-
గన్నవరంలో టీడీపీ గలాటా
సాక్షి, మచిలీపట్నం/జగ్గయ్యపేట అర్బన్/ఉంగటూరు: కృష్ణాజిల్లాలో టీడీపీ నాయకులు గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీపై దాడులకు పాల్పడ్డారు. గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు, వైఎస్సార్సీపీ కేడర్ను రెచ్చగొట్టడంతో తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న వల్లభనేని వంశీ అక్కడికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. ⇒ ఉంగుటూరు మండలం తేలప్రోలు జెడ్పీహైస్కూల్లో ఉన్న 271, 273, 274, 275 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు పరీశీలించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావు తన అనుచరులతో ర్యాలీగా చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చిన ఆయన వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టేలా వల్లభనేని వంశీని, సీఎం జగన్ను అసభ్యపదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు చేరడంతో దాడికి పాల్పడ్డారు.వల్లభనేని వంశీమోహన్ అక్కడకు చేరుకుని కవ్వింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి రవికుమార్, ప్రత్తిపాటి జీవన్కుమార్, భీమవరపు యతేంద్ర రామకృష్ణ, తదితరులు తీవ్రంగా గాయపడ్డాడు. వారంతా అవుటుపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.⇒ అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలంకలో వైఎస్సార్సీపీ నాయకుడైన మండల బీసీ సెల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు, ఆయన కుమార్తె కేసాని తేజశ్రీలపై జనసేన నాయకులు దాడికి దిగారు. తండ్రిని కొడుతుండగా కుమార్తె తేజశ్రీ అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆమెపై దాడి చేసి కాలు విరగ్గొట్టారు.కౌన్సిలర్ భర్తపై టీడీపీ గూండాల దాడిఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో సోమవారం పోలింగ్ బూత్లోకి వెళ్లిన 16వ వార్డు కౌన్సిలర్ తన్నీరు నాగమణి భర్త, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి తన్నీరు నాగేంద్రపై స్థానిక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగేంద్ర ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక చెరువుబజారులోని బీసీ కమ్యూనిటీ భవన్లో ఏర్పాటుచేసిన 33వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఒక మానసిక దివ్యాంగుడికి సహాయంగా అతని కుటుంబ సభ్యుని అనుమతించాలని తన్నీరు నాగేంద్ర ప్రిసైడింగ్ అధికారి అనుమతి తీసుకునేందుకు బూత్లోకి వెళ్లారు.అదే సమయంలో స్థానిక టీడీపీ వ్యక్తులు నడిగొండ్ల సతీష్, తాళ్లూరి సోమయ్య, అతని కుమారుడు తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఉత్తపళ్ల వెంకటేశ్వర్లు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు అరగంట ముందు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సోదరుడు శ్రీరాం చినబాబు అదే బూత్ వద్దకు వచ్చి టీడీపీ నాయకులతో మంతనాలు జరిపాడనీ, ఆయన సూచనతోనే ఈ దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు సామినేని రవిచంద్, ఉదయభాను కుమారుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, ఉదయభాను కుమార్తె పద్మ ప్రియాంక, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్(చిన్నా), పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్(బాజి) ఇరువర్గాలను విడదీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఎమ్మెల్యే ఉదయభాను సోదరి చాముండేశ్వరి(బేబి)ని కూడ దుండగులు తోసేయడంతో ఆమె కింద పడి కాలుకు ఫ్రాక్చర్ అయింది. -
మోపిదేవిలంకలో బాలశౌరి తనయుడి వీరంగం
మోపిదేవి (అవనిగడ్డ): ఓటమి భయంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలంకలో సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు రె చ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా కిందపడేసి పిడిగుద్దులు గుద్దడమేగాక కాళ్లతో తన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్తో వచ్చిన జనసేన నాయకులు కూడా ఈ దాడులకు పాల్పడ్డారు.మోపిదేవిలంకలో ఏజెంట్లు టీ అడగడంతో స్థానికంగా ఉండే యార్లగడ్డ అంకరాజుతో తెప్పించారు. లోపలికి వెళుతున్న అంకరాజుపై జనసేన ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్తో వ చ్చిన జనసేన నాయకులు, కొందరు టీడీపీ నేతలు దాడిచేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ బీసీ విభాగం మోపిదేవి మండల కన్వినర్ రాజులపాటి నాగేశ్వరరావు మీద జనసేన నేతలు బల్లా సీతారాంప్రసాద్, బల్లా మునికుమారి, బల్లా దినేష్, శ్రీనివాసరావు, పవన్ తదితరులు దాడిచేసి కొట్టారు. నాగేశ్వరరావు కుమార్తె కేశాని తేజశ్రీని కిందపడేసి పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తన్నారు. అడ్డువ చ్చిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావుతో పాటు రాజులపాటి సుజాత, నరసారావు, వినయ్బాబు, శివనాగరాజులను తీవ్రంగా కొట్టారు.బాధిత వైఎస్సార్సీపీ నాయకులు మోపిదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, అవనిగడ్డ వైద్యశాలలో చేరారు. వీరికంటే ముందే.. దాడిచేసిన టీడీపీ నాయకులు ఆస్పత్రిలో చేరారు. తరువాత వైఎస్సార్సీపీ నాయకులు హాస్పటల్లో చేరగా అదే వార్డులో ఇరువర్గాలను ఉంచారు. టీడీపీ నాయకురాలు బల్లా మునికుమారిని పరామర్శించేందుకు వ చ్చిన ఆమె సోదరులు అక్కడే చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి యత్నించారు. ఎస్ఐ రమేష్ ఇరువర్గాలకు సర్దిచెప్పారు.అనంతరం ఇరువర్గాలను మచిలీపట్నం ఆస్పత్రికి పంపారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు వైద్యశాలకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులను పరామర్శించారు. ఈ దాడుల్ని ఎమ్మెల్యే సింహాద్రి తీవ్రంగా ఖండించారు. -
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
సాక్షి, కృష్ణా జిల్లా: పోరంకిలో టీడీపీ అరాచకం సృష్టించింది. టీడీపీ గూండాలు దాదాగిరికి పాల్పడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు గుర్తించాయి. ప్రశ్నించినందుకు జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రాముపై కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నెల్లూరు: ఓటమి భయంతో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన అభ్యర్థి మేరీగా మురళిపై దాడికి యత్నించారు. సంగం మండలం చెన్నవరప్పాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఢిల్లీ బాబు గాయపడ్డారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు, ముసునూరులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. -
ఎన్నికల బందోబస్తుకు సంసిద్ధం
●సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి ●పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ●జిల్లా ఎస్పీ అస్మి కోనేరుసెంటర్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల బందోబస్తుకు పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. అలాగే శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే అటువంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని శనివారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయన చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలో ఇప్పటికే ప్రత్యేక బలగాలు విధుల్లో ఉన్నాయన్నారు. జిల్లా పోలీసులతో పాటు మిలటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఎక్స్ సర్వీస్మెన్ల సేవలను వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 2,611 కేసులు నమోదు చేసి, 10,026 మందిని బైండోవర్ చేశామన్నారు. 51 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేశామని తెలిపారు. జిల్లాలో 1686 పోలింగ్ కేంద్రాలు ఉండగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి నగదు, మద్యం, ఇతర సామగ్రి అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. జిల్లాలో 2,172 మంది సిబ్బందిలో 2,064 మంది పోలీసులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎస్పీ తెలిపారు. 160 లైసెన్స్లు కలిగిన వ్యక్తుల నుంచి 133 ఆయుధాలను డిపాజిట్ చేశామని, మిగిలిన 27 బ్యాంకులు, ఇతర సెక్యూరిటీ ప్రాంతాల్లో ఉంచామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘనపై 18 కేసులు నమోదు చేయటంతో పాటు రూ.7,23,17,075లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న రూ.94,30,467ల విలువైన మద్యాన్ని పట్టుకున్నామన్నారు. 464 కేజీల గంజాయితో పాటు రూ.1,69,93,843ల విలువ కలిగిన ఆభరణాలు, రూ.29,82,135ల ఖరీదు చేసే వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తంగా 1,605 కేసులకు సంబంధించి రూ..10,56,90,810లను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఓటు హక్కును జిల్లా ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ధైర్యంగా వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. -
పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన
పామర్రు: సాధారణ ఎన్నికల సందర్భంగా 77–పామర్రు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం రాత్రి పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆర్వో బి.శ్రీదేవి తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఆదివారం ఉదయం ఆయా అసెంబ్లీ నియోజవర్గాలకు కేటాయించిన పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వచ్చి పోలింగ్ మెటీరియల్ తీసుకుని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తారని చెప్పారు. పామర్రు నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో రూట్లు, పోలింగ్ కేంద్రాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ సకాలంలో జరగాలని, పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, ఆహారం, కనీస వసతులు కల్పించాలని రిటర్నింగ్ అధికారికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో పామర్రు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బూసి శ్రీదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
2,400 మద్యం బాటిళ్ల స్వాధీనం
వెల్లంకి(వీరులపాడు): మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. మండలంలోని వెల్లంకి గ్రామ సమీపంలోని ఎర్రగుట్ట వద్ద అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లను శనివారం ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం రావటంతో సిబ్బందితో వెళ్లి దాడి చేశామన్నారు. మొత్తం రూ.3.50 లక్షల విలువ చేసే 50 కేసుల్లో 2,400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నాయని అక్కడ ఎవరూ లేకపోవటంతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. దాడిలో ఎస్ఐ నాగేంద్రకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన మద్యం టీడీపీ నాయకులకు చెందినదిగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కావటంతో ఓటర్లకు పంచేందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం కురుమద్దాలి(పామర్రు): విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై కురుమద్దాలి గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి బల్లిపర్రు గ్రామానికి చెందిన కలపాల చంద్(24), బి.నాగేశ్వరరావులు తమ బైక్పై కురుమద్దాలి గ్రామానికి జాతీయ రహదారిపై వెళ్తున్నారు. ఈ క్రమంలో కురుమద్దాలి వద్దకు రాగానే బైక్ లారీని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో చంద్ రోడ్డుపై పడిపోవడంతో బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి నాగేశ్వరరావుకు గాయాలు అవ్వడంతో మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. డివైడర్ను ఢీ కొన్న కారు.. వ్యక్తి మృతి గౌరవరం(జగ్గయ్యపేట): డివైడర్ను కారు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గౌరవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన రెడ్డి సాయిప్రసాద్(58) తన ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి ఏలూరు ఫంక్షన్కు వెళ్లారు. తిరిగి వస్తుండగా గ్రామంలోని జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా కారు పంచర్ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న ప్రసాద్ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. చిల్లకల్లు ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణాలో పారిశ్రామిక విప్లవం
సాక్షి, మచిలీపట్నం: ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి. ఇందుకు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు నెలకొల్పాలి. ప్రధాన జీవనాధారం వ్యవసాయమే అయినా రోజురోజుకు సమాజంలో వస్తున్న మార్పు కారణంగా ఏదైనా కొలువులో స్థిరపడాలనేది నేటి తరం యువత కల. అది ప్రభుత్వ ఉద్యోగమైనా.. ప్రైవేటుది అయినా సరే. అయితే అత్యధికంగా పోటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగం కంటే పారిశ్రామిక రంగంలో రాణించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. స్మాల్ స్కేల్, మైక్రో తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ఐదేళ్లలో జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు తీసింది. ప్రభుత్వం అందించే సహాయంతో ముందుకు వచ్చిన ఔత్సాహికులు తమ ఆలోచనా విధానాలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. చిన్న తరహా పరిశ్రమలే అయినా తమతో పాటు మరి కొందరికి ఉపాధి అవకాశాలు కల్పించి ఆసరాగా ఉంటున్నారు. ఫలితంగా జిల్లాలో వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. గుడివాడలో అత్యధికంగా... జిల్లాలోని 25 మండలాల్లోనూ చిన్న పరిశ్రమలు కొత్తగా స్థాపించారు. నాలుగున్నరేళ్లలో ఒక్కో మండలంలో కనీసం 40కి పైగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. ఇందులో అత్యధికంగా గుడివాడ మండలంలో రూ.74.59 కోట్లతో 776 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయగా 2,071 మందికి ఉపాధి అవకాశాలు వరించాయి. అయితే మచిలీపట్నంలో రూ.93.36 కోట్లతో ఏర్పాటు చేసిన 681 ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధికంగా 3,071 మందికి ఉపాధి లభించడం గమనార్హం. సింగిల్ డెస్క్ విధానంతో వేగంగా ప్రక్రియ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అందుకు ఐదారు శాఖల అనుమతులు అవసరం. ముఖ్యంగా పరిశ్రమల శాఖతో పాటు లేబర్, స్థానిక సంస్థలు, విద్యుత్, జీఎస్టీ లాంటి అనుమతులను జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు ఆయా శాఖల అధికారులతో సంప్రదించి అనుమతులు ఇప్పించేందుకు అన్ని విధాలా సహకరిస్తారు. దీంతో ఔత్సాహికుడు అన్ని శాఖలకు తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి రాయితీ విడుదలపై చర్చిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈల వివరాలు: మండలం ఏర్పడిన ఉపాధి పెట్టుబడి ఎంఎస్ఎంఈల సంఖ్య పొందిన వారు (రూ. లక్షల్లో)అవనిగడ్డ 95 338 1278 బంటుమిల్లి 110 313 1429.45 బాపులపాడు 199 2968 7682.61 చల్లపల్లి 203 568 2256 గన్నవరం 370 1934 7302.8 ఘంటసాల 44 104 5359 గుడివాడ 776 2071 7459.29 గుడ్లవల్లేరు 437 739 2496.7 గూడూరు 275 894 2906 కంకిపాడు 121 372 1394 కోడూరు 98 323 1771.5 కృత్తివెన్ను 202 268 1028.5 మచిలీపట్నం 681 3071 9336.02 మోపిదేవి 57 165 417.9 మొవ్వ 102 291 826.8 నాగాయలంక 150 310 1435.5 నందివాడ 187 304 1435.3 పామర్రు 145 626 1491.807 పమిడిముక్కల 88 237 892 పెడన 152 382 1227.96 పెదపారుపూడి 88 215 553.813 పెనమలూరు 463 2116 7666.06 తోట్లవల్లూరు 140 351 1372 ఉంగుటూరు 79 143 478.5 ఉయ్యూరు 218 668 1700.49 వైఎస్సార్ తాడిగడప 99 164 1075 మొత్తం 5,579 19,935 722,73 కోట్లు చిన్న తరహా పరిశ్రమలకు ఊతం ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యం సర్కారు సాయంతో ముందుకు వచ్చిన ఔత్సాహికులు కృష్ణాజిల్లాలో నాలుగున్నరేళ్లలో 5,579 పరిశ్రమల ఏర్పాటు రూ.722.73 కోట్ల పెట్టుబడులు 19,935 మందికి ఉద్యోగ అవకాశాలు నాలుగేళ్లలో రూ.772 కోట్లతో 5,579 ఎంఎస్ఎంఈలు కృష్ణాజిల్లాలో సహజ వనరులు పుష్కలంగా ఉండడంతో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలు దక్కింది. ప్రభుత్వ సహకారంతో ఔత్సాహికులు తమ ఆలోచన, అభిరుచులకు తగ్గట్లు రూ.772.73కోట్లతో 5,579 ఎంఎస్ఎంఈలు (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్) ఏర్పాటు చేసుకున్నారు. దీని వల్ల 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. మరోవైపు గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో నాలుగు లార్జ్, అండ్ మీడియం పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.6 కోట్లు పెట్టుబడి పెట్టగా వీటి ద్వారా 2,300 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. రాయితీలతో చేయూత చిన్న, మైక్రో పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలతో ప్రభుత్వం అండగా ఉంటోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఔత్సాహికులకు ఉత్పత్తి పరిశ్రమ అయితే రూ.50 లక్షల వరకు రుణం, సర్వీసింగ్ సెక్టారులో రూ.20లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జగనన్న బడుగు వికాసం కింద ఉత్పత్తి సంస్థలకు రూ.1.20 కోట్ల వరకు సబ్సిడీ కల్పిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీలోకి యాదవ మహాసభ నేత ‘పచ్చిపాల’
జగ్గయ్యపేటఅర్బన్: అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పచ్చిపాల నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయన శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమక్షంలో చేరారు. ఉదయభాను ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పచ్చిపాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానాలు నచ్చి తాను పార్టీలో చేరినట్లు తెలిపారు. పెనుగంచిప్రోలు దేవస్థానం చైర్మన్ పదవి, పేట మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కూడా యాదవ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉదయభాను ఇస్తున్న ప్రాధాన్యత స్ఫూర్తిదాయకం అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కుంభం వెంకటేశ్వర్లు, బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కోసూరి ప్రహ్లాద్, మండల బీసీ నాయకుడు మార్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వినూత్నంగా ఎన్నికల ప్రచారం విజయవాడస్పోర్ట్స్: ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించి విజయవాడ ప్రజల దృష్టిని ఆకర్షించాడీ యువకుడు. కృష్ణలంకకు చెందిన శివకుమార్ తన ద్విచక్ర వాహనాన్ని పూర్తిగా వైఎస్సార్సీపీ స్టిక్కర్లతో చుట్టేశాడు. ఆ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ను వాహనం ముందు అమర్చి వీధుల్లో చక్కర్లు కొడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. వెల్డింగ్ వర్కర్గా జీవనం సాగిస్తున్న తాను సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడనై.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకుని పార్టీ తరఫున స్వచ్ఛందంగా ప్రచారం చేసినట్లు శివకుమార్ చెప్పారు. -
విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్
వేమిరెడ్డిపల్లి(విస్సన్నపేట): విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. వేమిరెడ్డిపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామిదాసు విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హమీలను నెరవేర్చి ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించారన్నారు. స్థానికుడినైన తనను, కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, సర్పంచ్ పంతంగి విజయకుమారి, ఎంపీటీసీ వి. సత్యనారాయణచారి, సొసైటీ అధ్యక్షుడు రాయల వెంకట సత్యనారాయణ, స్థానిక నాయకులు నెక్కళపు సుబ్బారావు, నెక్కళపు శివయ్య, సూరా వెంకట్రామయ్య, రాష్ట్ర ఎస్టీ నాయకుడు భూక్యా రాము పాల్గొన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరికలు జూపూడి(ఇబ్రహీంపట్నం): ఇటీవలి కాలంలో వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన తురకా దుర్గారావు తన బంధువులు వారం తిరగకముందే ఆ పార్టీని వీడి సొంతగూడికి వచ్చేశారు. మైలవరం నియోజవకర్గ పార్టీ పరిశీలకులు కర్ర హర్షవర్థన్రెడ్డి వారికి కండువాలు కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, మండల కన్వీనర్ బొంత సాంబశివరావు, దుర్గగుడి కమిటీ సభ్యుడు చింకా శ్రీనివాసరావు, కలతోటి కొండలరావు, బాణావత్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు కుట్రలను గమనించాలి
నందివాడ: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ప్రజలందరూ గమనించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. మండలంలోని జనార్దనపురం(జొన్నపాడు) గ్రామంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నానిపై పార్టీ శ్రేణులు పూల వర్షం కురిపిస్తూ, గజమాలలతో ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. గ్రామంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలసి ఎమ్మెల్యే కొడాలి నాని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ను, గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి చేసిన సీఎం జగన్కు ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఇంటింటికీ వెళ్లి పేదలకు పెన్షన్లు అందిస్తున్న వలంటరీ వ్యవస్థను చంద్రబాబు అండ్ కో ఆపేశారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు చంద్రబాబు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 2014లో కూటమి మేనిఫెస్టో పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం మళ్లీ సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మోసం చేసేందుకు మరోసారి చంద్రబాబు రెడీ అయ్యారన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సీఎం జగన్కు మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పెయ్యల ఆదాం, జెడ్పీటీసీ కందుల దుర్గాకుమారి, వైస్ ఎంపీపీ కొప్పుల జయరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, పార్టీ నాయకులు కొండపల్లి కుమార్రెడ్డి, మలిరెడ్డి రవిరెడ్డి, కొండపల్లి రంగారెడ్డి, కొల్లారెడ్డి మధురెడ్డి, మలిరెడ్డి నాగిరెడ్డి, కోటే నాగేశ్వరరావు, బట్టిపాటి శ్రీనివాసరెడ్డి, కుందల నాగరాజు, తోట నాగరాజు, మొండ్రు వెంకటేశ్వరరావు, చింతాల నాగూర్, పరిమి అమృతబాబు, పామర్తి మురళీకృష్ణ, బేతపూడి నవరత్నరాజు, రాజులపాటి చంద్రశేఖర్, ఎంపీటీసీలు గోవాడ నిర్మలకుమారి, వెన్న ప్రభావతి, గుజ్జుల చైతన్యజ్యోతి, పిట్టా విశ్రాంతమ్మ, గుత్తా సత్యనారాయణ(చిన్ని), సచివాలయ కన్వీనర్ దేశిరెడ్డి రామ్మోహన్రెడ్డి, సర్పంచ్లు తాత మరియమ్మ, తెన్నేటి భాస్కరరెడ్డి, కలపాల సుధారాణి, సరెళ్ల రత్నకుమారి, తప్పిట ధనలక్ష్మి, జాజుల జ్యోత్స్నదేవి పాల్గొన్నారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలి గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని మండలంలో ముగిసిన ఎన్నికల ప్రచారం -
చారిత్రక పురి.. అభివృద్ధే గురి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగి కొండపల్లి ప్రస్తుతం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది. 1956 నుంచి 2020 వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కొండపల్లిని.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2021 జనవరిలో ఇబ్రహీంపట్నం, కొండపల్లి జంట గ్రామాలను కలిపి మునిసిపాలిటీగా ఏర్పాటు చేశారు. చరిత్రకు ఆనవాళ్లుగా కొండపల్లి ఖిల్లా, బొమ్మల పరిశ్రమ, విద్యుత్ వెలుగులు విరజిమ్మే నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, కొండపల్లి ఇండస్ట్రీయల్ డెవలప్ ఏరియా(ఐడీఏ) ఆప్మెల్ సంస్థ, దూరదర్శన్ కేంద్రం, రైల్వే స్లీపర్ల తయారీ సంస్థ, పట్టణ ఒడ్డున కృష్ణమ్మ పరవళ్లు ఈ ప్రాంతానికి తలమానికంగా నిలిచాయి. గత టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని కొండపల్లి.. ఈ ఐదేళ్లలో ప్రగతి పథాన పయనిస్తోంది. విద్య, వైద్యం అద్భుతః.. ఐదేళ్ల కాలంలో విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఇప్పటికే రెండు పీహెచ్సీలు ఉన్న కొండపల్లిలో ప్రతి 30 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం చొప్పున ఒక్కొక్కటి రూ.96.50 లక్షల చొప్పున రూ.1.93కోట్లతో రెండు అర్బన్ యూపీహెచ్సీలు నిర్మించింది. రూ.2 కోట్లతో బొమ్మల పరిశ్రమ అభివృద్ధి, ఎన్టీటీపీఎస్, ఐడీఏలో పనిచేసే అసంఘటిత కార్మికుల ఆరోగ్య ప్రయోజనాల కోసం రూ.54 లక్షలతో ఈఎస్ఐ వైద్యశాల నిర్మించింది. నాడు – నేడు పథకంలో రూ.6 కోట్లతో 14 పాఠశాలలు, ఏపీ గిరిజన గురుకుల బాలికల సంక్షేమ హాస్టల్, బీసీ గురుకుల సంక్షేమ బాలుర హాస్టల్ అభివృద్ధి చేశారు. జెడ్పీ బాలికల పాఠశాలలో జూనియర్ కళాశాల మంజూరు చేసి అదనపు గదులు నిర్మించింది. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియాన్ని చేరువ చేసింది. చేరువైన పాలన.. 73,580 మంది జనాభా కలిగిన కొండపల్లిలో పరిపాలనా సౌలభ్యం కోసం 10 వార్డు సచివాలయాలు నిర్మించారు. 340 మంది వలంటీర్లు, 90 మంది సచివాలయ ఉద్యోగుల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయి. ఐదేళ్లలో ప్రజల నుంచి 31,357 అర్జీలు స్వీకరించి 28,186 అర్జీలు పరిష్కరించారు. అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, లానేస్తం, తదితర పథకాలు 73,580 మంది జనాభాలో 67,515 మందికి రూ.207.35 కోట్లు నగదు డీబీటీ ద్వారా అందాయి. రూ.80.16 కోట్లతో అభివృద్ధి పనులు.. ● గత ఐదేళ్లలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా విడుదలైన రూ.80.16 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ● ఎస్సీ సబ్ప్లాన్ రూ.75 లక్షలతో ఆర్సీఎం కాలనీలో ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ● ప్రభుత్వ నిధులు రూ.4 కోట్లతో 10 నూతన సచివాలయాలు నిర్మించారు. 14, 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్ రూ.10.70 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు జరిగాయి. ● ప్రభుత్వ నిధులు రూ.1.50 కోట్లతో పైప్లైన్ ఆధునికీకరణ పనులు జరిగాయి. ● అమృత్ 0.2 నిధులు రూ.1.45కోట్లతో గజరాజు చెరువు, రూ.1.93 కోట్లతో రెండు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రూ.కోటితో 4 కమ్యూనిటీ భవనాలు నిర్మించారు. ● నాడు – నేడు పథకం నుంచి రూ.6 కోట్లతో 14 పాఠశాలలు, బాలికలు, బాలుర హాస్టల్స్ అభివృద్ధి చేశారు. ● రూ.54 లక్షలతో ఈఎస్ఐ వైద్యశాల నూతన భవన నిర్మాణం చేశారు. ● జగనన్న కాలనీల్లో రూ.1.50 కోట్లతో విద్యుత్ సదుపాయం కల్పించారు. 3,120 మందికి స్థలాలు కేటాయించగా, ఇళ్లు పూర్తి చేసిన 2,709 మందికి రూ.48.79 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ● ఇవికాక మరో రూ.63 కోట్లతో ఇంటింటికీ తాగునీటి పథకం పనులు టెండర్ దశలో ఉన్నాయి. ఐదేళ్లలో మారిన కొండపల్లి రూపురేఖలు 2021లో పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా రూపాంతరం దాదాపు రూ.80.16 కోట్లతో అభివృద్ధి పనులు మరో రూ. 