చార్మినార్ లో ట్రెండ్గా గాజుల వ్యాపారం
నిమిషాల్లో నచ్చిన రంగుల్లో కస్టమైజేషన్
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిల అలంకరణల్లో ఎన్ని రకాల నగలున్నా.. గాజుల స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే, ఒకప్పటిలా నిండుగా కాకుండా.. ఆఫీసుకైనా, కాలేజీకైనా సింపుల్గా ఓ గాజు వేసుకుంటే చాలనుకుంటున్నారు. దీంతో పాటు కస్టమైజేషన్ గాజులంటే మరింతగా ఇష్టపడుతున్నారు. దీంతో చార్మినార్ ప్రాంతంలోని లాడ్ బజార్లో ‘లైవ్ బ్యాంగిల్ మేకింగ్’ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. అక్కడ కస్టమర్ల అభిరుచి మేరకు వారి కళ్ల ఎదుటే, నచి్చన డిజైన్లలో గాజులు తయారు చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియను పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా సోమవారం ఓ యువతి కళాకారుడి సూచనల మేరకు స్వయంగా గాజులు తయారుచేయించుకుంది.


