బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం..! కానీ పేదవాడే..
మంచి జీతం, ఓ కారు, ఇల్లు ఉంటే..ఎవ్వరైనా ఇంతకంటే ఏం కావాలి లైఫ్కి అనుకుంటారు. ఇన్ని సౌకర్యాలు ఉంటే మస్తు హ్యాపీగా సాగిపోతుంది జీవితం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇన్ని ఉన్నా తను పేదవాడినని చెబుతుండటం విశేషం. అంతేగాదు అనారోగ్య సమస్యలతో వైద్యుని వద్దకు వచ్చి తన పరిస్థితి వివరించడంతో డాక్టర్ సైతం విస్తుపోయాడు. చివరికి అతడి గురించి క్షుణ్ణంగా విచారించగా..అసలు విషయం తెలిసి వైద్యుడికి నోట మాట రాలేదు. అంతేగాదు చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప నిపుణులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారంటూ ఆ వ్యక్తి కేసు గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సన్నీ గార్గ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పట్టణాల్లో, నగరాల్లో ఉంటున్న వృత్తి నిపుణుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు లేవనెత్తాయి. ఆ డాక్డర్ 34 ఏళ్ల గుర్గావ్ నివాసి కథను పంచుకున్నారు. పైకి చూస్తే ఆ వ్యక్తి బాగా డబ్బున్న వాడిలా సక్సెస్ఫుల్ మ్యాన్లానేఉన్నాడు. అతడి జీతం కూడా ఏడాదికి రూ. 40 లక్షల జీతం, డబుల్ బెడ్రూం ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు అన్నీ ఉన్నాయని అన్నారు. అయితే అతడు మాత్రం తాను చాలా పేదవాడినని, అందుకే రాత్రి పూట నిద్రపోలేకపోతున్నా, విపరీతమైన ఒత్తిడికి గుర్వవుతున్నా అంటూ తన వద్దకు వచ్చాడని చెప్పుకొచ్చారు డాక్టర్ సన్నీ. ఒక్కసారిగా విస్తుపోయిన డాక్టర్ సన్నీ అతడి విషయాన్ని కొట్టపారేయకుండా..బాగా సక్సెఫుల్ అయిన నిపుణుల్లో పెరుగుతున్న అభద్రత భావమే ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ఈ వ్యక్తి ఆర్థికంగా విజయవంతమైనవాడే కానీ పోల్చుకోవడం అనే సమస్య నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఏళ్లు గడిచే కొద్దీ అతడి పోల్చుకునే ధోరణి ఎలా మారిపోయిందో వివరించారు. మొదట తన సొంత ఊరి వాళ్లతో లేదా సాంప్రదాయ వృత్తుల ఉన్నవాళ్లతో పోల్చుకున్నాడు. దాన్ని అధిగమించి ఓ స్థాయికి వచ్చాక..ఇప్పుడు ఏకంగా చిన్న వయసులో కోట్లలో సంపాదిస్తున్న స్టార్టప్ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటూ బాధపడుతున్నాడని అన్నారు. ఆ కారణంగానే తాను పేదవాడినని పేర్కొన్నాడని అన్నారు. దీన్ని డాక్టర్ సన్నీ "ఆధునిక పేదరికం"గా అభివర్ణించారు. ఇక్కడ డబ్బు లేకపోవడం కాదు, ఆదాయం కంటే అంచనాలు వేగంగా పెరగడం, సంతృప్తి లేకపోవడమే కారణమని అన్నారు. అంతేగాదు ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. మొదటి గతేడాది నేను బెటర్ అని ఎన్నిసార్లు అనుకున్నావ్ అని అడిగగా.. దానికి నో అనే సమాధానం. రెండో ప్రశ్నగా.. ఈ డబ్బంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు? తన చుట్టూ ఉన్నవారికంటే బెటర్గా ఉండటం కోసం అని రిప్లై ఇచ్చాడు. ఇక చివరగా డబ్బు లేదా వృత్తిపరమైన పురోగతి కోసం కాకుండా చేసిన మంచి పని ఏమైనా ఉందా అని అడిగగా..నో అనే సమాధానం ఇచ్చాడని అన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి కేసులో డబ్బు కొలమానంగా మారడంతో...ప్రతి పనిలోనూ తాను మనిషిగా ఉండటం మానేసి ఒక యంత్రంగా మారిపోయాడని అన్నారు డాక్టర్ సన్నీ. అంతేగాదు ప్రజలు నిరంతరం విజయగాథలు, విలాసవంతమైన జీవనశైలులు, అసాధారణ సంపదలు ఆకర్షణగా మారి పోలిక అనే వ్యసనం బారిన పడుతున్నారని..అదే ఒత్తిడి, మానసిక సమస్యలు బారినపడటానికి ప్రధాన కారణమని చెప్పారు. నెటిజన్లు కూడా వైద్యుడి మాటకు మద్దతిస్తూ..పోలిక ఎల్లప్పుడూ మనిషి ఆనందాన్ని చంపేస్తుందని, అన్నింట్లకంటే ఆత్మసంతృప్తి అత్యంత ముఖ్యం అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Dr Sunny Garg (@drsunnygarg) (చదవండి: భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు)
మమతా బెనర్జీ అలా చేయలేదు.. గంగూలీ కీలక వ్యాఖ్యలు
కోల్కతా: టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ యూసుఫ్ పఠాన్ మధ్య ఎంపీ సీటు విషయమై తాను మధ్యవర్తిగా ఉన్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపడేశారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తానేప్పుడూ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు.పశ్చిమబెంగాల్లో 'దీదీ' పరిస్థితి నానాటికీ దిగజారుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం.. అనంతరం ఆపార్టీలో తిరుగుబాటు మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై ఏసీబీ దాడులు ఇలా ఒకదాని తర్వాత మరో సమస్యలు మమతను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి పార్టీని చక్కదిద్దే యత్నం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకుగాను మాజీ క్రికెటర్ యూసప్ పఠాన్ తన సీటును త్యాగం చేయనున్నారని పుకార్లు చెలరేగాయి.అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ఎపిసోడ్కి మెుత్తం టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని మధ్యవర్తిగా నియమించారని ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహారంపై గంగూలీ తాజాగా స్పందించారు "పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరపున నేను యూసుఫ్ పఠాన్ను సంప్రదించి, ఆమె ఆ నియోజకవర్గం నుండి జరగబోయే ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుగా..ఆయన తన పదవికి రాజీనామా చేయాలని మమతా తరపున సందేశాన్ని అందించానని ఆరోపణలు వచ్చాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవాలు " అని గంగూలీ అన్నారు.మమతా ఎప్పుడూ తనను ఇటువంటి రాజకీయ వ్యవహారాల చేరవేయాలని కోరలేదన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులతో తాను ఇదివరకూ ఏ సందర్భంలోనూ రాజకీయ విషయాలలో పాలుపంచుకోలేదని తెలిపారు. భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ పశ్చిమ బెంగాల్లోని బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ తరపున ఈ స్థానం నుండి గెలుపొందారు.
హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: నగరంలోని విపత్తు నిర్వహణ, ప్రజా ఆస్తుల రక్షణ, పట్టణ నియంత్రణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పాటైన సంస్థే హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency). అయితే ఇది గత కొంతకాలంగా బాగా ఫేమస్ అయ్యింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలకు సంబంధించి హైడ్రా పేరు మార్మోగుతూనే ఉంది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2024, జూలైలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకొచ్చారు. అయితే తాజాగా హైడ్రాపై రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అని పేరు పెట్టడానికి గల కారణాలను వెల్లడించారు. నియంతగా పేరుగాంచిన హిట్లరే ఇందుకు కారణమన్నారు సీఎం రేవంత్. హైడ్రా అనే పేరు హిట్లర్కు చాలా ఇష్టమని, హిట్లర్కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని సీఎం రేవంత్ తెలిపారు. అందుచేత అక్రమ కట్టడాలు చేసే వారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరుపెట్టామన్నారు. హైదరాబాద్లో చెరువులను ఎవరు ఆక్రమించాలనుకున్నా భయపడాలని ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామన్నారు.
గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు!
ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులేస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకంతో చెలరేగిత్, కెప్టెన్ గిల్ కూడా సెంచరీ దిశగా పరిగెడుతున్నాడు. సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ విషయం పక్కనబెడితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో తన చేతిలో ఒక అంతుచిక్కని పదార్థంతో కెమెరా కంటికి చిక్కాడు. అయితే అవి హోమియోపతి మెడిసిన్స్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే చిన్న డబ్బాలో రౌండ్గా ఉన్న పిల్స్ను చేతిలోకి తీసుకున్న గంభీర్ వాటిని నోటిలో పెట్టుకోవడం కనిపించింది. బహుశా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గంభీర్ ఆ పిల్స్ను వాడుతున్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అవకాశం చిక్కితే చాలు గంభీర్ను విమర్శించడమే పనిగా పెట్టుకునే కొందరు ఆకతాయిలు తమ నోటికి పనిచెప్పారు. సోషల్ మీడియా వేదికగా అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టడం కనిపించింది. 'గంభీర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని, వెంటనే అరెస్ట్ చేయాలని కొందరు పేర్కొంటే.. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణాన్ని గంభీర్ పూర్తిగా చెడగొడుతున్నాడని, అతన్ని వెంటనే కోచ్ పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని' కామెంట్లు చేయడం గమనార్హం.అయితే ఆఫ్గన్తో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ ఆకట్టుకున్నాడు. గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్లో సాయి సుదర్శన్ 104 బంతులెదుర్కొని 13 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు రావాలని గంభీర్ తనకు చెప్పాడని సాయి సుదర్శన్ మ్యాచ్ విరామ సమయంలో పేర్కొన్నాడు. జైస్వాల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి సాయి సుదర్శన్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలిరోజే టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. గిల్ (103), పంత్ (50) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ (100) శతకం సాధించాడు. 🚨DRUG DEALER GAUTAM GAMBHIR 🚨Gautam Gambhir was seen taking drugs while on-going India vs Afghanistan test match 👀 pic.twitter.com/9gJOYoy7jg— ; (@ReignofDhoni) June 6, 2026చదవండి: ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్!
పాపం పాటిదార్.. ఆర్సీబీ కెప్టెన్పై సానుభూతి వెల్లువ
డీకేకు బిగ్ రిలీఫ్.. 24 గంటల్లోనే మారిన సీన్!
టీవీకేలో ఏకంగా 300 మంది చేరిక.. ఇక ఆ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి?
చీరలో అనసూయ అలా.. జీన్స్లో రష్మిక ఇలా
మమతా బెనర్జీ అలా చేయలేదు.. గంగూలీ కీలక వ్యాఖ్యలు
క్రికెటర్ కేఎస్ భరత్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఐదు నెలల్లో లక్ష ఉద్యోగాలు మాయం!
‘అందుకే హార్దిక్ను కాదని నితీశ్ రెడ్డిని ఎంపిక చేశాం’
భువీని కాదని హర్షిత్కు చోటు.. గంభీర్పై ఆగ్రహజ్వాలలు
అన్నామలై.. మరో టాలెంట్
‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
జై చంద్రబాబు అంటే మీకు కనెక్ట్ అవుతుంది సార్!
ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు
భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్, భువనేశ్వర్కు చోటు!
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
మీ ‘కుర్చీ’ కింద భూమి కదిలినట్లు అనిపించింది సార్!!
'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. ఎమోషనల్ పోస్ట్
అపచారం... దైవద్రోహం
ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..!
భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం..?
వామ్మో ఏం తిట్లు! ఏం బూతులు!! యుద్ధంలో మిసైల్స్ బదులు ఇవే ప్రయోగిస్తే ఈజీగా గెలిచేవాళ్లం సార్
పసిడి, వెండి.. కంగారు లేకుండా కొనండి!
సూపర్ ఎల్–నినోకు సిద్ధం కండి
ఓటీటీలో దురంధర్-2 ప్రీమియర్ షో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే...!
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
'అన్నామలై రాజీనామా చేయలేదు'
పాపం పాటిదార్.. ఆర్సీబీ కెప్టెన్పై సానుభూతి వెల్లువ
డీకేకు బిగ్ రిలీఫ్.. 24 గంటల్లోనే మారిన సీన్!
టీవీకేలో ఏకంగా 300 మంది చేరిక.. ఇక ఆ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి?
చీరలో అనసూయ అలా.. జీన్స్లో రష్మిక ఇలా
మమతా బెనర్జీ అలా చేయలేదు.. గంగూలీ కీలక వ్యాఖ్యలు
క్రికెటర్ కేఎస్ భరత్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఐదు నెలల్లో లక్ష ఉద్యోగాలు మాయం!
‘అందుకే హార్దిక్ను కాదని నితీశ్ రెడ్డిని ఎంపిక చేశాం’
భువీని కాదని హర్షిత్కు చోటు.. గంభీర్పై ఆగ్రహజ్వాలలు
అన్నామలై.. మరో టాలెంట్
‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
జై చంద్రబాబు అంటే మీకు కనెక్ట్ అవుతుంది సార్!
ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు
భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్, భువనేశ్వర్కు చోటు!
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
మీ ‘కుర్చీ’ కింద భూమి కదిలినట్లు అనిపించింది సార్!!
'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. ఎమోషనల్ పోస్ట్
అపచారం... దైవద్రోహం
ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..!
భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం..?
వామ్మో ఏం తిట్లు! ఏం బూతులు!! యుద్ధంలో మిసైల్స్ బదులు ఇవే ప్రయోగిస్తే ఈజీగా గెలిచేవాళ్లం సార్
పసిడి, వెండి.. కంగారు లేకుండా కొనండి!
సూపర్ ఎల్–నినోకు సిద్ధం కండి
ఓటీటీలో దురంధర్-2 ప్రీమియర్ షో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే...!
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
'అన్నామలై రాజీనామా చేయలేదు'
ఫొటోలు
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్ సందడి (ఫొటోలు)
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
హైదరాబాద్ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)
అమీర్పేటలో పొగ.. మంటలతో బెంబేలు (ఫొటోలు)
సినిమా
‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన బుచ్చిబాబు
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలను అవమానించేలా జాన్వీ కపూర్ పాత్రను తీర్చిదిద్దారంటూ పలువురు నెటిజన్స్ బుచ్చిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో హీరోయిన్ని చూపించిన తీరు, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తాజాగా ఈ విమర్శలపై స్పందించాడు. క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో ఓ సుధీర్గమైన పోస్ట్ పెట్టాడు.ఒక ఫిల్మ్ మేకర్గా.. సినిమా అనేది ప్రేక్షకులను అలరించాలి, వారిలో స్ఫూర్తిని నింపాలి అనుకుంటాను. ఎవరినీ అసౌకర్యానికి, అగౌరపరచాలని చూడను. పెద్దిలో కొన్ని సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని తీవ్రంగా పరిగణించాం. తెరపైన, తెర వెనుక కూడా మహిళలంటే నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది. మహిళల పాత్రలను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఈ సినిమాలో సన్నివేశాలు మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. అలాగే ఆయా సన్నివేశాలలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నాం (జాన్వీ కపూర్కి సంబంధించిన రొమాంటిక్ సీన్లన్నీ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం). ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా ఎదుగుతుంది. అభిమానులతో ఉన్న అనుబంధమే సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కొన్ని సున్నితమైన అంశాలపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలే. వారిని శక్తిమంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి మేం కట్టుబడి ఉన్నాం. తమ అభిప్రాయాలను నిజాయితీగా, మనస్ఫూర్తిగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని బుచ్చిబాబు తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.I have always had immense respect for…— BuchiBabuSana (@BuchiBabuSana) June 6, 2026
‘పెద్ది’ వివాదం.. అనసూయ సంచలన పోస్ట్
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తెరపై ఆమెను చూపించిన తీరుపై, కొన్ని సీన్లపై మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ.. ఆ సన్నివేశాలను తొలగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. తాజాగా నటి, యాంకర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమా అనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని, అందులోని మంచి చెడులను నిర్ణయించుకునే పూర్తి విచక్షణ ప్రేక్షకులకే ఉంటుందని అనసూయ అన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయానికి సినిమాలను ముడిపెట్టకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. చిత్రరంగంలో ఉండాల్సిన సామాజిక బాధ్యత, సృజనాత్మక స్వేచ్ఛ గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.ఒకప్పుడు నైతికత..ఇప్పుడు గందరగోళం‘ఒకప్పటి సినిమాల్లోని కథలలో నైతికత కనిపించేది. హీరో పాత్రలు స్ఫూర్తిదాయకంగా, విలన్ పాత్రలు మనం అనుకరించకూడదనే విధంగా ఉండేవి. కానీ, ఈ రోజుల్లో వచ్చే కథల్లో ఆ స్పష్టత లోపిస్తోంది. కేవలం పాత్రను గొప్పగా చూపించడం కోసమే దర్శకులు ఈ విధమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఒక కథను తెరకెక్కిస్తున్నప్పుడు సమాజంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో.. సాంకేతిక నిపుణుల నుంచి దర్శక నిర్మాతలు, నటీనటులు, చివరకు ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ కీలక పాత్రధారులే. అందుకే సినిమా ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉండాలి.నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా..నేను కూడా గతంలో సృజనాత్మకత విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల వల్లే కొన్ని షోల నుంచి తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల నా ప్రతిభకు తగిన అవకాశాలు రావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ సిద్ధాంతాల కోసమే నిలబడ్డాను.ప్రతి తప్పుకూ సినిమాను మాత్రమే నిందించడం సరికాదుసినిమాలకు సృజనాత్మక స్వేచ్ఛ ఎంత అవసరమో, సామాజిక స్పృహ ఉండటం కూడా అంతే ముఖ్యం. సినిమాలు సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తాయని ఆశించకూడదు. అలాగని, అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపవని కూడా అనుకోలేం. సమాజంలో జరిగే ప్రతి తప్పుకూ సినిమాను మాత్రమే నిందించడం సరికాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ఇలాంటి విషయాలపై చర్చలు జరపడం, కథల్లో పాత్రలను చూపించే విధానాలను ప్రశ్నించడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం వంటివి చూస్తుంటే తనకు సంతోషంగా ఉంది. అవసరమైనప్పుడు తప్పులను ప్రశ్నించడం అంటే సృజనాత్మకతపై దాడి చేయడం కాదు, అది సమాజంలో అవగాహన పెంచడమే. నేను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించడం లేదు. ఈ చిత్ర పరిశ్రమ అనే వ్యవస్థలో మనమంతా భాగమేనని గుర్తుచేయడమే నా ఉద్దేశం. ఇకనైనా క్రియేటర్స్, నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఆడియన్స్ మరింత సామాజిక స్పృహతో, బాధ్యతాయుతంగా కంటెంట్ను రూపొందిస్తారని ఆశిస్తున్నాను’ అని అనసూయ తన పోస్టులో రాసుకొచ్చింది.🙏🏻 pic.twitter.com/gfQfdsaLV4— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 6, 2026
అభిమానికి ఊహించని షాకిచ్చిన ఎన్టీఆర్!
అభిమానులకు రకరకాల కోరికలు ఉంటాయి. తమ అభిమాన హీరోని ఒక్కసారైనా కలవాలి.. ఆయనతో కాసేపు మాట్లాడాలి.. వీలైతే కలిసి భోజనం చేయాలి.. కనీసం ఒక సెల్ఫీ అయినా దిగాలి.. ఇలాంటి డ్రీమ్స్ చాలానే ఉంటాయి.నిజానికి వీటిలో చాలా వరకు నెరవేరని కోరికలే అని అభిమానులకు కూడా బాగా తెలుసు. కానీ, ఆరాధించే గుండెకు లాజిక్కులు తెలియవు కదా! అందుకే నెరవేరుతుందో లేదో తెలియకపోయినా.. సరదాగానైనా సరే, తమ మనసులోని ఆ ముచ్చటను బయటపెడుతుంటారు. అయితే ఇలా సరదాగా అడిగిన కోరికను హీరో నిజం చేస్తే మాత్రం..ఆ అభిమాని షాకవ్వడం మాత్రం గ్యారెంటీ. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ అలాంటి పనే చేసి అభిమానికి షాకిచ్చాడు. వివరాల్లోకి వెళ్లితే..ఎన్టీఆర్కు వంటలు చేయడం చాలా ఇష్టం. ఖాలీ సమయం దొరికితే కిచెన్లోకి దూరిపోతుంటాడు. బిర్యానీ చేయడంతో ఆయన దిట్ట. అయితే ఈ సారి మాత్రం కాస్త వెరైటీ వంటకం ట్రై చేశాడు. పిల్లలకు చాలా ఇష్టమైన కుకీలు రెడీ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్లో షేర్ చేస్తూ.. అవి కొన్నవి కాదని, స్వయంగా తయారు చేశానని చెప్పుకొచ్చాడు.Anna janma dhanyam ayyindi anna @tarak9999 , any way sesh nestle apartments flat no 102 , moti nagar, near gowtham model school 😉 https://t.co/hh7hfv5KY0— saiteja (@saitejaathoti) June 5, 2026ఎన్టీఆర్ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పలువు అభిమానులు ఎన్టీఆర్ని పొడుగుతూ కామెంట్స్ పెట్టారు. అయితే ఓ అభిమాని తన హీరోకి సరదాగా ఓ విజ్ఞప్తి చేశాడు. ‘మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రెండు కుకీలు పంపించు అన్న’అని ట్వీట్ చేశాడు. దానికి ఎన్టీఆర్ సరదగా స్పందిస్తూ.. ‘అడ్రస్ పెట్టు’ అంటూ బ్రహ్మానందం వీడియోని పెట్టాడు. అది చూసి సదరు అభిమాని ఆశ్చర్యపోయాడు. ‘అన్నా.. జన్మ ధన్యమైంది’ అంటూ తన ఇంటి అడ్రస్ చెప్పాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నిజంగానే తాను తయారు చేసిన కుకీస్ని అతనికి పంపించేశాడు. ఇది చూసి సదరు అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. ‘కాళ్లు, చేతులు వణుకుతున్నాయి. కన్నీళ్లను ఆపుకోలేకతున్నాను’ అంటూ తారక్ పంపిన కుకీల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. Anna @tarak9999 legs and hands are still shaking cant control tears 😭😭😭 pic.twitter.com/YMdmQjbFWD— saiteja (@saitejaathoti) June 5, 2026
చరణ్-జాన్వీల ముద్దు సీన్పై విమర్శలు... స్పందించిన బుచ్చిబాబు
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం ఈ నెల 4న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. సినిమా చూసినవారంతా గ్లామర్ షో కోసమే జాన్వీ కపూర్ని పెట్టారని, కథకు ఆమె పాత్రకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే జాన్వీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్-జాన్వీల ముద్దు సీన్పై కూడా విమర్శలు వచ్చాయి. ఏ సందర్భం లేకుండా ఉద్దేశపూర్వకంగా ఆ సీన్ పెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. ముద్దు సీన్పై ఇలాంటి నెగెటివ్ స్పందన వస్తుందని ఊహించలేదన్నారు.రామ్ చరణ్-జాన్వీల మధ్య సరదా సాగే ఓ ప్రేమ కథను మాత్రమే తెరపై చూపించాలనుకున్నామని.. అందులో భాగంగానే ముద్దు సీన్ పెట్టామని వివరణ ఇచ్చాడు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకొని ఇకపై అలాంటి సీన్లను తెరకెక్కించే ముందు మరింత జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. తన తదుపరి సినిమాల్లో అలాంటి సీన్లు ఉంటే.. ప్రేక్షకులను నచ్చే విధంగా తెరకెక్కిస్తామని తెలిపారు.పెద్ది విషయానికొస్తే.. 1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలోని కొండకింద ఊరికి చెందని ఓ యువకుడు.. గుర్తింపు కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇందులో రామ్ చరణ్ గిరిజన యువకుడిగా కనిపిస్తూ.. క్రికెటర్గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్గా మూడు విభిన్నమైన పాత్రలు పోషించి, ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. మొదటి రోజు ఈ చిత్రం రూ. 135 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
క్రీడలు
బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెటర్.. భారత జట్టులోకి స్వాగతం!
శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్ కోసం ఇప్పటికే భారత-ఏ జట్టు ఆ గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో తెలుగు కుర్రాడు షేక్ రషీద్కు చోటు దక్కడం ఆసక్తికర అంశంగా మారింది. ధ్రువ్ జురేల్ నేతృత్వంలోని జట్టులో సాయి సుదర్శన్, పడిక్కల్, రుతురాజ్, ఆయుష్ బదోని వంటి ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. 2021 అండర్-19 ఆసియా కప్ టోర్నీ ద్వారా షేక్ రషీద్ తొలిసారి బీసీసీఐ దృష్టిలో పడ్డాడు. జట్టు టైటిల్ గెలవడంలో షేక్ రషీద్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్కు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ఆరంభంలోనే కోవిడ్ బారిన పడ్డాడు. అయితే లీగ్ దశ ఆఖరికి చేరుకున్న క్రమంలో తిరిగి జట్టులోకి వచ్చిన రషీద్ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 108 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఫైనల్లోనూ కీలక హాఫ్ సెంచరీతో మెరిసిన షేక్ రషీద్ టీమిండియా టైటిల్ గెలవడంలోనూ సహాయపడ్డాడు.ఎవరీ షేక్ రషీద్?ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్ క్రికెట్ ప్రయాణం అడ్డంకులతో సాగింది. అతడి తండ్రి షేక్ వలీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొడుకు లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కష్టపడ్డాడు. తండ్రి త్యాగంతో ఇవాళ ఇండియా-ఏ జట్టుకు ఎంపికైన షేక్ రషీద్ త్వరలోనే జాతీయ జట్టుకు కూడా ఎంపికవ్వాలని కోరుకుందాం. అండర్-19 టీ20 ప్రపంచకప్ అతడికి గుర్తింపు తెచ్చినప్పటికీ దేశవాలీ క్రికెట్లో రాణించాలంటే రంజీ మ్యాచ్లు ఆడడం తప్పనిసరి. అందుకే 2022లో ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన షేక్ రషీద్ ఓర్పు, టెక్నిక్, సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యాన్ని అలవరుచుకున్నాడు. 2025-26 రంజీ సీజన్లో షేక్ రషీద్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో షేక్ర రషీద్ మూడు శతకాలతో 627 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 27 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన షేక్ రషీద్ 46 సగటుతో 1831 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలున్నాయి. లంక పర్యటనలో ముందుగా శ్రీలంక, అఫ్గానిస్తాన్తో కలిసి ఇండియా-ఏ ట్రై వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి.శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, ఎన్ జగదీశన్, అమన్ మోఖడే, షేక్ రషీద్, జీషన్ అన్సారీఇండియా-ఏ టూర్ ఆఫ్ శ్రీలంక షెడ్యూల్జూన్ 25- తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)జులై 2- రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)చదవండి: గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు!
BCCI: ప్రపంచకప్ గెలిచినా.. ఆ ఐదుగురిపై ‘వేటు’!.. కారణం?
ఊహాగానాలే నిజమయ్యాయి.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ను మార్చింది. టీమిండియాకు 2026లో ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసింది. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. మూడేళ్లుగా జట్టులోనే లేడుఐర్లాండ్ పర్యటన నుంచే అయ్యర్ బాధ్యతలు చేపట్టనుండగా.. ఇంగ్లండ్ టూర్, ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా బీసీసీఐ జట్టును ప్రకటించేసింది. ఇక ఈ ఏడాదే టీమిండియాకు వరల్డ్కప్ అందించిన సూర్యను కాదని.. దాదాపుగా మూడేళ్లుగా అసలు టీ20 జట్టులోనే లేని శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ కెప్టెన్గా ఎంపిక చేయడం విశేషం. గత మూడేళ్లుగా ఐపీఎల్లో సారథిగా, బ్యాటర్గా ఈ ముంబైకర్ సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం. మరోవైపు.. ఐపీఎల్-2026లో పరుగుల వరద పారించిన రాజస్తాన్ రాయల్స్ సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా తొలిసారి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచారు.ఆ ముగ్గురిపై వేటు.. ఆ ఇద్దరికి విశ్రాంతి!ఇదిలా ఉంటే.. స్వదేశంలో దాదాపు మూడు నెలల క్రితం టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన భారత జట్టులోని సభ్యుల్లో ఐదుగురిని ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు ఎంపిక చేయలేదు సెలక్టర్లు. వీరిలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేశారు. అయితే, మిగతా నలుగురిని మాత్రం పూర్తిగా పక్కనపెట్టేశారు. వారెవరంటే..సూర్యకుమార్ యాదవ్కెప్టెన్గా 2023-2026 వరకు టీమిండియాను విజయపథంలో నడిపాడు సూర్యకుమార్ యాదవ్. అతడి సారథ్యంలో 52 మ్యాచ్లలో టీమిండియా ఏకంగా నలభై గెలిచింది.అయితే ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న సూర్య గత కొంతకాలంగా విఫలమవుతున్నాడు. దీంతో సెలక్టర్లు నిర్దయగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు జట్టులో కూడా చోటులేకుండా చేశారు. టీ20 ప్రపంచకప్- 2028 టోర్నీని దృష్టిలో పెట్టుకుని 35 ఏళ్ల సూర్యకు దాదాపుగా వీడ్కోలు పలికేశారు.హార్దిక్ పాండ్యాటీమిండియా టీ20 మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా ఈ టూర్ల నుంచి సెలక్టర్లు పక్కనపెట్టేశారు. ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఆల్రౌండర్గా హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు.అదే సమయంలో వెన్నునొప్పితోనూ ఈ ఆల్రౌండర్ సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027 నాటికి అతడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సెలక్టర్లు టీ20 జట్టు నుంచి అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.కుల్దీప్ యాదవ్ప్రపంచకప్ జట్టుకు ఎంపికైనప్పటికీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు తుదిజట్టులో చాన్నాళ్లుగా చోటు దక్కలేదు. అతడికి బదులు వరుణ్ చక్రవర్తికి యాజమాన్యం పెద్దపీట వేసింది. నిజానికి 2024, 2026లలో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్లలో సభ్యుడైనా 31 ఏళ్ల కుల్దీప్.. ఈ రెండు టోర్నీలలో కలిపి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అయితే, ఈసారి అతడిని పూర్తిగా టీ20ల నుంచి పక్కనపెట్టేసి రవి బిష్ణోయికి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.రింకూ సింగ్గత కొంతకాలంగా టీ20 జట్టులో భాగమైన రింకూ.. 2024 వరల్డ్కప్ జట్టులో రిజర్వు ప్లేయర్గా ఉన్నాడు. ఇక ఏడాది ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. అయితే, ఫినిషర్గా తన వంతు పాత్ర పోషించడంలో రింకూ విఫలమయ్యాడు. ఐపీఎల్లోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేదు. దీంతో సెలక్టర్లు అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.జస్ప్రీత్ బుమ్రాటీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటిన జస్ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్-2026లో మాత్రం తేలిపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున కేవలం నాలుగు వికెట్లే తీశాడు.అయితే, బుమ్రా విషయంలో ప్రదర్శనను బట్టి కాకుండా.. అతడికి విశ్రాంతినిచ్చేందుకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వన్డే వరల్డ్కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బుమ్రాను యూకే టూర్ నుంచి తప్పించారు. అయితే, ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు మాత్రం ఎంపిక చేశారు.చదవండి: వైభవ్ వచ్చేశాడు!
గిల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ పరుగుల వరద పారిస్తుంది. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టగా.. తాజాగా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. గిల్ 138 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో మూండకెల మార్కును తాకాడు. ఈ సెంచరీ గిల్కు 11వ టెస్ట్ సెంచరీ. ఓవరాల్గా 20వ అంతర్జాతీయ సెంచరీ. కేవలం 26 ఏళ్ల వయసులోనే గిల్ ఇన్ని సెంచరీలు చేయడం విశేషం.అరుదైన ఫీట్టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్ల్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు.అంతేకాదు కెప్టెన్ అయిన అతి తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.అలాగే అత్యధిక టెస్ట్ శతకాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో టాప్-5లోకి చేరాడు. గిల్ భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా 6 శతకాలు సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (20) టాప్ ప్లేస్లో ఉండగా.. సునీల్ గవాస్కర్ (11), మొహమ్మద్ అజహారుద్దీన్ (9), సచిన్ టెండూల్కర్ (7) గిల్కు ముందున్నారు. గిల్ 6 టెస్ట్ శతకాలను కేవలం 15 ఇన్నింగ్స్లోనే సాధించడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ అతి భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్ 368-3గా ఉంది. రాహుల్ (100), యశస్వి జైస్వాల్ (24), సాయి సుదర్శన్ (81) ఔట్ కాగా.. గిల్ (103), వికెట్కీపర్ రిషబ్ పంత్ (50) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో సలీం సాఫి 2, జియా ఉర్ షరిఫీ ఓ వికెట్ పడగొట్టారు.
గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు!
ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులేస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకంతో చెలరేగిత్, కెప్టెన్ గిల్ కూడా సెంచరీ దిశగా పరిగెడుతున్నాడు. సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ విషయం పక్కనబెడితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో తన చేతిలో ఒక అంతుచిక్కని పదార్థంతో కెమెరా కంటికి చిక్కాడు. అయితే అవి హోమియోపతి మెడిసిన్స్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే చిన్న డబ్బాలో రౌండ్గా ఉన్న పిల్స్ను చేతిలోకి తీసుకున్న గంభీర్ వాటిని నోటిలో పెట్టుకోవడం కనిపించింది. బహుశా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గంభీర్ ఆ పిల్స్ను వాడుతున్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అవకాశం చిక్కితే చాలు గంభీర్ను విమర్శించడమే పనిగా పెట్టుకునే కొందరు ఆకతాయిలు తమ నోటికి పనిచెప్పారు. సోషల్ మీడియా వేదికగా అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టడం కనిపించింది. 'గంభీర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని, వెంటనే అరెస్ట్ చేయాలని కొందరు పేర్కొంటే.. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణాన్ని గంభీర్ పూర్తిగా చెడగొడుతున్నాడని, అతన్ని వెంటనే కోచ్ పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని' కామెంట్లు చేయడం గమనార్హం.అయితే ఆఫ్గన్తో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ ఆకట్టుకున్నాడు. గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్లో సాయి సుదర్శన్ 104 బంతులెదుర్కొని 13 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు రావాలని గంభీర్ తనకు చెప్పాడని సాయి సుదర్శన్ మ్యాచ్ విరామ సమయంలో పేర్కొన్నాడు. జైస్వాల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి సాయి సుదర్శన్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలిరోజే టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. గిల్ (103), పంత్ (50) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ (100) శతకం సాధించాడు. 🚨DRUG DEALER GAUTAM GAMBHIR 🚨Gautam Gambhir was seen taking drugs while on-going India vs Afghanistan test match 👀 pic.twitter.com/9gJOYoy7jg— ; (@ReignofDhoni) June 6, 2026చదవండి: ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్!
న్యూస్ పాడ్కాస్ట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా... కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
బిజినెస్
మానవ నియంత్రణ తప్పుతున్న నమూనాలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మానవాళి మనుగడకే సవాలుగా మారనుందా అంటే.. తాజా సాంకేతిక అంశాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ‘ఆంత్రోపిక్’ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు చర్చకు దారితీసింది. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిపై అంతర్జాతీయంగా తక్షణమే తాత్కాలిక విరామం(గ్లోబల్ పాజ్) ప్రకటించాలని ఆంత్రోపిక్ తెలిపింది. తాము రూపొందిస్తున్న ఏఐ నమూనాలు మానవ నియంత్రణ పరిధుల నుంచి తప్పించుకునే సంకేతాలను ప్రదర్శిస్తున్నాయని సంస్థ బాహాటంగా అంగీకరించడం గమనార్హం.స్వీయ నియంత్రణ సాధ్యమేనా?ప్రసిద్ధ క్లాడ్ ఏఐ నమూనాల సృష్టికర్త అయిన ఆంత్రోపిక్ సంస్థ సాంకేతిక పరిజ్ఞాన ప్రగతితో పాటు సామాజిక నిర్మాణాలు, భద్రతా ప్రమాణాల సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ గ్లోబల్ పాజ్ అత్యవసరమని పేర్కొంది. ‘సాంకేతిక పరిజ్ఞాన పురోగతిని తట్టుకునేలా సామాజిక వ్యవస్థలను సిద్ధం చేయడానికి, సరిహద్దు ఏఐ (ఫ్రంటీర్ ఏఐ) అభివృద్ధిని నెమ్మదిగా లేదా తాత్కాలికంగా నిలిపివేసే హక్కు ప్రపంచానికి ఉండాలి’ అని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.అయితే, ఒకే ఒక్క సంస్థ లేదా దేశం అభివృద్ధిని ఆపితే ప్రయోజనం లేదని, ప్రత్యర్థి శక్తులు మరింత వేగంగా దూసుకుపోయే ప్రమాదముందని హెచ్చరించింది. అమెరికా, చైనాల వంటి అగ్రదేశాల్లోని ప్రధాన ఏఐ సంస్థలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పరస్పర నిబంధనలను ధ్రువీకరించుకుంటూ ఏకకాలంలో విరామం ప్రకటిస్తేనే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ సమన్వయ యంత్రాంగం లేకపోతే భౌగోళిక రాజకీయ, వ్యాపార ఒత్తిళ్ల కారణంగా భద్రతను పణంగా పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.వైట్హౌస్ అభ్యంతరాలుఆంత్రోపిక్ చేసిన ఈ ప్రతిపాదనపై సిలికాన్ వ్యాలీతో పాటు వాషింగ్టన్ రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రమాదాల తీవ్రతను ఆంత్రోపిక్ అతిగా ఊహిస్తోందని, భద్రతా ఆందోళనల ముసుగులో ప్రత్యర్థులను వెనక్కి నెట్టే వ్యూహాత్మక పన్నాగం ఇదంటూ వైట్హౌస్ అధికారులు, సహచర టెక్ కంపెనీల ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. ఏఐ అభివృద్ధిని ఆపడం వల్ల చైనాకు వ్యూహాత్మకంగా పైచేయి లభిస్తుందని అమెరికా అధికారులు భయపడుతున్నారు.అయినప్పటికీ, ఆంత్రోపిక్ సంస్థ అత్యంత రహస్యంగా ఉంచిన ‘మైథోస్’ మోడల్ శక్తిని వైట్హౌస్ సైతం గుర్తించింది. అసాధారణమైన సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు ఉన్నందున ఈ మోడల్ను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. కేవలం నిశితంగా పరిశీలించిన అతికొద్ది సంస్థలకు మాత్రమే ప్రస్తుతం దీనికి యాక్సెస్ కల్పించారు. యూరప్కు కూడా ఈ మైథోస్ మోడల్ యాక్సెస్ణు ఆంత్రోపిక్ అందిస్తుండటం విశేషం.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!
కోట్లలో లాభాల పంట.. కంపెనీలో లేఆఫ్స్ మంట!
టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ మునుపెన్నడూలేని విధంగా భారీగా లేఆఫ్స్ నిర్ణయం తీసుకుంది. కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ విభాగాల్లో రికార్డు స్థాయి వృద్ధిని, బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేస్తున్నప్పటికీ.. ఏకంగా 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తుండటం ఐటీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో దాదాపు 18 శాతం మందిని తొలగించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ ఉద్వాసనకు ప్రభావితమైన ఉద్యోగుల అధికారిక పీరియడ్ జూన్ 1 నుంచి జూన్ 15 మధ్య ముగియనుంది.లాభాల బాటలో ఒరాకిల్..వ్యాపార పరంగా ఒరాకిల్ వృద్ధిని కనబరుస్తున్న తరుణంలోనే ఈ లేఆఫ్స్ నిర్ణయం రావడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే.. ఏడాది ప్రాతిపదికన 22 శాతం వృద్ధి చెంది 17.2 బిలియన్ డాలర్ల లాభం నమోదైంది. క్లౌడ్ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 44 శాతం పెరిగి 8.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఏఐ అప్లికేషన్ల అభివృద్ధికి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఐ విభాగం ఏకంగా 243 శాతం, మల్టీక్లౌడ్ డేటాబేస్ ఆదాయం 531 శాతం వృద్ధిని సాధించాయి.ఉద్యోగాలను ఎందుకు తగ్గిస్తోంది?రికార్డు లాభాలు వస్తున్నప్పటికీ ఒరాకిల్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యూహాత్మక పునర్నిర్మాణ ప్రణాళిక ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సాంప్రదాయ విభాగాల నుంచి వనరులను తగ్గించి, వాటిని పూర్తిగా ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ విస్తరణ వైపు మళ్లించాలని ఒరాకిల్ భావిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 50 బిలియన్ డాలర్ల మూలధన వ్యయాన్ని కేటాయించింది. ఇందులో అధికంగా ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకే ఖర్చు చేయనున్నారు. ఓపెన్ఏఐ, సాఫ్ట్బ్యాంక్ మద్దతుతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భారీ స్థాయి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ‘స్టార్ గేట్’లో ఒరాకిల్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.సెవెరెన్స్ ప్యాకేజీపై అసంతృప్తిఒకవైపు కంపెనీ భారీ లాభాలను ప్రకటిస్తూ మరోవైపు ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీ ఆఫర్ చేసిన సెవెరెన్స్ (విడదీత) ప్యాకేజీ నిబంధనలపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. అన్వెస్టెడ్ (ఇంకా చేతికి రాని) స్టాక్ అవార్డుల విషయంలో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఒరాకిల్ అందిస్తున్న సెవెరెన్స్ ప్యాకేజీలో పదవీకాలం ఆధారిత పరిహారాన్ని గరిష్టంగా 26 వారాలకే పరిమితం చేశారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!
హ్యుందాయ్ కార్లపై ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు
దేశీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో పోటీ మరింత పెరుగుతున్న నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా జూన్ 2026కు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.1.05 లక్షల వరకు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు, అప్గ్రేడ్ బోనస్లు, కార్పొరేట్ ఆఫర్లను అందిస్తోంది. ఆటోమొబైల్ రంగానికి చెందిన పలు నివేదికలు, డీలర్షిప్ సమాచారం ప్రకారం క్రెటా మోడల్పై అత్యధిక ప్రయోజనాలు లభిస్తున్నాయి.క్రెటాకే అత్యధిక డిస్కౌంట్హ్యుందాయ్ అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్సైజ్ ఎస్యూవీ క్రెటా (Hyundai Creta)పై కంపెనీ అందిస్తున్న మొత్తం ప్రయోజనాల విలువ రూ.1.05 లక్షల వరకు చేరుతోంది. పెట్రోల్ వేరియంట్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్, అప్గ్రేడ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు కలిపి ఈ ప్రయోజనం అందుతోంది. ఇటీవల కంపెనీ క్రెటా సమ్మర్ ఎడిషన్ను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో విక్రయాల ఊపును కొనసాగించేందుకు ఈ ఆఫర్లు ఉపయోగపడనున్నాయి.ఇతర మోడళ్లపైనా ఆకర్షణీయ ఆఫర్లుక్రెటా తర్వాత గ్రాండ్ ఐ10 నియోస్పై రూ.80,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ప్రీమియం హ్యాచ్బ్యాక్ ఐ20పై రూ.65,000 వరకు, వెర్నా సెడాన్పై రూ.55,000 వరకు, ఎక్స్టర్ కాంపాక్ట్ ఎస్యూవీపై రూ.40,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మోడల్, వేరియంట్, నగరం, డీలర్ స్టాక్ను బట్టి ఈ ఆఫర్లలో మార్పులు ఉండే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఫైనాన్స్ సదుపాయాలు కూడామోడల్ ఆధారంగా రూ.65,000 వరకు అప్గ్రేడ్ బోనస్తో పాటు 100 శాతం వరకు ఆన్రోడ్ ఫండింగ్, ప్రాసెసింగ్ ఫీజులో రాయితీలు, ఫోర్క్లోజర్ ఛార్జీల మినహాయింపు వంటి ఫైనాన్స్ పథకాలను కూడా హ్యుందాయ్ అందిస్తోంది. దీంతో కొత్త కారు కొనుగోలు వ్యయం తగ్గే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, ప్రత్యర్థి కంపెనీలు కూడా భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకీ తన నెక్సా శ్రేణిలోని కొన్ని మోడళ్లపై రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలను ప్రకటించింది. దీంతో జూన్ నెలలో కారు కొనుగోలుదారులకు డిస్కౌంట్ల పరంగా మంచి అవకాశాలు లభిస్తున్నాయి.ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే అమల్లో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన డిస్కౌంట్, వేరియంట్ వారీ వివరాల కోసం సమీప హ్యుందాయ్ డీలర్ను సంప్రదించడం మంచిది.
ఏఐ వైపు నిధులు.. జీతాల పెంపునకు బ్రేకులు!
ఐటీ రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్నటివరకు ఉద్యోగాల కోతకే పరిమితమైన ఏఐ ముప్పు.. ఇప్పుడు నేరుగా ఉద్యోగుల వార్షిక వేతన ప్యాకేజీలు, ఇంక్రిమెంట్లపై పడింది. సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు తమ వ్యాపార శైలిని పూర్తిగా మార్చేస్తున్నాయి. పనులను వేగవంతం చేయడానికి ఏఐపై పెట్టుబడులను భారీగా పెంచుతూ అందుకోసం ఉద్యోగుల జీతాల పెంపునకు బ్రేకులు వేస్తున్నాయి. తాజాగా, గ్లోబల్ క్లౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘టెరాడేటా’ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐటీ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఏఐ వైపు మళ్లుతున్న నిధులుప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ జర్నల్ ‘బిజినెస్ ఇన్సైడర్’ నివేదిక ప్రకారం.. టెరాడేటా సంస్థ తన ఉద్యోగుల వార్షిక వేతన పెంపును ఈ ఏడాదికి పూర్తిగా నిలిపివేయాలని (ఫ్రీజ్) నిర్ణయించింది. ఈ బడ్జెట్ను నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా మళ్లించడమే దీనికి ప్రధాన కారణం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 5,100 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఈ ఏడాది వార్షిక జీతాల సర్దుబాటు ఉండబోదని కంపెనీ సీఈఓ స్టీవ్ మెక్మిలన్ ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత మెమోలో స్పష్టం చేశారు.‘మార్కెట్లోకి సరికొత్త ఏఐ ఆవిష్కరణలను తీసుకురావడానికి, ఈ రంగానికి చెందిన నిపుణులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం. అందుకే ఈ ఏడాది వార్షిక జీతాల బడ్జెట్ను పునసమీక్షించి ఆ నిధులను ఏఐ పెట్టుబడులకు కేటాయిస్తున్నాం’ అని టెరాడేటా సీఈఓ స్టీవ్ మెక్మిలన్ అన్నారు. అయితే, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్లు, ఈక్విటీ షేర్లను మాత్రం యథావిధిగా అందిస్తామని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!
ఫ్యామిలీ
హాట్టాపిక్గా ఆ విద్యార్థి లేవనెత్తిన ప్రశ్న..!
ఓ యువ విద్యార్థి లేవనెత్తిన సందేహం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జార్ఖండ్కు చెందిన పదిహేడేళ్ల సార్థక్ సిద్ధాంత్ 12 వ తరగతి చదువుతున్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ ఏడాది 12వ తరగతి పరీక్ష మూల్యాంకనానికి ఆన్ స్క్రీన్ మార్కింగ్ను ప్రవేశపెట్టింది. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. కాస్త లోతుగా విశ్లేషించాలని సీబీఎస్ఈ విడుదల చేసిన డాక్యుమెంట్లు, పాత టెండర్లను డౌన్లోడ్ చేసుకుని పరిశీలించి చూశాడు సార్థక్. నిబంధనల మార్పు జరిగిందని, కొన్ని క్లాజులను సడలించారని, మరిన్ని లోపాలు కూడా ఉన్నాయని తన బ్లాగ్లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు ఆన్లైన్లో వైరల్గా మారింది. అధికారులు అప్రమత్తమయ్యారు. సార్థక్ ఆరోపించిన అంశాలను సవివరంగా తెలుసుకోదలచి అతడినే సీబీఎస్ఈ పార్లమెంటరీ ప్యానల్కి ఆహ్వానించారు. కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సార్థక్ ఇచ్చిన ప్రజెంటేషన్లో తాను గుర్తించిన పలు లోపాలను వారికి వివరించాడు. మొత్తానికి జార్ఖండ్ విద్యార్థి లేవెనెత్తిన ప్రశ్న దేశవ్యాప్తంగా ఉన్న విద్యావ్యవస్థ పరీక్షగా మారింది.(చదవండి: ‘గ్రాండ్ఫేర్వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!)
‘గ్రాండ్ఫేర్వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!
ఎవరైనా ఉద్యోగం నుంచి రిటైర్ అయితే శాలువా కప్పి సన్మానం చేసి నాలుగు మంచి మాటలు చెప్పడం చాలా కామన్ అయితే మంచి చెప్పడం కన్నా చేతల్లో చూపించడం అరుదు. అదే చేశారు కేరళలోని కొందరు పూర్వ విద్యార్థులు. కాసరగాడ్లోని చెన్మాద్ వెస్ట్ గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో హెడ్మాస్టర్గా పని చేసిన పీటీ. బెన్నీ గతవారం రిటైర్ అయ్యారు. పూర్వ విద్యార్థులు, స్కూల్ ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామస్తులందరూ కలిసి ఓ కారుని బెన్నీకి బహుమానంగా అందజేశారు.నూట ఇరవై ఏడు సంవత్సరాల స్కూల్చెన్మాద్ స్కూల్ను ఏర్పాటు చేయడానికి 1899లో చెన్మాద్ జమాద్ కమిటీ కొంత స్థలాన్నిచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కాని పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా సదుపాయాలు, ఉపాధ్యాయులు, ఇతర వసతులు అందుబాటులోకి రాలేదు. పీటీ బెన్నీ ఎక్కడ పని చేసినా ఎవరో ఇచ్చే విరాళాల కోసం చూడకుండా తన సొంత ఖర్చులతో స్కూలును బాగు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావర ణాన్ని అందించేవారు. ఆయన గురించి తెలిసి 2019లో చెన్మాద్ స్కూల్కి రప్పించారు. హెడ్మాస్టర్గా బెన్నీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాలను పూర్తిగా మార్చివేశారు. ఆయన ప్రయత్నం చూసి స్థానికులు కూడా తమ వంతు సాయం చేశారు. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే తరగతి గదులు పెరిగాయి. పాఠశాలకు రెగ్యులర్గా 25 మంది ఉపాధ్యాయులను నియమించారు. విద్యార్థుల సంఖ్య 550 నుంచి 850కి పెరిగింది. ప్రముఖ పోగటీ పరీక్షలలో పాఠశాల విద్యార్థులు టాపర్స్గా నిలిచారు. నూట ఇరవై ఏడు సంవత్సరాల పాఠశాల చరిత్రలో ఉత్తమ గురువుగా బెన్నీ పేరు సంపాదించారు. తమ గురువు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా పండగలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతి ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు. తమ గురువు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా సంబరంలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు. (చదవండి: ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..)
ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..
