

సమాజ సేవ చేసే అతికొద్ది మంది నటీనటుల్లో సమంత ఒకరు. ప్రత్యూష ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఆమె ఎందరికో చేయూతను అందిస్తున్నారు.

ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను ఆదుకుంటున్నారు. ప్రముఖ ఆస్పత్రులతో కలిసి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారుకుల ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.

అవకాశం ఉన్నప్పుడల్లా వారిని నేరుగా కలుస్తూ.. సంతోషాన్ని అందిస్తున్నారు.

తాజాగా సమంత ‘ప్రత్యూష’ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేద పిల్లలతో ఈ దీపావళి పండగను సెలెబ్రేట్ చేసుకున్నారు.

దీపావళి సెలెబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలలో తన ఇన్స్టాలో షేర్ చేస్తూ.. నిన్నటి సాయంత్రం చాలా ఆనందంగా గడిచిందని రాసుకొచ్చింది.