207.35 కోట్లతో 67,515 మందికి సంక్షేమం విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్ద పీట ఐదేళ్లల్లో రెట్టింపు అభివృద్ధి.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కొండపల్లి రూపురేఖలు మారాయి. సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు ఉచితంగా పొందగలుగుతున్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సదుపాయం మెరుగైంది. మరో ఐదేళ్లు సీఎంగా జగన్మోహన్రెడ్డి ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నా. – డి.మల్లికార్జునరావు, స్థానికుడు, ఇబ్రహీంపట్నం విద్య, వైద్య రంగాల్లో మార్పులు.. కొండపల్లి మునిసిపాలిటీ అయ్యాక విద్య వైద్య రంగాలు మెరుగుపడ్డాయి. రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక ఈఎస్ఐ వైద్యశాల నిర్మించారు. ఏ అనారోగ్య సమస్య వచ్చినా యూపీహెచ్సీల్లో వైద్య సేవలు, మెడికల్ టెస్ట్లు పక్కాగా నిర్వహిస్తున్నారు. నాడు – నేడులో భాగంగా చేసిన పాఠశాలల అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుంది. – పచ్చిగోళ్ల పండు, స్థానికుడు, కొండపల్లి -
‘కూటమిని కూలదోస్తేనే ప్రజా సంక్షేమం’
కంకిపాడు: మాయమాటలు చెప్పే కూటమిని కూల దోస్తేనే ప్రజా సంక్షేమ రాజ్యం అధికారంలోకి వస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి, వైఎస్సార్సీపీ పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కంకిపాడు పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో, బస్టాండు కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో జోగి రమేష్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకూ కానీ, అంతకు ముందు కానీ ఏ రోజైనా చంద్రబాబు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాడా? అని ప్రశ్నించారు. దోచుకోవటం, దాచుకోవటం తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. అమరావతి పేరుతో భ్రమరావతి చూపాడని ధ్వజమెత్తారు. అభివృద్ధి పేరుకే కాగితాల్లో ఉందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతోందన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా చేసేందుకు చంద్రబాబు, పవన్, మోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారి మాయమాటలు నమ్మొద్దని హితవు పలికారు. ఓటు అనే ఆయుధంతో కూటమిని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పెనమలూరు అసెంబ్లీ స్థానానికి తనను, మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సింహాద్రి చంద్రశేఖర్రావును ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్పర్సన్ తాతినేని పద్మావతి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత చలసాని స్మిత గౌతమ్, జెడ్పీటీసీ సభ్యుడు బాకీ బాబు, జేసీఎస్ చైర్మన్ రాచూరి చిరంజీవి, సర్పంచ్ బాకీ రమణ, ఏఎంసీ వైస్ చైర్మన్ మాదు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. -
బందరులో అభివృద్ధి లంగరు
మచిలీపట్నంటౌన్: జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నగరం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఈ ఐదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నగరపాలక సంస్థగా రూపొందిన తరువాత అభివృద్ధి పరుగులు పెట్టింది. మౌలిక వసతులతో పాటు ల్యాండ్ మార్క్గా నిలిచే పలు అభివృద్ధి పనులు జరిగాయి. కోట్లాది రూపాయలతో నగరంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయి. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కులను సుందరంగా తీర్చిదిద్దారు. 20 వేల మందికి ఇళ్ల స్థలాలు నగర పరిధిలోని అర్హులైన 20 వేల మంది పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయగా వాటిలో వేలాది మంది ఇళ్లు నిర్మించుకుని నివాసాలు ఉంటున్నారు. నగరంలోని అర్హత ఉన్న లబ్ధిదారులకు కరగ్రహారంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని అతి పెద్ద లేఅవుట్లో 10 బ్లాక్లలో 17 వేల మందికి స్థలాలు ఇచ్చారు. బందరుకోట, గిలకలదిండి, ఉల్లింగిపాలెం, రుద్రవరం తదితర ప్రాంతాల్లో సుమారు 3 వేల మందికి స్థలాలు ఇచ్చారు. ఈ లేఅవుట్లలో విద్యుత్ సదుపాయం కల్పించారు. దీంతో నగరవాసులతో కొత్త ఊళ్లు ఏర్పాటయ్యాయి. రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు ఎంయూడీఏ నిధులు రూ.20 కోట్లతో నగరంలోని అన్ని డివిజన్లలో సిమెంటు రోడ్లు, పక్కా డ్రెయిన్లు, పైప్లైన్లు వంటి పనులు నిర్వహించారు. ఈ పనులతో ఆయా డివిజన్లలో ప్రజలకు మౌలిక వసతులు ఒనగూరాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న చిన్న, చిన్న సమస్యలు తీరటంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రూ.3 కోట్లతో బస్టాండ్ అభివృద్ధి నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. నాటి రవాణాశాఖ మంత్రిగా ఉన్న ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రత్యేక కృషితో నిధులు రాబట్టడంతో బస్టాండ్ అభివృద్ధి సాధ్యమైంది. పల్లంగా ఉన్న బస్టాండ్ ఆవరణ మెరక చేయటంతో పాటు ఎలివేషన్, భవనాల నిర్మాణం తదితర పనులు చేశారు. ఆధునిక హంగులతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. ఉద్యోగులు, కార్మికులకు వైద్యసేవల కోసం నూతన డిస్పెన్సరీ భవన నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్మాణం నగరంలో రూ.3.20 కోట్లతో అర్బన్ ప్రైమరీ హెల్త్సెంటర్ల భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. రైలుపేట, శారదానగర్లలో రూ.80 లక్షల చొప్పున నిధులతో భవనాలు పూర్తయ్యాయి. గిలకలదిండిలో శ్లాబ్ పూర్తి చేసి నిర్మాణంలో ఉంది. బైపాస్రోడ్డులోని బ్రహ్మంగారి మఠం వద్ద స్థలవివాదం ఉండటంతో ఈ భవనం నిర్మాణం ప్రారంభం కాలేదు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో రూ.2కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వసతులు ఏర్పడ్డాయి. శతాబ్దాల చరిత గల మచిలీపట్నంలో ఈ అయిదేళ్లలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగింది. బందరు రూపురేఖలు మారిపోయాయి. నగర సుందరీకరణతో పాటు ఉద్యానవనాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. చాలా కాలం తర్వాత బందరు వచ్చిన వారెవరైనా ఇది నిజంగా మన బందరేనా అని నమ్మలేనంతగా నగరంలో అభివృద్ధి జరిగిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కోట్లాది రూపాయలతో నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులు పాఠశాలలు, అర్బన్ హెల్త్సెంటర్ల నిర్మాణం, అభివృద్ధి మౌలిక వసతుల కల్పన పధకం లబ్దిదారుల సంఖ్య నిధులు (రూపాయల్లో) డీబీటీ 1,94,528 622,46,48,675 నాన్ డీబీటీ 83,533 621,23,54,789 మొత్తం 2,78,061 1243,70,03,464 -
పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