మనకెదురయ్యే సమస్యల నుంచే అద్భుత ఆవిష్కరణలు పుట్టుకొస్తుంటాయి. బహుశా సమస్య కూడా సౌకర్యాలు సమకూర్చుకునేదే కాబోలు. ఇదంతా ఎందుకంటే..ఇక్కడ ఓ ఐదేళ్ల చిన్నారి తనలాంటి పిల్లలు పడుకోవడానికి ఇబ్బందిపడే నిద్ర సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపింది. పేరెంట్స్కి పిల్లలను నిద్రపుచ్చుడం ఓ సవాలులా ఉంటుంది. ఆ సమస్యకు ఈ చిన్నారి భలే అద్భుతంగా చెక్పెట్టడమే కాదు. ఆమె ఆవిష్కరణకు పేటెంట్ కూడా మంజూరవ్వడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..ఇంతవరకు పిల్లల నిద్రపై ఏ ఆవిష్కరణ ప్రభావవంతంగా లేదు. పిల్లలు నిద్రపోవడం లేదంటూ డాక్టర్లు వద్దకు వెళ్లి మెడిసిన్ తెచ్చుకుని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా ఔషధల ప్రభావం లేకుండా సహజసిద్ధంగా వాళ్లను నిద్రపుచ్చే టెక్నీక్ కోసం పిల్లలు, నిపుణులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదోక పరిష్కారం కానీ సమస్యలా ఉన్న జఠిల సమస్యకు కాలిఫోర్నియాకు చెందిన ఐదేళ్ల చిన్నారి వెన్నెల అత్తిలి అద్భుతంగా చెక్ పెట్టింది. తన తల్లి వీపుపై జోకొడుతూ ఉంటే తనకు నిద్రపట్టేది లేదంటే నిద్రపట్టేది కాదామెకు. ఒక్కోసారి ఆమె తల్లి త్వరగా నిద్రపోయేది దాంతో తనకు నిద్రరాకి ఎలా ఇబ్బంది పడేదో బాగా తెలుసు. అయితే ఒక రోజు స్కూల్లో ఉపయోగకరమైన ఏదైనా వస్తువును కనిపెట్టమని ఇచ్చిన అసైన్మెంట్ ఆవిష్కరణకు దారితీసింది. అదేదో తాను రోజు ఎదుర్కొంటున్న నిద్రసమస్యకు చెక్పెడితే చాలని అనుకుంది వెన్నెల. అందుకోసం ఒక టెడ్డీబేర్, గుడ్డ, పుల్లలు, వైబ్రేటింగ్ మోటర్ని ఉపయోగించింది. ఆ బొమ్మ మన పక్కన ఉంటే మన తల్లిదండ్రులు ఉన్నట్లుగా శ్వాస, వెచ్చదనం ఇచ్చేదనం అందించే బొమ్మ అయ్యి ఉండాలని అనుకుంది. అలా ఆమె ‘హ్యాపీ స్లీప్’ అనే శ్వాస తీసుకుని వెచ్చదనం అందించే బొమ్మను రూపొందించింది. నిజానికి ఇంట్లో చాలామంది పిల్లలు పడుకునేటప్పుడు తమకు నచ్చిన ఏదోఒక బొమ్మను పక్కన పెట్టుకుని నిద్రపోతుంటారు. ఆ బొమ్మతో పిల్లలకు భావోద్వేగపరమైన సంరక్షణతో కూడిన అనుబంధం ఉంటుంది. అలా వెన్నెల ఆవిష్కరించిన బొమ్మ నిజంగానే ప్రభావవంతంగా ఉంది. ఇది నిజంగా పిల్లలకు తమ పక్క సంరక్షకులు ఉన్నారనే భావంతో హాయిగా నిద్రపోయారు. పైగా అధ్యయనంలో మంచి ఫలితాలు లభించాయి. దాంతో ఈ ఆవిష్కరణను 2019 కాలిఫోర్నియా ఇన్వెన్షన్ కన్వెన్షన్లో ప్రదర్శించగా, అక్కడ ఆ చిన్నారి మెరిట్ అవార్డును అందుకోవడమే కాకుండా యుఎస్ పేటెంట్ కూడా మంజూరవ్వడం విశేషం. కాగా, ఈ ఆవిష్కరణ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు, ముఖ్యంగా కీమోథెరపీ చేయించుకుంటున్న వారికి లేదా ఆసుపత్రి ఐసోలేషన్లో ఉన్న వారికి సాంత్వన చేకూరుస్తుందని చెబుతోంది ఆ చిన్నారి. (చదవండి: అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!)
మొక్కజొన్న చొప్పతో జెట్ ఇంధనం!
మొక్కజొన్న కంకుల్ని కోసిన తర్వాత మిగిలే ఎండు చొప్పతో జెట్ విమానాలను నడిపే ఖరీదైన ఇంధనాన్ని రూపొందించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవటంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పశ్చమాసియా యుద్ధం ్ర΄ారంభమైన తర్వాత విమానయాన ఇంధనం ధర రెట్టింపైంది. విమానయాన సంస్థలు పెట్రోలియంకు ప్రత్యామ్నాయాలను కనుగొని, తమ ఉద్గారాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. మొక్కజొన్న పంట వ్యర్థాలను ఇంధనంగా మార్చడం దీనికి ఒక గొప్ప ఆరంభం కానుంది. ప్రతి పంట కోత కాలం తర్వాత అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న పొలాలు ఎండిన చొప్ప, ఆకులతో నిండి΄ోతాయి. మొక్కజొన్న కంకులను సేకరించిన తర్వాత మిగిలి΄ోయే వ్యర్థాలు ఇవి. కొంతమంది రైతులు ఈ చొప్పను జంతువులకు మేతగా వేస్తారు లేదా పంటల మధ్యన ఆచ్ఛాదనగా లేదా సహజ కం΄ోస్టు ఎరువుగా తయారు చేసి భూసారాన్ని పెంచటానికి ఉపయోగిస్తారు. కానీ, అమెరికా వంటి దేశాల్లో మొక్కజొన్న వ్యర్థాల్లో చాలా భాగం సరిగ్గా ఉపయోగపడకుండానే మిగిలిపోతోంది.వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) తాజా పరిశోధన ప్రకారం.. విమానయాన రంగంలో ఉద్గారాలను తగ్గించటం అత్యంత క్లిష్టతరమైన పని. అయితే, మొక్కజొన్న వ్యర్థాలను ఈ పని కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని తేలింది. మొక్కజొన్న చొప్ప నుంచి జెట్ ఇంధనాన్ని తయారు చేయటం ద్వారా ఈ ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ను వాతావరణ మార్పులకు దోహదపడకుండా తీర్చవచ్చు.ఇరాన్పై యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురుతో తయారయ్యే సాంప్రదాయ జెట్ ఇంధనం ధర ప్రపంచవ్యాప్తంగా ఇటీవల రెట్టింపు అయ్యింది. కానీ, ప్రపంచ ఉద్గారాల్లో 2.4% కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోలియం జెట్ ఇంధనానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసే కృషి ఈ యుద్ధానికి ముందే మొదలైంది. విమాన ప్రయాణానికి డిమాండ్ పెరిగేకొద్దీ, 2050 నాటికి ఈ ఇంధన కాలుష్యం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా.చొప్పతో 10% జెట్ ఇంధనంమొక్కజొన్న చొప్ప వ్యర్థాలతో జెట్ ఇంధనం తయారీ ప్రక్రియ మనుషులకూ, పర్యావరణానికీ కూడా మేలు చేసే ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అని డబ్ల్యూఆర్ఐ పరిశోధనలో తేలింది. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి పొలాల్లోనే వదిలివేయాల్సిన భాగాన్ని మినహాయించిన తర్వాత, అమెరికాలో ప్రతి సంవత్సరం 9 కోట్ల టన్నుల మొక్కజొన్న చొప్ప అందుబాటులో ఉంటుందని అంచనా. ఇది 300 కోట్ల గ్యాలన్ల నిజమైన సుస్థిర ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది. ఈ మొత్తం అమెరికా వైమానిక ఇంధన కాలుష్యాన్ని 75% తగ్గింపునకు దోహదపడుతుంది. అంతేకాకుండా, అమెరికా జెట్ ఇంధన అవసరతను 10 శాతం వరకూ తీరుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో మొక్కజొన్న ఇథనాల్ను జెట్ ఇంధనంగా మార్చుతున్నారు. ఈ పనికి స్వస్తి చెప్పటం ద్వారా ఆహార ధాన్యాలను ఇంధనానికి వాడటం మానుకోవచ్చు. దీని వలన కలిగే ప్రయోజనం కేవలం వాతావరణానికి మాత్రమే పరిమితం కాదు. మొక్కజొన్న చొప్ప ఇంధనోత్పత్తి అనేక ఉద్యోగాలను, ఇతర ఆర్థిక ప్రయోజనాలను సృష్టించగలదని నిపుణులు చెబుతున్నారు. డబ్ల్యూఆర్ఐ పరిశోధన ప్రకారం, సంవత్సరానికి 300 కోట్ల గ్యాలన్ల మొక్కజొన్న చొప్పతో వైమానిక ఇంధనం ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల 99 వేల నుంచి 2.14 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు. సంబంధిత ఆర్థిక కార్యకలా΄ాలు వేలాది కోట్ల డాలర్ల పన్ను రాబడి అదనంగా చేకూరుతుందని అంచనా.ప్రాథమిక దశలో పరిశోధనలుమొక్కజొన్న చొప్పను జెట్ ఇంధనంగా మార్చే సాంకేతికతలపై పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. సాంప్రదాయ జెట్ ఇంధనాలతో ధరల పరంగా ఈ ప్రత్యామ్నాయ ఇంధనం ఇంతకుముందు వరకు ΄ోటీపడలేక΄ోవడం కూడా ఇందుకు ఓ కారణం. కానీ ఇరాన్పై యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ సంఘర్షణల కారణంగా సాంప్రదాయ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ అంతరం తగ్గుతోంది. దీనివల్ల కొత్త రకాల విమానయాన ఇంధనోత్పత్తి రంగం పెట్టుబడిదారులకు, విమానయాన సంస్థలకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది.పరిశోధన, అభివృద్ధికి విధానపరమైన మద్దతు, విస్తరణ ప్రోత్సాహకాలు లేకుండా మొక్కజొన్న చొప్పతో ఇంధనం ఉత్పత్తి సాంకేతికతల అభివృద్ధి యజ్ఞం నెరవేరదు. డబ్ల్యూఆర్ఐ పరిశోధన ప్రకారం, అన్ని సమస్యలకు ఒకే పరిష్కారంగా పనిచేసే సాంకేతికత అంటూ ఏదీ లేదు. దానికి బదులుగా, ఏ సాంకేతికతలకు అత్యధిక సామర్థ్యం ఉందో అర్థం చేసుకోవడానికి, విభిన్న రకాల సాంకేతికతల పరిశోధన, అభివృద్ధికి విధానాల మద్దతు ఇవ్వాలి. మొక్కజొన్న చొప్ప అమెరికాలో అత్యంత సవృద్ధిగా లభించే వ్యవసాయ వ్యర్థం. చొప్ప ఆధారిత విమానయాన ఇంధనోత్పత్తి పరిశ్రమ మన ఇంధన భద్రతకు దోహదపడటంతో పాటు, విమానయాన ఉద్గారాలను తగ్గించి, మొక్కజొన్న ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యగలదని నిపుణులు భావిస్తున్నారు. (చదవండి: అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!)
అంతర్జాతీయం
ఎస్యూ–57 జెట్ను జట్టుగా తయారుచేద్దాం!
సెయింట్ పీటర్స్బర్గ్: చిరకాల మిత్రదేశం భారత్కు తమ శక్తివంతమైన అత్యాధునిక యుద్ధవిమానాలను సైతం ధారాదత్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. దీంతో భారత వైమానికదళం మరింత పటిష్టవంతమయ్యేందుకు పుతిన్ భారత్కు భారీ ఆఫర్ ఇచ్చారు. రష్యాలో రెండో అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్బర్గ్లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో భేటీలో పుతిన్ సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యా అభివృద్ధిచేసిన ఐదో తరం స్టెల్త్ రకం ‘ఎస్యూ 57’జెట్ను భారత్తో కలిసి దేశీయంగా మరింత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పుతిన్ వెల్లడించారు. ‘‘ఎస్యూ–57 రకం యుద్ధవిమానాన్ని మరింత అధునాతనంగా భారత్తో కలిసి, భారత్లో తీర్చిదిద్దేందుకు రష్యా సిద్ధంగా ఉంది. నిజానికి ఈ విమానాన్ని మేం సొంతంగా అభివృద్ధిచేశాం. కానీ ఇప్పుడు మిత్రదేశం భారత్లో తయారుచేసేందుకు ఆశపడుతున్నాం. ఈ విమానం విషయంలో ఎలాంటి షరతులు విధించదల్చుకోలేదు’’అని అన్నారు. ‘‘సమీకృత గగనతల రక్షణ వ్యవస్థల అభివృద్ధిలోనూ భారత్ను భాగస్వామిగా చేర్చుకోవాలని భావిస్తున్నాం. ఇతర యుద్ధరంగ ఉపకరణాల తయారీని సంయుక్తంగా ఆరంభిద్దాం. దీనిపై ఆలోచిస్తామని భారత్ గతంలోనే మాకు సమాచారం ఇచ్చింది’’అని పుతిన్ వెల్లడించారు. పుతిన్ ఆఫర్పై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ స్పందించారు. ‘‘రక్షణ రంగ సంబంధం అంశంలో మీకు అదనపు సమాచారం కావాలంటే రక్షణమంత్రిత్వ శాఖనే బదులు ఇవ్వగలదు’’అని ఆయన అన్నారు. భారత్ వైఖరేంటి? అంతర్జాతీయంగా మారిన రాజకీయ¿ౌగోళిక పరిస్థితులు, ఉక్రెయిన్, పశి్చమాసియా యుద్ధాలతో భారత్ రక్షణ ఉత్పత్తుల సరఫరాలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ముఖ్యంగా ఐదో తరం యుద్ధవిమానం కోసం వెతికి విసిగిపోయి చివరకు సొంతంగా తయారుచేయాలని నిశ్చయించుకుంది. ఇందులోభాగంగా ప్రతిష్టాత్మకంగా అత్యాధునిక బహుళార్థ యుద్ధవిమాన(ఏఎంసీఏ) ప్రాజెక్టుకు శ్రీకారంచుట్టింది. అయితే 2035లోపు ఈ విమానం అందుబాటులోకి వచ్చే అవకాశాలులేకపోవడంతో పుతిన్ ఆఫర్ను భారత్ అంగీకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భారత్–చైనా విషయంలో జోక్యం చేసుకోబోం ‘‘చైనా, భారత్ మధ్య సున్నితమైన ద్వైపాక్షిక సంబంధాల్లో రష్యా ఎన్నడూ జోక్యంచేసుకోలేదు. ఇకమీదటా కలగజేసుకోబోం. రెండు దేశాలతో రష్యా సంబంధాలు సహజమైనవి. సరిహద్దు అంశం సహా వివాదాస్పద అంశాలన్నింటినీ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నా. భారత్–రష్యా బంధం చైనాను ఇబ్బంది పెట్టదు. అలాగే రష్యా–చైనా బంధం భారత్ను ఇబ్బందిపెట్టదు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు విషయంపై చైనా, రష్యాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇక పాకిస్తాన్ అనేది చైనా కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకుంటోందని నేను భావించట్లేను’’అని అన్నారు. అలా చేస్తే అంతర్జాతీయ అస్థిరతే ‘‘భారత్–రష్యా బంధాన్ని తుంచేయాలని పశి్చమదేశాలు కుట్రలు పన్నుతున్నాయి. మా బంధం బలహీనమైతే అంతర్జాతీయ అస్థిరతకు దారితీస్తుంది. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైంది. భారత్తో రష్యా బంధం మరింత బలోపేతానికి కృషిచేస్తున్నాం. ప్రస్తుతమున్న 60 బిలియన్ డాలర్ల వాణిజ్యబంధాన్ని త్వరలో 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వాణిజ్యం, పెట్టుబడులు సహా ఇంధనం, ఫార్మాసూటికల్స్, హైడ్రోకార్భన్ల వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవాల్సిఉంది. చక్కటి ఆర్థికాభివృద్ధి సాధిస్తూ భారత్ ప్రపంచంలోని మేటి ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా రాణిస్తోంది. ఈ ప్రగతి ఒక్క రోజులో వచ్చిందికాదు. మోదీ నాయకత్వంలో ఎంతో శ్రమతో భారత్ అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. మా రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే దేశాలే చావుదెబ్బ తింటాయి’’అని పరోక్షంగా అమెరికాకు చురకలంటించారు. ‘‘ప్రధాని మోదీపై కొందరు(అమెరికా) ఒత్తిడిచేస్తున్నారు. ఎవరు ఒత్తిడి చేస్తున్నారనేది అనవసరం. మా దేశాల మధ్య సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి. భారత్ మాకు విశ్వసనీయమైన వ్యూహాత్మక భాగస్వామి’’అని పుతిన్ ఉద్ఘాటించారు.దేవుడికే తెలుసు 2036 ఏడాదిదాకా మీరే అధ్యక్షపీఠంపై కొనసాగుతారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ తనదైన రీతిలో బదులిచ్చారు. నాకు 73 ఏళ్లు. 1999 నుంచి అధికారంలో ఉంటున్నాను. వచ్చే అధ్యక్ష ఎన్నికలపై నాకు ఎలాంటి ఆలోచన లేదు. అప్పటిదాకా ఏమాత్రం ఆరోగ్యంగా ఉంటానో ఆ దేవునికే తెలియాలి. ఇవాళ ఇక్కడ కూర్చున్న మనందరం రేపు, ఎల్లుండి, ఆ తర్వాతి రోజులకు కూడా చేయాల్సిన విధులను నిర్వర్తిస్తామో లేదో ఎవరికీ తెలీదు’’అని పుతిన్ వ్యాఖ్యానించారు. పుతిన్ తొలిసారిగా 1999లో ప్రధాని అయ్యారు. తర్వాత అధ్యక్షునిగా, ఆ తర్వాత ప్రధానిగా పనిచేశారు. మళ్లీ అధ్యక్షపీఠాన్ని అధిరోహించారు.
భారత్పై మరోసారి ట్రంప్ అక్కసు...
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి భారత్పై అక్కసు వెల్లగక్కారు. చాలా కాలంగా భారత్, అమెరికాపై అధిక సుంకాలు విధించి భారీగా లాభాలు పొందిందందన్నారు. ఇప్పుడు ఆ పని అమెరికా చేస్తుందన్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దీర్ఘకాలంగా ఉన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా, 2026 ఫిబ్రవరిలో భారత్, అమెరికా దేశాల మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ఇటీవలే న్యూఢిల్లీలో అమెరికా బృందం పర్యటించింది. భారత ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు దాదాపు ఫైనల్ అయ్యాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితులు నడుమ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.ట్రంప్ మాట్లాడుతూ" ఇంతకాలం భారత్, అమెరికాపై అధిక పన్నులు విధించి లాభపడింది. ఇప్పుడు అది మావంతు. అమెరికా, భారత్ మధ్య త్వరలోనే ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరవచ్చు. ఎందుకంటే "నాకు మోదీ అంటే చాలా ఇష్టం. మోదీ నాకు చాలా మంచి స్నేహితుడు. మా మధ్య మంచి సంబంధం ఉంది, మేము ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటాము."అని అన్నారు.కాగా బలవంతపు కార్మిక వ్యవస్థను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న కొన్ని దేశాలపై అదనపు దిగుమతి సుంకాలను (టారిఫ్లను) విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత జాబితాలో భారతదేశం కూడా ఉంది. దీనిని అమలు చేస్తే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై అదనంగా 12.5% సుంకం విధించబడవచ్చు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. దీంతో ఎగుమతులు ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది.
ఆయతుల్లా ఖమేనీ చివరి క్షణాల్లో ఏం జరిగింది..?
టెహ్రాన్: ఆయతుల్లా ఆలీ ఖమేనీ మృతి ప్రపంచాన్ని ఎంత దిగ్భ్రాంతికి గురిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఆయన మృతిచెందడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దాడికి ముందు ఖమేనీ గడిపిన క్షణాల గురించి ఆ దేశ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తొలిసారిగా బహిరంగంగా పంచుకున్నారు.ఇరాన్- అమెరికా యుద్ధం మెుదలయి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. అయినా ఈ యుద్ధం ముగింపు అంశంలో ఎటువంటి స్పష్టత లేదు. ఇన్ని రోజుల ఈ యుద్ధంలో అత్యంత భయానక అంశం ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి చేసి చంపడం.. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. అయితే ఆ సందర్భంలో ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ దాడి చేసిన ప్రాంతంలోనే ఉన్నానని తెలిపారు.ఈ రోజు (శుక్రవారం) అబ్బాస్ అరాగ్చీ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. "ఇరాన్పై దాడులు ప్రారంభం అయ్యాక.. సుప్రీం లీడర్ని సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని కోరాం. దానికి ఆయన నిరాకరించారు. ఇరాన్ ప్రజలందరికీ సురక్షితమైన ప్రదేశానికి ప్రవేశం లభించేంత వరకు తాను ఎటువంటి ఆశ్రయానికి గానీ, సురక్షిత ప్రాంతానికి గానీ వెళ్ళనన్నారు... నా ప్రజలకు ఏది జరిగినా, అది నాకు కూడా జరుగుతుంది ," అని ఖమేనీ అన్నట్లు అరాఘ్చి తెలిపారు.సుప్రీం లీడర్పై దాడి జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే ఉన్నానని ఆ దాడిలో ఆయనకు ఏమయిందా అని కలవర పడ్డానని తెలిపారు. అయితే దాడులకు ఇరాన్ ఇచ్చిన ప్రతీకారం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఎంతో కలవరపాటుకు గురిచేసిందన్నారు. అదే విధంగా ఇరాన్ పొరుగు దేశాల్లో అమెరికా స్థావరాలు లేకపోయి ఉంటే వాటిపై దాడులు జరిగేవి కావన్నారు. పస్తుతం సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సర్వాధికారాలు కలిగి ఉన్నారని కొత్త సుప్రీం లీడర్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతన్నామన్నారు. అతని ఆదేశాలను యుథాతధంగా అమలు చేస్తున్నామన్నామన్నారు. ఆయుతుల్లా ఖమేనీకి ఏలాంటి గౌరవం దక్కేదో ఇతనికీ అదే విధమైన గౌరవం దక్కుతుందన్నారు.
సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
వాషింగ్టన్: ఇమ్మిగ్రేషన్, సరిహద్దు నియంత్రణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. దాదాపు 70 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్తో బిల్లు రూపకల్పన చేశారు. అయితే, బిల్లుపై డెమొక్రాట్లు,రిపబ్లికన్ల మధ్య తీవ్ర స్థాయిలో పొలిటికల్ డ్రామా నడిచింది. ట్రంప్ వివాదాస్పద నిధులపై ప్రతిపక్షాలు వేసిన సవరణలను వీటో చేస్తూ అధికార రిపబ్లికన్ పార్టీ బిల్లును నెగ్గించుకుంది. సరిహద్దుల్లో నిఘూ పటిష్టం, అక్రమ వలససలను అడ్డుకోవడమే బిల్లు ముఖ్యఉద్దేశమని ట్రంప్ తెలిపారు.
జాతీయం
లండన్లో భారత ప్రధాన న్యాయమూర్తికి చేదు అనుభవం
లండన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కి లండన్లో చేదు అనుభవం ఎదురైంది. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఆయనను ఇబ్బందికరంగా ప్రశ్నలు అడిగారు. ఇటీవల ఆయన చేసిన బొద్దింక వ్యాఖ్యలపై ప్రశ్నలు సందించారు. దీంతో న్యాయమూర్తి నిరసనల మధ్యే ప్రసంగం పూర్తి చేశారు.జూన్ 4న లండన్లోని బిర్క్బెక్ కాలేజీలో సీజేఐ సూర్యకాంత్ కృత్రిమ మేధస్సు , అంతర్జాతీయ చట్టం అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. అయితే అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కొంతమంది వ్యక్తులు జస్టిస్ సూర్యకాంత్ ఇబ్బంది పడే విధంగా ప్రశ్నలు సందించారు. భారత్లో అసమ్మతిని అణచివేస్తున్నారనే ఆరోపణలపై ప్రశ్నలు లేవనెత్తారు. అంతేకాకుండా ఇటీవల భారత్లో ఎంతో సంచలనమైన కాక్రోచ్ 'బొద్దింక' వ్యాఖ్యపై సైతం న్యాయమూర్తిని ప్రశ్నించే యత్నంచేశారు. దీంతో జస్టిస్ సూర్యకాంత్ ఒకింత అసౌకర్యానికి లోనయ్యారు. నిర్వాహకులు ఆ ప్రశ్నలు అంశం పరిధిలోకి రావని చెబుతూ మధ్యలోనే నిలిపివేశారు. చివరికి నిరసనల మధ్యే ఈ కార్యక్రమం పూర్తి చేశారు.అయితే దీనిపై లండన్లోని భారత హైకమిషన్ తీవ్రంగా స్పందించింది. ఎక్స్ ఖాతాలో దీనిపై ప్రకటన విడుదల చేసింది." జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నోత్తరాల సమయంలో అరుపులు అమర్యాదకరం. ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఇది గౌరవప్రదమైన సంభాషణకు విరుద్ధం ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే గౌరవప్రదమైన రీతిలో వ్యక్తం చేయాలి" అని హై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన బొద్దింక వ్యాఖ్యలు ఇటీవల దేశంలో పెద్ద దుమారాన్నే రేపిన సంగతి తెలిసిందే.
బుడ్డోడి మ్యాజిక్కి ఆనంద్ మహీంద్ర ఫిదా! వైరల్ వీడియో
పారిశ్రామికవేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా మరోసారి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించారు. నిత్యం అనేక ఇన్సిపిరేషనల్ కథనాలు, టాలెంట్ వీడియోలు, విజ్ఞానాత్మక కథనాలను పంచుకుంటూ ఉండటం ఆయనకు బాగా ఆలవాటు. అంతేకాదు అర్హులైన వారికి చేయూత నందించడం కూడా పరిపాటి. ఆయన తాజాగా ఆయన షేర్ చేసిన మట్టిలోమాణిక్యంలాంటి వీడియో ఆసక్తికరంగా మారింది.ఉత్తరాఖండ్లోని అందమైన నైనిటాల్ పట్టణ వీధుల్లో గారడీ చేసే ఓ చిన్నారి ఇంద్రజాలికుడి వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. చిన్నారి టాలెంట్కు ఫిదా అయిపోయారు. బోలెడు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు అద్భుతమైన ప్రతిభకు ముగ్ధుడైనమహీంద్రా ఆర్థికంగా అండగా నిలుస్తానని ప్రకటించి మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నారు.ఆ వైరల్ వీడియోలో విశేషం ఏమిటంటే నైనిటాల్లోని ఒక మార్గంలో సాహిల్ అనే బాలుడు వరుసగా వీధుల్లోఅద్భుతమైన మ్యాజిక్ విన్యాసాలు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. తన చేతిలోని కొన్ని లోహపు కప్పులు, చిన్న ఎర్రటి బంతులతో అతడు చేసే ఇంద్రజాలం చూస్తే ఎవరైనా వారెవ్వా అనాల్సిందే. కేవలం రెండు స్టీల్ గిన్నెలు, చిన్న బాల్స్ సాయంతో తన చిట్టి చేతులతో అద్భుతమైన వేగంతో కప్పులను అటూ ఇటూ కదుపుతూ అద్భుత నైపుణ్యంతో కనికట్టు చేస్తున్నాడు. అసలా బంతి ఏ గిన్నె కిందినుంచి అలా అలా మాయమై, ఎలా ప్రత్యక్షమవుతుందో అర్థంకాక ఆశ్చర్య చకితులవుతారు.Yeh ladka bahut talented hai. Kya woh abhi bhi Nainital ki sadkon par kaam kar raha hai? Main na sirf uski padhai mein madad karna chahta hoon, balki jaadu mein uski dilchaspi ko bhi badhava dena chahta hoon. Kyon na woh duniya ke behtareen jaadugaron mein se ek bane? Kya… pic.twitter.com/lju2LokTBj— anand mahindra (@anandmahindra) June 5, 2026 ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడుఆనంద్ మహీంద్రా కూడా అదే అనుభూతికి లోనయ్యారు. ‘‘ఈ కుర్రాడు ఓ అద్భుతమైన ప్రతిభావంతుడు. అతను ఇప్పటికీ నైనిటాల్ వీధుల్లో ఇలాగే ప్రదర్శనలు ఇస్తున్నాడా? ఈ బాలుడికి ఉన్నత చదువులు చెప్పించడంతోపాటు, మ్యాజిక్పై అతని ఆసక్తిని ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. సరైన మార్గదర్శకత్వం, అవకాశాలు లభిస్తే ఈ బాలుడు ప్రపంచంలోని అత్యుత్తమ ఇంద్రజాలికులలో ఒకడిగా ఎదుగుతాడు’’ అంటూ ఈ చిన్నారి గురించి లేదా అతని తల్లిదండ్రుల గురించి ఏమైనా సమాచారం తెలిస్తే , వారితో మాట్లాడటానికి, వారికి సాయం చేసేందుకు తనకు సహాయం చేయాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.నెటిజన్లు స్పందనమహీంద్రా చొరవను మంచి మనసును నెటిజన్లు ప్రశంసించారు. ఆ బాలుడిని గుర్తించి, అతని చదువుకు సాయం చేయడానికి మహీంద్రా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. సాహిల్ ,అతని కుటుంబం ఆచూకీ తెలుసుకోవడంలో సహాయపడటానికి కూడా పలువురు ముందుకు వచ్చారు.ఇదీ చదవండి: రూ.15 వేల కోట్ల లగ్జరీ రిసార్ట్ : ట్రంప్కి భారీ ఝలక్
ఢిల్లీ అగ్నిప్రమాదం: కుక్ నిర్లక్ష్యమే కొంపముంచిందా?
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలోని మాలవీయ నగర్ ‘ఫ్లరిష్ ఇన్’ హోటల్లో 21 మందిని బలితీసుకున్న అగ్నిప్రమాదం కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ వంటవాడు (కుక్) కేశవ్ నేగిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇతని నిర్లక్ష్యం కారణంగానే మంటలు వేగంగా వ్యాపించడమే కాకుండా, హోటల్లోని ఎలక్ట్రానిక్ తలుపులు లాక్ అయిపోయి, పెను విషాదానికి దారితీసిందని పోలీసు వర్గాల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.ఒకే ఒక్క స్విచ్ కారణంగా..పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కిచెన్లో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన కుక్ కేశవ్ నేగి, హోటల్ మెయిన్ పవర్ స్విచ్ (ఎలక్ట్రిసిటీ సప్లై)ను పూర్తిగా ఆఫ్ చేసి, దట్టమైన పొగల మధ్య నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పారిపోయాడు. ఆయన తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే హోటల్లో ఉన్నవారికి మృత్యుపాశంగా మారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్లోని సెన్సార్ ఆధారిత ఎలక్ట్రానిక్ తలుపులన్నీ జామ్ అయిపోయాయి. లోపల ఉన్న బాధితులు బయటకు వచ్చే మార్గం లేక లోపలే చిక్కుకుపోయారు.బాత్రూమ్లోనే భార్యాభర్తల సజీవ దహనంఈ ప్రమాదంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు వెలుగుచూశాయి. పవర్ కట్ కావడంతో తలుపులు తెరుచుకోక, దట్టమైన పొగలు హోటల్ అంతటా కమ్మేశాయి. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ పాయింట్ ఉండటం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి (సీల్డ్) ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకోలేక విలవిలలాడారు. ఓ జంట (భార్యాభర్తలు) ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్రూమ్లోకి వెళ్లగా, అక్కడ కూడా డోర్ లాక్ అయిపోయింది. బయటకు రాలేక, ఊపిరాడక వారు అక్కడికక్కడే మరణించారు. నేగి చేసిన నిర్లక్ష్యపు పనే ఇంతమంది ప్రాణాలు గాల్లో కలవడానికి ప్రధాన కారణమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు.ముమ్మరంగా సాగుతున్న పోలీసు విచారణఅగ్ని ప్రమాదం జరిగిన ఐదు అంతస్తుల ఈ ఇరుకైన భవనంలో మొత్తం 22 గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ నడుస్తుండగా, బేస్మెంట్, పై అంతస్తులను హోటల్గా ఉపయోగిస్తున్నారు. హోటల్ యజమాని లవకేష్ బజాజ్ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేయగా, తాజాగా కుక్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయడానికి హోటల్ సిబ్బందిని, ఇతర నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు.
అందరూ ప్రేమకథే చూశారు.. అసలు కథ వేరే ఉంది!
భారత సైన్యానికి చెందిన కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన కాబోయే భార్య ఆరోషికి యూనిఫామ్లో.. అదీ ఆర్మీ హెలికాప్టర్లో ప్రపోజ్ చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధుల్లో ఉండగా ఇవేం పనులంటూ ఆర్మీ అధికారులతో సహా కొందరు దీనిని ఖండించారు. మాజీల్లో కొందరు మాత్రం ‘ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు?’ భరద్వాజ్కు సపోర్ట్ చేశారు. అయితే ఆ రొమాంటిక్ దృశ్యం వెనుక.. అత్యంత కీలకమైన ఓ అంశాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.కెప్టెన్ భరత్ భరద్వాజ్ భారత సైన్యంలో యంగ్ ఆర్మీ ఏవియేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న అధికారి. ఇటీవలే హెలికాప్టర్ పైలట్గా శిక్షణ పూర్తి చేసి యూనిఫామ్లో ఫ్రంట్లైన్ సర్వీస్కు సిద్ధమయ్యాడు. అతని కాబోయే భార్య ఆరోషి, సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉండగా, అధికారిక శిక్షణ పూర్తి అయిన సందర్భంలో భరద్వాజ్ చేసిన ఈ ప్రత్యేక ప్రపోజల్ క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యువ వయసులో ఉన్న ఈ జంటకు సంబంధించిన ఈ రొమాంటిక్ ఘటన ఒకవైపు చర్చనీయాంశంగా మారితే, మరోవైపు యూనిఫామ్లో వ్యక్తిగత జీవితం ఎంతవరకు సమంజసం అన్న డిబేట్కు కూడా దారితీసింది.భరద్వాజ్ ప్రపోజల్ కోసం ఉపయోగించిన హెలికాప్టర్ ‘చీతా’. గత 50 ఏళ్లుగా భారత సైన్యం దాని మీదే ఆధారపడి ఉంటోంది. ఫ్రాన్స్కు చెందిన ఏరోస్పటియల్ సంస్థ డిజైన్ చేసిన ఈ హెలికాప్టర్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 1970ల నుంచి భారత్లో తయారు చేస్తోంది. సియాచిన్ వంటి అత్యంత ఎత్తైన, క్లిష్టమైన ప్రాంతాల్లో సైనిక రవాణా, గాయపడిన వారిని తరలించడం, సరఫరాలు అందించడం వంటి కీలక బాధ్యతలను ఇది నిర్వర్తిస్తోంది. కానీ దీని భద్రతపై చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.1974 నుంచి 2022 మధ్య కాలంలో చీతా హెలికాప్టర్లు 60కి పైగా ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మొన్న.. మే 20న లడఖ్లోని టాంగ్స్టే ప్రాంతంలో మరో చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో ఉన్న ముగ్గురు సైనిక అధికారులు ప్రాణాపాయం నుంచి బయటపడినా.. ఇప్పుడు ఈ ప్రేమకథ పుణ్యమాని ప్రమాదాల పరంపరను మరోసారి కొందరు చర్చకు తీసుకొచ్చారు. అలాగని చీతా మాత్రమే కాదు, దాని సోదర మోడల్ ‘చేతక్’ హెలికాప్టర్ కూడా ప్రమాదాల పరంగా చెడు రికార్డే కలిగి ఉంది. ఆర్మీ వైవ్స్ అజిటేషన్ గ్రూప్ (AWAG) వివరాల ప్రకారం, గత కొన్ని దశాబ్దాల్లో చీతా-చేతక్ హెలికాప్టర్లకు సంబంధించిన దాదాపు 191 ప్రమాదాల్లో 294 మంది పైలట్లు మరణించారు. ఈ కారణంగానే వీటిని కొందరు “ఫ్లయింగ్ కాఫిన్స్” (ఎగిరే శవపేటికలు)గా కూడా అభివర్ణించారు.వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే ఆధునిక సాంకేతికత, నావిగేషన్ వ్యవస్థలు లేకపోవడం వల్లే అనేక ప్రమాదాలు జరిగాయని మాజీ వైమానిక దళ అధికారి ఎయిర్ మార్షల్ జీఎస్ బేడీ అభిప్రాయపడ్డారు. దీంతో 2027 నుంచి చీతా, చేతక్ హెలికాప్టర్లను దశలవారీగా సేవల నుంచి తప్పించాలని సైన్యం, వైమానిక దళం నిర్ణయించాయి. వాటి స్థానంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (LUH)ను తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినా, సర్టిఫికేషన్ వివాదాలు, సాంకేతిక అడ్డంకుల కారణంగా ఆ ప్రాజెక్టు ప్రస్తుతం నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఒకవైపు వైరల్ ప్రపోజల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే.. మరోవైపు అదే హెలికాప్టర్లో ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలు మాత్రం ఆధునిక ప్రత్యామ్నాయాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నాయి. సియాచిన్ నుంచి లడఖ్ వరకు ఎన్నో విజయవంతమైన మిషన్లకు చీతా సాక్ష్యమైనా, దాని వయసు మీద పడడం, ప్రమాదాల చరిత్ర ఇప్పుడు భారత సైన్యానికి పెద్ద సవాలుగా మారింది.
ఎన్ఆర్ఐ
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ఎన్నారై రాపోలు నందు..!
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేసూ్తనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా..నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం..కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేసూ్తనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది.– రాపోలు నందు, సింగపూర్
అమెరికా యూ టర్న్ : వారికి భారీ ఊరట
అమెరికాలోని భారతీయుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్న వేళ గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) కోసం దరఖాస్తు చేసుకునే హెచ్-1బి (H-1B) వీసాదారులకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) భారీ ఊరట నిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన (ప్రాసెసింగ్) జరిగే సమయంలో అత్యధిక శాతం మంది వలసదారులు అమెరికాలోనే కొనసాగవచ్చని, వారు దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని DHS స్పష్టం చేసింది.గ్రీన్కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు, వారి దరఖాస్తులు ప్రాసెస్ అవుతున్నప్పుడు అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేద నిడీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఇటీవలి ప్రకటనపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో విధానంలో ఎలాంటి పెద్ద మార్పు జరగలేదని స్పష్టత వచ్చింది. దీని ప్రకారం గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అత్యధిక శాతం మంది వలసదారులు తమ దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యే వరకు అమెరికాలోనే సురక్షితంగా ఉండవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యందరఖాస్తుదారుడు అమెరికా వెలుపల ఉండి ప్రక్రియను పూర్తి చేయాలా లేదా అనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ విచక్షణాధికారాల (case-by-case basis) ప్రకారం చాలా కాలంగా నిర్ణయిస్తున్నారు. తాజా మార్గదర్శకాలు కేవలం ఆ పాత అధికారాలను గుర్తుచేసేవే తప్ప కొత్త నిబంధనలు కావనిడీహెచ్ఎస్ ప్రతినిధి తెలిపారు.కాగా యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) చేసిన ఒక ప్రకటన వల్ల దరఖాస్తు దారులలో తీవ్ర గందరగోళం నెలకొంది. అసాధారణ మినహాయింపులంటే తప్ప, వారు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి అక్కడి నుంచే గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉండాలంటూ వెలువడిన వార్త తీవ్ర ఆందోళన రేపింది.
సౌదీ నుంచి సజీవంగా వస్తాడనుకోలేదు..!
