సచివాలయ ఉద్యోగులపై ‘యోగా’ పిడుగు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న రకరకాల ఇంటింటి సర్వేలు, సంబంధం లేని పనుల కారణంగా పని ఒత్తిడి పెరిగిందని ఆవేదన చెందుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై తాజాగా యోగాభారం పడింది. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసే భారాన్ని వారి నెత్తినపెట్టింది. దీనిపై ఇప్పటికే పలు జిల్లాల్లో సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి యోగా ట్రైనర్గా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.ట్రైనర్గా నమోదు చేసుకున్న ఒక్కొక్కరు కనీసం 40 మంది ప్రజలను యోగాంధ్రలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్దేశించింది. ఒక్కో సచివాలయంలో 17 మంది యోగా ట్రైనర్లుగా నమోదవ్వాలని, అంతమంది సచివాలయ సిబ్బంది లేకపోతే ఆ గ్రామంలో యువకులను ట్రైనర్లుగా నమోదు చేయాలని సూచించింది. పొదుపుసంఘాల మహిళలతో పాటు ఉపాధి హామీ పథకం కూలీలు యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని పేర్కొంది.రిజిస్ట్రేషన్ చేసిన 40 మందికి 20 వరకు రోజూ ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు యోగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని రోజూ ఫొటోలు తీసి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యోగాంధ్ర మొబైల్యాప్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో మండల స్థాయిలో జరిగే పోటీల్లో స్థానికులు పాల్గొనేలా చూడాలని పేర్కొంది. 21వ తేదీన సచివాలయ, మండల స్థాయిలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
విజయ్ ఫొటో కోసం.. కుర్చీ ఖాళీ!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజాదరణ ఇప్పుడు కేవలం రాజకీయ సభలకే పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల్లోనూ ఆయన ఫొటోలు ప్రధాన చర్చగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో ఉంచి తీరాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే.. తిరునెల్వేలిలో చివరకు మేయర్ ‘కుర్చీ’నే ఖాళీ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు అక్కడ జరిగిందంటే.. తిరునెల్వేలి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మేయర్ జి. రామకృష్ణన్ కార్యాలయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ ఫొటో ఏర్పాటు చేశారు. అయితే దానిని గదిలో మధ్యభాగంలో, మేయర్ కుర్చీకి నేరుగా పైన ఉంచాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తలు కోరినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామకృష్ణన్.. తన నిరసనను మరోలా వ్యక్తం చేశారు. ఆయన తన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కార్యాలయ పనులు నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని.. నిరసన తెలిపేందుకే తాను ఇలా చేస్తున్నానని అన్నారాయన. రెండు వారాల క్రితం కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని గదుల్లో విజయ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరగా అంగీకరించామని, ఇప్పుడు తన కుర్చీ పైనే ఫొటో ఉండాలని పట్టుబడటం అనవసర వివాదాలకు దారితీస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజా సేవలకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.అసలు వివాదం రెండు వారాల క్రితమే మొదలైంది. అప్పట్లో కూడా మేయర్ రామకృష్ణన్ నిరసనగా తన టేబుల్పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఫొటోను ఉంచి సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇదే తరహా వివాదం కోయంబత్తూరులోనూ చోటుచేసుకుంది. అక్కడ మేయర్ ఆర్. రంగనాయకి తొలుత తనకు కేటాయించిన గదిలో విజయ్ ఫొటో పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో చివరకు అంగీకరించారు. అయినప్పటికీ స్టాలిన్ ఫొటోను తొలగించేందుకు మాత్రం నిరాకరించారు.కరూర్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. విజయ్ ఫొటో పక్కనే స్టాలిన్ ఫొటోను కూడా ఉంచాలని డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ నేతల ఫొటోలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సమావేశం రాజకీయ వాగ్వాదాలకు వేదికగా మారింది.కూనూర్లో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విజయ్ ఫొటోతో పాటు స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి చిత్రాలను ఉంచగా, టీవీకే కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆ ఫొటోలను తొలగించడంతో వివాదం చెలరేగింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరించాల్సి వచ్చింది.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఫొటోల వివాదం మాత్రమే కాదు. స్థానిక సంస్థల్లో టీవీకే ఎమ్మెల్యేలు, డీఎంకే లేదంటే ఇతర పార్టీల కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపానికి ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతోందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పోరులో ప్రజా సమస్యలు పక్కన పడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Polimer News (@polimernews) VIDEO Credits: polimernews
దుబాయ్లో ఘోరం.. ఏడుగురి భారతీయులు మృతి
దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. "దుబాయ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని దుబాయ్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది.ప్రమాదానికి గల కారణాలను దుబాయ్ పోలీసు ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ వివరిస్తూ.. సాంకేతిక లోపం కారణంగా ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో ట్రక్కు అకస్మాత్తుగా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ప్రమాదానికి గురైన ట్రక్కు, బస్సులను రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం.. సరైన సురక్షిత దూరం పాటించకపోవడం వల్లే వెనుక నుంచి వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిని భారత రాయబార కార్యాలయ అధికారులు పరామర్శించారు.
భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్కేస్లో కుక్కింది.!
పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్పై సూట్కేసులో దొరికిన కుళ్లిపోయిన తల చేతులు కాళ్లు లేని మృతదేహం కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల కాళ్లు, చేతులు లేక పోవడం, మొండెం మాత్రం ఉండటంతోకేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్కోడ్ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆ దుస్తులను కొనుగోలు చేసిన షాపును గుర్తించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలింది. కాల్ డేటా రికార్డ్, వాట్సాప్ లోకేషన్ ఆధారంగా నిందితులు తేనాంపేట, టి.నగర్ పరిసరాలలో ఉన్నట్టు గుర్తించారు. హత్యకు గల కారణాలు.. పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్ గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్ రోడ్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్లో నివసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టి.నగర్లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు అష్రఫ్ (31)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి చెప్పగా పథకం ప్రకారం మట్టుబెట్టినట్టు తేలింది. హత్య తర్వాత తన భర్త అమీర్ అలీ స్వయంగా పెట్టినట్లుగా.. తనకు ఇక బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫెస్బుక్లో రోకిమా పోస్టు చేసింది. మానసిక క్షోభతో∙అమీర్ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకే యత్నించింది.శవాన్ని ముక్కలుగా నరికి.. పథకం ప్రకారం, జూన్ 4వ తేదీ రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న సమయంలో రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీ రాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా, నరికిన చేతులు, కాళ్లను ఒక కాలువలో వేయగా, తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర బాగాలను నరికేటప్పుడు ఆనందంగా భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం.-సాక్షి, చెన్నై
నేరాలు చేసి నేపాలీలు పరార్!
ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత!
సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల
హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్ ట్విస్ట్
బీమా చేయించి.. చంపేశారు!
హైదరాబాద్లో రెచ్చిపోయిన మరో నేపాలీ గ్యాంగ్
హిందీ కంటే సౌత్ సినిమాలే మెరుగ్గా రాణిస్తున్నాయి: కాజల్
అతడికి షరతులు వర్తించవా?.. అగార్కర్కు చురకలు!
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
అడవిలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య!
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు
‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్కు రాహుల్ రామకృష్ణ చురకలు!
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’
ఊళ్లో నెమళ్ల బెడద
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఆఫర్లు
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
తొలి క్యాబినేట్ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్
మెగా మామ్!
క్యాబ్ డ్రైవర్పై సినీ నటుడు దాడి
నేరాలు చేసి నేపాలీలు పరార్!
ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత!
సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల
హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్ ట్విస్ట్
బీమా చేయించి.. చంపేశారు!
హైదరాబాద్లో రెచ్చిపోయిన మరో నేపాలీ గ్యాంగ్
హిందీ కంటే సౌత్ సినిమాలే మెరుగ్గా రాణిస్తున్నాయి: కాజల్
అతడికి షరతులు వర్తించవా?.. అగార్కర్కు చురకలు!
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
అడవిలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య!
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు
‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్కు రాహుల్ రామకృష్ణ చురకలు!
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’
ఊళ్లో నెమళ్ల బెడద
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఆఫర్లు
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
తొలి క్యాబినేట్ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్
మెగా మామ్!
క్యాబ్ డ్రైవర్పై సినీ నటుడు దాడి
ఫొటోలు
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. గుండెలు పిండేసే దృశ్యాలు
చేప మందు కోసం వేలాదిగా తరలివచ్చిన ప్రజలు (ఫోటోలు)
బాలీవుడ్ బ్యూటీ నేహ కక్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తన ముద్దుల గారాలపట్టితో బిగ్బాస్ శివజ్యోతి బొబ్బట్ల పండుగ (ఫొటోలు)
శారీలో అనసూయ గ్లామర్ చూశారా? (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ స్టిల్స్
మృగశిర ఎఫెక్ట్.. కిక్కిరిసిన మార్కెట్ (ఫొటోలు)
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం (ఫొటోలు)
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్నెస్తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
సినిమా
'మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా'.. స్లమ్డాగ్ యాక్షన్ టీజర్
తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా వస్తోన్న చిత్రం స్లమ్ డాగ్.. 33 టంపుల్ రోడ్. ఈ మూవీకి టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.'ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్లో విజయ్ సేతుపతి ఎంట్రీ, యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక సామాన్యుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో ఈ కథ ఉండనుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. టీజర్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త, టబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
'నా భార్యను మోసం చేయలేదు'.. దురంధర్ నటుడు కామెంట్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్, బ్లాక్బస్టర్ మూవీ దురంధర్. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన ది రివెంజ్ సైతం బాక్సాఫీస్ను షేర్ చేసింది. ఈ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా.. ఆర్ మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు. ఈ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు.తాజాగా ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యుకు హాజరైన మాధవన్ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు. ఎంతోమంది అందమైన హీరోయిన్లతో తాను పనిచేశానని వెల్లడించారు. అయితే ఎప్పుడు తాను ఎవరితో రిలేషన్ పెట్టుకోలేదన్నారు. ఈ విషయంలో తన వైఫ్ను ఎప్పుడు మోసం చేయలేదని తెలిపారు. ఎందుకంటే తన జీవితంలో వైవాహిక బంధానికి ఎక్కువ విలువ ఇస్తానని మాధవన్ వెల్లడించారు.కుటుంబంతో సంతోషంగా ఉండాలనేదే తనకిష్టమని ఆర్ మాధవన్ తెలిపారు. ఇదంతా తాను పాత తరం నుంచే నేర్చుకున్నానని.. సతీమణితో విధేయతగా ఉండడం మా బ్లడ్లోనే ఉందన్నారు. షూటింగ్ పూర్తికాగానే ఇంటికి వెళ్లి నా భార్యను హత్తుకున్నప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించారు. ఎందుకంటే నేను భార్యకు భయపడే మధ్యతరగతి వ్యక్తినన సరదాగా మాట్లాడారు. తన భార్య సరితనే ఇంట్లో ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటారని వెల్లడించారు. తన ఫోన్, బ్యాంక్ లావాదేవీలు కూడా ఆమెనే చూస్తుంటారని పంచుకున్నారు. కాగా.. 1993లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్ మాధవన్.. 1999లో సరితను వివాహం చేసుకున్నారు.
'మోదీ ఆలోచనే పెద్దికి ఆదర్శం'.. బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.తాజాగా పెద్ది టీమ్ హైదరాబాద్లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్కు డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు హీరో రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెద్ది మూవీ కథకు స్ఫూర్తి ఏంటనే విషయాన్ని రివీల్ చేశారు. ఇది ఒక ఆదర్శమైన కథ అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను బయటి ప్రపంచానికి పరిచయం పెద్ది మూవీ ఉద్దేశమని బుచ్చిబాబు అన్నారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఖేలో ఇండియానే పెద్ది కథకు స్ఫూర్తి అని తెలిపారు. మట్టిలో ఆటగాళ్లను వెతుకుదాం.. ఓట్లలాగే ఇంటింటికి వెళ్లి ఆటగాళ్లను కూడా అడుక్కుందాం అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇండియాకు మెడల్స్ తీసుకొచ్చేలా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడమే ఖేలో ఇండియా ఉద్దేశమన్నారు. భారత జీవన విధానంలోనే ఆట కూడా ఓ భాగమని చెప్పాలనుకున్నా.. అందుకే పెద్దిని మీ ముందుకు తీసుకొచ్చానని అన్నారు. పెద్ది అనేది కమర్షియల్ చిత్రం కాదన్నారు. ఈ మూవీ గ్రామీణ క్రీడాకారుందరికీ ఆదర్శమని బుచ్చిబాబు తెలిపారు.
పెద్ది పేరుతో ఏకంగా స్కూల్.. ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.అయితే ఈ మూవీ పేరుతో ఏకంగా స్కూల్ ఉందని మీకు తెలుసా? దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో స్కూల్ను చూసిన ఓ చిన్నారి ది పెద్ది స్కూల్.. నాన్న అది చికిరి చికిరి వాళ్ల స్కూలా అంటూ క్యూట్గా.. అమాయకంగా అడిగింది. ఈ వీడియో యూఎస్లో తీసినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో పెద్ది టీమ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.#ChikiriChikiri Vala School Ah Anta 🔥😂#PEDDI @AlwaysRamCharan pic.twitter.com/LDYLZLZTXQ— SAI CHARANISM ™ 🔥 (@saicharanism1) June 8, 2026
క్రీడలు
చూసేద్దాం...చివరిసారి!
ఏ ఆటలో అయినా నిలకడగా రాణిస్తూ... మంచి గుర్తింపు తెచ్చుకునే ప్లేయర్లు చాలా మంది ఉంటారు. కానీ తమ ఉనికితోనే మ్యాచ్ను రసవత్తరంగా మార్చేసి... చిన్న కదలికలతో ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను చేసేవారు కొందరే! స్టార్, సూపర్ స్టార్ స్థాయి దాటేసి అలా లెజెండ్గా మారిన పలువురు ప్లేయర్లు ఈ ‘ఫిఫా’ ప్రపంచకప్తో అంతర్జాతీయ ఫుట్బాల్కు టాటా చెప్పనున్నారు. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), నెమార్ (బ్రెజిల్), మొహమ్మద్ సలా (ఈజిప్ట్), లూకా మోడ్రిక్ (క్రొయేషియా), మాన్యుయెల్ న్యూయెర్ (జర్మనీ), విర్జిల్ వాన్ డిక్ (నెదర్లాండ్స్), కెవిన్ డి బ్రూనీ (బెల్జియం), సాడియో మానె (సెనెగల్), సన్ హెంగ్ మిన్ (దక్షిణ కొరియా), జేమ్స్ రోడ్రిగెజ్ (కొలంబియా) ఇలా ఈ జాబితా చాలా పెద్దదే! ఈ దిగ్గజాలను ఆయా దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచ్ల్లో చూడటం దాదాపు ఇదే చివరిసారి కానుంది. అలాంటి వాళ్ల కెరీర్ను ఓసారి పరిశీలిస్తే...మెస్సీ... అర్జెంటీనా తురుపుముక్క సుదీర్ఘ కాలంగా అర్జెంటీనా జట్టు తురుపుముక్కగా ఉన్న స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 తర్వాత కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. నాలుగేళ్ల క్రితం ఖతార్లో జరిగిన మెగా టోర్నీ సమయంలోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న 39 ఏళ్ల మెస్సీ... అప్పుడు అర్జెంటీనా జట్టు వరల్డ్ చాంపియన్గా నిలవడంతో... సుదీర్ఘకాలంగా తాను కన్న కలను ఆస్వాదించేందుకు ఆటలో కొనసాగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 198 మ్యాచ్లాడిన మెస్సీ 115 గోల్స్ కొట్టాడు. ఐదుసార్లు ‘ఫిఫా’ వరల్డ్కప్లో పాల్గొన్న మెస్సీ... రికార్డు స్థాయిలో ఆరోసారి మెగా టోర్నీలో ఆడిన అనంతరం వీడ్కోలు పలికే అవకాశాలున్నాయి. మరే ఆటగాడికీ సాధ్యం కాని రీతిలో ఈ అర్జెంటీనా స్టార్ 26 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనున్న అర్జెంటీనా జట్టు... టైటిల్ను నిలబెట్టుకొని మెస్సీకి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తోంది. అతడి నాయకత్వ పటిమ, అనుభవం ఈ టోర్నీలో అర్జెంటీనాకు మరింత బలాన్నిస్తాయని యోచిస్తోంది. ఫిట్నెస్ ఎంతో కీలకమైన ఫుట్బాల్లో 39 ఏళ్ల వయసు వరకు కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. జాతీయ జట్టుతో పాటు క్లబ్లు కలుపుకుంటే కెరీర్లో మొత్తం 1151 అధికారిక మ్యాచ్లు ఆడిన మెస్సీ... 906 గోల్స్ చేశాడు.రొనాల్డో... ముందే చెప్పేశాడుయావత్ క్రీడా ప్రపంచం ‘సీఆర్7’గా పిలుచుకునే... ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ ప్రపంచకప్ అనంతరం కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. మెస్సీతో సరిసమానంగా రికార్డు స్థాయిలో ఆరోసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ బరిలోకి దిగనున్న 41 రొనాల్డో ఇదే తనకు చివరి ప్రపంచకప్ అని ఇప్పటికే వెల్లడించాడు. కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన రొనాల్డో లెక్కకు మిక్కిలి ట్రోఫీలు సైతం చేజిక్కించుకున్నాడు. అయితే సుదీర్ఘ కాలంగా ఎంతగానో తపిస్తున్నా ‘ఫిఫా’ విన్నర్స్ ట్రోఫీ మాత్రం అతడి చేతికి చిక్కలేదు. ‘ఔర్ ఏక్ ధక్కా... ఇస్ బార్ పక్కా’ అన్నట్లు తన చివరి ప్రయత్నంలో అయినా అందని ద్రాక్షను అందుకోవాలని రొనాల్డో భావిస్తున్నాడు. 2003లో తొలిసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగిన రొనాల్డో... 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో పోర్చుగల్ తరఫున 226 మ్యాచ్లు ఆడి 143 గోల్స్ చేశాడు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన ‘అల్ నాసర్’ క్లబ్కు సారథ్యం వహిస్తున్న రొనాల్డో... ఇటీవలే సౌదీ ప్రొ లీగ్ టైటిల్ సాధించి ఫుల్ జోష్లో ఉన్నాడు. అదే ఊపు ప్రపంచకప్లోనూ కొనసాగిస్తూ తన చిరకాల లక్ష్యాన్ని అందుకుంటాడా చూడాలి. సీనియర్ స్థాయిలో ఇప్పటి వరకు 1320 మ్యాచ్లు ఆడిన రొనాల్డో 970 గోల్స్ చేశాడు. 41 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్కు ప్రతిరూపంగా నిలచే రొనాల్డో... సోషల్ మీడియాలో వంద కోట్లకుపైగా ఫాలోవర్స్ సంపాదించుకున్న తొలి వ్యక్తిగా అరుదైన ఘనత సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.నెమార్... బ్రెజిల్ గుండె చప్పుడు మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆడిన బ్రెజిల్ సూపర్ స్టార్ నెమార్ జూనియర్ చివరి టోర్నీకి సిద్ధమవుతున్నాడు. తన తరంలో జట్టుకు అందని ట్రోఫీని అందించాలనే బలమైన సంకల్పంతో ఉన్నాడు. అయితే ఫిట్నెస్ కారణాలరీత్యా అతడు అన్నీ మ్యాచ్లు ఆడతాడా అనేది సందేహమే. అత్యధికంగా ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) వరల్డ్ చాంపియన్గా నిలిచిన బ్రెజిల్ ‘సిక్సర్’ కొట్టాలంటే నెమార్ ప్రదర్శన కీలకం కానుంది. ఇది తనకు చివరి మెగా టోర్నీ అని 34 ఏళ్ల నెమార్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున 128 మ్యాచ్లు ఆడిన నెమార్... 79 గోల్స్ చేయడంతో పాటు మరో 59 గోల్స్కు సహకారం అందించాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా కొనసాగుతున్న నెమార్ చివరి వరల్డ్కప్లోనూ అదే నిలకడ కొనసాగించాలని భావిస్తున్నాడు. ఐదో ప్రపంచకప్ ఆడనున్న జర్మనీ గోల్ కీపర్ న్యూయెర్ (40 ఏళ్లు), మెక్సికో గోల్ కీపర్ ఒచోవా (40 ఏళ్లు), కొలంబియా కెప్టెన్ జేమ్స్ రోడ్రిగెజ్ (34 ఏళ్లు), సాడియో మానె (34 ఏళ్లు), విర్జిల్ వాన్ డిక్ (35 ఏళ్లు), కెవిన్ డి బ్రూనీ (35 ఏళ్లు), సన్ హెంగ్ మిన్ (34 ఏళ్లు) కూడా చివరిసారి ప్రపంచకప్లో కనిపించనున్నారు.సలా... వన్ మ్యాన్ షో క్లబ్ ఫుట్బాల్ లివర్పూల్ తరఫున సంచలనాలు నమోదు చేసిన ఈజిప్ట్ సూపర్ స్టార్ మొహమ్మద్ సలాకు కూడా ఇదే చివరి ‘ఫిఫా’ వరల్డ్కప్ కానుంది. 2010లో సీనియర్ స్థాయిలో తొలి మ్యాచ్ ఆడిన సలా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 115 మ్యాచ్లాడి 67 గోల్స్ చేశాడు. అటాకింగ్కు పెట్టింది పేరైన సలా... రెప్పపాటులో ప్రత్యర్థి ప్లేయర్లను బోల్తా కొట్టించడంలో నేర్పరి. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి (2018లో) ప్రపంచకప్ బరిలోకి దిగిన సలా... 2 మ్యాచ్లాడి రెండు గోల్స్ చేశాడు. క్లబ్ ఫుట్బాల్లో 750కి పైగా మ్యాచ్లాడిన అనుభవం ఉన్న అతడు... ఈజిప్ట్ను ఎలా ముందుకు నడిపిస్తాడనేది కీలకం. మైదానంలో అతడి వేగం, గోల్స్ చేయడంలో అతడి సామర్థ్యంపై ఈజిప్ట్ భారీ ఆశలు పెట్టుకుంది. సుదీర్ఘ ‘ఫిఫా’ వరల్డ్కప్ చరిత్రలో ఈజిప్ట్ ఇప్పటి వరకు మూడుసార్లు (1934, 1990, 2018) మాత్రమే మెగా టోర్నీకి అర్హత సాధించింది. 33 ఏళ్ల సలాకు ఫిట్నెస్ పరంగా సమస్యలు లేకపోయినా... ఇప్పటి వరకు ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈజిప్ట్ వచ్చే సీజన్కు అర్హత సాధిస్తుందా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో... అతడికిదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలున్నాయి. లూకా మోడ్రిచ్... క్రొయేషియా ఆశ క్రొయేషియా మిడ్ఫీల్డర్ లూకా మోడ్రిచ్ ఐదోసారి ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ జట్టు ఆడిన సగానికి పైగా మ్యాచ్ల్లో బరిలోకి దిగిన 40 ఏళ్ల మోడ్రిక్ చివరిసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ టోర్నీ ఆడనున్నాడు. కెరీర్లో 196 మ్యాచ్లాడిన మోడ్రిచ్... 28 గోల్స్ చేశాడు. గోల్స్ పరంగా చూసుకుంటే సంఖ్య తక్కువే కనిపించినా మిడ్ఫీల్డ్లో అతడి అనుభవం జట్టుకు ఎంత బలాన్నిస్తుందో గత ప్రపంచకప్లో రుజువైంది. 2022 టోర్నీలో అనూహ్య ఆటతీరుతో జట్టును ముందుకు నడిపించిన మోడ్రిచ్... క్రొయేషియాను మూడో స్థానంలో నిలిపాడు. ప్రస్తుతం ఇటలీ లీగ్లో ఏసీ మిలాన్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న లూకా... ఇటీవల గాయపడి కోలుకున్నాడు. ముఖానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఈ టోర్నీలో అతడు సేఫ్టీ మాస్క్తో బరిలోకి దిగొచ్చు. క్రొయేషియా జట్టు సంధి దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో లూకా అనుభవం ఆ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేనేజర్ డాలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. – సాక్షి క్రీడా విభాగం
ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నజరానా
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక నార్వే ఓపెన్ చెస్ టోర్నిలో టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన తమిళనాడు గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహకం లభించింది. విజేత హోదాలో చెన్నై వచ్చిన ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో సోమవారం సచివాలయంలో సీఎం విజయ్ను కలిశాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందను విజయ్ సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహానికి గాను చెక్ను అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో చెస్ బోర్డు తెచ్చావా? అని అడిగి మరీ విజయ్ 15 నిమిషాలపాటు స్నేహపూర్వక గేమ్ ఆడారు. వీరిద్దరి మధ్య గేమ్ను ఛాంబర్లో ఉన్న క్రీడా మంత్రి ఆధవ్ అర్జునతో పాటుగా అ«ధికారులు ఆసక్తితో తిలకించారు. గేమ్లో తనను ఓడించిన ప్రజ్ఞానందను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
‘ఆసియా’ అంతంతే!
టేబుల్ టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, బ్యాడ్మింటన్... తదితర వ్యక్తిగత క్రీడాంశాల్లో విశ్వవేదికపై ఆసియా దేశాల క్రీడాకారులు సంపూర్ణ ఆధిపత్యం చలాయిస్తుంటారు. కానీ జట్టు క్రీడ అయిన ఫుట్బాల్లో మాత్రం ఆసియా దేశాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. కోట్లాది మంది క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించే ఫుట్బాల్ ప్రపంచకప్లోనైతే ఆసియా దేశాలు చిరస్మరణీయ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. 2002లో దక్షిణ కొరియా–జపాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్లో దక్షిణ కొరియా జట్టు సెమీఫైనల్ చేరడమే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఆసియా దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ ప్రదర్శన. పెరిగిన ఆసియా బెర్త్లు... 32 జట్లతో ప్రపంచకప్ నిర్వహించినపుడు ఆసియాకు నేరుగా 4 బెర్త్లు దక్కేవి. ఇంటర్ కాన్ఫడరేషన్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఐదో బెర్త్కు కూడా అవకాశం ఉండేది. ఈసారి జట్ల సంఖ్య 48కి పెరగడంతో ఆసియా దేశాలు బెర్త్లు రెట్టింపై 8కి చేరుకున్నాయి. ఇంటర్ కాన్ఫడరేషన్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా తొమ్మిదో బెర్త్ కూడా అవకాశం లభించింది. 47 దేశాలు పోటీపడ్డ ఆసియా క్వాలిఫయింగ్ ద్వారా ఈసారి దక్షిణ కొరియా, జపాన్, ఆ్రస్టేలియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్, ఇరాన్ జట్లు ఎనిమిది బెర్త్లు దక్కించుకోగా... ఇంటర్ కాన్ఫడరేషన్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ఇరాక్ జట్టు 2–1 గోల్స్తో బొలీవియా జట్టును ఓడించి తొమ్మిదో బెర్త్ను సంపాదించింది. జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ జట్లు తొలిసారి ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధించాయి. ఆ మూడు జట్లపైనే... దక్షిణ కొరియా జట్టు 12వసారి, జపాన్ జట్టు 8వసారి బరిలోకి దిగుతున్నాయి. ఇరాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా జట్లకు ఇది ఏడో ప్రపంచకప్ కానుంది. ఖతార్, ఇరాక్ జట్లు రెండోసారి ప్రపంచకప్లో పోటీపడుతున్నాయి. జపాన్ జట్టు నాలుగుసార్లు, ఆస్ట్రేలియా రెండుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు వచ్చాయి. ఈసారి కూడా దక్షిణ కొరియా, జపాన్, ఆ్రస్టేలియా జట్లపైనే ఆసియా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మిగతా ఆరు జట్లు గ్రూప్ దశను దాటి ముందుకు వెళితే బోనస్ అనుకోవాలి. – సాక్షి క్రీడా విభాగం
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్లో కీలక మార్పు
త్వరలో స్వదేశంలో భారత్తో జరుగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు సంబంధించి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ వీక్షకుల సంఖ్య పెంచేందుకు మూడు మ్యాచ్ల ప్రారంభ సమయాలను మార్చింది.వాస్తవానికి ఈ మ్యాచ్లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బ్రాడ్కాస్టర్లతో చర్చల అనంతరం వాటిని సాయంత్రం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) ప్రారంభించాలని నిర్ణయించారు.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భారత ప్రేక్షకులే. భారత్లో క్రికెట్కు ఉన్న విపరీతమైన ఆదరణ దృష్ట్యా, మ్యాచ్లు మరింత ఎక్కువ మంది వీక్షించేలా టైమింగ్ను మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బ్రిటన్కు చెందిన స్కై స్పోర్ట్స్, భారత్కు చెందిన సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లతో ECB సంప్రదింపులు జరిపింది.కాగా, జూలై 1 నుంచి 19 వరకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటనుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును తాజాగా ప్రకటించారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు ఈ సిరీస్కు సిద్ధమవుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడంతో ఈ పర్యటనపై మరింత ఆసక్తి నెలకొంది.
న్యూస్ పాడ్కాస్ట్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి... ఆరుగురికి తీవ్ర గాయాలు
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
బిజినెస్
ఎలక్ట్రానిక్స్ రంగం @ రూ.14.4 లక్షల కోట్లు!
ముంబై: ఎల్రక్టానిక్స్ తయారీ సేవల (ఈఎంఎస్) రంగం వచ్చే ఐదేళ్లలో భారీగా విస్తరించనుంది. 2030 నాటికి మూడు రెట్లకు పైగా పెరిగి 150 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.14.4 లక్షల కోట్లు) ఈఎంఎస్ మార్కెట్ చేరుకుంటుందని కేపీఎంజీ ఇండియా నివేదిక అంచనా వేసింది. దేశీ డిమాండ్కు తోడు ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు. చైనాకు ప్రత్యామ్నాయంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల కోసం అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తుండడం (చైనా ప్లస్ వన్ విధానం) ఈ మార్కెట్ విస్తరణకు దన్నుగా నిలవనున్నట్టు తెలిపింది. 2025లో ఈఎంఎస్ మార్కెట్ పరిమాణం 40–45 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. అయితే ఈ రంగం వృద్ధి విస్తృతంగా కాకుండా పరిమితంగా ఉండడాన్ని ఎత్తి చూపించింది. అధిక విలువను తీసుకొచ్చే డిజైన్, విడిభాగాలు, మేధో హక్కుల (ఐపీ) పరంగా దేశీ సంస్థల పాత్ర పరిమితంగానే ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో మొబైల్, అధికంగా అమ్ముడుపోయే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అసెంబ్లింగ్కే భారత కంపెనీలు ఎక్కువగా పరిమితమైనట్టు వివరించింది. దీని స్థానంలో డిజైన్, తయారీ, ఐపీ, వ్యాల్యూ చైన్తో కూడిన సమగ్రమైన ఎల్రక్టానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ అవతరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. వృద్ధికి అపార అవకాశాలు.. అంతర్జాతీయ ఈఎంఎస్ మార్కెట్ 2025లో 640–650 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు పెరగనున్నట్టు కేపీఎంజీ నివేదిక అంచనా వేసింది. అనుసంధానత, ఎలక్ట్రిఫికేషన్, ఓఈఎం అవుట్సోర్సింగ్ ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రంగం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడం కంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు పేర్కొంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా 5–6 శాతంగానే ఉండగా, ఇక్కడి నుంచి భారీ వృద్ధి సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ చర్యలు అవసరం.. ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన కీలక విడిభాగాల కోసం భారత్ ఇప్పటికీ 80–95 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఇక్కడి కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయని.. దీన్ని అధిగమించడం అత్యంత ముఖ్యమని ఈ నివేదిక సూచించింది. సాధారణ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ ద్వారా మార్కెట్ పరిమాణం పెరిగినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం క్లిష్టమైన సాంకేతికత కలిగిన ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, ఏరోస్పేస్ రంగాలపై ఎక్కువగా దృష్టి సారించాలని పేర్కొంది. ఈ రంగాల్లో అధిక విలువ సృష్టికి అవకాశాలున్నట్టు వివరించింది. ఎల్రక్టానిక్స్ తయారీలో తక్కువ వ్యయాలతో అంతర్జాతీయంగా భారత్ పోటీపడేందుకు కేవలం సామర్థ్య ఆధారితం కాకుండా నైపుణ్య ఆధారితంగా ఎదగాల్సి ఉందని పేర్కొంది. ‘‘ఇందుకోసం ప్రభుత్వం, తయారీ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. దేశీయంగా విడి భాగాల తయారీని పెంచడంతోపాటు కారి్మకుల్లో నైపుణ్యాలను పెంచాలి. ఇంజనీరింగ్–డిజైన్పై పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థతో అనుసంధానం కావడంపై దృష్టి సారించాలి’’అని ఈ నివేదిక సూచించింది.
నెలకు రూ.1.35 లక్షల భరణం ఇవ్వాల్సిందే!
ఆధునిక వివాహ బంధాల్లో వస్తున్న విభేదాలు, విడాకుల కేసులో ఇటీవల పుణె కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశం అయింది. భార్య నెలకు లక్షకు పైగా జీతం సంపాదిస్తున్నప్పటికీ, ఆమెకు భర్త భారీ మొత్తంలో భరణం (మెయింటెనెన్స్) చెల్లించాల్సిందేనంటూ పుణెలోని ఒక కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది.అసలేం జరిగింది? కేసు వివరాలు ఇవీ..ఉద్యోగ రీత్యా పుణెలో స్థిరపడిన ఒక ఐటీ/కార్పొరేట్ జంటకు వివాహమైన ఆరు నెలలకే మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో వారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ సమయంలో భార్య తరఫు న్యాయవాది కీలక వాదనను తెరపైకి తెచ్చారు. వివాహ బంధంలో ఉన్నప్పుడు తాను ఎలాంటి విలాసవంతమైన, ఉన్నతమైన జీవన ప్రమాణాలను అనుభవించిందో విడిపోయిన తర్వాత కూడా అదే స్థాయి జీవనాన్ని కొనసాగించే హక్కు ఆమెకు ఉందని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. భర్త తన విడాకులు తీసుకున్న భార్యకు నెలకు రూ.1,35,000 భరణంగా చెల్లించాలని ఆదేశించింది.ఆదాయాల లెక్కలు ఇలా..కోర్టు రికార్డుల ప్రకారం ఇద్దరి ఆదాయ వివరాలు కింది విధంగా ఉన్నాయి.వివరాలుభర్త ఆర్థిక పరిస్థితిభార్య ఆర్థిక పరిస్థితిప్రస్తుత నెలవారీ జీతంరూ. 2,79,499రూ. 1,41,436కోర్టు ఆదేశించిన భరణంరూ. 1,35,000రూ. 1,35,000తీర్పు తర్వాత మొత్తం ఆదాయంరూ. 1,44,499రూ. 2,76,436
లేఆఫ్స్ సమయంలో వాల్మార్ట్ వినూత్న వ్యూహం
ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ఐటీ, కార్పొరేట్ కంపెనీలు ఏఐ సాకుతో ఉద్యోగులపై లేఆఫ్స్ పంజా విసురుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ వాల్మార్ట్ భిన్నమైన వ్యూహాన్ని ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానం అనేది మానవ వనరులను భర్తీ చేయడానికి కాదు, వారి పనితీరును మరింత మెరుగుపరచడానికేనని స్పష్టం చేసింది. అర్కాన్సాస్లోని బెంటన్విల్లేలో నిర్వహించిన వాల్మార్ట్ వార్షిక ‘అసోసియేట్స్ వీక్’ ఈవెంట్లో సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్లు కీలక ప్రకటనలు చేశారు. డిజిటల్ సాధనాలు కేవలం సమస్యల పరిష్కారానికి, వ్యాపార సరళీకరణకు, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికే ఉపయోగపడతాయని భరోసా ఇచ్చారు.ఉత్పాదకత సాధనంగానే ఏఐగత మూడు నెలల్లో అమెరికా కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించడానికి ఏఐ సాంకేతికతను ఒక ప్రధాన కారణంగా చూపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. వాల్మార్ట్ సైతం ఇటీవల తన టెక్నాలజీ, ప్రొడక్ట్ డిజైన్ విభాగాల్లో వందలాది పోస్టులను తగ్గించినప్పటికీ ఆ నిర్ణయానికి ఏఐతో ఎటువంటి సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఏఐని ఉద్యోగుల భర్తీ వ్యూహంగా కాకుండా ఉత్పాదకతను పెంచే ఒక సాధనంగా వాల్మార్ట్ అగ్రనాయకత్వం అభివర్ణించింది.‘సాంకేతికత మన భవిష్యత్తుకు ఊతమిస్తుంది. కానీ, మన ఉద్యోగులే దానికి నాయకత్వం వహిస్తారు’ అని డోనా మోరిస్, వాల్మార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ తెలిపారు. వాల్మార్ట్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ ఫర్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాల్మార్ట్ చరిత్రలో సాధించిన విజయాల వెనుక సాంకేతికత కంటే ఉద్యోగుల కృషి, వారు చూపిన ప్రతిభే కీలకమని కొనియాడారు.భిన్నాభిప్రాయాలు - ఆందోళనలుఏఐ పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ వాల్మార్ట్ వార్షిక ఆదాయం సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అయితే గత ఐదేళ్లలో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కార్మికులపై ఏఐ ప్రభావంపై మరింత పారదర్శకత కావాలంటూ ‘యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్’ అనే లేబర్ అడ్వకసీ గ్రూప్ వాటాదారుల సమావేశంలో ప్రతిపాదన తెచ్చింది. ఏఐ సాధనాల వల్ల పని వేగం పెరిగి కార్మికులపై ఒత్తిడి తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రతిపాదనకు తగినంత మద్దతు లభించలేదు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!
డబ్బు కావాలా? వీటిలో మాస్టర్స్ అవ్వాల్సిందే!
ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పంచుకున్న కొన్ని ఆర్థిక సూత్రాలు ఇప్పుడు యువతను, వర్ధమాన పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతికే సగటు ఆలోచనా విధానానికి, రూ.కోట్లకు పడగలెత్తే వ్యాపారవేత్తల మైండ్ సెట్కు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు.‘ ‘నేను ధనవంతుడిగా ఎలా మారాలి? దీనికోసం ఏదైనా మంత్రదండం ఉందా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. వారంతా నా నుంచి ఏదో ఒక సంక్లిష్టమైన ఫార్ములానో లేక మాయా పెట్టుబడి వ్యూహాన్నో ఆశిస్తారు. కానీ, నేను కుర్రాడిగా ఉన్నప్పుడే మా ‘రిచ్ డాడ్’ నాకు అసలైన రహస్యం చెప్పారు. నువ్వు నిజంగా ధనవంతుడివి కావాలననుకుంటే.. కేవలం రెండు విషయాల్లో పట్టు సాధించు. ఒకటి సేల్స్ (అమ్మకాలు), రెండు రియల్ ఎస్టేట్’ అన్నారు.ఆ రెండు నైపుణ్యాలే ఎందుకు?రాబర్ట్ కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఒక వ్యక్తి ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరడానికి ఈ రెండు రంగాలు పునాదిగా పనిచేస్తాయి.సేల్స్ (అమ్మకాలు)వ్యాపార ప్రపంచంలో ఎవరైనా ఏదైనా అమ్మనంత వరకు అక్కడ ఎలాంటి చలనం ఉండదు. సేల్స్ అంటే కేవలం వస్తువులను అమ్మడం కాదు.ఎదుటివారితో ఎలా మాట్లాడాలి.ఎలా చర్చలు జరపాలిఇతరులను ఎలా ప్రభావితం చేయాలి.విలువను ఎలా సృష్టించాలి.. అనేది సేల్స్ నేర్పుతుంది.ఇదే ఉద్దేశంతో రాబర్ట్ కియోసాకి మెరైన్ కార్ప్స్ విడిచిపెట్టిన తర్వాత కేవలం సేల్స్ నేర్చుకోవడం కోసమే ‘జిరాక్స్’ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కెరీర్ బిల్డ్ చేయడం ఆయన ఉద్దేశం కాదు. ఒక పారిశ్రామికవేత్తకు కావలసిన అసలైన సేల్స్ నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడమే ఆయన లక్ష్యం.రియల్ ఎస్టేట్రియల్ ఎస్టేట్ అనేది కేవలం భూములు, భవనాల కొనుగోలు మాత్రమే కాదు. అది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సూత్రాలైన అప్పు, పన్నుల గురించి నేర్పుతుంది.లెవరేజ్: రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుడానికి మీ సొంత డబ్బు అక్కర్లేదు. ఇతరుల లేదా బ్యాంకుల డబ్బును ఎలా ఉపయోగించవచ్చో ఇది నేర్పుతుంది.క్యాష్ ఫ్లో: క్రమబద్ధమైన ఆదాయ వనరును ఎలా సృష్టించాలో చూపిస్తుంది.టాక్స్-ఫ్రీ వెల్త్: పన్ను నిబంధనలను చట్టబద్ధంగా ఉపయోగించుకుంటూ అతి తక్కువ పన్నుతో సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో రియల్ ఎస్టేట్ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.నేటి ఆధునిక కాలంలో కేవలం అకడమిక్ డిగ్రీలు మాత్రమే జీవితంలో స్థిరపడటానికి సరిపోవు అనేది జగమెరిగిన సత్యం. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మనల్ని కేవలం ఒక ఉద్యోగిగా మారడానికే శిక్షణ ఇస్తాయి. కానీ, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి. రాబర్ట్ కియోసాకి చెప్పినట్లు సేల్స్, రియల్ ఎస్టేట్ రంగాలపై అవగాహన పెంచుకోవడం అంటే వ్యాపారం చేయడం మాత్రమే కాదు. సంపదను సృష్టించే మైండ్ సెట్ను అలవర్చుకోవడం. డిగ్రీల వేటలో పడేముందు.. ప్రతి ఒక్కరూ ఈ ప్రాథమిక ఆర్థిక నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!
ఫ్యామిలీ
పప్పు కూర
చెన్నైకి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ప్రతి శనివారం తిరుమలకి వచ్చి వెళ్ళడం అలవాటు. ఉదయమే చెన్నై నుంచి కారులో బయలుదేరి కొండకు చేరేవాడు. కొండ దిగేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగేవాడు కాడు. కుదిరితే స్వామివారి దర్శనం చేసుకునే వాడు. కుదరకపోతే ప్రశాంతంగా గుడి ముందర కూర్చునేవాడు. పుష్కరిణి దగ్గరకు వెళ్ళి తలమీద నీళ్ళు చల్లుకునే వాడు. వరాహస్వామి దర్శనం చేసుకునే వాడు. ఆపైన బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిలబడి ఆలయ గోపురానికి నమస్కరించే వాడు. కర్పూర హారతి ఇచ్చి కొండ దిగేసే వాడు. తిరుపతిలో అతడికి పిల్లనిచ్చిన అత్తగారు ఉన్నారు. కొండ దిగిన ప్రతిసారీ అత్తగారి ఇంటికి వెళ్లి ఆమె బాగోగులు తెలుసుకునేవాడు. అల్లుడు వచ్చిన ప్రతిసారీ ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టులోని కొన ఆకు కోసి తను చేసిన వేడి వేడి వంటలు వడ్డించేది. పచ్చటి అరిటాకులో పప్పుకూర వడ్డించేది. ఘుమఘుమలాడే నెయ్యి కూడా వేసేది. వెళ్ళిన ప్రతిసారీ ఆమె పప్పుకూరే చేసేది. ఎందుకంటే ఆమె పప్పు కూర మాత్రమే బాగా చేయగలదు. ఎంతో రుచిగా ఉన్నప్పటికీ వారం వారం పప్పుకూర తినలేక అల్లుడికి విసుగు వచ్చింది. ఒకరోజు ఏడుపు ముఖం పెట్టి ‘‘అత్తా, ఎప్పుడూ పప్పు కూరేనా? తినాలంటే మొహం మొత్తుతోంది’’ అన్నాడు. ఆమె నవ్వింది.‘‘అల్లుడూ... పప్పుకూర సరే, పదేళ్ళుగా తిరుమల వచ్చి వెళ్తున్నావు. గుడిలోని స్వామి అప్పుడూ, ఇప్పుడూ ఒక్కరే కదా... ఏ మాత్రం మార్పు లేదు కదా, నీకెప్పుడూ స్వామిని ‘చూసింది చాల్లే’ అనిపించలేదా?’’ అని అడిగింది.అతడు నవ్వాడు.‘‘స్వామిని చూడటం ‘చాలు’ అనిపించదత్తా. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. కొండకి వచ్చిన ప్రతిసారీ దర్శనం చేసుకుని బంగారు వాకిలి దాటి వచ్చేలోగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏమిటో ఈ మాయ’’ అంటూ చేయి కడిగాడు. అత్త తాను చేసిన పప్పు కూర కొద్దిగా గిన్నెలో పెట్టి కూతురికిమ్మనిచెప్పింది. అలాగేనని తల ఊపి ‘రాకుండా ఉండలేను నీ కొండకు... చూడకుండా ఉండలేను ఏ నాటికీ’ అని పాడుకుంటూ చెన్నైకి బయలుదేరాడు. ఆ రోజునుంచి అత్త ముందు పప్పు కూర మాట ఎత్తలేదు అల్లుడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
అమాయకత్వంలో ఆధ్యాత్మికత
పసిప్రాయం ఒక తెల్ల కాగితం లాంటిది. వారు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ, అనుకరిస్తూ ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. వారి చిన్ని చిన్ని ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అయితే పిల్లల నుంచి పెద్దలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పసిపిల్లలకు ‘నేను, నాది’ అనే అహంకారం ఉండదు. వారు తమను తాము ప్రత్యేకంగా చూసుకోరు. ప్రకృతిలో, అందరిలో కలిసిపోతారు. ఈ నిర్మలత్వమే వారిని దైవస్వరూపులుగా చేస్తుంది.గత జ్ఞాపకాల్లో లేదా భవిష్యత్తు ఆందోళనల్లో కాకుండా, ప్రస్తుత క్షణంలో ఉండటం పసిపిల్లల లక్షణం. వారు గడిచిన నిమిషం గురించి బాధపడరు, రేపటి గురించి భయం చెందరు. ఈ ‘స్థితప్రజ్ఞత’ వారికి దైవికమైన ఆనందాన్ని ఇస్తుంది. కోపాన్ని మనసులో పెట్టుకోకుండా ఉండటం. రేపటి చింత లేకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించడం. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం పిల్లల మనస్తత్వం. ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మలక్షణం ’సత్–చిత్–ఆనందం’. పిల్లల ప్రతి చర్యలోనూ ఒక చైతన్యం, ఒక సహజ సిద్ధమైన ఆనందం కనిపిస్తుంది. వారిని చూసినప్పుడు మనసు ప్రశాంతంగా మారడానికి కారణం వారిలో ప్రతిబింబించే ఆ పరమాత్మ తత్వమే. పిల్లల ప్రేమలో ఎటువంటి ఆశలు, నిబంధనలు ఉండవు. వారు కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు. భగవంతుడు కూడా అటువంటి నిష్కల్మషమైన ప్రేమకే లొంగుతాడని మన పురాణాలు చెబుతున్నాయి. మనం మనలోని బాల్యాన్ని మర్చిపోవడం వల్లే ఒత్తిడికి, అసూయకు లోనవుతున్నాం. ఆధ్యాత్మిక సాధన అంటే కొత్తగా ఏదో సంపాదించడం కాదు, మళ్ళీ పసిపిల్లవాడిలా నిర్మలమైన మనసును పొందడమేనని పెద్దలు చెబుతుంటారు. మనలోని ఆ ‘బాల్యాన్ని’ మేల్కొల్పడమే నిజమైన ఆత్మసాక్షాత్కారం. అందుకే ఆధ్యాత్మికవేత్తలు‘ మళ్ళీ ఒక బిడ్డలా మారిపొమ్మని చెబుతుంటారు.మనిషి ఎదుగుతున్న కొద్దీ అనుభవాలు, పంతాలు, పట్టింపులు, సమాజం నేర్పిన ముసుగులు ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి. ఆత్మసాక్షాత్కారం అంటే ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడం కాదు, మనపై పేరుకున్న ఈ కృత్రిమ పొరలను తొలగించుకుని, మన లోపల అంతర్లీనంగా ఉన్న ఆ పసిబిడ్డ వంటి స్వచ్ఛతను తిరిగి దర్శించడమే.పిల్లలు దేవుడిచ్చిన వరాలు. పిల్లల కళ్ళలో కనిపించే మెరుపు కోటి వెలుగులతో సమానం. వారికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. ఒక చిన్న రంగుల బంతి లేదా వాన చినుకు వారిని పరవశానికి గురిచేస్తుంది. వారి ప్రపంచంలో ప్రతి వస్తువు ఒక వింతే, ప్రతిరోజూ ఒక పండుగే. ఒక ఖాళీ అట్టపెట్టె వారికి విమానం కావచ్చు, ఒక చిన్న కర్ర గుర్రం కావచ్చు. పిల్లలు తమ ఊహలతో ఒక మాయా లోకాన్ని సృష్టించుకుంటారు. అక్కడ బొమ్మలు మాట్లాడతాయి, చెట్లు కథలు చెబుతాయి. పిల్లలకు కులమతాలు, పేద– ధనిక భేదాలు తెలియవు. తోటిచిన్నారి నవ్వితే వీరు నవ్వుతారు, ఏడిస్తే పలకరిస్తారు. క్షణంలో గొడవపడినా, మరుక్షణమే మర్చిపోయి మళ్ళీ ఆడుకునే గుణం కేవలం వారి పసిడి మనసులకే సొంతం. వారి పసిడి ప్రపంచాన్ని ప్రేమతో, భద్రతతో కాపాడుకోవడం మన అందరి బాధ్యత. వారి చిరునవ్వు ఇంట్లో ఉంటే, ఆ ఇల్లే ఒక నందనవనం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి
చెడు స్నేహానికి ప్రతీక శకుని
మహాభారతయుద్ధంలో శకుని పాత్ర గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దుష్టచతుష్టయంలో ఒకరుగా పేరుగాంచి, కౌరవులకు మేనమామగా, వారిలో యువరాజైన దుర్యోధనునికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించి అన్నీ తప్పుడు సలహాలు, సూచనలిచ్చి కౌరవులకు కీడు తలపెట్టడంతో, పాండవులకు మేలు జరిగేది. శకుని ఉద్దేశ్యం కూడా ఇదే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాంధహార్ ఆనాటి గాంధార దేశం. గాంధారదేశపు రాజు సుబలుడు, రాణి సుధర్మల కుమారుడే శకుని. సుబలునికి వందమంది కుమారులు, గాంధారి అనే కుమార్తె ఉన్నారు. అందరిలో ఆఖరివాడే శకుని. ఇతని అసలు పేరు సుబలోత్తముడు. అపారమైన తెలివితేటలు కల్గిన, శకుని ‘చౌసర్’ అనే మాయా జూదపు ఆటలో మంచి నేర్పరి. శకుని ప్రాణప్రదంగా అభిమానించే తన సోదరి గాంధారిని, కౌరవ సామ్రాజ్యాధీశుడు, పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడికి పట్టమహిషిగా చేయాలని భీష్ముడు భావించాడు. అయితే జాతకం ప్రకారం గాంధారికి వైధవ్య యోగం ఉందని తెలిసిన శకుని తన సోదరి అంటే ఉన్న వల్లమాలిన అభిమానంతో, ఈ విపత్తు నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంతో, జ్యోతిష్యుల సూచనలు, సలహాల మేరకు గాంధారికి మొదటగా ఓ మేకతో వివాహం జరిపించి, అనంతరం ఆ మేకను బలిచ్చి ఆపై ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తే ఆ దోష పరిహారం అవుతుందని ఆ విధంగా చేశాడు. వివాహానంతరం ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఆగ్రహం చెంది సుబలుని కుటుంబాన్ని చెరశాలలో బంధించి, మరణించే వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశించాడు. చెరసాలలో ఉన్న సుబలుని కుటుంబానికి ఇచ్చే ఆహారం ఒక్కరికి మాత్రమే సరిపోయేది. మిగిలిన సోదరులు ఆహారాన్ని తమలో తెలివైన, ఆఖరి సోదరుడైన శకునికే పెట్టి ఎలాగైనా కౌరవులపై పగ తీర్చుకోవాలని ప్రమాణం చేయించుకున్నారు. అనంతరం క్షుద్బాధతో తండ్రి, ఒక్కొక్క సోదరుడు మృతి చెందారు. తన తండ్రి మరణానంతరం అతని తొడ ఎముకతో తయారైన పాచికలను వినియోగిస్తూ, తాను అనుకున్న సంఖ్య పడేలా శకుని వరం పొందాడు. ఆ పాచికలతో శకుని మాయాజూదం ఆడి మోసపూరితంగా పాండవులను ఓడించి, కౌరవులచే మరిన్ని అన్యాయాలు, అక్రమాలు చేయిస్తూ మహాభారత యుద్ధం జరిగేలా పథకం రచించి కౌరవవంశాన్ని నాశనం చేసాడు. అయితే మహాభారత యుద్ధంలో ఆఖరిరోజున (18వ రోజు)సహదేవుని చేతిలో శకుని మరణించాడు. ఇదిలావుండగా శకునికి కూడా గుడి ఉంది. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం వద్ద శకునికి ఆలయం నిర్మించారు అక్కడి కురువర్ తెగ ప్రజలు. అయితే అక్కడ ఏ విధమైన శకుని విగ్రహం ఉండదు.– సి.ఎన్. మూర్తిసీనియర్ పాత్రికేయులు
హ్యాట్సాఫ్ సార్..! భలే గుణపాఠం చెప్పారు..
రోడ్ల మీద ప్రయాణికులు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలిసిందే. కనీసం బస్తాప్ వద్ద కూడా రయ్ రయ్ అంటూ వెళ్లిపోవడమే. ప్రయాణికులు బస్సలు ఎక్కనివ్వరు, కనీసం ఫుట్పాత్పై నిలబడనివ్వరు. అలాంటి టూ వీలర్ ప్రయాణికులకు ఇక్కడొక పోలీసు అధికారి భలే గుణపాఠం చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ అధికారిపై ప్రశంసల జల్లు వెల్లువెత్తింది. ఆ వీడియోలో పోలీసు అధికారి రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తుండగా..ట్రాఫిక్ జామ్ను దాటాలనే ఉద్దేశ్యంతో ప్రయాణికులు ఎలా మాములు ఫుట్పాత్పై వాహానాలు నడుపుతున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన ఈ పోలీసు అధికారి వెంటనే కొద్ది దూరం ప్రయాణించి ఫుట్పాత్పై బైక్తో సహా అడ్డంగా నిలబడతాడు. దీంతో రాంగ్రూట్లో వస్తున్న ఆ టూవీలర్ ప్రయాణికులు కాస్తా వెనుదిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది. దాంతో నెటిజన్లు ఏం ధైర్యం సార్ అంటూ ఆ పోలీసు అధికారిని అభినందించగా, మరికొందరు హ్యాట్సాప్ సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by COP NAVEEN (@cop_naveensingh) (చదవండి: భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!)
అంతర్జాతీయం
చాగోస్ దీవులపై ట్రంప్ కన్ను.. యూకేకు బిగ్ షాక్?
వాషింగ్టన్: హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన చాగోస్ దీవులను కొనుగోలు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలంరేపుతున్నాయి. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన తరహాలోనే, ఇప్పుడు బ్రిటన్ను పూర్తిగా పక్కనపెట్టి, చాగోస్ దీవులపై సార్వభౌమాధికారం ఉన్న మారిషస్తో అమెరికా నేరుగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఒక ప్రత్యేక ప్రతిపాదనను ట్రంప్ ముందుకు తెచ్చినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘టెలిగ్రాఫ్’ వెల్లడించింది.ట్రంప్ వ్యూహం.. బ్రిటన్తో సంబంధంలేకుండా..అమెరికా రూపొందించిన ఈ సరికొత్త ప్రతిపాదన ప్రకారం.. బ్రిటన్తో సంబంధం లేకుండా చాగోస్ దీవులను నేరుగా మారిషస్ నుండి కొనుగోలు చేయాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అయితే దీనికంటే ముందు ఆ దీవులకు పూర్తి సార్వభౌమాధికారం లభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పలు ఆప్షన్లలో ఇది ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, అమెరికా అధికారుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు మిత్రదేశంగా ఉన్న మారిషస్కు ఈ భూభాగాన్ని పూర్తిగా అప్పగిస్తే, అక్కడ గూఢచర్య ముప్పు పెరిగే అవకాశం ఉందని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డియెగో గార్సియా స్థావరం.. ఇరాన్ ముప్పుమధ్య హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ చాగోస్ దీవులలోని ‘డియెగో గార్సియా’ సైనిక స్థావరం అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. ప్రస్తుతం ఇరాన్తో నడుస్తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ నుండి సుమారు 3,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బేస్ నుండి అమెరికా లాంగ్-రేంజ్ మిసైళ్లను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత మార్చిలో ఈ సంయుక్త సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రయత్నించగా, అమెరికా యుద్ధనౌక దాన్ని తిప్పికొట్టింది. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడులు చేసేందుకు యూకే ఆలస్యంగా అనుమతి ఇవ్వడంపై ట్రంప్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు.యూకే హ్యాండ్ఓవర్ సస్పెన్స్.. శరణార్థుల ఆవేదనఈ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్కు బదిలీ చేసే ప్రక్రియకు అమెరికా మద్దతు ఉపసంహరించుకోవడంతో, గత ఏప్రిల్లోనే దీనికి సంబంధించిన చట్టం నిలిచిపోయింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ.. డియెగో గార్సియాపై నియంత్రణకు ముప్పు పొంచి ఉన్నందున, జాతీయ ప్రయోజనాల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా మద్దతు లేకుండా బ్రిటన్ ఎలాంటి సార్వభౌమత్వ ఒప్పందానికి ముందుకు వెళ్లబోదని స్పష్టం చేశారు. మరోవైపు తమ జన్మభూమి భవిష్యత్తును బ్రిటన్ రాజకీయాలు హైజాక్ చేశాయని, స్వదేశానికి తిరిగి వెళ్లే హక్కు తమకు ఉందని చాగోస్ శరణార్థుల బృందం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అమెరికాలో కలకలం.. రద్దీ రైల్వే స్టేషన్లో రక్తపాతం
న్యూయార్క్: అమెరికాలోనే అత్యంత రద్దీగా ఉండే రవాణా కేంద్రాలలో ఒకటైన న్యూయార్క్ లోని పెన్ స్టేషన్ రక్తపాతానికి వేదికైంది. స్టేషన లోపల ఒక దుండగుడు విచక్షణారహితంగా కత్తులతో దాడికి తెగబడటంతో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. ఆ సమయంలో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఆమ్ట్రాక్ పోలీస్ డిపార్ట్మెంట్ నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు జరగనున్న తరుణంలో ఈ దాడి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.రక్తసిక్తంగా మారిన రైల్వే స్టేషన్పెన్ స్టేషన్లోని ట్రాక్ 5, 6 సమీపంలో ఈ ఘోర దాడి జరిగింది. ఘటన జరిగిన ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. న్యూయార్క్ ఫైర్ డిపార్ట్మెంట్, నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తే..ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడి వివరాలను, దాడికి గల కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే నిందితుడు మానసిక వికలాంగుడైన ఒక నిరాశ్రయుడని భావిస్తున్నట్లు న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ మార్క్ లెవిన్ తెలిపారు. ఈ దాడిని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ తీవ్రంగా ఖండించారు. ఇదొక ‘భయంకరమైన హింసాత్మక చర్య’ అని అభివర్ణించిన ఆమె, ప్రజల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పోలీసులు ఈ దాడి వెనుక గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.ప్రతిష్టాత్మక టోర్నీల వేళ భద్రత కట్టుదిట్టంమరో కొన్ని రోజుల్లో న్యూయార్క్ నగరం రెండు ప్రధాన క్రీడా ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వబోతున్న తరుణంలో ఈ ఘటన జరగడం భద్రతా సంస్థలను ఆందోళనలో పడేసింది. మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఎన్బీఏ ఫైనల్స్ (గేమ్స్ 3, 4), అలాగే పొరుగున ఉన్న న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం నగరం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యవసర చర్యల దృష్ట్యా పెన్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఇదికూడా చదవండి: ‘దీదీ’కి మరో షాక్: ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా
ఆమె ప్రశ్నిస్తే ట్రంప్కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!
ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఎదురుగా డొనాల్డ్ ట్రంప్లాంటి నేతల ముందు అడుగు వేయడం అంటేనే చాలా మంది జర్నలిస్టులు జాగ్రత్తపడే పరిస్థితి. కానీ ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా ధైర్యంగా కఠిన ప్రశ్నలు వేసిన ఒక జర్నలిస్ట్.. ఇప్పుడు హాట్టాపిక్గా మారారు. ఇక చాలూ అనుకుంటూ ఆయన్ని ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేయించిన.. “ఆమె ఎవరబ్బా?” అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.. ఆమె పేరు.. క్రిస్టెన్ వెల్కర్. ఎన్బీసీ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానంగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఆధారాలు చూపాలంటూ ఆయన్ని పదే పదే ప్రశ్నించారు. అయితే ఆయన మాత్రం ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే అంశాన్ని ఆమె మళ్లీ మళ్లీ ప్రస్తావించడంతో ఇంటర్వ్యూ వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. సారీ డార్లింగ్ అంటూనే.. తీవ్రంగా విమర్శిస్తూ ట్రంప్ విసుగ్గా కోటుకు ఉన్న లాపెల్ మైక్, వైర్లెస్ ట్రాన్స్మిటర్తో పాటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత అమెరికా మీడియా ప్రపంచంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఒక్కసారిగా దృష్టి మొత్తం క్రిస్టెన్ వెల్కర్ వైపుకే మళ్లింది.WOW -- Trump crashes out and cuts his interview with Welker short as she presses him on his lack of evidence for claiming elections are rigged"You're either crooked or you're stupid. Let's call it quits. Because I've had enough. Thank you darling," he tells her.""I traveled… pic.twitter.com/qQaNIDnX4y— Aaron Rupar (@atrupar) June 7, 2026క్రిస్టెన్ వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వార్తా రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్రను అభ్యసించారు. అనంతరం జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని స్థానిక టెలివిజన్ ఛానళ్లలో రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించారు. రిపోర్టింగ్లో చూపిన ప్రతిభతో 2010లో ఆమె ఎన్బీసీ న్యూస్లో చేరారు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం వేగంగా ముందుకు సాగింది. వైట్హౌస్ కరస్పాండెంట్గా నియమితులైన ఆమె, అమెరికా అధ్యక్షుల విదేశీ పర్యటనలు, ఎన్నికలు, జాతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలను కవర్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే.. క్రిస్టెన్ వెల్కర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి పెద్దగా వినిపించింది 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో. అప్పటి ట్రంప్–బైడెన్ మధ్య జరిగిన చివరి ప్రత్యక్ష చర్చకు ఆమె సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇద్దరు అభ్యర్థులను సమతుల్యంగా ప్రశ్నిస్తూ, చర్చను నియంత్రించిన తీరు ఆమెకు విస్తృత ప్రశంసలు తెచ్చిపెట్టింది. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ చర్చా కార్యక్రమాల్లో ఒకటైన “మీట్ ద ప్రెస్”కు 2023లో ఆమె హోస్ట్గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా హోస్ట్గా, రెండో మహిళా యాంకర్గా నిలిచి విశేష గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్ను ఆమె ఇంతకు ముందు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. ట్రంప్ మాత్రమే కాదు.. గతంలో బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, జో బైడన్.. ఇంకా పలువురు టాప్ డెమోక్రటిక్, రిపబ్లికన్ లీడర్లను ఆమె తనదైన శైలి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఆమె ప్రశ్నించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా వెనక్కి తగ్గకుండా ప్రశ్నలు వేయడం, సమాధానాల్లోని అస్పష్టతను వెంటనే గుర్తించి తిరిగి ప్రశ్నించడం ఆమె జర్నలిజం శైలి. స్పష్టమైన సమాధానం వచ్చే వరకు వెనక్కి తగ్గకపోవడం వల్లే ఆమెను అమెరికా రాజకీయ జర్నలిజంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా భావిస్తారు. తాజా ఘటనతో మరోసారి ఆమె పేరు.. తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది.