వన్టౌన్(విజయవాడపశ్చమ): ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో పశ్చమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న హవా నడిచింది. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం బుద్దా వెంకన్న ఇంటికే పరిమితమయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సుజనాచౌదరితో పాటు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని కూడా బుద్దా వెంకన్నను పూర్తిగా దూరం పెట్టారు. దాంతో నియోజకవర్గంలో బుద్దా వెంకన్న వర్గం సైలెంట్ అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి బీజేపీ అభ్యర్థిగా సుజనాచౌదరిని పోటీకి దింపారు. సుజనాచౌదరి వచ్చిన తొలి నాళ్లలో బుద్దా వెంకన్న తన క్యాడర్తో కాస్త హడావుడి చేశారు. కానీ గడిచిన 15 రోజులుగా ఆయన ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆర్థిక అంశాలను తనకు అప్పజెబుతారనుకున్న బుద్దా లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని చిన్ని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి ఇద్దరూ ఎన్నికలకు సంబంధించిన ఆర్థిక అంశాలను తనకు అప్పగిస్తారని బుద్దా వెంకన్న ఆశించారు. నియోజకవర్గంలో కేశినేని చిన్నితో గడిచిన ఏడాదిన్నర కాలంగా అనేక కార్యక్రమాలను సైతం బుద్దా వెంకన్న నిర్వహించారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం చిన్ని బుద్దా వెంకన్నను నమ్మకపోవటంతో ఆయనను దూరంగా ఉంచారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సుజనాచౌదరి ఆర్థిక కార్యకలాపాలన్నీ తన ద్వారానే నిర్వహిస్తారని బుద్దా వెంకన్న భావించారు. కానీ సుజనాచౌదరి సైతం బుద్దా వెంకన్నను నమ్మకుండా దూరంగా ఉంచారు. ఇద్దరూ వేరువేరుగా నియోజకవర్గంలో తమ తాలుకా వ్యక్తులను రంగంలోకి దింపి ఆర్థిక అంశాలను చక్కబెట్టే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యుడైనప్పటికీ... పశ్చమ నియోజకవర్గంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక కమిటీని వేసి దాని ద్వారా ఖర్చులు చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచన చేసింది. అందులో బుద్దా వెంకన్నను సైతం సభ్యునిగా సూచించారు. కానీ సుజనాచౌదరి ఆ కమిటీ ఏర్పాటుకు, దాని ద్వారా నిర్వహణకు వ్యతిరేకించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుద్దా వెంకన్నను నమ్మకపోవటం వలనే సుజనాచౌదరి వ్యతిరేకించినట్లు సమాచారం. దాంతో అటు కేశినేని చిన్ని, ఇటు సుజనాచౌదరి రెండు శిబిరాలు వెంకన్నను దూరంగా పెట్టాయి. అందువలన ఇద్దరికీ బుద్దా వెంకన్న దూరంగా ఉంటూ ఇంటికి మాత్రమే పరిమితమయ్యారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తమ నాయకుడిని పట్టించుకోకపోవటంతో బుద్దా వెంకన్న క్యాడర్ సైతం ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేయటం లేదని తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఒకరు చెబుతున్నారు. -
ఎన్నికల్లో సెక్టార్ అధికారుల పాత్ర కీలకం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా, సక్రమంగా నిర్వహించడంలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో గురువారం సెక్టార్ అధికారులు, ఏఎల్ఎంటీలకు జిల్లా స్థాయి శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 13న జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, సెక్టార్ అధికారులకు ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చామన్నారు. ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టం గురించి, ఈవీఎం ఎర్రర్స్, రీప్లేస్మెంట్ ప్రొటోకాల్ గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా విధులు నిర్వహించా లని సూచించారు. తద్వారా ఈవీఎంలు మొరాయించాయనే మాట రాకుండా పోలింగ్ సక్రమంగా జరిగేలా కృషి చేయాలన్నారు. శిక్షణలో చెప్పిన విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోల్ డే మేనేజ్మెంట్ సిస్టం గురించి ప్రత్యేక వెబ్ పేజ్ రూపొందించామని, దాని ద్వారా పోలింగ్ సంబంధించి ప్రతి అంశాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుందని వివరించారు. వేసవి కాబట్టి ఉదయం 10 గంటల్లోపు, మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత ఎక్కువగా పోలింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో విద్యుత్ సౌకర్యం, తగినంత లైటింగ్ ఉండేలా ముందుగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఈసీ నిబంధ నలు అనుసరించి ప్రణాళికా బద్ధంగా పోలింగ్ జరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రిసైడింగ్ అధికారులకు మార్గదర్శకంగా ఉండి ఎన్నికలు సజా వుగా నిర్వహించేలా కృషి చేయాలని సెక్టార్ అధికారులకు సూచించారు. తొలుత డీఆర్వో కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియలో ఈవీ ఎంలు ఎంత ముఖ్యమో, రిపోర్టింగ్ కూడా అంతే కీలకమన్నారు. ప్రతి ఫారాన్ని సరైన సమాచారంతో నింపడంపై అవగాహన పెంచుకోవాలన్నారు. శిక్షణ నోడల్ అధికారి మురళీ కిషోర్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి, జెడ్పీ సీఈఓ ఆనందకుమార్, ఎన్నికల విభాగం సమన్వయ అధికారి దుర్గా కిషోర్, మాస్టర్ ట్రైనన్లు పాల్గొన్నారు.కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె.బాలాజీ గురువారం సందర్శించారు. ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన మార్గాలకు అవసరమైన బారికేడింగ్ పనులను పరిశీలించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి పార్లమెంటు, అసెంబ్లీ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు పరిశీలించేందుకు వీలుగా సీసీటీవీల డిస్ప్లే రూములను వేర్వేరుగా ఏర్పాటు చేయా లని సూచించారు. నియోజకవర్గాల వారీగా పరిశీలకుల కోసం ఏర్పాటుచేసిన గదుల్లో టీవీలతో పాటు అవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. పోలింగ్ అనంతరం వచ్చే వాహనాలు వర్షం కారణంగా పార్కింగ్ ప్రదేశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా క్వారీ డస్ట్తో చదును చేయించాలని పేర్కొన్నారు. డ్వామా పీడీ జి.వి. సూర్యనారాయణ, ఏఎస్పీలు జి.వెంకటేశ్వరరావు, ఎస్.వి.డి.ప్రసాద్, ఏడీ సర్వే మనిషా త్రిపాఠి, పంచాయతీరాజ్ ఎస్ఈ విజయకుమారి, ఆర్ అండ్బీ ఈఈ కె.శ్రీనివాసరావు, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. -
కాపుల అభివృద్ధి వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
