Sukumar
-
పుష్ప 2 సెలబ్రేషన్స్ కు దూరంగా పుష్ప టీమ్
-
'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్
పుష్ప సిరీస్ గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 భారీ కలెక్షన్స్ సాధించి ఎన్నో రికార్డ్స్ను దాటేసింది. పుష్ప రెండు భాగాలకు దేవిశ్రీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 3' (Pushpa 3) ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. పుష్ప చిత్రాలకు ఐటెమ్ సాంగ్స్ మంచి గుర్తింపును ఇచ్చాయి. ఇప్పుడు పుష్ప3లో ఐటెమ్ సాంగ్లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ తాజాగా చెప్పారు. (ఇదీ చదవండి: విజయ్తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)పుష్పలో సమంత 'ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా' అంటూ తన గ్లామర్తో దుమ్మురేపింది. పుష్ప2లో శ్రీలీల కిస్సిక్ సాంగ్లో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ ప్రత్యేకమైన సాంగ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ ఇలా పంచుకున్నారు. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని అయన అన్నారు. అయితే, ఈ సాంగ్కు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను మేకర్స్కు ముందే చెప్పానని ఆయన అన్నారు. దానికి ప్రధాన కారణం ఆమె చాలా బెటర్గా డ్యాన్స్ చేయడమేనని దేవిశ్రీ అన్నారు. ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్లు తన మ్యూజిక్లో వచ్చిన ఐటెమ్ సాంగ్స్లో మెప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో కాజల్ అగర్వాల్ (జనతా గ్యారేజ్), పూజా హెగ్డే( రంగస్థలం), సమంత (పుష్ప), శ్రీలీల (పుష్ప2)ఉన్నారన్నారు. వారందరూ కూడా కెరీర్లో మంచి పీక్లో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్స్లలో కనిపించారన్నారు.'పుష్ప 3' ఐటెమ్ సాంగ్లో జాన్వీ ఎంపిక ఎందుకంటే..?పుష్ప 3 సినిమాలో ఐటెమ్ సాంగ్లో కనిపించేది ఎవరని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఈ అంశంపై దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాట ఆధారంగా హీరోయిన్ను ఎంపిక చేస్తారని దేవి తెలిపారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్కు తాను అభిమానినని చెప్పిన ఆయన.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా మంచి డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్లో నటించిన ఆమె పాటలు చూశానని అన్నారు. ఆమె అమ్మగారు అయిన శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, పుష్ప-3 ఐటెమ్ సాంగ్కు జాన్వీ అయితే సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.‘పుష్ప 2’ ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. సుకుమార్ ఇచ్చిన మంచి స్క్రిప్టుకు అల్లు అర్జున్ అద్భుతంగా నటించడం వల్లే సినిమా భారీ హిట్ అయిందని ఆయన అన్నారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతామని తెలిపారు. -
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.టాలీవుడ్పై టార్గెట్తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన సుకుమార్ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ వ్యవహారంపై దిల్రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. -
డైరెక్టర్ సుకుమార్ ఇంట ఐటీ రైడ్స్
చిత్ర పరిశ్రమపై ఆదాయ పన్నుశాఖ అధికారులు గురి పెట్టారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన నిర్మాతలు, దర్శకుల ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా నేడు ఐటి సోదాలు జరుగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ గాయని సునీత భర్త రామ్కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే మొదలైన ఈ ప్రక్రియే రెండో రోజు కూడా కొనసాగుతుంది. గత రెండు నెలల్లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.దిల్ రాజ్ కూతురు ఇంట్లో సోదాలుదిల్ రాజ్ కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆమె సమక్షంలో డిజిటల్ లాకర్లను ఐటి అధికారులు ఓపెన్ చేశారు. మరికొద్ది సేపట్లో ఆమెకు సంబంధించిన బ్యాంకు లాకర్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి హన్సితా రెడ్డి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. -
కూతురి ఫస్ట్ మూవీ.. ఏడ్చేసిన సుకుమార్ భార్య (ఫోటోలు)
-
ఏ అమ్మాయి ఆ పని చేయదంటూ ఏడ్చేసిన తబిత.. ఓదార్చిన సుకుమార్
ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాంధీ తాత చెట్టు. ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ఎన్నో అవార్డులను అందుకుంది. గురువారం నాడు ఈ సినిమా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఎన్నోసార్లు ఏడ్చానంటూ మళ్లీ ఎమోషనల్సందర్భంగా తబిత మాట్లాడుతూ ఎమోషనలైంది. 'సుకృతి పాటలు పాడగలదు. కానీ తనకు యాక్టింగ్ రాదని చాలా భయపడ్డాను. డైరెక్టర్ మాత్రం సుకృతిని నమ్మి సినిమాలోకి తీసుకొచ్చింది. తనలోని టాలెంట్ను నేనెప్పుడూ గమనించలేదు. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్నిసార్లు చూశానో.. అన్నిసార్లు ఏడుస్తూనే ఉన్నాను. ఇక్కడ నా కూతురు గురించి చెప్పాలి.. ఈ సినిమా చేసేటప్పుడు తను 13వ వయసులోకి అడుగుపెట్టింది. గర్వంగా ఉంది: తబితఈ ఏజ్లో ఏ అమ్మాయి గుండు చేయించుకోవడానికి ఇష్టపడదు.. కానీ గాంధీ తాత చెట్టు సినిమా (Gandhi Tatha Chettu) కోసం తను గుండు గీయించుకుంది. ఆ విషయంలో తనను చూసి గర్విస్తున్నాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో సుకుమార్ స్టేజీపైకి వెళ్లి తనను ఓదార్చాడు. అనంతరం సుకృతి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. నా చుట్టూ ఉన్నవాళ్లు పుష్ప మూవీలో నటిస్తున్నావా? అని అడుగుతూ ఉండేవారు. పుష్ప మూవీలో యాక్ట్ చేస్తానన్నాసుకుమార్ కూతుర్ని కాబట్టే నన్ను సినిమాలో తీసుకున్నాడు అన్న పేరు నాకిష్టం లేక నేను చేయలేదని చెప్పాను. కానీ అసలు నిజమేంటో తెలుసా? పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో నేను యాక్ట్ చేస్తానని నాన్నను అడిగాను. ముందు ఆడిషన్ చేయు.. తర్వాత చూద్దామన్నాడు. అందుకే చేయలేదు. అని చెప్పుకొచ్చింది.గాంధీ తాత చెట్టుగాంధీ తాత చెట్టు సినిమా విషయానికి వస్తే.. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ మూవీ జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది.చదవండి: సైఫ్ అలీ ఖాన్పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ -
ప్రభాస్ తో సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్
-
పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్
నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బాహుబలి-2 రికార్డ్ను అధిగమించిన పుష్ప-2 మరో రెండు వేల కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో అమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దంగల్ వసూళ్లపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే దంగల్ రికార్డ్ను క్రాస్ చేయనుంది.మేకర్స్ బిగ్ ప్లాన్..పుష్ప-2 ఫ్యాన్స్కు ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. త్వరలోనే రీ లోడెడ్ వర్షన్ థియేటర్లలో విడుదల ప్రకటించారు. ఈనెల 17 నుంచి పుష్ప రీ లోడెడ్ థియేటర్లలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ ప్రోమో మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 25 సెకన్ల పాటు ఉండే రీ లోడ్ వర్షన్ గ్లింప్స్ ప్రోమో రిలీజ్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. దంగల్పైనే గురి..'పుష్ప 2' (Pushpa 2 The Rule) ఇప్పటికే రూ.1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్లో రెండో స్థానంలో ఉంది. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి.అయితే ఇప్పటికే పుష్ప2 (Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. మరో రూ. 200 కోట్ల కలెక్షన్స్ వస్తే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం పుష్ప2 నిలుస్తుంది. ఇప్పటి వరకు దంగల్ రికార్డ్ను ఏ మూవీ అధిగమించలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డ్ను బద్దలు కొట్టే ఛాన్స్ పుష్ప-2 మాత్రమే ఉంది.హిందీలో భారీ రికార్డులు..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. జనవరి 17 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో అయితే గతంలో ఎప్పుడు లేని రికార్డులు నెలకొల్పింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో పాన్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది.ప్రీ రిలీజ్ బిజినెస్లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్టైమ్ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. #Pushpa2Reloaded storms into theatres on JAN 17th! 🔥Here’s the GLIMPSE to ignite your excitement! ❤️🔥Telugu - https://t.co/5N7M2xgZTU#Pushpa2 #WildFirePushpa #Pushpa2TheRule pic.twitter.com/4M4KcZYmL2— Mythri Movie Makers (@MythriOfficial) January 12, 2025 -
చిరంజీవితో తొలి సినిమా.. సుకుమార్ బర్త్డే విశేషాలు (ఫోటోలు)
-
సుకుమార్ కూతురి చిత్రం.. ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు
పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి(Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi Tatha Chettu) ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్ను అందుకుంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను(Gandhi Tatha Chettu Trailer) విడుదల చేశారు మేకర్స్. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా గాంధీతాత చెట్టు ట్రైలర్ రిలీజ్ చేశారు. గాంధీ తాత చెట్టు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా అనిపిస్తోంది. సుకృతికి, అలాగే ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు అంటూ ప్రిన్స్ మహేష్బాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.తాజాగా రిలీజైన గాంధీ తాత చెట్టు ట్రైలర్ చూస్తే ఓ బాలిక ఇచ్చిన మాట కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకున్న కథగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్దాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. గాంధీగా సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఈ సినిమాలో నటించారు. ట్రైలర్ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా సుకుమార్ కూతురి నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేసిన సూపర్స్టార్ మహేష్బాబుకు నిర్మాతలు, దర్శకురాలు, చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.కాగా.. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ 'ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ..ఇలా ఓ నెగెటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి.ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకముంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ ముఖ్య పాత్రలు పోషించారు. -
పుష్ప 'జాతర'తో పూనకాలు.. ఈ వీడియోలో చూసేయండి
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ తన బ్రాండ్ ఏంటో చూపిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప2 నాలుగు వారాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటివరకూ రూ.1799 కోట్లకు (గ్రాస్) పైగా ఈ చిత్రం రాబట్టిందని అధికారికంగా ప్రకటించారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి ఎంతో బలాన్ని చేకూర్చిన 'గంగమ్మతల్లి జాతర' సాంగ్ వీడియోను మేకర్స్ యూబ్యూబ్లో విడుదల చేశారు.పుష్ప2 చిత్రంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ ప్రధాన హైలైట్గా నిలిచింది. ఈ సీన్ ప్రారంభంలో అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది. జాతర ఎపిసోడ్లో వచ్చే సాంగ్లో ఆయన హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుతాయి. దీంతో అందరూ ఆ పాటకు అభిమానులు అయిపోయారు. ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించగా మహాలింగం ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అదరిపోయే రేంజ్లో ఉంటుంది. ఇలా అన్ని అంశాల్లో మెప్పించిన ఈ సాంగ్ వీడియో వర్షన్ను తాజాగా విడుదల చేశారు. -
సుకుమార్ నేషనల్ అయితే.. కూతురు ఇంటర్నేషనల్
పుష్ప సినిమాతో దర్శకుడు సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా ఇంటర్నేషనల్ వేదికలపై సత్తా చాటుతుంది. ఆమె ప్రధాన పాత్రధారిగా నటించిన 'గాంధీ తాత చెట్టు' ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్ను అందుకుంది. ఇప్పుడు తెలుగులో జనవరి 24న విడుదల కానుంది.పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య, శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం కూడా పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.ఈ సినిమా గురించి దర్శకురాలు మాట్లాడుతూ.. 'గాంధీజీ సిద్ధాంతాల్ని పాటిస్తూ.. ఓ పదమూడేళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ చిత్రంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేటి తరం తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలకి ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని దర్శకురాలు కోరారు. సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. -
సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్
'పుష్ప 2' (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందడం, పిల్లాడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరడం హీరో అల్లు అర్జున్ని(Allu Arjun) ఎలాంటి ఇబ్బందుల్లో పడేసిందో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్పై పరోక్షంగా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా పోలీసులు.. మరోసారి బన్నీని విచారణకు కూడా పిలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)ఈ వివాదం అల్లు అర్జున్పై ఎంత ప్రభావం చూపిందో తెలీదు గానీ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) మాత్రం మానసికంగా చాలా కుంగిపోయినట్లు అనిపిస్తున్నాడు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం జరిగిన సక్సెస్ మీట్లో మహిళ మృతి విషయాన్ని గుర్తుతెచ్చుకుని బాధపడ్డాడు. ఇప్పుడు ఏకంగా సినిమానే వదిలేస్తానని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యూఎస్లో 'గేమ్ ఛేంజర్' (Game Changer) ఈవెంట్ సందర్భంగా సుక్కు ఈ కామెంట్స్ చేశాడు.యూఎస్ ఈవెంట్లో 'గేమ్ ఛేంజర్' నుంచి 'ధోప్' లిరిక్స్తో సాగే పాట రిలీజ్ చేశారు. దీని గురించి మాట్లాడుతూ.. సుకుమార్ గారు ఒకవేళ మీరు 'ధోప్' అని వదిలేయాలి అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు? అని యాంకర్ సుమ అడగ్గా, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాకయ్యాడు. అలా చేయరులే అని సైగ చేసి చూపించాడు. బహుశా ప్రస్తుత పరిస్థితుల వల్ల సుకుమార్ బాగా డిస్ట్రబ్ అయినట్లు ఉంది. బహుశా అందుకే అలా అన్నాడేమో?(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?)Papam ra SUKKU 😢Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK— Negan (@Negan_000) December 23, 2024 -
డల్లాస్లో ఘనంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
'గేమ్ ఛేంజర్' చూసేసిన సుకుమార్.. ఫస్ట్ రివ్యూ
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇదివరకే రిలీజైన పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అమెరికాలోని డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు సుకుమార్ కూడా వెళ్లాడు. ఈ మూవీ ఇప్పటికే చూసేశానని చెప్పి.. ఎలా ఉందో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ నుంచి 'దోప్' సాంగ్ రిలీజ్)'నేను, చిరంజీవి గారు ఆల్రెడీ మూవీ చూశాం. ఫస్టాప్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ అయితే బ్లాక్ బస్టర్. ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. క్లైమాక్స్లో చరణ్, అవార్డ్ విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు' అని సుకుమార్ చెప్పుకొచ్చాడు.సుకుమార్ చెప్పిన దానిబట్టి చూస్తే సినిమా అదిరిపోయిందని తెలుస్తోంది. మరి ప్రేక్షకులు తీర్పు ఏంటనేది తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు. కియారా అడ్వాణీ హీరోయిన్. సునీల్, శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా) -
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం.. వందేళ్ల చరిత్రను తిరగరాశాడు!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 తొలి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. రూ.294 కోట్లతో మొదలైన పుష్ప రాజ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోనూ అత్యధిక వసూళ్లు తొలి ఇండియన్ మూవీగా ఘనత సాధించింది. అటు యూఎస్లోనూ తిరుగులేని కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పుష్పకు సీక్వెల్గా ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. #Pushpa2 creates a new RECORD in 100 Years of BOLLYWOOD HISTORY 🔥🔥🔥#Pushpa2TheRule becomes the BIGGEST HINDI NETT of ALL TIME in just 15 days 💥💥💥 #HargizJhukegaNahin pic.twitter.com/uLmeZ0yoYJ— Pushpa (@PushpaMovie) December 20, 2024 The NUMBER ONE BLOCKBUSTER in the HISTORY OF HINDI CINEMA 🔥🔥#Pushpa2TheRule collects 632.50 CRORES NETT in Hindi - THE HIGHEST EVER FOR ANY HINDI FILM ❤🔥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa pic.twitter.com/LWJa7W2JxT— Pushpa (@PushpaMovie) December 20, 2024 -
పుష్ప రాజ్ వసూళ్ల సునామీ.. రెండు వారాల్లోనే ఆ మార్క్ దాటేశాడు!
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ చేరుకున్న పుష్ప-2 కలెక్షన్ల మాస్ జాతర ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నార్త్లో ఏకంగా రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాడు పుష్పరాజ్.ఇప్పటికీ పుష్ప-2 రిలీజై రెండు వారాలు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ అధికారికంగా పుష్ప-2 వసూళ్లను రివీల్ చేశారు. ఈ మూవీ విడుదలైన 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల మార్క్ను దాటేసింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత వేగంగా 1500 కోట్ల వసూళ్ల సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించింది. COMMERCIAL CINEMA REDEFINED 🔥HISTORY MADE AT THE BOX OFFICE 💥💥#Pushpa2TheRule collects 1508 CRORES GROSS WORLDWIDE - the fastest Indian Film to reach the mark ❤🔥#Pushpa2HitsFastest1500crBook your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa… pic.twitter.com/vk0qnXLOt0— Pushpa (@PushpaMovie) December 19, 2024 The HISTORIC RULE at the box office continues 💥💥#Pushpa2TheRule becomes the FASTEST INDIAN FILM to Gross 1500+ CRORES WORLDWIDE in 14 Days ❤🔥1508CR & counting 🔥#Pushpa2HitsFastest1500crBook your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon… pic.twitter.com/AQueWAv9Gp— Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2024 -
శ్రీతేజ్ను పరామర్శించిన పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సుకుమార్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మా తరఫున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య తబిత బాలుడికి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. డిసెంబర్ 9వ తేదీన శ్రీతేజ్ తండ్రికి రూ.5 లక్షల సాయం చేశారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే ముందురోజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రదర్శించారు మేకర్స్. డిసెంబర్ 4న సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కు వెళ్లారు. అదే సమయంలో అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అల్లు అర్జున్పై కేసు..సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా బన్నీని అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయమే జైలు నుంచి విడుదలయ్యారు. -
సెట్స్ పైకి రంగస్థలం సీక్వెల్
-
'పుష్ప' రాజ్ యూనిక్ సాంగ్ విడుదల
అల్లు అర్జున్- సుకుమార్ కాంబో హిట్ సినిమా ‘పుష్ప 2 ది రూల్’. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి బన్నీ యూనిక్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫీలింగ్స్ వీడియో సాంగ్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో సాంగ్ను విడుదల చేయడంతో ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.'పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ పలు భాషల్లో 250+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఇదే సాంగ్ వీడియో రూపంలో తాజాగా విడుదలైంది. తెలుగులో నకాశ్ అజీజ్, దీపక్ బ్లూ ఆలపించగా దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ను అందించారు. -
ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు)
-
అల్లు అర్జున్ని హత్తుకుని సుకుమార్ ఎమోషనల్
జైలు నుంచి బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్.. ఇంటికొచ్చేశాడు. మీడియాతో మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఈ క్రమంలోనే బన్నీని కలిసేందుకు సినీ ప్రముఖులు అతడి ఇంటికి వస్తున్నారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ దర్శకుడు సుకుమార్ మాత్రం బన్నీని హత్తుకుని ఎమోషనల్ అయిపోయాడు.(ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)ఇంటికొచ్చి బన్నీని కలిసిన వాళ్లలో చిరంజీవి భార్య సురేఖతో పాటు నిర్మాతలు నవీన్ యెర్నేని, దిల్ రాజు ఉన్నారు. అలానే హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, నాగచైతన్య, శ్రీకాంత్, సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు, యంగ్ డైరెక్టర్స్ హరీశ్ శంకర్, వశిష్ఠ తదితరులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.రీసెంట్గా 'పుష్ప 2'తో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ మాత్రం బన్నీని ఇంట్లో కలిసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. కూర్చుని వీళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇకపోతే సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో తొలుత బన్నీని అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు.. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. (ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)#Sukumar sir " We Love You " ♥️🥺@alluarjun #WeStandWithAlluArjun pic.twitter.com/aq4S8cvitj— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 14, 2024 -
