"ఆ దేశాలతో వాణిజ్యం తెంచుకోండి"
వెనిజువెలా వాణిజ్యంపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం చైనా, రష్యా, ఇరాన్లతో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా చమురు వెలికితీతలో కేవలం యుఎస్ మాత్రమే భాగస్వామిగా ఉండాలని హెచ్చరించారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు ఈ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని కొద్దిరోజుల క్రితం ట్రంప్ సర్కార్ బంధించిన సంగతి తెలిసిందే. అయితే అదేశం నుంచి డ్రగ్స్ అధికమెత్తంలో అమెరికాకు వస్తున్నాయని అందుకే శాంతిభద్రతల కోసం ఆయనని బంధించామని ట్రంప్ చెబుతున్నా.. అక్కడి చమురునిల్వలను స్వాధీనం చేసుకోవాడానికే ట్రంప్ ఈ ప్లాన్ వేశారని చాలా మంది భావించారు. తాజాగా ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో ఇది నిజం అనే భావన కలుగుతుంది. ప్రస్తుతం వెనిజువెలాకు తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆప్రభుత్వానికి ట్రంప్ ఆల్టిమేటం జారీచేశారు. "మెట్టమెుదటగా వెనిజువెలా చైనా, రష్యా, ఇరాన్,క్యూబాలతో ఉన్న వాణిజ్య సంబంధాలన్ని తెంచుకోవాలి. అమెరికాను తన ఆయిల్ ప్రొడక్షన్లో భాగస్వామిగా అంగీకరించాలి. అధిక మెత్తంలో చమురు అమెరికాకు అమ్మేప్పుడు సానుకూలంగా వ్యవహరించాలి" అని తెలిపారు.అంతేకాకుండా ప్రస్తుతం అమెరికాకు విక్రయిస్తున్న 30మిలియన్ల బ్యారెళ్ల చమురును 50 మిలియన్ బ్యారెళ్లకు పెంచి మార్కెట్ ధరలకు అమెరికాకు విక్రయించాలని తెలిపారు. ఆ డబ్బులను వెనిజువెలా ప్రజల సంరక్షణ కోసం అమెరికా వినియోగిస్తుందన్నారు. అమెరికా వర్గాల నివేదిక ప్రకారం కార్కస్ తన దగ్గర ఉన్న చమురునిల్వలను అమ్మకపోతే కేవలం వారాల వ్యవధిలోనే ఆర్థికంగా దివాళా తీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Vreels - సోషల్ మీడియాకు సరికొత్త నిర్వచనం
డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న ఈ రోజుల్లో, యూజర్ డేటా గోప్యతా సమస్యలు, స్పష్టతలేని అల్గోరిథమ్స్, మరియు కొద్ది మంది మాత్రమే లాభపడే ఆదాయ వ్యవస్థలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో, Vreels (www.vreels.com) ఒక కొత్త దృష్టికోణాన్ని తీసుకొని వచ్చింది. ఇది యూజర్ గోప్యత, పారదర్శకత, సమాన అవకాశాలు, మరియు కమ్యూనిటీ ఇంటరాక్షన్పై ఆధారపడి రూపుదిద్దబడిన వేదిక.యూజర్కు అనుగుణంగా రూపొందిన వేదికVreels ప్రత్యేకత ఏమిటంటే - ఇది యూజర్ల కోసం మాత్రమే కాకుండా, యూజర్లతో కలిసి నిర్మించబడుతున్న వేదిక. మీటప్లు, ఓపెన్ ఫోరమ్ల ద్వారా కంటెంట్ క్రియేటర్లను, యూజర్లను నేరుగా కలుసుకుంటూ, వారి అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకుని ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.ప్రతిభకు సమాన ప్రాధాన్యత, వ్యక్తీకరణ స్వేచ్ఛ, నైతిక ఆదాయ విధానం, మరియు యూజర్ నియంత్రణ వంటి అంశాలే ఈ వేదిక అభివృద్ధికి దిశానిర్దేశకాలు. అల్గోరిథమ్ ప్రయోజనాలకన్నా, కమ్యూనిటీ అవసరాలే ఇక్కడ ప్రధానంగా పరిగణించబడతాయి.విద్యార్థులు మరియు కొత్త ప్రతిభలకు ప్రోత్సాహంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న అపారమైన సృజనాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు Vreels ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. క్యాంపస్ స్థాయిలో నిర్వహిస్తున్న కంటెంట్ కార్యక్రమాలు విద్యార్థులను సురక్షిత వాతావరణంలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రోత్సహిస్తున్నాయి.విద్యాసంస్థను వెరిఫై చేసిన యూజర్లు ఇతర కళాశాలల విద్యార్థులతో కనెక్ట్ అవుతూ, దీర్ఘకాలిక సామాజిక మరియు వృత్తిపరమైన నెట్వర్క్లను నిర్మించుకోగలరు. గోప్యతా రక్షణలు, కంటెంట్ నియంత్రణలు యువతలోని సందేహాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ప్రారంభ దశలోనే ఆదాయ అవకాశాలుసోషల్ మీడియా రంగంలో అరుదైన అడుగు వేస్తూ, Vreels ఒక స్పష్టమైన మైల్స్టోన్ ఆధారిత ఆదాయ విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం:• ప్రతి 10,000 ఫాలోవర్లకు ₹10,000 చెల్లింపు • గరిష్ట ఆదాయ పరిమితి లేదు (ప్రోగ్రామ్ అమలులో ఉన్నంత వరకు)పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా మారకముందే, యూజర్ల శ్రమకు విలువ ఇస్తూ, ప్రారంభ దశ నుంచే ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం ఈ విధాన ప్రత్యేకత.సోషల్ కామర్స్ దిశగా అడుగు - Vreels Shop2026 తొలి త్రైమాసికంలో Vreels Shop ప్రారంభం కానుంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వ్యాపారాలు, కొత్త బ్రాండ్లు యూజర్లతో నేరుగా కనెక్ట్ కావచ్చు. ప్రస్తుతం వెండర్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.ఇది క్రియేటర్లు, వ్యాపారులు, బ్రాండ్లకు కొత్త ఆదాయ మార్గాలను తెరవనుంది.వ్యక్తిగత అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చే ఫీచర్లుVreelsలోని ప్రత్యేకమైన ఫీచర్ Memory Capsule — మీరు ఎంచుకున్న ఫోటోలు, వీడియోలు లేదా సందేశాలను, నిర్ణయించిన సమయానికి, ఎంపిక చేసిన వ్యక్తికే షేర్ చేసే అవకాశం ఇస్తుంది. ఇది పబ్లిక్ షేరింగ్కు భిన్నంగా, వ్యక్తిగత భావోద్వేగాలకు విలువ ఇస్తుంది.PixPouch ఫీచర్ ద్వారా యూజర్లు తమ విజువల్ జ్ఞాపకాలను సక్రమంగా భద్రపరచుకుని, కావాలనుకున్నప్పుడే ఎంపిక చేసిన వారికి షేర్ చేయవచ్చు.ఒకే యాప్లో సంపూర్ణ అనుభవం• Vreels ఒకే వేదికలో: షార్ట్ వీడియోలు (Reels) • రియల్టైమ్ చాట్ • వాయిస్ & వీడియో కాల్స్అన్నీ అందిస్తూ, యూజర్లు యాప్ల మధ్య మారాల్సిన అవసరాన్ని తొలగిస్తోంది.గోప్యతే పునాదిప్రకటనల ఆదాయంపై ఆధారపడే వేదికలతో పోలిస్తే, Vreels గోప్యత మరియు డేటా భద్రతను తన మౌలిక నిర్మాణంలోనే సుస్థిరంగా ఏర్పాటు చేసింది. యూజర్ల కంటెంట్, పరస్పర చర్యలపై పూర్తి నియంత్రణ యూజర్లకే ఉంటుంది.ప్రపంచ దృష్టికోణంఅమెరికా ఆవిష్కరణా దృక్పథ్వం మరియు భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభ కలయికతో రూపొందిన Vreels, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అనేక టెక్నాలజీ పేటెంట్లు దాఖలయ్యాయి. ప్రాంతీయ భాషల మద్దతు కూడా నిరంతరం విస్తరిస్తోంది.Vreels — మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా — మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒక్కే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels - భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comక్రింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్లలో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదా డౌన్లోడ్ కోసం క్రింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి.
చితక్కొట్టాడు.. యువీ దెబ్బకు అల్లాడినా..
ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు స్టువర్ట్ బ్రాడ్. టెస్టుల్లో ఏకంగా 604 వికెట్లు కూల్చి.. సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 178 వన్డే, 65 అంతర్జాతీయ టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.ఇంతటి గొప్ప రికార్డు కలిగి ఉన్న స్టువర్ట్ బ్రాడ్కు కెరీర్ ఆరంభంలోనే ఓ చేదు అనుభవం ఎదురైంది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007లో టీమిండియా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) బ్రాడ్కు పీడకల మిగిల్చాడు. అతడి బౌలింగ్లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది.. అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్గా చరిత్రకెక్కాడు.21 ఏళ్ల వయసులో..మరోవైపు.. ఇలా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా బ్రాడ్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 క్రికెట్లో యువీ ఐకానిక్ ఫీట్ నమోదు చేసిన ఆ సమయంలో.. ఈ రైటార్మ్ పేసర్ వయసు 21 ఏళ్లే. అయితే, ఆ చేదు అనుభవం నుంచి బ్రాడ్ త్వరగానే కోలుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి మేటి బౌలర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.యువీ దెబ్బకు అల్లాడినా..తాజాగా... గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న స్టువర్ట్ బ్రాడ్.. యువీ దెబ్బకు అల్లాడినా.. ఆ తర్వాత ఎలా నిలదొక్కుకున్నాడో చెప్పుకొచ్చాడు. ‘‘అప్పటికి నేను ఏడు నుంచి ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడి ఉంటాను. ఇంకా టెస్టు క్రికెట్లో అరంగేట్రమే చేయలేదు. అప్పుడు నా జట్టు పొడవుగా.. బంగారు వర్ణంలో ఉండేది.ఐదేళ్ల కెరీర్ సేవ్ అయింది20-21 ఏళ్ల మధ్య వయసు. ఉరకలెత్తే ఉత్సాహం. అలాంటపుడు ఊహించని విధంగా.. నా ముఖం మీద కొట్టినట్లుగా బ్యాటర్ బాదుతూ ఉంటే నేను ఏమైపోవాలి?.. అయితే, ఆట ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆరంభంలోనే అంతా సజావుగా సాగిపోతే 26-27 ఏళ్లకే అంతా సాధించేశాము అన్న భావన వచ్చేస్తుంది. అంకితభావం కొరవడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.వారియర్ మోడ్ఫామ్లో లేకుంటే జట్టు నుంచి తప్పించనూ వచ్చు. 31 ఏళ్లు వచ్చే సరికి అంతా ముగిసిపోతుంది. కానీ నాకు 21 ఏళ్ల వయసులో తగిలిన ‘దెబ్బ’ నాలో కసిని రగిల్చింది. మరుసటి ఐదేళ్లు ఎలా ఆడాలో.. ఆటను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలిసేలా చేసింది. నన్ను ‘వారియర్ మోడ్’లోకి తీసుకువెళ్లింది.ప్రతి మ్యాచ్కు ముందు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా చేసింది. అలా 25-26 ఏళ్ల వయసు వచ్చే సరికి ఎలైట్ పర్ఫార్మర్ కావాలనే కోరిక పెరిగింది. అందకు తగినట్లుగా కృషి చేశా. కానీ ఒక్కోసారి నా శరీరం ఇందుకు సహకరించలేదు. కాబట్టి అనుకున్నది అనుకున్న సమయంలో సాధించకలేకపోయాను.అందుకే ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేనింకా మెరుగ్గా ఆడాల్సింది అని అనిపిస్తుంది’’ అని మాథ్యూ హెడెన్ పాడ్కాస్ట్లో స్టువర్ట్ బ్రాడ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా 344 మ్యాచ్లలో కలిపి 847 వికెట్లు కూల్చిన 39 ఏళ్ల బ్రాడ్.. 2023లో ఆటకు గుడ్బై చెప్పాడు.చదవండి: బంగ్లాదేశ్కు భారీ షాక్
నిన్న ప్రియురాలు.. నేడు ప్రియుడు!
సాక్షి, హైదరాబాద్: ప్రేమ వ్యవహారం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఒకరికొకరు దూరం అవుతున్నారనే బాధలో.. బలవన్మరణానికి పాల్పడి తమ కుటుంబాల్లో విషాదం నింపారు. యాచారం మండలం మేడిపల్లి గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ పీఎస్ పరిధి బ్రహ్మణపల్లిలో బుధవారం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ వెంచర్లోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నాడు. అది గమనించిన కొందరు స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడ్ని మేడిపల్లి గ్రామానికి చెందిన మహేష్గా గుర్తించారు. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయం ఒకటి తెలిసింది. మేడిపల్లి గ్రామానికే చెందిన పూజ(17) నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహేష్-పూజలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలి మృతిని తట్టుకోలేకనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే.. ఈ ఇద్దరూ గతంలోనూ సూసైడ్ అటెంప్ట్ చేసినట్ల తేలింది. రెండు నెలల కిందట ఇద్దరూ పురుగుల మందు తాగగా.. స్థానికులు గుర్తించి రక్షించారు. ఆ తర్వాత ఏమైందో తెలీయదుగానీ.. వెనువెంటనే ఇలా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చితక్కొట్టాడు.. యువీ దెబ్బకు అల్లాడినా..
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
"ఆ దేశాలతో వాణిజ్యం తెంచుకోండి"
నిన్న ప్రియురాలు.. నేడు ప్రియుడు!
బీమా అనైతిక విక్రయాలకు చెక్!.. ఐఆర్డీఏఐ
ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్ సినిమా.. తెలుగులోనూ
మోదీపై ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్ అంత పని చేసిందా?.. నేనే తప్పుకొన్నా!
సిట్ దూకుడు.. సీఎం సోదరుడు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
ఐటీ ఉద్యోగులకు మరో కఠిన నిబంధన!
బంగారం ధరల్లో ఊహకందని మార్పు!
కరెంటు లేదు.. ఆహారం దొరకదు
'బాయిలోనే బల్లి పలికే' మంగ్లీ కాపీ కొట్టిందా.. క్లారిటీ ఇదే
వెండిపై అస్సలు తగ్గని కియోసాకి
ఆ డ్యాన్సులే కొంప ముంచాయా?
ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్
ఆయనకు చేతకాదు నువ్వు నమ్మాల్సిందే!
'దిల్రాజు'తో మా అక్క పెళ్లి.. మొదట ఒప్పుకోలేదు: తరుణ్
ఏపీ అప్పులు రూ.2.93 లక్షల కోట్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సన్నిహితులతో సఖ్యత
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
మీది మహర్జాతకమండీ.. ఎవరో చేసిన కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుంటారు!
... మీ నోబెల్ బహుమతికి మరొకరు పోటీ వస్తున్నార్సార్!
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?
బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం!
ఓట్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారు
మూడో సారి తండ్రి అయిన అంబటి రాయుడు
అమ్మ రెండో పెళ్లి.. నేనే సాక్షి సంతకం పెట్టా!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
చితక్కొట్టాడు.. యువీ దెబ్బకు అల్లాడినా..
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
"ఆ దేశాలతో వాణిజ్యం తెంచుకోండి"
నిన్న ప్రియురాలు.. నేడు ప్రియుడు!
బీమా అనైతిక విక్రయాలకు చెక్!.. ఐఆర్డీఏఐ
ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్ సినిమా.. తెలుగులోనూ
మోదీపై ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్ అంత పని చేసిందా?.. నేనే తప్పుకొన్నా!
సిట్ దూకుడు.. సీఎం సోదరుడు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
ఐటీ ఉద్యోగులకు మరో కఠిన నిబంధన!
బంగారం ధరల్లో ఊహకందని మార్పు!
కరెంటు లేదు.. ఆహారం దొరకదు
'బాయిలోనే బల్లి పలికే' మంగ్లీ కాపీ కొట్టిందా.. క్లారిటీ ఇదే
వెండిపై అస్సలు తగ్గని కియోసాకి
ఆ డ్యాన్సులే కొంప ముంచాయా?
ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్
ఆయనకు చేతకాదు నువ్వు నమ్మాల్సిందే!
'దిల్రాజు'తో మా అక్క పెళ్లి.. మొదట ఒప్పుకోలేదు: తరుణ్
ఏపీ అప్పులు రూ.2.93 లక్షల కోట్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సన్నిహితులతో సఖ్యత
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
మీది మహర్జాతకమండీ.. ఎవరో చేసిన కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుంటారు!
... మీ నోబెల్ బహుమతికి మరొకరు పోటీ వస్తున్నార్సార్!
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?
బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం!
ఓట్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారు
మూడో సారి తండ్రి అయిన అంబటి రాయుడు
అమ్మ రెండో పెళ్లి.. నేనే సాక్షి సంతకం పెట్టా!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
ఫొటోలు
‘కార్ల్టన్ వెల్నెస్’ బ్రాండ్ అంబాసిడర్గా మృణాల్ (ఫొటోలు)
తిరుమలలో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)
కొత్త సంవత్సరం కొత్త కొత్తగా హీరోయిన్ కృతి శెట్టి (ఫొటోలు)
ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
నుమాయిష్ ఎగ్జిబిషన్లో లేడీస్ డే వేడుకలు (ఫొటోలు)
గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు
కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)
సినిమా
సమంత మాస్ లుక్.. సంక్రాంతికి సర్ప్రైజ్
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్థాపించి.. తొలి ప్రయత్నంగా 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అందుకుంది. అదే బ్యానర్పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఇందులో ఆమే హీరోయిన్. ‘ఓ బేబీ’ తర్వాత సామ్తో కలిసి నందిని రెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే దర్శకురాలు పేరు తప్ప.. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ని పంచుకుంది సమంత. (చదవండి: ఓటీటీలో తమిళ ఫీల్గుడ్ మూవీ.. ఎక్కడంటే?)సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్కి సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని కూడా విడుదల చేశారు. ‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’ అంటూ ఆ పోస్టర్కి క్యాప్షన్ రాసుకొచ్చారు. జనవరి 9న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్తోన్న బ్యూటీ.. ఎప్పుడో మరి!)ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా..సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుఉతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
ఓటీటీలో ఫీల్గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యదార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా అంగమ్మాల్. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీత కైలాసం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించాడు. రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన కొడు తుని అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్లో జనవరి 9 నుంచి ప్రసారం కానుంది. అయితే కేవలం తమిళ భాషలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.అంగమ్మాల్ కథ విషయానికి వస్తే..జీవితాంతం రవిక అంటే ఏంటో తెలీక బండచాకిరీ చేస్తూ కొడుకుల్ని పోషించింది తల్లి. భర్త పోయాక ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాకింది. చిన్న కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకుని సంబంధం మాట్లాడేందుకు అతడి ఊరొస్తామంటారు.పట్నంలో పెరిగిన హైక్లాస్ మనుషులు అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? రవిక లేకుండా చూస్తే నోరెళ్లబెట్టరా? అని ఆలోచించిన చిన్నకొడుకు తల్లిని జాకెట్ వేసుకోవాల్సిందేనని పట్టుబడతాడు. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ! Her name says it all. Angammal. Angammal From Jan 9th#SunNXT #AngammalOnSunNXT #Angammal@kaarthekeyens @ksubbaraj @njoy_films @stonebenchersWriter: @perumalmurugan_offl@kailasam.geetha @_saranofficial @actor_bharani @thendral_raghunathan @mullaiyarasii @vinodanandr… pic.twitter.com/B3YeHx5zuk— SUN NXT (@sunnxt) January 6, 2026 చదవండి: పెళ్లి చేసుకుంటా: స్త్రీ 2 హీరోయిన్
నేను పెళ్లి చేసుకుంటా: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు 38 ఏళ్లు. ఇప్పటికీ తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్ప పెళ్లిగురించి ఆలోచించడమే లేదు. అయితే కొంతకాలంగా రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది.పెళ్లి చేసుకుంటాసోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ఈ మేరకు ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దానికి హీరోయిన్ స్పందిస్తూ... నేను కూడా పెళ్లి చేసుకుంటా అని రిప్లై ఇచ్చింది. అది చూసి ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.సినిమాశ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా.. తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 మూవీస్లోనూ యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈతా సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ
చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందంటూ గత రెండు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై చిరంజీవి కూతురు, ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ నిర్మాత సుస్మిత స్పందించారు. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేను’ అని అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా నేడు(జనవరి 6) చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి(Chiranjeevi)కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. అయితే అదే ప్రశ్నకు కొనసాగింపుగా..‘సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్కి దూరంగా ఉన్నారట కదా?’ అని అడగ్గా.. అలాంటిదేమి లేదని.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పింది. అంతేకాదు ఇటీవల ‘ఓవర్సీస్ అభిమానులతోనూ వీడియో కాల్స్లో మాట్లాడారని, త్వరలోనే జరగబోయే ప్రీరిలీజ్ ఫంక్షన్కి కూడా చిరంజీవి వస్తారని స్పష్టం చేసింది. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్పై క్లారిటీ!)దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సర్జరీ జరిగిందనే వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. సినిమా ప్రమోషన్స్లో ఇక ఆయన పాల్గొనబోరని అంతా అనుకున్నారు. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్కి వస్తారని సుస్మిత చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.(చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్టైమ్ ఎంతంటే?)మనశంకర్ వరప్రసాద్(Mana Shankara Vara Prasad Garu) విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
క్రీడలు
చరిత్ర సృష్టించిన డుప్లెసిస్
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పొట్టి క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని (429 మ్యాచ్ల్లో) తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన పదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అత్యంత లేటు వయసులో (41 ఏళ్ల 178 రోజులు) ఈ మార్కును తాకిన ఆటగాడిగా షోయబ్ మాలిక్ రికార్డును (40 ఏళ్ల 315 రోజులు) బద్దలు కొట్టాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో భాగంగా ఎంఐ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసిన అనంతరం ఈ ఘనత సాధించాడు.పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు.. - క్రిస్ గేల్ – 14,562 - కీరన్ పోలార్డ్ – 14,462 - అలెక్స్ హేల్స్ – 14,449 - డేవిడ్ వార్నర్ – 13,836 - షోయబ్ మాలిక్ – 13,571 - జోస్ బట్లర్ – 13,554 - విరాట్ కోహ్లీ – 13,543 - జేమ్స్ విన్స్ – 12,854 - రోహిత్ శర్మ – 12,248 - ఫాఫ్ డుప్లెసిస్ – 12,002పొట్టి క్రికెట్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు.. - ఫాఫ్ డుప్లెసిస్ – 12,002 - క్వింటన్ డి కాక్ – 11,813 - డేవిడ్ మిల్లర్ – 11,631 - రిల్లీ రొస్సో – 9,705 - ఏబీ డివిలియర్స్ – 9,424 మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్ రాణించినా సూపర్ కింగ్స్పై ఎంఐ కేప్టౌన్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 44 పరుగులు చేసిన డుప్లెసిస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. కేప్టౌన్ బౌలర్లలో కార్బిన్ బాష్ 3 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఎంఐ జట్టు 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పూరన్ (33, 5 సిక్సర్లు), జేసన్ స్మిత్ (22, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడి ఎంఐని గెలిపించారు. ఆదిలో డస్సెన్ (35) పర్వాలేదనిపించాడు. ఈ గెలుపుతో ఎంఐ సీజన్లో బోణీ కొట్టింది.
తొలి శతకంతోనే చరిత్రపుటల్లోకెక్కిన ఇంగ్లండ్ యువ ఆటగాడు
సిడ్నీ వేదికగా జరుగుతున్న యాషెస్ చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ సెంచరీతో కదంతొక్కాడు. 22 ఏళ్ల బేతెల్కు టెస్ట్ల్లో ఇది తొలి శతకం. ఈ శతకంతో అతడు రికార్డుపుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియాపై 22 ఏళ్లలోపు శతకం చేసిన తొమ్మిదో ఇంగ్లండ్ బ్యాటర్ అయ్యాడు. ఈ జాబితాలో జానీ బ్రిగ్స్, జాక్ హెర్న్, పటౌడి, కాలిన్ కౌడ్రే, డేవిడ్ గోవర్, మైక్ అథర్టన్, అలిస్టర్ కుక్, బెన్ స్టోక్స్ ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. బేతెల్ తన అద్భుత శతకంతో ఇంగ్లండ్ను ఆధిక్యం దిశగా నడిపించాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఏడు డాట్ బాల్స్ ఆడిన బేతెల్ వెబ్స్టర్ బౌలింగ్లో బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు (162 బంతుల్లో). బేతెల్ సెంచరీ చేసిన అనంతరం అక్కడే మైదానంలో ఉన్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.నాలుగో రోజు చివరి సెషన్ సమయానికి బేతెల్ 131 పరుగుల వద్ద ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా బ్రైడన్ కార్స్ (11) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి పోరాడుతుంది. బేతెల్ పుణ్యమా అని ఆ జట్టు 107 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఈ ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బేతెల్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. డకెట్, బ్రూక్ తలో 42 పరుగులు చేయగా.. జేమీ స్మిత్ 26, జాక్ క్రాలే 1, రూట్ 6, స్టోక్స్ 1, విల్ జాక్స్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో వెబ్స్టర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, బోలాండ్, నెసర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు హెడ్ (163), స్టీవ్ స్మిత్ (138) సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 567 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా బ్యాటరల్లో వెబ్స్టర్ 71 (నాటౌట్), వెదర్లాడ్ 21, లబూషేన్ 48, మైఖేల్ నెసర్ 24, కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా 17, అలెక్స్ క్యారీ 16, గ్రీన్ 37 , స్టార్క్ 5, బోలాండ్ డకౌయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, టంగ్ తలో 3, స్టోక్స్ 2, జాక్స్, బేతెల్ తలో వికెట్ తీశారు. దీనికి ముందు జో రూట్ (160) సెంచరీతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు. కాగా,ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్కు భారీ షాక్
భారత్లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో తమ మ్యాచ్లను ఇతర దేశానికి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్, వేదికల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. భారత్లో ఆడకపోతే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఈ విషయాలను ఐసీసీ వర్చువల్ సమావేశం ద్వారా బీసీబీకి తెలియజేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..?ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రతరమయ్యాయి. కొన్ని రాజకీయ ప్రేరేపిత శక్తులు ఏకంగా ఆరుగురు హిందువులను కిరాతకంగా చంపేశాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ ప్లేయర్ను ఐపీఎల్లో ఆడించకూడదని భారత్లో నిరసనలు వెల్తువెత్తాయి. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగి ముస్తాఫిజుర్ను ఐపీఎల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించాలని కేకేఆర్కు అల్టిమేటం జారీ చేసింది. తప్పేదేమీ లేక కేకేఆర్ ముస్తాఫిజుర్ను కాంట్రాక్ట్ నుంచి తొలిగించింది.తమ దేశ ఆటగాడిని ఐపీఎల్ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్ను బ్యాన్ చేసింది. భారత్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అలాగే తమ దేశానికి చెందిన అంపైర్లు భారత్లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్ల్లో పాల్గొనరని స్పష్టం చేసింది.ప్రపంచకప్ మ్యాచ్ల వేదికల మార్పుకు ఐసీసీ ససేమిరా అంటున్న నేపథ్యంలో బీసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ సాహసం చేసి భారత్లో మ్యాచ్లు ఆడకపోతే, ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.
టీ20 ప్రపంచకప్ 2026కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 7) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. ఉపఖండపు పరిస్థితుల దృష్ట్యా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పిన్ హెవీ టీమ్ను ఎంపిక చేసింది. జట్టులో నలుగురు స్పిన్నర్లకు (సాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్, రచిన్) అవకాశం కల్పించింది.ఆర్సీబీ స్టార్ బౌలర్, గతేడాది లీడింగ్ వికెట్ టేకర్ జేకబ్ డఫీ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కైల్ జేమీసన్ ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపికయ్యాడు. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ పితృత్వ సెలవుల కారణంగా కొన్ని మ్యాచ్లు మిస్ అవుతారు. వీరిద్దరు గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.ఈ జట్టుకు ఎంపికైన మరో ముగ్గురు (ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, సాంట్నర్) కూడా గాయాల నుంచి కోలుకునే క్రమంలో ఉన్నారు. కాగా, ప్రపంచకప్లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ గ్రూప్-డిలో ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 8న చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది.దీనికి ముందు న్యూజిలాండ్ భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతుంది. ఈ సిరీస్ల్లో భాగంగా జనవరి 11 నుంచి మూడు వన్డేలు జరుగుతాయి. తొలి వన్డే వడోదరలో.. రెండో వన్డే రాజ్కోట్లో (జనవరి 14), మూడో వన్డే ఇండోర్లో (జనవరి 18) జరుగనున్నాయి. అనంతరం జనవరి 21 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్పూర్, రాయ్పూర్, గౌహతి, వైజాగ్, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో నలుగురిని మార్చి ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసింది.టీ20 ప్రపంచకప్కు న్యూజిలాండ్ జట్టు- మిచెల్ సాంట్నర్ (కెప్టెన్) - ఫిన్ అలెన్ - మైఖేల్ బ్రేస్వెల్ - మార్క్ చాప్మన్ - డెవాన్ కాన్వే - జేకబ్ డఫీ - లాకీ ఫెర్గుసన్ - మ్యాట్ హెన్రీ - డారిల్ మిచెల్ - ఆడమ్ మిల్నే - జేమ్స్ నీషమ్ - గ్లెన్ ఫిలిప్స్ - చిన్ రవీంద్ర - టిమ్ సీఫర్ట్ - ఇష్ సోధీ ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ జేమిసన్
న్యూస్ పాడ్కాస్ట్
సీమ జల ద్రోహి చంద్రబాబు. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలి. రాయలసీమ జిల్లాల వైఎస్సార్సీపీ నేతల డిమాండ్
సీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్దేశించిన సమాచారాన్ని ఇవ్వని చంద్రబాబు సర్కార్
రాయలసీమకు సైంధవుడు చంద్రబాబే... ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపివేసి మరణ శాసనం
వెనెజువెలాపై అమెరికా భీకర దాడులు... దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకొని న్యూయార్క్కు తరలించిన అమెరికా సేనలు
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సూపర్ సిక్స్ మోసాల ఖరీదు ఒక లక్ష 42 వేల కోట్ల రూపాయల పైమాటే...కొత్త ఏడాదిలోనైనా బకాయిలు చెల్లించాలంటూ ప్రజల డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో అత్యంత అధ్వానంగా మారిన ‘108’ నెట్వర్క్ నిర్వహణ... అంబులెన్స్ సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న బాధితులు
2026కు ఘన స్వాగతం పలికిన విశ్వమానవాళి... ఆనందోత్సాహాల నడుమ న్యూ ఇయర్ వేడుకలు
ఆంధ్రప్రదేశ్లో ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని నీరుగార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో బాదుడే బాదుడు...ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం...
పార్కుల ముసుగులో చంద్రబాబు పందేరం.. ఆంధ్రప్రదేశ్లో దళితుల భూముల్లో ‘ప్రైవేట్’ దందా!
బిజినెస్
‘అదానీ’ బాండ్లు: నిమిషాల్లోనే మొత్తమన్నీ సేల్..
డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ మూడోసారి ఆఫర్ చేసిన మార్పిడికివీలుకాని లిస్టెడ్ డిబెంచర్ల(ఎన్సీడీలు)కు భారీ డిమాండ్ నెలకొంది. ఆఫర్ ప్రారంభమైన 45 నిముషాల్లోనే బాండ్లు విక్రయమైనట్లు స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) డేటా వెల్లడించింది. నిజానికి తొలుత రూ. 500 కోట్ల విలువైన ఎన్సీడీలను ఆఫర్ చేయగా.. 10 నిముషాలలోనే అంతకుమించిన సబ్స్క్రిప్షన్ లభించింది.వార్షికంగా 8.9 శాతం ఈల్డ్(వడ్డీ ఆర్జన)తో వీటిని ఆఫర్ చేసింది. అయితే భారీ డిమాండ్ నేపథ్యంలో గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా మరో రూ. 500 కోట్ల విలువైన ఎన్సీడీలను సైతం విక్రయించింది. వెరసి 45 నిముషాల్లోనే రూ. 1,000 కోట్లు సమీకరించింది. ఇష్యూ పరిమాణం 50 లక్షలుకాగా.. 2.19 కోట్ల ఎన్సీడీలకు బిడ్స్ దాఖలయ్యాయి. ఇవి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి. 6న ఓపెన్ అయిన ఇష్యూ 19న ముగియనుంది. వీటిని తొలుత వచ్చినవారికి తొలుత ప్రాతిపదికన జారీ చేయనున్న సంగతి తెలిసిందే.75 శాతం చెల్లింపులకేఅదానీ ఎంటర్ప్రైజెస్ ఆఫర్ చేసిన ఎన్సీడీలకు రేటింగ్ దిగ్గజాలు ఇక్రా, క్రిసిల్ వీటికి స్థిరత్వ ఔట్లుక్తో కూడిన ఏఏమైనస్ రేటింగ్ను ప్రకటించాయి. నిధులలో 75 శాతాన్ని ప్రస్తుత రుణాల చెల్లింపునకు అదానీ గ్రూప్ దిగ్గజం వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ ఇంతక్రితం 2025 జూలైలో ఎన్సీడీల జారీ ద్వారా రెండోసారి రూ. 1,000 కోట్లు సమీకరించింది.తాజాగా విక్రయించిన ఎన్సీడీలను 24, 36, 60 నెలల కాలావధితో ఆఫర్ చేసింది. వీటికి త్రైమాసిక, వార్షిక పద్ధతిలో వడ్డీని చెల్లించనుంది. గత నెలలో ప్రారంభమైన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సహా.. కంపెనీ వైజాగ్లో గూగూల్ అదానీ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్, దేశవ్యాప్తంగా వివిధ రహదారుల ప్రాజెక్టులు అభివృద్ధి చేయనున్న విషయం విదితమే.
ఆర్ 15 సిరీస్ యమహా బైక్ ధరలపై డిస్కౌంట్
యమహా మోటార్ 70వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా యమహా మోటార్ సంస్థ తన ఫ్లాగ్ప్ స్పోర్ట్స్ మోటార్సైకిల్ ఆర్15 సిరీస్ బైక్లపై రూ.5,000 డిస్కౌంట్ ప్రకటించింది. ప్రత్యేక తగ్గింపు ధరలు జనవరి 5 నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీ తెలిపింది. తగ్గింపు తర్వాత యమహా ఆర్15 సిరీస్లోని యమహా ఆర్15ఎస్ మోడల్ బైక్ ప్రారంభం ధర రూ.1,50,700గా ఉంది.రేసింగ్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్, ఆధునిక సాంకేతికత, రోజువారీ వినియోగానికి అనువైన రైడింగ్ లక్షణాల కారణంగా యువతలో ఈ బైక్లకు విశేషణ ఆదరణ లభించింది. భారత్లో ఇప్పటివరకు 10 లక్షలకుపైగా యూనిట్ల ఉత్పత్తి జరగడం ఆర్15 సిరీస్ బ్రాండ్ డిమాండ్ ప్రతిబింబిస్తుంది.ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, క్విక్షిఫ్టర్, ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఆరు స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ ఉంది. తగ్గించిన ధరలను పరిగణలోకి తీసుకుంటే ఇదే సిరీస్లోని ఆర్15 వీ4 బైక్ ధర రూ.1,66,200, ఆర్15 ఎం బైక్ ధర రూ.1,81,100గా ఉన్నాయి.
చిన్న బ్యాంకులు... పెద్ద అడుగులు
న్యూఢిల్లీ: పేరుకు చిన్నవే అయినా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) వేగంగా వృద్ధి చెందుతున్నాయి. గత అయిదేళ్లలో నియామకాలు, డిపాజిట్లు, రుణాల కార్యకలాపాల్లో ముందుకెళ్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ఎస్ఎఫ్బీల్లో 95,249గా ఉన్న సిబ్బంది సంఖ్య వార్షికంగా 13.3 శాతం వృద్ధితో 2025 ఆర్థిక సంవత్సరంలో 1.8 లక్షలకు పెరిగింది. ఇదే వ్యవధిలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.3 శాతం వార్షిక వృద్ధితో 18.1 లక్షలకు చేరింది. 2026 ఆర్థిక సంవత్సరంలోనూ ఎస్ఎఫ్బీల్లో నియామకాల జోరు కొనసాగింది.11 ఎస్ఎఫ్బీలకు గాను ఎనిమిది లిస్టెడ్ బ్యాంకులు ప్రథమార్ధంలో దాదాపు 9,000 మందిని తీసుకున్నాయి. 2020–25 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) సిబ్బంది సంఖ్య 0.8 శాతం తగ్గగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 8.6 శాతం పెరిగింది. మరోవైపు, 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఎస్ఎఫ్బీల రుణాలు రూ. 94,441 కోట్ల నుంచి 24.2 శాతం పెరిగి రూ. 2,78,564 కోట్లకు ఎగిశాయి. అటు బ్యాంక్ డిపాజిట్లు కూడా రూ. 62,667 కోట్ల నుంచి 33.5 శాతం పెరిగి రూ. 2,65,586 కోట్లకు చేరాయి. చిన్న సంస్థలకు పీఎస్బీ రుణాల దన్ను మరోవైపు, పీఎస్బీల దన్నుతో 2025 జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) గణనీయంగా కొత్త రుణాలు లభించినట్లు క్రిసిల్ ఇంటెలిజెన్స్ ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, ఎంఎస్ఎంఈలకు అదనంగా ఇచ్చిన రుణాలు గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 17.7 శాతంతో పోలిస్తే 32.5 శాతానికి పెరిగినట్లు వివరించింది. మొత్తం రుణాల్లో ఎంఎస్ఎంఈల వాటా 1.72 శాతం మేర పెరిగింది. సురక్షితమైన సెక్యూర్డ్ క్రెడిట్ వైపు మొగ్గు చూపుతూ పీఎస్బీలు గణనీయంగా రుణాలివ్వడం ఇందుకు తోడ్పడింది. అలాగే ఎంఎస్ఎంఈల నిర్వచనంలో మార్పులు కూడా అధిక రుణ వితరణకు కారణంగా నిల్చినట్లు నివేదిక పేర్కొంది. అన్సెక్యూర్డ్ వ్యాపార రుణాల్లో అసెట్ నాణ్యత కాస్త క్షీణించినప్పటికీ మొత్తం ఎంఎస్ఎంఈ రుణాల పోర్ట్ఫోలియో పరిస్థితి సంతృప్తికరంగానే ఉన్నట్లు వివరించింది. యూనివర్సల్ లైసెన్సుపై దృష్టి..ఎస్ఎఫ్బీలు భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తూ, యూనివర్సల్ లైసెన్సుపై దృష్టి పెట్టాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. లైసెన్సు రావడానికి ముందుగానే సర్వసన్నద్ధంగా ఉండేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లలోను శాఖలను చురుగ్గా విస్తరిస్తున్నాయని పేర్కొన్నాయి. ఇలాంటి మార్కెట్లలో టెక్నాలజీ వినియోగం పరిమితంగా ఉంటుంది కాబట్టి సిబ్బంది సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా హైరింగ్ని కూడా పెంచుకుంటున్నాయి. ఇటీవలే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి యూనివర్సల్ బ్యాంక్గా లైసెన్సు వచి్చంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గతేడాది లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకూ లైసెన్సుపై ఆసక్తిగా ఉంది.
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో
జైసల్మేర్: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఎక్స్యూవీ 3ఎక్స్వో ఈవీని (ఎలక్ట్రికల్) ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఐసీఈ వెర్షన్ని 2024 ఏప్రిల్లో ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ వెర్షన్ 285 కి.మీ. రేంజినిస్తుంది. మరోవైపు, సెవెన్ సీటర్ ఎక్స్యూవీ 7ఎక్స్వోని కూడా ఆవిష్కరించింది. దీని ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.11 లక్షల వరకు (ఎక్స్షోరూం) ఉంటుంది.ఇది ఎక్స్యూవీ 700కి కొత్త వెర్షన్. ఎక్స్యూవీ 700 అమ్మకాలు ప్రతి నెలా సుమారు 7,000 యూనిట్లుగా ఉండగా, 7ఎక్స్వో రాకతో విక్రయాలు దాదాపు 30 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. కొత్త ఉత్పత్తులు, వేరియంట్లతో ఈ ఏడాది అమ్మకాలు మరింతగా వృద్ధి చెందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతేడాది బొలెరో, బొలెరో నియో కొత్త వెర్షన్లను ప్రవేశపెట్టగా, ఈసారి ఎక్స్యూవీ 7ఎక్స్వో, ఎలక్ట్రిక్ ఎక్స్ఈవీ 9ఎస్ దన్నుతో విక్రయాలు మరింత పెరుగుతాయని చెప్పారు. జీఎస్టీ తగ్గింపు ప్రభావం కార్లతో పాటు చిన్న కమర్షియల్ వాహనాలపైనా సానుకూల ప్రభావం చూపినట్లు రాజేశ్ తెలిపారు. పరిశీలనలో రేట్ల పెంపు కమోడిటీల రేట్లు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం తదితర పరిణామాల నేపథ్యంలో వాహనాల రేట్ల పెంపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాజేశ్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, వచ్చే కొద్ది వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. ఇప్పటికే హుందాయ్, బీవైడీ, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్స్ మొదలైనవి జనవరి నుంచి రేట్ల పెంపు ప్రకటించాయి. అటు మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎండబ్ల్యూ ఇండియా తదితర దిగ్గజాలు కూడా రేట్ల పెంపును పరిశీలిస్తున్నాయి.
ఫ్యామిలీ
బ్రయాన్ జాన్సన్లా భారత్ యువకుడు..! ఏకంగా ఏడువేల..
వృద్ధాప్యఛాయలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ అనే వ్యాపారవేత్త ఎన్ని కోట్లు ఖర్చుచేస్తున్నాడో తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో చికిత్సలు, అనుక్షణం హెల్త్ ట్రాకింగ్లు, చుట్టూ వందలాది డాక్టర్లను మెయింటైన్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. అదీగాక ఇటీవల త్వరలో వృద్ధాప్యాన్ని, చావుని జయిస్తానిని చాలా నమ్మకంగా ప్రకటించేశాడు కూడా. ఇది ఎంత వరకు సాధ్యం అన్న సందేహాలు వెల్లువెత్తున్న తరుణంలో ఒక భారత యువకుడు తాను కూడా బ్రయన్ జాన్సన్లా కావాలనుకుంటున్నా అంటూ షాంకింగ్ ప్రకటన చేశాడు. ఆయన బాటలోనే నడుస్తున్నానంటూ..తప వ్యక్తిగత ఆరోగ్య ప్రయోగం గురించి పూసగుచ్చినట్లు వివరించి నోరెళ్లబెట్టేలా చేశాడు. యవ్వనంపై ఇంత వ్యామోహమా అని నెటిజన్లు ఆ యువకుడిని ఏకీపారేస్తున్నారు నెటిజన్లు..ఇంతకీ ఆ యువకుడి ఏవిధంగా తనపై ప్రయోగాలు చేసుకుంటున్నాడంటే..బెంగళూరు సెడోనా హెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకుడు 23 ఏళ్ల పునర్వ్ దినకర్ భారత్ బ్రయన్ జాన్సన్గా అవతరించాలని కోరుకుంటున్నా అని సోషల్ మీడియా ఎక్స్లో పేర్కొన్నాడు. అందులో భాగంగా తన వ్యక్తిగత ఆరోగ్య ప్రయోగాన్నికూడా మొదలు పెట్టేశానని, ప్రతీ అవయవం పనితీరుపై ఫోకస్ పెట్టేలా ట్రాక్ చేస్తున్నట్లు కూడా వెల్లడించాడు. అంతేకాదండోయ్ ఏకంగా ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా రక్తపరీక్షలు కూడా చేయించుకున్నాడట. ఆఖరికి నిద్ర, ఒత్తిడిని ట్రాక్ చేసేలా WHOOPని కొనుగోలు చేసాను - నా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి స్ట్రావా, నా కేలరీలను ట్రాక్ చేయడానికి Amy, ఈ పరీక్షలన్నింటిని ట్రాక్ చేసేలా Sedona వంటివి అన్నింటిని సెటప్ చేశానని చెబుతున్నాడు. పైగా తన ఆరోగ్యానికి సంబంధించి ప్రతి అణవణువు శోధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఈ యువకుడి లక్ష్యం బ్రయాన్లా వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం కానే కాదట. ఇతడి ఆశయం అత్యంత భిన్నగా ఉంది. బదులుగా డేటా ఆధారిత ఆప్టిమైజేషన్ ద్వారా జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించడం అనేది అతడి లక్ష్యమట. అలాగే ఇతరులు తన ఆరోగ్యం గురించి తెలసుకునేందుకు మొత్తం డేటాని బహిర్గతం చేసేలా డాక్యుమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. తన శరీరంలో కొలిచే, ట్రాక్ చేసే, మెరుగుపరిచే ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేస్తాను కాబట్టి ఇతరులు కూడా సులభంగా తనలా స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా ప్రేరణగా ఉంటుదనేది అతడి అభిప్రాయం. చావుని జయించి దీర్ఘాయువుతో ఉండాలనే దానిపై విపరీతంగా పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో దినకర్ ప్రకటన రావడం విశేషం. కాగా, దీపిందర్ గోయల్(జోమాటో వ్యవస్థాపకుడు) వంటి ప్రముఖ వ్యక్తులు కూడా మెదడు రక్త ప్రవాహాన్ని ట్రాక్ చేయడానికి ధరించగలిగే కంటిన్యూ', 'టెంపుల్' వంటి ప్రాజెక్టులతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే నెటిజన్లు దినకర్ ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ప్రయోగాలకు సిద్ధమవ్వడానికి ప్రశంసించినప్పటికీ..ఇలా నిరంతరం ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తే..చిన్న చిన్ని వాటికి ఆందోళన చెందే పరిస్థితికి దారితీస్తుందనేది వారి వాదన. పైగా దీని కారణంగా ఒత్తిడి బారినపడే ప్రమాదం కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు. అంతేగాదు బ్రో ఎవ్వరూ జీవితాన్నిపూర్తి స్థాయిలో ఆస్వాదించలేరనేది జగమెరిగిన సత్యం అంటూ పోస్టులు పెట్టారు.To everyone reading this, Hi, I'm Punarv.I'm 23 and starting today, I will be the Bryan Johnson of India.- Got a blood test done worth 7k covering all the imp biomarkers- Bought a WHOOP last month to track sleep, strain and recovery- Strava to track my activities, Amy to… pic.twitter.com/h8079K5LHW— punarv (@ycocerious) January 5, 2026 (చదవండి: తండ్రికి చదువు లేదు, తల్లి సూట్లు కుట్టేది....కానీ కూతురు ఐపీఎస్..!)
ఎక్స్రే, సీటీ స్కాన్, ఎమ్మారైలు సురక్షితమేనా?
ఈరోజున ఎక్స్–రేలు లేని మెడికల్ సైన్స్ను ఊహించుకోలేం. ఏదైనా సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్లగానే చేయించే పరీక్షల్లో మొట్టమొదటిది రక్తపరీక్షలైతే.. రెండోది తప్పకుండా ఎక్స్–రే అయి ఉంటుంది. దేహాన్ని కోయకుండా... కత్తిగాటు పెట్టకుండా లోపలి అవయవాల తీరుతెన్నులు తెలుసుకునే ఈ పరీక్ష వైద్యశాస్త్రంలోనే ఓ తిరుగులేని వరదాయిని. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దేహంలోపలి అవయవాలకు గానీ, ఎముకలకు గానీ... ఏ ముప్పు వాటిల్లిందో, ప్రమాదం తాలూకు దుష్ప్రభావమెంతో తెలుసుకోవడంలో ఎక్స్–రేలను మించిన పరీక్షలేదు కదా... అలాంటిది అసలీ ఎక్స్–రేలను తెలుçసుకోవడమే ఓ యాక్సిడెంట్! ఎక్స్–రే అంటే ఏమిటో, దాని వివరాలూ, తీయాల్సింది ఎందుకు, ఎప్పుడెప్పుడు, దాని తాలూకు దుష్ప్రభావాలేమిటి... అవే ఎక్స్–రేలను మరింత తక్కువ మోతాదులో ఉపయోగించి తీసే సీటీ–స్కాన్ ఏమిటి? అదెప్పుడు తీస్తారు వంటి అనేక వివరాలను తెలుసుకుందాం...ఎక్స్–రే అంటే కూడా ఒక రకం కాంతి. అనంత కాంతి పటలంలో కంటికి కనిపించేది కొంతమేరకు మాత్రమే. ఇక కంటికి కనిపించని కాంతి పుంజాలు... ఇన్ఫ్రారెడ్ అనీ, అల్ట్రా వయొలెట్ అనీ, ఎక్స్ రేస్ అనీ ఇలా వేర్వేరుగా ఉంటాయి. విస్తృతమైన రేడియేషన్లో కంటికి కనిపించే కాంతి ఒక వేవ్లెంగ్త్తో (అంటే కాంతి వేవ్లెంగ్త్ 380 నుంచి 750 నానో మీటర్ల మధ్యన) ఉంటే... ఈ రకరకాల రేడియేషన్ రూపాలు కొన్ని నిర్దిష్టమై వేవ్లెంగ్త్స్తో రకరకాలుగా ఉంటాయి. వాటి వేవ్లెంగ్త్ తాలూకు ఫ్రీక్వెన్సీలను బట్టి వాటికి ఆయా పేర్లు పెడతారు.మిగతా రేడియేషన్ల తాలూకు తీవ్రత కాంతి కంటి భిన్నంగా ఉండటంతో పాటు కాంతిలా నిరపాయకరంగా ఉండదు. ఆయా కాంతి కిరణాల తీవ్రత కారణంగా వాటి దుష్ప్రభావమూ తీవ్రంగానే ఉంటుంది. అందుకే వైద్య పరీక్షల కోసం వెలువరించే ఆ రేడియేషన్తో కొన్ని ముప్పులూ, దుష్ప్రభావలూ తప్పవు. అయితే వైద్యశాస్త్ర అవసరాల దృష్ట్యా బేరీజు వేసినప్పుడు... వాటి వల్ల కలిగే దుష్ప్రభావం కంటే వాటితో ఒనగూరే మేలు ఎక్కువ అనుకున్నప్పుడు డాక్టర్లు ఈ కిరణాలను ఉపయోగించే ఎక్స్–రే పరీక్ష లేదా సీటీ స్కాన్ చేయించమని సూచిస్తారు. అయితే ఆధునిక వైద్యశాస్త్రవేత్తలు తమ కొత్త కొత్త ఆవిష్కరణలతో ఇప్పుడీ ఎక్స్–రేల దుష్ప్రభావాలను గతం కంటే చాలా చాలా తగ్గించారు. దాంతో ఇప్పుడు ఎక్స్–రేలు చాలావరకు నిరపాయకరమే అని చెప్పవచ్చు.కనుగొనడమే ఓ యాదృచ్ఛికమైన అద్భుతం! ఎక్స్–రేలను కనుగొనడమే చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఈ అత్యద్భుతమైన ఆవిష్కారం జరిగిన తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ గాజు సిలిండర్లో క్యాథోడ్ కిరణాలను దారిమళ్లించాక... అవి తప్పించుకుపోకుండా ఉంచిన ఫ్లోరెసెంట్ స్క్రీన్ మెరుస్తుండటంతో అక్కడ ఒకరకమైన కిరణాలు పడుతున్నాయని విల్హెమ్ కోనార్డ్ రాంట్జన్ అనుకున్నాడు. అకస్మాత్తుగా తన చేతిని అడ్డుపెడితే చేతిలోని ఎముకలు కనిపించాయి. దాంతో తన భార్యను పిలిచి... ఆమె చేతిని కూడా ఆ కిరణాలకు అడ్డుగా ఉంచినప్పుడు ఆమె కూడా తన చేతిలోని ఎముకలు చూసి భయంతో బెంబేలెత్తిపోయింది. అలా చాలా యాక్సిడెంటల్గా రాంట్జన్ కనుగొన్న ఎక్స్–రేలతో వైద్యచికిత్సలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అంతకుముందు చాలా అసాధ్యంగా భావించిన సంక్లిష్టమైన చికిత్సలు చాలా చాలా సులువయ్యాయి. మరీ ముఖ్యంగా ఎముకలు మొదలుకొని శరీరంలోని కొన్ని భాగాల చికిత్స ఎంతో సులభతర మయ్యింది.అసలు ఎక్స్–రే అంటే ఏమిటి? ఏదైనా వస్తువును చూడటానికి కాంతి అవసరమవుతుంది. కానీ నిజానికి ‘కాంతి’ అంటే అనేక వేవ్లెంత్ గల రేడియేషన్ తరంగాల కిరణాల్లో అదో చిన్న భాగం మాత్రమే. అందులోని ఇతర వేవ్లెంగ్త్ ఉన్న భాగాలు నేరుగా మన కంటికి కనిపించవు. కాంతి కిరణాల కంటే ఈ ఎక్స్–రే తరంగాలు బలమైనవి. కాబట్టి కాంతి మన శరీరాన్ని తాకి వెనుదిరిగిపోతుంది. కానీ ఈ ఎక్స్ కిరణాలు మాత్రం శరీరంలోకి బలంగా దూసుకుపోతాయి. కాంతి ఓ వస్తువును తాకి వచ్చి తిరిగి మన కంటిని చేరినప్పుడు... మనమా వస్తువును చూడగలిగినట్లే... ఈ కిరణాలూ శరీరం లోపలికి వెళ్లి అక్కడి అంతర్భాగాలపై ప్రతిఫలిస్తాయి కాబట్టి... వాటిని రేడియాలజిస్ట్ (రేడియేషన్తో పని చేయగలిగే సామర్థ్యం ఉన్న నిపుణులు) మరికొంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, వాటి సహాయంతో చూడగలుగుతాడు. అలాగే ఆ ప్రతిబింబాన్ని ఫొటో తీసి, ఫిల్మ్పై ముద్రించగలిగినప్పుడు అది ‘ఎక్స్–రే’ పిక్చర్ అవుతుంది. ఇప్పుడున్న సాంకేతికత సహాయంతో ఆ ప్రతిబింబాన్ని టీవీ మీదగానీ లేదా కంప్యూటర్ తెర మీదగానీ ఒడిసి పట్టగలగడమూ సాధ్యమే. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రేడియేషన్లు! ఈ ప్రపంచంలో ప్రతిచోటా రేడియేషన్ ఉండనే ఉంటుంది. సగటున ఒక వ్యక్తి ప్రతి ఏడాదీ 3 ఎమ్ఎస్వీ రేడియేషన్కు గురవుతుంటాడని ఓ అంచనా. అయితే అది సగటు మాత్రమే. కొన్నిచోట్ల రేడియేషన్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. మరికొన్ని చోట్ల తక్కువ. ఉదాహరణకు పీఠభూమి (ప్లేటో) ్రపాంతాల్లో ఉండేవారు తమ తోటి కోస్తా (కోస్టల్) ్రపాంతాల్లో ఉండేవారితో పోలిస్తే 1.5. మిల్లీ స్టీవెర్ట్ (ఎమ్ఎస్వీ... అంటే రేడియేషన్ను కొలవడంలో ఉపయోగపడే కొలతల్లో ఒక రకమైన యూనిట్) ఎక్కువగా నేచురల్ రేడియేషన్కు గురవుతుంటారు. అలాగే మనం మన ఇండ్లలోపలే ఉన్నప్పటికీ ఎంతోకొంత రేడియేషన్కు గురవుతూనే ఉంటాం. వాతావరణంలోని రాడాన్ గ్యాస్ కూడా ఈ రేడియేషన్ మోతాదులోని మార్పులకు కారణమవుతుంటుంది. రాడాన్ వల్ల రేడియేషన్ పెరుగుతుంది (ఏడాదికి షుమారు 2 ఎమ్ఎస్వీ). ఒకదేశంలో ఉండే రేడియేషన్కీ మరో దేశం తాలూకు రేడియేషన్లో కూడా తేడాలుంటాయి. ఉజ్జాయింపుగా ఒక ఉదాహరణ చె΄్పాలంటే... మనం 10 రోజుల పాటు స్వాభావికంగానే ఎంత రేడియేషన్కు ఎక్స్పోజ్ అవుతామో... ఛాతీ ఎక్స్–రే తీయించుకోవాలనుకున్నప్పుడు కేవలం ఆ కొద్ది క్షణాల్లోనే 10 రోజులకు సరిపడా రేడియేషన్ను గురవుతామన్నది నిపుణుల తాలూకు ఓ రఫ్ అంచనా. సీటీ స్కాన్లో ఉండేవీ ‘ఎక్స్–రే’లే! వైద్య పరీక్షల్లో భాగంగా ‘సీటీ స్కాన్’గా పరిగణించే స్కానింగ్ ప్రక్రియల్లోనూ ఎక్స్–రేలనే ఉపయోగిస్తారు. కాకపోతే వాటినే మరికొంత అడ్వాన్స్డ్ ప్రక్రియల్లో ఉపయోగించి ఎక్స్–రే కంటే అదనపు ప్రయోజనాలను సాధిస్తారు. కాకపోతే ఎక్స్–రేతో పోలిస్తే సీటీ స్కాన్లో రేడియేషన్ మోతాదులు ఎక్కువ. ఫలితం కూడా ఎక్కువే. ఇందులో రేడియేషన్ తాలూకు మోతాదూ, తీవ్రతా కాస్తంత ఎక్కువ. కాబట్టి తీయించుకోవడంలోనూ డాక్టర్ల సలహాలు, సూచనలు, విచక్షణ అవసరం. అందుకే వారి సలహా లేకుండా పేషెంట్లు తామంతట తాము సీటీ స్కాన్ కోసం పట్టుబట్టడం అంత సరైనది కాదు.రేడియేషన్తో ఎప్పుడూ ప్రమాదమేనా..? నిజానికి వైజ్ఞానికి ఆవిష్కరణ అన్నది ఎప్పుడూ పదునైన కత్తి లాంటిది. ఆ పదునుతో ఎన్ని సౌలభ్యాలుంటాయో, అన్ని ప్రమాదాలూ ఉంటాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి కొన్ని పరీక్షల తాలూకు మరో కోణాన్నీ చూద్దాం. అవును. రేడియేషన్తో కచ్చితంగా ఎంతో కొంత ప్రమాదం ఉండితీరుతుంది. అయితే రేడియేషన్ అంటే అదేదో కేవలం ఎక్స్–రేలలోనే ఉండదు. నిజానికి మన చుట్టూ ఉండే వాతావరణంలోనూ ఎల్లప్పుడూ ఎంతోకొంత రేడియేషన్ ఉంటుంది. కాకపోతే అది మనకు హానికలిగించే పరిమాణంలోఉండకపోవచ్చు. వాతావరణంలో ఉన్న రేడియేషన్ అన్నది మనం తన ఉనికిని గుర్తించేంతగా ఉండదు. అదే... ఎక్స్–రే తీసేచోట లేదా వాటితో పనిచేసే చోట అది ఎక్కువగా ఉంటుంది. మితిమీరిన రేడియేషన్ కారణంగా ఎన్నో అనర్థాలూ, ఆరోగ్య సమస్యలూ వచ్చే ముప్పు ఉంటుంది.‘రేడియేషన్’ను ఎలా కొలుస్తారంటే....? ఒక ప్రదేశంలో రేడియేషన్ ఎంత పరిమాణంలో ఉందనే విషయాన్ని తెలుసుకోడానికి లేదా కొలవడానికి ఒక కొలత (యూనిట్) ఉంది. దాని పేరే మిల్లీ సీవెర్ట్ (ఎమ్ఎస్వీ). అలాగే రేడియేషన్ మోతాదునూ, తీవ్రతలను కొలవడానికీ రెడ్, రెమ్, రోంట్జెన్, సీవెర్ట్, గ్రే వంటి యూనిట్లూ ఉంటాయి. ఈ వేర్వేరు కొలతలతో మనకు ఉపయోగం ఏమిటి? కాంతి మన శరీరాన్ని తాకి వెనుదిరుగుతుంది. కానీ ఎక్స్–రేలు లోపలికి ఎముకల వరకూ వెళ్తాయి . అలాగే మన శరీరంలో వేర్వేరు అవయవాలు వాటివాటి స్వభావాన్ని బట్టి ఎక్స్–రేలను తమలోకి అనుమతించడం విషయంలో వేర్వేరుగా స్పందిస్తాయి. అంటే... ఎముకల వరకు వెళ్లాలంటే ఒక మోతాదు బలం అవసరం. అలాగే ఊపిరితిత్తులు మెత్తగా ఉంటాయి కదా. వాటిని చూడాలంటే ఎక్స్–రే వేరే మోతాదులో కావాలి. అలా మనం మన దేహంలోకి చూడాల్సిన అవయవాన్ని బట్టి వేర్వేరు మోతాదులో ఎక్స్–రే పరిమాణాన్ని లోపలికి పంపాలి. అలా మనం మన దేహంలో ఫొటో తీయాలనుకున్న అవయవాన్ని బట్టి వేర్వేరు మోతాదుల్లో ఎక్స్–రే కిరణాలను పంపాల్సి ఉంటుంది. అందుకే ఈ రెడ్, రెమ్, రోంట్జెన్, గ్రే వంటి కొలతలు అవసరమవుతాయి.సీటీ స్కాన్తోనూ ఇదే ముప్పా ? ఉంటుంది. ఎందుకంటే... సీటీ స్కాన్లోనూ వెలువడే రేడియేషన్ కూడా హానికరమైనదే. అందుకే రేడియాలజిస్ట్లు సీటీ స్కాన్ తీసేప్పుడు వాడే రేడియేషన్ తాలూకు తీవ్రతనూ వీలైనంతగా తగ్గించేలా శిక్షణ ΄÷ందుతారు. అందుకే... ఎక్స్–రేగానీ లేదా సీటీ స్కాన్ గానీ తీయించుకోవడం తప్పనప్పుడు ఈ రేడియేషన్ ప్రమాదాలకు భయపడకూడదు. అలాగే మనకు అవసరం లేకపోయినా... రొటీన్ పరీక్షల పేరిట రేడియేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్న పరీక్షలనూ తరచూ చేయించుకోవడమూ సరికాదు.ఇదే ఇలాగుంటే మరి ఎమ్మారైతో...? ఎక్స్–రేలూ, సీటీ స్కాన్లతో ఇంత ముప్పు అయితే మరి వీటన్నికంటే మరింత లోతైన ఫలితాలను చెప్పే ఎమ్మారైతో ఎంత ముప్పు కలుగుతుందో అన్న సందేహం వైద్య పరిజ్ఞానం అంతగా లేని సాధారణ ప్రజల్లో కలగవచ్చు. నిజానికి ఎక్స్–రే, సీటీ స్కాన్తో పోలిస్తే ఎమ్మారైతో రేడియేషన్ ప్రమాదమే ఉండదు. ఎందుకంటే ఎమ్మారై అంటే ‘మేగ్నటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్’ అని అర్థం. అంటే ఇందులో కేవలం అయస్కాంత బలాన్ని మాత్రమే ఉపయోగిస్తూ, రేడియేషన్ వాడరు కాబట్టి ఎమ్మారైతో అంతటి ప్రమాదాలు ఉండవు. రేడియేషన్ కిరణాలతో క్యాన్సర్ వంటి వైద్యచికిత్సలు... రేడియో సర్జరీలు! రేడియేషన్తోనూ వైద్యచికిత్సలు సాధ్యమవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో రేడియేషన్ థెరపీ విషయానికి వస్తే గతంలో అది చాలా భయం గొలిపేదిగా ఉండేది. అయితే ఇప్పుడలాంటి దుష్ప్రభావాలు చాలావరకు తగ్గాయి. ‘ర్యాపిడ్ ఆర్క్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ’ వల్ల కేవలం క్యాన్సర్ కణాలకు మాత్రమే రేడియేషన్ తగులుతుంది. ఇలాంటి చికిత్సల్లో రేడియేషన్ కేవలం క్యాన్సర్ కణాల్ని మాత్రమే తన లక్ష్యంగా చేసుకుంటుంది. అత్యాధునిక ప్రక్రియల సహాయంతో దేహంలోని అత్యంత కీలకమైన అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి చోట్ల నిర్భయంగా రేడియేషన్ను ప్రసరింపజేయవచ్చు. ఇక ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ‘ఎఫ్ బీమ్’ వల్ల చాలా సురక్షితంగా ‘రేడియోసర్జరీ’ చేయవచ్చు. సాధారణ సర్జరీలో రోగిని ఆసుపత్రిలో చేర్చాలి. కానీ రేడియోసర్జరీలో రోగిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరమే ఉండదు. పైగా రేడియేషన్తో చేసేదైనప్పటికీ ఇది పూర్తిగా సురక్షితం.ఎక్స్–రే ఉపయోగాలేమిటి...? ఎక్స్–రే వంటి బలమైన కిరణాలు బలంగా శరీరంలో లోపలికి చొచ్చుకుపోతాయి. అవి శరీరంలోని అనేక కీలక అవయవాలను చేరి, ఫొటోలు తీసి... అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. దాన్ని ఎక్స్–రే ఫిల్మ్ సహాయంతో నిక్షిప్తం చేసుకోవచ్చు. మనకు తెలిసిందల్లా... ఎక్స్–రే అంటే... ఆ కిరణాల సహాయంతో ఎముకలు విరిగాయా అన్న సమాచారం తెలుస్తుందనే సాధారణ విషయం మాత్రమే. కానీ డాక్టర్లు మాత్రం ఈ ఎక్స్–రే కిరణాల సహాయంతో చాలా రకాల సమాచారమూ, ఫలితంగా ఎన్నో ప్రయోజనాలు ΄÷ందుతారు. ఉదాహరణకు... దేహంలోకి ఓ పైప్ను పంపాలంటే... అది దేహంలోకి ఇతర అంతర్గత అవయవాలకూ తగలకుండా సాఫీగా ఎలా పంపగలమని చూస్తారు. అలాగే దేహం లోపల ఏదైనా ఉపకరణాన్ని లేదా పరికరాన్ని అమర్చాలంటే నిర్దిష్టంగా ఎక్కడ అమర్చాలన్న విషయాన్ని ఎక్స్–రేల సహాయంతోనే తెలుసుకుంటారు. ఎక్స్–రేతో ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి. ఎక్స్–రేలు సురక్షితమేనా...? ఒక్కమాటలో చెప్పాలంటే... పూర్తిగా సురక్షితమైతే కాదు. మరెందుకు తీయించుకుంటున్నామనే ప్రశ్న ఆవిర్భవిస్తుంది. అయితే... ఎక్స్–రేలకు ఎక్స్ పోజ్ అయినప్పుడు ఉన్న రిస్క్తో పోలిస్తే... నిజంగా మనకు అవసరమైనప్పుడు చేయించిన వైద్యపరీక్షతో మనకు ఒనగూరే లాభం ఎక్కువ కాబట్టి. అందుకే ఎక్స్–రే లేదా ఇతరత్రా రేడియేషన్ సహాయంతో సీటీ స్కాన్ వంటివి తీసేప్పుడు సాధ్యమైనంత తక్కువ రిస్క్తో... సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పోందేలా రేడియాలజిస్టులు పనిచేస్తారు. అలా వారు శిక్షణపోందుతారు. మన ఇంట్లో మామూలు బల్బ్ ఆర్పేశాక... కాంతి మాయం అయినట్లే... ఒకసారి ఎక్స్–రే స్విచ్ ఆఫ్ చేశాక మళ్లీ అక్కడ రేడియేషన్ ఉండదు. కాబట్టి ఎక్స్–రే ప్రక్రియ ముగిశాక అక్కడ అరకొర ఎక్స్–రే దుష్ప్రభావాలు ఉండిపోయి... అవి మనకు హానిచేస్తాయేమో అనే ఆందోళన ఎంతమాత్రమూ అవసరం లేదు. అలా అనుకోవడం మన అపోహ మాత్రమే.ఎక్స్–రేలు... గర్భవతి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మామూలు వ్యక్తులకే ఎక్స్–రేలతో ఎంతోకొంత హాని ఉందనుకుంటే... మరి గర్భవతి కడుపులో పెరుగుతున్న చిన్నారులకూ ఇంకా ఎక్కువ హాని ఉండనే ఉంటుంది. అందుకే గర్భవతికి ఎక్స్–రే విషయంలో డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆమెకు మందులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక ఫిజీషియన్ ఎంత నిశితంగా వ్యవహరిస్తాడో... ఆమెకు ఎక్స్–రే అవసరమైనప్పుడు ఒక రేడియాలజిస్ట్ అంతే నిశితంగా ఉంటాడు. అయితే ప్రతి సందర్భంలోనూ బిడ్డకు ఎక్స్–రే తప్పనిసరిగా హానికరంగా పరిణమిస్తుందని కాదు. కాకపోతే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కడుపులోని బిడ్డ ఏ వయసుకు పెరిగింది (అంటే ఏ నెల గర్భం), దానికి హాని చేయకుండా ఎంత మోతాదు ఎక్స్–రేకు గురిచేయవచ్చు... లాంటి అనేక అంశాల మీద ఈ ఎక్స్–రేల తాలూకు ముప్పు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత గర్భవతి తాలూకు తల, చెయ్యి, కాలు, ఛాతీ వంటి భాగాలకు ఎక్స్–రే తీయాల్సివస్తే... ఆమె కడుపులోని బిడ్డ వాటికి నేరుగా ఎక్స్పోజ్ అయ్యే ముప్పు అంతగా ఉండదు. కేవలం ఆమె ΄÷ట్టభాగంలో లేదా ΄÷త్తికడుపు భాగాల్లో ఎక్స్–రే తీయాల్సి వచ్చినప్పుడే బిడ్డ రేడియేషన్కు ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే మిగతావాళ్లతో పోల్చినప్పుడు ఎంతో అవసరమైతే తప్ప గర్భవతికి ఎక్స్–రే పరీక్ష నిర్వహించరు. ఒకవేళ చేయాల్సి వచ్చినా ఆమెకు చాలా తక్కువ మోతాదులో ఎక్స్–రేలు వాడేలా నిశితమైన జాగ్రత్తలు తీసుకుంటారు.గర్భవతులకు ఇప్పుడు ఆందోళన అక్కర్లేదు... ఏదైనా పనిలో రిస్క్ ఉందంటే... అది అన్నిసార్లూ అన్నే అనర్థాలను తెచ్చిపెట్టకపోవచ్చు. ఎక్స్–రే విషయంలోని ముప్పు కూడా అంతే. ఒకవేళ నిజంగా గర్భవతికి ఎక్స్–రే నిర్వహించాల్సి వస్తే అది తప్పకుండా అనర్థాలు తేకపోవచ్చు. కాకపోతే ఆ కిరణాల వల్ల కడుపులోని బిడ్డకు రిస్క్ ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని దాన్ని ఏ మేరకు తగ్గించగలరో... అంత మేరకు తగ్గించేలా రేడియాలజిస్టులు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి గర్భవతికి నిజంగా ఎక్స్–రే తీయాల్సిన అవసరమైనప్పుడు వారు ఈ విషయంలో మరీ ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే వైద్యపరిశోధనల్లో వచ్చిన ఎన్నో రకాల మార్పులు ఎక్స్–రే ముప్పులనూ గణనీయంగా తగ్గించగలిగాయి. నిర్వహణ: యాసీన్
వెనెజువెలా నూతన సారథి..పులిబిడ్డ
‘ముళ్ల కిరీటం’ అనే మాట వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ విషయంలో అక్షరాలా సరిపోతుంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేస్తోంది. ‘ఇలా చేయాలి...ఇలా మాత్రమే చేయాలి’ అంటూ శాసనాలు చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు తన దేశ సార్వభౌమాధికారాన్ని, తమ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఏటికి ఎదురీదే ప్రయత్నం చేస్తున్నారు డెల్సీ రోడ్రిగ్స్...నార్కో–టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి... మొదలైన ఆరోపణలతో వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్య సిలియాను అమెరికన్ సైన్యం నిర్బంధించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించడంతో ‘ఎవరీ డెల్సీ రోడ్రిగ్స్?’ అనే ఆసక్తి మొదలైంది.→ బాల్యం నుంచే పోరాట పాఠాలుతండ్రి ఒడిలో చిన్నప్పటి నుంచి పోరాట పాఠాలు వింటూనే పెరిగిన డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా సుప్రసిద్ధ జన నాయకురాలిగా ఎదిగారు. తండ్రి జార్జ్ ఆంటోనియో వెనెజువెలాలోని ప్రసిద్ధ లెఫ్ట్–వింగ్ గెరిల్లా ఫైటర్. 1976లో ఆయన హత్యకు గురయ్యాడు.→ చరిత్ర సృష్టించి...సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనెజువెలా(యుసీవి) నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన డెల్సీ స్టూడెంట్ లీడర్గా చురుగ్గా ఉండేవారు. ఆ తరువాత కాలంలో ‘సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనెజువెలా’లో ప్రొఫెసర్గా, ‘వెనెజువెలా అసోసియేషన్ ఆఫ్ లేబర్ లాయర్స్ ప్రెసిడెంట్’గా పనిచేశారు. 2002లో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ మంత్రి స్థాయికి ఎదిగారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో డెల్సీని 2014లో ‘పాపులర్ పవర్ ఫర్ ఫారిన్ రిలేషన్స్’ మంత్రిగా నియమించారు. వెనెజువెలా చరిత్రలో ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు డెల్సీ.→ ఉపాధ్యక్షురాలిగా...వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా 2018లో నియామకం అయ్యారు డెల్సీ. వెనెజువెలా నిఘా సంస్థ బొలివేరియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్కి హెడ్ అఫీషియల్గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2020లో ‘పాపులర్ పవర్ ఫర్ ఎకనామిక్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ వెనెజువెలా’ మంత్రిగా పనిచేశారు. చమురు, ఆర్థిక శాఖల మంత్రిగా దేశాన్ని ద్రవ్బోల్బణం బారిన పడకుండా చూశారు.దేశాన్ని రక్షించుకుందాం...వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియామకం అయిన డెల్సీ రోడ్రిగ్స్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన హెచ్చరికలతో, తమ చెప్పుచేతల్లో ఉండాలని చెప్పకనే చె΄్పాడు. అయితే ట్రంప్ హెచ్చరికలను 56 ఏళ్ల డెల్సీ ఆట్టే ఖాతరు చేయలేదు. నికొలస్ మదురో, అతడి భార్యను నిర్బంధించడాన్ని ఆమె ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘మదురోను కిడ్నాప్ చేశారు’ అని ఆరోపిస్తున్న డెల్సీ రోడ్రిగ్స్ ‘వెనెజువెలాని రక్షించుకోవడానికి, దేశంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. దేశ వనరులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. గ్రేట్ ఫైటర్నికోలస్ మదురోకు డెల్సీ రోడ్రిగ్స్ ప్రతిభాపాటవాలన్నా, నాయకత్వ సామర్థ్యమన్నా ఇష్టం. ఒకానొక సందర్భంలో ఆమెను ‘టైగర్’ అని అభివర్ణించారు. డెల్సీ ఉపా«ధ్యక్షురాలిగా నియమితురాలైన సందర్భంలో నికోలస్ మదురో ఆమెను...‘ధైర్యం మూర్తీభవించిన మహిళ. రాజకీయాల్లో తలపండిన అనుభవజ్ఞురాలు. అమరవీరుడి కుమార్తె. వెయ్యి యుద్ధాలతో పరీక్షించబడిన విప్లవకారిణి’ అని ఆకాశానికి కెత్తారు. డెల్సీని ‘టైగర్’ విత్ డిజైనర్ ఫ్యాషన్ టేస్ట్స్ అంటుంటారు. కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా పనిచేసిన డెల్సీకి ఫ్యాషన్ డిజైనింగ్పై మంచి అవగాహన ఉంది.ఏక్ లవ్స్టోరీ!గతంలో డెల్సీ రోడ్రిగ్స్, నటుడు ఫెర్నాండో కారిల్లో ప్రేమికులు. ఈ జంట 2007 వరకు కలిసే ఉంది. టీవీ సోప్ ఒపేర స్టార్గా ఫెర్నాండో సుపరిచితుడు. ‘నేను ఆమెను ఏదో ఒకరోజు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అత్యంత తెలివైన మహిళలలో ఆమె ఒకరు’ అని డెల్సీ గురించి చెబుతుండే వాడు ఫెర్నాండో కారిల్లో. వినోదం, రాజకీయం అనే భిన్న ప్రపంచాలు ఒకే ప్రపంచం కావడానికి ఏర్పడిన వైరుధ్యాలో? ఇతరత్రా కారణాలో... తెలియదుగానీ వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేక΄ోయారు. తాజా విషయానికి వస్తే... డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా అధ్యక్షురాలిగా నియామకం అయిన నేపథ్యంలో, ఆ రోజుల్లో డెల్సీపై ఫెర్నాండో కారిల్లో తన ప్రేమను ప్రకటించిన రోజును గుర్తు చేసుకుంటున్నారు నెటిజనులు.
మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
నటుడు శివాజీ కారుకూతల పైత్యం పెద్ద దుమారాన్నే రాజేసింది. ప్రత్యక్షంగా హీరోయిన్లపైనా, పరోక్షంగా మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన శివాజీపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అలాగే శివాజీకి అనూహ్యంగా మద్దతు కూడా లభించింది. ఈ దుమారం ఇలా కొనసాగుతుండగానే, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో రాసిన వ్యాసం కొత్త దుమారాన్ని రాజేసింది. ఇలాంటి వివాదాల పట్ల మీడియా బాధ్యతను, వ్యవహరించాల్సిన తీరును గుర్తు చేసింది.భూమిక ఫౌండర్, రచయిత్రి, సామాజికవేత్త కొండవీటి సత్యవతి ఈ ఆర్టికల్పై తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది కొత్త పలుకు కాదు. మహిళల పరంగా చెత్త పలుకు. శివాజీని వెనకేసుకొచ్చిన ఈ పెద్దమనిషి గతంలో సినీనటుడు చలపతిరావుతో 'మీకు నిజంగా రేప్ చేయ్యాలనిపించలేదా?.. అని అసహ్యంగా అడిగినపుడు నేను డైరెక్ట్గా అతనికే ఫోన్ చేసి నిలదీసినపుడు మర్నాడు ఆంధ్రజ్యోతిలోనే సారీ చెప్పారు. అయినా ఇలాంటి వాళ్ళు మారతారని నేను అనుకోను. శివాజీకి కానీ, రాధాకృష్ణకి కానీ మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యానించే అర్హత ముమ్మాటికీ లేదు. మీ వ్యవహారాలు మీరు చక్కబెట్టుకోండి. మాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి సాహసించకండి. మీకా అర్హత లేదు. మీ వ్యాఖ్యలు చుట్టవిరుద్ధమే కాదు రాజ్యాంగ విరుద్ధం’’ అంటూ ఆమె ఫేస్బుక్లో మండిపడ్డారు. అలాగే సీనియర్ జర్నలిస్టు కృష్ణజ్యోతి కూడా సోషల్మీడియాలో దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విక్టిమ్ బ్లేమింగ్, entitlement, మేల్ ప్రివిలేజ్, మేల్ dominance, control, body & gender politics ఈ ఆర్టికల్ అద్దంపడుతోందన్నారు. మీడియాతో సహా మహిళల విషయాల పట్ల అందరికీ కొంతైనా జెండర్ sensitisation ఉండడం చాలా ముఖ్యమని.. కానీ ఇందులో ఆ స్పృహ, ఆలోచన, ఆసక్తి, కించిత్ బాధ్యత లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే సిద్ధార్థ సుభాష్ చంద్రబోస్ ఈ వ్యాసంపై స్పందిస్తూ స్త్రీలు ఎటువంటి దుస్తులు వేసుకోవాలో తెలియజేస్తూ ఒక పత్రిక సంపాదకీయం రాయడం దారుణం అని వ్యాఖ్యానించారు. ‘‘స్త్రీలు మన కొలతల ప్రకారం శరీరం చూపే జంతువులు కాదు. వాళ్ల సౌకర్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ల దుస్తులు వాళ్లు ఎంపిక చేసుకునే హక్కుని అంగీకరించాలి. చూడలేకపోతే కళ్ళు మూసుకుని పక్కకు తప్పుకోవాలి, లేకపోతే గుహల్లో బ్రతకాలి. ఒక స్త్రీని దుస్తులని చూసి దాడి చేయాలనుకోవడం మగవాడి బలహీనతకు చిహ్నమే గాక, అది అతడు నాగరికంగా ఎదగలేకపోయిన వెనకబాటుని చూపిస్తుందనీ, రాజ్యాంగం సూచించిన స్వేచ్చా, సమానత్వాన్ని అంగీకరించని చట్టవిరుద్దమైన విషయమనీ, అలా గాకుండా ఇక్కడ ఏకంగా చేతులేస్తాం, రేపులు చేస్తామనడం తిరోగమనతత్వమని హితవు చెప్పి వుంటే అది "కొత్తపలుకు" అనే పదానికి అర్థవంతంగా వుండేది.. అంటూ బాగానే వాతలు పెట్టడం గమనార్హం.రాధాకృష్ణ వ్యాసంలో ఏముంది? డ్రెస్ కోడ్లతో మొదలైన అహంకారం, నిండు సభలో ఒక మహిళ చీర లాగినందుకు మహాభారత సంగ్రామం జరిగింది. అది ద్వాపర యుగం. కలియుగంలో మహిళలు జన సమూహంలోకి వెళ్లినప్పుడు చీర కట్టుకుంటే మంచిది అన్నందుకు మాటల యుద్ధం జరుగుతోందన్న సోషల్ మీడియా.. పలువురు వాడిన కాపీ డైలాగ్స్తో ఈ వ్యాసం సాగుతుంది.అభినవ కందుకూరి వీరేశలింగం అంటూ అంతేకాదు స్త్రీ జనోద్ధారకుడు, గొప్ప రచయిత కందుకూరి వీరేశలింగాన్ని కూడా అవమానపరుస్తూ, అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్లు కొద్దిమంది మహిళల తరఫున వత్తాసు పలుకుతున్నారంటూ తన కుంచిత బుద్ధని ప్రకటించుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తన అజ్ఞానాన్ని, అహంకారాన్ని ప్రదర్శించకున్నాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.ఆకతాయిలను రెచ్చగొడుతున్న వైనం‘‘చిట్టి పొట్టి దుస్తులతో ఒక మహిళా ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్లడాన్ని ఊహించగలమా? వెళ్లకూడదా? అని గద్దిస్తే ఏం చెబుతాం? వెళ్లవచ్చు. కాకపోతే పర్యవసానాలకు కూడా సిద్ధం కావాలి. జరగరాని పరాభవం జరిగితే చింతించకూడదు’’ అంటూ పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలను ఏం చేసేనా పరవాలేదనే పైత్యాన్ని నూరిపోస్తున్న ఒక మీడియా సంస్థ అధిపతి వైఖరి విమర్శలకు తావిస్తోంది.ఎవరి వల్ల ఎవరికి కష్టం? ఎవరిని శిక్షించాలి? ‘‘వస్త్రధారణ విషయంలో స్వేచ్ఛ అంటే అది కష్టాలు తెచ్చి పెట్టేదిగా ఉండకూడదు. తిండి, బట్ట విషయంలో స్వేచ్ఛ అనేది మనకు మేలు మాత్రమే చేయాలి. ఈ రెండు విషయాలలో నియమ నిబంధనలు పెట్టుకోవడం మనకే మంచిది!’’ అంటూ పెద్ద ముక్తాయింపు ఒకటి. ఇక్కడ ఎవరి వల్ల ఎవరికి కష్టం. దుస్తుల పేరుతో మహిళలపై, సెలబ్రిటీలపై ఆంబోతులపై ఎగబడుతున్నది ఎవరు అని ప్రశ్నించారు నెటిజన్లు. మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ప్రస్తుతం శివాజీ పరిస్థితి తయారైంది అంటూ శివాజీకి మద్దతు పలకడాన్ని మహిళలు తీవ్రంగా ఖండించారు.అసందర్భ ప్రేలాపనమోరల్ పోలీసింగ్ అంటే అర్థం తెలియని వాగాడంబరం ఎలా ఉందంటే ‘‘జంక్ ఫుడ్ తింటే ఊబకాయం వస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధ పడతారు’ అని వైద్యులు చెబుతారు కదా! జంక్ ఫుడ్ తినవద్దని చెప్పడానికి మీరెవరు? అని ప్రశ్నించడం ఎంత అహేతుకంగా ఉంటుందో దుస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించడాన్ని తప్పుపట్టడం కూడా అంతే అహేతుకం. జాగ్రత్తగా ఉండాలనడం మోరల్ పోలీసింగ్ అవుతుందని విమర్శించడం ఏమిటి?’’ అంటూ రాసుకు రావడం విడ్డూరంగా నిలిచింది. అల్లు అర్జున్పై దాడి గురించి ఏమంటారో?హైదరాబాద్లో హైటెక్ సిటీలోని ప్రసిద్ధ నిలోఫర్ కేఫ్కు టీ కోసం వెళ్లిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి రాధాకృష్ణ ఏమంటారు? సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా రెచ్చిపోతున్న యువకులను సమర్ధిస్తారా?. సెల్ఫీల కోసం ఎగబడి ఒక ఆడకూతుర్ని ఇబ్బంది పెట్టిన వైనంపై ఏమంటారో?. ఏ దుస్తులు వారిని అలా ప్రొవోక్ చేశాయి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘వస్త్రధారణ స్వేచ్ఛే.. మహిళా సాధికారతా?’’ పేరుతో మగ దురహంకారంతో రాసిన రాతలు తప్ప మరొకటి కాదని రాధాకృష్ణ ఆర్టికల్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల వస్త్రధారణపై చర్చ అంటూ అవాస్తవాలు, అవాకులు చెవాకులతో, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా ప్రచురించిన ఈ వ్యాసంపై రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.
అంతర్జాతీయం
పాక్లో నెక్ట్స్ జరిగేది ఇదేనా?
పాకిస్తాన్ దేశం పైపైన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఎన్నో సమస్యలు.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దేశంలో నిరుద్యోగిత రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగిత అధికంగా ఉండటం ఆ దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగాలు లభించక, అనేక మంది యువకులు లేబర్గా, దినసరి కూలీలుగా మారుతున్నారు.పాకిస్తాన్లో జనాభా వేగంగా పెరుగుతుండగా.. దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు. పరిశ్రమలు మందగించడం, పెట్టుబడులు తగ్గడం, రాజకీయ అస్థిరత వంటి కారణాల వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి ఆగిపోయింది. మరోవైపు విద్యా వ్యవస్థ కూడా ఉపాధి అవసరాలకు అనుగుణంగా లేకపోవడం కూడా నిరుద్యోగితకు ప్రధాన కారణంగా మారింది.చదువుకున్న యువత కూడా నైపుణ్య లోపంతో ప్రైవేట్ రంగంలో అవకాశాలు పొందలేకపోతోంది. ఫలితంగా ఆ యువత నిర్మాణ రంగం, వ్యవసాయం, చిన్నచిన్న పనుల్లో తక్కువ జీతాలకు పని చేయాల్సిన దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థతి వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, వారి జీవన ప్రమాణాన్ని కూడా దిగజారుస్తోంది. ఓవరాల్గా చూస్తే.. పాకిస్తాన్లో పెరుగుతున్న నిరుద్యోగిత యువతను లేబర్గా మారుస్తోంది. ఇది వ్యక్తిగత సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా మారింది. యువతకు సరైన ఉపాధి కల్పించకపోతే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. యువత శక్తిని సద్వినియోగం చేసుకోకుంటే పాకిస్తాన్కు భవిష్యత్తు ప్రశ్నార్థకమే.పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం కేవలం 7 శాతం మాత్రమే యువత నిరుద్యోగులని తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవ గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు సుమారు 18 నుంచి 20 శాతం వరకు ఉందని వివిధ ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువతలో నిరుద్యోగిత రేటు 30 శాతం కంటే ఎక్కువగా ఉందని అంచనా. ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మందికి పైగా యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నా, అందుకు సరిపడే ఉద్యోగాలు లేవు.అయితే, ఆ దేశ జనాభాలో 64 శాతం యువత ఉండటం ఒకవైపు అవకాశంగా కనిపించినా, ఉపాధి కల్పన లేకపోవడంతో అదే జనాభా భారం గా మారుతోంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక యువత నగరాల వైపు వలసలు వెళ్తున్నారు. ద్రవ్యోల్బణం 25–30 శాతం వరకు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, విదేశీ రుణాల భారం పెరగడం వంటి కారణాలు అక్కడి పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా అనేక కర్మాగారాలు మూతపడగా, ఉద్యోగాల కోత జరిగింది. పరిశ్రమల రంగం జిడిపిలో సుమారు 20 శాతం మాత్రమే వాటా కలిగి ఉండటం, సేవా రంగం కూడా మందగించడం వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు.ఉద్యోగాలు లభించక యువత పెద్ద సంఖ్యలో దినసరి కూలీలు, అసంఘటిత రంగం కార్మికులుగా మారుతున్నారు. ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 70 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత ఏదీ ఉండదు. తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, అసురక్షిత పరిస్థితుల్లో పని చేయడం.. యువత ఆరోగ్యం.. వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, దేశ భవిష్యత్తునూ అంధకారంలోకి నెడుతోంది.ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీలు, డిప్లొమాలు పొందుతున్నా, వారిలో చాలామందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవు. సాంకేతిక, వృత్తి విద్యకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల చదువుకున్న యువత కూడా చివరకు కూలీ పనులు, డ్రైవింగ్, డెలివరీ, నిర్మాణ రంగం వైపు వెళ్లాల్సి వస్తోంది. దాంతో ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నిరుద్యోగ యువతలో నిరాశ, అసంతృప్తి పెరుగుతోంది. కొందరు యువకులు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది వారి కుటుంబాలపై, సమాజంపై.. చివరకు ఆ దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది.ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే అక్కడి ప్రభుత్వం తొలుత దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను అమలు చేయాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్టార్టప్లకు మద్దతు వంటి చర్యలు అవసరం. అప్పుడే యువత.. వారి విద్యకు తగిన ఉద్యోగాలు పొందగలుగుతారు.
ట్రంప్ను రెచ్చగొడుతున్న మరో దేశాధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే.. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను తీసుకెళ్లినట్లుగానే తనను ఎత్తుకెళ్లాలని, ఆ క్షణం కోసం తాను ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు వెటకారంగా సవాల్ విసిరారాయన.వెనెజువెలా దాడి తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. కొలంబియాను డ్రగ్స్ విక్రయించే వ్యక్తి పాలిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ‘‘కొలంబియా బాగా నష్టపోయింది. ఓ చెడ్డోడు ఆ దేశాన్ని పాలిస్తున్నాడు’’ అని కామెంట్ చేశాడు. పైగా కొలంబియాపై ఆపరేషన్ ప్రారంభించడం తనకు మంచిగా అనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది సహజంగానే అవతలి వాళ్లను కోపం తెప్పించింది.ట్రంప్ బెదిరింపులను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా ఖండించారు. ‘‘నేను ఇక్కడే మీ కోసం ఎదురు చూస్తుంటా. దమ్ముంటే వచ్చి మదురోను పట్టుకున్నట్లు నన్ను పట్టుకోండి. అది అంత సులువు అనుకుంటే వాళ్లు పొరబడినట్లే. ఒకవేళ కొలంబియాపై అమెరికా గనుక దాడులు చేస్తే.. ఇక్కడి పర్వతాల్లో ఉండే రైతులు ఆయుధాలు పడతారు. తాము గౌరవించే అధ్యక్షుడ్ని బంధిస్తే ఈ దేశ ప్రజలు చిరుతల్లా ముందుకు దూకుతారు’’ అంటూ ప్రకటించారు. నేను మళ్లీ ఆయుధం ముట్టుకోనని గతంలో ప్రమాణం చేశాను. కానీ నా మాతృభూమి కోసం అవసరమైతే నేను మళ్లీ ఆయుధం చేపడతా అంటూ భావోద్వేగంగా మాట్లాడారాయన.గుస్తావో ఫ్రాన్సిస్కో పెట్రో ఉర్రెగో (Gustavo Petro) ఒకప్పుడు M-19 గెరిల్లా ఉద్యమంలో సభ్యుడుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయుధాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి, బొగోటా మేయర్, సెనేటర్గా పనిచేశారు. 2022లో ఆయన కొలంబియాకు తొలి వామపక్ష అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1990లలో నిరాయుధీకరణ సమయంలో ఆయన మళ్లీ ఆయుధం ముట్టనంటూ ప్రతినబూనారు.గత శనివారం(జనవరి 3న) వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికాకు బందీలుగా పట్టుకెళ్లారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల కేసుల్ని మోపింది. డ్రగ్స్ ముఠాకు మదురో నాయకుడని.. యూఎస్లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని ట్రంప్ ఆరోపించారు. అయితే.. వెనెజువెలాలో ఉండే చమురు, అదరుదైన ఖనిజాల కోసంమే ట్రంప్ ఈ కుట్రకు తెరదీశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.అయితే.. అమెరికా సైనిక చర్య కంటే ముందు ఒక కార్యక్రమంలో మదురో మాట్లాడుతూ.. ‘‘దమ్ముంటే, నన్ను పట్టుకెళ్లండి’’ అంటూ ట్రంప్కు సవాల్ చేశారు. ఆ తర్వాతే అమెరికా వెనిజులా రాజధాని కారకస్పై దాడులు చేసి మదురోను బంధించింది. ఈ నేపథ్యంలో.. కొలంబియా అధ్యక్షుడి సవాల్కు ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.
35 రోజుల్లో 11 మంది హిందువుల దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై తీవ్రమైన హింస కొనసాగుతోంది. యూనస్నేతృత్వంలోని ప్రభుత్వం ఇవి మతపరమైన దాడులు, హత్యలు కాదని పదేపదే చెబుతున్నప్పటికీ, జరుగుతున్నసంఘటనలు, వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిణామాలు దేశంలో మైనారిటీల భద్రతకు శాంతిభద్రతలు ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి.బంగ్లాదేశంలో జరుగుతున్ హింసను కేవలం యాదృచ్ఛిక సంఘటనగానో లేదా వేర్వేరు నేరాలుగానో కొట్టిపారేయడం కష్టమవుతోందంటున్నారు విశ్లేషకులు. కేవలం ఒక నెలలోనే దేశవ్యాప్తంగా కనీసం 11 మంది హిందువులు హత్యకు గురయ్యారు, వీరిలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో చనిపోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో 35 రోజుల వ్యవధిలో ఇన్ని హత్యలు జరిగాయి. ఈ మరణాలు, మూకదాడులు, కాల్పులు , గుంపు దాడుల పరంపరను వెల్లడిస్తున్నాయి. ఈ వరుస ఘటనలు మైనారిటీలలో విస్తృత భయాలను రేపడంతోపాటు, ప్రభుత్వ సామర్థ్యం, ఉద్దేశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.2026 జనవరి 5, ఒకే రోజులో రెండు హత్యలుజనవరి 5న, జెస్సోర్ జిల్లాలో హిందూ వార్తాపత్రిక సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చి చంపారు. కొన్ని గంటల్లోనే ఢాకా సమీపంలోని నర్సింగ్డి జిల్లాలో హిందూ కిరాణా వ్యాపారి మణి చక్రవర్తిపై దాడి. ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్యలతో కేవలం 18 రోజుల్లోనే హిందువుల హత్యల సంఖ్య ఐదు, ఆరుకు చేరింది.ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యంజనవరి 3న మూక దాడి, సజీవ దహనంషరియత్పూర్ జిల్లాకు చెందిన హిందూ వ్యాపారవేత్త ఖోకన్ చంద్ర దాస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక మూక దాడిలో తీవ్రంగా గాయపడి జనవరి 3న మరణించాడు. అతణ్ని కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతను ఒక చెరువులోకి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తీవ్రమైన కాలిన గాయాలతో, ఢాకాలో మరణించాడు.డిసెంబర్ 29, 2025: సహోద్యోగి కాల్చివేతఅన్సార్ బాహినిలో హిందూ సభ్యుడైన బజేంద్ర బిస్వాస్ను మైమెన్సింగ్ జిల్లాలోని ఒక వస్త్ర కర్మాగారంలో అతని సహోద్యోగి కాల్చి చంపాడు. దీనిని పోలీసులు మొదటగా అనుకోకుండా జరిగి ఉండవచ్చని పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు, కానీ ఈ హత్య మైనారిటీ వర్గాలలో పెరుగుతున్న ఆందోళనను మరింత పెంచింది.డిసెంబర్ 24, 2025: మాబ్ లించింగ్అమృత్ మండల్ను రాజ్బరి జిల్లాలో ఒక గుంపు కొట్టి చంపింది. హత్యకు మతపరమైన కోణం లేదని అధికారులు పేర్కొన్నారు, కానీ కొన్ని రోజులకే మరొక మూక దాడి జరిగడంతో మైనారిటీ భయాలు మరింత తీవ్రమయ్యాయి.డిసెంబర్ 18, 2025: ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మూక దాడిమైమెన్సింగ్లో 27 ఏళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ హత్య ఒక మలుపు తిరిగింది. దాస్ను ఇస్లామిక్ గుంపు కొట్టి చంపింది, అతని శరీరాన్ని హైవేకి వేలాడదీసి నిప్పంటించింది. దైవదూషణ జరిగిందనే అస్పష్టమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, దర్యాప్తు అధికారులు తరువాత హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని కనుగొన్నారు.ఇదీ చదవండి: సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలిడిసెంబర్ 12న, 18 ఏళ్ల హిందూ ఆటోరిక్షా డ్రైవర్ శాంటో చంద్ర దాస్, కుమిల్లాలో గొంతు కోసి హత్య చేశారు. డిసెంబర్ 7న, 1971 విముక్తి యుద్ధ అనుభవజ్ఞుడు జోగేష్ చంద్ర రాయ్, అతని భార్య సుబోర్నా రాయ్లను రంగ్పూర్లో వారింట్లోనే గొంతు కోసి చంపేశారు. డిసెంబర్ 2న ఇద్దరు హిందువులు బంగారు వ్యాపారి ప్రంతోష్ కోర్మోకర్ను నర్సింగ్డిలో కాల్చి చంపగా, ఉత్పోల్ సర్కార్ను ఫరీద్పూర్లో నరికి చంపారు.మైనారిటీ హత్యలతో పాటు, బంగ్లాదేశ్లో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయి ఒక నివేదిక ప్రకారం 2025లోనే 197 మూక హత్యలు, 2024లో 293 హత్యలు జరిగాయి. మానవ హక్కుల సంఘాలు దీనిపై హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్ డీసీకి చెందిన హిందుస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఢాకాను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మైనారిటీ భద్రతకు హామీ ఇవ్వాలని కోరింది.అయినప్పటికీ యూనస్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. దీపు చంద్ర దాస్ హత్యపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు రగలడంతో తాత్కాలిక ప్రభుత్వం సంతాపాన్ని వ్యక్తం చేసింది.భారతదేశం ఖండనభారతదేశం దీపు చంద్ర హత్యను తీవ్రంగా ఖండించింది. "బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై కొనసాగుతున్న శత్రుత్వం , దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మైమెన్సింగ్లో ఇటీవల జరిగిన హిందూ యువకుడి దారుణ హత్యను మేము ఖండిస్తున్నామనీ, బాధితులను న్యాయం చేయాలని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
వెనెజువెలా బాధ్యతపై ట్రంప్ సంచలన ప్రకటన
వెనెజువెలా భవిష్యత్తుపై ట్రంప్ తన ప్లాన్ను ప్రకటించారు. ఆదేశంలో ఇప్పట్లో ఎన్నికలు ఉండవని తెలిపారు. ప్రస్తుతం ఆ దేశంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని మౌళిక సదుపాయాలు, సంస్థాగత నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. వెనెజువెలా బాధ్యత ఎవరూ చూసుకుంటారు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇట్స్..మీ అని ట్రంప్ బదులిచ్చారు.కొద్దిరోజుల క్రితం వెనెజువెలాపై యుఎస్ దాడి చేసి.. అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెనెజువెలా తదుపరి అధ్యక్షుడు ఎవరు? అక్కడి పాలన, తదితర పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ తదితర విషయాలపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. అయితే ఆ దేశ భవిష్యత్తుపై ట్రంప్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆ దేశంలో ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ లేదని తెలిపారు.ట్రంప్ మాట్లాడుతూ.. "మనం మెుదటగా దేశాన్ని సరిచేయాలి, ప్రజలు ఓటు వేయలేని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించకూడదు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించేలా యుఎస్ ఆయిల్ కంపెనీలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మెుదటగా యుఎస్ ఆయిల్ కంపెనీలు వెనెజువెలాలో పెట్టుబడులు పెడతాయి. అనంతరం ఆ మెుత్తాన్ని దాని రెవెన్యూ ద్వారా రీయంబర్స్మెంట్ చేసుకుంటాయి." అని అన్నారు.ఈ వ్యవస్థ మెుత్తం సెట్ కావడానికి 18 నెలల వరకూ సమయం పడుతుందని ట్రంప్ తెలిపారు. వెనెజువెలాతో అమెరికా యుద్ధం చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని డ్రగ్స్ అమ్మేవారితో అమెరికా ఎప్పుడు యుద్ధం చేయదని తెలిపారు. ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఆదేశ నాయకత్వమే కారణమని తెలిపారు.అయితే అక్కడే ఉన్న ఒక జర్నలిస్టు అంతిమంగా వెనెజువెలా ఛార్జ్ ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించగా ట్రంప్ దానికి బదులిస్తూ అది 'నేనే' అని తెలిపారు. తన సెక్రటరీ స్పానిష్ భాష చాలా బాగా మాట్లాడుతుందని ఆ వ్యవహారాలు తాను చూసుకుంటుందని తెలిపారు. ఒకవేళ వెనెజువెలాలో పరిస్థితులు అదుపులో లేకపోతే మరోసారి దాడి చేయడానికి యుఎస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు.
జాతీయం
మనుషుల కేసుల్లోనూ ఇన్ని దరఖాస్తులు రాలేదు
న్యూఢిల్లీ: వీధి శునకాలకు సంబంధించి తమ వద్ద విచారణలో ఉన్న కేసుకు అనుబంధంగా కుప్పలుతెప్పలుగా అనుబంధ పిటిషన్లు, దరఖాస్తులు వచ్చిపడుతున్నాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. వీధి శునకాలకు సంబంధించిన కేసును బుధవారం విచారిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం గుర్తుచేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇప్పటికే పలువురు లాయర్లు ఈ అంశంలో అనుబంధ పిటిషన్లు, దరఖాస్తులు ఇచ్చారు. మళ్లీ ఇద్దరు లాయర్లు ఇదే కేసుపై దరఖాస్తులు సమర్పించి సంబంధిత ధర్మాసనానికి బదిలీచేయాలని విజ్ఞప్తిచేశారు. సాధారణంగా చూస్తే మనుషులకు సంబంధించిన ఏ కేసులో కూడా ఇన్ని అప్లికేషన్లు రాలేదేమో. కుక్కల విషయంలో పిటిషన్లు పోటెత్తుతున్నాయి. ఇలాంటి అప్లికేషన్లు బుధవారం కూడా వస్తాయేమో. అన్నీ కలిపి బుధవారమే కేసును విచారిస్తాం’’అని సుప్రీంకోర్టు వెల్లడించింది.
లాస్ట్ మినిట్లో మారిన లొంగుబాట
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పీఎల్జీఏ బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవా లొంగుబాటు విషయంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు పోటాపోటీగా వ్యూహాలు అమలు పరిచినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పీఎల్జీఏ బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవాను లొంగిపోవాలని కోరుతూ వారి స్వగ్రామమైన పూవర్తికి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్శర్మ గతేడాది నవంబర్ 6న వెళ్లారు. హిడ్మా, దేవా తల్లులైన పొజ్జి, హింగేలతో కలిసి భోజనం చేశారు. ఇద్దరూ లొంగిపోవాలని వారి తల్లులతో పిలుపునిప్పించారు. అయితే నవంబర్ 18న ఏపీలో జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు మద్దతుదారులతోపాటు స్థానిక ప్రజానీకంలోనూ హిడ్మా పట్ల సానుభూతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ సర్కార్, అటు కేంద్రం తదుపరి ఆపరేషన్లపై ఆచితూచి వ్యవహరించాయి. ఇదే సమయంలో ఛత్తీస్గఢ్లో మైనింగ్ కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ రణరంగంగా మారడం పరిస్థితి తీవ్రతను మరింతగా పెంచింది. దీంతో ఎన్కౌంటర్లకు బదులు తమ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా బర్సె దేవాను లొంగుబాటుకు ఒప్పించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయతి్నంచినట్టు సమాచారం. అప్రమత్తమైన తెలంగాణఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి వచ్చిన లొంగుబాటు ప్రయత్నాలపై నిర్ణయం తీసుకునే విషయంలో బర్సె దేవా ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్టు తెలుస్తోంది. చివరకు ఛత్తీస్గఢ్ కంటే తెలంగాణలో లొంగిపోవడమే మేలని భావించి ఇటు దిశగా వచి్చనట్టు సమాచారం. అయితే, అనుకున్నంత వేగంగా లొంగుబాటు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో తన ‘నెట్వర్క్’ద్వారా బర్సె దేవా ఛత్తీస్గఢ్ పోలీసుల టచ్లోకి వెళ్లేందుకు ప్రయతి్నంచినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు లొంగుబాటు ‘ముచ్చట్లు’సాగించేందుకు అక్కడి నుంచి ప్రతినిధులు గోదావరి తీర ప్రాంత అడవుల్లోకి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ పోలీసులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. వెనువెంటనే బర్సె దేవా ‘లొకేషన్’కు చేరుకొని, అక్కడి నుంచి సరెండర్ ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా బర్సె దేవా బృందం మాయం కావడంతో పౌరహక్కుల సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. వరుస ఎన్కౌంటర్లు హిడ్మా ఎన్కౌంటర్తో జరిగిన డ్యామేజ్ను ఎంతో కొంత పూడ్చుకునేందుకు బర్సె దేవా లొంగుబాటును ఉపయోగించుకునే ప్రయత్నాలు విఫలం కావడంతో బస్తర్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో ఉన్న బలగాలు తమ పంథాను మార్చుకున్నట్టు సమాచారం. బర్సె దేవా లొంగుబాటు ప్రక్రియ అధికారికంగా జరగాల్సిన రోజు ఉదయమే బీజాపూర్, సుక్మా జిల్లాల్లో వేర్వేరుగా రెండు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఆ రోజు 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు బర్సె దేవా లొంగుబాటు విషయంలో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుకు అతని స్వగ్రామమైన పూవర్తి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీలో ఉద్రిక్తత.. జనం రాళ్ల దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పాతబస్తీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుర్క్మన్ గేట్ సమీపంలోని పురాతన మసీదు ఆనుకుని ఉన్న అక్రమ ఆక్రమణలను మున్సిపల్ అధికారులు, భద్రతా బలగాలు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. వాస్తవానికి ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు వ్యూహాత్మకంగా అర్ధరాత్రి 1:30 గంటలకే మొదలుపెట్టారు. బుల్డోజర్లు, ఎర్త్ మూవర్లతో ఆక్రమణలను తొలగిస్తుండగా, పోలీసులు గట్టి కాపలాగా నిలిచారు. ఈ ఆకస్మిక చర్యతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. నిరసనకారులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వగా, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు (టీయర్ గ్యాస్) ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు మాత్రమే టియర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. తుర్క్మన్ గేట్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. #WATCH | Delhi | Visuals from the area near Faiz-e-Elahi Masjid, Turkman Gate, where MCD, pursuant to the directions of the Delhi High Court, carried out a demolition drive on an encroachment earlier today. Madhur Verma, Joint Commissioner of Police, Central Range, says,… pic.twitter.com/56LD5zeYZg— ANI (@ANI) January 7, 2026ఈ కూల్చివేతలపై ఢిల్లీ సెంట్రల్ రేంజ్ జాయింట్ సీపీ మధుర్ వర్మ స్పందిస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఈ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు సమీపంలోని ఆక్రమణలను తొలగించే క్రమంలో ఈ ప్రాంతాన్ని తొమ్మిది జోన్లుగా విభజించి, అదనపు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 10 కంపెనీల ఢిల్లీ పోలీస్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను ఇక్కడ మోహరించారు. కూల్చివేతకు ముందు అమన్ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాలు నిర్వహించినప్పటికీ, కొందరు దుండగులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.మసీదు సయ్యద్ ఇలాహి నిర్వాహక కమిటీ ఈ కూల్చివేతలను సవాలు చేస్తూ, హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, గతంలోనే కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం అధికారులు ఈ తొలగింపు చేపట్టారు. గత అక్టోబర్లో నిర్వహించిన సర్వే ప్రకారం, 38,940 చదరపు అడుగుల మేర రోడ్లు, ఫుట్పాత్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. మసీదు ఉన్న 0.195 ఎకరాల భూమి మినహా మిగిలిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఎంసీడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఎర్రకోట పేలుడు నిందితుడు ఉమర్-ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు అధికారులు పేర్కొనడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘నా నోబెల్ ట్రంప్కే..’ మచాడో సంచలనం
పేలనున్న సూపర్నోవా!
అంతరిక్ష వీధిలో మరో తారకు ఆయువు మూడింది. అంతర్ధానానికి అతి సమీపానికి చేరింది. ఆ నక్షత్రం పేరు బెటెల్గేస్. ఓరియన్ నక్షత్రమండలంలో అత్యంత ప్రకాశవంతమైన తార ఇదే. బెటెల్గెస్ ఓ రెడ్ సూపర్జెయింట్ స్టార్. అంటే ఆయుఃప్రమాణం దాదాపుగా ముగింపుకు వచి్చన నక్షత్రమన్నమాట. అయితే కొన్ని దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. ఎందుకంటే అంత పెద్ద నక్షత్రమై ఉండి కూడా ఇది చూసేందుకు ఓ తోకచుక్క మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. దాని ఒక కొస నుంచి తోక మాదిరిగా వాయుసమూహం సుదూరాల దాకా విస్తరించి ఉండటమే ఇందుకు కారణం. బహుశా ఇప్పటికే ఉనికిని కోల్పోయిన మరో నక్షత్రం తాలూకు శక్తిని కూడా బెటెల్గెస్ అందిపుచ్చుకుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.భారీ తారలు తమ చుట్టూ ఉన్న సంక్లిష్ట వ్యవస్థలతో ఎలా ప్రతిక్రియ జరుపుతాయో తెలుసుకునేందుకు బెటెల్గెస్ ఉదంతం బాగా ఉపయోగపడుతోందని వారంటున్నారు. ఈ నక్షత్రం సూపర్నోవాగా మారి అతి త్వరలో పేలిపోనుందని హబుల్ టెలిస్కోప్ తాజాగా ధ్రువీకరించింది. అది ఎప్పుడు జరగొచ్చన్నది వీలైనంత కచి్చతంగా అంచనా వేసేందుకు సైంటిస్టులు ప్రయతి్నస్తున్నారు.ఏమిటా తోక?: బెటెల్గెస్ తాలూకు ‘తోక’ఇప్పుడు శాస్త్రవేత్తల నడుమ హాట్ టాపిక్గా మారింది. నక్షత్రం నుంచి అది అస్తవ్యస్తంగా సుదూరాల దాకా పొడుచుకుని వచి్చనట్టుగా కనిపిస్తోంది. హబుల్ టెలిస్కోప్ తాలూకు అతి శక్తిమంతమైన పరారుణ ఇమేజింగ్ సాయంతో ఈ తోక ఆనుపానులను సైంటిస్టులు తాజాగా అతి స్పష్టంగా కనిపెట్టారు. ఈ తోక ప్రాంతం మరో నక్షత్రం ప్రభావానికి, దాని గురుత్వాకర్షణ శక్తికి లోనవుతోందని, అందుకే అస్తవ్యస్తంగా వంపులు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోందని వివరించారు. ‘‘ఆ తార స్పష్టంగా హబుల్ కంటికి చిక్కకపోయినా దాని ప్రభావం మాత్రం సుస్పష్టం.ఎందుకంటె బెటెల్గెస్ నుంచి బయటికి వెరజిమ్ముతున్న ప్రతి పదార్థమూ బయటి శక్తి ద్వారా ఒకరకమైన బలమైన లాగుడుకు లోనవుతోంది. చ్రి™కవిచిత్రమైన ఆకారాలు దాలుస్తోంది’’అని వారు చెప్పుకొచ్చారు. ఎందుకంత ప్రాధాన్యం?: బెటెల్గెస్ తోక తాలుకు స్వరూప స్వభావాలను సరిగా అర్థం చేసుకోవడం చాలా కీలకంగా మారనుంది. ఇప్పటిదాకా మిస్టరీగానే ఉన్న ఆస్ట్రోఫిజిక్స్ తాలూకు పలు చిక్కుముడులను విప్పడంలో ఇది ఎంతగానో దోహదపడవచ్చన్నది సైంటిస్టుల ఆశాభావం. అంతేగాక ఇలాంటి భారీ నక్షత్రాలు సూపర్నోవాగా మారి పేలినప్పుడు వాటినుంచి బయటికి విరజిమ్మే మూలకాలు, పదార్థాలు అంతరిక్షాన్ని మరింత సుసంపన్న చేస్తాయని చెబుతున్నారు.నిజానికి బెటెల్గెస్ ప్రవర్తన, దాని తీరుతెన్నులు ఇటీవలి కాలం దాకా సైంటిస్టులను బాగా తికమక పరిచాయి. ముఖ్యంగా 2019–20 నడుమ అది ఉన్నట్టుండి పూర్తిగా కాంతివిహీనంగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది! ‘‘అందుకే ఈ భారీ నక్షత్రం గురించి తెలుసుకుంటున్న కొద్దీ మరిన్ని కొత్త విషయాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇది నిజంగా గొప్ప విషయం’’అని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
ఎన్ఆర్ఐ
క్వీన్స్ కామన్ వెల్త్ వ్యాసరచన పోటీలో విజేతగా తెలుగమ్మాయి..!
వసుధైవకుటుంబకమ్ అనే సార్వజనీన సార్వకాలిక దృక్పథం.. ప్రపంచ సాహిత్యంలో వలసవాద ధోరణుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ అల్లాడిన ప్రపంచవ్యాప్తంగా ఉండే దీనప్రజానీకానికి మద్దతు తెలిపే కవిత్వ ధోరణి.. ఇలాటి పెద్దపెద్ద విషయాలు ఒక చిన్నారి కవితలలో కనపడటం మామూలు విషయం కానేకాదు. సింగపూర్లో క్రెసెంట్ గర్ల్స్ స్కూల్ నుంచి సెకండరీ 2 విద్యార్థిని అయిన ఆచంట లక్ష్మీ మనోజ్ఞ ఇలాటి గొప్ప అద్భుతాన్నే చేసి చూపించింది. పూవు పుట్టగానే పరిమళిస్తున్న చందంగా చదువుతో పాటు సంగీత సాహిత్యాలు పియానో వాదన, నృత్యం ఇలా బహువిధాలుగా తన ప్రజ్ఞను వికసింపజేసుకుంటున్న మనోజ్ఞ ఈ సంవత్సరం రాయల్ కామన్వెల్త్ సొసైటీ (RCS), పాఠశాలల కోసం ప్రపంచంలోనే అత్యంత పురాతన అంతర్జాతీయ రచనల పోటీ అయిన 'ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC) 2025' విజేతలలో ఒకరిగా ఎంపిక అవడం విశేషం. ఈమె తన కవిత్వం ద్వారా, విశ్వమానవాళికి సంబంధించిన సంవేదనలతో తాదాత్మ్యాన్ని పొందుతుంది. వారి జీవితాలలో నిండిన దైనందిన భావావేశాల లయలను తన కవితలద్వారా స్పృశిస్తుంది. పియానో పట్టుకోని వేళలను ప్రపంచ పౌరుల సుఖదుఃఖాలను ప్రతిబింబించే కవితలను అల్లడానికి సమయాన్ని వినియోగిస్తుంది. పిన్న వయస్కురాలైనప్పటికీ ఈమె కవితా ధోరణులలో ఎలిజబెత్ లిమ్ మరియు ఆన్ లియాంగ్ వంటి రచయితలచే పొందిన ప్రభావాలున్నాయి.మనోజ్ఞ రాసిన, బహుమతి గెలుచుకున్న 'ఇండియా టు మారిషస్' అనే కవిత, తన తల్లి నుంచి వేరు చేయబడి, భారతదేశంలోని తన ఇంటి నుండి మారిషస్లోని ఒక ఎన్క్లోజర్కు తరలించబడిన ఒక చిన్న కోతి కథను చెబుతుంది. భారతదేశంలో జన్మించినా ఆరు నెలల వయస్సులో సింగపూర్కు వెళ్లి అక్కడ శాశ్వత నివాసం చేసే కుటుంబానికి చెందిన మనోజ్ఞ, ఈ పోటీకోసం ఎన్నుకునే ఇతివృత్తంగా - 'అవర్ కామన్వెల్త్ జర్నీ'కి సంబంధించి భారతదేశం గురించి రాయాలనుకుంది.ఆమెకు భారతదేశం, మారిషస్లను కలిపే బానిస కార్మిక వ్యాపారం గురించి అవగాహన ఉంది. దానితో ఆ దేశాల మధ్య మార్గం గురించి, అలాగే మన భారతదేశం నుండి మారిషస్కు వచ్చిన వారి అనుభవాల గురించి పరిశోధించడం ప్రారంభించింది. కార్మికులతో పాటు అన్యదేశ వన్యజీవులతో కూడా వలస వ్యాపారం చేస్తున్నారని తెలుసుకొని వేదనపడ్డది. ఆ విషయమే కోతికి సంబంధించిన ప్రతీకాత్మక దృష్టికోణం నుండి రాయడానికి ఆమెకు ప్రేరణగా మారింది. ఆమె బహుమతి పొందిన కవితలో భారతదేశం నుంచి మారిషస్కు దాని దయనీయమైన ప్రయాణాన్ని వర్ణిస్తూ, మరియు తల్లిచెంత, స్వంత భూమిలో లభించే ఆత్మీయమైన వాతావరణం హఠాత్తుగా కోల్పోయి, పరాయి చోటున బందీయై పలుబాధలు పడుతూ తిరిగి తల్లి ప్రేమను ఆశిస్తూ అది లభించక పడే తపన...జాలికొలిపే తీరులో దాని ఆర్ద్రమైన కోరికను తన తల్లికి స్వగతంగా విన్నవించుకునే -పసికోతి ద్వారా చెప్పబడిన హృదయవిదారకమైన ఒక ఘటనకు చెందిన కవిత ఇది.. బందిఖానాలో ఉన్నప్పుడు , స్వానుభవాలపట్ల గమనిక..తను పొందిన తీపి అనుభవాలకూ.. ప్రస్తుతం అనుభవించే మనోవేదనకూ మధ్య జరిగే సంఘర్షణను ప్రతి ఒక్కరి హృదయాలను తాకేటట్టు వర్ణించే మనోహరమైన కవిత ఇది. ఈ కవితను రాయడానికి భూమికగా - ఇండియానుండి సింగపూర్కు వచ్చి, ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని, తన మరియు తన సోదరి కోసం వారిదైన నూతన జీవితాన్ని ఏర్పరచుకున్న తీరుతెన్నులను గురించి తన తల్లిదండ్రులు చెప్పిన సంగతులు తనకు స్ఫూర్తినిచ్చాయని మనోజ్ఞ చెప్తుంది. ఇలాటి గంభీరమైన, ప్రభావశీలమైన కవితా రచనతోనే ప్రతిష్టాత్మకమైన క్వీన్స్ కామన్వెల్త్ వ్యాసరచన పోటీలో తను రన్నరప్గా ఎంపికైంది. ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరిగింది. తన కుటుంబ సభ్యులు ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి ప్రసన్న, సోదరి శ్రీ మేఘనల సమక్షంలో చిరంజీవి మనోజ్ఞ ఈ అవార్డును హర్ మెజెస్టీ క్వీన్ కెమిల్లా నుంచి అందుకుంది.(చదవండి: మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు)
విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “TTA సేవా డేస్ - 2025” సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, అవసరమైన సామగ్రి పంపిణీ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు రెండు వారాల పాటు పలు జిల్లాల్లో నిర్వహించారు.హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ, మెదక్ సహా పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభించి, బెంచీలు, యూనిఫామ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సులు అందజేశారు. పాఠశాలల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయాల పునర్నిర్మాణం కూడా చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో 10కే రన్ను కూడా నిర్వహించారు. వృద్ధుల కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన క్యారం బోర్డు ఛాంపియన్షిప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ మహా సేవా కార్యక్రమాలను టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెడ్డి నాయకత్వంలో టీటీఏ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, ఫౌండర్ డా. పైళ్ళ మల్లా రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పటలోల్ల, అడ్వైజరీ సభ్యులు భరత్ రెడ్డి మాదడి, శ్రీని అనుగు, పూర్వ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల, ఇండియా కోఆర్డినేటర్ డా. ద్వారకానాథ రెడ్డి, ఇండియా సేవా డేస్ కోఆర్డినేటర్ మధుకర్ రెడ్డి బీరాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యుల మార్గదర్శకత్వం ఈ భారీ సేవా కార్యక్రమాలకు తోడ్పడింది.అమెరికా నుండి వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీఏ టీమ్ సభ్యులకు, ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీఏ మహాసభలు “టీటీఏ మెగా కన్వెన్షన్ - 2026” జూలై 17–19, 2026లో షార్లెట్, నార్త్కరోలైనాలో జరుగనున్నట్లు టీటీఏ నాయకులు వెల్లడించారు
పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..! హాట్టాపిక్గా భారత సంతతి వ్యక్తి పోస్ట్
భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారడమే గాకా ఆ అంశం హాట్టాపిక్గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి. ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు. అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు". అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్లు పెట్టడం గమనార్హం.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్నారై పోస్ట్)
మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
అమెరికాలో మన తెలుగు వారు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా మేరీల్యాండ్లో తెలుగు బాలికలు టెక్నాలజీతో ఓ సమస్య పరిష్కారం కనిపెట్టి.. ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్లో క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. టెక్నాలజీ రంగంలో విశేష ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్( స్టెమ్)లో విద్యార్ధుల మేధాశక్తిని, సాంకేతిక ప్రతిభను, సామాజిక బాధ్యతను గుర్తించేలా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్'లో పాల్గొన్న ఆరుగురు తెలుగు బాలికల బృందం, క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. హృతిక, సియోన, ప్రజ్ఞ, జాసు, ధృతి, లాస్య అనే ఆరుగురు తెలుగు విద్యార్ధినులు టెక్నోటియారాస్ పేరుతో జట్టుగా ఏర్పడ్డారు. గత నాలుగు నెలలుగా నిరంతర శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం, టీమ్ వర్క్ను జోడించి తమ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. కేవలం రోబోలను తయారు చేయడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఒక వినూత్న పరిష్కారాన్ని వీరు కనుగొన్నారు.ప్రాణాపాయం లేని ఆస్బెస్టాస్ తొలగింపు!పాత భవనాల్లో ఉండే 'ఆస్బెస్టాస్' వల్ల కార్మికులకు కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఈ బృందం గుర్తించింది. దానికి పరిష్కారంగా ఒక అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ప్రతిపాదించింది. నిపుణుల సలహాలు తీసుకుంటూ, క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి వీరు రూపొందించిన ఈ 'ఇన్నోవేషన్ ప్రాజెక్ట్' అందరి ప్రశంసలు అందుకుంది.మెక్డొనో స్కూల్ క్వాలిఫైయర్ పోటీల్లో పాల్గొన్న టెక్నో టియారాస్ తెలుగు విద్యార్ధుల అద్భుత ప్రదర్శనకు ప్రశంసలు, పురస్కాలు లభించాయి. సామాజిక సమస్యకు పరిష్కారం చూపినందుకు అత్యున్నత 'క్వాలిఫైయర్ ఛాంపియన్షిప్' అవార్డును కైవసం చేసుకున్నారు.రోబోట్ డిజైన్ దాని పనితీరులో రెండో స్థానాన్ని సాధించి తమ సాంకేతిక సత్తాను చాటారు. తెలుగు బాలికల మధ్య ఉన్న సమన్వయం, నాయకత్వ లక్షణాలు, వారిలో ఉన్న ఉత్సాహాన్ని చూసి జడ్జీలు సైతం ఆశ్చర్యపోయారు. తెలుగు విద్యార్ధినులు సాధించిన ఈ విజయాల వెనుక కోచ్లు ఆలోక్, అభిజిత్ల మార్గదర్శకత్వం చాలా ఉపకరించింది. అలాగే వారి కుటుంబ సభ్యులు, నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ ప్రతినిధులు ఈ చిన్నారులను నిరంతరం ప్రోత్సహించారు. తెలుగు వారందరికి గర్వకారణంగా నిలిచిన ఈ బాలికలు ఇప్పుడు మేరీల్యాండ్ స్టేట్ కాంపిటీషన్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ యువ టెక్నాలజిస్ట్ల బృందం మరో మూడు నెలల్లో జరగనున్న ప్రతిష్టాత్మక స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి అర్హత సాధించింది. క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న బాలికల బృందానికి నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ మేరీల్యాండ్ నాయకులు, సభ్యులు అభినందించారు. స్టేట్ లెవెల్ పోటీల్లోనూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్ఆర్ఐ పోస్ట్)
క్రైమ్
ప్రాణం తీసిన వేధింపులు
రంగారెడ్డి జిల్లా: తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడు పెడుతున్న వేధింపులను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన సిద్దగోని మహేశ్, ఇదే గ్రామానికి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థిని పూజ(17)ను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆమె తనకు దక్కుతుందో.. లేదోనని ఆందోళనకు గురైన మహేశ్ నెల రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చేరి్పంచగా, కోలుకుని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తరచూ పూజకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపోతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తెలిసిన మహేశ్ యువతిపై మరింత ఒత్తిడి పెంచడంతో మనోవేదనకు గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు, ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. కాగా, మహేశ్ బెదిరింపులతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళవారం ఉద యం పూజ మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐ, గ్రామస్తు లు నచ్చజెప్పడంతో శాంతించారు. మహేశ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నాన్నా.. మేమేం చేశాం?
మహబూబ్ నగర్ జిల్లా: భార్య విడాకులు ఇచ్చిందనే కోపంలో అతడు కిరాతకుడిలా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కొడుకు, కూతురిని కర్కశంగా హతమార్చాడు. ఆపై మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. సీఐ రాజేందర్రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన చాకలి శివరాములుకు ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన ఓ మహిళతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివరాములు డ్రైవర్గా పనిచేస్తూ హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరికి కూతురు రితిక, కుమారుడు చైతన్య ఉన్నారు. అయితే దంపతులు తరచూ గొడవపడేవారు. ఆరేళ్ల క్రితం భర్తను వదిలి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివరాములు తీలేరుకు వచ్చాడు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా శివరాములు అమ్మానాన్న చూసేవారు. ఈ క్రమంలో దంపతులను కలపాలని రెండుసార్లు గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు. ఫలితం లేకపోవడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. గతేడాది మార్చి నెలలో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి శివరాములు మనస్తాపానికి గురై ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మూడు రోజుల నుంచే ప్లాన్.. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారని భావించిన శివరాములు మూడు రోజుల క్రితం నిర్ణయించుకున్న ఓ ప్లాన్ ప్రకారం తన ఇద్దరు పిల్లలు రితిక(8), చైతన్య(6)లను పొలం దగ్గరకు తీసుకెళ్లి రాత్రి అక్కడే నిద్రించి ఉదయం ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భోజనం చేయకుండా తన పిల్లలను బైక్పై తీసుకెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో శివరాములు తమ్ముడి భార్య రాత్రి 8 గంటలకు ఫోన్ చేయగా రితిక అనారోగ్యంతో ఉందని మరికల్ ఆస్పత్రికి తీసుకొచ్చా.. డాక్టర్కు చూపించి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా వెళ్లి కూతురు, కుమారుడిని పొలం దగ్గర ఉన్న పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. అర్ధరాత్రి సమయంలో వారు గాఢనిద్రలో ఉండగా తాడుతో ఒక్కొక్కరి గొంతు నులిమి చంపేశాడు. పొలం పక్కనే ఉన్న కోయిల్సాగర్ సాగునీటి కాల్వలో మృతదేహాలను పడేసి నీళ్లలో లోపలికి తొక్కేశాడు. పిల్లలను చంపిన తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ముందుగా పొలం దగ్గర ఉన్న గడ్డి మందు తాగాడు. ఆపై పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. అయితే సింగిల్ ఫేజ్ ఉండి అది ట్రిప్ కావడంతో షాక్ కొట్టి వదిలేసింది. మళ్లీ పశువుల కొట్టంలోకి వచ్చి గడ్డపారతో పొడుచుకొని చనిపోవాలని ప్రయత్నించాడు. అది కూడా సాధ్యం కాకపోవడంతో బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. అయినా చనిపోకపోవడంతో తనను బతికించాలని పక్క పొలం రైతులకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేశాడు. వారు వెంటనే అక్కడకుచేరుకొని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలను కాల్వలో నుంచి బయటకు తీశారు. శివరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. కాగా.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రితిక 4వ తరగతి, చైతన్య 1వ తరగతి చదువుతున్నారు. డబ్బులు ఇవ్వడం లేదని.. తండ్రిని చంపిన తనయుడు పాపన్నపేట(మెదక్): డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కొడుకు కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని సీతానగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లంగడి లక్ష్యయ్య (48) వ్యవసాయంతోపాటు విద్యుత్ లైన్మెన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. భార్య శేఖమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహం, వ్యవసాయం నిమిత్తం కొంత అప్పులు చేశాడు. శ్రీకాంత్ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ, ఖర్చుల కోసం తరచూ తండ్రిని వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పలుమార్లు తండ్రీకొడుకు మధ్య గొడవలు జరిగాయి. సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే కొడుకు డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో శ్రీకాంత్ ముందుగా సుత్తితో తండ్రిపై దాడి చేయగా, తల్లి కొడుకు చేతి నుంచి సుత్తి లాక్కుంది. తీవ్ర ఆవే«శంతో రగిలిపోతున్న శ్రీకాంత్.. అక్కడే ఉన్న కర్రతో తండ్రి తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు.
దళిత బాలికపై లైంగిక దాడి
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఇంటర్ చదువుతున్న దళిత బాలికపై లైంగికదాడి చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మంగువారితోట కండ్రవీధికి చెందిన బొమ్మలాట నవీన్ (19) నెలరోజులుగా బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ యువకుడిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. కేసును జిల్లా పోలీస్ శిక్షణా సంస్థ డీఎస్పీ గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు.
ఖతర్నాక్ విగ్గురాజా
బట్టతల కారణంగా పెళ్లి ఈడు దాటిపోతుండడంతో.. అతగాడు ఘరానా మోసానికి దిగాడు. విగ్గుతో మేనేజ్ చేస్తూ ఎలాగోలా ఓ అమ్మాయికి తాళిబొట్టు కట్టేశాడు. తీరా.. కాపురంలోకి అడుగుపెట్టాక అతగాడి హెయిర్స్టైల్పై అనుమానం వచ్చిందామెకు. కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. అక్కడి నుంచే అసలు డ్రామా మొదలుపెట్టాడు.. బట్టతల భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భార్య నోయిడా పోలీసులను ఆశ్రయించింది. విగ్గు పెట్టుకుని తనను పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత జుట్టు రాలుతోందంటూ డ్రామాలు ఆడాడనని.. చివరకు విషయం తెలిసిపోవడంతో విగ్గు పీకేసి విలన్ వేషాలు వేస్తున్నాడని వాపోయిందామె. అప్పటి నుంచి సైకోలా మారిపోయి వేధించడం మొదలుపెట్టాడు.. నా ఫోన్ నుంచి వ్యక్తిగత ఫొటోలు సేకరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడు. చేసేది లేక నగలు ఇచ్చేశాను. ఆపై అదనపు కట్నం కోసం నా తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. భరించలేక న్యూఢిల్లీ ప్రతాప్ భాగ్లోని అత్తింటి నివాసంలో పంచాయితీ పెట్టించా. అందరి ముందు విగ్గు తీసేసి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి మమ్మల్ని వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొందామె. సదరు భర్త కుటుంబం మొత్తంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని.. పరారీలో ఉన్న భర్త కుటుంబం కోసం గాలిస్తున్నట్లు బిస్రాఖ్ పీఎస్ అధికారి మనోజ్కుమార్ చెబుతున్నారు.
వీడియోలు
విజయవాడ జైలులో జోగి రమేష్ తో YSRCP నేతల ములాఖత్
సుప్రీం తీర్పు అంటే లెక్కలేదా? లోకేష్ పై జూపూడి ఫైర్
Satish Reddy: కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయి
Konaseema: ఏ అధికారి రాలేదు.. రెండు ఊర్లను మేమే ఖాళీ చేయించాం..!
ట్రంప్ కు అభిశంసన తప్పదా ?
చంద్రబాబు పై బీజేపీ, జనసేన సీరియస్... ప్రజల ప్రాణాలతో ఆటలు వద్దు....
Delhi : మసీదు వద్ద కూల్చివేతలు పోలీసులపై రాళ్ల దాడి
Avinash : ఇది డిస్ట్రిక్ట్ రివ్యూ కాదు.. టీడీపీకి డబ్బా కొట్టే మీటింగ్
Amaravati: గ్రామ సభలో పరువు పోయింది.. ఏకిపారేసిన రైతులు
AP: దళితులపై పోలీసుల దమనకాండ