రెండు దశాబ్దాల ఆ తల్లి నిరీక్షణకు తెరపడింది. కోట్ల రూపాయల ‘బ్లడ్ మనీ’.. దీర్ఘకాల న్యాయపోరాటం, అంతర్జాతీయ స్థాయిలో సాగిన చర్చల అనంతరం అబ్దుల్ రహీమ్ చివరికి స్వదేశానికి చేరాడు. అదీ ఈద్ అల్ అదా రోజున!. ఇంకేం కోజికోడ్ విమానాశ్రయంలో ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు అల్లా సమాధానం ఇచ్చాడు” అంటూ తల్లి ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని కదిలించాయి.కేరళలోని కోజికోడ్ జిల్లా ఫెరోక్కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఆయన డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో, ఆయన సంరక్షణలో ఉన్న ఓ ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారి మరణించిన ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సౌదీ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. ఆ చిన్నారి సౌదీ వ్యాపారవేత్త అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి కొడుకు. ఆ బాలుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, వైద్య సహాయక పరికరాలపై ఆధారపడి చికిత్స పొందుతున్నాడు. ఒక సందర్భంలో ఆ చిన్నారికి అమర్చిన వైద్య సహాయక పరికరాన్ని రహీమ్ అనుకోకుండా తాకాడు. దీంతో అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.తాను కావాలని చేయలేదని రహీమ్ చెప్పినా కోర్టులు వినలేదు. ఈ ఘటనపై సౌదీ కోర్టు విచారణ జరిపి 2012లో ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు తర్వాత కేసు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కొడుకు మీద ఆశలు వదిలేసుకున్న టైంలో.. దగ్గరి బంధువు ద్వారా బ్లడ్ మనీ గురించి తెలుసుకుంది రహీమ్ తల్లి ఫాతిమా. కొందరు అధికారులు, మత పెద్దలు ద్వారా కొడుకు విడుదల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా నెలల తరబడి చర్చల తర్వాత.. రహీమ్కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి బ్లడ్మనీకి అంగీకరించింది. కేరళలో పెద్ద ఎత్తున మానవతా సహాయ ప్రచారం ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు, వ్యాపారులు, విద్యార్థులు కలిసి నిధులు సేకరించారు. మొత్తం సుమారు రూ.47 కోట్లు సమీకరించగా, అందులో రూ.34 కోట్లు ‘బ్లడ్ మనీ’గా బాధిత కుటుంబానికి చెల్లించారు. అనంతరం బాధిత కుటుంబం క్షమాభిక్ష ఇవ్వడంతో 2014లో మరణశిక్ష రద్దయింది. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.సౌదీ చట్టాల ప్రకారం పబ్లిక్ రైట్స్ కింద ఆయనకు అప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. దీంతో.. ఆ శిక్ష పూర్తయ్యేదాకా ఆయన ఆగాల్సి వచ్చింది. ఇటీవల ఆ శిక్షపూర్తి కావడంతో రహీమ్ విడుదల అయ్యాడు. ఈద్ పండుగ రోజున ఆయన కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, వందలాది మంది కుటుంబ సభ్యులు, మద్దతుదారులు అక్కడికి వచ్చి ఘన స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆ క్షణం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.ఇంటివద్ద కూడా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తల్లి ఫాతిమా కన్నీళ్లతో కుమారుడిని ఆలింగనం చేసుకుని, “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు ఈ రోజు సమాధానం లభించింది” అని చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. భారత రాయబార కార్యాలయం, లీగల్ కమిటీ సహకారంతో అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసి ఆయన స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఘటన కేరళలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మలయాళీ సమాజంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.నిమిషా ప్రియా పరిస్థితి?రహీమ్ ఘటన నేపథ్యంలో.. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియా కేసు కూడా కొనసాగుతోంది. 2017లో ఓ యెమెన్ పౌరుడి మరణ ఘటనలో ఆమెపై కేసు నమోదై కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘాలు, భారత ప్రభుత్వ వర్గాలు కలిసి ఆమె శిక్షను నిలిపివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ‘బ్లడ్ మనీ’ ద్వారా క్షమాభిక్ష సాధించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, కేసు ఇంకా తుది దశకు చేరలేదు.
అమెరికా 'స్పెల్లింగ్ బీ' విజేతగా భారత సంతతి విద్యార్థి
అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి శ్రేయో పారిఖ్ విజేతగా నిలిచాడు. కాలిఫోర్నియాలోని రాంచో కుకామోంగాకు చెందిన ఈ 14 ఏళ్ల బాలుడు, గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో తన అపార ప్రతిభ ప్రదర్శనతో టైటిల్ను కైవసం చేసుకున్నాడు. శ్రేయ్ మొత్తం 90-సెకన్ల స్పెల్-ఆఫ్ రౌండ్లో అంచనాలకు తగ్గట్టుగా మొత్తం 32 పదాలను సరిగ్గా పలికి విజయం దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సుమారు రూ. 48 లక్షల నగదు, పతకం, స్క్రిప్స్ కప్, మెరియం వెబ్స్టర్ నుంచి రూ. 24 లక్షల నగదుర, డెల్టా నుంచి రూ. 96 వేలు విలువ చేసే ఫ్లైట్ క్రెడిట్లు, ఎన్సైక్లోపిడియా బ్రిటానికా నుంచి రూ. 38 వేలు విలువ చేసే వర్క్స్ శ్రేయ్కు లభించనున్నాయి. గతంలో 2024 పోటీల్లో మూడోస్థానంలో నిలవడగా..తాజా పోటీల్లో విజేతగా నిలిచి ట్రోపీ దక్కించుకున్నాడు. ఇక శ్రేయ్కు టెన్నిస్, రీడింగ్, గణితం, చెస్ వంటివి అతడి అభిరుచులు. చివరగా తనకు ఎక్కువగా భారత్లోని తాతయ్య నానమ్మల వద్ద గడపడం అంటే మహా ఇష్టం అని చెబుతున్నాడు. (చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)
క్రైమ్
ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం కబళించింది. అంత్యక్రియలు, అస్థికల నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం బారినపడింది. దీంతో ఆ కుటుంబంలోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.పంజాబ్లోని ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిపై ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జలాలాబాద్కు చెందిన ఓ కుటుంబంలో ఇంటి పెద్ద(మహిళ) మరణించింది. దీంతో అంత్యక్రియలు, అనంతర కర్మలు పూర్తి చేసుకుని ఆ కుటుంబం పికప్ వాహనంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 28 మంది వాహనంలో ఉన్నట్లు సమాచారం.గత అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనం ఫిరోజ్పూర్-ఫజిల్కా మార్గంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకర కొండ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్తో కొట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పికప్ వాహనం అధిక వేగంతో వెళ్తుండటంతో డ్రైవర్ మలుపు వద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైలర్ను తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఢీకొట్టిన తీవ్రతకు పికప్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని ఫరీద్కోట్లోని ప్రత్యేక వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగం, ఇరుకు రహదారి, ప్రమాదకర మలుపు కలిసి ప్రమాదానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిలోని ఈ భాగం చాలా కాలంగా ప్రమాదాల కేంద్రంగా మారిందని, రహదారి విస్తరణ చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#BREAKING SEVEN TO NINE killed and 15 injured in Ferozepur, Punjab, when a truck collided with a jeep carrying a family to immerse ashes. SSP Bhupinder Singh confirmed. #Punjab #Ferozepur #RoadAccident @PunjabPoliceInd https://t.co/3CbYUL1g3A pic.twitter.com/k8W1AxtjUP— jarvis ☠️ (@Vishii14) June 6, 2026
బుర్ఖాలో వచ్చాడు.. నడకతో దొరికిపోయాడు
స్నేహితుడి మెడలో ఐదు తులాల బంగారంపై కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని నెలల తరబడి ఎదురు చూశాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి ఏం చేయాలి.. ఎలా తప్పించుకోవాలి అని స్కెచ్ గీశాడు. ప్లాన్ అమలు చేసే టైంలో.. కంగారుపడడంతో ఊహించనిది జరిగింది. అయినా బెదరలేదు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. చివరకు.. సీసీటీవీలో దొరికిన ఒక చిన్న క్లూ చివరకు అతడిని కటకటాల వెనక్కి నెట్టింది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ప్రకాశ్ చంద్ర గుప్తా కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనికి మోహిత్ ద్వివేది అనే వ్యక్తితో 18 ఏళ్ల స్నేహం ఉంది. అయితే ఆ స్నేహానికే చివరికి డబ్బు, బంగారం చిచ్చుపెట్టాయి. ప్రకాశ్ ధరించే సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు గొలుసుపై మోహిత్ కన్నేశాడు. దానిని ఎలాగైనా దోచుకోవాలని నిర్ణయించుకున్న అతడు ముందుగానే పథకం రచించాడు.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న మే 31 రాత్రి ప్రకాశ్ తన కోచింగ్ సెంటర్లోనే ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బుర్ఖా ధరించడంతో పాటు మహిళలు ఉపయోగించే ఆభరణాలు, చెప్పులు కూడా వేసుకున్నాడు. అనంతరం కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించి ప్రకాశ్పై దాడికి దిగాడు. బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నంలో ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది.ఈ క్రమంలో ప్రకాశ్ను బలంగా తోసేయడంతో అతడు నేలపై పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మోహిత్ బంగారు గొలుసుతో పాటు మరో బంగారు బ్రాస్లెట్ను కూడా తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం ప్రకాశ్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని రక్తపు మడుగులో గుర్తించారు. తొలుత పోలీసులు ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్ల మరణించి ఉండొచ్చని భావించారు. అయితే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఒక చోట ఒకరు బుర్ఖాలో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ మనిషి నడక మాత్రం తేడాగా కనిపించింది. దీంతో బుర్ఖాలో ఉంది మహిళ కాదేమోనని అనుమానపడ్డారు. అలాగే.. అక్కడి నుంచి సుమారు 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ ఆ ముసుగు వ్యక్తి కదలికలను ట్రాక్ చేశారు. చివరకు ఒక కారులో.. బుర్ఖా మార్చుకుంటూ ఆ వ్యక్తి బయటపడ్డాడు. అది మోహిత్ అని గుర్తించి షాక్ తిన్నారు.పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన మోహిత్.. హత్య తర్వాత కూడా ఎలాంటి అనుమానం రాకుండా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు వెల్లడైంది. అంతేకాకుండా నేరం జరిగిన మరుసటి రోజే ఓ పోటీ పరీక్షకు హాజరై, తర్వాత లక్నోకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనతో ప్రకాశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. "18 ఏళ్ల స్నేహాన్ని డబ్బు కోసం బలి చేశాడు. ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఊహించలేదు" అని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
రహస్య గదులు.. స్పా ముసుగులో వ్యభిచారం..!
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమ స్పా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) సమన్వయంతో కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లలో విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న 46 సెంటర్ల నిర్వాహకులు, మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆయా సెంటర్లు ప్రధానంగా అనుమతులు లేకపోవడం, రహస్య గదుల ఏర్పాటు, గుర్తింపు కార్డులు సేకరించకపోవడం, నేమ్బోర్డులు ప్రదర్శించకపోవడం, రికార్డుల నిర్వహణ లోపం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు కమిషనర్ బి. సుమతి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), వ్యభిచార నిరోధక చట్టం (ఐటీపీఏ) ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భవన యజమానులు తమ ప్రాంగణాలను స్పా నిర్వహణకు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలను పూర్తిగా సరిచూసుకోవాలని, అక్రమ కార్యకలాపాలకు తావిస్తే యజమానులపై కూడా చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. #Hyderabad:Major crackdown on #spacentres in #Malkajgiri#Police inspected 113 spa centres and booked 46 cases for violations including #hiddenrooms without #transparentdoors, failure to collect #customerIDproofs, lack of permissions and poor record maintenance.Cases have… pic.twitter.com/yz44plNGKq— NewsMeter (@NewsMeter_In) June 5, 2026
మీనాకుమారి పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో నమోదైన ‘బాలికలకు వల’ కేసులో నిందితురాలు మీనాకుమారి మేజిస్ట్రేట్ ఎదుట ఒకలా.. ఇక్కడి పిటిషన్లో మరోలా విరుద్ధ ప్రకటనలు చేయడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది. రిమాండ్ సమయంలో ఎలాంటి వేధింపులు జరగలేదని చెప్పిన ఆమె.. అనంతరం తనను వేధింపులకు గురిచేశారని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఆమె కోరిన విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుగానీ, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్లో కోరిన ఉపశమనాల మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించలేదంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఇన్స్ట్రాగామ్ ద్వారా మైనర్ బాలికలను వలలో వేసుకుని, వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడంతో పాటు లక్షలో డబ్బు దోచుకున్నారన్న ఆరోపణలపై చంద్రశేఖర్ ఆజాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత అతని తల్లి మీనాకుమారితో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తను పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారని, సిట్ , సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ నిందితురాలు మీనాకుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేసి పిటిషనర్ను అక్రమంగా నిర్బంధించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ఈ ఘటనపై సిట్ ఏర్పాటుతో పాటు రూ.50 లక్షల పరిహారం మంజూరు చేయాలని, సంబంధిత పోలీసు స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్ వివరాలను భద్రపరచాలని కోరారు. హోం జీపీ మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ.. మే 5న రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరైన పిటిషనర్, పోలీసులు తనను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని, కోర్టు ముందు ఉన్న రికార్డులు ఆమె వాదనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీడియోలు
మహిళలపై కక్ష కట్టిన బాబు, పవన్ కళ్యాణ్
నందూస్ అక్రమాలపై జైపాల్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
పాపం రా బుడోడా అభిషేకే కే ఎసరు పెట్టిన వైభవ్
గజదొంగ..! స్కీముల పేరుతో స్కాములు.. బాబు పాపాల చిట్టా..!
మైనార్టీలను రాజకీయంగా ప్రోత్సహించింది YSRCP
మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..?
నీ అయ్య జాగీరా.. పవన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
దంచికొడుతున్న వర్షం రోడ్లు జలమయం
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా..షాకింగ్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్
నందూస్ కపుల్స్ మౌనం..స్క్రీన్ షాట్ బయటపెట్టిన UK జైపాల్ రెడ్డి..