సుకుమార్ పూర్తి పేరు చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2'. ఈ మూవీ విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంది. ఈ మూవీ ఇంతటి విజయానికి కారణమైన అందరికీ ధన్యవాదాలు చెబుతూ థాంక్యూ ఇండియా పేరుతో ఢిల్లీలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ఎగ్జిబిటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ మొదటిసారి దర్శకుడు సుకుమార్ పూర్తి పేరును రివీల్ చేశారు.'పుష్పపై ఇది లవ్ కాదు.. వైల్డ్ లవ్. పుష్ప2 విజయం క్రెడిట్ అంతా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ను రూల్ చేస్తోన్న మా దర్శకుడు 'బండిరెడ్డి సుకుమార్ రెడ్డి'కి చెందుతుంది. ఆయన విజన్ నుంచే ఈ సినిమా పుట్టింది. ఈ చిత్రం కోసం ఆయన హార్డ్ వర్క్ చాలా ఎక్కువ ఉంది. ఈ విజయం క్రెడిట్ మొత్తం నీ సొంతమే డార్లింగ్' అంటూ సుకుమార్పై బన్నీ ప్రశంసలు కురిపించారు.సుకుమార్ పేరుతో నెటిజన్లకు పరీక్ష పెట్టిన బన్నీటాలీవుడ్లో ఇప్పటి వరకు సుకుమార్గా అందరికి ఆయన పరిచయమే.. అయితే, మొదటిసారి ఆయన్ను 'బండిరెడ్డి సుకుమార్ రెడ్డి' అని అల్లు అర్జున్ కామెంట్ చేయడంతో నెటిజన్లు అందరూ కాస్త తికమక అయ్యారు. వాస్తవంగా ఆయన పేరు సుకుమార్ బండిరెడ్డి అని నెట్టింట కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆయన తండ్రి పేరు తిరుపతి రావు నాయుడు అని ఆయన వికిపీడియాలో కూడా ఉంది. బన్నీ చేసిన కామెంట్తో ఆయన ఏ సామాజిక వర్గానికి చెందుతారోనని గూగుల్లో నెటజన్లు తెగ వెతుకుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో సుకుమార్ జన్మించారు. దర్శకుడు కాక ముందు గణితం అధ్యాపకుడిగా తన కెరీర్ను ప్రారంభించారు. 2004లో ఆయన మొదటి చిత్రం 'ఆర్య' సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ను స్టార్గా నిలబెట్టింది. -
'పుష్ప2' రికార్డ్స్పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప' ట్రెండ్ కొనసాగుతుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎక్కడ చూసిన భారీ వసూళ్లతో అనేక రికార్డ్స్ దాటుకుని దూసుకెళ్తున్న ఈ సినిమా విడుదలైన 6 రోజుల్లోనే రూ.1002 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విడుదలైన ఆరు రోజుల్లోనే అత్యంత వేగంగా వెయ్యి కోట్ల మైలురాయిని అందుకున్న చిత్రంగా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్లో కూడా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 375 కోట్లు వసూలు చేసింది. అక్కడ ఇంత వేగంగా ఈస్థాయి వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తాజాగా థ్యాంక్యూ ఇండియా పేరుతో ఢిల్లీలో ఒక మీడియా సమావేశాన్ని పుష్ప టీమ్ ఏర్పాటు చేసింది. అందులో చిత్ర నిర్మాతలతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ పాల్గొన్నారు. భారీ కలెక్షన్స్, పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్స్పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు.'రికార్డ్స్ అనేవి శాశ్వితంగా ఉండిపోవు. బహుశా వచ్చే సమ్మర్లోనే పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్స్ శ్మాస్ కావచ్చు కూడా.. నంబర్స్ అనేవి ఎప్పటికీ శాశ్వంతగా ఉండిపోవని నేను నమ్ముతాను. రూ. 1000 కోట్లు అనేది అభిమానుల ప్రేమకు ప్రతిబింబం. ఈ నంబర్స్ తాత్కాలికంగా ఉంటాయి. కానీ, వాళ్ల ప్రేమ మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. రికార్డులు అనేవి ప్రతిసారీ బద్దలవుతూనే ఉండాలి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతూనే ఉండాలని నేను ఎక్కువగా నమ్ముతా. మరో మూడు నెలలపాటు ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తాను. వచ్చే వేసవిలోపు ఈ రికార్డులన్నీ బద్దలు కావాలని కోరుకుంటున్నా. తెలుగు, తమిళ్, కన్నడ,హిందీ పరిశ్రమ ఏదైనా కావచ్చు వచ్చే పుష్ప రికార్డ్స్ను మరో సినిమా దాటాలని నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో పురోగతి అనేది ఉండాలని ఆశిస్తున్నాను.'బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ తర్వాత ఇంతటి భారీ వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్లో కొనసాగుతున్న ఈ చిత్రం సుమారు రూ. 1500 కోట్ల కలెక్షన్స్ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.#AlluArjun about 1000cr in todays #Pushpa2TheRule event:"The 1000cr number is just reflection of Love. Number is temporary & but love is forever. I want these numbers to be broken at least by next summer irrespective of any Industry. That is progression" pic.twitter.com/NjUnwlciBA— AmuthaBharathi (@CinemaWithAB) December 12, 2024 -
ఆస్కార్ కు ట్రై చేద్దాం అంటున్న అల్లు అర్జున్