హనుమాన్జంక్షన్ రూరల్: కాపు సామాజికవర్గ సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు అన్నారు. స్థానిక విజయవాడ రోడ్డులోని ఎస్ఆర్ కల్యాణ మండపంలో గురువారం రాత్రి నిర్వహించిన కాపు అత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజికవర్గానికి గడిచిన ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ సీతారామలక్ష్మి మాట్లాడుతూ వయోభారంతోనే తన తండ్రి డాక్టర్ దుట్టా రామచంద్రరావు ప్రస్తుత ఎన్నికల్లో క్రియాశీలకంగా తిరగటం లేదని, తమ పూర్తి మద్దతు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీకే అని స్పష్టం చేశారు. దేశంలోనే గర్వించదగ్గ క్యాన్సర్ వైద్య నిపుణుడు అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును మచిలీపట్నం ఎంపీగానూ, వల్లభనేని వంశీని గన్నవరం ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ సీతారామలక్ష్మి కాపు కులస్తులను కోరారు. తొలుత దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా చిత్రపటానికి డాక్టర్ సింహాద్రి, డాక్టర్ సీతారామలక్ష్మి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య, ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ నక్కా గాంధీ, గన్నవరం ఏఎంసీ చైర్మన్ తోట కరుణ, వైస్ ఎంపీపీ చందు రమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ చిన్నాల సత్యగణేష్బాబు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి వెంకట రామాంజనేయులు పాల్గొన్నారు. బందరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు -
మాస్టర్ ప్లాన్ పనులు వేగవంతం చేయాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఈఓ కె.ఎస్.రామరావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా మహామండపం పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఈఓ గురు వారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనకదుర్గా నగర్ నుంచి మహామండపానికి వరకు చేపట్టిన ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి చేస్తున్న పునాదుల నిర్మాణ పనుల గురించి ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. అనంతరం గోశాల వద్ద నిర్మిస్తున్న అన్నదాన భవనం, ప్రసాదాల పోటు నిర్మాణ పనులపై ఈఈ ఎల్.రమాదేవితో చర్చించారు. అన్నదాన భవనం పునాదుల కోసం జరుగుతున్న రాడ్బెండింగ్ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు తొలుత పునాదుల నిర్మాణం కీలకమని, పనుల పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వేసవి సెలవులు, ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉండే సమయం కావడంతో పనులను మరింత వేగంగా చేపట్టేందుకు వీలు కలుగుతుందని ఆలయ ఈవో ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఈవో వెంట దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం అక్రమంగా నిల్వ చేసిన టీడీపీ నాయకుల అరెస్ట్
తిరువూరు: ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తెలుగుదేశం నాయకులు తెలంగాణ నుంచి అక్రమంగా తీసుకువచ్చిన మద్యాన్ని గురువారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు రాజుపేటలో టీడీపీ నాయకుడు షేక్ షాహిన్ పాషా రేకుల షెడ్డులో 4,200 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు. మద్యం నిల్వ చేసిన టీడీపీ నాయకులు షాహిన్ పాషా, జీనుగు అశోక్, మోదుగు వెంకటేశ్వరరావులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. గంపలగూడెం మండలం కొత్తపల్లిలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న వంగల నాగేశ్వరరావు నుంచి తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భారీగా మద్యం పట్టివేత నందిగామ: అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం సీసాలను గురువారం తెల్లవారుజామున నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ హనీష్ తెలిపిన సమాచారం ప్రకారం చందర్లపాడుకు చెందిన తలమాల మోహన్రావు అనే వ్యక్తి గూడ్స్ ఆటోలో 2,850 మద్యం సీసాలను నందిగామకు తీసుకువస్తున్నాడు. స్థానిక డీవీఆర్ కాలనీ సమీపంలోకి రాగానే గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ మద్యం తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. -
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
● ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు ● ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన ● పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన ● ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కసరత్తు సాక్షి, మచిలీపట్నం: లోక్సభతో పాటు అసెంబ్లీ స్థానాలకు నాలుగో దశ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 13న రాష్ట్రంలో పోలింగ్ జరగ నుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అధికారులు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వారిలో ధైర్యం నింపి, సమస్యలను సున్నితంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కలిగించారు. తద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 1,768 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా 15,39,604 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 1768 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా కేంద్రాల్లో ఎన్ని కల సిబ్బంది, ఓటర్లకు అవసరమైన అన్ని వసతులూ కల్పించారు. సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు. అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కోడ్ పక్కాగా అమలు చేసేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బృందాలను రంగంలోకి దింపారు. జిల్లాలో 158 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 1,010 పోలింగ్ ప్రాంతాలు ఉండగా వీటిలో 158 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటిలో 391 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించగా, అత్యధికంగా గన్నవరంలో 111 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు 75వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు ప్రజలు ప్రశాంతంగా ఓటు వేయగలిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టారు. రాజకీయ నాయకులకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రతి ఘటనను నిశితంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించేలా సిబ్బందిని సంసిద్ధం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల వివరాలు నియోజకవర్గం మొత్తం పోలింగ్ పోలింగ్ సమస్యాత్మక సమస్యాత్మక ప్రాంతాలు కేంద్రాలు లోకేషన్లు పోలింగ్ కేంద్రాలుగన్నవరం 168 306 41 111 గుడివాడ 122 230 21 60 పెడన 150 216 20 41 మచిలీపట్నం 107 205 15 32 అవనిగడ్డ 182 267 26 53 పామర్రు (ఎస్సీ) 155 238 22 44 పెనమలూరు 126 306 13 50 మొత్తం 1010 1768 158 391 -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాం. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటర్లకు ధైర్యం కల్పించేందుకు కృషి చేశాం. జిల్లా కలెక్టర్తో కలిసి వివిధ రూపాల్లో సమావేశాలు నిర్వహించాం. ఏదైనా సమస్యలు తలెత్తితే సమీపంలోని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. జిల్లా ప్రజలు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి. – అద్నాన్ నయీం అస్మీ, ఎస్పీ, కృష్ణాజిల్లా -
క్రికెట్ జిల్లా జట్ల ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా అండర్ –15, అండర్–19, అండర్–23 మహిళల జట్లను ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ అడహక్ కమిటీ చైర్మన్ టి.త్రినాథరాజు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను జట్లకు ఎంపిక చేశామన్నారు. ఎంపికైన జట్లు 2024 –25 సీజన్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు. జట్ల బృందాన్ని అడహక్ కమిటీ కన్వీనర్ ఎం.రవిశంకర్, కోచ్లు అభినందించారు. పరిశోధనా గ్రంథం ఆవిష్కరణ కోనేరుసెంటర్: మహాభారతం గ్రంథం కాలానుగుణంగా రూపాంతరం చేసుకుంటూ సమాజంలో చైతన్యం తీసుకువస్తుంది అనే కోణంలో పరిశోధన చేయడం అభినందనీయమని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి కొనియాడారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిశోధనా విద్యార్థి వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సహాయ ఆచార్యుడు డాక్టర్ విష్ణు వందనా దేవి పుస్తక రూపంలోకి తీసుకువచ్చిన ’కథన రూపాంతరాలు – మహాభారతం సాంస్కృతిక పునశ్చరణల అన్వేషణ’ తన పరిశోధనా గ్రంథాన్ని ఉపకులపతి గురు వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత ప్రయత్నాన్ని అభినందించారు. కార్యక్రమంలో పరిశోధనను పర్యవేక్షించిన ఆచార్య ఎన్.ఉష, రిజిస్ట్రార్ ఆచార్య కె.శోభన్బాబు, ఆంగ్ల విభాగం ఆచార్యుడు ఈ.దిలీప్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీకి మాల మహానాడు మద్దతు గుడివాడటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా మాల సామాజిక వర్గ ఓటర్లంతా వైఎస్సార్ సీపీకి మద్దతు ఇవ్వాలని మాల మహానాడు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పొంగులేటి జయ రాజు పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల, మాదిగలను రాజకీయ లబ్ధి కోసం విడదీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు సైతం వర్గీకరణ అంశాన్ని కొట్టి వేసిందని చెప్పారు. ఎంతో కాలంగా ఈ సమస్య ముగిసిపోయినా ప్రధాని నరేంద్ర మోదీని అడ్డుపెట్టుకుని మంద కృష్ణ మాదిగను రంగంలోకి దింపి తిరిగి వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తేవడం దుర్మార్గమన్నారు. అందుకే వివిధ వర్గాలుగా ఉన్న మాల మహానాడు శాఖలన్నింటిని ఏకం చేసి జేఏసీ ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని పార్టీల్లోని మాలలందరూ చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెబుతూ వైఎస్సార్ సీపీని గెలిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని పంపుతున్నామన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఈ జేఏసీ తీర్మానాన్ని పంపి, విస్తృత ప్రచా రం చేపట్టామన్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన వారంతా వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని కోరారు. జేఏసీ రాష్ట్ర కార్యదర్శి సేవ నాగ జగన్మోహనరావు, న్యాయవాది గంటా తిరుమలరావు పాల్గొన్నారు. గుడివాడ టీడీపీ అభ్యర్థి రాము ఎన్నికల కోడ్ ఉల్లంఘన గుడివాడరూరల్: గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. వివరాల్లోకి వెళితే నియోజకవర్గంలోని ఓటర్లకు ఈ నెల 13న జరగనున్న ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్ స్లిప్పులు అందజేయాల్సి ఉంది. కానీ వాటికి భిన్నంగా రాము తన ఫొటో, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కలర్ ఫొటోలతో కూడిన ట్యాగ్లు(స్లిప్పులు) అందజేస్తూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రాము టీడీపీ ట్యాగ్లు విచ్చలవిడిగా అందజేస్తున్నారు. ట్యాగ్ ఉన్న ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున పంపిణీ చేయనున్నట్లు టీడీపీ నాయకులే బాహాటంగానే పేర్కొంటున్నారు. ఈ ట్యాగ్లో హోలోగ్రామ్ ఆధారంగా పక్కాగా నగదు బదిలీ చేపట్టనున్నారు. ఇప్పటికై నా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ
చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో ఈ నెల నాలుగో తేదీ నుంచి ఈ ప్రక్రియ గురువారం వరకు కొనసాగింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉద్యోగులు ఆయా విభాగాల వారీగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చివరిరోజు వివిధ జిల్లాల్లో పోలీస్ బందోబస్తు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించింది. ఆఖరి రోజు 256 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 15,659 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు నోడల్ అధికారి షేక్ షాహిద్బాబు తెలిపారు. -
సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా అన్ని విధాలా చర్యలు చేపట్టాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశాం. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాం. నిఘా, భద్రత పెంచాం. ఓటర్లతో పాటు రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటర్లకు అభయం కల్పించాం. ఏ సమస్య తలెత్తినా వెంటనే స్పందించి నివారణ చర్యలు తీసుకుంటాం. – డీకే బాలాజీ, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, కృష్ణాజిల్లా● -
నిర్భయంగా ఓటు వేసేలా చర్యలు చేపట్టండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకుడు దీపక్మిశ్రా సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి.వి.జి.అశోక్ కుమార్, మచిలీపట్నం పార్లమెంట్ పోలీస్ పరిశీలకుడు ప్రసాద్ ప్రలాద్ అక్కనూరు తదితరులతో కలిసి గురువారం సమీక్ష నిర్వహించారు. తొలుత ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మాట్లాడుతూ.. జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేపడుతున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లు, చెక్పోస్ట్ల ఏర్పాటును పకడ్బందీగా నిర్వహించామన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న పోలీస్ సిబ్బంది, భద్రత అంశాలు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డబ్బు, మద్యం, వస్తువుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం దీపక్మిశ్రా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలను అరికట్టి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాలను అరికట్టాలన్నారు. సమావేశంలో పరిశీలకులు జాన్కింగ్స్లే, నరహరిసింగ్ బంగర్, చవాన్ ప్రవీణ్మోహన్దాస్, వికాష్ చంద్రకరోల్, కలెక్టర్ డి.కె.బాలాజీ, రిటర్నింగ్ అధికారులు గీతాంజలిశర్మ, పి.పద్మావతి, ఎం.వాణి, పి.వెంకటరమణ, బాలసుబ్రహ్మణ్యం, బి.శ్రీదేవి, దాసి రాజు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకుడు దీపక్మిశ్రా
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement