ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం.. వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.సప్తమి ప.11.11 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: హస్త సా.6.37 వరకు తదుపరి చిత్త, వర్జ్యం: రా.3.11 నుండి 4.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.04 వరకు,అమృత ఘడియలు: ప.12.14 నుండి 1.56 వరకు.సూర్యోదయం : 6.37సూర్యాస్తమయం : 5.38రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. రుణబాధలు తొలగుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.వృషభం: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.మిథునం: కొన్ని సమస్యలు సవాలుగా మారతాయి. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ముఖ్యమైన పనులు వాయిదా. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.కర్కాటకం: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. శుభవార్తలు. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.సింహం: దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం తగ్గుతుంది.కన్య: ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. భూవ్యవహారాలలో కొత్త ఆశలు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.తుల: ప్రయాణాలలో మార్పులు. స్వల్ప అనారోగ్యం. శ్రమాధిక్యం. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.వృశ్చికం: కొన్ని వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.ధనుస్సు: పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.మకరం: పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.కుంభం: పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. బంధువర్గంతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఒత్తిడులు.మీనం: పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా సాగుతారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
ఇక రాజకీయ ధురంధురుల నిష్క్రమణేనా?
సాక్షి, ఢిల్లీ: దేశ రాజకీయ చరిత్రలో 2026 ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్ కానున్నారు. వాళ్ల వివరాలను రాజ్యసభ సచివాలయం పార్లమెంటరీ బులిటెన్ ద్వారా వెల్లడించింది. వీళ్లలో దశాబ్ధాలుగా రాణిస్తూ.. రాజకీయ ధురంధరులుగా పేర్లున్న నేతలు కూడా ఉన్నారు.ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్(నామినేటెడ్ ఎంపీ) టర్మ్లు ముగుస్తాయి. పెద్దల సభలో ప్రతిపక్ష నేత కావడంతో ఖర్గేకు మళ్లీ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈ మధ్య ఆయన పేస్మేకర్ ఇంప్లాంటేషన్ జరిగింది. దీంతో అనుమానాలు నెలకొన్నాయి. మిగతా వాళ్లలో.. వయసు రిత్యా వీళ్లలో తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఏపీ నుంచి నలుగురు ఉండగా, అందులో జూన్ 21వ తేదీన వైఎస్సార్సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని.. తెలుగు దేశం పార్టీ నుంచి సానా సతీష్ బాబు ఉన్నారు. తెలంగాణ నుంచి రిటైర్ కానున్న ఇద్దరు ఎంపీలు ఈ లిస్ట్లో ఉన్నారు. ఏప్రిల్ 9న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ రిటైర్ కానున్నారు.మొత్తం 73 సీట్లలో 72 సీట్లకుగాను ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలతో ఎన్డీఏ (NDA) కూటమి స్థానాలు పెంచుకునే అవకాశం ఉందని.. మొత్తం 145 సీట్లు వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. అలాగే.. విపక్ష ఇండియా బ్లాక్ విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయొచ్చని సమాచారం. ఏప్రిల్లో తొలి విడత, నవంబర్లో రెండు విడతలలో జరిగే అవకాశం ఉంది.రాష్ట్రాల వారీగా రిటైర్ కానున్న ఎంపీల సంఖ్యమహారాష్ట్ర :4 ఎంపీలు ఒడిశా :4 తమిళనాడు :6పశ్చిమ బెంగాల్ :5అస్సాం :3 బీహార్ :5 చత్తీస్గడ్ :2 హర్యానా: 2 హిమాచల్ ప్రదేశ్ :1 గుజరాత్ 4 జార్ఖండ్ 2 మధ్యప్రదేశ్ 3 మణిపూర్ :1 మేఘాలయ :1 రాజస్థాన్ :3 అరుణాచల్ ప్రదేశ్ :1 కర్ణాటక: 4 మిజోరం :1 యూపీ :10 ఉత్తరాఖండ్ : 1
ఫిబ్రవరి 14న ‘పుర’ పోరు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నిక వచ్చే నెల 14న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటరు జాబితా ఈ నెల 16న ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకా శం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రచారానికి వారం రోజుల వ్యవధి ఇచ్చేలా షెడ్యూల్పై కసరత్తు జరుగుతోంది.రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూలును ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినా చట్టపరమైన అడ్డంకులను దృష్టిలో పెట్టుకుని 32 శాతానికే పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. నివేదిక అందించిన ‘బూసాని’.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన బీసీ డెడికేషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నివేదిక అందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 12 లేదా 13వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించే పక్షంలో ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం నేపథ్యంలో మున్సిపాలిటీల్లో బీసీ జనాభా స్వల్పంగా తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి పరిమితం కానుండగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రూ.85 కోట్లు విడుదల చేయాలని లేఖ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం రూ.85 కోట్లు విడుదల చేయాలని కోరుతూ పురపాలక శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పోరేషన్లు కలుపుకుని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లోని 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మిగిలిపోయిన ఐదారు కార్పొరేషన్ల పాలక మండళ్లను రద్దే చేయడం లేదా..వారితో రాజీనామా చేయించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కూ.. చెక్.. చెక్!
సాక్షి, హైదరాబాద్: వేగంగా దూసుకెళ్లే రైళ్లకు అడ్డుగా ట్రాక్ మీదకు వచ్చే జంతువులను ముందే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ త్వరలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ప్రధాన రైల్వే కారిడార్లలో రైళ్ల గరిష్టం వేగం గంటకు 110 కి.మీ.గా ఉంది. కొన్ని ముఖ్య కారిడార్లను మాత్రం పటిష్ట పరిచి 130 కి.మీ.వేగాన్ని తట్టుకునేలా మార్చారు.త్వరలో మిగతా కారిడార్లను కూడా ఆ స్థాయికి తెచ్చేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించుకుని అమలు ప్రారంభించింది. దీంతో రైళ్ల వేగం కూడా పెరగబోతోంది. ట్రాక్ మీదకు వచ్చే జంతువులు వేగంగా దూసుకెళ్లే రైళ్లకు ప్రమాదకరంగా మారుతున్నాయి.ట్రాక్ మీద జంతువుల కదలికలను ముందే గుర్తించి రైళ్ల వేగాన్ని తగ్గించటంతోపాటు అవసరమైతే నిలిపివేయగలిగేలా కృత్రిమ మేథతో కూడిన సాంకేతికతను వినియోగించుకోనున్నారు. ఇలా పని చేస్తుంది... అభివృద్ధి చెందిన దేశాలు కృత్రిమ మేథతో కూడిన వ్యవస్థను ఇందుకు అనుసరిస్తున్నాయి. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తుండడంతో మన రైల్వే శాఖ కూడా దీని ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది.ఈ సాంకేతికత రెండు భాగాలుగా ఏర్పాటవుతుంది. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్), ఏఐ– కెమెరాల ఏర్పాటుతో పని చేస్తుంది. ఐడీఎస్ వ్యవస్థ డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సిస్టమ్ (డీఏఎస్) ఆధారంగా పనిచేస్తుంది.ఇందులో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ)ను రైలు పట్టాల వెంబడి అమరుస్తారు. ఈ కేబుల్స్ జంతువుల కదలికల నుంచి వచ్చే ప్రకంపనలను 300–500 మీటర్ల దూరం నుంచే గుర్తిస్తాయి.ఈ సమాచారాన్ని ఏఐ సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేసి, రైళ్లలోని లోకో పైలట్లు, స్టేషన్లోని సంబంధిత సిబ్బందికి, కంట్రోల్ రూమ్లకు రియల్–టైమ్ అలర్ట్ల ద్వారా పంపుతుంది. దీంతో రైలు వేగాన్ని తగ్గించి జంతువులు ట్రాక్ దాటిన తర్వాత ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటారు. అవి దాటని పక్షంలో రైళ్లను నిలిపేస్తారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 141 రూట్ కిలోమీటర్ల మేర పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. ఇటీవల అసోంలో రైలు ఢీకొని పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోయిన నేపథ్యంలో దీన్ని వేగంగా ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వేలో కూడా ప్రయోగాత్మక పరిశీలనకు రెండు కారిడార్లలో ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన స్పష్టత రానుంది.
సరిహద్దులు చెరపొద్దు.. శాంతిని చంపొద్దు!
ఐఈడీ డేటా ప్లాట్ఫాం అందుబాటులోకి
తీవ్రవాదుల గుప్పిట్లో యూనస్ ప్రభుత్వం
నిష్పూచీ నిష్క్రమణలు
నిరసనలను కఠినంగా అణచివేస్తాం
టీనేజీ బంధాల రక్షణకు... రోమియో–జూలియట్ క్లాజ్
ఎంత తాగినా కిక్కే రావడం లేదు.. పెంచిన ధరలే గుర్తొస్తున్నాయి!!
మరో షిప్ సీజ్!
స్క్రామ్ ఇంజన్ పరీక్ష విజయవంతం
దరఖాస్తుతో.. దేవుడి భూములు!
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్'.. వీడియో వైరల్
పడిపోయిన బంగారం, వెండి ధరలు
ట్రంప్ ఉపసంహరణ తంత్రం
హార్దిక్ పాండ్యా మహోగ్రరూపం
ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు
వెన్నుపోటు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. నాడు మామకు.. నేడు సీమకు
ఇప్పటికే అప్పుల్లో, ప్రజలను నమ్మించి మోసం చేయడంలో నెంబర్.1 మనమే సార్!
తెలంగాణలో నాయకుల తిట్ల పురాణం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
తారుమారైన బంగారం, వెండి ధరలు..
IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు
..స్వదేశీయుల్ని ఎలాగూ తొలగిస్తూనే ఉన్నాము!
..దాని దారి మళ్ళించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నార్సార్ శాస్త్రవేత్తలు!
వెనెజువెలా చమురు.. అంత వీజీ కాదు ట్రంపూ!
జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!
జన నాయగన్ 'బుక్ మై షో' రీఫండ్.. చరిత్రలో ఇదే తొలిసారి
‘వెండి పని’ పడదాం.. ‘సిల్వర్ సెక్యూరిటీ’ అవసరం
నన్ను ముద్దు చేస్తున్నాడనుకున్నా.. కోరికలు తీర్చుకున్నాడు!
సరిహద్దులు చెరపొద్దు.. శాంతిని చంపొద్దు!
ఐఈడీ డేటా ప్లాట్ఫాం అందుబాటులోకి
తీవ్రవాదుల గుప్పిట్లో యూనస్ ప్రభుత్వం
నిష్పూచీ నిష్క్రమణలు
నిరసనలను కఠినంగా అణచివేస్తాం
టీనేజీ బంధాల రక్షణకు... రోమియో–జూలియట్ క్లాజ్
ఎంత తాగినా కిక్కే రావడం లేదు.. పెంచిన ధరలే గుర్తొస్తున్నాయి!!
మరో షిప్ సీజ్!
స్క్రామ్ ఇంజన్ పరీక్ష విజయవంతం
దరఖాస్తుతో.. దేవుడి భూములు!
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్'.. వీడియో వైరల్
పడిపోయిన బంగారం, వెండి ధరలు
ట్రంప్ ఉపసంహరణ తంత్రం
హార్దిక్ పాండ్యా మహోగ్రరూపం
ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు
వెన్నుపోటు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. నాడు మామకు.. నేడు సీమకు
ఇప్పటికే అప్పుల్లో, ప్రజలను నమ్మించి మోసం చేయడంలో నెంబర్.1 మనమే సార్!
తెలంగాణలో నాయకుల తిట్ల పురాణం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
తారుమారైన బంగారం, వెండి ధరలు..
IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు
..స్వదేశీయుల్ని ఎలాగూ తొలగిస్తూనే ఉన్నాము!
..దాని దారి మళ్ళించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నార్సార్ శాస్త్రవేత్తలు!
వెనెజువెలా చమురు.. అంత వీజీ కాదు ట్రంపూ!
జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!
జన నాయగన్ 'బుక్ మై షో' రీఫండ్.. చరిత్రలో ఇదే తొలిసారి
‘వెండి పని’ పడదాం.. ‘సిల్వర్ సెక్యూరిటీ’ అవసరం
నన్ను ముద్దు చేస్తున్నాడనుకున్నా.. కోరికలు తీర్చుకున్నాడు!
ఫొటోలు
తెలంగాణ : సంక్రాంతి సంబరాలలో సచివాలయం ఉద్యోగులు (ఫొటోలు)
ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు
రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్
నగరంలో హీరోయిన్ డింపుల్ హయతీ సందడి (ఫొటోలు)
విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్ (ఫొటోలు)
ట్రెండింగ్లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?
అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)
'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్లో ఫోటోలు
'అనగనగా ఒక రాజు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సెలబ్రిటీలు (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)
సినిమా
'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!
బిర్యానీ వండాలంటే పక్కా ప్లానింగ్ ఎంత అవసరమో.. దాన్ని తినాలన్నా అలాంటి ప్లానింగే ముఖ్యం. 'రాజాసాబ్' పరిస్థితీ ఇలానే తయారైంది. రిలీజ్ పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. చివరకు జనవరి 9న అని పక్కాగానే ప్లాన్ చేసుకున్నారు. తీరా థియేటర్లలోకి వచ్చే చివరి నిమిషం వరకు అంతా గందరగోళమే. మొత్తం ఆదరాబాదరానే. ఇంతకీ 'రాజాసాబ్' విషయంలో ఏమేం తప్పిదాలు జరిగాయి?(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)తెలంగాణలోని ప్రీమియర్స్ ప్లానింగ్ ఘోరంగా ఫెయిలైంది. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల పెంపు జీవో ముందే వచ్చేసింది. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. తెలంగాణకు వచ్చేసరికి రిలీజ్ రోజు(జనవరి 09న) వేకువజామున జీవో జారీ అయింది. 8వ తేదీ సాయంత్రమే ప్రీమియర్స్ ఉంటాయని ప్రకటించారు. కానీ అటు జీవో రాకపోవడంతో విడుదలకు కొన్ని గంటల ముందు వరకు నిర్మాతలు.. బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. సెన్సార్ త్వరగానే పూర్తి చేసుకుని సిద్ధమయ్యారు గానీ నైజాంలో ప్రీమియర్స్, రెగ్యులర్ బుకింగ్స్ విషయంలో ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది.ప్రమోషనల్ కంటెంట్ విషయంలోనూ 'రాజాసాబ్' టీమ్ సరైన ప్లానింగ్ చేసుకోలేదా అనిపించింది. ఎందుకంటే రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసి కాస్తోకూస్తో హైప్ వచ్చేలా చేశారు కానీ పాటలు మాత్రం ఎందుకనో పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మూవీ విడుదలకు చాలా రోజులు ముందుగానే చేసేశారు. ప్రభాస్ పాల్గొన్న ఒకే ఒక్క ఇంటర్వ్యూని విడుదలకు ముందురోజు వరకు ఆన్లైన్లో వదల్లేదు. 'నాచో నాచో' అనే పాట కేవలం హిందీ, తమిళంలోనే రిలీజ్ చేశారు. తెలుగులో సినిమా చేస్తూ తెలుగు వెర్షన్ పాట లేకపోవడం ఏంటో?(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)'రాజాసాబ్' కోసం దాదాపు నాలుగున్నర గంటల ఫుటేజీ చిత్రీకరించామని స్వయంగా దర్శకుడి మారుతినే బయటపెట్టారు. తీరా చూస్తే మూడు గంటల సినిమాకే ప్రేక్షకుల నుంచి నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. ప్రభాస్.. ముసలి గెటప్లో కనిపించి, చేసే ఫైట్ సీక్వెన్స్ పూర్తిగా తీసేశారు. కథకు అవసరమా లేదా అని ముందే ఆలోచించి ఉంటే ప్రేక్షకుల నుంచి నిట్టూర్పులు ఉండేవి కాదుగా! అసలు ప్రభాస్ ఓల్డ్ గెటప్ వల్లే మూవీపై కాస్త హైప్ ఏర్పడింది. ఇప్పుడు అదే లేదని తెలిసి అందరూ నిరుత్సాహపడుతున్నారు.తెలంగాణలో టికెట్ రేట్ల విషయంలోనూ మూవీ టీమ్ ప్లానింగ్ బెడిసికొట్టిందనే చెప్పొచ్చు. సింగిల్ బెంచ్కి వెళ్లి అనుకూలంగానే ఉత్తర్వులు తెచ్చుకున్నారు కానీ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల పంపు మెమోని తెలంగాణ హైకోర్టు ఇప్పుడు సస్పెండ్ చేసింది. పాత ధరలకే టికెట్లు అమ్మాలని బుక్ మై షోని ఆదేశించింది. గత నెలలో 'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు హంగామా జరిగినప్పుడే.. 'రాజాసాబ్' టీమ్ అలెర్ట్ అయి, సరైన నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. కానీ అలా చేయలేకపోయారు. (ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు?)
దళపతి విజయ్.. గతంలోనూ ఇలాంటి అనుభవాలే
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్' వాయిదా పడింది. లెక్క ప్రకారం ఈరోజే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే కొత్త తేదీని ప్రకటించలేదు. 21వ తేదీన తర్వాత హియరింగ్ ఉంది. చూస్తుంటే ఈనెల రావడమే కష్టమే. దీని వెనక రాజకీయ కారణాలున్నాయని అభిమానులు, విజయ్ టీవీకే పార్టీ ఆరోపిస్తోంది. ఇదే కాదు గతంలోనూ విజయ్ చిత్రాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి ఆ మూవీస్ ఏంటి?(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)2023లో రిలీజైన 'లియో'కు చాలానే సమస్యలు ఏర్పడ్డాయి. తమిళనాడు వ్యాప్తంగా మార్నింగ్ షోలు వేయనివ్వలేదు. రోజుకి ఇన్ని షోలు మాత్రమే వేయాలని కఠినంగా వ్యవహరించారు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశమివ్వలేదు. ఇలా పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ఓవరాల్ రన్ ముగిసేసరికి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ మూవీగా నిలిచింది.2017లో రిలీజైన 'మెర్సల్'(అదిరింది).. రిలీజ్ తర్వాత రాజకీయ ఇబ్బందుల్లో ఎదుర్కొంది. జీఎస్టీ, నోట్ల రద్దు గురించి ఉన్న డైలాగ్స్ విమర్శలకు కారణమయ్యాయి. కొందరు నాయకులు.. ఏకంగా మూవీలో సీన్స్ తీసేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే మేకర్స్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు నమోదు చేసింది.2021లో రిలీజైన 'మాస్టర్'కు కొవిడ్ వల్ల సమస్యలు ఎదురయ్యాయి. అనుకున్న టైంకి విడుదల కాలేకపోయింది. థియేటర్ల కేటాయింపు, స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వకపోవడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. అలానే ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వడంపై పలువురు పిటీషన్లు వేశారు. తర్వాత కోర్టు నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు నమోదు చేసింది. విజయ్ స్టామినా ఏంటనేది మరోసారి నిరూపించింది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)2018లో 'సర్కార్' విడుదలకు ముందే అడ్డంకులు ఎదుర్కొంది. ఓటింగ్ సరళి, రాజకీయ పార్టీ గుర్తులు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. వాటిని మ్యూట్ లేదా పూర్తిగా తీసేయమనే డిమాండ్స్ వినిపించాయి. కానీ కొన్ని మార్పులు చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేశారు. ప్రారంభంలో బాగానే ఆడింది కానీ లాంగ్ రన్లో ఓకే ఓకే అనిపించుకుంది.2015లో రిలీజైన 'పులి'కి అయితే పైన చెప్పినట్లు కాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. విడుదలయ్యే కొన్నిరోజుల ముందు వరకు సమస్యలు తప్పలేదు. కొన్నిచోట్ల షోలు రద్దయ్యాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓపెనింగ్స్ బాగానే తెచ్చుకుంది. తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.2012లో వచ్చిన 'తుపాకీ'కి అయితే విడుదలకు ముందే ఇబ్బందులు. టైటిల్, అలానే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ, సామాజిక అంశాల దృష్ట్యా కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో చిన్న చిన్న మార్పులు చేసి పలు విషయాల్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. విజయ్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.2014లో వచ్చిన 'కత్తి' చిత్రానికి తిప్పలు తప్పలేదు. విడుదలకు ముందే నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. శ్రీలంక తమిళ సెంటిమెంట్స్ అనుకూలంగా తీశారని రాజకీయ ఆరోపణలు చేశారు. బెదిరింపులు, చివరి నిమిషాల్లో హడావుడి వల్ల తమిళనాడు అంతటా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతటా క్లియరెన్స్ తెచ్చుకుని అనుకున్న తేదీనే థియేటర్లలోకి వచ్చింది. విమర్శలు, ఆరోపణలు తట్టుకుని నిలబడింది. కమర్షియల్ సక్సెస్ అందుకుని విజయ్ ఇమేజ్ మరింత పెంచింది.(ఇదీ చదవండి: విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!)
'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్
ప్రభాస్ 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన వస్తోంది. మరోవైపు టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు, నిర్మాతలకు షాకిచ్చింది. టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్లకే టికెట్ రేట్లు వసూలు చేయాలని బుక్ మై షోని ఆదేశించింది. ఇక మీదట ఎలాంటి మెమోలు ఇవ్వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్ రేట్ పెంచాలనుకుంటే జీవో నం.120 ప్రకారం 350లోపే సినిమా టికెట్ ఉండాలని సింగిల్ బెంచ్ పేర్కొంది.అలానే పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని, అలానే అధికారుల తీరుపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని అడిగింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని మండిపడింది. కొద్దిరోజుల క్రితం టికెట్ ధరలు పెంచబోమని స్వయంగా మంత్రి చెప్పినా మళ్లీ ఎందుకు పెంచారంటూ కోర్టు, అధికారుల్ని ప్రశ్నించింది.టికెట్ ధరల పెంపు కోసం మనశంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్ బెంచ్ కోర్టుకు వెళ్లారు. అక్కడ వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలని సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పుడు టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయిపోయింది.
రెండు ఓటీటీలో 'జిగ్రీస్' సునామీ.. అన్-లిమిటెడ్ నవ్వుల జాతర
ఓటీటీలో 'జిగ్రీస్' సినిమా ట్రెండింగ్లో కొనసాగుతుంది. థియేటర్స్లో చూడాలనుకుని వెళ్లలేని వారందరూ ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఈ మూవీని చూస్తున్నారు. టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్.. నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సన్ నెక్స్ట్ (SunNXT)లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. యువ నటీనటులతో తెరకెక్కించిన జిగ్రీస్ సినిమా ట్రైలర్ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. దీంతో మూవీకి బజ్ వచ్చింది.ఈ మూవీలో కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. కృష్ణ వోడపల్లి నిర్మాణంలో, చిత్తం వినయ్ కుమార్ సహ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా గారి సపోర్ట్ పెద్ద బలాన్ని ఇచ్చింది. సయ్యద్ కమ్రాన్ సంగీతం, ఈశ్వరదిత్య డీవోపీ, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ వీకెండ్లో ఈ క్లీన్ ఎంటర్టైనర్ని అస్సలు మిస్ అవ్వకండి!
క్రీడలు
భారత్లో ఆడబోము..! బంగ్లా డిమాండ్పై స్పందించిన బీసీసీఐ
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత్కు రావడంపై ఇంకా సందిగ్థత కొనసాగుతోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే.అయితే అందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విముఖత చూపించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఐసీసీ నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ విషయంపై బీసీసీఐ తొలిసారి స్పందించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవిష్యత్తు ప్రణాళికలను రచించేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు.ఈ మీటింగ్లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో పాటు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సీఓఈ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ పాల్గోన్నారు. అయితే ఈ సమావేశంలో కేవలం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించినట్లు దేవజిత్ సైకియా స్పష్టం చేశారు."కేవలం సీఓఈ, క్రికెట్ క్రికెట్ అభివృద్ధిపైనే చర్చించాం. బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్ల తరలింపు అనేది మా పరిధిలోని అంశం కాదు. దానిపై ఐసీసీయే తుది నిర్ణయం తీసుకుంటుంది" సైకియా పేర్కొన్నారు. అదేవిధంగా సీఓఈలో ఖాళీగా ఉన్న హెడ్ ఆఫ్ క్రికెట్ ఎడ్యుకేషన్, హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ పోస్ట్లను భర్తీ చేసేందుకు బోర్డు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.కాగా ఇటీవల భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ 2026 నుంచి తప్పించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 2026 టీ20 ప్రపంచ కప్లో భారత్లో మ్యాచ్లు ఆడబోమని, తమ మ్యాచ్ల వేదికలను శ్రీలంకకు తరలించాల్సిందిగా ఐసీసీకి బంగ్లా లేఖ రాసింది. బంగ్లా అభ్యర్ధను ఐసీసీ తిరస్కరించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే మరోసారి ఐసీసీకి బీసీబీ లేఖ రాసినట్లు సమాచారం.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఐర్లాండ్ జట్టు ప్రకటన
భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఐర్లాండ్ ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ సారథ్యం వహించనున్నాడు. అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ లొర్కాన్ టక్కర్ వ్యవహరించనున్నాడు.అయితే ఈ జట్టులో అన్నదమ్ముల జోడీలు ఉన్నాయి. మార్క్ అడైర్, రాస్ అడైర్తో పాటు హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్ బ్రదర్స్ వరల్డ్కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్, ఆల్ రౌండర్ కర్టిస్ కాంఫర్ స్టార్ ప్లేయర్లను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్.. ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్లతో పాటు గ్రూపు-బిలో ఉంది. ఐరీష్ జట్టు తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 8న కోలంబో వేదికగా శ్రీలంకతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్కు ఐర్లాండ్.. న్యూజిలాండ్, పాకిస్తాన్లతో పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధించింది. ఇక ఈ పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టుపాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.చదవండి: BBL 2025-26: ట్రావిస్ హెడ్ కీలక నిర్ణయం..
ట్రావిస్ హెడ్ కీలక నిర్ణయం..
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. యాషెస్ సిరీస్ ముగియడంతో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు తమ తమ బీబీఎల్ ఫ్రాంచైజీల్లో చేరేందుకు సిద్దమయ్యారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఉస్మాన్ ఖవాజాతో పాటు మార్నస్ లబుషేన్ ఇప్పటికే బ్రిస్బేన్ హీట్ జట్టులో చేరారు.ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లలో బ్రిస్బేన్ హీట్ కెప్టెన్గా ఖవాజా వ్యవహరించనున్నాడు. జనవరి 10న సిడ్నీ థండర్స్తో జరగనున్న మ్యాచ్లో లబుషేన్, ఖవాజా ఆడనున్నారు. అదేవిధంగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ సిడ్నీ సిక్సర్స్ తరపున బరిలోకి దిగనున్నారు.హోబర్ట్ హరికేన్స్తో జరిగే మ్యాచ్కు వీరద్దరూ అందుబాటులో ఉండనున్నారు. యాషెస్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' నిలిచిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వారం రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఆ తర్వాత జనవరి 16న సిడ్నీతో జరిగే మ్యాచ్లో సిడ్నీ సిక్సర్ తరపున స్టార్క్ ఆడనున్నాడు.స్టార్క్ బీబీఎల్లో ఆడనుండడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలెక్స్ కారీ (అడిలైడ్ స్ట్రైకర్స్), జోష్ ఇంగ్లిష్ రిచర్డ్సన్ (పెర్త్ స్కార్చర్స్), బ్రెండన్ డాగెట్ (మెల్బోర్న్ రెనెగేడ్స్) కూడా తమ జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.హెడ్, గ్రీన్ దూరం...అయితే ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి హెడ్ అడిలైడ్ స్ట్రైకర్స్, గ్రీన్ పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడాల్సి ఉండేది. కానీ వర్క్లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా వీరిద్దరూ విశ్రాంతి తీసుకోనున్నారు. నేరుగా వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. హెడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. యాషెస్ సిరీస్లో హెడ్ 629 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్కు ఛాన్స్?
WPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్కు తెరలేచింది. తొలి మ్యాచ్లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది.అయితే తొలి మ్యాచ్కు ముంబై స్టార్ ప్లేయర్ హీలీ మాథ్యూస్ దూరమైంది. అదేవిధంగా ఆసీస్ ప్లేయర్ నికోలా కారీ ముంబై తరపున డబ్ల్యూపీఎల్ అరంగేట్రం చేసింది. ఆర్సీబీ తరపున అయితే ఏకంగా ఆరుగురు అరంగేట్రం చేశాఉరు. గ్రేస్ హారిస్,లిన్సే స్మిత్, లారెన్ బెల్, అరుంధతి రెడ్డి వంటి స్టార్ ప్లేయర్లకు ఆర్సీబీ తరపున ఇదే తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం.తుది జట్లుముంబై ఇండియన్స్: నాట్ స్కివర్-బ్రంట్, జి కమలిని(వికెట్ కీపర్), అమేలియా కెర్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, నికోలా కారీ, పూనమ్ ఖేమ్నార్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజన, సైకా ఇషాక్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్), గ్రేస్ హారిస్, దయాళన్ హేమలత, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రేమ రావత్, లిన్సే స్మిత్, లారెన్ బెల్ఓపెనింగ్ సెర్మనీ అదుర్స్..ఇక డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ వేడుకను బీసీసీఐ ఘనంగా నిర్వహించింది. తొలుత మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు మహిళా సాధికారతపై ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన డ్యాన్స్తో, యో యో హనీ సింగ్ తన పాటలతో ప్రేక్షకులను అలరించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్కు ఛాన్స్?
న్యూస్ పాడ్కాస్ట్
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పన్నాగం... చంద్రబాబు కోసం ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ ముసుగులో కుతంత్రం
ప్రజలకు సంజీవని లాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు శాపనార్థాలు... సరైన అనుమతులు లేకుండా లిఫ్ట్ ప్రారంభించారంటూ పోలవరం సాక్షిగా అక్కసు వెళ్లగక్కిన ఏపీ సీఎం
సీమ జల ద్రోహి చంద్రబాబు. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలి. రాయలసీమ జిల్లాల వైఎస్సార్సీపీ నేతల డిమాండ్
సీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్దేశించిన సమాచారాన్ని ఇవ్వని చంద్రబాబు సర్కార్
రాయలసీమకు సైంధవుడు చంద్రబాబే... ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపివేసి మరణ శాసనం
వెనెజువెలాపై అమెరికా భీకర దాడులు... దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకొని న్యూయార్క్కు తరలించిన అమెరికా సేనలు
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సూపర్ సిక్స్ మోసాల ఖరీదు ఒక లక్ష 42 వేల కోట్ల రూపాయల పైమాటే...కొత్త ఏడాదిలోనైనా బకాయిలు చెల్లించాలంటూ ప్రజల డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో అత్యంత అధ్వానంగా మారిన ‘108’ నెట్వర్క్ నిర్వహణ... అంబులెన్స్ సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న బాధితులు
2026కు ఘన స్వాగతం పలికిన విశ్వమానవాళి... ఆనందోత్సాహాల నడుమ న్యూ ఇయర్ వేడుకలు
బిజినెస్
అదే రీఛార్జ్ ప్లాన్.. పెరిగిన డైలీ డేటా!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బీఎస్ఎన్ఎల్.. తన రూ. 2399, రూ. 485, రూ. 347, రూ. 225 రీఛార్జ్ ప్లాన్ల మీద 0.5 జీబీ అదనపు డేటా అందిస్తుంది. గతంలో ప్యాక్ రీఛార్జ్ ద్వారా 2.5 జీబీ డేటా లభిస్తే.. ఇప్పుడు అదే ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 3.0 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.BSNL enhances prepaid plans with extra daily data!Enjoy a data boost on ₹2399, ₹485, ₹347 & ₹225 at no extra cost. Stay connected longer on Bharat’s trusted network. Offer valid till 31 Jan 2026Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c#BSNL… pic.twitter.com/iQvAesldmr— BSNL India (@BSNLCorporate) January 9, 2026
పర్సనల్ లోన్ vs టాప్-అప్ లోన్: ఏది బెస్ట్?
ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసే వారైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో లోన్స్ అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే.. పర్సనల్ లోన్ & టాప్-అప్ లోన్లలో ఏది బెస్ట్. మీ సందేహానికి.. ఈ కథనమే సమాధానం.పర్సనల్ లోన్పర్సనల్ లోన్ గురించి దాదాపు అందరికీ తెలుసు. విద్య, పెళ్లి, వైద్య ఖర్చులు, ట్రావెల్ వంటి వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువమంది ఈ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ లోన్కు అప్రూవల్ ప్రక్రియ కొంత వేగంగా ఉంటుంది. అంతే కాకుండా డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా కొంత తక్కువే.పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 11 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కూడా కొంత ఎక్కువే. మొత్తం మీద మీరు తీసుకున్న లోన్ మీద కొంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.టాప్ అప్ లోన్టాప్ అప్ లోన్ విషయానికి వస్తే.. ఇది మీరు ఇప్పటికే తీసుకున్న లోన్పైనే అదనంగా ఇచ్చే లోన్ అన్నమాట. ఒక వ్యక్తి లోన్ తీసుకుని సక్రమంగా చెల్లిస్తున్న సమయంలో.. బ్యాంక్స్ లేదా ఫైనాన్స్ కంపెనీలు ఈ సౌకర్యాన్ని అందిస్తాయి.టాప్ అప్ లోన్ తీసుకోవడం వల్ల.. వడ్డీ రేటు కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా హోమ్ లోన్ మీద తీసుకునే టాప్-అప్ లోన్కు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఈఎంఐ కూడా పర్సనల్ లోన్తో పోలిస్తే చాలా తక్కువే. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. టాప్ అప్ లోన్ కావాలంటే.. మీరు ఇప్పటికే లోన్ తీసుకుని ఉండాలి. సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి.పర్సనల్ లోన్ అనేది అత్యవసరంలో ఉపయోగపడుతుంది. ఇది దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుంది. టాప్ అప్ లోన్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండదు. లోన్ తీసుకుని, సమయానికి చెల్లించేవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి.. మీ సౌలభ్యం, అవసరాన్ని బట్టి.. ఏ లోన్ తీసుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి.
పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?
కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్లను 10 శాతం నుంచి 20 శాతం పెంచవచ్చు. ఎయిర్టెల్ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుందని సమాచారం. అయితే వోడాఫోన్ ఐడియా (VI) పరిస్థితి మరింత సవాలుగా మారనుంది. దాని బకాయి చెల్లింపులను తీర్చడానికి, కంపెనీ FY27 & FY30 మధ్య మొబైల్ సర్వీస్ రేట్లను 45 శాతం వరకు పెంచాల్సి రావచ్చు.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది. జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!జూన్ 2026 నుంచి టారిఫ్లు పెరిగితే, సాధారణ వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జ్ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు & ఎక్కువ డేటా వినియోగించేవారి ఇది కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెలికాం కంపెనీల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది.
సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?
సుజుకి మోటార్సైకిల్ ఇండియా 'ఈ-యాక్సెస్' పేరుతో భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిని కంపెనీ గురుగ్రామ్ ప్లాంట్లో తయారు చేయనుంది.బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్న సుజుకి ఈ-యాక్సెస్.. 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ద్వారా 95 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇందులోని 4.1 కేడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటారు 15 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.సుజుకి ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, మూడు రైడింగ్ మోడ్లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్ మొదలైనవి పొందుతుంది. ఇందులో బ్లూటూత్/యాప్ కనెక్టివిటీ & USB ఛార్జింగ్ పోర్ట్ కూడా లభిస్తాయి. ఇది నాలుగు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఫ్యామిలీ
మ్యూజిక్ లాలిపాప్..! తింటూ..సంగీతం వినొచ్చు..
లాలీపాప్స్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టమో తెలిసిందే. పంచదార క్యాండీలాంటి ఈ చాక్లెట్లంటే పెద్దలకు కూడా ప్రియమైనవే. అలాంటి లాలిపాప్ని టెక్నాలజీ సాయంతో వినూత్నంగా ఆవిష్కరించారు. వాటి ప్రత్యేకత తెలిస్తే విస్తుపోతారు. ప్రపంచ సమావేశమైన సీఈఎస్ 2026 లాస్ వేగాస్లో వినూత్న ఆవిష్కరణలతో ప్రారంభమైంది. ఈ ఈవెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), రోబోటిక్స్ టెక్నాలజీలో ఉన్నత స్థాయి పురోగతిని ప్రదర్శిస్తుండగా..ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ అందర్నీ ఆమితంగా ఆకట్టుకుంది. అదేంటంటే..క్యాండీ చాక్లెట్గా పిలిచే లాలిపాప్ని కొరికనప్పుడు మ్యూజిక్ వినిపిస్తుంటుందట. వీటిని లాలిపాప్స్టార్గా పిలుస్తారట. ఈ అసాధారణమైన క్యాండీ బోన్ కండక్షన్ టెక్నాలజీతో పనిచేస్తుందట. ఈ క్యాండీలో మనం ఐస్ స్పైస్, ఏకాన్, అర్మానీ వైట్ వంటి కళాకారుల పాటలు వినొచ్చట. ఆక్యాండీని చప్పరించినా లేదా కొరికనప్పుడూ మన పుర్రె ఎముకల ద్వారా లోపలి చెవికి ప్రయాణించే ధ్వని సంగీతంలా వినిపిస్తుందట. అంటే మన నోటిలోనే సంగీత కచేరి వినోచ్చన్నమాట. సింపుల్గా చెప్పాలంటే..ప్రపంచపాప్ దిగ్గజాల పాటలన్నీ మన నోటిద్వారానే వినొచ్చు. పైగా కొరకండి సంగీతాన్ని అస్వాదించండి అని సదరు లావా కంపెనీ వెబ్సైట్లో పేర్కొంది కూడా. అంతేగాదు వీటి ధర ఏకంగా రూ. 808లు. ఇవి కేవలం స్టార్వెబ్సైట్లో లభిస్తాయట. అయితే నెటిజన్లు ఈ ఆవిష్కరణపై మండిపడుతున్నారు. ఇంతకుమునుపు పిల్లల టూత్బ్రెష్లలో ఇలాంటి టెక్నాలజీనే వినియోగించారని గుర్తు చేస్తూ పోస్టులు పెట్టారు. పైగా అత్యంత పనికిమాలిన వస్తువుగా తిట్టిపోయడం గమనార్హం. (చదవండి: హీరో రామ్చరణ్ ఇంట జపాన్ చెఫ్ చేతి బిర్యానీ..! టేస్ట్ ఎలా ఉందంటే..)
హీరో రామ్చరణ్ ఇంట జపాన్ చెఫ్ చేతి బిర్యానీ..!
బిర్యానీ ఎవ్వరినైనా ఇట్టే తన రుచికి ఫిదా చేసేస్తుంది. యావత్తు ప్రపంచాన్ని తన ఘుమఘమలు వైపుకి లాగేసుకుంటుంది. అసలు ఒక్కసారి రుచి చూసిన వారెవ్వరైనా..మరోసారి తినేలా ఊరించే వంటకం ఇంది. అలాంటి వంటకానికి ఎందరెందరో ఫిదా అయ్యారు. అచ్చం అలానే బిర్యానీ ప్రియుడిగా మారి అందులో స్పెషలిస్ట్గా అవతరించాడు ఈ జపనీస్ చెఫ్. ఆ ఇష్టమే హైదరాబాద్కి రప్పించి ..మన చిరు తనయడు ఇంటికి వచ్చేలా చేయడమే కాదు..హీరో రామ్చరణ్కి రుచి చూపించాడు కూడా. ఔనా ఏంటా కథా అని కుంటున్నారా..!. అయితే తక్షణమే చదివేయండి ఆ సంగతేంటో..ప్రత్యేక బిర్యానీలకు సంబంధించి వరల్డ్ పేమస్ జపనీస్ చెఫ్ మాస్టర్ తకమాసా ఒసావా ఇటీవల హైదరాబాద్లోని మన రామ్చరణ్ ఇంటికే వచ్చి మరి వండుకున్నాడు. ఇదేంటి అనుకోకండి బహిరంగంగా వండుతూ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకునే ఈ చెఫ్ తకమాసా..అలానే మన చరణ్ ఇంట్లో కూడా బిర్యానీ వండి ఆ వీడియోని నెట్టింట షేర్ చేసుకున్నాడు. ఇది క్షణాలో ఆహారప్రియులను, రామ్చరణ్ అభిమానులను అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఏంటి మేటర్ అంటే..ఆయన రామ్ చరణ్ నివాసానికి వచ్చి..అక్కడ బ్యూటిఫుల్ లోకేషన్స్ని షేర్ చేస్తూ..అక్కడే తన స్పెషల్బిర్యానీ వండాడండోయ్. అక్కడితో ఆగలేదు రామ్చరణ్కి, వాళ్ల అమ్మ సురేఖమ్మకి కూడా టేస్ట్ చేయమని పెట్టాడు కూడా. మన హీరో రామ్చరణ్ అయితే బాస్ ఇది చాలా రుచిగా ఉంది గ్రేవీలా లేదంటూ చమత్కరించాడు. ఎందుకంటే జపాన్ వాళ్లు ఏదైనా సూప్ మాదిరిగా అదేనండి పులుసు టైపులో తింటుంటారు కథా అందుకని మన హీరో చరణ్ సరదాగా అలా అన్నారు. మన జపాన్ చెఫ్ తకమాసాకి ఈ బిర్యానీ వండడం ఎలా తెలిసిదంటారా..?అలా తెలుసుకుని..ఇలా గరిటపట్టేశాడు..టోక్యోకు చెందిన చెఫ్ తకమాసా సింగిల్ పాట్ బిర్యానీ స్పెషలిస్ట్ అట. అంతేగాదు ట్యోక్కోలో బిర్యానీ రెస్టారెంట్ని కూడా నడుపుతున్నాడు. అతని బిర్యానీ వండే స్కిల్కి, టేస్ట్కి మిచెలిన్ బిబ్ గౌర్మాండ్ అనే మంచి అవార్డు సైతం వచ్చింది ఈ చెఫ్కి. మన తకమాసాకి బిర్యానీ గురించి తెలిసింది 2009లోనట. తమిళనాడులో ఆఫీస్ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడూ..స్థానిక తినుబండారాలపై బిర్యానీ అని రాసి ఉడంట చూశాడట తకమాసాక. ఆసక్తిగా అనిపించి ఆర్డర్ చేసి తిన్నాడట. అంతే ఆక్షణమే దానిపై మనసు పారేసుకుని ఇలా బిర్యానీ చెఫ్గా సెటిల్ అయ్యిపోయాడు. అక్కడితో ఆగిపోలేదు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్ని పర్యటించి మరి అక్కడ బిర్యానీ వంట పద్ధతులను తెలుసుకుంటూ, దీని రుచిపై అధ్యయనం చేస్తున్నాడట ఈ చెఫ్ తకమాసా. బిర్యానీపై ఉన్న అతని ప్రేమ చూస్తుంటే భోజనప్రియులకు ఆహారమే సార్వత్రికభాష అని నిరూపితమైంది కదూ..!Famous Japanese biryani chef Osawa Takamasa (awarded Bib Gourmand in the Michelin Guide) visited @AlwaysRamCharan's home yesterday and cooked biryani for him and his family. He postedan Instagram story about the occasion.🥘🔥🤩 pic.twitter.com/xLR3k1XbT5— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) January 5, 2026 (చదవండి: ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..)
ప్రేమకు ఎక్స్పైరీ లేదు!.. వీళ్లంతా ‘యంగ్’స్టర్లే!
ప్రేమకు ఎక్స్పైరీ అంటూ ఉండదు. ఏ వయసులోనైనా కాసింతా ప్రేమ, ఆదరణ కావాలనే అనుకుంటాం. ప్రేమ అనే పదంతోనే కదా ఏ బంధమైన పెనవేసుకునేది. యంగ్గా ఉన్నప్పుడే ప్రేమ, పెళ్లి కాదు, మలి వయసులోనూ కావాలి ఓ తోడు. అయితే మలిసంధ్యలో ఉండే ప్రేమ అత్యంత ఆత్మీయమైనది, స్నేహ మాధుర్యానికి మించినది. దాన్నే హైలెట్ చేసింది ఈ మ్యాచ్ మేకింగ్ ఈవెంట్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇన్ఫ్లుయెన్సర్ షెనాజ్ ట్రెజరీ ఈ వీడియోని నెట్టింట షేర్ చేశారు. అది 60,70, 80 ఏళ్ల లోపు వారి కోసం రూపొందించిన మ్యాచ్ మేకింగ్ ఈవెంట్ అని రాసుకొచ్చింది. ఆ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లి కళ్లనీళ్లు ఆగలేదంటోంది. వాళ్లంతా టీనేజర్ల వలే నవ్వుతూ ఉండటం చూసి తాను ఒక విధమైన ఆనందం, భావోద్వగంతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు పేర్కొంది. అక్కడ గదుల్లో చాలామంది భాగస్వాములును కోల్పోయారని, మరికొందరూ విడాకులు తీసుకున్న వాళ్లని తెలిపింది. అయితే అందరూ కలిసి కూర్చొని నవ్వుకుంటూ కనిపించిన విధానం తాము కోల్పోయిన ప్రేమ, తోడు ఏదో పొందాలన్న ఆశ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ కార్యక్రమం మతం, కులం, అంతస్థులతో సంబంధం లేకుండా జరగడం విశేషం. కొందరు స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ కనిపిస్తే..మరికొందరు సిగ్గుపడిపోతూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లని చూస్తే మనసు ఆనందంతో పవరశించిపోయిందంటూ ఉద్విగ్నంగా రాసుకొచ్చిందామె పోస్ట్లో. వాళ్లంతా పిల్లల పెంపకం, బాధ్యతలలో తలమునకలై, తమకంటూ వ్యక్తిగత ఆనందానికి చోటు దొరకక, కనీసం మలి వయసులోనైనా పొందాలని వచ్చిన అత్యంత యంగ్ సీనియర్ సిటిజన్లుగా అని పేర్కొంది. ఈ కార్యక్రమం వారికి కొత్త ప్రేమనే కాదు..ఆ వయసు వాళ్లతో కనెక్ట్ అయ్యే ఓ గొప్ప అవకాశం కూడా ఇది. నెటిజన్లు సైతం ఈ వయసులో అలా ధైర్యంగా ముందుకొచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గ్రేట్అంటూ ప్రశంసించారు. అందరూ తమను కూడా ఇది భావోద్వేగానికి గురించేసిందంటూ పోస్టులు పెట్టారు. అంతేగాదు ప్రేమకు వయోపరిమితి ఉందనే నమ్మకానికి ఈ ఘటనే అతి పెద్ద సవాలు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) (చదవండి: ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..)
ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..
కుంభమేళ, మాఘమేళ వంటి మహోత్సవాల్లో ఆధ్యాత్మికతకు సంబంధించి ఎన్నో ఆసక్తికర కథల కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి, విస్మయానికి గురిచేస్తాయి కూడా. గొప్ప గొప్ప మేధావులు, మహా సంపన్నులు ఇలాంటి కుంభమేళాల్లో సాధువులుగా కనిపించిన ఘటనలు కూడా చూశాం. మరొకరు ఏకంగా తలపై మొక్కలను పెంచడం, పావురాల బాబా వంటి ఎన్నో విచిత్రాలను చవిచూశాం. భక్తి, ఆధ్యాత్మికతల గొప్పదనం ఈ మహోత్సవాలు ఎలుగెత్తి చాటుతున్నాయా అన్నట్లుగా ఉంటాయి వింత ఘటనలు. అలాంటి తరహాలోనే ఈ ఏడాది జరగుతున్న మాఘమేళాలో కనువిందు చేసింది. అదేంటంటే.. ప్రతి ఏడాది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం (గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం) వద్ద జరిగే ఒక మహత్తర ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ మాఘమేళా. ఇది మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసి, దీక్షలు చేపట్టి, మోక్షం కోసం ప్రార్థనలు చేస్తారు. దీన్ని అచ్చం కుంభ మేళలాంటి చిన్నకుంభమేళాగా పేర్కొనచ్చు. ప్రతి ఏటా జనవరిలో మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 3న మొదలైన ఈ మాఘమేళాలో ఒక 26 ఏళ్ల సాధువు అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాడు. ఎందుకుంటే అతడు గత ఏడేళ్లు అస్సలు కూర్చోలేదు, పడుకోలేదట. శంకర్పురిగా పిలిచే ఈ సన్యాసి బిహార్లోని సీతామర్హి జిల్లాకు చెందిన యువ సన్యాసి. ప్రస్తుతం జరుగుతున్న మాఘమేళాలో నిరంతరం ఒక కాలిపై నిలబడి కనిపించిడంతో అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అయితే పడుకోవడం కోసం తన తలను ఒక చెక్కకు ఆన్చుకుని అలానే పడుకుంటారట ఆ సన్యాసి. తినడం నుంచి ఇతర రోజువారీ కార్యక్రమాలన్ని ఆ భంగిమలోనే చేస్తారట. ఆయన నైమిశారణ్యానికి చెందినవారట. అక్కడ సుమారు 88వేల మంది రుషులు ఉంటారనేది భక్తుల విశ్వాసం. అలాంటి పుణ్యభూమిలో తాను జన్మించానని, అక్కడే తనకు ఓ ఆశ్రమం కూడా ఉందని ఈ శకంర్పురి సన్యాసి చెబుతున్నారు. ఇలా ఒంటి కాలిపై ఎందుకంటే..ఆ నైమిశారణ్యంలో ఉన్నప్పుడే తనకు ఇలా ఒంటికాలినై నిలబడాలనే ఆలోచన వచ్చిందట. అప్పటి నుంచే ఈ భంగిమలో ఉన్నట్లు తెలిపారు ఆ సాధువు. ఆయన ఆరేళ్ల వయసులోనే సాధువుగా మారారట. ఎప్పుడైనా కూర్చొన్నారా అని అడిగితే..ఏడేళ్లుగా ఇలా నిలబడే ఉన్నాని చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఊయలలాంటి చెక్క నిర్మాణంపై తల ఆనించి నిద్రపోతానని, ఆహారం, నీరు నుంచి ప్రతీ పని ఈ భంగిమలోనే చేస్తానని చెప్పారు. కాగా, జనవరి 3న ప్రారంభమైన ఈ మాఘమేళ 44 రోజులపాటు సాగే మహత్తర ఉత్సవం. ఇది ఫిబ్రవరి 15న ముగుస్తుంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి, మోక్షం కోసం పూజలు చేస్తుంటారు. (చదవండి: రెస్టారెంట్ మేనేజర్గా ఇస్రో శాస్త్రవేత్త..! సరదా సంభాషణ..)
అంతర్జాతీయం
ఎక్స్ గ్రోక్ యూజర్లకు బిగ్ షాక్
ఎడాపెడా గ్రోక్ను వాడేస్తున్న యూజర్లకు ఎక్స్ పెద్ద షాకే ఇచ్చింది. బూతు కంటెంట్ వివాదం నేపథ్యంలో గ్రోక్ చాట్బాట్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.ఎక్స్ ఫ్లాట్ఫారమ్లో(పూర్వపు ట్విటర్)లో ‘గ్రోక్’ కృత్రిమ మేధ చాట్బాట్ వినోదం కోసం తీసుకొచ్చారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారం అందజేయడం.. తొలినాళ్లలో నవ్వులు పూయిచింది ఇది. అయితే రాను రాను గ్రోక్ వికృత రూపం దాల్చింది. గ్రోక్లో అశ్లీల, అసభ్యకర, అభ్యంతరకర దృశ్యాల రూపకల్పనకు దుర్వినియోగం అవుతుండటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రముఖులతో పాటు సాధారణ ప్రజల ఫొటోలను అశ్లీల, అసంబద్ధ ప్రాంప్ట్లతో ఎడిట్లు చేస్తున్నారు పలువురు యూజర్లు. అటు గ్రోక్ కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఈ అంశంపై పలు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇటు భారత ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యింది. వివరణ కోరుతూ ఎక్స్కు నోటీసులు కూడా జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిన నేపథ్యంలో ఎక్స్ చర్యలు చేపట్టింది. ఈ చాట్బాట్లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్పై పరిమితులు విధించింది. అయితే.. గ్రోక్ (Grok) అనేది xAI రూపొందించిన AI అసిస్టెంట్. ఇది 2023 చివర్లో మొదటి వెర్షన్గా వచ్చింది. అప్పటి నుంచి పలు అప్డేట్లు, కొత్త వెర్షన్లు విడుదలయ్యాయి. 2025 చివర్లో Grok 4.1 Thinking విడుదల కాగా, 2026 జనవరి నాటికి Grok ఇప్పటికే X ప్లాట్ఫారమ్లో భాగమైంది.తీవ్ర విమర్శల వేళ ఇకపై Grok (గ్రోక్) చాట్బాట్ ఫీచర్ Xలో కేవలం సబ్స్క్రైబర్లకే అందుబాటులో ఉండనుంది. ఫ్రీ యూజర్లకు యాక్సెస్ నిలిపివేయడం మొదలుపెట్టింది. గ్రోక్ను ఉపయోగించాలంటే ఎక్స్ ప్రీమియం X Premium లేదా ప్రీమియం ఫ్లస్ Premium+ ప్లాన్ తీసుకోవాలి. ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ.650 ( 8 డాలర్లు), ప్రీమియం ఫస్ల్ ధర నెలకు రూ.1,300 (16 డాలర్లు)గా ఉంది. సంవత్సరం ప్లాన్ ప్రీమియం ధర రూ.6,800, ప్రీమియమ్ ఫ్లస్ ప్లాన్ ధర రూ.13,600గా ఉంది. అయితే ప్రీమియం వెర్షన్లో అందుబాటులో ఉండడమూ ఆందోళన కలిగించే అంశమే కదా అని అంటున్నారు పలువురు.
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు
లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దక్షిణ ప్రాంతంలోని హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు (IOF) వైమానికదాడులు జరుపుతున్నాయి. నష్టం వివరాలు తెలియరావాల్సింది. అయితే తాజా పరిణామాలతో ఇజ్రాయెల్-హోజ్బొల్లా ఘర్షణలు మళ్ల తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాల్లో హెజ్బొల్లా షెల్టర్లను టార్గెట్ చేశాయి. సాజ్, అల్-రయ్హాన్, మౌంట్ అల్-రఫీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది. దీర్ అల్-జహ్రాని, హౌమిన్ అల్-ఫౌఖా ప్రాంతాల గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాల సంచారం కనిపించిందని తెలుస్తోంది. మరోవైపు.. దీర్ అల్-జహ్రాని–హౌమిన్ అల్-ఫౌఖాలోని లోయపై బాంబుదాడి జరిగింది. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్లోని క్ఫార్ఫిలా, రూమైన్, మౌంట్ రయ్హాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజా దాడులతో స్పష్టమవుతోంది. అటు వాది హమిలా ప్రాంతాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు సమాచారం. హెజ్బొల్లాకి చెందిన మిసైల్ ప్లాట్ఫారమ్లు, ఆయుధ గిడ్డంగులు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించుకుంది. 2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన సీజ్ఫైర్ తర్వాత కూడా ఇజ్రాయెల్ 10,000కిపైగా ఉల్లంఘనలు జరిపిందని UNIFIL (United Nations Interim Force in Lebanon) గణాంకాలు చెబుతున్నాయి. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆవున్ తాజా దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఇవి ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయన్నారు. లెబనాన్లోని పలు గ్రామాల ప్రజలను తక్షణ ఖాళీ చేయమని హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ.. ఐక్యరాజ్య సమితి కూడా ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.
ఆయన్ని సంతోషపెట్టేందుకు ఇరాన్ పరువు తీయొద్దు
తన పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించబోమంటూ ఆందోళనకారుల్ని హెచ్చరించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కూడా చురకలు అంటించారు. శుక్రవారం ఇరాన్ ఆందోళనలపై ఓ వీడియో మేసేజ్లో ఖమేనీ స్పందిస్తూ..మన దేశ వీధులను పాడుచేసి.. మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసం రోడ్డెక్కి దేశ పరువు తీయొద్దు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని ఇస్లామిక్ రిపబ్లిక్ సహించబోదు అని వార్నింగ్ ఇచ్చారు. తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన.. ఈ సమయంలో ఇరాన్ యువత ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎలాంటి శత్రువునైనా ఇరాన్ ఎదుర్కొగలుగుతుందని అభిప్రాయపడ్డారు.మీ సంగతి చూస్కోండినిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ పదే పదే ఇరాన్ను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ, అగ్రరాజ్యం అధ్యక్షుడికి చురకలంటించారు. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టిపెట్టాలంటూ ట్రంప్కు ఖమేనీ హితవు చెప్పారు.ఖమేనీ గద్దె దిగాలంటూ ఇరాన్ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరుగుతున్న ఆందోళనలు.. గత కొద్దిరోజులుగా తీవ్రతరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచిపారిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం వాటిని ఖండించినా.. ఖమేనీ మాత్రం అధికారికంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఆశ్రయం కోసం మాస్కోకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఊహాగాలను తెర దించుతూ ఇవాళ ఆయన ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. 2026 ఆర్థిక బడ్జెట్పై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రసంగం సమయంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, తారాస్థాయికి చేరుకున్న నిరుద్యోగ సమస్య, కరెన్సీ విలువ పడిపోవడం,వీటికి తోడు రాజకీయ స్వేచ్ఛకు భంగం కలగడంతో.. ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. టెహ్రాన్, మష్హాద్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా, ఇరాన్లో నూతన సంస్కరణలను డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ప్రజలు రోడ్డెక్కి నినాదాలు చేశారు.డిసెంబర్ 28న మొదలై.. 27 ప్రావిన్సుల్లో 250కి పైగా ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి. ఆందోళనకారుల్ని అణచివేసేందుకు భద్రతా బలగాలు.. టియర్ గ్యాస్, షాట్గన్స్, వాటర్ కేనన్లు ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 12 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటిదాకా 35 మంది మరణించారు. వీళ్లలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. సుమారు 1,200 మందికి పైగా అరెస్టు అయ్యారు. భారీగా ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసింది ఇరాన్ ప్రభుత్వం. నిరసనకారులను విదేశీ శక్తుల కిరాయి సైనికులుగా అభివర్ణిస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
గ్రీన్లాండ్ నేలపై కరెన్సీ నీడలు!
వీలైతే యుద్ధం.. లేకపోతే శాంతి మంత్రం.. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో గత కొంతకాలంగా చూస్తూ వస్తున్న యాంగిల్స్. అయితే ఆయనలో ‘బిజినెస్మ్యాన్’ కూడా ఉన్నాడండి. తాను అనుకున్న దానిని ఏదో రకంగా దక్కించుకోవడమే ఈ బిజినెస్ సూత్రం. వీలేతై దేన్నైనా కొనేయడం. మనం షేర్లు కొన్నట్లు డెన్మార్క్లో భాగమైన గ్రీన్లాండ్ను కొనేయడానికి సిద్ధమవుతున్నారు ట్రంప్. అక్కడ 6 వందల బిలియన్ డాలర్లు వెచ్చించి ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఎలాగైనా గ్రీన్లాండ్ను తమది అనిపించుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్.. ఇక డానిష్ దేశానికి డబ్బు ఆశ చూపుతున్నారు. గ్రీన్లాండ్ నేలపై కరెన్సీ నీడను పరచడానికి ట్రంప్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. నేటి ప్రపంచంలో డబ్బుతో అసాధ్యం కానిది ఏదీ లేదని నమ్మేవాళ్లలో ఒకరైన ట్రంప్.. డబ్బు అనే వలతో స్వేచ్ఛను బందించే యత్నం చేస్తున్నారు. ఈ మేరకు గ్రీన్లాండ్ (Greenland) ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆఫర్ చేశారు. స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తే ఆరు వందల బిలియన్ డాలర్లు చెల్లిస్తానని ప్రకటించారు ట్రంప్. ఇలా అక్కడ ప్రజల్ని ముందుగా ఖాళీ చేయించే యత్నం చేస్తున్నారు. ఈసారి గ్రీన్లాండ్ ప్రజలే టార్గెట్..గ్రీన్లాండ్ అంటే అమెరికాకు అమితమైన ఆసక్తి. అందులోనూ ఈ దీవిపై ట్రంప్నకు ఆసక్తి మరీ ఎక్కువ. 2019లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనే గ్రీన్లాండ్పై బేరసారాలు జరిపారు. అప్పుడు ప్రభుత్వానికి డబ్బు ఆఫర్ను ప్రతిపాదించారు ట్రంప్.. అయితే దాన్ని డెన్మార్క్ తిరస్కరించింది. కానీ రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ మరోసారి కూడా డబ్బును వెదజల్లడానికి సిద్ధమయ్యారు. ఈసారి డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. గ్రీన్లాండ్ ప్రజలకు భారీ ఆఫర్ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ ఉండే వారికి ప్రతీ వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకూ ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఒకవేళ ట్రంప్ చూపే ఆశకు గ్రీన్లాండ్లో ఉండే వాళ్లు సిద్ధమైతే మాత్రం.. ఆ ప్రాంతాన్ని సునాయాసంగానే ట్రంప్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. డబ్బు వలలో స్వేచ్ఛ బందీ కానుందా?గ్రీన్లాండ్పై ట్రంప్ వ్యూహం మార్చడంతో డెన్మార్క్కు అంతా గందరగోళంగా ఉంది. డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ను వేరు చేయడానికి చూస్తున్న ట్రంప్ను ఎదుర్కోవడానికి ఏం చేయాలనే యోచనలో ఉంది డెన్మార్క్ ప్రభుత్వం. ట్రంప్ ప్రకటించిన ఆఫర్కు గ్రీన్లాండ్ ప్రజలు లొంగితే ఇక తాము ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకతప్పదనే భయం పట్టుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఎదిరించి నిలబడటం అంత ఈజీ కాదని డెన్మార్క్కు తెలుసు. పోని వేరే దేశాలేమైనా సాయం చేస్తాయంటే అది ఎంతవరకూ జరుగతుందో అనేది చూడాలి. రష్యా, చైనా (China) వంటి దేశాలు డెన్మార్క్కు సాయం చేస్తే తప్పితే, గ్రీన్లాండ్ను కాపాడుకోవడం డెన్మార్క్కు అత్యంత కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకమైన దీవి ఇది.. ఉత్తర అమెరికా, యూరప్ ఖండాలక ఇది సరిగ్గా మధ్యలో ఉంటుంది. ప్రధానంగా ఖండాంతర క్షిపణులు మందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు ఇది అనువైనది. అమెరికా సైన్యానికి వ్యూహాత్మకమైన ప్రాంతంగా కూడా ఉపయోగపడుతుంది. రష్యా నావికా దళంపై అమెరికా ఎప్పుడూ కన్నేసి ఉంచడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్లాండ్లోని పిటుఫిక్లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా.ఖనిజాల సంపదకు పెట్టింది పేరు.. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నట్టు తేలింది. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషేధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ యోచనగా ఉంది. ఈ దీవి 7 దశాబ్దాల క్రితమే డెన్మార్క్లో భాగంగా మారింది. కాకపోతే 2019లో గ్రీన్లాండ్కు విస్తృత స్వయం పాలిత ప్రాంతంగా గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద దీవిగా ఉన్న గ్రీన్లాండ్.. డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది. ప్రస్తుత గ్రీన్లాండ్ జనాభా కూడా లక్ష లోపే ఉంది. వారి జనాభా సుమారు 57 వేలు ఉండొచ్చని అంచనా..
జాతీయం
అమెరికా ఆరోపణలకు భారత్ కౌంటర్
ఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా, భారత్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భారత్-అమెరికా వాణిజ్య చర్చల వేళ అగ్రరాజ్య వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ప్రధాని మోదీ గతేదాడి.. అధ్యక్షుడు ట్రంప్నకు ఎనిమిది సార్లు ఫోన్లు చేశారని గుర్తు చేశారు.డొనాల్డ్ ట్రంప్ 500 శాతం టారిఫ్ల బిల్లుపై భారత్ స్పందించింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..‘ప్రతిపాదిత బిల్లు గురించి మా దృష్టికి వచ్చింది. బిల్లుకు సంబంధించిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. దేశీయ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత ఆయిల్ కొనుగోళ్లు ఉంటాయి. ఈ బిల్లు విషయమై ప్రధాని మోదీ.. ఇప్పటికే ట్రంప్తో ఎనిమిది సార్లు ఫోన్లో మాట్లాడారు. గతేడాది ఫిబ్రవరి 13 నాటికే భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడానికి కట్టుబడి ఉన్నాయి. ఇప్పటికే పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందానికి రావడానికి ఇరుపక్షాలు అనేక రౌండ్ల చర్చలు జరిపాయి. చాలా సందర్భాలలో మేము ఒక ఒప్పందానికి దగ్గరగా వచ్చాము’ అని తెలిపారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్.. భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని వెల్లడించారు. ఇది ఆయన (ట్రంప్) ఒప్పందం. దానికి ముగింపు రావాలంటే.. ట్రంప్నకు మోదీ కాల్ చేయాల్సి ఉంది. అయితే ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదు. మోదీ చివరకు ఫోన్ చేయలేదు.మేము ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. భారత్తో వాటికంటే ముందే ఒప్పందం జరుగుతుందని ఊహించాం. అలా జరగకపోవడంతో ఇంతకుముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుంది. దానిపై ఇప్పుడు మేం ఆలోచించడం లేదు. బ్రిటన్తో వాణిజ్య ఒప్పంద చర్చలు కొలిక్కి వస్తోన్న సమయంలో ఆ దేశ ప్రధాని కీర్స్టార్మర్ ట్రంప్నకు కాల్ చేశారు (Donald Trump). ఆ రోజే డీల్ ముగింపునకు వచ్చింది. తర్వాతి రోజు మీడియా సమావేశంలో దాని గురించి ఇరువురు నేతలు ప్రకటించారు’’ అంటూ భారత్, బ్రిటన్ మధ్య పోలిక తెచ్చారు. మోదీ ఫోన్ చేయడానికి నిరాకరించినప్పటికీ.. ఇంకా ఫోన్ చేయడానికి అవకాశం ఉందని లుట్నిక్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.అయితే, ఒకవైపు ట్రేడ్ డీల్ చర్చలు జరుపుతూనే.. భారత్పై అమెరికా సుంకాలు విధించింది. తాజాగా అలాంటి బెదిరింపులకే పాల్పడింది. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై మరింత కక్ష సాధించేలా 500 శాతం సుంకాలు విధించే బిల్లును తేవడానికి ట్రంప్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి
నలభై ఏళ్ల ప్రేమ అరవై ఏళ్ల వయసులో నెరవేరడం నిజంగా అదృష్టం. 65 ఏళ్ల వయసులో జయప్రకాష్ అనే వ్యక్తి, తన టీనేజ్ ప్రియురాలు యాభై తొమ్మిదేళ్ల రష్మిని పెళ్లాడాడు. ఇది కేవలం ప్రేమకథ కాదు. అనేక ట్విస్టు అండ్ టర్న్ మధ్య వారి చిరకాల ప్రేమసంతోషం, ఆనందం గెలిచిన రోజు. ఒకనాడు విధికి తలవంచిన ఈ జంట, మళ్లీ ఆ విధి చేసిన వింతలో భాగంగానే పిల్లల అనుమతితో ఒకటయ్యారు. అలనాటి ప్రేమికులు జయప్రకాష్ , రష్మిల అందమైన, అరుదైన ఈ పెళ్లి కథ గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి! కేరళలో జరిగిన ఆసక్తికరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి:-కేరళలోని కొల్లం ముందక్కల్కు చెందినవారు జయప్రకాష్, రష్మి. వీరిద్దరూ పొరుగువారే. చాలా చిన్న వయసులోనే ప్రేమించు కున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. విధి వారిద్దరినీ మరొకరి జీవితంలోకి ప్రవేశించేలా చేసింది. దీంతో ఇద్దరూ తమ ప్రేమను త్యాగం చేసి, పెద్దలు చెప్పిన పెళ్లిళ్లు చేసుకొని వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. రష్మికి ఆమె తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.ప్రేమ విఫలం కావడంతో జయప్రకాష్ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. జయప్రకాష్కు ఇద్దరు కుమారులు, రష్మికి ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లలు, మనవరాళ్ళు, మునిమనవళ్లు వారి కుటుంబాలు నిండుగా సంతోషంగా ఉన్నాయి. అయితే జయప్రకాష్, రష్మి ఇద్దరూ కూడా తమతమ జీవిత భాగస్వాములను కోల్పోయారు. రష్మి భర్త పదేళ్ల క్రితం అకస్మాత్తుగా మరణించగా, జయప్రకాష్ భార్య 5 సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుంచి వారు తమ పిల్లలే తమ ప్రాణమని భావించి తిరిగి వివాహం చేసుకోకుండానే జీవించారు. దీంతో వారిద్దరూ ఒంటరిగా మారారు. షార్ట్ ఫిలిం కలిపిన ప్రేమభర్తను కోల్పోయిన బాధను మర్చిపోయేందుకు రష్మి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేది. ఆమె షార్ట్ ఫిల్మ్లలో కూడా నటించేది. ఈలోగా జయప్రకాష్ రష్మి నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ చూశాడు. తన చిన్ననాటి ప్రియురాలు షార్ట్ ఫిల్మ్స్లో నటించినట్టు తెలిసి సంబరపడిపోయారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వద్ద రష్మి కుమార్తె సెల్ ఫోన్ నంబర్ తీసుకుని, రష్మితో మాట్లాడారు. ఈ క్రమంలోనే జీవిత భాగస్వాములు చనిపోయారని పరస్పరం తెలుసుకున్నారు. మరోవైపు భార్య చనిపోవడంతో పిల్లల పట్టుబట్టడంతో జయప్రకాష్ కూడా తిరిగి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తాను తిరిగి వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని జయప్రకాష్ రష్మికి చెప్పాడు. అలా ఇద్దరిమధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది. పిల్లల అంగీకారంతో ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చని కూడా ప్రపోజ్ చేశాడు. రష్మి తన కూతురు, అల్లుడికి ఆ విషయం చెప్పింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. ఇంకేముంది పెళ్లి సందడి వేళ అయ్యింది.పిల్లలే పెద్దలుగా జయప్రకాష్-రష్మి సమీప బంధువుల సమక్షంలో దంపతులుగా మారారు. యవ్వనంలో ప్రేమలో పడిన ఈ జంట 60 ఏళ్ల తర్వాత కలిసి "నిజమైన ప్రేమ ఒకరోజు తప్పకుండా గెలుస్తుంది" అని నిరూపించారు. నూతన వధూవరులు రష్మి, జయప్రకాష్ మలేషియాకు హనీమూన్ వెళ్లాలని నిర్ణయించు కున్నారు. జయప్రకాష్, రష్మిల వివాహ ఫోటోను రష్మి కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేసి, "ఈ అదృష్టం ఏ పిల్లలకు లభిస్తుంది?" అని పేర్కొనడం విశేషంగా నిలిచింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!
బెంగాల్లో ఈడీ దాడుల టెన్షన్.. సీఎం మమత ర్యాలీ
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ సహా ఆ సంస్థ కార్యాలయాలపై ఈడీ దాడులు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బెంగాల్లో ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనార్జీ ఆందోళనలు, ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీఎంసీ నేతలు. సీఎం మమత చేపట్టిన ర్యాలీలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.మరోవైపు.. అంతకుముందు ఈడీ దాడులను నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. రాజకీయ వైరంతోనే ఈడీని ఆయుధంగా ఉయోగిస్తోందని అమిత్షాపై టీఎంసీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే, అమిత్ షా ఇంటి వద్ద టీఎంసీ నేతలు నిరసనలు తెలపడంతో పోలీసులు వారిని నిరసన ప్రాంతం నుంచి లాక్కెళ్లారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామంటూ పోలీసుల చర్యను నేతలు ఖండించారు.#WATCH | Kolkata | TMC Chairperson and West Bengal CM Mamata Banerjee leads a rally today against the Enforcement Directorate, following the raid on I-PAC yesterday. Visuals from the 8B bus stand, Jadavpur pic.twitter.com/On4uMtFUBG— ANI (@ANI) January 9, 2026ఈ నిరసనల్లో టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్, కీర్తి ఆజాద్, డెరెక్ ఓబ్రియన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం, ఎంపీలు మాట్లాడుతూ.. ‘‘ఎంపీలతో పోలీసులు వ్యవహరించిన తీరు అందరికీ కనిపిస్తోంది’’ అని డెరెక్, మహువా వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్య నిరసనలకు తావులేకుండా పోతోంది. నేరగాళ్లకు రివార్డులు దక్కుతున్నాయి. దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుతున్నారు. ఎన్నికలను తారుమారు చేస్తున్నారు. నిరసనకారులను జైలుకు పంపి.. రేపిస్టులకు బెయిల్ ఇస్తున్నారు. ఇది బీజేపీ విధానం. దీనిని బెంగాల్ అంగీకరించదు. మిమ్మల్ని ఓడించేందుకు మా శాయశక్తులా కృషిచేస్తాం’ అని అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ఇక, సోదాలు అడ్డుకున్నారని ఈడీ.. వాటిని ప్రశ్నిస్తూ ఐప్యాక్ కోల్కతా హైకోర్టును ఆశ్రయించాయి.#WATCH | Kolkata | TMC Chairperson and West Bengal CM Mamata Banerjee leads a rally following the ED raid on I-PAC yesterday pic.twitter.com/CkYfedjywC— ANI (@ANI) January 9, 2026ఇదిలా ఉండగా.. కోల్కతాలో రాజకీయ సంప్రదింపుల సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా ఎంపీలు, నేతలు నినాదాలు చేశారు. ఈడీ సోదాల సందర్బంగా అధికారుల వద్ద నుంచి సీఎం మమతా బెనర్జీ పలు ఫైల్స్ను తీసుకెళ్లారు. దీంతో, ఈడీ దాడుల ఘటన బెంగాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
లేడీ కిలాడీలు.. సీసీ ఫుటేజ్లో షాకింగ్ దృశ్యాలు
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ చోరీ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కస్టమర్లుగా నటిస్తూ గోల్డ్ షాప్కు వెళ్లిన మహిళలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గరు మహిళలు కేవలం 14 నిమిషాల్లోనే రూ.14 లక్షల విలువైన బంగారు చెవి పోగులు దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్రాజ్లోని కల్యాణ్ జువెలర్స్ షోరూమ్లో డిసెంబర్ 31 2025న ఈ ఘటన జరిగింది.ఆభరణాలు కొనేందుకు కస్టమర్లుగా వెళ్లిన ముగ్గురు మహిళలు.. సేల్స్మెన్ వారికి బంగారు ఆభరణాలను చూపించడంలో బిజీగా ఉన్న సమయంలో షోకేస్లో ఉన్న చెవిపోగుల డిస్ప్లే ప్యాడ్ను దొంగలించారు. ఎవరికీ కనిపించకుండా దుస్తుల్లో దాచి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేవలం 14 నిమిషాల్లోనే పనిపూర్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి.డిస్ప్లే ప్యాడ్ కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా.. ఈ వ్యవహారం బయటపడింది. జువెలర్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.इन महिलाओं ने बड़ा हाथ मारा है. कल्याण ज्वेलर्स से 14 लाख के गहने चुराए.प्रयागराज स्थित कल्याण ज्वेलर्स में ये चोरी हुई है. चार महिलाओं ने सेल्समैन को बातों में उलझाए रखा और मौका मिलते ही गहना चोरी कर लिया. पूरी घटना CCTV में कैद है. pic.twitter.com/mhmYetbwEh— Priya singh (@priyarajputlive) January 7, 2026ఈ ఘటనపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. సేల్స్మన్ను దృష్టి మళ్లించి, షాప్లో ఆభరణం దాచడం సినిమా సన్నివేశంలా ఉందంటూ ఒకరు.. సెక్యూరిటీ గార్డ్తో పాటు, సీసీటీవీని గమనిస్తూ వెంటనే అలర్ట్ చేసే వ్యక్తిని కూడా నియమించాలంటూ మరొకరు సూచనలు ఇస్తున్నారు. మరో నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. అది కూడా ఒక స్కిల్నే, దాంతో సంపాదించనివ్వండి.” అంటూ కామెంట్ పెట్టారు.
ఎన్ఆర్ఐ
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
మహబూబాబాద్: ఉన్నత చదువులు.. ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. అమెరికాలో ఘోర ప్రమాదంలో భారతీయ విద్యార్థినిలు మృతి చెందారు. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్కి బయల్దేరారు. ఈ క్రమంలో.. అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు.. ఇటు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఇద్దరి మృతితో గార్ల మండలంలోని వాళ్ల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్ల మీసేవా సెంటర్ నిర్వహకుడు కాగా.. భావన ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వర్రావు కుమార్తె అని తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, యువతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డల మృతదేహాలను రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.అమెరికాలో రోడ్డు ప్రమాదం మహబూబాబాద్ యువతులు మృతిఅమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతిఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి… pic.twitter.com/rnCljzTWtP— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో ఓరుగల్లు ఆడబిడ్డ
సాక్షి ప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి యారాల హరిత సౌత్ ఆస్ట్రేలియాలో లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె 2011 నుంచి సౌత్ ఆస్ట్రేలియా లిబరల్ పార్టీకి బలమైన మద్దతురాలిగా ఉన్నారు. 2023లో టోరెన్స్ ఎస్ఈసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అక్కడి తెలుగు వారందరినీ ఐక్యపరచి తెలుగు సంప్రదాయాన్ని చాటుతున్నారు. మార్చి 18న జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తెలుగు వారి సత్తా చాటుతామంటున్నారు. 2022లో క్లెమ్ జిగ్ వార్డు కౌన్సిలర్గా ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు.
క్వీన్స్ కామన్ వెల్త్ వ్యాసరచన పోటీలో విజేతగా తెలుగమ్మాయి..!
వసుధైవకుటుంబకమ్ అనే సార్వజనీన సార్వకాలిక దృక్పథం.. ప్రపంచ సాహిత్యంలో వలసవాద ధోరణుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ అల్లాడిన ప్రపంచవ్యాప్తంగా ఉండే దీనప్రజానీకానికి మద్దతు తెలిపే కవిత్వ ధోరణి.. ఇలాటి పెద్దపెద్ద విషయాలు ఒక చిన్నారి కవితలలో కనపడటం మామూలు విషయం కానేకాదు. సింగపూర్లో క్రెసెంట్ గర్ల్స్ స్కూల్ నుంచి సెకండరీ 2 విద్యార్థిని అయిన ఆచంట లక్ష్మీ మనోజ్ఞ ఇలాటి గొప్ప అద్భుతాన్నే చేసి చూపించింది. పూవు పుట్టగానే పరిమళిస్తున్న చందంగా చదువుతో పాటు సంగీత సాహిత్యాలు పియానో వాదన, నృత్యం ఇలా బహువిధాలుగా తన ప్రజ్ఞను వికసింపజేసుకుంటున్న మనోజ్ఞ ఈ సంవత్సరం రాయల్ కామన్వెల్త్ సొసైటీ (RCS), పాఠశాలల కోసం ప్రపంచంలోనే అత్యంత పురాతన అంతర్జాతీయ రచనల పోటీ అయిన 'ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC) 2025' విజేతలలో ఒకరిగా ఎంపిక అవడం విశేషం. ఈమె తన కవిత్వం ద్వారా, విశ్వమానవాళికి సంబంధించిన సంవేదనలతో తాదాత్మ్యాన్ని పొందుతుంది. వారి జీవితాలలో నిండిన దైనందిన భావావేశాల లయలను తన కవితలద్వారా స్పృశిస్తుంది. పియానో పట్టుకోని వేళలను ప్రపంచ పౌరుల సుఖదుఃఖాలను ప్రతిబింబించే కవితలను అల్లడానికి సమయాన్ని వినియోగిస్తుంది. పిన్న వయస్కురాలైనప్పటికీ ఈమె కవితా ధోరణులలో ఎలిజబెత్ లిమ్ మరియు ఆన్ లియాంగ్ వంటి రచయితలచే పొందిన ప్రభావాలున్నాయి.మనోజ్ఞ రాసిన, బహుమతి గెలుచుకున్న 'ఇండియా టు మారిషస్' అనే కవిత, తన తల్లి నుంచి వేరు చేయబడి, భారతదేశంలోని తన ఇంటి నుండి మారిషస్లోని ఒక ఎన్క్లోజర్కు తరలించబడిన ఒక చిన్న కోతి కథను చెబుతుంది. భారతదేశంలో జన్మించినా ఆరు నెలల వయస్సులో సింగపూర్కు వెళ్లి అక్కడ శాశ్వత నివాసం చేసే కుటుంబానికి చెందిన మనోజ్ఞ, ఈ పోటీకోసం ఎన్నుకునే ఇతివృత్తంగా - 'అవర్ కామన్వెల్త్ జర్నీ'కి సంబంధించి భారతదేశం గురించి రాయాలనుకుంది.ఆమెకు భారతదేశం, మారిషస్లను కలిపే బానిస కార్మిక వ్యాపారం గురించి అవగాహన ఉంది. దానితో ఆ దేశాల మధ్య మార్గం గురించి, అలాగే మన భారతదేశం నుండి మారిషస్కు వచ్చిన వారి అనుభవాల గురించి పరిశోధించడం ప్రారంభించింది. కార్మికులతో పాటు అన్యదేశ వన్యజీవులతో కూడా వలస వ్యాపారం చేస్తున్నారని తెలుసుకొని వేదనపడ్డది. ఆ విషయమే కోతికి సంబంధించిన ప్రతీకాత్మక దృష్టికోణం నుండి రాయడానికి ఆమెకు ప్రేరణగా మారింది. ఆమె బహుమతి పొందిన కవితలో భారతదేశం నుంచి మారిషస్కు దాని దయనీయమైన ప్రయాణాన్ని వర్ణిస్తూ, మరియు తల్లిచెంత, స్వంత భూమిలో లభించే ఆత్మీయమైన వాతావరణం హఠాత్తుగా కోల్పోయి, పరాయి చోటున బందీయై పలుబాధలు పడుతూ తిరిగి తల్లి ప్రేమను ఆశిస్తూ అది లభించక పడే తపన...జాలికొలిపే తీరులో దాని ఆర్ద్రమైన కోరికను తన తల్లికి స్వగతంగా విన్నవించుకునే -పసికోతి ద్వారా చెప్పబడిన హృదయవిదారకమైన ఒక ఘటనకు చెందిన కవిత ఇది.. బందిఖానాలో ఉన్నప్పుడు , స్వానుభవాలపట్ల గమనిక..తను పొందిన తీపి అనుభవాలకూ.. ప్రస్తుతం అనుభవించే మనోవేదనకూ మధ్య జరిగే సంఘర్షణను ప్రతి ఒక్కరి హృదయాలను తాకేటట్టు వర్ణించే మనోహరమైన కవిత ఇది. ఈ కవితను రాయడానికి భూమికగా - ఇండియానుండి సింగపూర్కు వచ్చి, ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని, తన మరియు తన సోదరి కోసం వారిదైన నూతన జీవితాన్ని ఏర్పరచుకున్న తీరుతెన్నులను గురించి తన తల్లిదండ్రులు చెప్పిన సంగతులు తనకు స్ఫూర్తినిచ్చాయని మనోజ్ఞ చెప్తుంది. ఇలాటి గంభీరమైన, ప్రభావశీలమైన కవితా రచనతోనే ప్రతిష్టాత్మకమైన క్వీన్స్ కామన్వెల్త్ వ్యాసరచన పోటీలో తను రన్నరప్గా ఎంపికైంది. ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరిగింది. తన కుటుంబ సభ్యులు ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి ప్రసన్న, సోదరి శ్రీ మేఘనల సమక్షంలో చిరంజీవి మనోజ్ఞ ఈ అవార్డును హర్ మెజెస్టీ క్వీన్ కెమిల్లా నుంచి అందుకుంది.(చదవండి: మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు)
విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “TTA సేవా డేస్ - 2025” సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, అవసరమైన సామగ్రి పంపిణీ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు రెండు వారాల పాటు పలు జిల్లాల్లో నిర్వహించారు.హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ, మెదక్ సహా పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభించి, బెంచీలు, యూనిఫామ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సులు అందజేశారు. పాఠశాలల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయాల పునర్నిర్మాణం కూడా చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో 10కే రన్ను కూడా నిర్వహించారు. వృద్ధుల కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన క్యారం బోర్డు ఛాంపియన్షిప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ మహా సేవా కార్యక్రమాలను టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెడ్డి నాయకత్వంలో టీటీఏ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, ఫౌండర్ డా. పైళ్ళ మల్లా రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పటలోల్ల, అడ్వైజరీ సభ్యులు భరత్ రెడ్డి మాదడి, శ్రీని అనుగు, పూర్వ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల, ఇండియా కోఆర్డినేటర్ డా. ద్వారకానాథ రెడ్డి, ఇండియా సేవా డేస్ కోఆర్డినేటర్ మధుకర్ రెడ్డి బీరాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యుల మార్గదర్శకత్వం ఈ భారీ సేవా కార్యక్రమాలకు తోడ్పడింది.అమెరికా నుండి వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీఏ టీమ్ సభ్యులకు, ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీఏ మహాసభలు “టీటీఏ మెగా కన్వెన్షన్ - 2026” జూలై 17–19, 2026లో షార్లెట్, నార్త్కరోలైనాలో జరుగనున్నట్లు టీటీఏ నాయకులు వెల్లడించారు
క్రైమ్
పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్ చేస్తే అస్థిపంజరం దొరికింది
అర్థరాత్రి వేళ, కాన్పూర్ పోలీసులు స్థానిక టవర్ సమీపంలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో బయటపడిన దాన్ని చూసిన పోలీసు అధికారులతోపాటు, చలిని కూడా లెక్క చేకుండా పనిలో నిమగ్నమైన కూలీలకూ చెమటలు పట్టాయి. నేలమాళిగలో ఏడు అడుగుల లోతులో దారుణమైన స్థితిలో అస్థిపంజరం దొరికింది. ప్రేమో, వ్యామోహమో, నమ్మిన వ్యక్తికి జరిగిన తీరని ద్రోహం తాలూకు విషాద గాథ ఇదీ..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన తల్లి కనిపించడం లేదని కొడుకు ఫిర్యాదు చేయడం ఈ విషయం వెలుగు చూసింది. దొరికిన అస్థిపంజరం ఏడుగురు పిల్లల తల్లి అయిన 45 ఏళ్ల రేష్మాదిగా పోలీసులు భావిస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారించేందుకు సిద్ధమవుతున్నారు. రేష్మా భర్త రాంబాబు సంఖ్వార్ మూడేళ్ల క్రితం మరణించాడు. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణం తర్వాత, రేష్మా తన పొరుగువాడైన గోరాలాల్తో అనుబంధం పెంచుకుంది. ఆ తరువాత కొద్దికాలానికే, తన పిల్లలను వదిలి గోరాలాల్తో కలిసి జీవించడం ప్రారంభించింది. దీంతో మనస్తాపం చెందిన రేష్మా పిల్లలు ఆమెతో సంబంధాలు తెంచుకుని విడిగా జీవిస్తున్నారు.ఎలా బయటపడింది?తల్లితో సంబంధాలు తెంచుకున్న రేష్మా కుమారుడు గత ఏడాది నవంబర్ 29న కుటుంబంలో జరగబోయే ఒక పెళ్లికి ఆహ్వానం పంపాడు. రేష్మా పెళ్లికి రాలేదు. దీంతో బబ్లూకు అనుమానం వచ్చింది. గోరాలాల్ ఇంటికి వెళ్లి రేష్మా గురించి ఆరా తీశాడు."నీ అమ్మ ఇక తిరిగి రాదు" అని గోరాలాల్ బదులిచ్చాడు. జోక్ చేస్తున్నాడనుకుని మొదట్లో పెద్దగా అనుమానం రాలేదు. కానీ పదే పదే అడిగినా, కచ్చితమైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ఇక లాభం లేదనుకుని బబ్లూ పోలీసులను ఆశ్రయించాడు.డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దిగ్భ్రాంతికరమైన నిజంబబ్లూ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు గోరాలాల్ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. చివరికి, అతను నిజం చెప్పాడు. గత సంవత్సరం ఏప్రిల్లో తనకు, రేష్మాకు మధ్య గొడవ జరిగిందని, దీంతో ఆమెను రేష్మాను వదిలించు కోవాలనుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపొమ్మని బెదిరించాడు. రేష్మా నిరాకరించింది. దీనివల్ల తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే అతడు రేష్మాను గొంతు నులిమి చంపేశాడు. రెండు రోజుల పాటు అతను మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, దానిని ఎలా వదిలించుకోవాలో ఆలోచించాడు. ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!దానిని కాలువలో పడేయాలని ప్లాన్ చేశాడు, కానీ కొన్ని రోజుల్లో మృతదేహం నీటిపై తేలుతుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఆ తర్వాత గ్రామంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టాలనుకున్నాడు. విచారణ సమయంలో ఆ ప్రదేశం గురించి పొరపాటున చెప్పడంతో, ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆభరణాలు , బట్టల ద్వారా ఆమెను గుర్తించారు. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, రేష్మా ఎముకలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు.ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?
మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్
అమెరికాలో వలసదారులపై జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ దారుణానికి ఒడిగట్టాడు. ఒక మహిళను కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. మిన్నియాపాలిస్లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారంమిన్నెసోటాలోని మిన్నియాపాలిస్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్కు వ్యతిరేకంగా నిరసనకారులు ఉద్యమానికి దిగారు. నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, కారులో కూర్చున్న మహిళ తలపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో రెనీ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.Ice agent shoots woman who tried to flee 😳 pic.twitter.com/fJ1X2XDMhC— RTN (@RTNToronto) January 7, 2026 ఇమ్మిగ్రేషన్ అమలు సమయంలో అధికారులను అడ్డుకోడంతో కాల్పులు జరిపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఘర్షణ సమయంలో మహిళపై కాల్పులు జరిగాయని DHS ప్రతినిధి ట్రిసియా మెక్లాఫ్లిన్ తెలిపారు. అల్లర్లకు, రెనీ గుడ్కు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలి తల్లి డోనా గాంగర్ విచారం వ్యక్తం చేసింది. తన కుమార్తె ఎంతో దయగల, గొప్ప మనిషి, ప్రజలంటే ప్రేమగల ఆమెను అన్యాయంగా కాల్చి చంపారని తల్లి వాపోయింది. అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్, హింస సర్వసాధారణంగా మారింది అని చెప్పడానికి మరో స్పష్టమైన ఉదాహరణ అని విశ్వవిద్యాలయ అధ్యక్షుడు బ్రియాన్ హెంఫిల్ వ్యాఖ్యానించారు. వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనం అంటూ ఆగ్రహం పెల్లుబుకింది. వందలాది మంది నిరసనలకు దిగారు. మిన్నియాపాలిస్ నగర కౌన్సిల్లోని మెజారిటీ సభ్యులు రెనీ మరణానికి కారణమైన ఏజెంట్ను అరెస్టు చేసి, విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ICE తమ నగరాన్ని విడిచి పెట్టాలంటున్నారు. అధికారుల భిన్నవాదనలుఈ సంఘటనల గురించి ఫెడరల్ , స్థానిక అధికారులు చాలా భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కారును ఆపి బయటికి రావాలని ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా ఏజెంట్పై ఎదురుదాడికి దిగి, ICE అధికారిని ఢీకొట్టడానికి ప్రయత్నించినందున మహిళను కాల్చి చంపామని అంటున్నారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు జరుగుతోంది2020లో ఓల్డ్ డొమినియన్ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో పట్టభద్రురాలైంది గుడ్. ఆమె కవయిత్రి కూడా. ప్రస్తుతం రెనీ నికోల్ గుడ్ తన భాగస్వామితో మిన్నియాపాలిస్లో నివసిస్తోంది.కాగా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత వలసదారుల ఆంక్షలు, దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది.ఇదీ చదవండి: బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్, పరారీలో ఎస్ఐ
బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్, పరారీలో ఎస్ఐ
లక్నో : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో దారుణ ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక పోలీసు అధికారి ఒక యూట్యూబర్ ఉండటం మరింత ఆందోళన రేపింది.బాధిత బాలిక పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం కాన్పూర్లోని సచెండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూట్యూబర్ శివబరన్ అరెస్ట్ చేశారు. సబ్-ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్ మౌర్య పరారీలో ఉన్నాడు.ఏం జరిగిందంటే..7వ తరగతి చదువు మానేసిన మైనర్ బాలిక సోమవారం రాత్రి సుమారు 10 గంటలకు తన ఇంటి నుండి బయటకు వెళ్ళగా, మహీంద్రా స్కార్పియోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.అనంతరం సచెండిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాహనంలోనే దాదాపు రెండు గంటల పాటు ఆమెపై లైంగిక దాడి జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఇంటి బయట వదిలి వెళ్లారు. బాధితురాలి సోదరుడు అర్ధరాత్రి సమయంలోఆమెను గమనించి 112కు డయల్ చేసి పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.నిందితులలో ఒకరు పోలీసని చెప్పడంతో తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాలిక సోదరుడు ఆరోపించాడు. ఉన్నతాధికారులను ఆశ్రయించిన తర్వాతే కేసు నమోదు చేశారని, అంతేకాకుండా ఫిర్యాదులో నిందితుల పేర్లను మొదటగా చేర్చలేదని పేర్కొన్నాడు.బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) దినేష్ త్రిపాఠి తెలిపారు. జర్నలిస్టును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, పోలీసు కానిస్టేబుల్ను గుర్తించి విచారణ పూర్తయిన తర్వాత అతడిని కూడా అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు. కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశామని, విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.పరారీలో ఉన్న SIని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని మరో పోలీసు అధికారి రఘుబీర్ లాల్ విలేకరులకు తెలిపారు.
క్రికెటర్.. నాకంటే 12 ఏళ్లు పెద్దది కావడంతో..
చిత్తూరు అర్బన్/ గంగాధరనెల్లూరు: ఇద్దరు విభిన్న ప్రతిభావంతుల మధ్య చిగురించిన ప్రేమ చివరకు విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలు తనకన్నా పెద్దది కావడం.. ఆమెను వదిలించుకునే క్రమంలో ప్రియుడు కిరాతకంగా మారిపోయాడు. ఆమెను నిర్ధాక్షిణ్యంగా హత్య చేసి నీవానదిలో పడేశాడు. చిత్తూరులో నమోదైన అదృశ్యం కేసు హత్యగా పలుపు తిరిగింది. బుధవారం ప్రియురాలి మృతదేహాన్ని గంగాధర నెల్లూరులోని నీవానదిలో గుర్తించారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి.. గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని గిరింపేట బాలజీ కాలనీకి చెందిన కవిత విభిన్న ప్రతిభావంతురాలు. కాణిపాకం ఆలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిస్తున్నారు. గత నెల 31వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లిన కవిత సాయంత్రం వరకు రాకపోవడంతో ఆమె తమ్ముడు చిట్టిబాబు అన్ని చోట్లా వెదికాడు. జనవరి 1వ తేదీన చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. 2వ తేదీన కేసు నమోదు చేశారు.ప్రియుడే హంతకుడు?చిత్తూరులోని మిట్టూరు ఎస్బీఐలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజరుగా విభిన్న ప్రతిభావంతుడు గణేష్(26) పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కవిత, గణేష్ మధ్య పరిచయం పెరిగింది. ఈ పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసినట్లు తెలుస్తోంది. తనకన్నా కవిత వయస్సులో 12 ఏళ్లు పెద్దది కావడంతో.. ఆమెను వదిలించుకోవడానికి గణేష్ ఈ దారుణానికి ఒడిగట్టిట్లు సమాచారం.పెళ్లి చేసుకుంటానని నమ్మించి చంపేశాడు!కవితను పెళ్లి చేసుకుంటామని చెప్పిన గణేష్.. ఆమెను గత నెల 31న ఆటోలో గంగాధరనెల్లూరులోని ఠాణా వద్దకు రప్పించాడు. కొద్దిసేపు తరువాత గణేష్, కవిత మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. తీరా పెళ్లి చేసుకుంటామని నమ్మించి, తన మూడు చక్రాల స్కూటర్లో కవితను ముందర కూర్చోబెట్టుకుని ఆమె తలను వాహనంపై ఉన్న ఓ ఇనుపరాడ్కు బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో కవిత చనిపోవడంతో.. గంగాధరనెల్లూరు బ్రిడ్జిపై నుంచి ఆమెను నీవానదిలోకి తోసేసి వెళ్లిపోయాడు. పోలీసులు గణేష్ను పలుమార్లు స్టేషన్కు పిలిపించి విచారించినా, తాను కూడా ఆమెను వెతుకుతున్నట్లు తప్పుదారి పట్టించాడు. బుధవారం సాయంత్రం నీవానదిలో పడి ఉన్న కవిత మృతదేహాన్ని గుర్తించిన ఆమె సోదరుడు చిట్టిబాబు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన గణేష్.. కవితను వాడుకుని వదిలించుకోవడానికే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.క్రికెటర్..బ్యాంక్ ఉద్యోగివిభిన్న ప్రతిభావంతుడైన గణేష్ జాతీయ స్థాయిలో క్రికెటర్గా రాణించి క్రీడా కోటాలో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. బలిష్టంగా ఉన్న ఇతను కవిత మృతదేహాన్ని అవలీలగా నదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.పోలీసుల వైఫల్యమే కారణంపోలీసుల వైఫల్యం వల్లే కవిత హత్య జరిగిందని.. దీనికి చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్సీపీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన దుయ్యబట్టారు.మా నిర్లక్ష్యం లేదుసీఐ స్పందిస్తూ.. ‘సెల్ టవర్ల లొకేషన్లతో అడవుల్లో, బావులు, చెరువుల వద్ద కవితను వెదికాము. మూడు రాత్రులు మావాళ్లు, నేను నిద్రకూడా పోలేదు. ఆమె కుటుంబ సభ్యులు వాయిస్ మెసేజ్ మాకు ముందుగా ఇచ్చి ఉంటే కేసు త్వరగా ఛేదించేవాళ్లం. ఇందులో మా నిర్లక్ష్యం ఎక్కడాలేదు..’ అని నెట్టికంటయ్య పేర్కొన్నారు.
వీడియోలు
బురద మీడియా.. బూతు రాతలు.. నీ చరిత్ర బయటపెట్టమంటావా..
రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్
చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా
హైకోర్టు తీర్పు ప్రభుత్వం, అధికారులకు చెంపపెట్టు: పేర్ని నాని
చాకిరీ మాకు.. పదవులు మీ వాళ్లకా? పవన్ను నిలదీసిన నేతలు
East Godavari: చంద్రబాబు బహిరంగ సభకు కనిపించని ప్రజా స్పందన
Business: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట..!
పోలీసుల తీరుపై మనోహర్ రెడ్డి ఫైర్

