Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

CBN your record in dropping crop rates is unbeatable Says YS Jagan1
బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్‌పై తన ఎక్స్‌ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.... క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్‌ చేశారాయన. .@ncbn గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ… pic.twitter.com/swvxxr9hse— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2025

Hyderabad woman request to Indian External Affairs Minister Jaishankar2
''నాకు సాయం చేయండి సార్‌'.. జైశంకర్‌కు హైదరాబాద్‌ యువతి అభ్యర్థన

హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్‌గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్‌ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో ఓ రూమ్‌ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్‌పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్‌ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్‌లోని USA కౌన్సెలేట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్‌లోని USA కౌన్సెలేట్‌కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు తన లేఖలో పేర్కొంది.

Rasi Phalalu: Daily Horoscope On 17-09-2025 In Telugu3
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ఏకాదశి రా.1.17 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పునర్వసు ఉ.9.38 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.5.26 నుండి 7.00 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.19 వరకు, అమృత ఘడియలు: రా.2.46 నుండి 4.18 వరకు, మతత్రయ ఏకాదశి.సూర్యోదయం : 5.51సూర్యాస్తమయం : 6.00రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆనారోగ్య సూచనలు. శ్రమా«ధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం... పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.మిథునం... రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు మధ్యలో వాయిదా. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి. బంధువులతో సత్సంబంధాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.సింహం.... మిత్రులతో విరోధాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దైవదర్శనాలు. పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.కన్య....... కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.తుల... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.వృశ్చికం.... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.ధనుస్సు.. కుటుంబంలో సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.మకరం... కొత్త పనులకు శ్రీకారం. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కుంభం.. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మీనం... పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

Sakshi Editorial On Supreme Cour On Waqf Amendment Act4
ఉన్నంతలో ఉపశమనం

వివాదాస్పద వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన మధ్యంతర ఆదేశాలు అటు పిటిషనర్లకూ, ఇటు కేంద్ర ప్రభుత్వానికీ పాక్షిక ఉపశమనం ఇచ్చాయి. చట్టంపై మొత్తంగా స్టే విధించకపోవటం కేంద్రానికి సంతృప్తి కలిగిస్తే, కొన్ని కీలకనిబంధనల అమలును నిలిపేయటం విపక్షాలకూ, పిటిషనర్లకూ సంతోషాన్నిచ్చింది. అయితే ఈ కేసులో పిటిషనర్‌ అయిన ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ వంటివారు ఈ ఉత్తర్వులపై నిరాశ పడకపోలేదు. పిటిషనర్లలో ఒవైసీతోపాటు ఎంపీలు మహువా మొయిత్రా(టీఎంసీ), మనోజ్‌ కుమార్‌ ఝూ(ఆర్జేడీ), జియావుర్‌ రహమాన్‌(కాంగ్రెస్‌) ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్, సీపీఐ కూడా చట్టాన్ని సవాలు చేశాయి. మొన్న ఏప్రిల్‌లో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టంపై మొత్తం 65 పిటిషన్లు దాఖలయ్యాయంటేనే ఇదెంత వివాదాస్పదమైనదో అర్థమవుతుంది. చట్టం రాజ్యాంగబద్ధమో కాదో ఈ ఉత్తర్వులు తేల్చలేదు. తుది తీర్పు ఆ అంశాన్ని పరిశీలిస్తుంది. వక్ఫ్‌ ఆస్తులు దుర్వినియోగానికి గురవుతున్నాయనీ, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయనీ కేంద్రం భావించింది. వాటిని చక్కదిద్దే ఉద్దేశంతోనే సవరణలు తెచ్చామని చెప్పింది. ముఖ్యంగా రిజిస్టర్‌ కాకపోయినా నిరాటంకంగా వక్ఫ్‌ అధీనంలో ఉంటే ఆ ఆస్తులు దానికే చెందుతాయన్న (వక్ఫ్‌ బై యూజర్‌) భావనను ఈ చట్టం రద్దు చేసింది. ఇకపై వక్ఫ్‌ ఆస్తులకు లిఖిత పూర్వక దస్తావేజు ఉండి తీరాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఈ నిబంధనపై స్టే విధించేందుకు నిరాకరించింది. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నాయని చట్టసభ గుర్తించి, దాన్ని నివారించాలనుకోవటం ఏకపక్ష చర్య ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే వక్ఫ్‌ ఆస్తులకు 1995 నాటి చట్టం ఒక ప్రత్యేక ప్రతిపత్తినిచ్చింది. దాని ప్రకారం వక్ఫ్‌ ఆస్తి దురాక్రమణకు గురైందని ఏ దశలో గుర్తించినా దాని స్వాధీనానికి వక్ఫ్‌ బోర్డు చర్యలు తీసుకోవచ్చు. తాజా సవరణ దీన్ని రద్దు చేయటాన్ని ధర్మాసనం సమర్థించింది. ఇతర ఆస్తులతో సమానంగా పరిగణించటం వివక్ష తొలగింపే అవుతుందని భావించింది.అన్య మతస్థులు కనీసం అయిదేళ్లుగా ఇస్లాం ఆచరణలో ఉంటేనే వక్ఫ్‌కు ఆస్తులు దానం చేయొచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే విధించటం ఒక రకంగా ఊరట. ఇస్లాం ఆచరణంటే ఏమిటో చట్టం వివరించకపోవటం, దాన్ని గుర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసే నిబంధనలు, అందుకోసం ఏర్పాటయ్యే వ్యవస్థ సంగతి తేలేవరకూ ఈ నిబంధన నిలిచిపోతుంది. పౌరులు తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగంలోని 300వ అధికరణం ఇచ్చింది. అన్య మతస్థులు వక్ఫ్‌ బోర్డుకు ఆస్తులివ్వరాదన్న నిబంధన దీన్ని ఉల్లంఘించటం లేదా? తుది తీర్పులోనైనా దీన్ని పరిశీలించక తప్పదు. వివాదాస్పద ఆస్తులపై వక్ఫ్‌ బోర్డుకూ, ప్రభుత్వాలకూ తగువు ఏర్పడినప్పుడు కలెక్టర్‌ స్థాయి అధికారి నిర్ణయించవచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ నిబంధనలో మరో వైపరీత్యముంది. అసలు అలాంటి విచారణ మొదలైన మరుక్షణమే అది వక్ఫ్‌ ఆస్తిగా పరిగణించటానికి వీల్లేదని చెబుతోంది. మొత్తానికి వివాదాలను ట్రైబ్యునల్స్‌ లేదా హైకోర్టులు మాత్రమే తేల్చాలనటం సరైన నిర్ణయం. అయితే వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం కల్పించాలన్న నిబంధనను కొంత మార్పుతో అలాగే ఉంచటం సబబు కాదు. హిందూ, సిక్కు, క్రైస్తవ మతాలకు చెందిన సంస్థల్లో అన్య మతస్థులకు చోటు లేనప్పుడు, వక్ఫ్‌ బోర్డుల్లో మాత్రం ఎందుకుండాలి?వక్ఫ్‌ చట్టంలో సమస్యలున్నాయి... సరిచేయమని కోరేవారిలో ఆ మతస్థులూ ఉన్నారు. అలా చేసే ముందు ముస్లిం మతాచార్యులతో, ముస్లిం పర్సనల్‌ లా బోర్డుతో మాట్లాడాలి. పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. పార్లమెంటులో అలజడి రేగాక బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేశారు సరే... కానీ విపక్షాల అభ్యంతరాలను పట్టించుకున్నారా? సమర్థమైన, లోప రహితమైన విధానాలు తీసుకురాదల్చుకుంటే స్వాగతించాల్సిందే. కానీ ఆ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. అటువంటి చర్య ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది.

Prisoner swallowed Studs Hustle without cooperating with medical care5
మేకులు మింగిన ఖైదీలు.. వైద్యానికి సహకరించకుండా హల్‌చల్‌

చోరీ కేసుల్లో అరెస్టై సంగారెడ్డి కారాగారాంలో ఉన్న ఇద్దరు ఖైదీలు.. మేకులు,బ్యాటరీలు మింగి హల్‌చల్‌ చేసిన ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే.. చోరీ కేసులో జైలుకొచ్చిన ఛావుస్‌,మధు ట్రబుల్‌ మేకర్లుగా ఉన్నారు. రెండురోజుల క్రితం అందుబాటులో ఉన్న మేకులు, టీవీరిమోట్‌కు ఉండే బ్యాటరీలు మింగి గుడ్లు తేలేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పతత్రికి తరలించారు. ఇద్దరూ రెండ్రోజులుగా వైద్యానికి సహకరించడం లేదని దగ్గరకు వచ్చేవారిపై ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారి కడుపులో ఉన్న బ్యాటరీలు,మేకులను శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని లేదంటే సెప్టిక్‌ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో ఉంటే బ్యాటరీలు పగిలితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై జైలు సూపరిటెండెంట్‌ కళాసాగర్‌ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఆయన ఫోన్‌లో అందుబాటులో లేరు.

China Replaces Germany in Top Ten of UNs Most Innovative Nation6
జర్మనీని వెనక్కి నెట్టిన చైనా: మొదటిసారి టాప్ 10లోకి..

చైనాలోని పలు కంపెనీలు.. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ దేశం మొదటిసారి ఐక్యరాజ్యసమితి మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ కంట్రీస్‌ యాన్యువల్ ర్యాంకింగ్‌లో టాప్ 10లోకి ప్రవేశించింది. యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని అధిగమించి ఈ రికార్డ్ కైవసం చేసుకుంది.2011 నుంచి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 78 సూచికల ఆధారంగా 139 ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) సర్వేలో చైనా 10వ స్థానంలో నిలిచింది.జాబితాలోని టాప్ 10 దేశాలలో.. వరుసగా స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, కొరియా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనా ఉన్నాయి.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజర్మనీ ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని GII కో ఎడిటర్ 'సచా వున్ష్-విన్సెంట్ (Sacha Wunsch-Vincent) అన్నారు. కొత్త ర్యాంకింగ్‌.. అమెరికాలో ట్రంప్ పరిపాలన విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రతిబింబించలేదని అన్నారు.

masood azhar family torn apart over operation sindoor7
‘ఆపరేషన్‌ సిందూర్‌’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్‌

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబం తునాతునకలైనట్లు పాకిస్తాన్‌ జైషే మహమ్మద్ కమాండర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.తాజాగా, పాకిస్తాన్‌లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు. ఉర్దూలో కాశ్మీరీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్‌పూర్‌లో భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో ఏప్రిల్‌ 22 మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో జరిపిన మెరుపుదాడులతో ఈ ఉగ్రసంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌తో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. వారితో పాటు జైషే నెంబర్‌-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌, మౌలానా అమర్‌ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు బహవల్‌పూర్‌లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటిని పునర్‌నిర్మించుకునేందుకు పాక్‌ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించింది.ఈ క్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌లో భారత బలగాలు పీవోకే, పాకిస్తాన్‌లో ఎంతటి బీభత్సం సృష్టించాయో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వివరించడం చర్చాంశనీయంగా మారింది. 🚨 #Exclusive 🇵🇰👺Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces. Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy— OsintTV 📺 (@OsintTV) September 16, 2025 Markaz Subhan Allah, Bahawalpur (Punjab, Pakistan) was the headquarters of Jaish-e-Mohammad. This facility was a key hub for orchestrating terror operations, including the Pulwama attack on Feb 14, 2019. The perpetrators of the bombing were trained at this very site. Demolished. pic.twitter.com/zNhcMylVxW— Amit Malviya (@amitmalviya) May 7, 2025 4th Month Anniversary of Operation Sindoor. Enjoy Guys pic.twitter.com/fJAL3vQvsh— rae (@ChillamChilli) September 7, 2025

Supreme Court Key Comments On Viveka Case8
వివేకా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్‌ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్‌.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్‌జీ తెలిపారు.‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్‌ వాదనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్‌ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్‌ కోర్టులో ఎందుకు చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్‌ రన్‌ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది. ఈ దశలో మేం చేసేది ఏం లేదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్‌ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది.

Australia A Scored 337 Runs After Losing 5 Wickets At Day 1 Stumps Against India A In First Un Official Test Match9
కొన్‌స్టాస్‌ శతకం.. శ్రేయస్‌ సేనపై ఆసీస్‌ బ్యాటర్ల పైచేయి

శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని భారత్‌ ఏ జట్టుతో ఇవాళ (సెప్టెంబర్‌ 16) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ బ్యాటర్లు పైచేయి సాధించారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌ (114 బంతుల్లో 109; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. మరో ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ కెల్లావే (97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వన్‌, టు డౌన్‌ బ్యాటర్లు నాథన్‌ మెక్‌స్వీని (1), ఒలివర్‌ పీక్‌ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచినా.. ఆతర్వాత వచ్చిన కూపర్‌ కన్నోల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటాడు. ఆట ముగిసే సమయానికి లియామ్‌ స్కాట్‌ 47, జోష్‌ ఫిలిప్‌ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.టీ విరామం వరకు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన భారత బౌలర్లు.. ఆతర్వాత 26 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపించారు. అయితే ఈసారి కూపర్‌ కన్నోల్లీ-లియామ్‌ స్కాట్‌ భారత్‌ పైచేయి సాధించకుండా అడ్డు తగిలారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 109 పరుగులు జోడించి ఆసీస్‌ను పటిష్ట స్థితికి చేర్చారు. కన్నోల్లీ ఔటైనా లియామ్‌ స్కాట్‌ బాధ్యతగా ఆడుతూ ఆసీస్‌ను భారీ స్కోర్‌ దిశగా తీసుకెళ్తున్నాడు. అంతకుముందు కొన్‌స్టాస్‌-కెల్లావే జోడీ తొలి వికెట్‌కు 198 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది.గుర్నూర్‌ బ్రార్‌ భారత్‌కు తొలి బ్రేక్‌ అందించారు. కెల్లావేను ఔట్‌ చేశాడు. అనంతరం లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ హర్ష్‌ దూబే ఒక్కసారిగా చెలరేగాడు. స్వల్ప వ్యవధిలో కెప్టెన్‌ మెక్‌స్వీనిని, సెంచరీ హీరో కొన్‌స్టాస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత ఖలీల్‌ అహ్మద్‌ ఒలివర్‌ పీక్‌ను ఔట్‌ చేశాడు. అనంతరం కన్నోల్లీ, లియామ్‌ స్కాట్‌ భారత బౌలర్ల సహనాన్ని చాలాసేపు పరీక్షించారు. 333 పరుగుల వద్ద హర్ష్‌ భారత్‌కు మరోసారి బ్రేక్‌ ఇచ్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న కన్నోల్లీని బోల్తా కొట్టించాడు.కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు (నాలుగు రోజుల మ్యాచ్‌లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే​ తొలి టెస్ట్‌ మొదలైంది. రెండో టెస్ట్‌ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్‌ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 3, 5 తేదీల్లో కాన్పూర్‌లో వన్డేలు జరుగుతాయి.

BJP Targets Rahul Gandhi Over Afridi Positive Mindset Remark10
రాహుల్‌ గాంధీపై షాషిద్‌ అఫ్రిది ప్రశంసలు

ఇస్లామాబాద్‌: పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌గాంధీ తన చర్చల ద్వారా అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్లు మాత్రం (బీజేపీని ఉద్దేశిస్తూ).. మరో ఇజ్రాయెల్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న ఒక్క ఇజ్రాయెల్‌ సరిపోదా? అని దుయ్యబట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌లు తలపడ్డాయి. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్‌ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్‌ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారని వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు పాక్‌ ప్రస్తుత ఆటగాళ్లు,మాజీ ఆటగాళ్లు భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో పాకిస్తాన్‌ మీడియా సంస్థ సామ్మాటీవీ ఆసియాకప్‌పై నిర్వహించిన ప్యానల్‌ డిస్కషన్‌లో షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాత్రం పాజిటివ్ మైండ్‌సెట్ కలిగిన నాయకుడు. సమస్యల పరిష్కారం కోసం సంభాషణే మార్గమని ఆయన నమ్ముతారు. కానీ బీజేపీ మాత్రం ఘర్షణ, విభజన వైపు మొగ్గుచూపుతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఒక ఇజ్రాయెల్ ఉంది. అది మత, భూభాగ, రాజకీయ వివాదాలతో నిండిన దేశం. మరొక ఇజ్రాయెల్‌ను సృష్టించాలన్నదే మీ ఉద్దేశమా? అని ప్రశ్నిస్తూ ఒక ఇజ్రాయెల్ చాలదా? ఇంకొకటి కావాలా?’ అంటూ షాహిద్‌ అఫ్రిది వ్యాఖ్యానించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను అస్త్రంగా పలువురు బీజేపీ నేతలు రాహుల్‌గాంధీపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి.. ఎక్స్‌ వేదికగా.. రాహుల్ గాంధీకి ఇప్పుడు కొత్త ఫ్యాన్‌బాయ్ దొరికాడు. అవమానానికి గురైన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ! అంటూ పేర్కొన్నారు. మరో బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. భారత్‌ను ద్వేషించే ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌లో మిత్రులను కనుగొంటారు. జార్జ్ సోరస్ నుంచి షాహిద్ అఫ్రిదీ వరకు... ఐఎస్‌సీ అంటే ‘ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్’ అని దుయ్యబట్టారు. 🚨This is Fear From Indian Army & Leadership.Operation Sindoor they will never forget. pic.twitter.com/p77IwsCSiz— Lt Colonel Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) September 16, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement