సబ్‌జైలులో జిల్లా జడ్జి తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

సబ్‌జైలులో జిల్లా జడ్జి తనిఖీలు

Dec 17 2025 7:25 AM | Updated on Dec 17 2025 7:25 AM

సబ్‌జైలులో జిల్లా జడ్జి తనిఖీలు

సబ్‌జైలులో జిల్లా జడ్జి తనిఖీలు

అవనిగడ్డ: జిల్లా న్యాయమూర్తి జి.గోపీ మంగళవారం అవనిగడ్డ సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్‌ ఖైదీలతో మాట్లాడారు. జైలులో అందుతున్న భోజన వసతి గురించి తెలుసుకున్నారు. స్టోర్‌ రూం, వంట గదిని న్యాయమూర్తి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. జైలు ప్రాంగణం అంతా కలియ తిరిగి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గోపీ మాట్లాడుతూ.. బెయిల్‌ కోసం న్యాయవాదులను పెట్టుకోలోని రిమాండ్‌ ఖైదీల కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తామనానరు. ఖైదీల ప్రవర్తన గురించి జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, అవనిగడ్డ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.అరుణ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి స్వర్ణలత ఓల్గా, జైలు సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సనకా రఘురామప్రసాద్‌, న్యాయవాది దామెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement