది.ధర్మేంద్ర గారూ... దేశానికి అమితాబ్ మంచి హెయిర్ స్టయిల్ ఇచ్చాడు. రాజేష్ ఖన్నా ఫ్యాషనబుల్ కుర్తా ఇచ్చాడు. మిథున్ డిస్కో డాన్స్ ఇచ్చాడు. మీరేం ఇచ్చారు?’ ధర్మేంద్ర ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి సమాధానం ఇచ్చారు. ‘ఆరోగ్యం ఇచ్చాను. నన్ను చూసి దేశంలో ఎందరో యువకులు జిమ్ వైపు నడిచారు. నేను దేశానికి కండ ఇచ్చాను. అంతకు మించింది ఏముంది?’13 ఏళ్ల పిల్లవాడుగా ధర్మేంద్ర ఉన్నప్పుడు లూథియానా మినర్వా థియేటర్లో ‘షహీద్’ అనే సినిమా చూశాడు. అందులో ఒకతను ‘వతన్ కే రాహ్ మే వతన్ కే నౌజవాన్ షహీద్ హో’... అని చేతిలో జెండా పట్టుకుని పాడుతున్నాడు. అతణ్ణి హీరో అంటారని, అతని పేరు దిలీప్ కుమార్ అని ధర్మేంద్రకు తెలియదు. కాని థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయానికి ఒకటే నిశ్చయించుకున్నాడు– ‘నేను అతనిలాగే మా ఊరి థియేటర్లో తెర మీద కనిపిస్తా’.అది ఏ సమయమో. ఆ మాటను ఏ నక్షత్రాలు విన్నాయో.ధర్మేంద్ర తండ్రి స్కూల్ టీచర్. పెద్ద కొడుకు ధర్మేంద్ర తన మార్గంలో నడిచి ప్రొఫెసర్ కావాలని ఆయనకు ఉండేది. ధర్మేంద్రకు చదువు వంటబట్టలేదు. పైగా సినిమా పురుగు కుట్టింది. దాంతో క్లాసులో ఏమీ వినలేక, చెప్పలేక తండ్రి చేతిలో రోజూ తిట్లే. ఇంటికి వచ్చి తల్లితో ‘నన్ను స్కూల్కు పంపకు. నాన్న నన్ను మిగిలిన పిల్లల కంటే ఎక్కువ తిడుతున్నాడు’ అని ఫిర్యాదు చేసేవాడు. మొత్తానికి మెట్రిక్తో చదువు ఆగి, రైల్వే శాఖలో క్లర్క్ ఉద్యోగం దొరికి, 19 ఏళ్లకు పెళ్లి కూడా అయిపోయింది. కాని అతణ్ణి వెండితెర పిలుస్తూ ఉంది. రోజూ అతడి బాధ చూసిన తల్లి ‘నీకు అంతగా నటించాలని ఉంటే ఒక అర్జీ పడేయొచ్చు కదరా’ అంది అమాయకంగా. ఉద్యోగానికి అర్జీగానీ హీరో కావడానికి అర్జీ ఉంటుందా? ఏమో... అర్జీ పెట్టాలేమో అనుకుంటున్న ధర్మేంద్రకు అప్పుడే ‘ఫిల్మ్ఫేర్ టాలెంట్ హంట్’ ప్రకటన పేపర్లో కనిపించింది.బిమల్ రాయ్, గురుదత్ల పర్యవేక్షణలో కొత్త నటీనటుల అన్వేషణ. అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి అప్పటికప్పుడు ‘మలేర్కోట్లా’ అనే టౌన్కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. కారణం ఫొటో స్టూడియో అక్కడే ఉంది. అక్కడ జాన్ మహమ్మద్ అనే ఫొటోగ్రాఫర్తో ‘నన్ను దిలీప్కుమార్లా ఫొటో తియ్యి’ అనంటే అతను అంతకన్నా అందంగా ఫొటో తీశాడు. వెంటనే బొంబాయి నుంచి పిలుపు వచ్చింది. మహా దర్శకులైన బిమల్రాయ్, గురుదత్ స్క్రీన్ టెస్ట్ చేశారు. గురుదత్ ఏ సినిమా ఆఫర్ చేయలేదుగానీ బిమల్రాయ్ ‘నీకు వేషం ఇస్తున్నా’ అన్నాడు. సినిమా పేరు ‘బందినీ’.సినిమా రంగంలో ఇదిగో అంటే ఆర్నెల్లు. ‘బందినీ’ నిర్మాణం లేటయ్యింది. ఈలోపు ధర్మేంద్రకు పస్తులు మొదలయ్యాయి. బిమల్రాయ్ బుక్ చేసిన నటుడు కాబట్టి ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ (1960) అనే సినిమాలో హీరోగా 51 రూపాయల అడ్వాన్సుతో పని దొరికింది. మొదటి సినిమాగా అదే రిలీజైంది. కాని ఫ్లాప్. ఆ కష్టకాలంలో తనలాగే వేషాల కోసం ప్రయత్నిస్తున్న మనోజ్ కుమార్ ఫ్రెండ్ అయ్యాడు. రోజుల తరబడి స్టూడియోల చుట్టూ తిరగడం, భార్యనూ... ఉద్యోగాన్నీ వదిలేసి బొంబాయిలో ఏం చేస్తున్నావ్ అని తండ్రి అక్షింతలతో ఉత్తరాలు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం వేల వేదనలు అనుభవించాడు. అప్పుడు ‘బందినీ’ (1963) విడుదలైంది. కొద్దిగా గుర్తింపు. ‘ఆయి మిలన్ కీ బేలా’ (1963) నెగెటివ్ రోల్. రాజేంద్ర కుమార్ హీరో. కాస్త హిట్ అయ్యింది. ఈ సమయంలోనే అతను మన మహానటి సావిత్రి (Savitri) పక్కన హీరోగా ‘గంగాకీ లహరే’ (1964)లో నటించాడు. ఆ సంగతి సావిత్రికి, ధర్మేంద్రకు తప్ప ప్రేక్షకులకు తెలియదు. అంత ఫ్లాప్ ఆ సినిమా. ధర్మేంద్ర స్ట్రగుల్ కొనసాగింది.సినిమా పరిశ్రమలో ‘గాడ్ఫాదర్’ ఉండాలని అంటూ ఉంటారు. ధర్మేంద్రకు ‘గాడ్మదర్’ దొరికింది. ఆమె పేరు మీనా కుమారి. మన ‘నాదీ ఆడజన్మే’ సినిమాను హిందీలో ‘మై భీ లడ్కీ హూ’ (1964)గా రీమేక్ చేస్తుంటే మొదటిసారి మీనాకుమారితో నటించాడు ధర్మేంద్ర. మీనాకుమారి అప్పటికే తన వివాహ బంధం నుంచి బయటపడింది. ఆమె మనసు ఒక మంచి మిత్రుడి కోసం చూస్తోంది. ఆ సమయంలో సిగ్గరిగా, స్నేహంగా ఉన్న ధర్మేంద్ర ఆమెకు ఆప్తుడుగా అనిపించాడు. మీనాకుమారి పేరు మీద ఇంకా సినిమాలు ఆడుతున్న రోజులు అవి. అందువల్ల మీనాకుమారి ధర్మేంద్రను చాలా ప్రమోట్ చేసింది. వారిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. పూర్ణిమ (1965), కాజల్ (1965), ఫూల్ ఔర్ పత్థర్ (1966), చందన్ కా పల్నా (1967), ‘బహారోంకి మంజిల్’ (1968)... వీటిలో ఫూల్ ఔర్ పత్థర్ సూపర్హిట్. ఆ తర్వాత ధర్మేంద్ర ఆగలేదు. అతణ్ణి పెద్ద హీరో చేసిన మీనాకుమారి అతని జ్ఞాపకాల్లో మిగిలిపోయింది.ఆశాఫరేఖ్, ధర్మేంద్ర జోడి ప్రేక్షకులకు నచ్చింది. ‘ఆయా సావన్ ఝూమ్ కే’... పాట రేడియోలో పెద్ద హిట్. సినిమా కూడా సూపర్హిట్. ‘ఆయా సావన్ ఝూమ్ కే’ సినిమాతో ధర్మేంద్ర కెరీర్ పూర్తిగా సెటిల్ అయ్యింది. ఇతను యాక్షన్, సెంటిమెంట్, రొమాంటిక్ సినిమాలు చేయగలడు అని ఇండస్ట్రీకి తెలిసిపోయింది. హీరోయిన్లు మాలాసిన్హా, సైరాబాను, వహీదా రెహమాన్, షర్మిలా టాగోర్ అందరూ ధర్మేంద్ర పక్కన నటించడానికి పోటీలు పడ్డారు. అయితే అతను నటించడానికి పోటీ పడిన హీరోయిన్ ఆ తర్వాతి రోజుల్లో వచ్చింది. హేమమాలిని!