‘నువ్వు నమ్మక ద్రోహివి.. నీకసలు తెలివే లేదు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీవీ ఇంటర్వ్యూలో సహనం కోల్పోయారు. సదరు టీవీ ఛానెల్ యాంకర్పై నోరు పారేశుకున్నారు. ‘నువ్వు చేసేది మోసమైనా ఉండాలి. లేదంటే తెలివి తక్కువైనా ఉండాలి అంటూ కాలర్ మైక్ను పడేసి బయటకు వెళ్లిపోయారు.ఆదివారం ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ఎన్బీసీ తన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్, యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ల మధ్య చిన్న సైజు మినీ యుద్ధమే జరిగింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కాలిఫోర్నియాలో జోబైడెన్ సుమారు 63శాతం ఓట్లు సాధించారు. డొనాల్డ్ ట్రంప్ 34శాతం ఓట్లు మాత్రమే పొందారు. ఈ ఎన్నికల ఫలితాల సరళిని ఎన్బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ మళ్లీ ప్రస్తావించారు. ఆయన కాలిఫోర్నియాలో రిగ్గింగ్ కారణంగా ఓట్ల లెక్కింపు ఆలసమైందని ఆరోపించారు. దీనికి యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ స్పందిస్తూ.. ‘కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఆలస్యానికి కారణం రిగ్గింగ్ కాదు. పోలైన ఓట్ల శాతం ఎక్కువ. వాటిని లెక్కించడానికి మరింత సమయం పట్టింది’ అని చెప్పారు. ఈ వివరణతో ట్రంప్ చిర్రెత్తుకొచ్చి ‘కౌంటింగ్లో చీటింగ్ జరిగింది’ అని మరోసారి ఆరోపించారు. వెల్కర్ ఆయనను నిలదీస్తూ.. మీ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ట్రంప్ ‘నేనే చూశాను.. అదే ఆధారం’ అని సమాధానమిచ్చారు. కానీ ఎన్బీసీ యాంకర్ ఎన్నికల్లో అవకతవకలకు ఎలాంటి ఆధారాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.తర్వాత సంభాషణ మీడియాపై విమర్శలకు దారి తీసింది. ట్రంప్ కాలిఫోర్నియా ఎన్నికల అధికారులను, మీడియా ప్రతినిధులను, మీడియా సంస్థలను ‘మోసగాళ్లు’గా అభివర్ణించారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని కూడా ‘మోసపూరితం’ అని అన్నారు. ట్రంప్ అమెరికా ఎన్నికల నిర్వహణను ‘అభివృద్ధి చెందని దేశం’ తరహాలో ఉందని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా వెల్కర్ ‘నేను మోసపూరితమైనది కాదు’ అని బదులిచ్చారు. దానికి ట్రంప్ ‘నువ్వు మోసపూరితమైనదానివైనా అయి ఉండాలి.. లేదంటే తెలివితక్కువదానివైనా అయి ఉండాలి అని అన్నారు. కాలిఫోర్నియా ఎన్నికలపై జరిగిన చర్చ చివరికి రసాభాసగా ముగింది. JUST NOW: President Trump walked out of the interview with Kristen Welker. President Trump had enough!!Refusing to tolerate the biased framing, President Trump completely turned the tables on the Welker."Your elections are crooked, and you're crooked."pic.twitter.com/cxXTcYM6Fk— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) June 7, 2026
జాతీయం
రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా: సుఖేందు
టీఎంసీ పార్టీకి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రే పెద్ద షాక్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. మమత హయాంలో అవినీతి చోటుచేసుకుందని, అన్ని వర్గాలకూ పార్టీ దూరమైందని ఆయన ఆరోపించారు. ఆర్జీ కర్ బోధనాస్పత్రిలో వైద్యురాలి హత్యోదంతంలో టీఎంసీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని శేఖర్ రే ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తే పార్టీలో తనను ఒంటరిని చేశారని విమర్శించారు. అప్పట్లో నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని శేఖర్ రే చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ను కలిసి రాజీనామా లేఖ సమర్పించానని తెలిపారు. ఇకపై రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. రాజ్యసభలో టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉండగా, ఆయన రాజీనామాతో ఈ సంఖ్య 12కి పడిపోయింది. రాజ్యాంగ నిపుణుడైన సుఖేందు శేఖర్ రే చాలా ఏళ్లుగా పార్లమెంట్లో టీఎంసీ ప్రధాన వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుగాంచారు. శాసన, రాజ్యాంగపరమైన అంశాలపై గొంతు వినిపించారు. ఆయన రాజీనామాపై టీఎంసీ నాయకత్వం ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా, పలువురు అసమ్మతి ఎంపీలు సుఖేందు శేఖర్ రేతో సమావేశం కావడం గమనార్హం. అనంతరం వీరంతా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా మమతా బెనర్జీ, అభిõÙక్ బెనర్జీ ఢిల్లీలో అసమ్మతి ఎంపీలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొందరు ఎంపీలు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సోమవారం బీజేపీ నేతలను కలిసి ఎంపీల్లో సుఖేందు సైతం ఉన్నారు.
మమత పార్టీలో మంటలు
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటికే పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీ చీఫ్ మమతా బెనర్జీపై ధిక్కార స్వరం విన్పించగా సోమవారం ఏకంగా 20 మంది ఎంపీలు సైతం పార్లమెంట్ వేదికగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీ కోసం మమత ఢిల్లీలో ఉండగానే టీఎంసీ అసమ్మతి ఎంపీలు ఈ తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీని మరింత సంక్షోభ సుడిగుండంలోకి నెట్టేశారు. ఎన్డీయేకు తమ మద్దతు ప్రకటిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు సోమవారం లేఖ రాశారు. పార్టీ చీఫ్ విప్ కకోలీ ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో తిరుగుబాటు ఎంపీలు ఏకమయ్యారు. ‘‘నాతో కలిపి 20 మంది పార్టీ ఎంపీలు బెంగాల్ అభివృద్ధి కోసం ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాని్న తెలుపుతూ స్పీకర్ బిర్లాకు ఇప్పటికే లేఖ రాశాం. మమ్మల్ని చీలికవర్గంగా గుర్తించాలని పేర్కొంటూ లోక్సభలో మాకు విడిగా సీటింగ్ కేటాయించాలని లేఖలో విన్నవించుకున్నాం’’ అని నాయకురాలు కకోలీ దస్తీదార్ తెలిపారు. అయితే చీఫ్ విప్ పదవి నుంచి కకోలీని గతంలోనే తప్పించామని, పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీని ఆ పదవిలో నియమించామని పేర్కొంటూ మే 20న స్పీకర్కు మమత రాసిన లేఖను టీఎంసీ పార్టీ సోమవారం బయటపెట్టింది. కకోలీ ప్రస్తుతం పార్టీలో ఏ పదవిలోనూ లేరు అని టీఎంసీ స్పష్టం చేసింది. ఇక ఎన్డీయేతో ప్రయాణం: దస్తీదార్ లోక్సభలో టీఎంసీ చీఫ్ విప్గా తమ నాయకురాలు కకోలీ ఘోష్ దస్తీదార్ను కొనసాగించాలని రెబల్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కోరబోతున్నట్లు తెలిసింది. మేము ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం. మా భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎన్డీయేతో సాగాలని భావిస్తున్నామని తిరుగుబాటు ఎంపీలు తెలిపారు. లోక్సభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి, బీజేపీలో చేరాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని ఎంపీలు స్పష్టంచేశారు. లోక్సభలో ఎన్డీయేకు మద్దతిస్తూ ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా కొనసాగుతామని చెప్పారు. లోక్సభలో టీఎంసీకి ప్రస్తుతం 28 మంది ఎంపీలు ఉన్నారు. మూడింట రెండొంతుల మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు పడే అవకాశం లేదని తెలుస్తోంది. అసమ్మతి ఎంపీలు ఢిల్లీలో పార్టీ నాయకురాలు శతాబ్దిరాయ్ నివాసంలో బెంగాల్ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమయ్యారు. బీజేపీ నేతలతో 12 మంది టీఎంసీ ఎంపీలు సమావేశమయ్యారని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ వెల్లడించారు. టీఎంసీ ఎంపీలు కకోలీ ఘోష్, శతాబ్ది రాయ్, అబూ తాహిర్ ఖాన్, అరూప్ చక్రవర్తి, ఖలీలుర్ రహమాన్, షర్మిల సర్కార్, రచనా బెనర్జీ, అసిత్ మల్, జగదీశ్ చంద్ర వర్మ బాసునీయ, కాలిపద సోరెన్, ప్రసూన్ బెనర్జీ, పార్థ బౌమిక్లు బీజేపీ నేతలతో భేటీ అయినట్లు కథనాలొచ్చాయి. రితబ్రత బెనర్జీతో ఫిర్హాద్ హకీం భేటీ మమతా బెనర్జీకి సన్నిహితుడైన టీఎంసీ సీనియర్ నాయకుడు, కోల్కతా మాజీ మేయర్ ఫిర్హాద్ హకీం సోమవారం బెంగాల్ అసెంబ్లీ ప్రాంగణంలో తిరుగుబాటు ఎమ్మెల్యేల నేత రితబ్రత బెనర్జీతో ఆయన చాంబర్లో సమావేశమయ్యారు. మరో తిరుగుబాటు ఎమ్మెల్యే సాందీపన్ సాహా సైతం హకీం వెంట వచ్చారు. ఇటీవలే మేయర్ పదవికి రాజీనామా చేసిన హకీం.. తిరుగుబాటు వర్గంతో సమావేశంకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన మమత తరఫున మధ్యవర్తిత్వం కోసం వచ్చారా? అనేది తెలియాల్సి ఉంది. కలకత్తా హైకోర్టులో టీఎంసీ పిటిషన్ తిరుగుబాటు వర్గం నాయకుడు రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని టీఎంసీ వ్యతిరేకించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సోమవారం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని, అందుకే ఈ పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని టీఎంసీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. 11న ఈ పిటిషన్ను విచారిస్తామని జస్టిస్ కృష్ణారావు తెలిపారు.
ఆడుకుంటూనే మృత్యు ఒడికి..
