'ఎక్స్'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.The EU should be abolished and sovereignty returned to individual countries, so that governments can better represent their people— Elon Musk (@elonmusk) December 6, 2025ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టండిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్ఫామ్ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి.
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. పర్యాటక ప్రోటీస్ జట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలో ఛేదించింది.జైశ్వాల్ సెంచరీ..లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ తొలి వికెట్కు 155 పరుగుల అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్కు పంపాడు. కానీ జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్ధి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఈ ముంబై ఆటగాడు 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో 65 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.Look at what it means to him! 🥳What a special knock this has been from Yashasvi Jaiswal 🙌Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/BHyNjwOGWY— BCCI (@BCCI) December 6, 2025డికాక్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో డికాక్ సెంచరీ వృథా అయిపోయింది.Virat Kohli in this series :Innings -3 Runs - 302Avg. - 151SR - 117.05100s- 250s-1Should get Man of the Series.#ViratKohli𓃵 pic.twitter.com/NVeNDgTqU2— Pedriverse (@Cules651) December 6, 2025చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
దిగొచ్చిన ఇండిగో : పైలట్లు,సిబ్బంది నియామకాలు షురూ
ముందస్తు హెచ్చరికలు లేకుండా వందలాది విమానాలు రద్దు, ప్రయాణీకులు ఆగ్రహాలు, కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్ననేపథ్యంలోఇండిగో ఎట్టకేలకు దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం పైలట్ పూల్ విస్తరణ జరుగుతుందని తాజాగా ప్రకటించింది.ఇండిగో కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్ల నియామకాలు సిబ్బంది నియామకాల్లో నెలల తరబడికొనసాగుతున్న స్తంభనను ముగించి ఇండిగో కొత్త FDTL నిబంధనలకు అనుగుణంగా నియంత్రణ సంస్థ డీజీసీఏ ద్వారా తాత్కాలిక మినహాయింపు పొందిన రోజే ఎయిర్బస్ A320 విమానాల కోసం కెప్టెన్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లను (టైప్ రేటెడ్) నియమాకాలకు రంగంలోకి దిగింది.ఈ పదవికి భారతీయులు డిసెంబర్ 6న, ఎయిర్లైన్ A320 కెప్టెన్లు, ఇతర సిబ్బంది కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ జారీ చేసింది. భారతీయ పౌరులు లేదా 62 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, విదేశీ పౌరుడు కార్డ్ హోల్డర్లు కాకుండా ఉండాలి. దరఖాస్తుదారులు A320 కుటుంబంలో మొత్తం 3000 గంటలు ,PIC పోస్ట్ లైన్ రిలీజ్గా కనీసం 100 గంటలు ప్రయాణించాలి.ఇదీ చదవండి: రోజూ వెళ్లే జిమ్మే... కానీ క్షణాల్లోనే అంతా అయిపోయింది!అలాగే 18-27 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళా భారతీయ పౌరుల కోసం క్యాబిన్ అటెండెంట్ (గ్రేడ్ ట్రైనీ) నియామకాన్ని కూడా ఎయిర్లైన్ ప్రారంభించింది. అభ్యర్థి ఏదైనా ఇండిగో స్థావరంలో మకాం మార్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఇండిగో నెట్వర్క్ అంతటా తన కార్యకలాపాలను తిరిగి ట్రాక్లోకి తీసుకు రావడానికి దృఢంగా పనిచేస్తున్నట్లు తెలిపింది.కొత్త నిబంధనల ప్రకారం పైలట్ పూల్ విస్తరణ జరుగుతుందని ఇండిగో ప్రకటించినప్పటికీ పైలట్ల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) నియామకాల నిలిపివేత కొనసాగుతోందని ఆరోపించింది. మరో పైలట్ సంస్థ ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA) కొత్త FDTL నిబంధనలను అమలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. కాగా కొత్త FDTL నియమాలు వన్-టైమ్ మినహాయింపు ఇండిగో కొన్ని కఠినమైన నిబంధనలను, ముఖ్యంగా నైట్ డ్యూటీకి సంబంధించిన నిబంధనలపై మినహాయింపునిచ్చింది.ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తే
రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి: జూపూడి ప్రభాకర్
సాక్షి తాడేపల్లి: దేశీయ విమానయాన రంగంలో సంక్షోభ పరిస్థితుల వేళ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో సంస్థతో కుమ్మక్కయ్యారని, అందువల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు కారణమైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఇంత సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారని విమర్శించారు. ఆయన విమానయానశాఖ మంత్రిగా కాకుండా రీల్స్ మంత్రిగా మారారని దుయ్యబట్టారు. ఇండిగో సంక్షోభాన్ని వదిలేసి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసుకుంటూ గడుపుతున్నారన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటిని కచ్చితంగా పాటించేలా చూడాలని విమానాయాన సంస్థలకు ఆదేశాలిచ్చింది.కానీ డీజీసీఏ నిబంధనలను ఇండిగో పాటించేలా చేయడంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని ఈ ఫలితంగానే ఇప్పుడు ఇండిగో సంక్షోభం వచ్చిందని తెలిపారు. డీజీసీఏ తన రూల్స్ను వెనక్కి తీసుకునేలా ఇండిగో వ్యవహరించిందంటే దానికి కారణం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడేనని కనుక ఆయనను పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని జూపూడి ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు.నారా లోకేష్ వార్ రూమ్లో చర్చలు జరుపుతున్నారంటూ నేషనల్ మీడియాలో మాట్లాడి పరువు తీశారు. అసలు కేంద్ర మంత్రి పదవితో లోకేష్ కి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. లోకేష్కి జాకీలు పెట్టి లేపాలనే ఉద్దేశ్యంతో దేశ వ్యాప్తంగా తెలుగు వారి పరువు తీశారని జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు.
'ఎక్స్'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్
కృష్ణా జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం..
ఈనెల 17న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
అభిషేక్ శర్మ రేర్ రికార్డు.. రోహిత్, కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
మిడ్నైట్ కార్నివాల్ పేరుతో రూ.4 లక్షల వరకు డిస్కౌంట్
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం: సీఎం రేవంత్
'ఇట్స్ ఓకే గురు' అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా: మెహర్ రమేశ్
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
యాంకర్ రష్మీ లవ్ వైబ్స్... 'బిగ్బాస్' దివి బుంగమూతి
యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ
పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. మాల తెంచేసిన వ్యాపారి.. అయ్యప్పల ధర్నా
ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరిక
TN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసుల దుర్మరణం
ఇండిగోకు భారీ ఊరట
కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
ఇండిగో సంక్షోభంపై పరువు పోగొట్టుకున్న టీడీపీ
‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే’
భారత్కు రష్యా నిజమైన స్నేహితుడు: మోదీ
ఇండిగో సంక్షోభంపై రాహుల్ సంచలన ట్వీట్
ఇండిగో సంక్షోభంపై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
ఇండిగో సంక్షోభం.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
వావ్!! వెండి భారీగా.. బంగారం విచిత్రంగా..
ఇంతకీ ఇండిగో ఓనర్ ఎవరో తెలుసా?
ఈనెల 17న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
ఆర్బీఐ వడ్డీ రేటు పావు శాతం కోత
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
ట్రంప్కే ‘ఫిఫా’ తొలి శాంతి బహుమతి ఎందుకంటే..
'ఎక్స్'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్
కృష్ణా జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం..
ఈనెల 17న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
అభిషేక్ శర్మ రేర్ రికార్డు.. రోహిత్, కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
మిడ్నైట్ కార్నివాల్ పేరుతో రూ.4 లక్షల వరకు డిస్కౌంట్
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం: సీఎం రేవంత్
'ఇట్స్ ఓకే గురు' అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా: మెహర్ రమేశ్
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
యాంకర్ రష్మీ లవ్ వైబ్స్... 'బిగ్బాస్' దివి బుంగమూతి
యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ
పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. మాల తెంచేసిన వ్యాపారి.. అయ్యప్పల ధర్నా
ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరిక
TN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసుల దుర్మరణం
ఇండిగోకు భారీ ఊరట
కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
ఇండిగో సంక్షోభంపై పరువు పోగొట్టుకున్న టీడీపీ
‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే’
భారత్కు రష్యా నిజమైన స్నేహితుడు: మోదీ
ఇండిగో సంక్షోభంపై రాహుల్ సంచలన ట్వీట్
ఇండిగో సంక్షోభంపై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
ఇండిగో సంక్షోభం.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
వావ్!! వెండి భారీగా.. బంగారం విచిత్రంగా..
ఇంతకీ ఇండిగో ఓనర్ ఎవరో తెలుసా?
ఈనెల 17న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
ఆర్బీఐ వడ్డీ రేటు పావు శాతం కోత
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
ట్రంప్కే ‘ఫిఫా’ తొలి శాంతి బహుమతి ఎందుకంటే..
ఫొటోలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాట్లపై అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి
రేపు హైదరాబాద్కు హీరో సల్మాన్ ఖాన్ (ఫోటోలు)
#BiggBossTelugu9 ట్రెండింగ్లో 'తనూజ' (ఫోటోలు)
ముంబై : స్వదేశ్ ఫ్లాగ్షిప్ స్టోర్ వేడుకలో నీతా అంబానీతో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
విజయవాడ : ఆకట్టుకుంటున్న ఫల, పుష్ప ప్రదర్శన (ఫొటోలు)
ఎగరని విమానాలు.. ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్యాసింజర్ల కష్టాలు చూశారా?.. (చిత్రాలు)
రూ.350 కోట్ల విలువైన బంగ్లా.. ఆలియా భట్ గృహప్రవేశం (ఫొటోలు)
నేను నా మూడ్ స్వింగ్స్.. చీరలో అనసూయ (ఫొటోలు)
భార్యతో విహారయాత్రకు వెళ్లిన కీరవాణి కొడుకు హీరో సింహా (ఫొటోలు)
ఈ ఏడాది మధుర జ్ఞాపకాలతో మీనాక్షి చౌదరి.. ఫోటోలు
సినిమా
సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది!: రాజ్ పిన్ని
హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈషా సెంటర్లో భూతశుద్ధి పద్ధతిలో వీరి పెళ్లి ఎంతో సింపుల్గా జరిగింది. ఈ వివాహం గురించి సంగీత విద్వాంసురాలు శోభారాజు మాట్లాడారు. ఈమె ఎవరంటే.. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సంగీత దర్శకురాలిగా మంచి పేరు గడించింది డాక్టర్ శోభారాజు. శోభారాజు రియాక్షన్2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమెకు రాజ్ నిడిమోరు బంధువవుతాడు. శోభారాజు అక్క రమాదేవి కొడుకే రాజ్ నిడిమోరు. కోడలి వరసయ్యే సమంత గురించి శోభారాజు మాట్లాడుతూ.. ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఆశ్రమంలో స్వామివారి ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక జరిగింది. రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే..వాడు చిన్నగా ఉన్నప్పుడే ముద్దుగారే యశోద.. వంటి పాటలు నేర్చుకుని పాడేవాడు. మీ పిన్ని పేరు నిలబెట్టావని అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లు. అది నాకు చాలా సంతోషంగా అనిపించేది. తను సంగీతం నేర్చుకుని ఎన్నో పాటలు పాడాడు. వాడికి స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని తెలిసింది.పక్కన కూర్చోవాలంటే సిగ్గేసిందిఓ రెండుసార్లు తను వచ్చినప్పుడు చూశాను, చాలా సన్నగా ఉంది. తన పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది. సన్నగా అవాలంటే ఎలా? అని అడిగినప్పుడు ఏవో ఎక్సర్సైజ్లు చెప్పింది, కానీ నేను చేయలేనన్నాను. తను మూడు నెలలకోసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మౌనం పాటిస్తూ సాధన చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. బహుమతులు ఏమిచ్చారంటే?ఎంతో బిజీ నటి అయుండి ఇలా ధ్యానానికి సమయం కేటాయిస్తుందంటే ముచ్చటేసింది. అలాంటి అమ్మాయి రాజ్కు దొరకడం హ్యాపీ. సమంత (Samantha Ruth Prabhu) వాడిని మరింత ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తుందన్నాను. పెళ్లిలో ఆరోగ్యకరమైన ఆహారమే వడ్డించారు. అలాగే కెమికల్స్ వాడని పర్ఫ్యూమ్స్ కానుకగా ఇచ్చారు అని శోభా రాజు చెప్పుకొచ్చారు. చదవండి: పవన్ కల్యాణ్.. బిగ్బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా?