ధర్మేంద్రలో ఒక మంచి, సెన్సిబుల్ నటుడు ఉన్నాడు. ఆ సంగతిని హృషికేష్ ముఖర్జీ పసిగట్టాడు. ‘అనుపమ’ (1966), ‘సత్యకామ్’ (1968), ‘చుప్కే చుప్కే’ (1975)... ఇవన్నీ ధర్మేంద్రతో తీశాడు. ధర్మేంద్ర మొత్తం కెరీర్లో అత్యుత్తమ నటన ప్రదర్శించిన సినిమాగా ‘సత్యకామ్’ను విమర్శకులు గుర్తిస్తారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఆ తర్వాత కల్ట్ క్లాసిక్గా నిలిచింది. ‘చుప్కే చుప్కే’లో ధర్మేంద్ర వేసిన ‘ప్యారేమోహన్’ అనే పాత్రకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ధర్మేంద్ర కామెడీని ప్రేక్షకులు ఈ సినిమాలో ఎంతో ఎంజాయ్ చేశారు. విశేషం ఏమంటే ఇందులో ధర్మేంద్ర బోటనీ ప్రొఫెసర్. సినిమా రిలీజయ్యాక తండ్రికి చూపించి ‘నువ్వు కోరినట్టుగా నేను బోటనీ ప్రొఫెసర్ అయ్యాను చూడు’ అనంటే ఆయన ఎప్పటిలానే ‘ఏడ్చావులే బడుద్దాయి’ అని అని అక్షింతలు వేశాడు.ధర్మేంద్ర హీరో. అతను హీరోగా ఉంటే పక్క పాత్ర ఉంటుంది తప్ప వేరెవరో హీరోగా ఉంటే అతను పక్కపాత్ర కాదు. ‘షోలే’లో హీరో ధర్మేంద్ర. సినిమాలో ప్రాణాలతో మిగిలేది కూడా అతడే. కాని అమితాబ్ కూడా అసాధ్యుడిగా నటించాడు. ధర్మేంద్రకు రాజకీయాలు చేయడం తెలియదు. కొత్త తరం వస్తే అసూయ లేదు. ఒడ్డూ పొడవూ ఉన్న అమితాబ్ తనను దాటేస్తాడనే భయం లేకుండా ‘జయ్’ పాత్రకు అమితాబ్ను తీసుకోండని తనే ఒక మాట వేశాడు దర్శకుడికి. ‘షోలే’ (1975) విడుదలయ్యి మరికొన్ని రోజుల్లో 4కెలో రీరిలీజ్ అవనుంది. యాభై ఏళ్లుగా షోలే ఖ్యాతి ధర్మేంద్రను భారత ప్రేక్షకులకు చేరువ చేస్తూనే ఉంది. ప్రతి కొత్తతరం ఈ సినిమా చూసి ధర్మేంద్రకు ఫ్యాన్స్ అయ్యారు. ‘కుత్తే మై తేరా ఖూన్ పీజావూంగా’ డైలాగ్ ధర్మేంద్ర ఒక్కసారి చెప్తే ఆ తర్వాతి తరాలు వందసార్లు చెప్తూనే ఉన్నాయి.1980ల తర్వాత ధర్మేంద్ర మల్టీస్టారర్ సినిమాల్లో హీరోగా క్షణం తీరిక లేకుండా గడిపాడు. అదే సమయంలో తన కుమారుడు సన్ని డియోల్ను ‘బేతాబ్’ (1983)లో లాంచ్ చేసి హీరోగా నిలబెట్టాడు. కొడుకుతో ధర్మేంద్ర తీసిన ‘ఘాయల్’ కూడా సూపర్డూపర్ హిట్ అయ్యింది. ఈ కాలంలో హీరోగా ధర్మేంద్ర కొన్ని సినిమాలు చేస్తుంటే హీరోగా సన్నిడియోల్ సినిమాలు చేస్తూ వచ్చాడు. డింపుల్ కపాడియా (Dimple Kapadia) వంటి హీరోయిన్లు ఇద్దరి సరసనా నటించారు. ఆ తర్వాత చిన్న కొడుకు బాబీ డియోల్ను ‘బర్సాత్’తో లాంచ్ చేశాడు ధర్మేంద్ర.ధర్మేంద్ర ఎప్పుడూ తన పని గురించి తప్ప ఎత్తులు పైఎత్తులు వేస్తూ కూచోలేదు. పంచాయతీలకు దిగలేదు. అనవసరంగా మీడియా ముందుకు రాలేదు. ఇన్నేళ్లలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా తక్కువ. అవార్డు ఫంక్షన్లకు హాజరవడం, పార్టీలు ఇవన్నీ చాలా పరిమితంగా చేసేవాడు. ధర్మేంద్రకు రైతుగా ఉండడటం ఇష్టం. అందుకే కుమారులిద్దరూ కలిసి లోనావాలా దగ్గర 100 ఎకరాల ఫామ్హౌస్ ఏర్పాటు చేశాడు. సినిమాలను పూర్తిగా తగ్గించుకున్నా ఆ ఫామ్హౌస్లోనే ఎక్కువగా గడిపాడు ధర్మేంద్ర, ‘మీ వయసు ఎంత?’ అని ధర్మేంద్రను అడిగితే ‘అది కెమెరా చెప్తుంది’ అనేవాడు. కెమెరా తన కంటితో ఆయనను ఎప్పుడూ యంగ్గా, ఆరోగ్యవంతుడిగా, ధీరుడిగా, హీమాన్గానే చూపిస్తూ వచ్చింది. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఆయన ఆ రూపంతోనే మిగిలిపోతాడు. ధర్మేంద్ర నటించిన ‘గాడీ బులా రహీహై’ పాటలో ‘గాడీ’ అంటే మృత్యువుకు సంకేతం. ఇన్నాళ్లకు మబ్బుల సెట్టింగ్, మెరుపుల ఆర్క్ లైట్లు ఉన్న చోటుకు తీసుకెళ్లే గాడీ ఎక్కి తరలిపోయాడు ధర్మేంద్ర. గాడీ బులా రహీహై... సీటీ బజా రహీహై.హేమమాలినితో ప్రేమకథహిందీ సినిమాల్లో హేమమాలిని (Hema Malini) రాకను బాంబేలో పెద్ద దుమారంగా మార్చిన వ్యక్తి రాజ్కపూర్. హేమమాలిని హిందీలో హీరోయిన్గా నటించిన మొదటి సినిమా ‘సప్నోంకా సౌదాగర్’ (1968)లో రాజ్కపూర్ హీరో. ఆ సినిమా పబ్లిసిటీ కోసం ‘డ్రీమ్ గర్ల్ హేమమాలిని’ అంటూ బాంబే అంతా హోర్డింగ్స్ పెట్టించాడు. అలా ఆమె బాలీవుడ్ హీరోల దృష్టిలో పడింది. ఆ వెంటనే ధర్మేంద్రతో ‘తుమ్ హసీ మై జవాన్’ (1969)లో నటించింది. ధర్మేంద్ర అప్పటికే వివాహితుడైనా, నలుగురు పిల్లల తండ్రయినా హేమమాలిని ఆకర్షణలో పడ్డాడు. సౌత్ హీరోయిన్లు హిందీలో ఎప్పుడూ టాప్స్టార్స్గానే ఉన్నారు. వహీదా రహెమాన్, వైజయంతీమాల, రేఖ... ఇప్పుడు హేమమాలిని. ఆమె స్నేహం కోసం అందరూ ఎదురు చూసిన వారే. వీరిలో మనోజ్ కుమార్, జితేంద్ర, సంజీవ్ కుమార్, ధర్మేంద్ర ఉన్నారు. ‘షోలే’ (1975) చేసే సమయానికి ధర్మేంద్ర ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆమెకు దగ్గరవడానికి ఆమెతో నటించే సీన్లలో రీటేక్ల కోసం లైట్బాయ్స్ను ఏదో ఒక తప్పు చేయమని తప్పుకు వంద రూపాయలు ఇచ్చేవాడు– ఆ రోజుల్లో. దాంతో హేమమాలినికి ధర్మేంద్ర అవస్థ తెలిసి వచ్చింది. అయినప్పటికీ ఇంట్లో అనంగీకారం, ధర్మేంద్ర మొదటి పెళ్లి కారణంగా హేమ మనసు ద్వైదీభావంతో ఉండేది. ఆ సమయంలోనే జితేంద్రతో దాదాపుగా ఆమె వివాహం వరకూ వెళ్లడం, మద్రాసుకు అందుకై వాళ్లు చేరుకోగా ధర్మేంద్ర మరో ఫ్లయిట్లో అక్కడకు వెళ్లి ఆమెను ఒప్పించి పెళ్లి కేన్సిల్ చేయడం ఆ రోజుల్లో వార్తగా వచ్చింది. చివరకు ధర్మేంద్ర, హేమమాలిని 1980లో వివాహం చేసుకున్నారు. ఇది పెద్ద వార్త. అయితే ధర్మేంద్ర తన కుటుంబాన్ని హేమమాలిని జీవితంలో