రాజ్కోట్: గుజరాత్లోని రాజ్కోట్లో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలిక ఆనంది మోదీ పిల్లలతో కలిసి ఆడుకుంటూ కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటు కారణంగా ఆమె మరణించినట్లు చెబుతున్నారు. జామ్నగర్కు చెందిన ఆనంది సెలవుల సందర్భంగా రాజ్కోట్లో బంధువుల ఇంటికి వచి్చంది. ఆదివారం సాయంత్రం భోజనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్కు వెళ్లింది. అక్కడ భోజనం తర్వాత రెస్టారెంట్ ప్రాంగణంలోనే పిల్లలతో కలిసి ఆడుకోవడం ప్రారంభించింది. పరుగు పందెం ప్రారంభించారు. ఇంతలోనే ఆనంది ఒక్కసారి కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. 2024 డిసెంబర్లో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఇలాంటి సంఘటనే జరిగింది. 14 ఏళ్ల బాలుడు మోహిత్ చౌదరి పాఠశాలలో పరుగు పందెంలో పాల్గొంటూ గుండెపోటుతో మృతి చెందాడు.
కేంద్రంపై సమరమే
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’కూటమి సమరశంఖం పూరించింది. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను గట్టిగా తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం సాగించాలని నిర్ణయించింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో సాగుతున్న ఓట్ల లూటీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.ఇండియా కూటమి సమావేశం రెండేళ్ల విరామం తర్వాత సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్విని యోగం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలపై భవిష్యత్ పోరాట కార్యాచరణపై రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. విపక్షాల ఐక్యతను చాటుతూ ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్లో జరుగనుంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమా వేశాల్లో సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు. ఐక్యతను బలోపేతం చేసుకోవాలి మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు కూటమి ఐక్యతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. దేశంలో రాజ్యాంగంపై దాడి కొనసాగు తోందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి పాల కులు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ధ్వజమె త్తారు. కూటమి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యా సం చేశారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, కొత్త పెట్టుబడులు రావడం లేదని, నూతన ఉద్యోగాల కల్పన జరగడం లేదని చెప్పారు.పరీక్షల వ్యవస్థలో అక్రమాలు లక్షలాది మంది యువత ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2026 ఏప్రిల్ 17న డీలిమిటేషన్పై మోడీ ప్రభుత్వ బిల్లులను ఓడించడానికి లోక్సభలో ప్రతిపక్షాలు గొప్ప ఐక్యతను ప్రదర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ పేరిట కోట్లాది మంది పౌరుల నుంచి ఓటు హక్కును లాగేసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.విదేశాంగ విధానంలో ప్రభుత్వం రాజీ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, కొత్త పెట్టుబడులు రాకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించిందని కూటమి నేతలు పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పరీక్షల వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని కూటమి పక్షాలు పట్టుబట్టాయి. దశాబ్దాలుగా దేశం పటిష్టంగా పాటిస్తున్న సంప్రదాయ విలువల నుంచి మోదీ సర్కార్ పక్కకు జరిగిందని, విదేశాంగ విధానంలో పూర్తిగా రాజీ పడిందని విపక్షాలు ఆక్షేపించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు ఆగడం లేదని మండిపడ్డాయి.హాజరైన 23 పార్టీల నేతలు విపక్ష కూటమి భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ అగ్రనేత డి.రాజా, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు హాజరయ్యారు.శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ వర్చువల్గా పాల్గొన్నారు. మొత్తం 23 పార్టీల నాయకులు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. 2024 జూన్ 1న ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఆరో సమావేశం జరిగింది. ఆ తర్వాత సోమవారం అగ్రనేతలంతా ఒకే వేదికపైకి వచ్చారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎన్సీపీ(ఎప్పీ) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ గైర్హాజరు సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా సమావేశమైన విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ కీలక భేటీకి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ హాజరు కాకపోవడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరిగింది. ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామి కాదని డీఎంకే తాజాగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలోనే ఇండియా కూటమికి దూరమైంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.రాహుల్కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో సోమవారం ఉదయం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ గాంధీకి నిలకడ లేదంటూ శరద్ పవార్ అన్నట్లుగా ఆ పోస్టర్లలో ముద్రించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోస్టర్లను చించివేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు.ఐదు అంశాలపై అంగీకారం: ఖర్గే దేశంలో అస్థిర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ప్రజా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. సోమవారం ఇండియా కూటమి భేటీ అనంతరం రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీతోపాటు ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు అంశాలపై తాము అంగీకారానికి వచ్చిననట్లు తెలిపారు. ఎస్ఐఆర్లో అక్రమాలు, ఓట్ల లూటీ, ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తికి లేఖ రాయబోతున్నట్లు చెప్పారు.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కేంద్రం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఇకపై ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తబోతున్నామని, దీనికి కూటమి పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయని ఖర్గే పేర్కొన్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో సమన్వయంతో పనిచేస్తామని, ప్రతిరోజూ ఉదయం విపక్ష నేత చాంబర్లో తమ భేటీ జరుగుతుందని వెల్లడించారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ 2029 లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సోమవారం సూచించారు. బీజేపీ వ్యతి రేక కూటమి ఐక్యంగా ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామని తెలి పారు. ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి రాబోయే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పారు. అవినీతిపరులను, దోపిడీదార్లను అధికారం నుంచి దించేయడమే ప్రజల ఎజెండా అని స్పష్టంచేశారు.
ఎన్ఆర్ఐ
ఆటా సభలకు వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి,తాడేపల్లి: అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు.. 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్కు వివరించారు.
కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై అమెరికా దాడులు చేసింది.
అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ఉత్సవాలు జరిగాయి.ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు.ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. నైటా కార్యవర్గం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.(చదవండి: ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు)
ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..
అబ్దుల్లాపూర్మెట్: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్రెడ్డితోపాటు అనురూప్రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో ఇటీవల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.శనివారం లూసియానాలోని టోరోడో పార్క్లో ఉన్న సెబాన్ రివర్లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం.
క్రైమ్
బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య
విశాఖపట్నం: రామాటాకీస్ వెనుక వైపున గల శ్రీనగర్లో నివాసముంటున్న దంపతులు బలరాం (33), ప్రియాంక (27) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కళింగపటా్ననికి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, బతుకుతెరువు కోసం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వెల్డింగ్ పనులు చేసే బలరాం మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండటంతో ప్రియాంక గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బలరాం బిర్యానీ కావాలని పట్టుబట్టడంతో ప్రియాంక తల్లి బయటకు వెళ్లగా, ఆమె తిరిగి వచ్చేసరికి దంపతులిద్దరూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అయితే బలరామే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రియాంక బలవన్మరణానికి పాల్పడటంతో భయపడి బలరాం ఆత్మహత్యకు ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ ప్రియాంక తల్లి రోదించడం స్థానికులను కలచివేసింది.
మోహన్ నా కూతురు అందంగా లేదు.. వేరే సంతానం కావాలి..!
బెంగళూరు: కన్నకూతురినే పొట్టనబెట్టుకున్న తల్లి ఉదంతం అంతటా చర్చనీయాంశమైంది. బెంగళూరు కాడుగోడిలో ఆరేళ్ల బాలిక వెన్నెల అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లి, ప్రియునిపై అనుమానాలు బలపడ్డాయి. మార్చి 24 తేదీన బాలిక అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తల్లి ప్రియాంక పుట్టిన రోజు వేడుకలను కోలారు వద్ద ఓ కెఫెలో జరుపుకొంది, అక్కడ వెన్నెలా కేక్ తిని కారులో నిద్రపోగా ఉదయానికి చనిపోయిందని తెలిపింది. మోహన్ అనే రియల్టర్తో ప్రియాంక జీవిస్తోంది. భర్త ప్రవీణ్ను వదిలేసిన ప్రియాంక లగ్జరీ లైఫ్ కోసం తపించేది. సంతోషానికి అడ్డు అని.. కొన్ని నెలల కిందట మోహన్ను కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. సంతానం కావాలని అనుకున్నారు. తమ సంతోషాలకు వెన్నెలా అడ్డుగా ఉందని, పైగా బాలిక అంద విహీనంగా ఉందనే కారణంతో బాలిక గొంతు పిసికి చంపారనే అనుమానాలున్నాయి. ప్రియాంక కు హొసకోటే వద్ద ఐదు ఎకరాలు భూమి ఉండగా, అందులో వాటా ఇవ్వాల్సి వస్తుందనేది కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు. మోహన్ను కాడుగోడి పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు. బాలిక చనిపోయిన రోజున ఆమె దుస్తులు మార్చారని సీసీ కెమెరాలలో వెల్లడైంది. కాగా ప్రియాంకను అరెస్టు చేశారా, పరారీలో ఉందా అనేది తెలియడం లేదు.
మామిడిపండ్లు తిన్న అనంతరం అమ్మాయి మృతి
హైదరాబాద్: మామిడిపండ్లు తిని అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక మృతి చెందింది. నారాయణగూడ ఎస్ఐ సాయి సందీప్ తెలిపిన మేరకు.. బీదర్ చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు విఠల్ వాడిలో ఉంటున్నారు. నివారం వారి బంధువు రేణుక నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పండ్లను కొనుగోలు చేసుకుని వీరి ఇంటికి వచ్చింది. ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు ఆదివారం తిన్నారు. అయితే అందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. మూడో కుమార్తె భువనే శ్వరి(17) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
లోన్ యాప్ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా: లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నేరేట్మెట్ పోలీసులు తెలిపిన మేరకు..రేవంత్కుమార్, దేవనందిని (25) దంపతులు నేరేడ్మెట్లో నివాసముంటున్నారు. ఈ నెల 7న రేవంత్కుమార్ బయటకు వెళ్లిన అనంతరం భార్యకు ఫోన్ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా బెడ్ రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఫోన్ను పరిశీలించగా ఓ గుర్తు తెలియని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు గుర్తించారు. తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలింది. ఇదిలా తండ్రి వెంకట్రెడ్డి మాత్రం.. భర్త, అత్తమాల వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు.
వీడియోలు
Shocking Video: పంది మృతదేహంతో ఆడుకుంటున్న పెద్ద పులి..!
శవాలతో బాబు బేరాలు.. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
ఆఫ్గాన్ చిత్తు చిత్తు.. టెస్టుల్లో భారత్ కు అతిపెద్ద విజయం
మానవత్వం చూపి బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి..
ప్లాన్ రెడీ... పవన్ పై చంద్రబాబు బిగ్ స్కెచ్..!
కాంగ్రెస్ కు మిత్రపక్షాల షాక్! NDAకు లాభమేనా?
అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు
న్యాయం చేయండి అంటే.. సమాధానం చెప్పకుండా పారిపోయిన పల్లా..
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై వైఎస్ జగన్ ఎమోషనల్
పురుషుల్లో ఈ నలుగురు పురుషులు చాలా వేరు.. రాజ్యసభ సీటు అడగటానికి వర్ల రామయ్య వెళ్తే..