రెండో పెళ్లి చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ
బుల్లితెర నటి సారా ఖాన్ రెండో పెళ్లి చేసుకుంది. నటుడు క్రిష్ పాఠక్ను రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. రామాయణ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహిరి కుమారుడే క్రిష్ పాఠక్. డిసెంబర్ 5న ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు, బుల్లితెర తారల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. రెండో పెళ్లిఇందుకు సంబంధించిన ఫోటోలను సారా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ కొత్త జంట తమ సంగీత్లో కూలీ సినిమాలోని మోనికా సాంగ్కు స్టెప్పులేశారు. అలాగే హిందీ పాటలకు సైతం కాలు కదిపారు. కాగా సారా ఖాన్.. సాప్న బాబుల్ కా బిడాయి సీరియల్తో బుల్లితెరకు పరిచయమైంది. బుల్లితెరపై, వెండితెరపై..పలు సీరియల్స్తో పాటు జర నాచ్కే దిఖా, నాచ్ బలియే 4 వంటి డ్యాన్స్ రియాలిటీ షోలలోనూ పాల్గొంది. డార్క్ రెయిన్బో, సైనైడ్, హమారీ అధూరీ కహాని వంటి చిత్రాల్లోనూ నటించింది. ఓటీటీలో లాక్ అప్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. హిందీ బిగ్బాస్ నాలుగో సీజన్లో సారా (Sara Khan) పాల్గొంది. అదే షోలో నటుడు అలీ మర్చంట్ కూడా పాల్గొన్నాడు. బిగ్బాస్ షోలో ఉన్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.మొదటి పెళ్లిబయటకు వచ్చాక 2010లో పెళ్లి చేసుకున్నారు. కానీ, వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. తర్వాత అలీ మర్చంట్ 2016లో అనమ్ మర్చంట్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేకపోయింది. 2021లో దంపతులిద్దరూ విడిపోయారు. దర్వాత తన స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Saaraa Khan (@ssarakhan) చదవండి: సమంత ఆ ఒక్క పని చేస్తే చాలు: హీరోయిన్ చిన్నత్త
‘అండర్ గ్రౌండ్కి వెళ్లడానికి రెడీ’ అన్న హీరోయిన్
ఒక్కసినిమాలో పాత్రతోనే కొందరు నటీనటులు చాలాకాలం గుర్తుండిపోతారు. అలాగే నిజ జీవితంలో జరిగిన ఒక్క సంఘటనతో మరికొందరు గుర్తుండిపోతారు. అయితే అటు సినిమాల్లో పాత్రతోనూ ఇటు నిజజీవితంలో సంఘటనతోనూ గుర్తుండిపోతుంది శ్వేతాబసు ప్రసాద్. కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఎ...క్క....డ అంటూ వరుణ్ సందేశ్ను ఆటపట్టిస్తూ ప్రేక్షకుల మనసుల్లో తిష్టవేసుకున్న ఆ టీనేజ్ బ్యూటీ... దురదృష్టవశాత్తూ... హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఉన్న ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టుబడిన అత్యంత పిన్నవయస్కురాలైన తారగా కూడా గుర్తుండిపోయింది.ఆ తర్వాత చాలా కాలం పాటు తెరమరుగైన శ్వేతాబసు... కొంత కాలంగా సినిమాల్లో, వెబ్సిరీస్లలో రాణిస్తూ మరోసారి నటిగా తన సత్తా చాటుతోంది. ఇటీవల మహారాణి అనే వెబ్సిరీస్ 4వ సీజన్ ద్వారా మరోసారి తన నటనా ప్రతిభను చాటింది. ఈ నేపధ్యంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది. తాను నిలకడగా నిదానంగా పని చేస్తున్నాన నీ అవకాశాల వెంట పరుగులు తీయడం లేదని ఆమె అంటోంది. తాను చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంపిక చేసుకుంటూన్నానని అందుకే తనను ఇష్టపడే, తన నటనపై నమ్మకం ఉన్న ప్రేక్షకులు తనకు ఉన్నారని చెప్పింది. ప్రత్యేకతను సృష్టించుకోవడం చాలా ముఖ్యమంటూ, తన పాత్రలను ఎంచుకోవడంలో అది కనిపిస్తుందంది. భవిష్యత్తులో తన ఎంపికలు తప్పుకావచ్చు కానీ తాను ప్రయోగాలు చేయడానికి భయపడనని స్పష్టం చేసింది. నిజానికి తన వద్దకు వచ్చే 10 ప్రాజెక్టులలో 9 ప్రాజెక్టులకు నో చెబుతున్నానంది. దాని వల్ల అవకాశాలు కోల్పోతున్న అనే బాధ లేదని అవసరమైతే 6 నెలలు ఇంట్లో కూర్చున్నా తనకు ఓకే అంది. ‘‘నా జీవితంలో ఆడంబరాలు, విలాసాలు లేవు, అవి ఉంటే ఇతరుల అంచనాలకు అనుగుణంగా జీవించాలి ఫోటోషూట్లు చేస్తూనే ఉండాలి’’ అంటోంది. ఆ తరహా జీవనశైలి వల్ల తనకు నిరంతరం ఒత్తిడి ఉండదనీ,అవసరమైతే అండర్ గ్రౌండ్( అజ్ఞాతం)లోకి వెళ్లిపోయి పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావడడం తనకు సులభం అని అని టెలివిజన్తో సహా హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేసిన బహుభాషా నటి అంటోంది. గత కొంత కాలంగా మక్దీ, ఇక్బాల్, తాష్కెంట్ ఫైల్స్, సీరియస్ మెన్, జూబ్లీ, త్రిభువన్ మిశ్రా సిఎ టాపర్ వంటి పలు వైవిధ్య భరిత చిత్రాల్లో వెరైటీ పాత్రలు పోషించిన శ్వేత, తన ఎంపికల ప్రాధాన్యతల వల్లే ఆసక్తికరమైన పాత్రలు తన వైపు వస్తున్నాయని స్పష్టం చేసింది. ‘‘నేను ముందు ప్రేక్షకురాలిని ఆ తర్వాత నటిని. నేను ఏది ఎంచుకున్నా అది నేను చూడాలనుకునేది కావడం చాలా ముఖ్యం.’’ అంటూ వివరించింది. , ప్రేక్షకులు ప్రయోగాలను ఆదరించరనేది ఇప్పుడు ఒక అపోహ. ప్రేక్షకులు అన్ని రకాల ప్రాజెక్టులను చూస్తున్నారు కాబట్టే నిర్మాతలు ధైర్యం చేయగలుగుతున్నారు అంటోందామె. ఒక నటిగా కొనసాగేందుకు ఇది గొప్ప సమయం అందామె.
బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?
టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ డేటింగ్ అంటూ వార్తలు కొత్తేం కాదు. గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు తెలుగు యాంకర్ వర్షిణితో ఇతడు డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వచ్చాయి. తర్వాత తర్వాత అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయాయి. ఇప్పుడు సుందర్, ఓ బాలీవుడ్ నటి, స్పోర్ట్స్ ప్రెజెంటర్తో డేటింగ్ చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?) క్రికెటర్లు.. హీరోయిన్లతో డేటింగ్, పెళ్లి చేసుకోవడం లాంటివి కొత్తేం కాదు. ఇప్పుడు ఆ లిస్టులోకి సుందర్ చేరుతాడా అనిపిస్తుంది. ఎందుకంటే హిందీ నటి సాహిబా బాలీతో ఓ కేఫ్లో సుందర్ జంటగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎప్పటిది అనేది తెలియట్లేదు గానీ సుందర్-సాహిబా డేటింగ్ గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.సాహిబా బాలీ విషయానికొస్తే.. ఈమె కశ్మీరీ కుటుంబానికి చెందిన అమ్మాయి. నాటకాలతో మొదలుపెట్టి హిందీలో పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఐపీఎల్లో స్పోర్ట్స్ ప్రెజెంటర్గానూ కనిపించి ఆకట్టుకుంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ టైంలోనూ క్రికెట్ యాంకర్గా పనిచేసింది. అయితే సుందర్-సాహిబా మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా అనేది తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం డేటింగ్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్కి ఓ గుణపాఠం!)
క్రీడలు
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి 20,000 పరుగులను రోహిత్ పూర్తి చేసుకున్నాడు. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ను హిట్మ్యాన్ అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు.రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్( (34357), విరాట్ కోహ్లీ (27910), రాహుల్ ద్రవిడ్ (24208) ఈ ఘనత సాధించారు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 11486, టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. ఓవరాల్గా తన అంతర్జాతీయ కెరీర్లో ఈ ముంబైకర్ 50 సెంచరీలు నమోదు చేశాడు.వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కూడా రోహిత్(264) పేరిటే ఉంది. ఈ మ్యాచ్లో రోహిత్ 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ ఈ హాఫ్ సెంచరీతో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డు బ్రేక్👉సౌతాఫ్రికాపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఓపెనర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు ఓపెనర్గా సఫారీలపై మూడు ఫార్మాట్లు కలిపి 1758 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1734) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా వన్డేల్లో ఓపెనర్గా అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఓపెనర్గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 79 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్(78)ను అధిగమించాడు.డికాక్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. అనంతరం లక్ష్య చేధనలో భారత్ నిలకడగా ఆడుతోంది. 29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(83), విరాట్ కోహ్లి(7) ఉన్నారు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్లోనే!
టీమిండియాకు శుభవార్త.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. సఫారీ జట్టుతో తొలి టీ20 నుంచే అతడు అందుబాటులోకి రానున్నాడు.ఫిట్నెస్ సాధించాడుభారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వర్గాలు ఈ విషయాన్ని శనివారం ధ్రువీకరించాయి. గిల్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించినట్లు తెలిపాయి. ఈ మేరకు.. ‘‘CoEలో శుబ్మన్ గిల్ తన పునరావాసం పూర్తి చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు ఆడేందుకు ఫిట్నెస్ సాధించాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 9న కటక్ వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA T20Is) మధ్య మొదలయ్యే టీ20 సిరీస్కు గిల్ అందుబాటులోకి రానున్నాడు. కాగా స్వదేశంలో టీమిండియా సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. సఫారీల చేతిలో భారత జట్టు 2-0తో వైట్వాష్కు గురైంది.మెడనొప్పి కారణంగా..ఇదిలా ఉంటే.. తొలి టెస్టు సందర్భంగానే గిల్ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా బ్యాటింగ్ మధ్యలోనే నిష్క్రమించిన గిల్.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత.. అతడు రెండో టెస్టుతో పాటు.. వన్డే సిరీస్ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.ఈ క్రమంలో గిల్ టీ20 సిరీస్కు కూడా అందుబాటులో ఉంటాడో.. లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే, ప్రొటిస్ టీమ్తో పొట్టి సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటిచ్చిన యాజమాన్యం ఫిట్నెస్ ఆధారంగా జట్టుతో కొనసాగేది.. లేనిది తేలుతుందని పేర్కొంది. తాజాగా గిల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు వెల్లడించింది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్, ఫిట్నెస్కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్👉మొదటి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా👉రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్👉మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్👉నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్👉ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు
ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్..
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. వెన్నెముక గాయం నుంచి కమ్మిన్స్ పూర్తిగా కోలుకున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మూడో టెస్టుకు కమ్మిన్స్ అందుబాటులోకి రానున్నాడు.ఈ విషయాన్ని కమ్మిన్సే స్వయంగా ధ్రువీకరించాడు. వాస్తవానికి ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో ఈ స్టార్ ఆల్రౌండర్ ఆడాల్సి ఉండేది. కానీ ఆఖరి నిమిషంలో ముందుస్తు జాగ్రత్తగా అతడిని ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకోలేదు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తన బౌలింగ్ ప్రాక్టీస్ను కమ్మిన్స్ మొదలు పెట్టాడు. స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ సేవలను కోల్పోయిన ఆసీస్కు కమ్మిన్స్ రీ ఎంట్రీ కాస్త ఉపశమనం కలిగించే ఆంశంగా చెప్పుకోవాలి. "ఆడిలైడ్ టెస్టుకు సిద్దమవుతున్నాను. ఆదివారం(డిసెంబర్ 7) మరోసారి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఆ తర్వాత అడిలైడ్ వెళ్లాక కూడా నెట్స్లో బౌలింగ్ చేస్తాను. ప్రస్తుతం ఫిట్గా ఉన్నారు. నా శరీరం కూడా అద్భుతంగా సహకరిస్తోంది. ఈ గ్యాప్లో ఎటువంటి సమస్యలు రాకూడదని కోరుకుంటున్నానని" మూడో రోజు ఆట సందర్భంగా ఫాక్స్ క్రికెట్తో కమిన్స్ చెప్పుకొచ్చాడు. కమ్మిన్స్, హేజిల్వుడ్ లేకపోవడంతో బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్, మైఖేల్ నేసర్లతో కూడిన పేస్ ధళానికి స్టార్క్ నాయకత్వం వహిస్తున్నాడు. తొలి టెస్టులో ఆసీస్ బౌలర్లు అదరగొట్టారు. రెండో టెస్టులో కూడా ఫర్వాలేదన్పిస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మక సిరీస్లోని మూడో టెస్టు అడిలైడ్ ఓవల్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్లోనే!
దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర పరాభవం
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన అద్భుత ప్రదర్శనతో జాతీయ సెలక్టర్లకు మరోసారి సవాల్ విసిరాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో దుమ్ములేపుతున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శనివారం పుదుచ్చేరి (Puducherry)తో జరిగిన మ్యాచ్లో షమీ నిప్పులు చెరిగాడు. షమీ తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే షమీ సత్తాచాటినప్పటికి బ్యాటర్లు విఫలం కావడంతో బెంగాల్ 81 పరుగుల తేడాతో ఘోర ఓటమి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.పుదుచ్చేరి బ్యాటర్లలో ఆమన్ ఖాన్(74) హాఫ్ సెంచరీ సాధించగా.. జస్వంత్(45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో షమీతో పాటు చటర్జీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో బెంగాల్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.పుదుచ్చేరి బౌలర్ల దాటికి బెంగాల్ 13.5 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్గా కరణ్ లాల్(40) మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పుదుచ్చేరి బౌలర్లలో జయంత్ యాదవ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. సైదక్ సింగ్ మూడు, అయూబ్, అమన్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఈ సీజన్లో బెంగాల్కు ఇది రెండో ఓటమి.
న్యూస్ పాడ్కాస్ట్
ఉన్నత శిఖరాలకు మన బంధం. ఇండియా-రష్యా సదస్సులో సంయుక్త ప్రకటన చేసిన మోదీ, పుతిన్
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సక్రమంగా ఎక్కడ అమలు చేశారు?. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జీవో సాక్షిగా చంద్రబాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు... విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఆ కాలేజీలకు రాష్ట్ర ఖజానా నుంచి వంద కోట్ల రూపాయలు దోచిపెట్టే కుతంత్రం
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధి మాటున భూ దోపిడీ...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంతులేని భూదాహం... రాజధానిలో రెండో విడత కింద ఏడు గ్రామాల్లో 20 వేల 494 ఎకరాలకుపైగా భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో వరి రైతుల పరిస్థితి దయనీయం... ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం... దళారుల కనుసన్నల్లోనే ధాన్యం సేకరణ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం, దళారులతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టికొడుతున్నారు... సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
గుడ్న్యూస్.. మారిపోయిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు క్షీణించాయి. క్రితం రోజున ఎగిసిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) తగ్గాయి. ఇక వెండి ధరలు మరోసారి క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అఫర్డబుల్ జోన్..
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల.. ఎకరం రూ.100 కోట్లు పలుకుతున్న హైదరాబాద్లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల సాకారం కావాలంటే ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్ హౌసింగ్(చౌక ధరల ఇళ్లు) తగ్గుముఖం పట్టాయి.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నగరానికి దక్షిణ భాగంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫోర్త్ సిటీలో అఫర్డబుల్ హౌసింగ్కు కూడా ప్రత్యేకంగా జోన్ కేటాయించాలని డెవలపర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సంస్థలకు, క్రీడలకు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకు ఎలాగైతే ప్రత్యేకంగా జోన్లను కేటాయిస్తున్నారో.. చౌక గృహాల నిర్మాణాలకు కూడా స్థలాలను కేటాయించాల్సిన ఆవశ్యకత ఉందనేది నిపుణుల అభిప్రాయం.ఆకాశాన్నంటిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు కొనలేని విధంగా తయారైంది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ ఏర్పడింది. డబ్బు ఉండి, ఇల్లు ఉన్నవారు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. వేతనజీవులు తమ సంపాదనలో 40–45 శాతం అద్దెలకే చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్ములో ఇల్లు, సంసారం గడపడం గగనమైపోయింది. మార్కెట్లో గృహ యజమానులు ఎక్కువ, అద్దెదారులు తక్కువగా ఉంటేనే సమత్యులత. లేకపోతే అద్దెలు విపరీతంగా పెరిగి, జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ని తీసుకురావడం అత్యవసరం.రీ–డెవలప్మెంట్ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపులతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు. అయితే ఈ తగ్గింపులతో ప్రభుత్వానికి ప్రత్యక్ష రాబడి తగ్గినా.. నిర్మాణ సామగ్రి కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరగడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటి వాటితో పరోక్షంగా అంతకు రెట్టింపు ఆదాయమే సమకూరుతుంది.ఫ్యూచర్ సిటీలో అఫర్డబుల్ జోన్.. కో–ఆపరేటివ్ సొసైటీ, ఎంప్లాయిస్ యూనియన్లుగా ముందుకు రావాలి. భారత్ ఫ్యూచర్ సిటీలో సామాన్య, మధ్యతరగతికి స్థలాలను కేటాయించాలి. కమ్యూనిటీ లివింగ్కు ప్రత్యేకంగా జోన్ కేటాయించాలి. ప్రభుత్వ భూములను మ్యాపింగ్ చేసి, అఫర్డబుల్ హౌసింగ్కు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక అవసరాలను కల్పిస్తే చాలు.. అందుబాటు ధరల్లో డెవలపర్లకు భూములను అందిస్తే అఫర్డబుల్ హౌసింగ్లను నిర్మించే వీలుంటుంది. పెరీ అర్బన్ ఏరియాలో భూమారి్పడి, కన్వర్షన్ల ప్రక్రియను సులభతరం చేయాలి. అర్హులైన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ, తొలిసారి ఇల్లు కొనుక్కునేవారికి స్టాంప్ డ్యూటీలో రాయితీ అందించాలి. అఫర్డబుల్ ప్రాజెక్ట్లను నిర్మించే డెవలపర్లకు పన్ను రాయితీలను అందజేయాలి.నిర్మాణ అనుమతుల్లో వేగం.. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటిస్తూ.. ప్రీ–ప్యాబ్, త్రీడీ ప్రింటింగ్, మాడ్యులర్ టెక్నాలజీలతో ఇళ్లను నిర్మిస్తే త్వరితగతిన పూర్తవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్లేస్కూళ్లు, పార్క్లు, కమ్యూనిటీ స్పేస్లు వంటి సదుపాయాలను అందించాలి. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే మున్సిపల్, ఫైర్, రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్.. ఇలా 15 విభాగాలు, 170 డెస్క్ల ద్వారా వెళ్లాలి. ఇదే అనుమతుల జారీలో జాప్యానికి ప్రధాన కారణం.అలాకాకుండా అన్ని కీలక విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో 45 రోజుల్లో అనుమతులు ఇవ్వాలి. రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లకు స్టాంప్ డ్యూటీని, మహిళా కస్టమర్లకు ప్రత్యేక రిబేట్ను అందించాలి. క్లబ్హౌస్, ఎస్టీపీ, డబ్ల్యూటీపీ, లిఫ్ట్లు వంటివి కూడా నివాస జీవనంలో భాగమే. అందుకే వీటికి వాణిజ్య విద్యుత్ సుంకాల భారం నుంచి మినహాయించాలి.
‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత
ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్ బ్రాండ్ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.ముంబైలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ తమ ఎక్స్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లాక్మే బ్రాండ్ను భారతదేశంలో ప్రముఖ కాస్మెటిక్ కంపెనీగా అభివృద్ధి చేయడంలో సిమోన్ టాటా కృషిని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సిమోన్ టాటా కన్నుమూతపై లాక్మే ఇండియా కూడా సంతాపం తెలియజేసింది. లాక్మే వెనుక దార్శనికురాలిని కోల్పోయామంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.టాటా కుటుంబంలో చేరి..సిమోన్ టాటా.. ప్రసిద్ధ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాకు తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు సవతి తల్లి. 1930లో జన్మించిన సిమోన్ డునోయర్ జెనీవాలో పెరిగారు. 1953లో పర్యాటకురాలిగా భారత్ వచ్చిన ఆమె నావల్ హెచ్ టాటాను వివాహమాడి ఇక్కడే స్థిరపడ్డారు. 1962లో టాటా ఆయిల్ మిల్స్కు చిన్న అనుబంధ సంస్థగా ఉన్న లాక్మే బోర్డులో చేరారు. అందం లగ్జరీ కాకూడదని, ప్రతి భారతీయ మహిళకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లాక్మే ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేశారు.We mourn the passing of Simone Tata, a truly accomplished woman whose achievements and grace touched so many. Her legacy will continue to inspire generations. May she rest in peace. Our thoughts & prayers are with the Tata family 🙏#SimoneTata pic.twitter.com/y3sHlL7ngJ— Swiss Consulate Mumbai (@SwissCGMumbai) December 5, 2025
చిన్న ఇళ్లు చవకైపోయాయ్..!!
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూ.. విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. విశాలమైన స్థలం, ఆధునిక వసతులు, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్లకు ఆదరణ వృద్ధి చెందుతోంది.2022 నుంచి 2025 మధ్యకాలంలో లగ్జరీ ఇళ్ల ధరలు 40 శాతం మేర పెరగగా.. చౌక గృహాల రేట్లు 26 శాతం మేర క్షీణించాయి. 2022లో రూ.40 లక్షలోపు ధర ఉండే అఫర్డబుల్ ఇళ్ల ధరలు చ.అ.కు రూ.4,229గా ఉండగా.. 2025 నాటికి 26 శాతం వృద్ధి రేటుతో రూ.5,299లకు చేరింది.అదే రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే మిడ్ ప్రీమియం గృహాల ధరలు 2022లో చ.అ.కు రూ.6,880గా ఉండగా.. ఇప్పుడది 39 శాతం వృద్ధి రేటుతో రూ.9,537కు పెరిగింది. ఇక, రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ యూనిట్ల ధర 2022లో చ.అ.కు రూ.14,530లుగా పలకగా.. ఇప్పుడది 40 శాతం వృద్ధి రేటుతో రూ.20,300లకు ఎగబాకింది.
ఫ్యామిలీ
పుతిన్ ఇష్టపడే వంటకాలివే..!
భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, అధికారిక విందులో ఆయ ఇష్టంగా ఆస్వాదించే వంటకాలేవి, ముఖ్యంగా ఇలాంటి పర్యాటనలలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు తదితరాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.పుతిన్ భారత్ వంటకాలను రుచి చూస్తారేమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ పుతిన్ క్రమశిక్షణ, కఠినమైన భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి. ఆయన ఆహారానికి సంబంధించి.. ఫుల్ సెక్యూరిటీ మధ్య సైనిక పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సాధారణంగా హోటల్ లేదా ఇతర దేశాల ఆతిథ్యంలో తయారు చేసిన భోజనాన్ని చాలా అరుదుగా తీసుకుంటారట పుతిన్. మాములుగా అయితే శిక్షణ పొందిన రష్యన్ చెఫ్లు, సహాయక సిబ్బంది పుతిన్ వెంట వస్తుంటారు. కాబట్టి వారే ఆయన భోజనం గురించి స్వయంగా చూసుకుంటారు. అందువల్ల ఆయన ఎలాంటి ఆహారం తీసుకుంటారనేది చాలా సీక్రెట్గా ఉంది. అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం..ఆయన ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధ్యానత ఇస్తారట. ప్రతి ఉదయం తేనె లేదా గంజితో ట్వోరోగ్(రష్యన్ కాటేజ్ చీజ్)తో ప్రారంభమవుతుందట. తాజా జ్యూస్, కౌజు పిట్ట గుడ్లతో చేసిన ఆమ్లెట్, తక్కువ చక్కెర కలిగిన ఆహారాలు వంటి వాటినే తీసుకుంటారట.ఆయన ఎర్ర మాంసం కంటే తాజా చేపలు అది కూడా కాల్చినవి ఇష్టంగా తింటారట. లేత గొర్రెపిల్ల మాంసం కూడా అప్పడప్పుడూ తీసుకుంటారట. ఇక ఆయన భోజనంలో ఎక్కువుగా టమోటాలు, దోసకాయలు, ఇతర ప్రాథమిక కూరగాయల సలాడ్లు తప్పనిసరిగా ఉంటుందట.ఇక జ్యూస్లలో కూడా మూలికా పానీయాలు, కేఫీర్, బీట్రూట్-ముల్లంగి జ్యూస్ వంటివి తీసుకుంటారట. ఇక పుతిన్కు పిస్తా ఐస్ క్రీం మహా ఫేవరెట్ డిజర్ట్ అట. చివరగా ఆయన క్రమశిక్షణతో కూడిన సంప్రదాయ ఆహారానికే కట్టుబడి ఉంటారట. చాలామటుకు ప్రోటీన్ కంటెంట ఉన్నవి, పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు పుతిన్ సన్నిహితులు.(చదవండి: అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..)
రెండున్నర నెలల భారత్ పర్యటనలో గమనించింది ఇదే..!
అమెరికా భారత్ మధ్య సాంస్కృతిపరంగా, సామాజికంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేకంగా ఎంతలా ఆ వ్యత్సాసం ఉంటుదనేది తెలియదు. అయితే ఇటీవల భారత్లో గడిపి వెళ్లిన ఇద్దరు పిల్లలు తల్లి ఆ విభిన్నతను క్షుణ్ణంగా గమనించి మరీ నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటో తెలిస్తే మాత్రం ఇంత తేడా ఉందా ఇరు దేశాల మధ్య అనిపిస్తుంది. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. రెండున్నర నెలల పర్యటన కోసం కుటుంబంతో సహా భారత పర్యటన వచ్చిన ఇద్దరు పిల్లల తల్లి అన్నా హాకెన్సన్ ఇన్స్టాగ్రామ్లో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. తనకు రెండు దేశాలు ఎంత భిన్నంగా ఉంటుందో తెలుసుగానీ, వాస్తవికంగా అదెలా అనేది స్పష్టంగా తెలియదని చెప్పుకొచ్చింది. కానీ ఈపర్యటనలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానంటూ ఆ ఇరుదేశాల వ్యత్యాస జాబితా గురించి వివరించింది. ఆమె గమనించి తొమ్మది తేడాలు ఏంటంటే..హాంకింగ్: అమెరికాలో హాంకింగ్ అంటే వేరే అర్థం వస్తుంది, కానీ భారతదేశంలో, హాంకింగ్ అంటే, "హాయ్, నేను ఇక్కడ ఉన్నాను, చూడండి, ధన్యవాదాలు". అని అర్థం. మాటిమాటికి గట్టిగా అరుస్తు మాట్లాడతారని అర్థం.ఆహారం: అమెరికాలో, కారం అంటే తేలికపాటి వేడి అని అర్థం. కానీ భారతదేశంలో, కారం అంటే కొన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది, ముఖ్యంగా విదేశీయులకు.ప్రజలు: యూఎస్ఏ మనం ఉన్నట్లు ఎవ్వరూ గుర్తించరు, పైగా గమనించనట్లు నటిస్తారు. అదే భారత్లో అవతలి వాళ్లు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనే కుతుహలం ఎక్కువ.చెత్త: USAలో చెత్త డబ్బాల్లో చెత్త ఉంటే భారతదేశం దీని గురించి స్పష్టంగా చెప్పలేము. అది ప్రాంతం బట్టి మారిపోతుంటుంది.కార్లు: యూఎస్లో ట్రాఫిక్ చట్టాలను పాటిస్తారు. కానీ భారతదేశంలో బయట నుంచి వచ్చేవారికి అర్థంకానీ గందరగోళంగా కనిపిస్తుంది.వాతావరణం: అమెరికా - శీతాకాలం, వసంతకాలం, వేసవి, చాలా ప్రదేశాలలో శరదృతువు; భారతదేశం: వేడి అది కూడా ఆశ్చర్యకరమైన రేంజ్లో అదనపు వేడి ఉంటుంది.మతం: అమెరికా - ఎక్కువగా కాథలిక్ చర్చిలు, నిశ్శబ్ద సమావేశాలు; భారతదేశం: ప్రతిచోటా దేవాలయాలు, నగరాలను ఆక్రమించే పండుగలు.స్థోమత: యూఎస్లో ప్రతీది ఖరీదైనది, కానీ భారత్లో పర్లేదు, నిర్వహించగలం.కుటుంబం: అమెరికా - ఒకే కుటుంబ జీవనం; భారతదేశం - ఒకే చోట బహుళ తరాలు చూడొచ్చు. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు.."మా దేశానికి అపరిచిత వ్యక్తే అయినా..మీరు చాలా క్షుణ్ణంగా వ్యత్యాసాలను గమనించారు . చాలా గ్రేట్." అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Anna Haakenson | Adventure Family Travel (@wanderlust.haaks) (చదవండి: ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్కు..!)
ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్కు..!
కుటుంబ పోషణార్థం టెన్త్కే చదువుకి స్వస్తి పలికాడు. ఏదో సాధించేద్దాం అనుకుంటూ ముంబై మహానగరంలో అడుగుపెట్టాడు. అది కూడా జేబులో కేవలం రూ. 200లతో కుటుంబ సభ్యులకు చెప్పపెట్టకుండా వచ్చేశాడు. అక్కడ బాంద్రాస్టేషన్లో పరిచయమైన స్నేహితుడి చేతిలో మోసానికి గురయ్యా..రోడ్డుపై నిలబడిపోయాడు. కట్చేస్తే..ఏంలేదు అన్న పరిస్థితిని నుంచి ఏకంగా 50 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. స్వయంకృషితో పైకొచ్చిన మరో సాంబయ్య అతడు..అతడే దోసప్లాజ్ వ్యవస్థాపకుడు ప్రేమ్ గణపతి. తల్లిదండ్రులు ఏడుగురు తోబుట్టువులతో కడు పేదరికంలో ఉన్న కుటుంబాన్ని పేదరికం నుంచి బయపటపడేయాలన్న ఆరాటంతో ముంబైకి ఒంటరిగా వచ్చేశాడు. అది కూడా కేవలం రూ. 200 రూపాయాలతో మహానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ బాంద్రా స్టేషన్లో పరిచయమైన స్నేహితుడే తోడు అనుకుంటే..తనదగ్గరున్న ఆ కాస్త డబ్బుని తీసుకుని పరారయ్యాడు. తోపుడు బండితో మొదలైన వ్యాపారం..తొలిసారిగా నమ్మకంతో చెలగాట మాడిన స్నేహితుడిని ఎదుర్కొని తల్లడిల్లిపోయాడు. ఏం చేయాలి..ఆకలిని ఎలా ఓర్చుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో కూడా ఆశను వెతుక్కుంటూ ఓ బేకరీలో ప్లేట్లు కడిగే పనికి కుదిరాడు. అలా నెలకు 150 రూపాయలు సంపాదించేవాడు. పడుకోవడానికి కటికి నేలపై స్థలం ఏర్పరుచుకున్నాడు. అలా ప్రతి నెల సంపాదించిన డబ్బుని ఆదాచేసి ఒక హ్యాండ్ బండిని అద్దెకు తీసుకున్నాడు. పాత్రలు స్టవ్ కోసం దాదాపు రూ. వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అలా వాషి రైల్వే స్టేషన్ ఎదురగా ఉన్న వీధిలో ఇడ్లీలు, దోసెలు అమ్మడం ప్రారంభించాడు. అది చూడటానికి కేవలం ఒక బండి, కానీ కస్టమర్లకు చాలా పరిశుభ్రంగా అందించే ఆహార ప్రదేశంగా వారి మనసులను గెలుచుకున్నాడు. తన సోదరులను ఈ పనిలో చేర్చుకుని..అందమైన బట్టలు, టోపీలతో కస్టమర్లను ఆకర్షించేలా వ్యాపారం చేశాడు. అతడి భోజనంలోని రుచి త్వరలో వేలాది మంది ప్రజలకు చేరువై నెలకు దాదాపు రూ. 20 వేలు టర్నోవర్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. వారంతా ఒకే అద్దె గదిలో ఉండేవారు. నిరంతరం జీవనాధారమైన తమ తోపుడు బండి, వంటగది కమ్ బెడ్రూం తమనుంచి లాగేసుకుంటారనే భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలా ఐదేళ్ల తర్వాత 1997లో చిన్న స్థలంలో ప్రేమ్ సాగర్ దోస ప్లాజా హోటల్ని పెట్టుకునే రేంజ్కి వచ్చాడు. అలా పుట్టింది షెజ్వాన్ దోస..అక్కడకు వచ్చిన విద్యార్థులు, స్నేహితులై ఇంటర్నెట్ని పరిచయం చేశారు. దాని సాయంతో ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల వంటకాలపై అవగాహన ఏర్పరుచుకున్నాడు. అలా పలు ప్రయోగాలు చేస్తూ ఉండగా..షెజ్వాన్ దోస అనే రెసిపీని కనుగొన్నాడు. అక్కడ నుంచి వెనుదిరగకుండా ఏకంగా 105 రకాల దోసెలను సృష్టించాడు. ఆ తర్వాత మాల్లో తన వ్యాపారానికి కాస్త చోటు ఇవ్వమని అడగగా బ్రాండ్ కాదంటూ పోమ్మన్నారు మాల్ నిర్వాహకులు. మరో సెంటర్ వన్మాల్ నిర్వాహకులకు అతడి చేతి ఆహారం రుచి గురించి తెలుసు. దాంతో వాళ్లు వ్యాపారం పెట్టుకునేందుకు స్థలాన్ని అందించారు. అక్కడ నుంచి మరిన్ని దుకాణాలు పెట్టమంటూ అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ఆ సింగిల్ తోపుడు బండి నుంచి భారతదేశం నుంచి దుబాయ్, ఆస్ట్రేలియా వరకు విస్తేరించేలా 70కి పైగా దుకాణాలు వెలిసాయి. ఆ రోజు మోసగింపబడిని రూ. 200లతో మొదలైన ప్రస్థానం ఇప్పుడూ ఏడాదికి రూ. 50 కోట్ల టర్నోవర్ అందుకునే వ్యాపారాన్ని నిర్మించే రేంజ్కి చేరాడు. చివరగా ప్రేమ్ గణమపతి మాట్లాడుతూ..ఇదంతా అకస్మాత్తుగా వచ్చిన ఐడియా కాదని, రెండు చేతులు ఖాళీగా ఆకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడూ మోసానికి గురైన రైల్వేస్టేషన్ని దురదృష్టకరమైన ప్రదేశం చూడలేదని అంటాడు. ఇదే ప్రదేశం తనకు ఏదో మార్గాన్ని చూపిస్తుందని వెతుక్కుంటూ వెళ్లాను అలా దొరికిన ప్లేట్లు కడిగే పనే తన పాలిట దైవంగా నమ్మా..అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటాడు ప్రేమ్ గణపతి.దొరికిన చిన్న పనిని చూసి నిరాశ పడకుండా..ఒక్కో మెట్టుని చేసుకుంటూ..అభ్యున్నతికి మార్గం వేసుకుని యువతకు ప్రేరణగా నిలవడమే గాక, మోసపోవడం అంటే దురదృష్టం కాదు..స్ట్రాంగ్ నిలబడేందుకు పునాది అని ప్రేమ్ గణపతి కథ చెప్పకనే చెబుతోంది. అంతేగాదు "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషలవుతారు అన్న నానుడికి సరైన అర్థం మన ప్రేమ్ గణపతి" కదూ..!
ఐఎన్ఐ సెట్లో సత్తా చాటిన మహిళా డాక్టర్..!
పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఐఎన్ఐ సెట్–2025లో ఆలిండియా 7వ ర్యాంకు పొంది వార్తల్లో నిలిచింది డాక్టర్ సాయి త్రిషారెడ్డి. కిందటి నెలలో విడుదలైన ఈ ఫలితాలలో తొలి ప్రయత్నంలోనే దక్షిణాదిలో మొదటి ర్యాంకు సాధించింది. హైదరాబాద్లోని బీరంగూడలో ఉంటున్న సాయి త్రిషారెడ్డి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్లో ఎంబీబీఎస్ హౌస్ సర్జన్గా చేస్తోంది. ‘కత్తిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలిసినట్టే యువతకు ఆన్లైన్ను ఉపయోగించడం కూడా అంతే స్మార్ట్గా తెలిసి ఉండాలి’ అంటూ తన ప్రిపరేషన్ వర్క్ గురించి తెలిపింది..‘‘మాది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా గురజాల. అమ్మా నాన్నలు బారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అనంత లక్ష్మీ నా చిన్నతనంలోనే హైదరాబాద్లో స్థిరపడ్డారు. నాన్న బిజినెస్ రంగంలో ఉండగా, అమ్మ స్కూల్ టీచర్. కుటుంబ నేపథ్యంలో ఎవరూ డాక్టర్లు లేరు. నాన్న స్నేహితుల్లో డాక్టర్లు ఉండటం చూసి, నేనూ వైద్యవృత్తిపై ఆసక్తి పెంచుకున్నాను. ఇండియాలోనే పేరొందిన ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేయాలనే ప్రయత్నం ఫలించాక, నా లక్ష్య సాధనలో సరైన దిశగా ఉన్నాను అనిపించింది. 2020 నీట్ ఫలితాల్లో 14వ ర్యాంకు, మహిళల విభాగంలో 6 వ ర్యాంకు వచ్చింది. ఈ యేడాది ఐఎన్ఐ–సెట్లో ఆల్ ఇండియా 7వ ర్యాంకు, దక్షిణాదిన నేనొక్కదాన్నే నిలవడం మరింత సంతోషాన్నిచ్చింది. సోషల్ మీడియాకు దూరంన్యూ ఢిల్లీ ఎయిమ్స్లో హౌస్సర్జన్గా వర్క్ చేస్తూనే పీజీ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఏదీ ఎవరికీ సులువుగా రాదు, దానికి తగిన క్రమశిక్షణతో ప్లానింగ్ చేసుకోవడమే మన ముందున్న మార్గం. ప్రిపరేషన్కి రోజూ ఒకే టైమ్ దొరికేది కాదు. వర్క్ షిఫ్టులు మారుతూ ఉండేవి. ఆరు గంటలు వర్క్, మిగతా టైమ్లో ప్రిపరేషన్ ప్లానింగ్కి కేటాయించుకున్నాను. ఆన్లైన్లో ఇంటర్వ్యూలు, కొన్నియాప్స్ గైడ్లైన్స్ తీసుకున్నాను. సోషల్మీడియాకు మాత్రం పూర్తి దూరంగా ఉన్నాను. ఒత్తిడిగా అనిపించినప్పుడు మాత్రం వాకింగ్, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, అమ్మానాన్నలతో మాట్లాడటం మాత్రమే చేశాను. దాదాపు 9 నెలల ప్రిపరేషన్ నన్ను నా లక్ష్య సాధనకు చేరువచేసింది. దాదాపు ఈ ఎగ్జామ్కు దేశవ్యాప్తంగా ఎనిమిది వేల మందికి పైగా హాజరయ్యారు. ఎంత పెద్ద పరీక్ష, ఎంత మంది పాల్గొంటున్నారు.. అనే భయం ఏ విషయంలోనూ ఎప్పుడూ సరైనది కాదు. నాలో ఉన్న శక్తి ఎంత... అనేదానిపైనే దృష్టి పెట్టాను. అదే ఈ రోజు నన్ను అగ్రస్థానంలో ఉంచింది’ అని తెలినారు ఈ యువ వైద్యురాలు. ఐఎన్ఐ సెట్లో దక్షిణ భారత దేశం నుండి పాల్గొన్న అభ్యర్థులలో ఏకైక మహిళా డాక్టర్గా తన ప్రతిభను చాటుకొని తెలుగు వారికి గర్వ కారణమయ్యింది. ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో వైద్య విద్యార్థి గానే కాకుండా అందరిలోనూ ఉత్తమ ఫలితాలను సాధించి భవిష్యత్ డాక్టర్లకు స్ఫూర్తిగా నిలిచింది.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
అంతర్జాతీయం
చికిత్సకోసం ఖలీదా జియా లండన్కు!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాను మెరుగైన చికిత్సకోసం లండన్ తరలిస్తున్నారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) అధినేత్రి అయిన జియా ఊపిరితిత్తులు, గుండెలో ఇన్ఫెక్షన్ల కారణంగా నవంబర్ చివరి వారంలో ఆస్పత్రిలో చేరారు. వారంరోజుల్లో ఆమె ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ప్రభుత్వ తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనస్ బుధవారం ఆస్పత్రిని సందర్శించారు. ఆమె ఆరోగ్య గురించి ఆరా తీశారు. జియా కుమారుడు బీఎన్పీ తాత్కాలిక చైర్ పర్సన్ తారిక్ రెహమాన్ 2008 నుంచి లండన్లో ఉంటున్నారు. తల్లి అనారోగ్యం గురించి ఆయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అవామీ లీగ్ పాలనలో అప్పటి సైనిక మద్దతుతో మాజీ ప్రధాని షేక్ హసీనా అవినీతి, క్రిమినల్ కేసుల్లో ఆయనను దోషిగా తేల్చడంతో తాను, తన దేశానికి వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నారు.
స్నేహ‘వృక్షం’
లండన్ నగరంలోని ట్రాఫాల్గర్ స్క్వేర్.. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు, పండుగ శోభతో నిండిపోతుంది. ఆ స్క్వేర్ మధ్యలో నిటారుగా.. వేలాది కాంతులతో వెలిగిపోయే ఒక అద్భుతమైన క్రిస్మస్ చెట్టు కనువిందు చేస్తుంది. ఇది కేవలం ఒక చెట్టు కాదు.. నార్వేజియన్ ప్రజల హృదయం నుండి వచ్చిన ఒక కృతజ్ఞతా బహుమతి. లండన్, నార్వే రాజధాని ఓస్లో నగరాల మధ్య కొనసాగుతున్న ఈ వార్షిక సంప్రదాయం వెనుక దాగిన కథ, మానవ సంబంధాల గొప్పతనాన్ని, చరిత్రను గుర్తు చేస్తుంది. కష్టకాలంలో పుట్టిన స్నేహం ఈ బంధానికి రెండో ప్రపంచ యుద్ధం కల్లోలంలో పునాదులు ఏర్పడ్డాయి. 1940లో, నాజీ జర్మనీ నార్వేపై దండెత్తినప్పుడు, అప్పటి నార్వే రాజు హాకాన్–7, అతని ప్రభుత్వ ప్రతినిధులు లండన్కు శరణార్థులుగా వచ్చారు. అక్కడే ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్ గడ్డ నుండే నార్వేజియన్ ప్రతిఘటన ఉద్యమానికి బలం చేకూర్చారు. అంతేకాదు, నాజీలు రేడియోలను నిషేధించినా, బీబీసీ సహకారంతో లండన్ నుండి రహస్యంగా నార్వేజియన్ భాషలో వార్తలను ప్రసారం చేసేవారు. ఆ వార్తలు నార్వే దేశ ప్రజలకు ధైర్యాన్ని, ఆశను నింపిన జీవనాడులు. నిరాశలో ఉన్న వేలాది నార్వేజియన్లకు అక్షరాలా అవి ఓ సాంత్వన! హృదయం నుండి వచ్చిన కానుక యుద్ధం ముగిసిన తర్వాత, నార్వే ప్రజలు తమకు ఆశ్రయం ఇచ్చి, తమ స్వాతంత్య్ర పోరాటానికి సహాయం చేసినందుకు బ్రిటన్పై అపారమైన కృతజ్ఞతను చూపాలనుకున్నారు. ఆ ప్రేమే 1947లో ఓస్లో నగర పాలక సంస్థ ఈ వార్షిక క్రిస్మస్ ట్రీ బహుమతిని ప్రకటించడానికి దారి తీసింది. ఈ బహుమతి కేవలం అలంకరణ వస్తువు కాదు. ‘ఓస్లో ప్రజల స్వేచ్ఛా స్ఫూర్తికి లండన్ ప్రజలు ఇచి్చన అండ’కు ప్రతీక. ‘ఎవర్ ఓస్లో’సాహస యాత్ర ఏటా ఓస్లో అడవుల్లో పెరిగే నార్వేజియన్ స్ప్రూస్ జాతి చెట్టును మాత్రమే ఎంపిక చేస్తారు. కొన్నేళ్ల ముందుగానే నాణ్యమైన చెట్లను గుర్తించి, వాటికి ప్రత్యేక సంరక్షణ అందిస్తారు. ఈ ఏడాది చెట్టుకు ముద్దుగా ‘ఎవర్ ఓస్లో’అని పేరు పెట్టారు. సుమారు 60 ఏళ్ల వయసు, 20 మీటర్ల ఎత్తు ఉన్న ఈ చెట్టు, వేలాది చెట్ల నుండి ఎంపికైంది. నవంబర్ 21న జరిగిన ప్రత్యేక వేడుకలో దీనిని నరికి, ఓ ప్రత్యేక ఉయ్యాలలో ఉంచి, రోడ్డు మార్గంలో ఓడరేవుకు తరలించారు. అక్కడి నుండి మొదలైంది అసలు ప్రయాణం. దాదాపు 26 గంటల పాటు సముద్రంలో ప్రయాణించాక ఆ చెట్టు లండన్కు చేరుకుంది. లండన్ చేరుకున్నాక, దాన్ని ట్రక్కులో ట్రాఫాల్గర్ స్క్వేర్కు తరలించారు. ఈ ప్రయాణమంతా ఆ చెట్టు.. రెండు దేశాల స్నేహ సందేశాన్ని మోసుకొచ్చిన ఒక రాయబారిలా సాగింది. సంప్రదాయ దీపాలంకరణ సోషల్ మీడియాలో ఈ చెట్టును ‘బ్రిటన్ జాతీయ నిధి’గా అభివర్ణిస్తారు. ఏటా డిసెంబర్ మొదటి గురువారం జరిగే దీపాలంకరణ వేడుకతో లండన్లో క్రిస్మస్ కౌంట్డౌన్ మొదలవుతుంది. ఈ చెట్టుకు నార్వేజియన్ సంప్రదాయం ప్రకారం నిలువు వరుసలలో దీపాలను అమరుస్తారు. ఈ కాంతులు.. స్క్వేర్లోని ప్రజలకు ఆశ, శాంతి సందేశాన్ని ఇస్తాయి. ఈ క్రిస్మస్ ట్రీ, జనవరి 5 వరకు ట్రాఫాల్గర్ స్క్వేర్లో ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత దీనిని కంపోస్ట్ తయారీకి వినియోగిస్తారు. ప్రతి క్రిస్మస్కు నార్వే పంపే ఈ ట్రీ బహుమతి, కేవలం పండుగ ఆనందం కోసం కాదు. యుద్ధ గాయాలను, మళ్లీ వెలిగించిన ఆశలను గుర్తుచేసే శాశ్వత చిహ్నం. ట్రాఫాల్గర్ స్క్వేర్లో ఈ దీపాలు వెలిగిన ప్రతిసారీ, అది క్రిస్మస్కు సంకేతం మాత్రమే కాదు.. కష్టకాలంలో ఒక దేశం మరో దేశానికి ఇచ్చిన అండ.. సాటి మనిషిపై చూపిన మానవత్వం.. నేటికీ సజీవంగా ఉన్నాయనడానికి హృదయపూర్వకమైన, శాశ్వతమైన కృతజ్ఞతా వెలుగు!– సాక్షి, నేషనల్ డెస్క్
మాలిలో ఇద్దరు తెలుగు కార్మికుల కిడ్నాప్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఉపాధి కోసం ఆఫ్రికా దేశమైన మాలికి వెళ్లిన తెలంగాణ, ఏపీకి చెందిన ఇద్దరు యువకులను జమాత్ నుస్రత్ అల్–ఇస్లామ్ వల్–ముస్లిమీన్ (జేఎన్ఐఎం) సంస్థకు చెందిన తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస ప్రవీణ్ (23), ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని పొదరళ్లపల్లికి చెందిన రామచంద్ర (25) గతేడాది హైదరాబాద్కు చెందిన ఓ బోర్వెల్ కంపెనీ పనిపై డ్రిల్లర్లుగా మాలి దేశంలోని కోబ్రి సమీపంలో పనిచేస్తున్నారు. గత నెల 23న వారు పని ముగించుకొని వస్తుండగా సాయుధులైన జేఎన్ఎంఐ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.వారి ఫోన్లను స్వా«దీనం చేసుకొని స్విచ్ఛాప్ చేయడంతో కిడ్నాప్ సమాచారం ఆలస్యంగా భారత ఎంబసీతోపాటు వారి కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. పనుల సీజన్ పూర్తయ్యాక వస్తానని కిడ్నాప్నకు ఒకరోజు ముందు తన కొడుకు ఫోన్ చేసి చెప్పాడని ప్రవీణ్ తండ్రి జంగయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన చెందారు. మరోవైపు బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు మాలిలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.తీవ్రవాదుల డిమాండ్లను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఎంబీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అల్కాయిదాకు చెందిన జేఎన్ఐఎం.. సహెల్ ప్రాంతంలో (మాలి, నైజర్ మొదలైన దేశాలు) మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఆర్థిక యుద్ధం‘వ్యూహంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటోంది. గత ఆరు నెలల్లో (మే నుంచి అక్టోబర్ వరకు) 22 మంది విదేశీయులను బంధించింది. అందులో కొందరు విడుదలవగా మరికొందరు ఇంకా తీవ్రవాదుల చెరలోనే ఉన్నారు. బందీల విడుదలకు తీవ్రవాదులు ఆర్థిక డిమాండ్లు పెడుతున్నారు.
పాక్తో ఇంకా సంబంధాలెందుకు?
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు పెద్దపీట వేస్తుండగా.. అమెరికా ఎంపీలు మాత్రం మునీర్పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 44 మంది అమెరికా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను ఆ దేశ విదేశాంగ మంత్రికి పంపారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇకపై అమెరికాలోకి రాకుండా.. ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. 44 మంది ఎంపీలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియోకు లేఖ రాశారు. ఇప్పుడు ఈ అంశం అమెరికాలో సంచలనంగా మారింది. ఆసిమ్ మునీర్ ఒక నేరగాడని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్పైనా చర్యలు తీసుకోవాలని అమెరికా ఎంపీలు తమ లేఖలో పేర్కొన్నారు. మునీర్పై తక్షణమే ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ లేఖ రాసిన వారిలో డెమోక్రటిక్ సభ్యులు ప్రమీలా జయపాల్, గ్రేగ్ కస్సార్ వంటివారు ఉన్నారు. పాకిస్థాన్లో ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతోందని, ఆ దేశంలో నియంతృత్వం, హింసా పెరిగాయని, జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని పేర్కొంటూ.. వర్జీనియా జర్నలిస్టు నూరానీ కిడ్నాప్ ఉదంతాన్ని ప్రస్తావించారు వర్జీనియా జర్నలిస్టు అహ్మద్ నూరానీ పాకిస్థాన్ సైన్యంలో అవినీతిపై వరుస కథనాలు రాశారు. ఆ తర్వాత నూరానీ, పాకిస్థాన్లో ఉంటున్న అతని ఇద్దరు సోదరులు అపహరణకు గురయ్యారు. నెలరోజులకు పైగా వారిని పాక్ సైన్యం నిర్బంధించింది. ఆ తర్వాత విడుదల చేసింది. వీరితోపాటు.. ప్రముఖ సంగీత దర్శకుడు సల్మాన్ అహ్మద్ బావమరిది కిడ్నాప్ ఉదంతాన్ని కూడా ఎంపీలు తమ లేఖలో ప్రస్తావించారు. అమెరికా జోక్యం తర్వాతే అతను విడుదలైన విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్థాన్లో విపక్ష నాయకులపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. వారిని జైలులో నిర్బంధిస్తున్నారని, సోషల్ మీడియాలో గళమెత్తే సాధారణ పౌరులను హింసిస్తున్నారని, మహిళలు, మైనారిటీలు, బలూచిస్థాన్ పౌరులు హింసకు గురవుతున్నారని పేర్కొన్నారు.ఇంకా ఆ లేఖలో ఏయే అంశాలను ప్రస్తావించారు?2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంపై దర్యాప్తు జరపాలని ఎంపీలు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పటాన్ రిపోర్టు పూర్తిగా తప్పుడు సాక్ష్యాలు, అబద్ధాలతో నిండి ఉందని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చింది కేవలం తోలుబొమ్మ ప్రభుత్వమేనని విమర్శించారు. సైన్యమే డీఫాక్టోగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు కూడా సైనిక న్యాయస్థానాలు సాధారణ పౌరులపై విచారణ జరపవచ్చని తీర్పునివ్వడం సహజ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఒక్క తీర్పును బట్టే పాకిస్థాన్లో పరిపాలన సైన్యం నియంత్రణలోకి వెళ్లిందని స్పష్టమవుతున్నట్లు వివరించారు. ఇదే లేఖలో ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం, అతని మృతిపై వస్తున్న వార్తలను గురించి ప్రస్తావించారు. అమెరికా చట్టాల ప్రకారం 44 మంది ఎంపీలు రాసిన లేఖను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఆరోపణలను ఎదుర్కొనేవారి వీసాపై అమెరికా నిషేధం విధించాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన ఆస్తులు అమెరికాలో ఉంటే.. వాటిని జప్తు చేసే అవకాశాలుంటాయి.
జాతీయం
బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని ఏలిన ‘షీరో’ ఇక లేరు: 5 ఆసక్తికర అంశాలు
సాక్షి, ముంబై: టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సవతి తల్లి సైమన్ టాటా (95) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో దుబాయ్లోని కింగ్స్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స పొందిన తర్వాత ఈ ఆగస్టు ప్రారంభంలో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.సైమన్ టాటా అస్తమయం పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా , లక్మే మాజీ చైర్పర్సన్ , భారతదేశ బ్యూటీ అండ్ రిటైల్ ల్యాండ్స్కేప్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరంటూ ఆమెకు నివాళులర్పించారు. నా షీరో ఇక లేరంటే చాలా బాధగా ఉంది, "మహిళా వ్యాపార నాయకులలో అగ్రగామి"అని తన సంతాపాన్ని ప్రకటించారు.సైమన్ టాటాకు సంబంధించి ఆసక్తికర సంగతులు.స్విట్జర్లాండ్లోని జెనీవాలో జన్మించారు సైమన్ నావల్ డునోయర్ 1953లో భారతదేశానికి పర్యాటకురాలిగా వచ్చారు. రెండేళ్ల తరువాత 1955లో ఆమె నావల్ హెచ్. టాటాను వివాహం చేసున్నారు.1960ల ప్రారంభంలో టాటా గ్రూప్తో తన వృత్తిపరమైన అనుబంధాన్ని ప్రారంభించారు.1961లో టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లక్మే బోర్డులో చేరారు. 1982లో ఆమె చైర్పర్సన్గా నియమితులయ్యారు.భారతదేశ ఆధునిక సౌందర్య సాధనాల రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గాను "కాస్మెటిక్ క్జారినా ఆఫ్ ఇండియా" అనే బిరుదును దక్కించుకున్నారు.వెస్ట్సైడ్ & ట్రెంట్ రిటైల్ వ్యవస్థాపకురాలుగా ఆమె ఫ్యాషన్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1998లో లక్మీని హిందూస్తాన్ యూనిలీవర్కు విక్రయించిన తర్వాత, సిమోన్ టాటా రిటైల్ విభాగమైన ట్రెంట్ లిమిటెడ్కు నాయకత్వం వహించారు.తరువాత వె స్ట్సైడ్ను ప్రారంభించి భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఫ్యాషన్ రిటైల్ చెయిన్గా తీర్చిదిద్దారు. ఇపుడు ఆ తరువాత జూడియో స్టోర్లలోకి విస్తరించింది.లక్ష కోట్ల రూపాయల రిటైల్ అండ్ బ్యూటీ సామ్రాజ్యాన్ని స్థాపించిన సైమన్ చాలా లోప్రొఫైల్మెయింటైన్ చేసేవారు. తన జీవితంలోని అనేక సవాళ్లను అధిగమించి విజయ వంతమైన వ్యాపారవేత్తగా, దార్శనికురాలిగా తన పేరును శాశ్వతం చేసుకున్న గొప్ప మహిళ సైమన్ టాటా.ఆమెకు కుమారుడు నోయెల్ టాటా, కోడలు ఆలూ మిస్త్రీ , మనవరాళ్ళు నెవిల్లే, మాయ , లియా ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్
గలీ గలీ మే చోర్ హై!
పోలీసింగ్ వ్యవస్థ ఇప్పుడు టెక్నాలజీని మాగ్జిమమ్ వాడేసుకుంటోంది. అయినా కూడా.. దొంగల చేతిలో తాళాలు విరిగిపోతూనే ఉన్నాయి. కళల్లో చోరకళ ఒకటి అంటారు కదా!. దేశంలో ఎన్ని కళలు అంతరించిపోతున్నా.. చోర కళ మాత్రంకు అలాంటి దుస్థితి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. నేరగణాంకాల నివేదిక ఒకటి ఈ విషయాన్నే బల్లగుద్ది మరీ చెబుతోంది. ప్రతి లక్ష మందికి సగటున 49.5(50 అనుకోండి ఇక) చోరీకి గురవుతున్నారట. ఆ వివరాలేంటో కాస్త లోతుగా చూద్దాం..చోర కళకు స్వర్గధామంగా (పోలీసుల పరిభాషలో హాట్స్పాట్ అని అందురు).. మహారాష్ట్ర (70.4), రాజస్థాన్ (50.9), మధ్యప్రదేశ్ (41.0) వంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ (42.5), బీహార్ (37.5), కర్ణాటక (36.8), ఒడిశా (36.3) కూడా జాతీయ సగటు దరిదాపుల్లో కేసులు నమోదు చేస్తున్నాయి.చండీగఢ్, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం దొంగలకు కలుగుతోంది. సగటును పరిశీలిస్తే.. లక్ష మందికి చండీగఢ్లో 114.3 కేసులు, ఢిల్లీలో 106.3 కేసులు నమోదు అవుతున్నాయి. అంటే ఇవి దేశ సగటు కంటే రెండింతలు ఎక్కువన్నమాట!. ప్చ్.. ఈ విషయంలో చిన్న రాష్ట్రాలు ఏం వెనకబడిపోలేదు. మిజోరాం (94), మణిపూర్ (74.1) లాంటి ఈశాన్య ప్రాంతాలు కూడా దొంగల బారిన పడుతున్నాయి.అయితే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం చోర కళకు చిక్కులు తప్పడం లేదు. తమిళనాడు (23.1), కేరళ (13.1), పశ్చిమ బెంగాల్ (9.4), సిక్కిం (6.7) లాంటి ప్రాంతాలు తక్కువ కేసులతో పాపం.. ఈ జాబితాలో అట్టడుగున నిలిచాయి. అంటే, అక్కడి పోలీసింగ్ వ్యవస్థ అంత బలంగా ఉందన్నమాట. ప్చ్.. లడఖ్ (5.0), దమన్ & దీయూ, డిఎన్హెచ్ (10.0), అండమాన్ & నికోబార్ (16.1), లక్షద్వీప్ (29.0) వంటి ప్రాంతాలు కూడా తక్కువ కేసులు నమోదు చేస్తున్నాయి. అయితే పర్యాటక ప్రాంతమైన గోవా (29.2), గుజరాత్ (29.6)లకు దొంగల పరిస్థితి కాస్త అటు ఇటుగానే నడుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాల స్థాయి మధ్యస్థంగా ఉంది. తెలంగాణలో ప్రతి లక్ష మందికి సగటున 42.5 కేసులు నమోదవుతున్నాయి. ఇది దేశ సగటు (49.5) కంటే కొంచెం తక్కువ అయినప్పటికీ.. మధ్యస్థాయి ప్రమాదంగా పరిగణించొచ్చు. అలాగే.. అర్బన్ భద్రతా వ్యవస్థకు సవాలుగా మారే అవకాశమూ లేకపోలేదు. ఇక ఏపీ విషయానికొస్తే.. సాధారణంగా దేశ సగటు కంటే కాస్త తక్కువ స్థాయిలోనే కేసులు(23.4) నమోదవుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల్లో దొంగతనాలు ఎక్కువగా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దొంగలు తమ చేతి వాటం తక్కువే ప్రదర్శిస్తున్నారని తేలింది.పై లెక్కలు చూస్తే.. మనం ఊహించేంత సురక్షితంగా మన గల్లీలు అందులో ఉన్న ఇల్లులు.. మనమూ లేమన్న మాట. సమర్థవంతమైన పోలీసింగ్కు ప్రజల భాగస్వామ్యం చేరినప్పుడు.. అదే సమయంలో సామాజిక సమస్యల పరిష్కారం కలిసినప్పుడే దొంగతనాలు పూర్తిగా కట్టడి అవుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతూనే ఉన్నారు.
87 ఏళ్ల క్రితం ‘జై భీమ్’ పుట్టిందిలా..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వర్థంతి నేడు(డిసెంబర్ 6). 1956లో ఇదే రోజున ఆ మహనీయుడు కన్నుమూసినప్పటికీ, ఆయన స్ఫూర్తిని గుర్తుకు తెచ్చే ‘జై భీమ్’ నినాదం నేటికీ ఆయన వారసత్వాన్ని, దళితుల ఐక్యతను చాటుతోంది. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్పై గల అపారమైన గౌరవాన్ని, దళిత సమాజపు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన నినాదం ‘జై భీమ్’ ఆవిర్భావం వెనుక ఆసక్తికర కథనం ఉంది. సుమారు 87 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని నాటి ఔరంగాబాద్ (నేటి ఛత్రపతి శంభాజీనగర్) జిల్లా, కన్నద్ తెహ్సిల్లోని మక్రాన్పూర్ గ్రామంలో చారిత్రక తొలి పరిషత్ సమావేశం జరిగింది. మరాఠ్వాడ షెడ్యూల్డ్ కులాల సమాఖ్య మొదటి అధ్యక్షుడు భౌసాహెబ్ మోర్, డిసెంబర్ 30, 1938న ఈ మొదటి మక్రాన్పూర్ పరిషత్ను నిర్వహించారు. ఈ చారిత్రక సందర్భాన్ని గురించి భౌసాహెబ్ మోర్ కుమారుడు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ మోర్ వివరించారు. నాటి సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ పాల్గొని, ఆనాటి హైదరాబాద్ రాచరికపు రాష్ట్రానికి మద్దతు ఇవ్వవద్దని ప్రజలను కోరారు. అనంతరం భౌసాహెబ్ మోర్ మాట్లాడుతూ ప్రతి సమాజానికి ఒక ఆరాధ్య దైవం ఉంటాడని, ఆ పేరుతో వారు పలకరించుకుంటారని పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ మనకు పురోగతి మార్గాన్ని చూపించారని, ఆయన మనకు దేవుడిలాంటివారని, కాబట్టి ఇక నుండి మనం ఒకరినొకరు కలిసేటప్పుడు ‘జై భీమ్’ అని పలుకరించుకోవాలని పిలుపునిచ్చారు. పరిషత్కు హాజరైన జనం ఈ కొత్త నినాదంపై ఉత్సాహంగా స్పందించి, వెంటనే ఆ నినాదాన్ని తమ సమాజ నినాదంగా అంగీకరిస్తూ, ఈ తీర్మానాన్ని ఆమోదించారు. మక్రాన్పూర్ వేదిక ఎంపిక వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. నాటి నిజాం పాలకులు దళితులపై మతమార్పిడి ఒత్తిళ్లతో సహా పలు దురాగతాలకు పాల్పడేవారు. వీటిని భౌసాహెబ్ మోర్.. డాక్టర్ అంబేద్కర్ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అయితే రాచరిక రాష్ట్రాలను వ్యతిరేకించిన కారణంగా హైదరాబాద్ రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ ప్రసంగాలు ఇవ్వకుండా నిషేధించారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ భూభాగంలో ఉన్న మక్రాన్పూర్ గ్రామాన్ని సమావేశ వేదికగా ఎంచుకున్నారు. అంబేద్కర్ అనుచరులు నిజాం పోలీసుల నుండి తప్పించుకుని ఈ సభకు హాజరయ్యారు.మొదటి మక్రాన్పూర్ పరిషత్ కోసం భౌసాహెబ్ మోర్ కుటుంబం ఎంతో త్యాగం చేసింది. ఖర్చుల నిర్వహణ కోసం మోర్ తన అమ్మమ్మ నగలను తాకట్టు పెట్టారు. ఖాందేశ్, విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చారు. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 30న నిర్వహిస్తారు. 1972లో మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొన్నప్పుడు కూడా ఈ సంప్రదాయం కొనసాగడం విశేషం.ఇది కూడా చదవండి: అయోధ్యలో హై అలర్ట్.. మసీదు కూల్చివేతకు 33 ఏళ్లు..
అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..
సాక్షి శబరిమల: సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ రాత్రికి నాడ మూసివేస్తే రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు యాత్రికులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఆ తర్వాత భద్రతలో భాగంగా, పోలీసులు, కేంద్ర దళాలు CRPF, RAF, NDRF, యాంటీ టెర్రర్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సంయుక్తంగా రూట్ మార్చ్ నిర్వహించనున్నారు.నాడ మూసివేత అంటే..నాడ అంటే శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే ప్రధాన మర్గం. ఇది అయ్యప్ప భక్తులకు, ముఖ్యంగా దీక్షధారులకు అతి ముఖ్యమైనది. సింపుల్గా చెప్పాలంటే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే మెట్ల మార్గం. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఆలయ ప్రవేశ మార్గం. అందువల్ల ఈ మెట్లమార్గం గుండా ఉండే ప్రధాన ద్వారాన్ని మూసివేస్తే..భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఇక్కడే స్వామివారికి ఆలయ పూజారులు విశేష పూజలు జరుపుతారు. భక్తులు తెచ్చే ఆవునేతితో అయ్యప్పకు అభిషేకం చేస్తారు.ఇదిలా ఉండగా, సన్నిధానం పంపా, నీలక్కల్ వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రి నాడ మూసివేశాక, తిరుముట్టం, దాని పరిసరాలు ప్రత్యేక పోలీసుల రక్షణలో ఉంటాయి. ఎప్పుడైతే నాడ మూసివేస్తారో ఆ తదనంతరం యాత్రికులను పాపంతల్ వద్ద క్యూలో నిలబెడతారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు నాడ తెరిచిన తర్వాత మాత్రమే భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతిస్తారు. సన్నిధానం వైపు ట్రాక్టర్ల తరలింపును రెండు రోజులుగా పరిమితం చేశారు. ట్రాక్టర్లలో తీసుకువచ్చిన వస్తువులను కూడా తనిఖీ చేస్తారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని సిబ్బంది ద్వారం గుండా తిరుముట్టంలోకి ప్రవేశించడానికి అనుమతించరు. ఈ ప్రాంతంలో నిఘా ముమ్మరంగా ఉంటుంది. ఇక ఫుట్పాత్ వద్ద దర్శనం ప్రారంభంలో స్కానర్లు డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హోల్డ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించే స్రీనింగ్ తనిఖీ తదితరాలు పర్యవేక్షణ ఉంటుంది.(చదవండి: పులిమేడు రూట్లో భక్తుల రద్దీ)
ఎన్ఆర్ఐ
సింగపూర్లో కార్తీకమాస స్వరారాధన
సింగపూర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సాంస్కృతిక సంస్థ "శ్రీ సాంస్కృతిక కళాసారథి", ఈ పవిత్ర కార్తీకమాస సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో శనివారం "కార్తీకమాస స్వరారాధన" అనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు. పోలండ్ దేశస్తుడైన యువ గాయకుడు (Zach)బుజ్జి పాత తెలుగు సినిమాలలోని ఘంటసాల పాడిన శివ భక్తిగీతాలను, శివతాండవ స్తోత్రాన్ని పాడి వినిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ సంస్థ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే సింగపూర్ గాయని గాయకులతో పాటుగా మాతృభాష తెలుగు కానీ ఒక విదేశీయుడైన బాలుడు చక్కగా తెలుగు భక్తి పాటలు నేర్చుకొని పాడడం చాలా అభినందనీయం" అని తెలియజేశారు.డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ ప్రసంగంలో మాట్లాడుతూ కార్తీకమాసంలో వచ్చే వివిధ పర్వదినాల గురించి ఆయా రోజులలో ఆచరించే పూజలు, వాటి వెనుక ఉన్న కథలు, ప్రత్యేకతలు, కారణాల గురించి సోదాహరణంగా విశ్లేషిస్తూ వివరిస్తూ, అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా, అన్ని వయసుల వారికి అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో తెలియజేశారు.సంస్థ ప్రధాన నిర్వహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభా సమన్వయం చేయగా, సుబ్బు వి పాలకుర్తి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సభలో, సింగపూర్ గాయనీగాయకులు విద్యాధరి కాపవరపు, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, శేషుకుమారి యడవల్లి, షర్మిల చిత్రాడ, స్నిగ్ధ ఆకుండి, శ్రీవాణి, చంద్రహాస్ ఆనంద్, హరి మానస శివ భక్తిగీతాలను ఆలపించారు. వానిలో త్యాగరాజ కృతులు వంటి సంప్రదాయ సంగీతం, శివపదం గీతాలు, చలనచిత్ర గీతాలు, లలిత గీతాలు కూడా ఉండడం విశేషం.కల్చరల్ టీవీ సాంకేతిక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం ఎప్పటివలే అన్నిదేశాల తెలుగు ప్రజల మన్ననలు అందుకుంది. (చదవండి: జపాన్లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు)
ఆస్ట్రేలియా ఎన్నారైల మద్దతు చిరస్మరణీయం:లక్ష్మీపార్వతి
సిడ్నీ: వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆస్ట్రేలియా ఎన్నారై వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ఆమె పార్టీ నాయకుడు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్టీ కష్టకాలంలో ఉన్న వైఎస్ జగన్పై మీరు చూపిన ఆధారాభిమానానికి పార్టీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది. మీ మద్దతు చిరస్మరణీయంగా నిలుస్తుంది’అని పేర్కొన్నారు. ‘మీ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. తమలో చాలామంది మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల విదేశాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ఆ రుణం తీర్చుకునేందుకు మేము ఎల్లప్పుడూ వైఎస్ జగన్కు మద్దతుగా ఉంటాం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరం రెడ్డి, గజ్జల చంద్ర ఓబుల రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, దూడల కిరణ్ రెడ్డి, నరెడ్డి ఉమా శంకర్, కృష్ణ చైతన్య కామరాజు, నల్ల జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాలో లక్ష్మీపార్వతికి వైఎస్సార్సీపీ శ్రేణుల ఘనస్వాగతం
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లక్ష్మీపార్వతికి నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ,గజ్జల చంద్ర ఓబుల రెడ్డి,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి ,దూడల కిరణ్ రెడ్డి, కామరాజు కృష్ణ చైతన్య ,కోటా శ్రీనివాసరెడ్డి, దుగ్గింపుడి కిరణ్ రెడ్డి, సిద్ధన సురేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం బ్రిస్బేన్లో ఉన్న లక్ష్మీపార్వతి.. వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారు. అక్కడ వివిధ నగరాల్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాకు ఆమె హాజరుకానున్నారు.
అమెరికాలో అందెశ్రీకి ఘన నివాళి
ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ అకాల మృతిపై అమెరికాలో ఘన నివాళి అర్పించారు. నార్త్ కరోలినా ఛార్లెట్ లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసులు అందెశ్రీ మాట, పాటలను స్మరించుకున్నారు.తెలంగాణ భూమి పుత్రుడిగా, నిస్వార్థ స్వరాష్ట్ర సాధన స్వాప్నికుడిగా అందెశ్రీని తెలంగాణ సమాజం కలకాలం గుర్తుపెట్టుకుంటుందని ఎన్.ఆర్.ఐ లు అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా ఆయన ప్రవాసులతో అత్మీయ అనుబంధాన్ని కొనసాగించారని కొనియాడారు.అందెశ్రీ రచనలు, ఆయన గాత్రం చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రవాసులు కోరారు. రానున్న తరాలకు ఆయన రచనలు పరిచయం అయ్యేలా పాఠ్య పుస్తకాల్లో చేర్చటంతో పాటు, అందెశ్రీ పేరుపై రాష్ట్ర స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రత్యేక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) – ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వై. నరేందర్ రెడ్డికి విన్నవించారు.అందెశ్రీని స్మరించుకోవటంతో పాటు, నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, కోర్ టీం సభ్యుడు, చార్లెట్ చాప్టర్ దిలీప్ రెడ్డి స్యాసని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరేంద్ర దేవరపల్లి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) చార్లెట్ చాప్టర్ అధ్యక్షుడు కదిరి కృష్ణ, చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) కార్యదర్శి ప్యారం పుట్టలి, తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రముఖుడు పవన్ కుమార్ రెడ్డి కొండ, స్థానిక తెలంగాణ ప్రవాసులు హాజరయ్యారు.
క్రైమ్
ఏలూరులో అమానుషం
ఏలూరు టౌన్: ఏలూరులో అర్ధరాత్రి వేళ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని వారి ఇంటి తలుపులు, కిటికీలు బాదుతూ ఇద్దరు రౌడీషీటర్లు భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం వారిలో ఒక యువతిని ఓ రౌడీషీటర్ కొట్టుకుంటూ సమీపంలోని సచివాలయానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత ఇద్దరు యువతులనూ రౌడీషీటర్లు బెల్టుతో దారుణంగా కొట్టినట్లు తెలిసింది. తాము పోలీసులను ఆశ్రయిస్తే వారు సరిగ్గా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చివరికి.. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతి (23) తండ్రి మరణించగా.. ఆమె తల్లితో గొడవపడి ఇంటి నుంచి వచ్చేసింది.ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఏలూరుకు చెందిన యువతి వద్ద ఉంటోంది. ఈ నెల 2న రాత్రివేళ వీరిద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నగరంలోని కొత్తపేటకు చెందిన ఇద్దరు రౌడీషీటర్లు అతిగా మద్యం సేవించి అర్ధరాత్రి వేళ యువతులు ఉంటున్న ఇంటి తలుపులు, కిటీకీలు బాదుతూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన యువతి తలుపులు తీయగా.. ఆమెను కొట్టుకుంటూ లాక్కెళ్లిన ఒక రౌడీషీటర్ సమీపంలోని సచివాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు.ఆ తర్వాత యువతులిద్దరినీ బెదిరించి వెళ్లిపోయిన ఆ ఇద్దరు రౌడీషీటర్లు.. మరో గంట తర్వాత స్నేహితులతో వచ్చి యువతులను మళ్లీ బెల్టులతో ఇష్టమొచ్చినట్లు కొట్టి బెదిరించి వెళ్లారు. దీంతో బాధితులిద్దరూ నగరంలోని ఒక పోలీస్స్టేషన్కు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని సమాచారం. అయితే, పోలీసు ఉన్నతాధికారులకు ఈ దారుణ ఘటన గురించి తెలియడంతో అత్యాచార బాధితురాలిని ఓ ఆçస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. అలాగే, హడావుడిగా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఈ ఘటనను పోలీసులు చిన్న కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై మీడియాకు సైతం తెలియకుండా అత్యంత గోప్యత పాటిస్తున్నారు.
మాలిలో ఇద్దరు తెలుగు కార్మికుల కిడ్నాప్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఉపాధి కోసం ఆఫ్రికా దేశమైన మాలికి వెళ్లిన తెలంగాణ, ఏపీకి చెందిన ఇద్దరు యువకులను జమాత్ నుస్రత్ అల్–ఇస్లామ్ వల్–ముస్లిమీన్ (జేఎన్ఐఎం) సంస్థకు చెందిన తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస ప్రవీణ్ (23), ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని పొదరళ్లపల్లికి చెందిన రామచంద్ర (25) గతేడాది హైదరాబాద్కు చెందిన ఓ బోర్వెల్ కంపెనీ పనిపై డ్రిల్లర్లుగా మాలి దేశంలోని కోబ్రి సమీపంలో పనిచేస్తున్నారు. గత నెల 23న వారు పని ముగించుకొని వస్తుండగా సాయుధులైన జేఎన్ఎంఐ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.వారి ఫోన్లను స్వా«దీనం చేసుకొని స్విచ్ఛాప్ చేయడంతో కిడ్నాప్ సమాచారం ఆలస్యంగా భారత ఎంబసీతోపాటు వారి కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. పనుల సీజన్ పూర్తయ్యాక వస్తానని కిడ్నాప్నకు ఒకరోజు ముందు తన కొడుకు ఫోన్ చేసి చెప్పాడని ప్రవీణ్ తండ్రి జంగయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన చెందారు. మరోవైపు బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు మాలిలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.తీవ్రవాదుల డిమాండ్లను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఎంబీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అల్కాయిదాకు చెందిన జేఎన్ఐఎం.. సహెల్ ప్రాంతంలో (మాలి, నైజర్ మొదలైన దేశాలు) మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఆర్థిక యుద్ధం‘వ్యూహంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటోంది. గత ఆరు నెలల్లో (మే నుంచి అక్టోబర్ వరకు) 22 మంది విదేశీయులను బంధించింది. అందులో కొందరు విడుదలవగా మరికొందరు ఇంకా తీవ్రవాదుల చెరలోనే ఉన్నారు. బందీల విడుదలకు తీవ్రవాదులు ఆర్థిక డిమాండ్లు పెడుతున్నారు.
వంద కోట్ల అవినీతి తిమింగలం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/మహబూబ్నగర్ క్రైం: రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. తప్పుడు సర్వేలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి గురువారం ఏక కాలంలో ఇళ్లు, ఆఫీసు, బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బహిరంగ మార్కెట్లో ఆయన ఆస్తుల విలువ రూ.వంద కోట్లకుపైగా ఉన్నట్లు అంచనా. శ్రీనివాసులు ప్రస్తుతం హైదరాబాద్ ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నాడు. శుక్రవారం ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది. శ్రీనివాసులు మరో ఏడాదిలో పదవీ విరమణ అవుతున్నట్లు సమాచారం. మూడు రాష్ట్రాల్లో రూ.కోట్ల ఆస్తులుశ్రీనివాసులుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటకలోనూ రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాయదుర్గం మైహోం భూజాలో విలాసవంతమైన ఫ్లాట్, అనంతపురంలో 11 ఎకరాలు, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా నారాయణపేటలో రైస్మిల్, మహబూబ్నగర్లో నాలుగు ప్లాట్లు, నారాయణపేటలో మూడు ప్లాట్లు, ఇంట్లో 1.6 కేజీల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులు, రూ.ఐదు లక్షల నగదు, కియా, ఇన్నోవా కార్లు దొరికాయి. ఆయన గతంలో నల్లగొండ సహా మేడ్చల్ జిల్లా ల్యాండ్స్ అండ్ సర్వే రికార్డ్స్ అధికారిగా కూడా పని చేశారు. మేడ్చల్ జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రాగా, అప్పట్లోనే ఏసీబీ కేసు కూడా నమోదైంది. కొంతకాలం సస్పెన్షన్లో ఉండి, ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరారు.తప్పుడు సర్వేలతో అక్రమార్జనశంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ రెవెన్యూల మధ్య ఉన్న వంద ఎకరాల గ్యాప్ లాండ్స్కు 555 సర్వే నంబర్ కేటాయించి, విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంలోనూ, ఇబ్రహీంపట్నం ఖానాపూర్ రెవెన్యూ పరిధిలోని 33 ఎకరాల బిలాదాఖల భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామం సర్వే నంబర్ 63లో రూ. 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల సర్కార్ భూమి, శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వే నం. 124/10, 11లోని రూ.రెండు వేల కోట్ల విలువ చేసే 50 ఎకరాలు, శేరిలింగంపల్లి గ్రామం సర్వే నం. 90, 91 నుంచి 102లోని 110 ఎకరాల అలూమినీ కంపెనీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో, సర్వే నం. 68లో ఐదెకరాల ప్రభుత్వ భూమి పట్టాగా మారడంలోనూ, హఫీజ్పేట్ సర్వే నం. 80లోని భూమి, కొండాపూర్ సర్వే నం. 87, 88 ల్లోని భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. అలాగే, వట్టినాగులపల్లి సర్వే నం. 186, 187లో 20 ఎకరాల భూదాన్ భూములు, గండిపేట్ మండలం ఖానాపూర్లోని 150 ఎకరాల బిలా దాఖల భూములకు సర్వే నంబర్ 65 కేటాయించి, ఆయా భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్ సర్వే నం. 69లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక అప్పటి శేరిలింగంపల్లి రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్స్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. గచ్చిబౌలిలో సర్వే నంబర్లు 38 నుంచి 54 వరకు గల 76 ఎకరాల సీలింగ్ సర్ప్లస్ భూములు, మహేశ్వరం మండలం మహేశ్వరం–తుమ్మలూరు గ్రామాల మధ్య ఉన్న 70 ఎకరాల బిలా దాఖల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక కూడా శ్రీనివాసులు హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
రూ.41 లక్షలు : లాయర్ ముసుగులో ఐఎస్ఐ గూఢచారి!
అమృత్సర్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసి, సమాచారాన్ని చేరవేసిన ఆరోపణలపై అరెస్టయిన గుర్గామ్ న్యాయవాది రిజ్వాన్ కేసులో దర్యాప్తు సంస్థలకు పలు కీలక విషయాలు తెలిశాయి. అరెస్టయిన రిజ్వాన్కు రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, డబ్బు సేకరించేందుకు అతను ఏకంగా ఏడుసార్లు అమృత్సర్ వెళ్లాడని, అతని స్నేహితుడు, న్యాయవాది ముషారఫ్ అలియాస్ పర్వేజ్ పోలీసులకు తెలిపాడు. 2022లో సోహ్నా కోర్టులో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు రిజ్వాన్తో స్నేహం ఏర్పడిందని ముషారఫ్ చెప్పాడు. జూలైలో, ఇద్దరూ కలిసి ముషారఫ్ కారులో అమృత్సర్ వాఘా సరిహద్దుకు వెళ్లారు. అక్కడ స్వర్ణ దేవాలయం వద్ద, ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరి నుండి రిజ్వాన్ ఒక సంచి నిండా డబ్బు తీసుకున్నాడు. అయితే, వారిని గుర్తించలేక పోయానని ముషారఫ్ తెలిపాడు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో.. కారును అక్కడే వదిలి రైలులో ప్రయాణించారు. ఆగస్టు 1న కారు తీసుకురావడానికి మళ్లీ అమృత్సర్ వెళ్లారని ముషారఫ్ చెప్పాడు.ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్యరూ.41 లక్షలు సేకరించి..రిజ్వాన్ మొత్తం రూ.41 లక్షల నగదును సేకరించినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ డబ్బును అతను అజయ్ అరోరా అనే వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపాడు. స్కార్పియో, స్కోడా కార్లలో వచ్చిన వ్యక్తుల నుండి డబ్బు సేకరించడానికి.. రిజ్వాన్ ఏడుసార్లు అమృత్సర్ వెళ్లాడు. రిజ్వాన్కు తౌరులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా, సోహ్నాలో ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతా ఉన్నాయి. రిజ్వాన్ ల్యాప్టాప్, ఫోన్లో అనుమానాస్పద లావాదేవీలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో నుహ్ పోలీసు బృందాలు పంజాబ్ అంతటా దాడులు నిర్వహిస్తున్నాయి.
వీడియోలు
ఇండిగో విమానాల రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్
ఇండిగో ఎయిర్ లైన్స్ పేరు మారిందన్న హర్ష్ గోయెంకా
రంగంలోకి మోదీ మ్మోహన్ కు బిగ్ షాక్
శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రయాణికుల కోసం తెలంగాణ RTC ఏర్పాట్లు
ఉగ్రవాదుల నుంచి నా బిడ్డను కాపాడండయ్యా! చేతులెత్తి వేడుకుంటున్న తల్లి
2 లక్షల జీతం వదులుకొని వచ్చా.. 13 ఏళ్లు అయినా అమరావతిలో ఏం లేదు
Kannababu: ప్రజల గొంతుకై వినిపించే ఉద్యమం
అమెరికా అగ్ని ప్రమాదంలో తెలుగు విద్యార్థులు మృతి
బాధ్యత లేదా..! రామ్మోహన్ నాయుడుపై మోదీ ఆగ్రహం
Peddapalli District: రైలు పట్టాలపై కారు తెరుచుకోని గేటు..