జోక్యం చేసుకోకుండా, హేమమాలిని తాను అతని కుటుంబంలో జోక్యానికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ (Prakash Kaur) ఎప్పుడూ ఈ విషయమై ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడలేదు. వారి ఇద్దరు కుమార్తెల్లో ఇషా డియోల్ సినిమాల్లో రావడం ధర్మేంద్రకు అంగీకారంగా లేకపోయినా తర్వాత ఆమెతో పాటు కలిసి నటించాడు కూడా. ‘నేను నా కుమార్తెను నటించ వద్దు అన్నాను నిజమే. నన్ను నా తండ్రి నటించ వద్దు అన్నాడు కదా. సినిమా రంగంలో కెరీర్ ఎంపికపై తల్లిదండ్రుల అభిప్రాయం ఉండటం తప్పు కాదు’ అంటాడు ధర్మేంద్ర. అయితే ధర్మేంద్ర కుమారులు సన్ని డియోల్, బాబీ డియోల్ (Bobby Deol) తమ సవతి తల్లి కుమార్తెలతో అంత మంచి అనుబంధంలో ఉన్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు. వారు నలుగురూ కలిసిన సందర్భాలు దాదాపుగా లేనట్టే.నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్’ధర్మేంద్ర (Dharmendra) మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్హౌస్ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన. ధర్మేంద్ర టాప్ 10 పాటలు1. యా దిల్ కి సునో దునియా వాలో ∙అనుపమ2. ఆప్ కే హసీన్ రుఖ్మె ఆజ్ నయా నూర్ హై ∙బహారె ఫిర్ భి ఆయేగీ3. బహారోంనె మేరా చమన్ లూట్ కర్ ∙దేవర్4. సాథియా నహీ జానా కె జీనా లగే ∙ఆయా సావన్ ఝూమ్ కే5. ఆజ్ మౌసమ్ బడా బే ఇమాన్ హై ∙లోఫర్6. పల్ పల్ పల్ దిల్ కే పాస్ ∙బ్లాక్ మెయిల్7. కోయి హసీనా జబ్ రూఠ్ జాతీ హై తో ∙షోలే8. ఓ మెరి మెహబూబా ∙ధరమ్ వీర్9. హమ్ బేవఫా హర్గిజ్ న థే ∙షాలిమార్10. జిల్మిల్ సితారోంకా ఆంగన్ హోగా ∙జీవన్ మృత్యుమాఫియాకి ధర్మేంద్ర హడల్1980లలో ప్రతి చిన్నా చితకా హీరోలకు మాఫియా నుంచి కాల్స్ వచ్చేవి. ‘భాయ్ మాట్లాడతాడట’ అనంటే అందరూ ఒణికిపోయేవారు. డబ్బులు కొందరు ఇచ్చేవారు. ఇలాగే ఒకసారి ధర్మేంద్రకు కూడా ఫోన్ వచ్చింంది. ధర్మేంద్ర ఫోన్ అందుకుని ‘మీరు ఎంత మంది ఉంటారు. ఒక పది మంది ఉంటారా? మీకు నేనొక్కణ్ణే చాలు. కాదు కూడదన్నారో ఒక ఫోన్ కొడితే మా పంజాబ్ నుంచి లారీలకు లారీలు కత్తులతో దిగుతారు. రండి చూసుకుందాం’ అన్నాడు. అంతే! మళ్లీ మాఫియా నుంచి ధర్మేంద్రకు ఫోన్ లేదు.నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్’ధర్మేంద్ర మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్హౌస్ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన.
అంతర్జాతీయం
భారత్కు తాలిబాన్ల భారీ ఆఫర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్తో సరిహద్దు సంక్షోభం కారణంగా వాణిజ్య మార్గాలు మూసుకుపోవడంతో భారత్తో దోస్తీ కోసం ఆఫ్ఘనిస్తాన్ తహతహలాడుతోంది. ఆ దేశానికి చెందిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, దౌత్య సంబంధాలను విస్తరించాలని పిలుపునివ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది. పాకిస్తాన్తో దౌత్య అంతరం పెరుగుతున్న తరుణంలో భారత్ పర్యటనకు వచ్చిన అజీజీ ‘ఎన్డీటీవీ’తో మాట్లాడారు.భారతదేశంతో వ్యాపారానికి ఆఫ్ఘనిస్తాన్ తలుపులు తెరిచిందని ఈ సందర్భంగా అజీజీ అన్నారు. 2021 తర్వాత భారతదేశంలో తాజాగా మొదటి ఉన్నత స్థాయి తాలిబాన్ సమావేశం జరిగింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఏర్పడిన తరుణంలో ఆ దేశం నుంచి ఔషధాల దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారత పర్యటనలో ఉన్న అజీజీ..భారత్తో వాణిజ్యానికి కొత్త మార్గాలను కనుగొనడం, ఆర్థిక సహకారాన్ని పునరుద్ధరించడం తన పర్యటన ముఖ్య ఉద్దేశమని అన్నారు.తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తమ అరియానా ఆఫ్ఘన్ ఎయిర్లైన్స్కు సబ్సిడీ ఇవ్వడం, ఇతర ప్రైవేట్ క్యారియర్లకు ప్రోత్సాహం అందించడం ద్వారా సరుకు రవాణా ఖర్చులను తగ్గించాలని యోచిస్తోంది. అంతేకాకుండా ఆఫ్ఘన్ డ్రై ఫ్రూట్స్, భారతీయ ఔషధాలతో సహా ఇరువైపులా ఎగుమతులను పెంచడానికి సుంకాలను తగ్గించాలని అనుకుంటోంది. పాకిస్తాన్కు ప్రత్యామ్నాయంగా ఇరాన్ ద్వారా సముద్ర మార్గాలు, ఆసియా ద్వారా భూ మార్గాలను వినియోగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. తమ దేశంలోని విస్తారమైన ఖనిజ నిక్షేపాలు, అరుదైన భూములపై భారతదేశం ఆసక్తి చూపుతున్నదని అజీజీ పేర్కొన్నారు.భారతీయ కంపెనీలు ఆఫ్ఘన్ నిబంధనలను అనుసరించినంతవరకు వారికి తమ దేశంలో వాణిజ్యానికి సమాన అవకాశాలు ఇస్తామని అజీజీ హామీ నిచ్చారు. ఇటువంటి సానుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి త్వరలో ఆఫ్ఘనిస్తాన్.. భారత్కు ఒక వాణిజ్య ప్రతిపాదనను పంపుతుందని తెలిపారు. కాబూల్లోని భారత దౌత్యవేత్తలకు, రాయబార కార్యాలయానికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. భారత మహిళా వ్యవస్థాపకులకు ఆఫ్ఘనిస్తాన్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా సహకారం అందిస్తామని అన్నారు. వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో ఆఫ్ఘనిస్తాన్ను సందర్శించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్లను ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అజీజీ ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: Delhi pollution: ఆఫీసులో ఫిఫ్టీ.. ఇంటిలో ఫిఫ్టీ!
ఆగ్రహా‘వేషం’ !
సిడ్నీ: అది ఆ్రస్టేలియా పార్లమెంటు.. గంభీరంగా సాగుతున్న సభలోకి హఠాత్తుగా.. ఒక వ్యక్తి బురఖా ధరించి ప్రవేశించడంతో అంతా అవాక్కయ్యారు. అదెవరో కాదు.. ఆ్రస్టేలియాకు చెందిన ఫార్–రైట్ సెనేటర్ పాలిన్ హన్సన్. బహిరంగ ప్రదేశాల్లో ముస్లింల బురఖా ధారణపై నిషేధం విధించాలన్న డిమాండ్ను వినిపించడానికి.. ఆమె ఏకంగా బురఖానే ఒక రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకోవడం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం జరిగిన ఈ సంఘటన ఆస్ట్రేలియా రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపింది. ముమ్మాటికీ జాత్యహంకారమే.. హన్సన్ చర్యపై సభలోని ఇతర సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యూ సౌత్వేల్స్కు చెందిన గ్రీన్స్ సెనేటర్, ముస్లిం మహిళ మెహ్రీన్ ఫరూకీ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ‘ఇది పచ్చి జాత్యహంకారం. ఒక సెనేటర్ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడం దారుణం’.. అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్రన్ ఆ్రస్టేలియాకు చెందిన స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమాన్ కూడా హన్సన్ తీరును అవమానకర చర్యగా అభివరి్ణంచారు. ముక్తకంఠంతో ఖండన హన్సన్ చర్యను అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ముక్తకంఠంతో ఖండించాయి. సెనేట్లో లేబర్ ప్రభుత్వ నాయకురాలు పెన్నీ వాంగ్ స్పందిస్తూ.. ‘ఇది ఆ్రస్టేలియా సెనేట్ సభ్యురాలికి తగని పని’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బురఖా తీయడానికి నిరాకరించిన హన్సన్ను సస్పెండ్ చేయాలని ఆమె తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష కూటమి డిప్యూటీ లీడర్ అన్నే రస్టన్ కూడా హన్సన్ చర్యలను తప్పుబట్టారు. గతంలోనూ ఇదే రచ్చ.. ఆసియా నుంచి వలసలు, శరణార్థుల రాకను తీవ్రంగా వ్యతిరేకించే హన్సన్, 1990ల నుంచే తనదైన వివాదాస్పద శైలితో వార్తల్లో నిలుస్తున్నారు. ఇస్లామిక్ దుస్తులపై ఆమె పోరాటం కొత్తేమీ కాదు. 2017లో కూడా ఆమె ఇలాగే బురఖా ధరించి పార్లమెంటుకు వచి్చ, జాతీయ స్థాయి నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే పంథాను ఎంచుకున్నారు. బ్యాన్ చేస్తారా?.. నన్ను భరిస్తారా? ఈ హైడ్రామా అనంతరం హన్సన్ ఫేస్బుక్లో ఒక ప్రకటన విడుదల చేశారు. తన బిల్లును సెనేట్ తిరస్కరించినందుకే ఈ నిరసన చేపట్టానని ఆమె స్పష్టం చేశారు. ‘పార్లమెంటు ఈ వ్రస్తాన్ని నిషేధించకపోతే, మహిళలపై అణచివేతకు, జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే ఈ రాడికల్ వ్రస్తాన్ని నేను సభలోనే ప్రదర్శిస్తాను. అప్పుడే ప్రతి ఆ్రస్టేలియన్కు దీని తీవ్రత అర్థమవుతుంది’.. అని స్పష్టం చేశారు. ‘నేను దీన్ని ధరించడం మీకు ఇష్టం లేకపోతే.. బురఖాను బ్యాన్ చేయండి’.. అని ఆమె సవాల్ విసిరారు.
శని వలయాలు ‘కనిపించుట’ లేదు!
శని. అందమైన వలయాలతో సౌరకుటుంబం మొత్తంలోనూ అత్యంత ప్రత్యేకంగా కన్పించే గ్రహం. అది కాస్తా తాజాగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. అంటే మరేమీ లేదు. శని గ్రహం చుట్టూ అందంగా చుట్టుకుని కన్పించే వలయాలు దాదాపుగా ‘మటుమాయం’అయిపోతున్నాయి! ఆదివారం రాత్రి వినువీధిలోకి విహంగవీక్షణం చేసిన ఔత్సాహికులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం కొట్టొచ్చినట్టుగా కన్పించి ఆశ్చర్యపరిచింది. అయితే అంతమాత్రాన శని గ్రహానికి నిజంగానే ఏదో ‘శని’దాపురించిందని మనమెవరమూ ఆందోళన పడాల్సిన పనేమీ లేదట! ఎందుకంటే దాని వలయాలు నిజానికి ఎటూ మాయం కాలేదని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ‘‘అది కేవలం మన దృక్ భ్రాంతి మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం శని భూమికి ఏటవాలు కోణంలో ఉంది. దాంతో దాని తాలూకు వలయాలు భూమి నుంచి కన్పించడం తాత్కాలికంగా దాదాపు అసాధ్యంగా మారింది. మరీ ముఖ్యంగా ఔత్సాహికులు ఉపయోగించే చిన్నాచితకా టెలిస్కోపుల సాయంతో వాటిని చూడటం కనాకష్టం’’అని వారు వివరించారు. ‘రింగ్’క్రాసింగ్! ప్రస్తుతం భూమి నుంచి చూస్తే శని వలయాలు మాయమైనట్టు కన్పించేందుకు రింగ్ ప్లేన్ క్రాసింగ్గా పేర్కొనే అరుదైన దృగ్విషయమే కారణమట. ఈ సమయంలో భూమి సరిగ్గా శని గ్రహం తాలూకు వలయాల తలానికి సమాంతరంగా పయనిస్తుందని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. దాంతో ఈ సమయంలో భూమి నుంచి చూస్తే ఆ వలయాలు పైనుంచో, కిందినుంచో కాకుండా సరిగ్గా ఒక పక్కనుంచి మాత్రమే కన్పిస్తాయి. దాంతో అవక్కడ లేవనే అనిపిస్తుంది. అదీ సంగతి! ఎంత రింగ్ క్రాసింగ్ ప్రభావమైనా సరే, అంత పెద్ద శని గ్రహాన్ని పాముల మాదిరిగా చుట్ట చుట్టుకుని ఉండే అందాల వలయాలు కన్పించకుండా పోవడం ఏమిటని అనిపించడం సహజమే. కాకపోతే అందుకు సహేతుకమైన కారణం కూడా లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘శని వలయాలు ఏకంగా 2.8 లక్షల కిలోమీటర్ల వ్యాసంతో కూడుకుని ఉంటాయి. కానీ అంతా చేస్తే వాటి మందం మాత్రం కేవలం కొన్ని పదుల మీటర్లే! పైగా ఈ దశలో వాటినుంచి భూమికేసి వెలువడే సూర్యరశ్మి కూడా అత్యంత స్వల్పం. వెరసి సుదూరంలో ఉన్న మన భూ గ్రహం నుంచి వాటిని సమాంతరంగా, అంటే ఒక పక్కగా చూసినప్పుడు దాదాపుగా కన్పించవు. దాంతో అవసలు లేవనే అన్పిస్తుంది’’అని వివరించారు. సమాన వంపు కోణం! శని అక్షం కూడా భూ అక్షం మాదిరిగానే సరిగ్గా 26.7 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటుంది. దీనికి తోడు సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు శనికి ఏకంగా 29.4 ఏళ్లు పడుతుంది. దాంతో రెండు గ్రహాల పరిభ్రమణ క్రమంలో భూమి నుంచి మనం శని వలయాలను చూసే కోణం విపరీతంగా మారుతూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్నేళ్ల పాటు అవి సాధారణ టెలిస్కోపుల నుంచి కూడా మనకు కొట్టొచ్చినట్టుగా కనువిందు చేస్తాయి. కాకపోతే ప్రతి 13 నుంచి 15 ఏళ్లకోసారి మాత్రం కొంతకాలం పాటు ఇలా అసలు కన్పించకుండా పోతాయి. అసలున్నాయా, లేవా అనిపిస్తాయి. ఈ ఏడాది మార్చి 23న తొలిసారి రింగ్ప్లేన్ క్రాసింగ్ జరిగింది. కానీ అది ఉదయం పూట కావడంతో భూమి నుంచి దాదాపుగా కన్పించకుండాపోయింది. తాజాగా ఆదివారం మాత్రం ఈ పరిణామం సాయం సమయంలో జరగడంతో అందరికీ కనువిందు చేసిందన్నమాట. మరో ఐదేళ్లకల్లా, అంటే 2030 నాటికి శని వలయాలు భూమి నుంచి ఎప్పట్లా మళ్లీ పూర్తిస్థాయిలో కనువిందు చేయనున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
ట్రంప్, జిన్పింగ్ మాటామంతి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్పింగ్ సోమవారం ఉదయం ఫోన్లో మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంతోపాటు తైవాన్, ఉక్రెయిన్ వ్యవహారాలపై వారిద్ద రూ చర్చించుకున్నట్లు అమెరికా, చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నెల రోజుల క్రితం దక్షిణ కొరియాలోని బుసాన్లో ట్రంప్, జిన్పింగ్ కలుసుకున్నారు. ఇంతలోనే మరో సారి వారు చర్చించుకోవడం గమనార్హం. తైవాన్ విషయంలో చైనా వైఖరిని జిన్పింగ్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారని సమాచారం. తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని ఆయన ట్రంప్కు స్పష్టంచేశారు.
జాతీయం
లాలూ కుటుంబానికి వరుస షాకులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఘోర ఓటమి నుంచి తేరుకోక ముందే ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఇంటి పోరుతో సతమతమవుతున్న తరుణంలో.. ఇప్పుడు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలనే నోటీసులు ఆ ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది.తిరిగి అధికారంలోకి వచ్చిన నితీశ్ ప్రభుత్వం.. లాలూ కుటుంబానికి ఊపిరి సలపనివ్వడం లేదు. ఆయన సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి పట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని నోటీసులు జారీ చేసింది. గత 20 ఏళ్లుగా లాలూ కుటుంబం ఈ బిల్డింగ్లోనే ఉంటోంది. ఆర్జేడీ కార్యకలాపాలు, కీలక సమావేశాలు, ప్రెస్మీట్లు వగైరా.. ఈ బంగ్లా నుంచే నిర్వహించేవారు. ఈ పరిణామంపై లాలూ తనయ రోహిణి ఆచార్య స్పందించారు. సుశాసన్ బాబు(నితీశ్ కుమార్ను ఉద్దేశిస్తూ..) ప్రభుత్వం లాలూ కుటుంబాన్ని అవమానించడంపైనే దృష్టిసారించినట్లు కనిపిస్తోందని ఓ ట్వీట్ చేశారు. బంగ్లా నుంచి బయటకు పంపినా.. బిహారీల గుండెల్లోంచి లాలూను బయటకు పంపించలేరని అన్నారామె. ఈ క్రమంలో.. ఆయన హోదా, వయసుకైన ప్రభుత్వం గౌరవం ఇస్తే బాగుండేదేమో అని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ఇది రబ్రీదేవికే పరిమితం కాలేదు. లాలూ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ను కూడా ఎం స్ట్రాండ్ రోడ్ బంగ్లా 26లోని బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు పంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ప్రస్తుతం ఈ నివాసంలోనే ఉంటున్నాడు. తాజాగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్లోని మంత్రి లకేంద్ర కుమార్ రోషన్కు ఆ బంగ్లా కేటాయించినట్లు సమాచారం. రాజకీయ పరాజయం, కుటుంబ అంతర్గత విభేదాలు, ఇప్పుడు నివాస సమస్య.. వెరసి మూడు కలసి యాదవ్ కుటుంబాన్ని కుదిపేస్తున్నాయి. ఆర్జేడీ నేతలు దీనిని నోటీసుల వ్యవహారాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నారు. బీజేపీ మాత్రం ఆ విమర్శను తోసిపుచ్చుతోంది. లాలూ కుటుంబం బంగ్లాను ఖాళీ చేయాల్సిందేనని.. తమ ప్రభుత్వం ఆ పని చేసి తీరుతుందని అంటోంది. అధికార వర్గాలు మాత్రం "నిబంధనల ప్రకారం" ఈ చర్య తీసుకున్నామని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అధికారి శివ్రంజన్ స్పందిస్తూ.. రబ్రీదేవి ప్రస్తుతం ఉన్న హోదా ప్రకారం వేరే కేటగిరీ బంగ్లా కేటాయించినట్లు స్పష్టత ఇచ్చారు. కొత్తగా హార్డింగ్ రోడ్లోని 39 నంబర్ సెంట్రల్ పూల్ బంగ్లాను ఆమెకు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె బిహార్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ నేతృత్వంలో బిహార్ ప్రభుత్వం తాజాగా కొలువుదీరింది. ఇందులో.. 13 మంది మంత్రులకు అధికారిక బంగ్లాలను కేటాయిస్తున్నారు. లాలూ పెద్ద కొడుకు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలను(ప్రియురాలితో ఉన్న ఫొటోను) నెట్టింట పెట్టి పార్టీ పరువు తీశారని ఆర్జేడీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. సొంతంగా పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడారాయన. ఈ క్రమంలో ఇప్పుడు అధికారిక బంగ్లాను సైతం ఖాళీ చేయాల్సి రావడం గమనార్హం. మరోవైపు.. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, అవమానాలు, సోదరుడు తేజస్వి యాదవ్తో విబేధాల నేపథ్యంతో రాజకీయాలకు రోహిణి ఆచార్య గుడ్బై చెప్పారు. అంతేకాదు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా కుటుంబానికి కూడా దూరంగా ఉంటానని ప్రకటించారామె.
రాజ్యాంగానికి రూపం ఇచ్చిన మహానుభావులు
భారత రాజ్యాంగం అంటే కేవలం డా. బి.ఆర్. అంబేద్కర్ పేరు మాత్రమే కాదు. ఆయనను "రాజ్యాంగ శిల్పి"గా గుర్తించినా, రాజ్యాంగ రూపకల్పన వెనుక పలువురు మేధావుల కృషి ఉంది. స్వాతంత్య్రానంతరం దేశానికి దిశానిర్దేశం ఇచ్చిన ఈ మహత్తర పత్రం.. అనేక మంది నాయకులు, న్యాయవేత్తలు, పండితులు, స్వాతంత్ర్య సమరయోధుల కలయికతో రూపుదిద్దుకుంది.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్: అంబేద్కర్ రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీ (Drafting Committee)కి ఛైర్మన్గా వ్యవహరించారు. దాదాపు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల పాటు సాగిన రాజ్యాంగ రచన ప్రక్రియకు ఆయన మార్గదర్శకత్వం వహించారు.డా. రాజేంద్ర ప్రసాద్డా. రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయన కేవలం సమావేశాలకు అధ్యక్షత వహించడమే కాకుండా, భిన్నాభిప్రాయాలున్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడానికి, సభ చర్చలను క్రమబద్ధంగా, సమర్థవంతంగా నడిపించడానికి అపారమైన సమన్వయ నైపుణ్యాలను ప్రదర్శించారు. సభ గౌరవం, నిష్పాక్షికతను కాపాడారు.తొలి రాష్ట్రపతి: రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత, ఆయన 1950 నుండి 1962 వరకు భారతదేశ మొదటి రాష్ట్రపతిగా పనిచేశారు.జవహర్లాల్ నెహ్రూలక్ష్యాల తీర్మానం (Objectives Resolution): నెహ్రూ 1946 డిసెంబర్ 13న ప్రవేశపెట్టిన ఈ 'లక్ష్యాల తీర్మానం' భారత రాజ్యాంగానికి తాత్త్విక పునాదిగా పరిగణిస్తారు. ఇది రాజ్యాంగ రూపకల్పనకు మార్గనిర్దేశం చేసే ఒక దార్శనిక ప్రకటన.ముఖ్య విలువలు: ఈ తీర్మానం భారతదేశాన్ని సార్వభౌమ, స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. ఇది భారత ప్రజలకు న్యాయం, సమానత్వం, స్వాతంత్ర్యం వంటి హామీలను ఇచ్చింది మైనారిటీలు, వెనుకబడిన ప్రాంతాలు, అణగారిన వర్గాలకు తగిన రక్షణను అందిస్తామని పేర్కొంది. ఈ తీర్మానమే ఆధునిక రాజ్యాంగంలో ప్రతిబింబించింది.సర్దార్ వల్లభభాయి పటేల్ప్రిన్స్లీ స్టేట్స్ ఏకీకరణ: స్వాతంత్ర్యం తరువాత, దాదాపు 565 స్వదేశీ సంస్థానాలను (Princely States) భారత యూనియన్లో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ పాత్ర కీలకమైనది. ఆయన దృఢ సంకల్పం, దౌత్యం, వ్యూహాత్మక చర్యల ద్వారా ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తిచేసి, ఆధునిక భారతదేశ రాజకీయ ఏకీకరణకు కారణమయ్యారు.రాజ్యాంగ కమిటీలు: రాజ్యాంగ సభలో ఆయన ప్రాథమిక హక్కులపై ఏర్పాటైన ఉప-కమిటీ, సలహా కమిటీకి అధ్యక్షత వహించారు. పౌరుల హక్కులు, మైనారిటీల రక్షణకు సంబంధించిన నిబంధనలను రూపొందించడంలో ఆయన కృషి ప్రధానమైనదిగా నిలిచింది.కేంద్ర-రాష్ట్ర సంబంధాలు: బలమైన కేంద్రాన్ని సర్దార్ వల్లభభాయి పటేల్ సమర్థించారు. ఇది దేశ సమగ్రతకు, ఐక్యతకు చాలా అవసరమని విశ్వసించారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్విద్య, సంస్కృతి: మౌలానా ఆజాద్ స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేశారు. రాజ్యాంగ రూపకల్పన సమయంలో, ఆయన విద్య , సాంస్కృతిక హక్కులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు.మైనారిటీల హక్కులు: మైనారిటీల హక్కులు, విద్యా హక్కులపై జరిగిన చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగంలో అనుబంధం 29 (మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించడం), అనుబంధం 30 (విద్యా సంస్థలను స్థాపించే, నిర్వహించే మైనారిటీల హక్కు) రూపకల్పనలో ఆయన వాదనలు, సూచనలు ముఖ్యమైనవిగా నిలిచాయి.కే.ఎం. మున్షీరాజ్యాంగ ముసాయిదా కమిటీ (Drafting Committee) లో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశారు. యూనియన్ రాజ్యాంగ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు.మౌలిక హక్కులు: మౌలిక హక్కులు, పౌర స్వేచ్ఛ, రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు (Directive Principles of State Policy - DPSP) తదితర ముఖ్యమైన విభాగాల రూపకల్పనలో ఆయన తన న్యాయపరమైన, రాజకీయ అనుభవాన్ని ఉపయోగించారు. భారత రాజ్యాంగపు పీఠిక (Preamble)లో 'సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర' అనే పదజాలం రూపకల్పనలో ఆయన ప్రభావం ఉంది.అలాడి కృష్ణస్వామి అయ్యర్అలాడి కృష్ణస్వామి అయ్యర్ ఆనాటి రోజుల్లో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన న్యాయవాదులలో ఒకరు. ఈయన కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో కీలక సభ్యుడు.న్యాయ సలహా: ఆయన రాజ్యాంగంలోని నిబంధనలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, చట్టపరమైన నిర్మాణం, వివిధ నిబంధనల చట్టబద్ధత (Legal Validity) పై అమూల్యమైన సలహాలను అందించారు. ఆయన రాజ్యాంగంపు ఫెడరల్ నిర్మాణాన్ని (Federal Structure) బలోపేతం చేయడంలో కృషి చేశారు.జి.వి. మావలంకర్రాజ్యాంగ సభలో ముఖ్య సభ్యుడిగా ఉంటూ, పలు చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు.తొలి లోక్సభ స్పీకర్: రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత, 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన అనంతరం ఆయన తొలి లోక్సభ (భారత పార్లమెంట్ దిగువ సభ) స్పీకర్గా ఎన్నికయ్యారు.బి.ఎన్. రావు (బెనగల్ నరసింగ రావు)బి.ఎన్. రావు రాజ్యాంగ సభకు న్యాయ సలహాదారుగా (Constitutional Advisor) పనిచేశారు. ఆయన ఎన్నికైన సభ్యుడు కాదు. కానీ ఆయన అందించిన సలహాలు రాజ్యాంగ రూపకల్పనకు అత్యంత ముఖ్యమైనవిగా నిలిచాయి.ప్రపంచ రాజ్యాంగాల అధ్యయనం: బి.ఎన్. రావు రాజ్యాంగ ముసాయిదాను తయారుచేయడానికి ముందు, ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను (ముఖ్యంగా ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా) అధ్యయనం చేసి, వాటిలోని ఉత్తమ లక్షణాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి మార్గదర్శకత్వం అందించారు.తొలి ముసాయిదా రూపకల్పన: డ్రాఫ్టింగ్ కమిటీ డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన తుది ముసాయిదాను తయారుచేయడానికి ముందు, బి.ఎన్. రావు రాజ్యాంగంలోని ప్రాథమిక ముసాయిదా (First Draft) ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.భారత రాజ్యాంగం ఒకే వ్యక్తి కృషి కాదు. అది సమిష్టి మేధస్సు, సమిష్టి త్యాగం. అంబేద్కర్ శిల్పి అయితే, రాజేంద్ర ప్రసాద్ దానికి రూపకల్పన చేసిన అధ్యక్షుడు, నెహ్రూ దానికి తాత్త్విక పునాది వేసినవాడు, పటేల్ దానికి రాజకీయ సమాఖ్యను ఇచ్చారు. మున్షీ, ఆజాద్, అలాడి, మావలంకర్ వంటి అనేక మంది నాయకులు రాజ్యాంగ రూపకల్పనలో తమదైన ముద్ర వేశారు.ఇది కూడా చదవండి: నేడు రాజ్యాంగ దినోత్సవం
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్ రస్తోగి
బ్లూ డ్రమ్.. ఈ పేరు వింటేనే భర్తల వెన్నులో వణకు పుడుతోంది. అందుకు కారణం.. మీరట్లో జరిగిన ఓ ఘటన. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను ప్రియుడి సాయంతో గంజాయి మత్తులో కిరాకతంగా హతమార్చింది ఓ భార్య. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే.. భర్త సౌరభ్ రాజ్పుత్ (మర్చంట్ నేవీ ఆఫీసర్)ను అత్యంత కిరాతకంగా కడతేర్చిన ముస్కాన్ రస్తోగి మళ్లీ తల్లైంది. ఆదివారం సాయంత్రం మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సయమంలో ముస్కాన్ ప్రియుడు, ఈ కేసు సహ నిందితుడు సాహిల్ శుక్లా కూడా పక్కనే ఉన్నాడు. ఒకవేళ ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్ఏ పరీక్షల్లో తేలితే.. తమ మనవడిగా స్వీకరిస్తామని సౌరబ్ కుటుంబం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.మీరట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బ్లూ డ్రమ్ హత్యకేసు మరోసారి వార్తల్లో నిలిచింది. భర్త సౌరభ్ రాజ్పుత్ను క్రూరంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టైన ముస్కాన్ రస్తోగి, ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఆమె.. ఆదివారం సాయంత్రం జైలు అధికారుల పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ప్రియుడు సాహిల్ శుక్లా మోజులో పడి భర్త సౌరభ్ గుప్తను హత్య చేయించిన కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ముస్కాన్ రస్తోగి అరెస్టు సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. గర్భధారణ చివరి దశకు చేరుకోవడంతో, భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెను మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు.ముస్కాన్ సాధారణ ప్రసవం ద్వారా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రసవం అనంతరం, భద్రతా కారణాల వల్ల వారిని ప్రత్యేక వార్డులో ఉంచారు. ఈ కేసు 2024లో వెలుగులోకి వచ్చింది.సౌరభ్ రాజ్పుత్ హత్య అనంతరం, అతని శవాన్ని బ్లూ డ్రమ్లో నింపి మాయం చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు విచారణలో ముస్కాన్ రస్తోగి, ఆమె స్నేహితుడు సహా పలువురిని అరెస్టు చేశారు. శిశువు భవిష్యత్తుపై చర్చ ముస్కాన్ జైలులో శిశువుకు జన్మనివ్వడంతో, బిడ్డను ఎక్కడ ఉంచాలి? ఎవరు చూసుకుంటారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చట్టం ప్రకారం, మహిళా ఖైదీలు తమ పిల్లలను ఆరు సంవత్సరాల వయస్సు వరకు జైలులోనే ఉంచుకునే అవకాశం ఉంది. ముస్కాన్ రస్తోగిపై హత్య, శవాన్ని మాయం చేయడం, కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రసవం అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించే ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రతి విద్వేష ప్రసంగాన్నీ పట్టించుకోలేం: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో జరిగే ప్రతి విద్వేషపూరిత ప్రసంగం కేసును పర్యవేక్షించడానికి, ఉత్తర్వులివ్వడానికి తాము సిద్ధంగా లేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకోసం చట్టపరమైన చర్యలు, పోలీస్స్టేషన్లు, హైకోర్టులు ఉన్నాయని తెలిపింది. ఒక వర్గాన్ని ఆర్థికంగా బహిష్కరించాలంటూ ఆన్లైన్ వేదికగా వస్తున్న విజ్ఞాపనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్పై మంగళవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. దేశంలో ఏదో ఒక మూల జరిగే ప్రతి చిన్న సంఘటనను తాము పరిశీలించలేమని తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే ఇతర ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయంది. ‘ఈ ఫిర్యాదుపై ముందుగా అధికారుల వద్దకు వెళ్లండి. వారు చర్యలు తీసుకోనివ్వండి. స్పందించని పక్షంలో సంబంధిత హైకోర్టుకు వెళ్లండి’అని పిటిషనర్కు సూచించింది. ప్రజా ప్రయోజన సంబంధమైన అంశం కాకుంటే హైకోర్టులు తగు రీతిలో స్పందిస్తాయని తెలిపింది. భాగల్పూర్ హింస, బిహార్లో ఎస్ఐఆర్కు సంబంధించి చేసిన విద్వేష వ్యాఖ్యలపై డిసెంబర్ 9వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.కస్టోడియల్ మరణాలను ఉపేక్షించంకస్టడీలో ఉన్న వారిని చిత్ర హింసలకు గురిచేయడం, వారి ప్రాణాలను హరించడం పోలీసు వ్యవస్థపై మాయని మచ్చ అని, ఇలాంటి చర్యలను జాతి సహించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీస్స్టేషన్లలో సీసీటీవీలు పనిచేయకపోవడంపై దాఖలైన సుమోటో కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పైవ్యాఖ్య చేసింది. వీటిని ఎవరూ సమర్థించడం లేదంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొనగా ..మరైతే ఇప్పటి వరకు తగు విధంగా అఫిడవిట్ను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఈ విషయాన్ని కేంద్రం చాలా తేలిగ్గా ఎందుకు తీసుకుంటోందని నిలదీయగా మూడు వారాల్లో అఫిడవిట్ వేస్తామని తుషార్ మెహతా బదులిచ్చారు. రాజస్తాన్లో 2025లో మొదటి 8 నెలల కాలంలో 11 కస్టడీ మరణాలు సంభవించడంపై ప్రచురితమైన కథనాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతుండటం తెల్సిందే. సీఐబీ, ఈడీ, ఎన్ఐఏలు సహా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని 2020లో జారీ చేసిన ఉత్తర్వులపై 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే స్పందించాయని అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే ధర్మాసనానికి వివరించారు. ఇందులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవడంపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, తదుపరి విచారణ జరిగే డిసెంబర్ 16 కల్లా కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు అఫిడవిట్లు వేయాలని ఆదేశించింది. లేకుంటే కేంద్ర దర్యాప్తు విభాగాల చీఫ్లు సహా వివరణతో అందరూ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.వేధింపులపై ఎన్సీపీసీకి వెళ్లండిదేశవ్యాప్తంగా నడిచే ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్) స్కూళ్లలో లైంగిక వేధింపులపై ఫిర్యాదులను నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్(ఎన్సీపీసీ) ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్లలోని చిన్నారుల హక్కుల కమిషన్లనూ ఆశ్రయించవచ్చని తెలిపింది. వారు తగు రీతిలో చర్యలకు ఆదేశిస్తారని సూచించింది. ఇస్కాన్ విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయంటూ రజ్నీశ్ కపూర్ తదితరులు వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్ల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇస్కాన్ సీనియర్ నాయకులు 200 మందికి పైగా చిన్నారులపై లైంగిక, భౌతిక, మానసిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని పిటిషనర్లు తెలిపారు. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఎన్ఆర్ఐ
ఫీనిక్స్లో సాంస్కృతిక వేడుకలు.. శంకర నేత్రాలయ యూఎస్ఏకు భారీ విరాళం
మెసా(అరిజోనా): ఫీనిక్స్లోని భారతీయ యువత ఆధ్వర్యంలో మెసా ఆర్ట్స్ సెంటర్లోని వర్జీనియా జి. పైపర్ రిపర్టరీ థియేటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, హాస్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సేవా సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుక ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ నిర్వహించే గ్రామ దత్తత కార్యక్రమం కోసం 1,45,000 డాలర్లు విరాళంగా సమీకరించబడ్డాయి.“డాన్స్ ఫర్ విజన్” కార్యక్రమంలో 160 మంది యువ కళాకారులు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల నృత్య రూపకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. యువ నాయకులు యోగాంశ్, విశాల్, జోషిత, ఆదిత్య తదితరులు సమర్థంగా కార్యక్రమాన్ని నడిపారు. మహిళా కమిటీ సమన్వయంతో నిర్వహణ విజయవంతమైంది. నృత్య గురువులకు సన్మాన పతకాలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.దాతలకు సన్మానంగ్రామ దత్తత కార్యక్రమానికి ముఖ్యంగా పది మంది దాతలు తమ విరాళాలతో మద్దతు అందించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. వారి సేవా దృక్పథం, అరిజోనా బృందం సమిష్టి కృషికి పలువురు అభినందనలు తెలిపారు.హాస్యంతో హృదయాల హరివిల్లు“విజన్ కోసం నవ్వులు” పేరుతో రామ్కుమార్ నిర్వహించిన తమిళ స్టాండ్అప్ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కార్యక్రమం అనంతరం ఆయన అభిమానులతో ఫొటోలు దిగారు, శాలువా, సత్కార పతకంతో సన్మానితులయ్యారు.శంకర నేత్రాలయ సేవా లక్ష్యం1978లో ప్రారంభమైన శంకర నేత్రాలయం, గ్రామీణ భారతదేశంలో కంటి చికిత్స అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1988లో స్థాపితమైన శంకర నేత్రాలయ యూఎస్ఏ, మెసు ద్వారా మొబైల్ నేత్ర శిబిరాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.నిర్వాహకుల కృషివంశీ కృష్ణ ఇరువారం, ఆది మోర్రెడ్డి, శ్రీని గుప్తా, డాక్టర్ రూపేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, గాయకులు, నృత్య పాఠశాలలు అందరూ తమదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా.. టికెటింగ్, ప్రచారం, ఫోటోగ్రఫీ, ఫ్లయర్ రూపకల్పన వంటి విభాగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా, పాల్గొన్నవారందరికీ భోజన పెట్టెలు అందజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు.
శ్రీ శ్రీ రవిశంకర్కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు
బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలతోఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి.
ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు.
బహ్రెయిన్లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
క్రైమ్
అత్తింటి వేధింపులకు అల్లుడు బలి
వెల్దుర్తి(తూప్రాన్): భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ (32)కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన పూజతో సుమారు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. వివాహం అయినప్పటినుంచి వేరుకాపురం పెట్టాలని భార్య, అత్తమామలు ఒత్తిడి తెచ్చారు.ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు కావడంతో తరచూ కూతురును తీసుకొని పూజ తన పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలోనే ఈ నెల 2న పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా అందరి సమక్షంలోనే తన కుమారుడిని దుర్భాషలాడి, పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని రెచ్చగొట్టారని ఆరోపించారు. పంచాయితీ అనంతరం పూజ కూతురుతో వెల్దుర్తిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది.ఈ క్రమంలో హరిప్రసాద్ ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తారింటిముందు పురుగులమందు తాగా డు. చుట్టుపక్కల వారి సాయంతో కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. తన కుమారుడి మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్లతో పాటు బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కారణమంటూ మృతుడి తండ్రి మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ట్రెయినీ ఎస్ఐ తెలిపారు.
రోడ్డు లేక.. ఫోన్ సిగ్నల్ రాక..
ఉట్నూర్ రూరల్: రోడ్డు సౌకర్యం లేక, ఫోన్ సిగ్నల్స్ రాక ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. ప్రసవంకోసం ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా వాహనం సహకరించకపోవడంతో అతికష్టంగా తిరిగి గ్రామానికి చేరుకుని కవలలకు జన్మనిచి్చంది. అయితే పుట్టిన శిశువు తో ఆమె కూడా ప్రాణాలు వదిలింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉ ట్నూర్ మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాజులమడుగు గ్రామానికి చెందిన గిరిజన మహిళ జంగుబాయి (37)కి సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. రోడ్డు సౌకర్యం, మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆటోలో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో ఆటో చెడిపోయింది. తిరిగి ఆ మహిళను గ్రామానికి తరలించారు. అప్పటికే నొప్పులు ఎక్కువై ఇద్దరు మగ శిశువులకు జన్మనిచి్చంది. ప్రసవ సమయంలో ఒక శిశువు ప్రాణాలతో ఉండగా మరో శిశువుతో పాటు తల్లి అస్వస్థతకు గురై మృతి చెందింది. ఘటనపై విచారణ జరిపిస్తామని అదనపు డీఎంహెచ్వో మనోహర్ తెలిపారు.
‘మీ ఇల్లు బంగారం గాను..’
గజ దొంగ సినిమాలో గోల్డ్ మ్యాన్ను ఉద్దేశించి ‘మీ ఇల్లు బంగారం గాను..’ అంటూ ఐటెం గర్ల్ ఆడిపాడుతుంది. పైన ఫొటో చూసి అదేదో నగల షాపు దుకాణమో లేదంటే నగల ఎగ్జిబిషన్ అనుకుంటే పొరపడినట్లే..!ఈ కనిపించేది ఓ ప్రభుత్వ అధికారి బంగ్లా. ఇలాంటి బంగ్లాలు ఇలాంటివి ఆయనకు నాలుగైదు ఉన్నాయట. అలాంటి పది మంది అధికారుల ఇళ్లలో తనిఖీలు జరిపితే.. భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, డబ్బు బయటపడ్డాయి..మంగళవారం కర్ణాటక యాంటీ కరప్షన్ ఏజెన్సీ లోకాయుక్త జరిపిన తనిఖీల్లో విస్తుపోయే ఈ దృశ్యాలు కనిపించాయి. లోకాయుక్త అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో రంగంలోకి దిగారు.బెంగళూరు, మైసూరు, మాండ్య, బీదర్, ధారవాడ, హవేరి, శివమొగ్గ, దావణగెరెలో ఈ తనిఖీలు జరిగాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ D.M. గిరీష్, మాండ్య టౌన్ ప్లానింగ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ C. పుట్టస్వామి, బీదర్ అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ప్రేమ్ సింగ్, మైసూరు హూటగల్లి మునిసిపాలిటీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ C. రామస్వామి, ధారవాడ కర్ణాటక యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుభాష్ చంద్ర, హవేరి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేకప్ప, బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ RTO ఆఫీస్ సూపరింటెండెంట్ P. కుమారస్వామి, శివమొగ్గ SIMS మెడికల్ కాలేజ్ FDA నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. కోట్ల విలువైన ఆస్తి పత్రాలు.. పెద్ద మొత్తంలో నగదు.. బంగారు ఆభరణాలు.. విలాసవంతమైన బంగ్లాలు ఉన్నట్లు తేలింది. అయితే తనిఖీలు పూర్తయ్యాకే పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు ప్రకటించారు.
వామ్మో..తృటిలో తప్పించుకున్నాడు, లేదంటే!
UP cyclist miraculous escape ఉత్తరప్రదేశ్లోని ఎటావాలో జరిగిన ఒకరోడ్డు ప్రమాద ఘటన నెట్టింట వైరల్గా మారింది. ప్రైవేట్ బస్సు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడే నిలబడి ఉన్న సైక్లిస్ట్ ఒకరు తృటిలోప్రాణా పాయం నుంచి తప్పించుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.ఎటావా నుండి మెయిన్పురి వైపు వెళ్తున్న బస్సు, అదుపు తప్పి మదర్ డెయిరీ ప్లాంట్ ప్రధాన గేటును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో దాదాపు డజను మంది ప్రయాణికులు గాయపడ్డారు , బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే అప్పుడే కొన్ని అడుగుల దూరం నుంచి వచ్చిన సైక్లిస్ట్, చివరి క్షణంలో తనవైపు దూసుకొస్తున్న బస్సును గుర్తించి చాకచక్యంగా పక్కకు తప్పుకున్నాడు. దీంతో అతడు దాదాపు చావు నుంచి తప్పించుకున్నాడు. ఈ భూమ్మిద నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో అంటూ అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టాప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బస్సు ముందు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్లు వేయడంతో, బస్సు డ్రైవర్ను కారును ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు నేరుగా మదర్ డైరీ గేటులోకి దూసుకెళ్లింది. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో దాదాపు డజను మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు , పోలీసులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి, గాయపడిన వారిని చికిత్స కోసం సైఫాయి మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. అధికారులు బస్సును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిర్ల[node:field_tags]క్ష్యం , అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి. బస్సు డ్రైవర్ను ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. यूपी -जिला इटावा में प्राइवेट बस बेकाबू होकर मदर डेयरी की दीवार से टकराई। 2 सिक्योरिटी गार्ड और 33 यात्री घायल हुए।साइकिल वाला : 'इसे कहते हैं मौत को छूकर टक से वापस आना' pic.twitter.com/9BtBfymaYv— Sachin Gupta (@SachinGuptaUP) November 24, 2025
వీడియోలు
బాస్కెట్ బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ.. నేషనల్ ప్లేయర్ దుర్మరణం
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మారువేషంలో వచ్చి ఆకస్మిక తనిఖీ చేసిన సూపరింటెండెంట్
సల్మాన్ ఖాన్ రంజాన్ సెంటిమెంట్.. మళ్లీ మ్యాజిక్ జరుగుతుందా?
వెళ్తూ వెళ్తూ బాబుపై జగన్ అదిరిపోయే లాస్ట్ పంచ్
Kadapa Tour: చంద్రబాబుపై జగన్ పంచులు..
బాబు సర్కార్ కు బిగ్ షాక్.. మద్యం కేసులో ఆ ముగ్గురికి ఊరట
YS Jagan: చంద్రబాబు ఉ కొట్టడం ABN, TV5 లు డప్పులు
లైవ్ లో జగన్ ముందే చంద్రబాబుపై రెచ్చిపోయిన రైతన్న
అరటి రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
నువ్వసలు మనిషివేనా? రైతుల ఉసురు కొట్టుకొని పోతావ్!

