జీవితాలతో బెట్టింగ్‌ ఆట | - | Sakshi
Sakshi News home page

జీవితాలతో బెట్టింగ్‌ ఆట

Dec 17 2025 7:25 AM | Updated on Dec 17 2025 7:25 AM

జీవిత

జీవితాలతో బెట్టింగ్‌ ఆట

● కృష్ణాజిల్లా, పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన 20 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన మరో మైనర్‌, ఇతర జిల్లాలకు చెందిన ఐదురురితో కలిసి బైకుల చోరీ, గంజాయి విక్రయాలు వంటి నేరలకు పాల్పడుతున్న క్రమంలో నవంబర్‌ 28వ తేదీన విజయవాడ ఆటోనగర్‌ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 14 బైకులు, ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ● సెప్టెంబర్‌ 23వ తేదీన జి.కొండూరు బైపాస్‌రోడ్డులోని ఓ టీస్టాల్‌లో కూర్చున్న నలుగురు యువకులు వచ్చే పోయే వాహనాల నంబర్‌ ప్లేట్లపై ఉండే నంబర్లను కలపగా ఫలానా నంబరు వస్తుందని కొందరు, అలా రాదని కొందరు బెట్టింగ్‌లకు పాల్పడుతున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ● అక్టోబర్‌ 25వ తేదీన సరదాగా ఇళ్ల వద్ద ఆడుకునే హౌసీ గేమ్‌ను సైతం బెట్టింగ్‌ గేమ్‌గా మార్చి జి.కొండూరు గ్రామంలో అర్ధరాత్రి దాటిన తర్వాత బెట్టింగ్‌కు పాల్పడుతున్న కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ● జి.కొండూరు మండలం త్కూరు గ్రామానికి చెందిన డి.అఖిల్‌ రాకేష్‌(25) కొండపల్లి ఐడీఏలోని ఓ ఫార్మా కంపెనీలో మిషన్‌ ఆపరేటర్‌గా పని చేస్తూ బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఈ నెల ఎనిమిదో తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ 10వ తేదీన మృతి చెందాడు. ● జి.కొండూరు మండలం చెర్వుమాధవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌లకు పాల్పడి రూ.2 లక్షలకుపైగా పొగొట్టుకొని ఇంటి నుంచి పరారైన ఘటన ఇటీవల జరిగింది. ఆ యువకుడు బెంగళూరు ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు.

సంక్రాంతి సంబరాల పేరుతో చిన్నారులను ఆకర్షించేలా బెట్టింగ్‌ గేమ్‌లు కోడిపందేల శిబిరాల వద్దకు భారీగా చేరుకుంటున్న చిన్నారులు, యువకులు సరదాగా మొదలై బెట్టింగ్‌ గేమ్‌లకు బానిసలుగా మారుతున్న వైనం తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకుంటేబిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకమే..

జి.కొండూరు: సంక్రాంతి సంబరాలు అంటూ నిర్వహిస్తున్న కోడిపందేల శిబిరాల వద్ద బెట్టింగ్‌ క్రీడలు జోరుగా సాగుతున్నాయి. శిబిరాల వద్దకు సరదాగా గడిపేందుకు వస్తున్న చిన్నారులు, యువకులను బెట్టింగ్‌ క్రీడలు ఆకర్షిస్తున్నాయి. పండుగ మూడు రోజుల సెలవుల్లో యువకులు, చిన్నారులు సరదాగా బెట్టింగ్‌ గేమ్‌లను ఆడడం పరిపాటిగా మారింది. ఈ సరదా వారిని బెట్టింగ్‌లకు బానిసగా మారుస్తోంది. చిన్న వయస్సులోనే ఆన్‌లైన్‌ గేమ్‌లు, బెట్టింగ్‌లకు అటవాటు పడిన యువకులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు, చోరీలకు తెగబడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి.

గతేడాది జిల్లాలో 70కిపైగా శిబిరాలు

ఎన్టీఆర్‌ జిల్లాలో గతేడాది సంక్రాంతి సంబరాల పేరుతో అనధికారికంగా 70కిపైగా కోడిపేందేల శిబిరాలు నడిచాయి. ఈ శిబిరాల ఏర్పాటుకు ముడుపులు, అద్దెల కోసం భారీగా ఖర్చు పెడుతున్న నిర్వాహకులు ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు పేకాటతో పాటు బెట్టింగ్‌ గేమ్‌లకు విచ్చలవిడిగా అనుమతినిచ్చారు. కోడిపందేలు నేరమని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంప్రదాయం పేరుతో ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో పోలీసులు అటు వైపు వెళ్లే అవకాశం లేకుండా పో యింది. కోడిపందేల శిబిరాల నిర్వాహకులు ఆదాయం కోసం బెట్టింగ్‌ గేమ్‌లకు అనుమతి ఇవ్వడంతో మూడు రోజులు పాటు చిన్నారులు, యువకులు పేకాట, కోసు ఆట, లోన – బయట, రాజు – రాణి, నలుపు – తెలుపు, బొమ్మలాట, నంబర్లాట, చిన్న బజారు – పెద్ద బజారు, మూడు ముక్కలాట, బొమ్మాబొరుసు వంటి ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ సరదా సంక్రాంతి సంబరాలు ముగిశాక ఆన్‌లైన్‌ గేమ్‌లు, క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడేలా చేస్తోంది. బెట్టింగ్‌లకు డబ్బుల కోసం లోన్‌ యాప్‌ల నుంచి అప్పులు చేయడం, డబ్బు దొరకనప్పుడు చోరీలు, ఇతర నేరాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

వెలుగు చూసిన ఘటనల్లో కొన్ని..

జీవితాలతో బెట్టింగ్‌ ఆట1
1/1

జీవితాలతో బెట్టింగ్‌ ఆట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement