మంగళగిరిలో టిఫిన్.. తిరుపతిలో లంచ్.. హైదరాబాద్లో డిన్నర్
సాక్షి టాస్క్ ఫోర్స్: డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతి జిల్లా పర్యటన వన్మ్యాన్ షోలా సాగింది. ఎక్కే విమానం.. దిగే విమానం.. అన్నట్లు తన రెండు రోజుల పర్యటనను బిజీబిజీగా ప్లాన్ చేసుకున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్.. రోడ్డు మార్గాన మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లారు. వాచ్ టవర్ ఎక్కి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం తిరుపతి మంగళంలోని గోదాముల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఆ తర్వాత తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశం ఉంటుందని, ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగరాదని సమాచార శాఖ అధికారులు హుకుం జారీ చేశారు. ‘దొంగల నుంచి పట్టుబడ్డ 2.65 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగలు తిరుపతిలోని గోదాములో ఉన్నాయి. వాటి విలువ రూ.2వేల నుంచి రూ.5 వేల కోట్లు ఉంటుంది. పట్టుబడకుండా స్మగ్లింగ్లో తరలిపోయింది చాలా ఉంటుంది. కర్ణాటక రూ.140 కోట్లు సొమ్ము చేసుకుంది. ఎక్కడ ఎర్రచందనం దొరికినా అది ఏపీకే చెందేలా ఒప్పందం జరిగింది. స్మగ్లింగ్కు పాల్పడుతున్న నలుగురు కీలక వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటాం. ఎర్రచందనం జోలికెళితే తాట తీస్తా’ అని పవన్ చెప్పుకొచ్చారు.ఎవరినీ కలవని పవన్.. కాగా, పవన్ వచ్చారని తెలిసి దివ్యాంగులు, రైతులు, జనసేన శ్రేణులు.. పలు సమస్యలపై అర్జీలు తీసుకుని రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి కలెక్టరేట్కు తరలివచ్చారు. అయితే పవన్ ఏ ఒక్కరినీ కలువలేదు. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్చార్జ్ కోట వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కుటుంబ సభ్యులు.. ప్లకార్డులు పట్టుకుని కేకలు వేసి పిలుస్తున్నా పట్టించుకోకుండా ముందుకు సాగారు. రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ఎక్కి హైదరాబాద్కు వెళ్లిపోయారు. కాగా, పవన్ ఆదివారం తిరిగి ప్రత్యేక విమానంలో రేణిగుంట రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో పలమనేరు వెళతారు. అక్కడ కుంకీ ఏనుగులను పరిశీలించి, తిరిగి హెలికాప్టర్లో రేణిగుంటకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లేక గన్నవరం వెళ్లనున్నారని అధికారులు తెలిపారు.
'జూబ్లీ'యేషన్ ఎవరికో!?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజాపాలనకు లేదా బీఆర్ఎస్ను ప్రజలు మళ్లీ ఆదరిస్తే ఆ పార్టీ చెబుతున్న ప్రజావ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచార బరిలోకి సీఎం.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మూడు విడతల్లో ఏకంగా ఆరు రోజులపాటు నియోజకవర్గమంతా చుట్టేయడం ఈ ఉపఎన్నిక తీవ్రతకు అద్దంపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులకు సైతం డివిజన్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారంలో తలమునకలవడం చూస్తే ఈ గెలుపును కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే హైడ్రా చేపట్టిన పేదలు, సామాన్యుల ఇళ్ల కూల్చివేతలు, ఆరు గ్యారంటీల అమల్లో అక్కడక్కడా తలెత్తిన లోపాలు, అర్హులందరికీ రేషన్ కార్డులు పూర్తిస్థాయిలో అందకపోవడం ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్కు ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రియల్టీ రంగం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదని, ప్రభుత్వ బడ్జెట్ పరిమితుల దృష్యా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరగలేదని వారు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ విపక్ష బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికులకు కొన్నేళ్లుగా చిరపరిమితుడు కావడం.. గతంలోనూ పోటీ చేసి ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. అలాగే సుమారు 30 శాతం ఉన్న ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం, మజ్లిస్ మద్దతిస్తుండటం ఆ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజావ్యతిరేకత చాటాలని బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో విపక్ష బీఆర్ఎస్ ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికార కాంగ్రెస్ను ఓడించడం ద్వారా ప్రజావ్యతిరేకతను గట్టిగా చాటేందుకు ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోందని చెబుతున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల కేసీఆర్ పాలనతో పోలుస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ ప్రచారంలో అధిక ప్రాధాన్యం ఇస్తోందని వారు వివరిస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ను తాము చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ప్రచారంలో పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నగరం నలుమూలలా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వడం, బీఆర్ఎస్ హయాంలో సాగిన 42 ఫ్లైఓవర్ల నిర్మాణం, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచిత తాగునీరు ఇవ్వడం, ఆ పార్టీ హయాంలో ఐటీ సంస్థలకు ఇచ్చిన తోడ్పాటు వంటి అంశాలు బీఆర్ఎస్కు ఈ ఎన్నికలో కలిసి వచ్చే అంశాలు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం, ఆయన సతీమణి బరిలో నిలవడం కూడా బీఆర్ఎస్కు ఈ ఎన్నికలో దోహదపడే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. బీజేపీ సైతం ఆశల పల్లకీలో.. ఇక బీజేపీ సైతం ఉపఎన్నికలో సత్తా చాటేందుకు ప్రచారంలో వేగం పెంచింది. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ప్రచారపర్వాన్ని బస్తీల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని.. ఆ పార్టీలను గెలిపించొద్దని కోరుతున్నారు. ప్రధాని మోదీ చొరవతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని.. తమ పార్టీ అభ్యర్థి దీపక్రెడ్డికే పట్టం కట్టాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లలో గెలవడం ద్వారా గతంతో పోలిస్తే పుంజుకున్నామని.. అదే స్థాయిలో ఈ ఉప ఎన్నికలోనూ గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ వర్గం ఓటర్లపై బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోనప్పటికీ ఇతర వర్గాల ఓటర్లంతా ఏకతాటిపైకి వచ్చి తమకు అండగా నిలుస్తారని ఆ పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్ల మౌనం.. పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో మంచిచెడుల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఓటర్లు నిరాకరిస్తున్నారు. ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేమని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరేం చెప్పినా, ఎవరికి ఓటు వేయాలని సూచించినా పోలింగ్ రోజు మనసులో ఉన్న దానిని బట్టి ప్రాధాన్యతలను తేల్చుకుంటామని ఇంకొందరు బస్తీలవాసులు అంటున్నారు. అయితే ఆటో కార్మీకులు, చిరువ్యాపారులు, కూలీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఉందని ఆటో డ్రైవర్లు... రియల్టీ నిదానించడం వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని భవన నిర్మాణ కూలీలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నీ అమలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. దశలవారీగా అయినా రాబోయే రోజుల్లో గ్యారెంటీలు అమలవుతాయనే ఆశాభావం సైతం కొందరిలో కనిపించింది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి అంశాలను బస్తీ ఓటర్లు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కాగా, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రలోభాల పర్వాన్ని మొదలుపెట్టాయి.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు బంధువులను మెప్పిస్తాయి. నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. ఇతరులకు సైతం సాయం అందించేందుకు ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు కొంత నెరవేరతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.వృషభం...కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంత గందరగోళంగా మారి రుణాలు చేస్తారు. కొన్ని పనులను హఠాత్తుగా వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు అనుకోని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల కృషి అంతగా ఫలించదు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.మిథునం....దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణబాధల నుంచి విముక్తి. కుటుంబసభ్యుల ఆదరణ పొందుతారు. కోర్టు విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. వాహనయోగం. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. నేరేడు, నీలం రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.కర్కాటకం...కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని విధుల్లో ముందుకు సాగుతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో కొద్దిపాటి వివాదాలు. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి.సింహం....కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరులతో సఖ్యత. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో మరింత అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు వివాదాలు సర్దుమణుగుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. గులాబీ, నీలం రంగులు. వినాయకునికి అర్చన చేయండి.కన్య...ఆర్థిక పరిస్థితి ఆశాజనంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడతారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన దానికంటే హోదాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఇంటర్వ్యూలు రాగలవు. వారం చివరిలో ధనవ్యయం. కావలసిన వ్యక్తులతో తగాదాలు. పసుపు, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి.తుల...కొన్ని పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఊపిరిపీల్చుకుంటారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.వృశ్చికం...ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ అనుభవాలతో నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సోదరులు, మిత్రుల సహకారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో మరింత సానుకూల వాతావరణం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాల యత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.ధనుస్సు...ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. పనుల్లో మరింత పురోగతి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులు, సన్నిహితులతో విభేదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. భూ, గృహయోగాలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.మకరం....మీ అంచనాలు కొన్ని ఫలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహన, గృహయోగాలు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కుంభం...మీ సమర్థతను చాటుకుని గుర్తింపు పొందుతారు. ఉద్యోగయత్నాలు కొంత సానుకూలమవుతాయి. సంఘంలో ఎనలేని గౌరవం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఊహించని రీతిలో తీరతాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు అందుతాయి. కళాకారులకు ఆటుపోట్లు తొలగుతాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. తెలుపు, గులాబీ రంగులు. విష్ణుధ్యానం చేయండి.మీనం...ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కొన్ని పెండింగ్ బాకీలు సైతం వసూలవుతాయి. మీసేవలు విస్తృతమవుతాయి. బంధువర్గం సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతమైన సమాచారం రాగలదు. వ్యాపారవర్గాలు రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి కొన్ని సమస్యలు. గులాబీ, పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
టిడ్కో ఇళ్ల.. సం‘గతేంటి’ బాబూ?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని లబ్ధిదారులు అందరికీ 2026 జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు అందజేస్తామని ఇటీవల మున్సిపల్శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. అయితే ‘ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.7,280 కోట్లు అవసరం. కూటమి ప్రభుత్వం 18 నెలల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. మరో ఏడు నెలల్లో ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒక్క లబ్ధిదారుకు కూడా ఇల్లు ఇచ్చింది లేదు.జగన్ పూర్తి చేసిన ఇళ్లే దిక్కు..పేదలకు ఇళ్ల విషయంలో పూర్తి వైఫల్యం నేపథ్యంలో పరువు కాపాడుకునేందుకు బాబు సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 90 – 95 శాతం పనులు పూర్తయిన 6 వేల ఇళ్లకు హంగులు అద్ది ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాలంటే తమకు నిధులు ఇవ్వాలని కాంట్రాక్టు సంస్థలు పట్టుబట్టడంతో చేసేది లేక రాజీవ్ స్వగృహ నిధుల నుంచి రూ.200 కోట్లు తీసుకుని కాంట్రాక్టర్లకు చెల్లించినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా బాబు ప్రభుత్వ పాలనకు భిన్నంగా జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లింది. ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరుశాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించడం జరిగింది. మొత్తం 2,62,212 ఇళ్లలో దాదాపు లక్ష ఇళ్లను జగన్ సర్కార్ లబ్ధిదారులకు అందించిన విషయాన్ని మున్సిపల్శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు. జగన్ హయాంలోనే మరో 77,546 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. లబ్ధిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా అక్రమాలకు జగన్ సర్కారు చెక్...ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించి రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించింది. ⇒ చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692 తగ్గించి రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. తద్వారా ఈ ప్రయోజనాన్ని పేదలకు అందించింది. ⇒ నిరుపేదలకు కేటాయించిన 300 చదరపు అడుగుల ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండాపోయింది. ⇒ 365 చదరపు అడుగుల ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. దాంతో రెండు, మూడు కేటగిరీల లబ్ధిదారులకు టీడీపీ లెక్కల ప్రకారం చెల్లించాల్సిన రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్ సర్కారు తగ్గించింది. ⇒ అలాగే గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరల భారాన్ని సైతం జగన్ ప్రభుత్వం తగ్గించింది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే 1,43,600 ఇళ్లలో ఒక్కోఇంటికి రూ.6.55 లక్షలు ఖర్చవగా నిరుపేదలకు పూర్తి ఉచితంగా అందించారు. ⇒ 365 చదరపు అడుగుల ఇంటికి రూ.7.55 లక్షలు ఖర్చవగా, ప్రభుత్వం రూ.4.15 లక్షలు భరించి లబ్ధిదారులకు వారి వాటాగా చెల్లించాల్సిన సొమ్ముకు సంబంధించి రూ.3.40 లక్షల రుణ సదుపాయం కల్పించింది. ⇒ అలాగే రూ.8.55 లక్షలతో నిర్మించిన 430 చ.అడుగుల ఇంటికి జగన్ ప్రభుత్వం రూ.4.15 లక్షలు చెల్లించి లబ్ధిదారు వాటాగా రూ.4.40 లక్షల రుణ సదుపాయం కల్పించింది. బాబు పాలనలో రూ. 8,929.81 కోట్ల దోపిడీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో టిడ్కో ఇళ్ల పేరుతో రూ.8,929.81 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. అన్ని మున్సిపాలిటీల్లో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేయగా, చాలా మున్సిపాలిటీల పరిధిలో స్థలం లభించలేదు. అయితే, భూములు దొరికిన చోట నాడు చదరపు అడుగు నిర్మాణ ధర రూ.1,000 కంటే తక్కువే. అయితే బాబు ప్రభుత్వం మాత్రం కంపెనీలు ఇచ్చిన ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2,034.59 వరకూ నిర్ణయించి కాంట్రాక్టులు కట్టబెట్టింది. సగటున చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,203.45గా చెల్లించారు.అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా ఇచ్చారు. పైగా ఎక్కడా నూరు శాతం ఇళ్లు ఇచ్చింది లేదు. కేవలం 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా నెల్లూరులో ఇళ్లు పూర్తవకపోయినా రంగులు వేసి లబ్ధిదారులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం 2019 మే నాటికి 77,350 ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఇందులో 20 వేల వరకు మాత్రమే 60 శాతం పూర్తి చేశారు.
కోటి దీపోత్సవాన్ని అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తాం
ప్రతి 9 మందిలో ఒకరికి అంటువ్యాధుల లక్షణాలు!
10, 11 తేదీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందం
గంధర్వులను జయించిన భరతుడు
శీతల్దేవికి వైఎస్ జగన్ అభినందనలు
డిజిటల్ ట్రాప్లో టీనేజర్లు
టిడ్కో ఇళ్ల.. సం‘గతేంటి’ బాబూ?
దాని వల్ల సమస్యలా..?
కాకమ్మ అందం
ఒప్పందం లేకుండానే ముగిసిన పాక్–అఫ్గాన్ చర్చలు
నూయార్క్ మేయర్గా మమ్దానీ - ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం
ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు.. వస్తులాభాలు
అఫ్గానిస్తాన్ సంచలనం.. 6 ఓవర్లలో 148 పరుగులు
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
ఈ విషయంలో బాగా నోరు పారేసుకుంటున్నాడు!
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. తప్పిన జ్యోతిషం
నిలబడిన కేఎల్ రాహుల్.. ఆధిక్యంలో టీమిండియా
ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్ చేసిన సాయికిరణ్
లేచి పడిన పసిడి.. తులం ఎంతంటే..
హైకోర్టులో టీవీ5 మూర్తికి చుక్కెదురు
షమీకి సుప్రీంకోర్టు నోటీసులు
‘అందుకే.. సంజూను కాదని జితేశ్ శర్మను ఆడిస్తున్నారు’
బంగారం.. బీకేర్ఫుల్
మన వల్ల ఫెమస్ అయ్యారట ధ్యాంక్స్ చెపుతున్నారు!
కశ్మీర్ లోయలో విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం
AP: ఎంఎస్కే ప్రసాద్కు ఘోర అవమానం
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న బుమ్రా
నన్ను బెదిరించేవాడే లేడన్న భరణి.. మళ్లీ అతడే కెప్టెన్!
కోటి దీపోత్సవాన్ని అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తాం
ప్రతి 9 మందిలో ఒకరికి అంటువ్యాధుల లక్షణాలు!
10, 11 తేదీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందం
గంధర్వులను జయించిన భరతుడు
శీతల్దేవికి వైఎస్ జగన్ అభినందనలు
డిజిటల్ ట్రాప్లో టీనేజర్లు
టిడ్కో ఇళ్ల.. సం‘గతేంటి’ బాబూ?
దాని వల్ల సమస్యలా..?
కాకమ్మ అందం
ఒప్పందం లేకుండానే ముగిసిన పాక్–అఫ్గాన్ చర్చలు
నూయార్క్ మేయర్గా మమ్దానీ - ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం
అఫ్గానిస్తాన్ సంచలనం.. 6 ఓవర్లలో 148 పరుగులు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు.. వస్తులాభాలు
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
ఈ విషయంలో బాగా నోరు పారేసుకుంటున్నాడు!
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. తప్పిన జ్యోతిషం
నిలబడిన కేఎల్ రాహుల్.. ఆధిక్యంలో టీమిండియా
ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్ చేసిన సాయికిరణ్
లేచి పడిన పసిడి.. తులం ఎంతంటే..
హైకోర్టులో టీవీ5 మూర్తికి చుక్కెదురు
షమీకి సుప్రీంకోర్టు నోటీసులు
‘అందుకే.. సంజూను కాదని జితేశ్ శర్మను ఆడిస్తున్నారు’
బంగారం.. బీకేర్ఫుల్
మన వల్ల ఫెమస్ అయ్యారట ధ్యాంక్స్ చెపుతున్నారు!
కశ్మీర్ లోయలో విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం
AP: ఎంఎస్కే ప్రసాద్కు ఘోర అవమానం
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న బుమ్రా
పెద్ది 'చికిరి' బాగుంది.. కానీ, బిగ్ డౌట్
సినిమా
రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
ఈ వారం తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' మాత్రమే ఉన్నంతలో బజ్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ కూడా దక్కించుకుంది. మరి తొలిరోజు దీనితో పాటు రిలీజైన సినిమాల సంగతేంటి? కలెక్షన్స్ ఎంత వచ్చాయని టాక్ వినిపిస్తుంది? ఇంతకీ వీటిలో ఏయే సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' విషయానికొస్తే.. విడుదలకు ముందురోజే ప్రీమియర్స్ వేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలిరోజు వసూళ్లు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అలా దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.1.30 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. చిత్రబృందం మాత్రం తొలిరోజు కంటే రెండో రోజు వచ్చేసరికి నాలుగురెట్ల వసూళ్ల పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేయలేదు. బహుశా వీకెండ్ తర్వాత చేస్తారేమో చూడాలి.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!)మహేశ్బాబు బావమరిది సుధీర్బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. హీరోతో పాటు కొందరు మాత్రమే తెలుగు నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ సబ్జెక్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ దీన్ని రిలీజ్ చేశారు. అయినప్పటికీ తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి కనీస వసూళ్లయినా వస్తాయా అనేది చూడాలి.వీటితో పాటు తిరువీర్ హీరోగా నటించిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ లక్షల్లో మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ప్రేమిస్తున్నా అనే తెలుగు మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందని అంటున్నారు. ఇదొకటి వచ్చిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలీదు. కాబట్టి దీనికి కూడా చాలా తక్కువ వసూళ్లు వచ్చుంటాయి. ఇవి కాకుండా 'ఆర్యన్', 'డీయస్ ఈరే' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే రష్మిక సినిమా మాత్రమే ప్రస్తుతానికి లీడ్లో ఉంది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)
వంటగదిలో నిహారిక.. అను 'గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు
వంటగది వీడియో పోస్ట్ చేసిన నిహారికఇంట్లో పెట్ డాగ్తో నమ్రత హ్యాపీనెస్'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాల్లో అను ఇమ్మాన్యుయేల్హీరోయిన్ మానస వారణాసి అడవిలో షికార్లుఉత్తరాది అమ్మాయిలా మారిపోయిన రాశీఖన్నాఅమ్మకు పుట్టినరోజు విషెస్ చెబుతూ శివానీ View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)
ఆ హీరో హోటల్కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని ..: మీనా
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్గా దక్షిణాది ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. తెలుగులో అప్పటి స్టార్ హీరోలందరితోనూ సినిమాను చేసింది. తమిళ, కన్నడలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉండేది. ఒకనొక దశలో ఒకే రోజు మూడు, నాలుగు సినిమాల షూటింగ్లకు హాజరయ్యేదట. ఇలా తెలుగు,కన్నడ,తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసిన మీనా(Meena).. హిందీలో మాత్రం పర్దా హై పర్దా అనే ఒకే ఒక మూవీ చేసింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా..తాను చేయలేదట. ఓ స్టార్ హీరో అయితే పలుమార్లు తనతో సినిమా చేయమని కోరినా.. చేయలేకపోయానని..ఒకనొక దశలో ఆయన ఉన్న హోటల్కి వెళ్లాలంటే భయపడ్డానని అంటోది మీనా. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ హీరో గురించి, తాను ఎందుకు బాలీవుడ్ సినిమాలు చేయలేకపోయిందో వివరించింది.తినడానికి కూడా టైం లేదు..తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేశాను. అదే సమయంలో నాకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ చేయలేకపోయాను. ఇక్కడే నాకు తినడానికి, నిద్రపోవడానికి కూడా టైమ్ దొరకలేదు. ఇక బాలీవుడ్ సినిమాలు ఎలా చేస్తా. పైగా అక్కడ టైమ్కి షూటింగ్ పూర్తి కాదని చెప్పారు. బాలీవుడ్లో ఒక్క సినిమా చేసేలోపు సౌత్లో నాలుగు సినిమాలు చేయొచ్చని చెప్పారు.అందుకే నేను బాలీవుడ్పై ఫోకస్ చేయలేదు. పర్దా హై పర్దా తర్వాత ఆఫర్స్ వచ్చినా తిరస్కరించా.మిథున్ చక్రవర్తి అలా అడిగేవాడుఅప్పట్లో బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ ఉండేది. సినిమా షూటింగ్స్ అన్నీ అక్కడే జరిగేవి. నా సినిమా షూటింగ్ కోసం అక్కడి వెళ్తే..అదే హోటల్లో ఉండేదాన్ని. అప్పుడు మిథున్ చక్రవర్తి నా దగ్గరకు వచ్చి మరీ..‘నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్’ అని అడిగేవాడు. నాకు చేయాలనే ఉండేది..కానీ డేట్స్ ఖాలీగా ఉండేవి కాదు. నేను వెళ్లిన ప్రతిసారి ఆయన నా గది దగ్గరకు వచ్చి మరీ అడిగేవాడు. నాకేమో డేట్స్ ఖాలీగా ఉండేవి కాదు. ఒకానొక దశలో ఆ హీరో హోటల్కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని. అంత పెద్ద స్టార్ హీరోకి నో చెప్పలేక బాధపడేదాన్ని. ఎప్పుడైనా ఊటీకి వెళితే.. ఆ హోటల్ వద్దు..వేరే హోటల్లో రూమ్ బుక్ చేయమని అడిగేదాన్ని. ఆయనకు నొ చెప్పాలంటే ఏదోలా అనిపించేంది’ అని మీనా చెప్పుకొచ్చింది.
బిగ్బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!
బిగ్బాస్ షోలో వీకెండ్ వచ్చిందంటే చాలు హౌస్ట్ నాగార్జున వచ్చేస్తారు. కాస్త సందడి చేస్తారు. ఈసారి కూడా అలానే 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ, మూవీలో హీరోయిన్-నాగ్ భార్య అమల షోలో సందడి చేశారు. నాగ్-అమల స్టెప్పులు కూడా వేశారు. ఇవన్నీ సరే గానీ వీకెండ్ వస్తే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి బిగ్బాస్కి ఛాన్స్ ఇవ్వకుండా సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)9వ సీజన్లో ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. ఈసారి సంజన, సుమన్ శెట్టి, భరణి, కల్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ నామినేషన్స్లో ఉన్నారు. సేవ్ చేసేందుకు ఓటింగ్ లైన్స్ శుక్రవారం రాత్రి వరకు ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత చివరి స్థానంలో సాయి శ్రీనివాస్ నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీకెండ్ ఇతడు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని అంతా ఫిక్సయ్యారు. సరిగ్గా ఇలాంటి టైంలో ట్విస్ట్. గత కొన్నాళ్ల నుంచి డల్గా ఉన్న రాము.. సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.ఐదోవారం వరకు రాము రాథోడ్ బాగానే బండి లాక్కొచ్చాడు గానీ తర్వాత మాత్రం పూర్తిగా డల్ అయిపోయాడు. నామినేషన్స్లో వాదించట్లేదు, పైపెచ్చు తానే నామినేట్ అవుతానని అంటున్నాడు. మరోవైపు గేమ్స్ వేటిలోనూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంట్లో వాళ్లు గుర్తొస్తున్నారని పదే పదే అంటున్నాడు. శనివారం ఎపిసోడ్లోనూ హౌస్ట్ నాగార్జున ఇదే విషయం అడిగారు. దీంతో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్)'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని రాము దీనంగా చెప్పాడు. ప్రోమోలో డ్రామా చూపించినప్పటికీ నిజంగానే రాము బయటకొచ్చేశాడట. శనివారం ఎపిసోడ్లోనే ఈ సెల్ఫ్ ఎలిమినేషన్ ఉండబోతుంది.ప్రతివారం ఒకే ఎలిమినేషన్ ఉంటుందిగా. రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవడంతో రెగ్యులర్గా జరగాల్సిన ఉంటుందా లేదా అందరూ అనుకుంటున్నారు. అయితే సాయి శ్రీనివాస్ని కూడా పంపిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాలావరకు అయితే రాము మాత్రమే హౌస్ నుంచి బయటకు రావొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: చెల్లి సీమంతం గ్రాండ్గా చేసిన బిగ్ బాస్ వితిక)
న్యూస్ పాడ్కాస్ట్
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
క్రీడలు
సౌతాఫ్రికాను చిత్తు చేసిన పాకిస్తాన్
ఫైసలాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ను పాకిస్తాన్ కైవం చేసుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రోటీస్ జట్టుతో జరిగిన ఐదు వన్డే సిరీస్లలో పాక్కు ఇది నాలుగో విజయం.అబ్రార్ మ్యాజిక్..ఇక నిర్ణయాత్మక వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 37.5 ఓవర్లలో కేవలం 143 పరుగులకే కుప్పకూలింది. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అహ్మద్ తన పది ఓవర్ల కోటాలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కెప్టెన్ షాహీన్ అఫ్రిది, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.ప్రోటీస్ బ్యాటర్లలో ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (72), ప్రిటోరియస్ (57) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని పాక్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 25.1 ఓవర్లలో చేధించింది. పాక్ ఓపెనర్ సైమ్ అయూబ్(77) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా అంతకుముందు టీ20 సిరీస్ను కూడా 2-1 తేడాతో పాక్ కైవసం చేసుకుంది.చదవండి: టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం
'మా కుర్రాళ్లు అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది'
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనను ముగించింది. శనివారం బ్రిస్బేన్ వేదికగా ఆసీస్-భారత్ మధ్య ఐదో టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ సిరీస్ విజయంపై ప్రెజెంటేషన్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. టీ20 సిరీస్ను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని సూర్య తెలిపాడు.మా కుర్రాళ్లు అద్భుతం.."వాస్తవానికి వాతావరణం మన నియంత్రణలోని ఆంశం. కార్బెర్రాలో పూర్తి మ్యాచ్ జరిగి ఫలితం రావాలని కోరుకున్నాము. దురదృష్టవశాత్తూ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయింది. ఆ తర్వాత రెండో టీ20లో ఓటమి పాలైము. అనంతరం బలంగా తిరిగి పుంజుకుని వరుస విజయాలను సాధించాము. ఇందుకు క్రెడిట్ మా కుర్రాళ్లకు ఇవ్వాల్సిందే. జట్టు విజయాల్లో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మేము మెరుగైన ప్రదర్శన చేశాము. బుమ్రా-అర్ష్దీప్ సింగ్లది చాలా ప్రమాదకరమైన కాంబినేషన్. అదేవిధంగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వాషింగ్టన్ సుందర్ ఏ ఫార్మాట్లో నైనా రాణించగలడు. వాషీ లాంటి ఆటగాడు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి టీ20 క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. వారు వ్యూహాలు సరిగ్గా అమలు చేసి జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. మాకు కావలసింది అదే. గుడ్ హెడెక్ ప్రతీ ఒక్కరూ అద్భుతంగా రాణిస్తుందున తుది జట్టు ఎంపిక మాకు గుడ్ హెడెక్ మారింది. ఆస్ట్రేలియాలో మేము మెరుగైన ప్రదర్శన చేశాము. స్వదేశంలో మేము దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్తో రెండు టీ20 సిరీస్లు ఆడనున్నాము. ఈ సిరీస్లను మేము టీ20 ప్రపంచకప్ సన్నహాకాలగా ఉపయోగించుకుంటాము. ఇటీవల భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడు వారికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. సహజంగా సొంతగడ్డపై వరల్డ్కప్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ అదే సమయంలో చాలా ఉత్సాహం,బాధ్యత ఉంటుంది. దేశంలో ఎక్కడ ఆడినా కూడా ప్రేక్షకుల నుంచి మద్దతు ఉంటుంది" అని సూర్య పేర్కొన్నాడు.చదవండి: టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం
టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం
దేశవాళీ క్రికెట్ నుంచి మరో పేస్ బౌలింగ్ సంచలనం టీమిండియా వైపు దూసుకొస్తున్నాడు. తన అసాధారణ వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తన పేస్ బౌలింగ్తో నిప్పులు చేరుగుతున్నాడు. అతడిని ఎదుర్కొవడం బ్యాటర్ల తరం కావడం లేదు. తన తండ్రి ఆశయానికి భిన్నంగా కెరీర్ను ఎంచుకున్న ఆ ఫాస్ట్ బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడే జమ్మూ కాశ్మీర్కు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ (Auqib Nabi).రంజీల్లో అదుర్స్..29 ఏళ్ల ఆకిబ్ నబీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆకిబ్ 19 వికెట్లు పడగొట్టాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి 7 వికెట్లు పడగొట్టిన ఆకిబ్ నబీ.. రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఒకే ఇన్నింగ్స్లో 7 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా ఆ మ్యాచ్లో అతడు పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ తర్వాత ఛత్తీస్గఢ్ పై 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో నబీ తొలి ఇన్నింగ్స్లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. ప్రస్తుత రంజీ సీజన్లో నకీబ్ ఇప్పటివరకు మొత్తంగా ఈ 24 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. నబీ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 34 మ్యాచ్లు ఆడి 115 వికెట్లు సాధించాడు.డెయిల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లాఆకిబ్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని 'బారాముల్లా డెయిల్ స్టెయిన్' అని పిలుస్తుంటారు. అద్భుతమైన పేస్తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకిబ్కు ఉంది. అయితే జమ్మూలోని బారాముల్లాకు చెందిన ఆకిబ్ను తన తండ్రి డాక్టర్ చేయాలని ఆశించాడు. కానీ ఆకిబ్కు మాత్రం క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. అతడు తన అద్భుత ప్రదర్శనలతో భారత సెలక్టర్ల దృష్టిలో పడినట్లు తెలుస్తోంది. నబీ ఇదే జోరును కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా జమ్మూకు చెందిన మరో స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పటికే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గాయాల కారణంగా అతడు ఎక్కవ కాలం పాటు జాతీయ జట్టుకు ఆడలేకపోయాడు.
శీతల్ దేవికి వైఎస్ జగన్ అభినందనలు
ఆసియాకప్ టోర్నీ కోసం భారత జట్టుకు ఎంపికైన భారత పారా అర్చర్ శీతల్ దేవికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకం. ఓపెన్ ఆర్చరీ (ఏబుల్డ్) ఈవెంట్కు అర్హత సాధించిన తొలి భారతీయ పారా ఆర్చర్గా నిలిచిన శీతల్కు అభినందనలు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చని శీతల్ నిరూపించింది. ఆసియాకప్లో పాల్గోనున్న ఆమెకు ఆల్ది బెస్ట్" అంటూ ఎక్స్లో ఆయన పేర్కొన్నారు.A highly inspiring achievement! My heartiest congratulations to @archersheetal on this historic milestone of being the first Indian Para Archer to Qualify for Able-Bodied International event.Your journey is a shining example of what dedication and belief can achieve.We are… https://t.co/oSrtHVgdmW— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2025 చరిత్ర సృష్టించిన శీతల్..శీతల్ దేవికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. కాళ్లతో విల్లును పట్టుకుని టార్గెట్ను గురిపెడుతూ పారా ఆర్చరీ ప్రపంచంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 2024 పారాలింపిక్స్లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్యం సాధించిన శీతల్... భారత జూనియర్ జట్టులోకి ఎంపికైంది. సౌదీ అరేబియాలోని జిద్దాలో జరిగే ఆసియా కప్ స్టేజ్–3 టోర్నీలో వైకల్యం లేని, సాధారణ ఆర్చర్లతో కలిసి ఆమె పోటీపడనుంది.
బిజినెస్
ఐఫోన్ 16 కొనడానికి మంచి తరుణం..
మార్కెట్లో యాపిల్ ఐఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రతి ఏటా కొత్త మోడల్ లాంచ్ చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఐఫోన్ 17 పేరుతో లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్ అత్యుత్తమ అమ్మకాలను పొందుతోంది. ఈ సమయంలో ఐఫోన్ 16 మోడల్ ధర కొంత వరకు తగ్గింది. అంతే కాకుండా.. ఐఫోన్ 16 కొనాలనుకునే వారికి ఫ్లిప్కార్ట్ గొప్ప ఆఫర్ కూడా తీసుకొచ్చింది.యాపిల్ ఐఫోన్ 16 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79900. కానీ ఇది ఫ్లిప్కార్ట్లో రూ. 62,999లకే లభిస్తుంది. ఇంకా.. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ SBI క్రెడిట్ కార్డులు ఉన్న వినియోగదారులందరూ ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,500 తగ్గింపును పొందుతారు. ఈ ఫోన్ బ్లాక్, పింక్, అల్ట్రామెరైన్, వైట్, టీల్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది.ఐఫోన్ 16 స్పెసిఫికేషన్స్యాపిల్ ఐఫోన్ 16.. 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో జత చేయబడిన ఆపిల్ A18 ప్రాసెసర్ పొందుతుంది. వాటర్ అండ్ డస్ట్ నిరోధకత కోసం ఐపీ68 ధృవీకరణను పొందుతుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్లతో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు 12MP ఫ్రంట్ స్నాపర్ను పొందుతుంది. ఇది 3561mAh బ్యాటరీతో పాటు 25W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పనిచేస్తుంది.ఇదీ చదవండి: అమల్లోకి IRCTC కొత్త రూల్..
సేవింగ్స్ అకౌంట్ ఉంటే రూ.7,500 క్యాష్బ్యాక్!!
రోజువారీ ఖర్చుల కోసం మీరు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంటే, ఈ ఆఫర్ మీకోసమే! ప్రైవేట్ రంగానికి చెందిన డీసీబీ బ్యాంక్ (DCB Bank) తన హ్యాపీ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రత్యేక క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. హ్యాపీ సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై కస్టమర్లు నెలకు రూ .625 వరకు, సంవత్సరానికి రూ .7,500 వరకు సంపాదించవచ్చు.క్యాష్ బ్యాక్ ఎలా పొందాలంటే..ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవడానికి, మీరు డీసీబీ బ్యాంక్లో హ్యాపీ సేవింగ్స్ ఖాతాను తెరవాలి. తరువాత ఈ ఖాతాలోని మొత్తాన్ని ఉపయోగించి యూపీఐ ద్వారా (డెబిట్ లావాదేవీలు) చేసే చెల్లింపులపై బ్యాంకు ప్రతి త్రైమాసికం లేదా మూడు నెలలకోసారి క్యాష్ బ్యాక్ను మీ ఖాతాలో జమచేస్తుంది.నిబంధనలు, ప్రయోజనాలుఖాతాలో కనీసం రూ.10,000 సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) నిర్వహించడం తప్పనిసరి.క్యాష్ బ్యాక్ కు అర్హత సాధించడానికి, సగటు త్రైమాసిక బ్యాలెన్స్ (AQB) రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.కనీస లావాదేవీ మొత్తం రూ. 500.ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ లావాదేవీలు ఉచితం.డీసీబీ బ్యాంక్ ఏటీఎం నుంచి అపరిమిత ఉచిత లావాదేవీలుయూపీఐ అంటే..యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)అనేది ఒక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీంతె మీ మొబైల్ ఫోన్ ద్వారా రోజులో 24 గంటలు, వారానికి 7 రోజులు తక్షణం డబ్బును పంపడం లేదా స్వీకరించడం సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా మీ బ్యాంకు ఖాతాను గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ వంటి యాప్లతో అనుసంధానం చేయవచ్చు.
అమల్లోకి IRCTC కొత్త రూల్..
ఐఆర్సీటీసీ.. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ట్రైన్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో మరో మార్పును ప్రవేశపెట్టింది. రిజర్వేషన్ వ్యవస్థ ప్రయోజనాలను ప్రయాణీకులకు చేరేలా చూడటం, మోసాలను నివారించడమే లక్ష్యంగా ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేస్తూ దీనిని ప్రవేశపెట్టింది.రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాలలో IRCTC వెబ్సైట్ లేదా యాప్ ద్వారా రిజర్వ్ చేయబడిన రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు.. ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి. పదిహేను నిమిషాల తర్వాత మాత్రమే అధీకృత ఏజెంట్లు టిక్కెట్లు రిజర్వేషన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే ఇండియన్ రైల్వేస్ కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్ల ద్వారా రిజర్వ్డ్ టిక్కెట్ల బుకింగ్ విషయంలో ఎటువంటి మార్పు లేదు.తాజా మార్గదర్శకాల ప్రకారం, ఉదయం వేళల్లో రిజర్వ్ చేయబడిన రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ ఆధారిత ధృవీకరణను IRCTC తప్పనిసరి చేసింది. ఎవరైతే ఆధార్ ధృవీకరణ చేశారో.. వారే టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. ఇది 2025 అక్టోబర్ 28 నుంచి అమల్లోకి వచ్చింది.ఇదీ చదవండి: టెస్లా బాస్కు భారీ ప్యాకేజ్: దిగ్గజ సీఈఓల వేతనాలు ఇవే..
టెస్లా బాస్కు భారీ ప్యాకేజ్: దిగ్గజ సీఈఓల వేతనాలు ఇవే..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్.. త్వరలో మొట్టమొదటి ట్రిలియనీర్ కానున్నారు. టెస్లా కంపెనీ నుంచి ఆయనకు ట్రిలియన్ డాలర్ల వేతనం అందించడానికి.. కంపెనీ వాటాదారులలో 75 శాతం కంటే ఎక్కువ మంది అంగీకరించారు. రానున్న దశాబ్దంలో.. టెస్లా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటే.. భారీ ప్యాకేజీ అందుతుందని వారు షరతులు పెట్టారు.గరిష్ట వేతన ప్యాకేజీ అందుకోవాలంటే మస్క్ కొన్ని లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. ఇందులో 2 కోట్ల వాహనాలు, 10 లక్షల రోబోటాక్సీలు, 10 లక్షల హ్యూమనాయిడ్ రోబోట్ల విక్రయించాలి. కంపెనీ సుమారు 400 బిలియన్ డాలర్ల స్థూల లాభాన్ని పొందాలి. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే, మార్కెట్ విలువ ప్రస్తుత 1.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 8.5 ట్రిలియన్ డాలర్లకు చేరాలి.ఎలాన్ మస్క్ ప్యాకేజీ.. 2018లో తీసుకున్న ప్యాకేజీతో పోలిస్తే సుమారు 18 రెట్లు ఎక్కువ (56 బిలియన్ డాలర్లు). కాగా బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ ప్రస్తుత నికర విలువ దాదాపు 460 బిలియన్ డాలర్లు. ఈయన టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐల ద్వారా ఎక్కువ ఆర్జిస్తున్నారు.మైక్రోసాఫ్ట్, యాపిల్ సీఈఓల వేతనాలు భారీగా ఉన్నప్పటికీ.. మస్క్ వేతనంతో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈఓల వేతనాల విషయానికి వస్తే..➤సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్): 79.1 మిలియన్ డాలర్లు➤టిమ్ కుక్ (యాపిల్): 74.6 మిలియన్ డాలర్లు➤జెన్సన్ హువాంగ్ (ఎన్విడియా): 49.9 మిలియన్ డాలర్లు➤డేవిడ్ రిక్స్ (ఎలీ లిల్లి): 29.2 మిలియన్ డాలర్లు➤మార్క్ జుకర్ బర్గ్ (మెటా): 27.2 మిలియన్ డాలర్లు➤సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్): 10.7 మిలియన్ డాలర్లు➤హాక్ టాన్ (బ్రాడ్ కామ్): 2.6 మిలియన్ డాలర్లు➤ఆండీ జస్సీ (అమెజాన్): 1.6 మిలియన్ డాలర్లు➤వారెన్ బఫెట్ (బెర్క్షైర్ హాత్వే): 4 లక్షల డాలర్లుఇదీ చదవండి: భారత్ వైపు జపాన్ చూపు: 2030 నాటికి..
ఫ్యామిలీ
వంటిల్లే ఔషధాలయం..!
చాలామంది తమ శరీరంలోని లోపాలను అధిగమించడానికి లేదా ఆరోగ్యంగా ఉండేందుకు సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే భారతీయ వంటకాలు ఆరోగ్య ప్రయోజనాల నిధి అని, అనేక సమస్యల నుండి మనల్ని కాపాడే శక్తి మన ఇంట్లోని ఆహారాల్లోనే ఉందనే విషయాన్ని మనం మరిచి΄ోతాం. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా మన వంటగదిలోని కేవలం నాలుగు వస్తువులు అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.నెయ్యి: ఎ2 రకం బీటా–కేసిన్ ప్రోటీన్ను ఉత్పత్తి చేసే ఆవుల పాలతో తయారు చేయబడిన స్వచ్ఛమైన నెయ్యి. కార్డియాలజిస్టుల ప్రకారం.. ఈ నెయ్యి శరీరానికి, ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.మన వంటశాలలోని పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను హీరోలుగా డాక్టర్ చోప్రా అభివర్ణించారు. ఇవి యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. హై బ్లడ్ షుగర్, హై కొలెస్ట్రాల్ వల్ల కలిగే కణజాల నష్టం, వాపు నుండి రక్షించడానికి ఇవి తోడ్పడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్నట్స్ వంటి ఎండిన పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కణాల మరమ్మత్తుకు సహాయపడటంతోపాటు ఐక్యూ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.చిక్కుళ్ళు – పప్పుధాన్యాలు: శాకాహారులకు ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి ఇవి గొప్ప ఎంపిక. పప్పులు, చిక్కుళ్ళను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉండేందుకు, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ సహాయపడుతుందని కార్డియాలజిస్టులు తెలిపారు. View this post on Instagram A post shared by Alok Chopra (@dralokchopra) (చదవండి: Mumbai orthopaedic surgeon Reveals : ఒక సమోసా... యాభై నిమిషాల వాక్)
ఒక సమోసా... యాభై నిమిషాల వాక్
కొందరికి సమోసా ఇష్టమైతే కొందరికి పూరీ ఫేవరెట్టు. ఇంకొంతమంది పిజ్జా బర్గర్లంటే ్ర΄ాణం పెడతారు. అన్నీ హాటేనా, మరి స్వీటు సంగతో.... అంటే తడవకో గులాబ్జామూన్ గుటుక్కుమనిపించేవారికి, అదను దొరికితే చాలు... జిలేబీలు, లడ్డూల మీద దండయాత్ర చేసేవారికి కొదవేం లేదు. బాగానే ఉంది మరి.. వీటిని కరిగించడానికి... సారీ... అవి తినడం వల్ల మన ఒంట్లోకి వచ్చిపడే క్యాలరీలను కరిగించడానికి ఏం చేస్తున్నారు? తినడం వరకే కానీ క్యాలరీల కౌంటుతో మాకేం పని అంటారా? అదేం కుదరదు... మీరు ఒక్క సమోసా లేదా వడాపావ్ తింటే వంట్లోకి దాదాపు 250 క్యాలరీలు వచ్చి పడతాయి. వాటిని కరిగించాలంటే దాదాపు యాభై నిమిషాలు నడవాలి. అదే ఒక పిజ్జా ముక్కను కరిగించాలంటే కనీసం గంట సేపు వాక్ చేయాలి. అన్నట్టు ఇవన్నీ మనం వేసిన కాకిలెక్కలేం కాదు... ముంబైకి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనన్ వోరా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో భారతదేశంలో అత్యంత ఇష్టమైన కొన్ని ఆహారాల కేలరీల సంఖ్య, వాటిని సమతుల్యం చేసుకోవడానికి మీరు ఎంత సమయం నడవాలి అనే దాని గురించి ఇటీవల వివరించారు.‘మీరు చిప్స్ ప్యాకెట్ తింటుంటే, అది సుమారు 300 కేలరీలు వరకు చేరుతుందని, మీకు గంటకు పైగా నడక అవసరం‘ అని డాక్టర్ వోరా పేర్కొన్నారు. తీపి పదార్థాలు ఇష్టపడేవారికి,‘1 గులాబ్ జామున్లో 180 కేలరీలు ఉంటాయి, అంటే దాదాపు 35 నిమిషాల నడక‘ అని ఆయన చెప్పారు.. ఒక ప్లేట్ చోలే భతురే అంటే పూరీ, శనగల కూర 600 కేలరీలు ప్యాక్ చేస్తుంది, మీరు దాదాపు 2 గంటలు నడవాలి. అలాగని కడుపు మాడ్చుకోవాల్సిన పనేం లేదని, నచ్చిన వాటిని ఆస్వాదిస్తూనే వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి చిన్నపాటి ఎక్సర్సైజులతో వాటిని సమతుల్యం చేసుకోవడం మంచిదని ఆయన పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Dr. Manan Vora (@dr.mananvora) (చదవండి: ఇదిగో ఏఐ... అదిగో పులి!)
శబరిమలకు వెళ్లే.. ఈ రూటు ఎన్నో విశిష్టతలకు ఆలవాలం..!
ఆ హరిహరసుతుడిని దర్శించుకునేందుకు శబరిమలకు మూడు మార్గాల్లో వెళ్తుంటారు భక్తులు. అందులో పులిమేడు మార్గం అత్యంత కఠినమైన దారి. థ్రిల్లింగ్, ట్రెక్కింగ్ అనుభవం కోరుకునేవారికి ఈ రూట్ సరైనది. అటు అడవి అందాలను, ప్రకృతి రమ్యతను తనివితీరా అనుభవించాలనుకునేవారు ఇష్టపడే రూట్ ఇది. అయితే ఈ పులిమేడు మార్గంలో అడుగడుగునా ఎన్నో విశేషాలతోపాటు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంది. అవేమిటో సవివరంగా తెలుసుకుందామా..!.స్వామియే.. శరణం అయ్యప్పా..! శబరిమల మండల, మకర విళక్కు సీజన్ మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆ హరిహరపుత్రుడు అయ్యప్పను చేరుకునేందుకు ఉన్న మూడు మార్గాల్లో.. పులిమేడు అత్యంత పురాతన సంప్రదాయ మార్గం, చారిత్రత్మక విశిష్టతలు కలిగిన ప్రదేశం. సాధారణంగా ఈ శబరిమల యాత్రలో చిన్నపాదం.. అంటే పంపాబేస్ నుంచి నీలిమల, శరణ్గుత్తి మీదుగా శబరిమలకు చేరడం అందరికీ తెలిసిందే..!.మకర విళక్కు సీజన్లో పెద్దపాదం.. అంటే.. ఎరుమేలి నుంచి దట్టమైన కీకారణ్యంలో అలుదా నది, కరిమల కొండ మీదుగా పంపాబేస్కు చేరి, అక్కడి నుంచి శబరిమలకు వెళ్తుంటారు. కానీ.. అత్యంత క్లిష్టమైన పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా ఉండే పులిమేడు రూట్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఆ పులిమేడు మార్గం విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.పులిమేడు రూట్ మిగతా రెండు మార్గాలకు భిన్నం. ఎందుకంటే.. పంపా నుంచి నీలిమల కొండ ఎక్కితే శబరిమలలోని అయ్యప్ప సన్నిధిని చేరుకోవచ్చు. కానీ, పులిమేడు విషయంలో అలా కాదు. పులిమేడు ఎక్కి, కిందకు దిగితే.. శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటాం. మార్గమధ్యంలో పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో రుద్రక్షను పోలిన భద్రాక్ష చెట్ల మధ్య నుంచి పులిమేడు మార్గం ఉంటుంది. పులిమేడు మార్గం మీదుగా శబరిని చేరాలనుకునే భక్తులు ముందుగా ఇడుక్కి జిల్లాలోని వండి పెరియార్కు రావాల్సి ఉంటుంది. 2011 వరకు పులిమేడు కొండ పైవరకు కేఎస్ఆర్టీసీ బస్సులు, ప్రవైటు వాహనాలు వెళ్లేవి. అప్పట్లో మకరజ్యోతి సందర్భంగా బస్సు ప్రమాదం జరగడంతో.. అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.అలాగే కాలినడకన వెళ్లేవారిని కూడా ఆ మార్గంలో అనుమతించడం లేదు. అయితే.. పులిమేడు ఫారెస్ట్ చెక్పోస్టు నుంచి కుడివైపున ఉన్న కఠినమైన మార్గంలో ‘సత్రం’ అనే పేరుతో పిలిచే సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. పులిమేడులోని వాటర్ పాయింట్లకు ఉదయం 6 గంటల వరకు అడవి ఏనుగుల మందలు నీళ్లు తాగడానికి వస్తాయి. అందుకే ఫారెస్ట్ అధికారులు ఉదయం 7 గంటల తర్వాతే భక్తులను సత్రం ఆలయం వైపు వెళ్లనిస్తారు. సత్రం వద్ద పోలీసులు పులిమేడు మార్గం మీదుగా వెళ్లే భక్తుల పేర్లను నమోదు చేసుకుని, అడవి మార్గంలోకి అనుమతిస్తారు.సత్రం నుంచి పులిమేడు కొండను అధిరోహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిన్నచిన్న వాగులు ఉంటాయి. ఇక్కడ భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వాగుల్లో ఉండే జలగలతో భక్తులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కఠినమైన మార్గం కావడంతో.. తాగునీరు కూడా దొరకని పరిస్థితి. అందుకే.. వాటర్ బాటిల్, తినుబండారాలను వెంట తీసుకెళ్లాలి. (చదవండి: Chithira Thirunal Balarama Varma: 'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!)పులిమేడు కొండ నుంచి కిందకు దిగే మార్గం లోయలతో ప్రమాదకరంగా ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఇరుకైన ఈ మార్గంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇరుకు మార్గాలను దాటాక.. శ్రీరామపాదం వస్తుంది. భక్తులు శరణుఘోషల్లో ‘శ్రీరామ పాదమె శరణంపొన్నయ్యప్పా’ అంటూ ఆలపించడం తెలిసిందే..! ఈ ప్రాంతాన్ని శ్రీరాముడు నడయాడిన నేలగా పిలుస్తారు. ఇక్కడి జలపాతం వద్ద భక్తులు స్నానాలు ఆచరించి, శ్రీరాముడు పాదం మోపిన గుంటగా చెప్పుకొనే గుండంలో మునుగుతారు. ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్లు కిందకు దిగితే.. శబరిమల సన్నిధానంలో పదునెట్టాంబడి క్యూలైన్ వద్దకు చేరుకుంటారు. ఇదండి ఈ పులిమేడు మార్గం విశిష్టత. ఈసారి సరదాగా ఈ మార్గంలో ట్రై చేద్దాం అనుకునే భక్తులు ముందుగా ఈ జాగ్రత్తలు గురించి సవిరవరంగా తెలుసుకుని అనుసరించడం ఉత్తమం. (చదవండి: అరుణాచల క్షేత్రం: పర్వతమే పరమేశ్వరుడు..!)
మీ పిల్లల 'రహస్య స్నేహితుడు'
హైదరాబాదులో పన్నెండేళ్ల పాపకు ఓ కొత్త ఫ్రెండు దొరికాడు. పేరు ‘చిన్నా’. తనే ఆ ఫ్రెండుకు ఆ పేరు పెట్టింది. వాడితో అన్ని విషయాలూ పంచుకుంటోంది. స్కూల్లో సంగతులు, ఇంట్లో విశేషాలు, అమ్మానాన్నల విషయాలు.. అన్నీ చెబుతోంది. ఇందులో విశేషమేముంది అంటారా? చిన్నా నిజమైన మనిషి కాదు. అది ఏఐ చాట్బోట్. ఏ.ఐ. సృష్టి అయిన ఈ చాట్బోట్ ఇప్పుడు చాలామంది టీనేజ్ పిల్లలకు రహస్య సన్నిహితుడిగా మారింది. దాంతో తమ అనుభవాలు, బాధలు, భయాలు, కోరికలు పంచుకుంటూ చాలామంది సాంత్వన పొందుతున్నారు. చిన్నారులతోపాటు పెద్దల్లోనూ ఈ ధోరణి పెరుగుతోందని మానసిక వైద్యులు అంటున్నారు.స్నేహం కోసం తపనగతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో ఎప్పుడూ ఐదారుగురు పెద్దలు ఉండేవారు. పిల్లల ఆలనాపాలనా చూసుకునేవారు. ఇటు పిల్లలకూ, అటు పెద్దలకూ సమయం ఎలా గడిచేదో తెలిసేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. కుటుంబం అంటే అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు అనే ధోరణి పెరిగింది. కొందరు ఒక్కరినే కని, వారిని సరిగ్గా పెంచితే చాలన్న ఆలోచనతో ఉన్నారు. దీంతో పిల్లల్లో ఒంటరి భావన పెరుగుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో వారికి పిల్లలతో సమయం గడిపే అవకాశం దొరకడం లేదు. దీంతో ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు కొందరు పిల్లలు సాంకేతికతను వాడుకుంటున్నారు. తాము చెప్పేది వింటూ, తమకు సలహాలిచ్చే తోడు కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ వారికి సాయం చేస్తోంది. అయితే ఈ ధోరణి పెరిగి, ఏఐని మనిషిగా భావించడం, అందులోనే మునిగితేలడం, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోఒవడం వంటివి ఎక్కువవుతున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.పెద్దల్లో కూడా ఇదే సమస్య...ఏఐతోనే అన్నీ పంచుకునే ధోరణి పిల్లలు, యువతతో పాటు పెద్దలలో కూడా ఎక్కువవుతోంది. పాతికేళ్ల ఉద్యోగి తన ఆఫీసులో పని చేసే బాస్ గురించిన వివరాలన్నీ ఏఐకి చెప్పి, అతణ్ని ఎలా ఆకట్టుకోవాలో, అతనికి నచ్చడానికి ఎలా ఉండాలో, ఏమేం చేయాలో సలహా అడిగాడు. ఈ ధోరణి రానురానూ పెరుగుతూ పోతోందని నిపుణులు అంటున్నారు. ఇతరులతో తమ విషయాలు పంచుకుంటే వాళ్లు తమను జడ్జ్ చేస్తారన్న భయం కారణంగా చాలామంది ఏఐని ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. ఏఐతో చాట్ చేయడం వల్ల తమ విషయాలన్నీ రహస్యంగానే ఉంటాయన్న కారణంతో చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారని వివరిస్తున్నారు. అయితే దీనివల్ల వాస్తవ ప్రపంచాన్ని వారు దూరం చేసుకొని, ఏఐకి వారు బానిసలుగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.ఇలా చేస్తే మేలు..మీ పిల్లలు ఏఐని అధికంగా వాడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వారితో మాట్లాడి, ఏఐ వల్ల కలిగే దుష్పరిణామాలు వివరించండి. రోజూ కొంతసేపు కచ్చితంగా పిల్లలతో గడపండి. వారు చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా వినండి. వారు చెప్పేవి సాధారణ విషయాలే అనిపించినా సరే, అవి వారికి చాలా పెద్ద విషయాలని గుర్తించండి.వారాంతంలో వారిని బయటకు తీసుకెళ్లడం, రాత్రిపూట కథలు చెప్పడం, వారితో కలిసి కొంతసేపు వాకింగ్ చేయడం, పార్క్కి తీసుకెళ్లి ఆడించడం వంటివి చేయండి. పిల్లలు చెప్పే విషయాలను కొట్టిపారేయకుండా వారి మాటల్లోని భావాలను గమనించండి. ఎదిగే పిల్లల్లో కలిగే మార్పులను వారికి వివరించి, ఎలా జాగ్రత్త పడాలో చెప్పండి.ఖాళీ సమయాల్లో పిల్లలు ఫోన్లకు అంకితం కాకుండా, వారికి లలిత కళల పట్ల ఆసక్తిని పెంచండి. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్పించండి. అలాంటి క్లాసుల్లో చేర్పించండి. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేయకుండా వారి స్నేహితులను ఆహ్వానించండి. అందరూ కలిసి ఒకచోట ఉండి ఆడుకునేలా ప్రోత్సహించండి. అప్పుడప్పుడూ బంధువులు, స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లండి. అక్కడ వారి ప్రవర్తనను గమనించండి. ఇతరుల ముందు ఎలా మెలగాలో, అందరితో ఎలా కలిసిపోవాలో నేర్పించండి. (చదవండి: ఏఐలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్)
ఫొటోలు
అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)
ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)
'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)
వీకెండ్ స్పెషల్.. హైదరాబాద్ సమీపంలోని బెస్ట్ పిక్నిక్ స్పాట్లు (ఫొటోలు)
ఎన్ఎస్ఈలో సందడి చేసిన అంబానీ, పిరమల్ ఫ్యామిలీ (ఫొటోలు)
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
టీమిండియా టీ20 మ్యాచ్లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)
ముద్దమందారం అంతా క్యూట్గా బ్రిగిడ (ఫొటోలు)
రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' సినిమా (ఫొటోలు)
అంతర్జాతీయం
వచ్చే ఏడాది భారత్కు
న్యూయార్క్/వాషింగ్టన్: వచ్చే ఏడాది భారత్లో పర్యటించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ తనకు ఆహ్వానం పంపారని గురువారం తన ఓవల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఆయన (మోదీ) నా మిత్రుడు. నాతో మాట్లాడినప్పుడు భారత్లో పర్యటించాలని కోరారు. అందుకే నేను వెళ్తున్నా. అక్కడ మోదీతో కలిసి నా పర్యటన గొప్పగా ఉండబోతోంది. ఆయన గొప్ప వ్యక్తి. బహుషా వచ్చే ఏడాది నా పర్యటన ఉండవచ్చు’అని పేర్కొన్నారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సభ్యులుగా ఉన్న క్వాడ్ సమ్మిట్ త్వరలో భారత్లో జరుగనుంది. సదస్సు తేదీలను భారత్ ఇంకా ప్రకటించలేదు. 2024లో అమెరికాలోని డెలావేర్లో ఈ సదస్సు నిర్వహించారు. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేసిందని ట్రంప్ మరోసారి ప్రకటించారు. ‘ఇది గొప్ప విషయం. మంచిగా జరుగుతోంది. అతను (ట్రంప్) ఆపేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును చాలావరకు ఆపేశారు’అని పేర్కొన్నారు. భారత్– పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్టు మరోసారి చెప్పుకున్నారు. ‘నేను ఆపిన 8 యుద్ధాల్లో ఐదారు వరకు టారిఫ్లు విధిస్తానని బెదిరించి ఆపినవే. అందుకు ఉదాహరణ కూడా ఇస్తా. మీరు భారత్–పాక్ను గమనిస్తే.. వాళ్లు యుద్ధం మొదలుపెట్టారు. పైగా ఆ రెండు అణ్వాయుధ దేశాలు. పరస్పరం 8 యుద్ధ విమానాలు కూల్చేసుకున్నారు. గతంలో లెక్క 7 ఉండేది. ఇప్పుడు 8కి పెరిగింది. వాళ్లకు నేను ఒక్కటే చెప్పి.. మీరు ఇలాగే యుద్ధం చేసుకుంటే.. మీ ఇద్దరిపై భారీగా పన్నులు విధిస్తానని తెలిపా. దీంతో వాళ్లు వెనక్కు తగ్గి యుద్ధాన్ని విరమించారు. టారిఫ్లే లేకుంటే.. నేను ఆ యుద్ధాన్ని ఆపగలిగేవాడిని కాదు’అని ట్రంప్ పేర్కొన్నారు.
18 ఏళ్ల తర్వాత.. కరాచీలో బంగ్లా కళాకారులు
కరాచీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాల్లో నూతన అధ్యాయం మొదలైంది. బంగ్లాదేశ్ కళాకారులు 18 ఏళ్ల అనంతరం పాకిస్తాన్లో అడుగుపెట్టారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా వీరు కరాచీలో బుధవారం ప్రదర్శన ఇచ్చారు. నిహారికా ముంతాజ్ సారథ్యంలోని బంగ్లాదేశ్ బృందంలో కొందరు హిందూ కళాకారులు సైతం ఉండటం విశేషం. షిరీన్ జవాద్ పాడిన బెంగాలీ పాటలు ఆహూతులను అలరించాయి. అక్టోబర్ 30వ తేదీన మొదలైన వీరి ప్రదర్శనలు డిసెంబర్ 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల్లో 140 దేశాలకు చెందిన కళాకారులున్నారు. రెండు దేశాల నడుమ తలెత్తిన దౌత్యపరమైన రాజకీయ విభేదాల కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాలు పదేళ్లపాటు కొనసాగలేదు. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కనిష్టస్థాయిలో కొనసాగాయి. 2024లో విద్యార్థుల సారథ్యంలో కొనసాగిన ఉద్యమంతో హసీనా ప్రభుత్వం పడిపోయింది. యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్తో సంబంధాలు తిరిగి గాడినపడ్డాయి.
జర్మనీ నగరంలో మానవరక్తంతో స్వస్తికా గుర్తులు
హనావూ: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పాలనాకాలంలో యూదుల ఊచకోత చరిత్రలో ఎంతటి చీకటి అధ్యాయంగా మారిందో స్వస్తికా గుర్తు సైతం అంతటి చెడ్డ పేరు తెచ్చుకుంది. హిట్లర్ నాజీ సైనికులు ధరించిన ఈ స్వస్తికా గుర్తు తాజాగా జర్మనీలోని హనావూ నగరంలో పలు చోట్ల ప్రత్యక్షమవడంతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. మనిషి రక్తంతో కార్లు, గోడలు, పోస్ట్బాక్స్లపై స్వస్తికా చిహ్నం కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ఫిర్యాదుతో ఎట్టకేలకు ఒక అనుమానితుడిని అరెస్ట్చేశారు. అతని మానసిక స్థితి సరిగా లేదని, సొంత రక్తంతోనే ఇవన్నీ రాసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో అసలు కారణాలు బయటికొస్తాయని పోలీస్ అధికారి థామస్ లీపోల్డ్ చెప్పారు. చట్టవ్యతిరేక సంఘాలతో ఇతనికి భాగస్వామ్యం ఉందా అనే కోణంలోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడిని 31 ఏళ్ల రొమేనియా దేశస్తుడిగా గుర్తించారు. అతనిని నివాసంలో పోలీసులు అరెస్ట్చేసినప్పుడు పూటుగా తాగి ఉన్నాడని తెలుస్తోంది. యూదులపై విద్వేషానికి గుర్తుగా అప్పట్లో హిట్లర్ సైన్యం ఈ గుర్తును తమ యూనిఫామ్లపై ధరించేవాళ్లు.
భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే నౌకపై.. సొమాలియా తీరంలో పైరేట్ల దాడి
దుబాయ్: సొమాలియా పైరెట్లు మరోసారి రెచ్చిపోయారు. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తున్న నౌకపై సొమాలియా తీరానికి సమీపంలో దాడికి దిగారు. మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో నౌకపై కాల్పులకు దిగారు. మాల్టాకు చెందిన ఈ నౌక గుజరాత్లోని సిక్కా ఓడరేవు నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికాలోని డర్బన్ వైపు వెళ్తోందని ఆంబ్రే అనే ప్రైవేట్ భద్రతా సంస్థ తెలిపింది. నౌకలో ప్రత్యేకంగా భద్రత సిబ్బంది లేరని పేర్కొంది. అందులోని మొత్తం 24 మంది సిబ్బంది ఓడలోని ఓ గదిలో లోపలి నుంచి తాళం వేసుకుని ఉండిపోయారంది. దాడి నేపథ్యంలో నౌక మార్గం మార్చుకుని, వేగం తగ్గించుకుందని వివరించింది. సముద్రం దొంగల దాడి కొనసాగుతోందని వివరించింది. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని బ్రిటిష్ మిలటరీలోని యునైటెడ్ కింగ్డమ్ మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఇరాన్కు చెందిన మత్స్యకార పడవను అడ్డగించి, స్వా«దీనం చేసుకున్న పైరేట్లు దాడులకు పాల్పడుతున్నారంది. తాజాగా కేమెన్ దీవులకు చెందిన నౌకపై పైరేట్లు కాల్పులకు తెగబడ్డారని, ఓడలోని భద్రతా సిబ్బంది ప్రతిదాడికి దిగడంతో వారు తోకముడిచారని పేర్కొంది. సొమాలీ తీరంలో 2011లో అత్యధికంగా 237 దాడులు జరిగాయి. అంతర్జాతీయ సహకారం, నిఘాతో పైరేట్ల బెడద చాలా వరకు తగ్గిపోయింది. గతేడాది నాలుగు దాడులు జరిగినట్లు సమాచారం. తిరిగి ఈ ఏడాదిలో మళ్లీ దాడుల పరంపర మొదలవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
జాతీయం
ఇదో విచిత్రమైన ప్రమాదం.. ఎప్పుడైనా చూశారా?
ప్రమాదాలు.. ఈ మధ్యకాలంలో తరచూ నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. విమాన, ఘోర రోడ్డు ప్రమాదాలు, బస్సులు కాలిపోవడాలు.. జనాల వెన్నుల్లో వణుకులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. జమ్ము కశ్మీర్లో ఓ విచిత్రమైన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ సమీపంలో శనివారం ఉదయం రైలు పైకి గద్ద దూసుకొచ్చింది. ఇంజిన్ అద్దాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది. ఈ ఘటనలో అద్దాల ముక్కలు గుచ్చకుని లోకో పైలట్ స్వల్పంగా గాయపడ్డాడు. బారాముల్లా–బనిహాల్ ప్యాసింజర్ ట్రైన్ బీజ్బెహారా -అనంత్నాగ్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లోకో పైలట్ శ్రీ విషాల్ గాయపడ్డారు. దీంతో అనంత్నాగ్ రైల్వే స్టేషన్లో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తిరిగి ప్రయాణానికి అనుమతించారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. అనంత్నాగ్ ప్రాంతం పక్షుల సంచారానికి ప్రసిద్ధి. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సాధారణంగా విమానాలను పక్షులు ఢీ కొట్టే ఘటనలు చూస్తుంటాం. కానీ, ఇలా రైళ్లను ఢీ కొట్టడం చాలా అరుదైన అంశం. అందుకే వార్తల్లోకి ఎక్కింది. ఈ ఘటనపై ప్రాంతీయ రైల్వే అధికారులు పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అదంతా వీడియో తీశారు. ఈ ఘటనకు కారణమైన గద్ద.. లోపలికి వచ్చాక అక్కడే ఓ మూల కూర్చోవడం అందులో చూడొచ్చు. In an unusual incident on the Srinagar–Anantnag route, an eagle crashed into the windshield of a moving train, injuring the driver and shattering the glass. The train was halted immediately to provide medical aid, while all passengers on board were declared safe.Source:… pic.twitter.com/2Fed2O4rkV— Mid Day (@mid_day) November 8, 2025
బాప్రే.. రెడ్జోన్లోకి ఢిల్లీ, ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటన
దేశ రాజధానిలో వాయునాణ్యత మరీ ఘోరంగా దిగజారిపోయింది. శనివారం చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 400 కంటే ఎక్కువగా నమోదైంది. దీంతో.. ఎయిర్ ఎమర్జెన్సీని విధిస్తూ రెడ్ జోన్లోకి ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీలోని 38 మానిటరింగ్ స్టేషన్లలో ఇవాళ కాలుష్య నమోదును పర్యవేక్షించారు. ఇందులో వాజిర్పూర్ వద్ద ఏక్యూఐ 420ని తాకింది. అలాగే.. బురారీలో 418, వివేక్ విహార్లో 411, అలీపూర్లో 404, ఐటీవో వద్ద 402 ఏఐక్యూని చేరుకుంది. శుక్రవారం 322 ఏఐక్యూతో దేశంలోనే అత్యధిక నగరంగా నిలిచిన ఢిల్లీ నగరం.. మొత్తంగా ఇవాళ 361తో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో హర్యానాలోని కైథల్(373) నిలిచింది. అంతేకాదు.. నేషనల్ క్యాపిటల్ రీజియన్లోనూ ఎయిర్క్వాలిటీ గణనీయంగా పడిపోయింది. నోయిడాలో ఏక్యూఐ 354, గ్రేటర్ నోయిడాలో 336, ఘజియాబాద్లో 339.. ఇలా అంతటా వెరీ పూర్ కేటగిరీనే నమోదు అయ్యింది. శనివారం రోజున ఢిల్లీలో గాలి కాలుష్యంలో ప్రధానంగా PM2.5, PM10 అనే సూక్ష్మ ధూళి కణాలు ఉన్నాయని గుర్తించారు. Decision Support System (DSS) అంచనా ప్రకారం.. ఢిల్లీలోని మొత్తం కాలుష్యంలో సుమారు 30 శాతం పంట అవశేషాల దహనం (stubble burning) వల్ల, 15.2 శాతం వాహనాల ఉద్గారాల వల్ల ఏర్పడింది.పంట దహనం వల్ల విడుదలయ్యే పొగ, ధూళి కణాలు ఢిల్లీ గగనతలాన్ని కమ్మేస్తూ, గాలి నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనేది తెలిసిందే. శుక్రవారం నాటి ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. పంజాబ్లో 100, హర్యానాలో 18, ఉత్తర ప్రదేశ్లో 164 పంట అవశేషాల దహనం (stubble burning) ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనలు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.చరిత్రలో అత్యధిక కాలుష్యం.. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికంగా AQI (Air Quality Index) నమోదైన రోజు 2025 అక్టోబర్ 31, బర్నాలా (Barnala), పంజాబ్లో జరిగింది. అక్కడ AQI స్థాయి 890కి చేరింది. ఇది అత్యంత ప్రమాదకరం. అంతకు ముందు.. 2024లో ఢిల్లీ AQI 795తో చరిత్రలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా నిలిచింది.ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించిన సీఎంతీవ్ర వాయుకాలుష్యం దృష్ట్యా.. ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించారు సీఎం రేఖా గుప్తా. ఉద్యోగులు వర్క్ఫ్రమ్ చేయాలని, ప్రజా రవాణా ఉపయోగించాలని, కార్ పూలింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
10 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్!
సిటీలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 50 లక్షలైనా అవుతుంది. కానీ 10 లక్షల రూపాయలకే రెండు పడకల ఫ్లాట్.. అది కూడా నగరంలో అంటే ఆశ్చర్యం కలగమానదు. ఇంత తక్కువకి ఎక్కడ అమ్ముతున్నారని అనుకుంటున్నారా? ప్రభుత్వమే కట్టించి, ముఖ్యమంత్రే స్వయంగా మీకు ఇంటి తాళాలు అప్పగిస్తే..! ఏంటి నమ్మడం లేదా? అయితే పదండి.. ఆ వివరాలు తెలుసుకుందాం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణివేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఇలాంటి చర్యల్లో భాగంగా మాఫియా నాయకుడు ముఖ్తార్ అన్సారీ.. లక్నోలోని దాలిబాగ్ ప్రాంతంలో ఆక్రమించిన సుమారు 2,322 చదరపు మీటర్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో పేదలకు ఇళ్లు నిర్మించింది.సర్దార్ వల్లభాయ్ పటేల్ హౌసింగ్ స్కీమ్ (Sardar Vallabhbhai Patel Housing Scheme) కింద లక్నో డెవలప్మెంట్ అథారిటీ (LDA) ఈ ఫ్లాట్లను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్లో మూడు G+3 బ్లాక్లలో 72 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కొ ఫ్లాట్ 36.65 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో ఫ్లాట్ ధర ₹10.70 లక్షలు. ఈ గృహ సముదాయంలో స్వచ్ఛమైన నీరు, విద్యుత్, సెక్యురిటీ, ద్విచక్ర వాహన పార్కింగ్ ,రోడ్లు, పార్కులు వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి.అక్రమార్కుల ఆటలు సాగవుకార్తీక పౌర్ణమి రోజున సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ గృహ సముదాయం ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా ఇంటి తాళాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను చెరబట్టిన అక్రమార్కుల ఆట కట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. "ఇది కేవలం ఇళ్ల పంపిణీ కార్యక్రమం కాదు, ఒకప్పుడు మాఫియా ఆక్రమించిన భూమిలో ఇప్పుడు పేదలు ఇళ్లు దక్కాయనే సందేశం ఇది. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ పేదలను దోపిడీ చేసే వారి ఆటలు ఉత్తరప్రదేశ్లో ఇకపై సాగబోవు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడటానికి మా ప్రభుత్వం గట్టిగా నిలబడుతుంది. ఇది నూతన భారతదేశం, ఉత్తరప్రదేశ్ యొక్క గుర్తింపు. ఇక్కడ విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలతో కలిసి అభివృద్ధి నడుస్తుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన లక్నోలో మాఫియా లేని భూమిలో లబ్ధిదారులకు గృహాలను అందించడం నిజంగా గర్వకారణమ''ని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.చదవండి: బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంఒక్కో ఫ్లాట్ విలువ రూ. కోటి!గృహ సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా బహుమతులు పంపిణీ చేశారు. నివాసితుల పిల్లలతో అప్యాయంగా మాట్లాడారు. వారికి చాక్లెట్లు పంచారు. నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు. కాగా, లక్నోలోని ప్రైమ్ ఏరియాలో నిర్మించిన ఈ ఫ్లాట్లను దక్కించుకునేందుకు 8,000 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 5,700 మంది అర్హులని గుర్తించారు. వీరిలో 72 మంది ఫ్లాట్లను దక్కించుకున్నారు. ఒక్కో ఫ్లాట్ విలువ మార్కెట్ ధర ప్రకారం దాదాపు కోటి రూపాయలకు వరకు ఉంటుందని సీఎం యోగి చెప్పారు. संदेश स्पष्ट है...अगर गरीबों की व किसी सार्वजनिक भूमि पर कब्जा कर समाज को धमकाने का कार्य करोगे तो लेने के देने पड़ जाएंगे।आज लखनऊ में माफिया से मुक्त कराई गई भूमि पर दुर्बल आय वर्ग के 72 परिवारों के लिए निर्मित फ्लैट के आवंटन-पत्र का वितरण किया। इस अवसर पर सरदार वल्लभ भाई… pic.twitter.com/gNmE1FXvzT— Yogi Adityanath (@myogiadityanath) November 5, 2025
నెట్టింట భయానక వీడియో.. అధికారుల వార్నింగ్
భవిష్యత్తు సాధనంగా భావించే కృత్రిమ మేధస్సు (AI).. నాణేనికి రెండోవైపులా భయానక పరిస్థితులను కూడా సృష్టిస్తోంది. ప్రధానంగా అశ్లీలతను పెంపొందించే కంటెంట్ సృష్టిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనికి తోడు తప్పుడు ప్రచారాలతో జనాలను తప్పుదోవ పట్టించడంలో ముందు ఉంటోంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఆ జాబితాలోనిదే.. ఏఐ ఆధారిత వీడియోలు, ఫోటోలు, వాయిస్లు.. ఇప్పుడు ఇవన్నీ నిజాన్ని వక్రీకరించే సాధనాలుగా మారుతున్నాయి. ఈ దెబ్బకు ఏది నిజమో.. ఏది అబద్ధమో గుర్తు పట్టలేని స్థితికి మనిషి చేరుకుంటున్నాడు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా, సమాజాన్ని గందరగోళంలోకి నెట్టేలా ఏఐ వినియోగం పెరుగుతోంది. ఇటీవల మహారాష్ట్ర చందద్రాపూర్ జిల్లాలోని బ్రహ్మపురిలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియో సారాంశం ఏంటంటే.. అక్టోబర్ 31వ తేదీన.. అటవీశాఖకు చెందిన అతిథి గృహం బయట ఓ వ్యక్తి కాపలాగా ఉన్నాడు. ఆ సమయంలో ఓ పెద్దపులి వచ్చి అతనిపై దాడి చేసి నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే.. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ వీడియో ఒరిజినల్ది కాదని అధికారులు స్పష్టం చేశారు. అది అసలైన వీడియో కాదు, AI ద్వారా రూపొందించబడినదని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దంటూ స్పష్టం చేశారు. ఈ వీడియోను క్రియేట్ చేసిన వాళ్లతో పాటు సర్క్యులేట్ చేసిన వాళ్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ ఘటన ఏఐ వినియోగం ఎంత ప్రమాదకరంగా మారిందో చాటిచెప్పింది. ఇలాంటి సాంకేతికతలు సాధనంగా ఉండాలే తప్ప సాధనంగా మారకూడదని, ప్రజల భద్రత, నైతికత, నిజాయితీకి భంగం కలిగించేలా ఏఐ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందనే అభిపప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.सीसीटीवी रिकॉर्डिंग at ब्राह्मपुरी फारेस्ट गेस्ट हाउस. (चंद्रपुर डिस्ट्रिक)👇👇👇 pic.twitter.com/d4SGS2Fu6N— Himmu (@Himmu86407253) November 7, 2025AI వల్ల కలిగే ప్రమాదాలు:• నకిలీ వీడియోలు: నిజమైనవిగా ప్రచారం చేయడం ద్వారా భయాన్ని, అవమానాన్ని, రాజకీయ అస్థిరతను కలిగించే అవకాశం• డీప్ఫేక్ టెక్నాలజీ: ప్రముఖుల ముఖాలు, వాయిస్లు మార్చి తప్పుడు సమాచారం సృష్టించడం• సామాజిక గందరగోళం: ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం, అధికారిక ప్రకటనలపై అనుమానం కలగడం ప్రజలకు సూచనలు:• ధృవీకరించని వీడియోలు, ఫోటోలు షేర్ చేయవద్దు• అధికారిక వనరుల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలి
ఎన్ఆర్ఐ
మనోళ్ల దీపావళి ఎఫెక్ట్: వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు.
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వహించిన “చెంచు లక్ష్మి” నృత్య నాటిక, కళా పరిమళాలను విరజిమ్ముతూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యా సేవతో మిళితం చేస్తూ, సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF) కు అందజేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కాంతివంతమైన మార్గం వేస్తుందనే సంకేతంగా నిలిచింది. వేదికపై దీపాల కాంతి, పూజా మంత్రాల నినాదం మధ్య వేడుక ప్రారంభమైంది. మంచినీటి వంటి స్వరంతో హర్షిణి చుండి మరియు శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయకర్తలుగా ప్రవేశించి కార్యక్రమాన్ని నడిపారు.మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు — “కళ మనసును మేల్కొలుపుతుంది, విద్య భవిష్యత్తును వెలిగిస్తుంది” అనే మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ. తర్వాత దీపప్రజ్వలన కార్యక్రమంలో, ఫోర్సిత్ కౌంటీకి చెందిన ఎన్నో ప్రముఖులు ఒకచోట చేరారు రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్),మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్).దీప కాంతుల జ్యోతి విరజిమ్మగా, వేదిక ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. “చెంచు లక్ష్మి” — ప్రేమ, పరమాత్మకత, ప్రకృతి గాథకథ — దేవుడు నరసింహ స్వామి, భక్తి రూపిణి లక్ష్మి, మరియు అరణ్యాల గుండెల్లో పుట్టిన చెంచు లక్ష్మి మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ.నల్లమల అడవుల సౌందర్యం, మనసుని తాకే సంగీతం, భక్తి పుష్టి తో నిండిన నాట్యరూపాలు — అన్నీ కలగలసిన ఆ అద్భుత నాటిక.నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారులు నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం — ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25) మరియు కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి.వేదికపై సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలు అందజేయబడ్డాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల ,టాడ్ జోన్స్ ఈకార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు.
క్రైమ్
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఎన్టీఆర్ జిల్లా: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనపాడు సమీపంలో శుక్రవారం జరిగింది. గ్రామ సమీంలోని వ్యవసాయ పొలాల్లో కాలిన గాయాలతో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలు కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న సాతుపాటి సాయికుమార్ భార్య సాతుపాటి జ్యోతి (20) గా గుర్తించారు. భార్య భర్తల మధ్య ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో భార్య కాలిన గాయాలతో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యా ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తండ్రి మేడా సాంబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి ఐదేళ్ల కుమార్తె, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు.
మొక్కజొన్న తోటలో బాలుడి మృతదేహం
ప్రకాశం జిల్లా: మండల పరిధిలోని చిలకచర్లలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొక్కజొన్న తోటతో అదే గ్రామానికి చెందిన గిరిజన బాలుడు ఆర్తి నాగన్న(16) మృతదేహాన్ని పాతి పెట్టి ఉండటం కలకలం రేపింది. ఈ సంఘటన కొద్ది రోజుల ముందు చోటు చేసుకోగా శుక్రవారం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్, తహసీల్దార్ అశోక్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పంచనామా అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. యువకుడి మృతదేహం మొక్కజొన్న తోటలో పూడ్చిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. కొద్ది రోజులుగా కనబడకుండా పోయిన తమ కుమారుడు ఇలా మొక్కజొన్న తోటలో శవమై తేలడంతో మృతుని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించటం అందరినీ కలిచివేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టనున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
అమ్మా.. అంకుల్ చేతులతో తాకుతున్నాడు..
పల్నాడు జిల్లా: తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె కుమార్తైపె కన్నేసినప్పటికీ తల్లి నివారించకపోగా కుమార్తె ఫిర్యాదు చేసినా కూడా సహకరించాలంటూ ప్రోత్సహించేందుకు యత్నించిన ఘటన సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శివాజీనగర్లోని ఓ ఆపార్ట్మెంట్లో నివసిస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె భర్తతో వివాదం కారణంగా తొమ్మిదేళ్ల కిందట విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సత్తెనపల్లిలో నివసిస్తూ పట్టణానికి చెందిన అక్రమ రేషన్ వ్యాపారి తులసీకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అతడు నిత్యం ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తైపె కూడా ఎక్కడబడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగంతో ఆమె తల్లికి చెప్పి విలపించింది. అయినప్పటికీ తల్లి నివారించే ప్రయత్నం చేయకపోగా సహకరించాలంటూ ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. ఈ క్రమంలో పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని బంధువైన వృద్ధురాలు ఇటీవల శివాజీనగర్లోని మహిళా పోలీస్ తిరుమల లక్ష్మి దృష్టికి తీసుకు రావడంతో వ్యవహారం బట్టబయలైంది. మహిళా పోలీస్ ఈనెల 5న డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జయరాజుకు సమాచారం అందించింది. ఆయన ఈనెల 6న సత్తెనపల్లి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల నేతృత్వంలో ఆ విద్యార్థిని పట్టణ పోలీసుల వద్దకు తీసుకువచ్చి, జరిగిన ఘటనను వివరించారు. ఆ విద్యార్థిని కనిపించకుండా చేసేందుకు ఆమె తల్లి శతవిధాలా ప్రయత్నించగా పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తొలుత ఆమెను గురువారం నరసరావుపేట వన్స్టాప్ సెంటర్కు తరలించారు. శుక్రవారం మంగళగిరి లోని వన్స్టాప్ సెంటర్కు తరలించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తులసీకృష్ణను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించటంతో సత్తెనపల్లి సబ్జైలుకు తరలించారు.
మాలీలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం
పశ్చిమ ఆఫ్రికా దేశం ఐదుగురు భారతీయుల కిడ్నాప్ వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని భద్రతా వర్గాలు శుక్రవారం ధృవీకరించాయి. ఒక పక్క అశాంతి, జిహాదీ హింసతో అల్లాడి పోతుండగా మరోపక్క కోబ్రీ సమీపంలో ఉగ్రవాదుల చేతిలో భారతీయుల కిడ్నాప్ మరింత ఆందోళన రేపింది. పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో గురువారం కార్మికులను ముష్కరులు కిడ్నాప్ చేశారని, వారు విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నారని భద్రతా వర్గాలు AFPకి తెలిపాయి. మరోవైపు బాధితులు పనిచేస్తున్న కంపెనీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ముందుజాగ్రత్త చర్యగా మిగిలిన వారిని రాజధాని బమాకోకు సురక్షితంగా తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తామే ఈ కిడ్నాప్ చేసినట్టు ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించలేదు.2012 నుండి తిరుగుబాట్లు, ఘర్షణలతో అట్టుడుడుతున్న దేశంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్లు సర్వసాధారణంగా మారిపోయాయి. అల్ఖైదాదీ సంబంధిత గ్రూప్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లింస్ (JNIM) జిహాదీలు సెప్టెంబర్లో బమాకో సమీపంలో ఇద్దరు ఎమిరాటీ జాతీయులను మరియు ఒక ఇరానియన్ను కిడ్నాప్ చేశారు.50 మిలియన్ల డాలర్ల చెల్లింపు తరువాత వారిని గత వారం విడుదల చేశారు.
వీడియోలు
చేపల వర్షం..ఇదేందయ్యా, ఇది!
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
బీహార్ లో గెలిచేశాం.. ఇక తుపాకులు ఉండవు
కూటమి నేతల తీరుపై విడదల రజిని తీవ్ర ఆగ్రహం
రాజమౌళి కొత్త సినిమా నుంచి ప్రమోషన్ స్టార్ట్.. మహేష్ బాబు టైటిల్ ఇదేనా?
నువ్వు 100 జన్మలెత్తినా జగన్ స్థాయిని చేరుకోలేవు
టికెట్ కోసం కొలికపూడి 5 కోట్లు.. క్రమశిక్షణ కమిటీ చేతికి కేశినేని చిన్ని దందాల చిట్టా
రూ.7 కోట్లకు టికెట్ ఇస్తానని వేమన సతీష్ మోసం
పెద్ది పాటలో చరణ్ స్టెప్స్, సలామ్ అనాలిని గుర్తు చేస్తున్నాయా?
వాగులో వజ్రాలు.. ఎగబడుతున్న జనం

