బుల్లితెరపై తొలిసారి రంగస్థలం మూవీ.. దాదాపు ఏడేళ్ల తర్వాత! | Ram Charan Rangasthalam Movie first Time Premiere on Tv | Sakshi
Sakshi News home page

Rangasthalam Movie: తొలిసారి బుల్లితెరపై రంగస్థలం.. దాదాపు ఏడేళ్ల తర్వాత!

Jul 28 2025 7:28 PM | Updated on Jul 28 2025 8:53 PM

Ram Charan Rangasthalam Movie first Time Premiere on Tv

మెగా హీరో రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం రంగస్థలం. ఈ మూవీ క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్‌గా మెప్పించిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా..ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు.

అయితే రంగస్థలం విడుదలై ఇప్పటికే ఏడేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగులో బుల్లితెరపై అలరించిన ఈ సినిమా.. ఇప్పటివరకు హిందీ మాత్రం రాలేదు. తాజాగా రంగస్థలం సినిమాను ఏడేళ్ల తర్వాత హిందీలో బుల్లితెరపై సందడి చేయనుంది. ఆగస్టు 24న రాత్రి 8 గంటలకు గోల్ట్‌ మైన్స్ ఛానెల్‌లో రంగస్థలం ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్‌ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ట్విటర్‌ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో బాలీవుడ్‌ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement