-
సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా ?..ఇలా సంప్రదించండి
-
సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ సమంతలో అందం, అభినయంతో పాటు మంచితనం కనిపిస్తుంటుంది. ఈ గుణాలు అన్నీ ఆమెలో ఉన్నాయి కాబట్టే సమంతను అభిమానులకు మరింత చేరువ చేసింది. ఇప్పటికే సామ్ నటిగా పలు సంస్థలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం ఆమె స్వయంగా 'సాకి' అనే దుస్తుల బ్రాండ్ను స్థాపించిన విసయం తెలిసిందే. తన బ్రాండ్కు చెందిన డిజైనర్ దుస్తులు మార్కెట్లో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. సాకి బ్రాండ్ అంటే సమంతకు చాలా ఇష్టం. అందులో తనకు ఫ్యాషన్పై ఉన్న అభిరుచిని తెలుపుతుంది.అయితే, సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది. తనకు ఎంతో ఇష్టమైన 'సాకి'లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. అందుకు సరిపడా అర్హతలు ఉన్నవారు సంప్రదించవచ్చని ఒక మెయిల్ అడ్రస్ను కూడా పొందుపరిచింది. తన కంపెనీలో ఉన్న ఉద్యోగ వివరాలను కూడా తెలిపింది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ వంటి ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపింది. ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారందరూ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని తెలిపింది.సమంత ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ పేరుతో పిల్లల కోసం ప్లే స్కూల్ కూడా నడుపుతుంది. తమ పిల్లలను అందులో చేర్పించేందుకు కావాల్సిన వివరాలు తెలుసుకునేందుకు ఒక ఫోన్ నంబర్ను (9154900466) కూడా ఆమె షేర్ చేసింది. మరోవైపు సూపర్ ఫుడ్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన సమంత.. ఏడాదికి మూడు మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే సమంత స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఆ విషయంలో నిరూపించుకోవాల్సిన పనిలేదు: సమంత
ఏ విషయంలోనూ తగ్గేదేలేదు అనే హీరోయిన్లలో సమంత ముందుటారని చెప్పవచ్చు. కొద్దిరోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన శ్యామ్.. మళ్లీ కెమెరాల ముందుకు వచ్చింది. మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న సమంత ఆ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. అంతకు ముందే భర్తకు దూరం అయ్యారు. గత రెండేళ్లుగా ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకరించలేదు. ఒప్పుకున్న చిత్రాలు, వెబ్ సిరీస్ల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. అయినప్పటికీ వాటి గురించి కొంచెం కూడా ఆలోచించకుండా చలాకీగా ఉంటూ సంతోషంగా కాలాన్ని గడిపేస్తుంటారు. సమంతకు ఆర్థిక సమస్యలు లేవనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తనే నిర్మాతగా మారి తెలుగులో మా ఇంటి బంగారం అనే హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యారు. ఇక పోతే తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. కాగా అలానే ఇటీవల ఆమె అర్ధనగ్నంగా స్నానం చేస్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు సమంతపై విమర్శల దాడి చేశారు. సమంత ఇలా మారిపోయారేమిటి? ఆమెను ఇలా ఊహించుకోలేమంటూ అభిమానులు కామెంట్ చేశారు. తీరా అది సమంత ఫొటో కాదని, ఫేక్ అని తేలింది. అప్పుటి వరకూ ఈ వ్యవహారంపై నోరు మెదపని సమంత ఇప్పుడు తాను ఎవరికీ, ఏ విషయంలోనూ కొత్తగా నిరూపించుకోవలసిన అవసరం లేదని తన ఇన్స్ట్రాగామ్లో పేర్కొన్నారు. దీంతో దటీజ్ సమంత అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
ఉన్నఫలంగా హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఓ మహిళ నగ్నంగా ఉన్న ఫొటోని వైరల్ చేస్తున్న నెటిజన్స్.. ఇందులో ఉన్న సమంతనే అంటున్నారు. ఈ ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసి, ఆ వెంటనే డిలీట్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అసలేం జరిగింది?హీరోయిన్గా స్టార్ హోదా అనుభవించిన సమంత.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని మూడేళ్ల క్రితం బయటపెట్టింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, దాన్ని నుంచి కోలుకోవడానికి అవసరమైన చికిత్సలు తీసుకుంటోంది. కొన్నాళ్ల క్రితం అమెరికా కూడా వెళ్లొచ్చిందని అన్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)తాజాగా సమంత.. 'ఫార్ ఇన్ఫ్రారెడ్ సౌనా' అనే చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ ఇన్ స్టాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. అలానే దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది కూడా రాసుకొచ్చింది. ఇదే టైంలో సమంత.. నగ్నంగా ఉన్న ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసిందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అది ఇదేనంటూ ఓ పిక్ వైరల్ చేశారు.అయితే ఇందులో ఎవరో ఓ మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అది సమంతనా కాదా అనేది మాత్రం తెలియలేదు. మెడలో ఉన్న చైన్ ఒక్కటే అని అంటున్నారు. కానీ ఆ ఫొటో ఫేక్ అని సామ్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో అసలు నిజమేంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
నిర్మాతగా సమంత.. కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
హీరోయిన్గా ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించిన సమంత వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా కూడా రాణించింది. తాజాగా టాలీవుడ్లో ఆమె మరో అడుగు ముందుకు వేసింది. నిర్మాతగా మారిన సమంత తన కొత్త సినిమాను ప్రకటించింది. ఈ మేరకు తన కొత్త ప్రొడక్షన్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' కంపెనీ నుంచి మొదటి సినిమా ప్రకటన అఫీషియల్గా వచ్చేసింది.నేడు (ఏప్రిల్ 28న) సమంత పుట్టిన రోజు సందర్భంగా తన నిర్మాణ సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించింది. 'మా ఇంటి బంగారం' అనే టైటిల్తో పోస్టర్ విడుదల చేశారు. తన సొంత నిర్మాణ సంస్థలో సమంత లీడ్ రోల్లో నటిస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో సమంత చీరకట్టుకుని చేతిలో తుపాకీ పట్టి సీరియస్ లుక్తో కనిపిస్తుంది. లేడీ ఓరియేంటెడ్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సినిమాలు నిర్మించే విషయంలో హైదరాబాద్కు చెందిన ఎంటర్టైన్మెంట్ కంపెనీ 'మండోవా మీడియా వర్క్స్'తో సమంత ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ సంస్థకు మంచి గుర్తింపే ఉంది. తమ భాగస్వామ్యంలో వెబ్ సిరీస్తో పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ రూపొందించే అవకాశం ఉందని మండొవా మీడియా వర్క్స్ అధినేత హిమాంక్ దువుర్రు గతంలో తెలిపాడు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
సమంత రుతు ప్రభు.. ఈ పేరు చెప్పగానే సినిమాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ట్రోల్స్ ఇలా చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే ఈమె జీవితం సినిమాని మించిపోయేలా ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్తో పాటు ట్రాజెడీ అనిపించే సంగతులు చాలానే వినిపిస్తాయి. వీటి గురించి కొందరికి తెలిస్తే మరికొందరికి తెలియదు. ఇప్పుడు సమంత 37వ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వాటిని అలా గుర్తుచేసుకుందాం.తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగిన సమంత.. అక్కడే చదువుకుంది. డిగ్రీ చివర్లో ఉండగానే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం పార్టీలు, ఈవెంట్స్లో వెల్కమ్ గర్ల్గా పనిచేసింది. అలానే 'ఏ మాయ చేశావె'.. ఈమె తొలి సినిమా అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకంటే ముందే తమిళంలో 'మాస్కోవిన్ కావేరి' అనే మూవీ చేసింది.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్.. ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. 2010-19 వరకు దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వరస చిత్రాలు చేసిన సమంత.. ఆ తర్వాత మాత్రం వరస ఫ్లాపుల దెబ్బకు డౌన్ అయిపోయింది. మధ్యలో ఈమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్టు తెలియడంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది.సినిమాలతో పాటు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఉగ్రవాది తరహా పాత్రలో నటించి షాకిచ్చింది. అప్పటివరకు గ్లామరస్ రోల్స్లో సామ్ని చూసిన ఫ్యాన్స్.. ఈ సిరీస్లో సమంత డీ గ్లామర్ గెటప్, ఫైట్స్ చేయడం చూసి అవాక్కయ్యారు.(ఇదీ చదవండి: సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్)సమంతకు యశోద అనే మరోపేరు కూడా ఉంది. ఈ విషయం దాదాపు ఎవరికీ తెలియదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆమెని ఈ పేరుతో పిలుస్తారు. 'యశోద' పేరుతో సమంత ఓ సినిమా కూడా చేయడం విశేషం. అలానే 2012లో తెలుగు, తమిళంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. రేవతి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హీరోయిన్గా ఘనత సాధించింది.2013లో తనకు డయాబెటిస్ ఉన్నట్లు బయటపెట్టిన సమంత.. జిమ్, హెల్తీ ఫుడ్ తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడింది. కానీ ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. 2022 అక్టోబరులో ఈ విషయాన్ని బయటపెట్టింది. దీని వల్ల దీర్ఘకాలిక కండరాల వాపు వస్తుంది. ప్రస్తుతం కొంతమేర దీన్నుంచి కోలుకుంది. పూర్తిగా నార్మల్ అవ్వాలంటే మాత్రం కొన్నేళ్లు పట్టొచ్చు!(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!)సినిమాల సంగతి పక్కనబెడితే సమంత వ్యక్తిగత జీవితం అంతకు మించి అనేలా ఉంటుంది. అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించింది. 2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ ఏమైందో ఏమో గానీ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీలో అందరూ షాకయ్యారు. కారణం ఏంటో తెలియకుండానే సమంతపై చాలా విమర్శలు చేశారు. పర్సనల్ స్టైలిష్ట్తో ఎఫైరే దీనికి కారణమని అన్నారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుటికీ సస్పెన్సే.సాధారణంగా హీరోయిన్లు పెద్దగా వివాదాలు జోలికి వెళ్లరు. కానీ సమంత మాత్రం ఈ విషయంలో కాస్త డిఫరెంట్. కోరి తెచ్చుకునేలా కొన్నింటిని నెత్తిన పెట్టుకునేది. ట్రోలింగ్కి గురయ్యేది. అయితే ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా సరే సమంతలో ఓ మంచి మనిషి కూడా ఉంది. పేద పిల్లలు, మహిళల సంక్షేమం కోసం 'ప్రత్యూష సపోర్ట్' అనే ఎన్జీవో స్థాపించి చాలామందికి సహాయపడుతోంది. ఇలా సమంత జీవితం చూసుకుంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని స్థాయి నుంచి మొదలై.. స్టార్ హీరోయిన్ హోదా అనుభవించి.. పెళ్లి జీవితంతో విమర్శలు ఎదుర్కొని.. పరిస్థితులు ఎదురు తిరిగిన నిలబడి గెలిచిన బ్యూటీ సామ్.(ఇదీ చదవండి: ఎక్కడెక్కడో టచ్ చేశారు.. వస్తావా అంటే తెలియక సరే అన్నాను: కీర్తి భట్) -
Samantha: ఏ మాయ చేసిందో.. ఇప్పటికీ ఎంతోమంది ఫేవరెట్ హీరోయిన్ (ఫోటోలు)
-
విజయ్ చివరి చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..ఎవరంటే?
ఇప్పుడు కోలీవుడ్లో ఆసక్తికరమైన టాక్ హల్చల్ చేస్తోంది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చి త్రం గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టై మ్) నటి మీనాక్షి చౌదరి, స్నే హ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్,వైభవ్, ప్రేమ్జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తదుపరి విజయ్ తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే ఈయన చివరి చిత్రం అని ప్రచా రం జోరుగా సాగుతోంది. కారణం విజయ్ రాజకీయరంగ ప్రవేశం చేయడమే. కాగా ఆయన చివరి చిత్రానికి హెచ్ వినో ద్ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో దీన్ని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుందీ అన్నది కూడా తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇందులో విజయ్తో జత కట్టే కథానాయికల గురించి ప్రచారం జో రుగా సాగుతోంది.అలా ఈ జాబితాలో పలువురు పేర్లు చెక్కర్లు కొడుతున్నా, నటి సమంత, కీర్తీసురేష్ పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. నటి సమంత ఇంతకు ముందు విజయ్ సరసన కత్తి, తెరి, మెర్సల్ చిత్రాల్లో నటించారు. అలాగే నటి కీర్తీసురేష్ కూడా ఇంతకు ముందు భైరవా, సర్కార్ చిత్రాలలో జత కట్టారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి విజయ్తో రొమాన్స్ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
పెళ్లి జ్ఞాపకాల్ని అలా మార్చేసిన సమంత.. వీడియో వైరల్
సమంత పేరు చెప్పగానే ఆమె పెళ్లి, విడాకులే చాలామందికి గుర్తొస్తాయి. ఎందుకంటే కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఎన్నాళ్లు బంధాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కారణమేంటో గానీ విడాకులు తీసేసుకుంది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. పెళ్లి పెటాకులు అయినా.. సామ్ దగ్గర ఆ జ్ఞాపకాల ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు వాటితో ప్రయోగం చేసింది. ఇంతకీ అసలేంటి విషయం?'ఏ మాయ చేశావె'తో హీరోయిన్ అయిపోయిన సమంత.. ఇదే సినిమాలో హీరోగా చేసిన నాగచైతన్యని లవ్ చేసింది. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో వీళ్లిద్దరూ జంటగా నటించారు. అలా కొన్నేళ్ల పాటు సాగిన ప్రేమకు 2017లో ఎండ్ కార్డ్ వేశారు. పెద్దల్ని ఒప్పించి చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ నాలుగేళ్లలో అంటే 2021లో విడాకులు తీసుకున్నారు.అయితే పెళ్లిలో సమంత.. వైట్ కలర్ వెడ్డింగ్ గౌన్ ఒకటి అప్పట్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అయితే పెళ్లి, విడాకులు తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు. కానీ దాన్ని అలానే జాగ్రత్తగా దాచుకున్న సమంత.. ఇప్పుడు ఆ గౌన్కి ఉన్న చిన్న చిన్న పూలని తీసి కొత్త డ్రస్ కోసం ఉపయోగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామ్ ఇన్ స్టాలోనే ఉంది. పెళ్లి జీవితం సరిగా లేనప్పటికీ.. ఆ జ్ఞాపకాల్ని ఇంకా పదిలంగా అలా ఉంచుకోవడం ఇంట్రెస్టింగ్ విషయమే. View this post on Instagram A post shared by Krésha Bajaj (@kreshabajajofficial) -
ఆ మ్యూజిక్ డైరెక్టర్పై సమంత ప్రశంసలు
ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఈ తరం హీరోయిన్లకు బాగా తెలుసు. ఇందుకు నటి సమంత అతీతం కాదు. ఈమె నటించిన చివరి చిత్రం ఖుషీ విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఆ తరువాత మరో చిత్రంలో నటించలేదు. అలాగని తెరమరుగు కాలేదు. తన గ్లామరస్ ఫొటోలతో, ఫిట్నెస్ ఫొటోలతోనో, ఇతరుల గురించి కామెంట్స్ చేయడంతోనో తరచూ వార్తల్లో ఉంటారు. మరో పక్క ఈమె నటించిన వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానళ్లలో హల్చల్ చేస్తుంటాయి. ఒక పక్క మయోసైటీస్ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూనే ప్రేక్షకులకు దూరం కాకుండా జాగ్రత్త వహిస్తున్న జాన సమంత. కాగా ఈమె నటించిన ది ఫ్యామిలీ స్టోరీ– 2 వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోంది. కాగా సమంత ఓ మలయాళ సంగీత దర్శకుడిని మేధావి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ఇన్స్టా పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇటీవల విజయాలతో కళ కళలాడుతోంది. తక్కువ బడ్జెట్తో చిత్రాలు చేసి భారీ లాభాలను చవి సూస్తున్నారు. అలా ఇటీవల బ్రహ్మయుగం,ప్రేమలు, మంజుమల్ బాయ్స్, ది గోట్ వంటి చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. తాజాగా ఈ కోవలోకి ఆవేశం చిత్రం చేరింది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫాహత్ ఫాజిల్ తాజాగా కథానాయకుడిగా నటించిన మలయాళ చిత్రం ఆవేశం. ఈనెల 11న విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్టు వసూలు చేసిందని సమాచారం. కాగా ఈ చిత్రానికి నటి సమంత తన ఇన్స్ట్రాగామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అందులో ముఖ్యంగా ఆ చిత్ర సంగీత దర్వకుడు సుషిన్ శ్యామ్పై పొగడ్తల వర్షం కురిపించింది. -
సమంత లగ్జరీ బ్రాండ్ వాచ్.. ధర ఎంతంటే..!
టాలీవుడ్ నటి సమంత చక్కటి ఫ్యాషన్ దుస్తుల పోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యాక్టివ్గా ఉంటుంది. ప్రతి డ్రెస్ అత్యంత లగ్జరియస్ బ్రాండ్కు చెందినవే. ఈసారి మంచి కలర్ఫుల్ లుక్ ఫోటోలతో అభిమానులను ఆకర్షించింది. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీకి చెందిన తెల్లటి లక్కర్ జాకెట్, స్కర్ట్ ధరించి.. క్యూట్ లూక్తో చూపురులన కట్టిపడేస్తుంది. దుస్తులపై ఉన్న ఎంబ్రాయిడరీ, ప్యాడెడ్ ఫోల్డర్లు, ఫుల్ స్లీవ్ల్లు బోర్డురూంలో సమావేశానికి వెళ్లే సీఈవోల మాదిరిగా ఉంది. అందుకు తగ్గట్టు ఆమె ధరించి డైమండ్ స్టడెడ్ సెర్పెంటి స్పిగా వాచ్ ఆమె అందన్ని రెట్టింపు చేశాయి. ఆ వాచ్ డయల్ చ్టుటూ సిల్వర్ ఒపలైన్ , డైమండ్లతో పొదడబడి ఉంది. చేతికి స్పైరల్ బ్రాస్లెట్ మాదిరిగా ప్రకాశవంతంగా ఉంది. ఆ తెల్లటి దుస్తులకు సరిగ్గా సరిపోయింది కాంస్య మేకప్ సమంతాకి కొత్త లుక్ని ఇచ్చింది. బహుశా ఈ వాచ్ అంటే ఆమెకు చాలా ఇష్టమనుకుంటా దీన్ని మరో రెండు సందర్భల్లో కూడా ధరించింది. ఒకసారి బోల్డ్ బ్లాక్ దుస్తులను ధరించినప్పుడూ వాచ్ మరింత ప్రకాశవంతంగా కనిపించింది. అలాగే ఓ ఫ్రైమ్ వీడియో ఈవెంట్కు కూడా ఈ సర్పెంటీ వాచ్ని ధరించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అలాగే ఈ వజ్రాలతో కూడిన వాచ్కి కేవలం సమంతా మాత్రమే ఫ్యాన్ కాదు మరో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీకి కూడా తెగ ఇష్టం. అందుకే కియారా కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో ఆమె నలుపు రంగు దుస్తులు ధరించి, చేతికి వెండి సర్పెంటీ స్పిగా వాచ్ను ధరించింది. మంచి జీవనశైలితో జీవితాన్ని ఆశ్వాదించేవారికి ఈ బల్గారియా వాచ్లు స్టైయిల్ష్ లుక్ని ఇస్తాయట. ఇంతకీ డైమండ్లతో పొదగబడిన ఈ వాచ్ ధర వింటే షాకవ్వుతారు. ఈ బల్గారియా సర్పెంటీ వాచ్ ధర ఏకంగా రూ. 70 లక్షలట. లగ్జరీ బ్రాండ్కి తగ్గ రేంజ్ ధర కాబోలు..! View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
పుష్ప సాంగ్ క్రేజ్.. వారి స్టెప్పులకు సమంత ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఫుష్ప. ఈ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా పుష్ప-2 కూడా రాబోతోంది. అయితే పుష్పలో సమంత ఐటమ్ సాంగ్కు స్టెప్పులేయని వారు ఉండరు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ సాంగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రంలోని 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అనే సాంగ్ ఆడియన్స్ను ఓ ఊపు ఊపేసింది. అయితే తాజాగా ముగ్గురు చిన్నారులు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సుకుమార్ భార్య తబిత తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన సమంత చిన్నారుల డ్యాన్స్కు ఫిదా అయిపోయింది. అంతే కాకుండా తగ్గేదేలే అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చూశాక నేను ఇంకాస్తా బెటర్గా చేయాల్సిందని ఫన్నీ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జత చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. సమంత ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఈ సిరీస్లో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. -
కర్నూలు విద్యార్థినిపై సమంత ప్రశంసలు... పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించింది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీతో అదరగొడుతోంది. తాజాగా సమంత ఇంటర్ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నిర్మలను కొనియాడింది. ఈ రోజుల్లో తనే నాకు ఆదర్శం అంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ పత్రిక క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టార్ హీరోయిన్ సమంత ఇంటర్ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించడంతో సామ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఇటీవల రిలీజైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఆలూరు కేజీబీవీలో చదివిన ఎస్ నిర్మల బైపీసీలో 440 కి 421 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాదు నిర్మల పదో తరగతిలోనూ 537 మార్కులు సాధించింది. నిరుపేదలైన నిర్మల తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. -
కిరాక్ పోజుల్లో టిల్లు గాని రాధిక.. శోభిత ఏకంగా అలా!
హీరోయిన్ సమంత టాప్ లెస్ పోజులు.. కేక అంతే హీట్ పెంచేస్తున్న టిల్లు గాని రాధిక అలియాస్ నేహాశెట్టి అందంతో మత్తెక్కించేలా హాట్ బ్యూటీ శోభిత దూళిపాళ్ల కొంటె చూపులతో చంపేస్తున్న 'జాతిరత్నాలు' చిట్టి రెడ్ డ్రస్ లో మరింత అందంగా సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల నవ్వుతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ ఓరగా చూస్తూ కవ్విస్తున్న తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!
సమంత పేరు చెప్పగానే పలు హిట్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ అదంతా ఒకప్పుడు కొత్త నీరు వస్తే పాత నీరు గురించి మర్చిపోయినట్లు శ్రీలీల, కృతిశెట్టి లాంటి బ్యూటీస్ రావడం, సినిమాలు చేయడం తగ్గించేయడంతో సమంత.. జనాలకు కాస్త దూరమైంది. ఇప్పుడేమో మళ్లీ బాగా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. 'ఏ మాయ చేశావె' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఆ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్, మహేశ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. సూపర్ హిట్స్ కొట్టింది. హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్నప్పటికీ 'మజిలీ', 'ఓ బేబీ' లాంటి చిత్రాలతో అలరించింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) ఇక చైతూకి విడాకులు ఇచ్చేసిన తర్వాత పలు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన సామ్.. హిట్స్ కొట్టలేకపోయింది. దీనికి తోడు మయోసైటిస్ లాంటి అరుదైన వ్యాధి వల్ల కొన్నాళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ సిరీస్ తప్పితే సామ్ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. గతేడాది 'ఖుషి' మూవీతో వచ్చింది. కానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో సమంత ఇప్పుడు మళ్లీ గ్లామర్ ట్రీట్ ఇస్తూ పలు ఫొటోలు రిలీజ్ చేస్తోంది. కానీ దర్శకనిర్మాతలైతే ఈమెని పెద్దగా పట్టించుకుంటున్నట్లు అనిపించట్లేదు. దీంతో సామ్ గ్లామర్ పరంగా కష్టపడుతున్న పెద్దగా లాభం ఉండట్లేదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అమాయకుడైన 'చై'ని మోసం చేశావ్.. సమంత దిమ్మతిరిగే ఆన్సర్
-
Samantha: ఫ్యాషన్ : కిల్లింగ్స్ లుక్స్లో సమంతా.. ఏమిటిదంతా..?( ఫోటోలు)
-
సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!
సమంత పేరు చెప్పగానే పలు హిట్ సినిమాలతో పాటు ఆమెకున్న మయాసైటిస్ వ్యాధి గుర్తొస్తుంది. అప్పటివరకు వరసపెట్టి మూవీస్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. అకస్మాత్తుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. దీని వల్ల ఆమె.. 'చెన్నై స్టోరీ' అనే హాలీవుడ్ చిత్రం నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వచ్చింది. (ఇదీ చదవండి: హీరోయిన్ అనుపమకు అవమానం.. ఎన్టీఆర్ ముందే..!) సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ అయిన సమంత.. సదరు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ముద్దుగుమ్మ శ్రుతిహాసన్ కు వచ్చింది. 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే నవల ఆధారంగా తీస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ కథతో సాగే మూవీ. ఇందులో శ్రుతి.. అనూ అనే లేడీ డిటెక్టివ్గా నటించడానికి సిద్ధమైంది. ఈ మధ్యే మొదలైన షూటింగ్లోనూ పాల్గొంది. ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు శ్రుతిహాసన్.. చైన్నె స్టోరి మూవీ నుంచి వైదొలగినట్లు టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందుకు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో నటి సమంత, శృతిహాసన్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు ఈ అవకాశం ఏ నటికి దక్కుతుందో చూడాలి? (ఇదీ చదవండి: Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?) -
సమంత నిద్ర లేచాక ఏం చేస్తుందో తెలుసా?.. అస్సలు ఊహించి ఉండరు! (ఫొటోలు)
-
చై అమాయకుడు, ఎందుకు మోసం చేశావ్? సామ్ ఆన్సరిదే!
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎందుకు విడిపోతుంది? పెళ్లికి ముందు ఉన్న ప్రేమ తర్వాత ఎందుకు ఉండట్లేదు? జీవితాంతం కలిసుండాలనుకున్న లవ్ బర్డ్స్ భార్యాభర్తలుగా ఎందుకు కంటిన్యూ అవలేకపోతున్నారు? ఈ ప్రశ్నలకు కారణాలెన్నో...! కొన్నిసార్లు తప్పు ఒకరివైపు ఉండొచ్చు, మరికొన్నిసార్లు ఇరువైపులా ఉండొచ్చు. మూడో వ్యక్తి మధ్యలో దూరడం వల్ల కూడా అవొచ్చు లేదా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడమూ ఓ కారణం కావొచ్చు. మోసం చేశావని కామెంట్స్ సెలబ్రిటీలైతే అవన్నీ బయటకు చెప్పుకోలేక భేదాభిప్రాయాల వల్ల విడిపోతున్నామని సింపుల్గా చెప్పేస్తారు. కానీ దాని వెనక ఉన్న బాధను లోలోపలే భరిస్తూ పైకి నవ్వుతూ కనిపిస్తారు. ఇది అర్థం చేసుకోలేని జనాలు.. ఎంతసేపూ నువ్వు మా వాడిని మోసం చేశావు.. నువ్వు మా హీరోయిన్ను మోసం చేశావంటూ వారిని నిందిస్తూనే ఉంటారు. హద్దులు దాటిన నెటిజన్ అలా సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ వారిని విమర్శించడం ఆపడం లేదు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సామ్ ఆరోగ్యం గురించి తెలుపుతూ ఓ పాడ్కాస్ట్ వీడియో షేర్ చేసింది. ఓ నెటిజన్ ఈ వీడియో గురించి మాట్లాడకుండా ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ హద్దులు దాటాడు. సామ్ స్ట్రాంగ్ కౌంటర్ అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావో చెప్పు అని కామెంట్ చేశాడు. ఇది చూసిన సామ్.. సారీ, ఇలాంటివి చేయడం మీకంత మంచిది కాకపోవచ్చు. మీకింకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా అని చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీతో రిప్లై ఇచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ నిన్ను కిందకు దిగజార్చాలనుకునే ట్రోలర్స్కు ఇలాగే ఇచ్చిపడేయ్.. ఎవరికీ అవకాశం ఇవ్వకు అని కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అఫీషియల్ ప్రకటన.. ఆ రోజు నుంచే భీమా స్ట్రీమింగ్ -
సమంతను మేనేజ్ చేయడం కష్టం.. ఆ సినిమాలో వద్దనుకున్నా కానీ.. : సుకుమార్
సమంత నటన గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఎలాంటి పాత్రలోనైనా ఆమె ఒదిగిపోతుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ పాత్ర ఏదైనా..వన్స్ సామ్ చేతికి వచ్చిదంటే..ఇక అందులో వేరే హీరోయిన్ని ఊహించుకోలేం. సామ్లోని మరో కోణాన్ని బయటకు తీసిన సినిమా ఏదైనా ఉంటే అది రంగస్థలం అనే చెప్పాలి. అంతకు ముందు సమంత అలాంటి పాత్రను పోషించలేదు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. రామ్ చరణ్ పాత్రతో పాటు సామ్ పాత్ర కూడా అందరికి గుర్తిండిపోతుంది. అయితే ఆ పాత్రకు మొదట సమంతను అనుకోలేదట దర్శకుడు సుకుమార్. చివరి నిమిషంలో ఆమెను తీసుకున్నాడట. కానీ షూటింగ్ సమయంలో సామ్ నటన చూసి సుక్కు ఆశ్చర్యపోయాడట. ఆ పాత్రకు సమంత తప్ప ఇంకెవరు న్యాయం చేయలేకపోయేవారని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్యూలో ఆ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఆ పాత్రను ఆయనను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు. కానీ సమంత పోషించిన లక్ష్మీ పాత్రను మాత్రం ఆమె కోసం రాయలేదు. ఒక కొత్త అమ్మాయిని పెట్టుకోవాలనుకున్నాం. సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు స్టార్స్ అయితే నేను సెట్లో మేనేజ్ చేయలేనేమో అనుకున్నా. కానీ సినిమా స్క్రిప్ట్ ప్రకారం మంచి ఆర్టిస్ట్, తెలుగు వచ్చిన హీరోయిన్ కావాలి. సమంత అయితే పల్లెటూరి అమ్మాయి పాత్రకు సరిపోతుందని భావించి ఆమెను తీసుకున్నాం. షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రతి సీన్లోనూ ఆమె పలికించిన హావభావాలు అద్భుతం. నేను సినిమాలు తీసినంత కాలం సమంతతో చేస్తూనే ఉంటా’ అని సుకుమార్ సమంతను పొగడ్తలో ముంచేశాడు. -
అక్కినేని హీరోకు సమంత విషెస్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. వరుణ్ ధావన్తో కలిసి ఇందులో కనిపించనుంది. తాజాగా సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ బర్త్ డే విషెస్ తెలిపింది సామ్. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. క్యూట్ పప్పీతో అఖిల్ ఉన్న ఫోటోను పంచుకుంది. హ్యాపీ బర్త్ డే అఖిల్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడిన సమంత.. విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. గతేడాది అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. -
డిటెక్టీవ్గా అక్కడ ఎంట్రీ ఇస్తున్న శృతిహాసన్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ సినీ కేరీర్ను చూస్తే నటిగా, సంగీత దర్శకురాలిగా, గాయనీగా, గీత రచయితగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 14 ఏళ్ల వయసులోనే తన తండ్రి కమలహాసన్ కథానాయకుడిగా నటించిన హేరామ్ చిత్రంలో బాల నటిగా రంగప్రవేశం చేసిన శృతిహాసన్ ఆ తరువాత లక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళంలో ఏళాం అరివు (7th సెన్స్) చిత్రంలో సూర్యకు జంటగా నటించి గుర్తింపు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్న శృతిహాసన్ ఇప్పుడు హాలీవుడ్ చిత్రంలో నటించే స్థాయికి ఎదిగారు. చైన్నె స్టోరీ అనే అంతర్జాతీయ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రంలో నటించే లక్కీఛాన్స్ను నటి సమంత పొందారు. అయితే ఆమె మైయోసిటీస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. దీంతో ఆ అదృష్టం శృతిహాసన్ను వరించింది. ఇది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాస్య నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో శృతిహాసన్ అనూ అనే లేడీ డిటెక్టీవ్గా నటిస్తున్నారు. కాగా ఈమె ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. హాలీవుడ్ చిత్రంలో నటించడం తన మనసుకు ఉత్సాహాన్నిస్తోందని ఆమె ఒక భేటీలో పేర్కొన్నారు. -
అల్లు అర్జున్కి జోడీగా..?
‘పుష్ప: ది రైజ్’ వంటి బ్లాక్బస్టర్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ‘పుష్ప: ది రూల్’ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అందులో భాగంగానే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో పడ్డారట అట్లీ. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్కి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో సమంత, త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత త్రిష పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్కి ఆమె జోడీగా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరి’ సినిమాలో విజయ్కి జోడీగా నటించారు సమంత. అలాగే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్తో జతకట్టారీ బ్యూటీ. అలాగే ‘పుష్ప: ది రైజ్’ మూవీలో ‘ఊ అంటావా...’ అంటూ ప్రత్యేక పాట చేశారు. తాజాగా వీరి జోడీ రిపీట్ కానుందనే వార్తలు నెట్టింట వైరల్గా మారాయి. మరి అల్లు అర్జున్ సరసన నటించేది సమంతా? త్రిషా? లేకుంటే ఇద్దరూ నటిస్తారా? ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక నటిస్తారా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఈ అక్టోబర్లో అల్లు అర్జున్–అట్లీ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
Samantha Fans Meet Photos: ఫ్యాన్స్ మీటింగ్లో సమంత సందడి (ఫొటోలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement