Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Netanyahu To Visit India Soon  Advise PM Modi On Dealing With Trump1
మోదీ దెబ్బ.. ఇది ట్రంప్‌ రాయబారమా?

అమెరికా విషయంలో ఏదైతే అది అయ్యిందనే నిర్ణయానికొచ్చింది భారత్‌. ఇప్పటిరకూ అమెరికాతో సంబంధాలపై ఆచితూచి అడుగులేసిన భారత్‌.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రష్యాతో వాణిజ్య ఒప్పందానికే ఓకే చెప్పింది. గత కొంతకాలంగా ట్రంప్‌ విధించే సుంకాలపై సహనంగా ఉన్న భారత్‌.. అమెరికా ఆయుధాల కొనుగోలుకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ‘రోజూ భయపడుతూ కూర్చుంటే ట్రంప్‌ ఏదొక నిర్ణయంతో ఇరకాటంలో పెడుతూనే ఉంటారని నిర్ణయానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో భారత్‌.. ఎట్టకేలకు స్పందించింది. ఎంత సుంకాన్ని అయినా భరిస్తామని, అయితే రష్యాతో వాణిజ్య ఒప్పందం విషయంలో రాజీ పడేది లేదనే సంకేతాలు పంపింది. ఇప్పటివరకూ అమెరికాను మిత్రదేశంగా భావించిన భారత్‌.. ఉపయోగం లేని మిత్రత్వం అవసరం లేదనే విషయాన్ని యూఎస్‌కు అర్థమయ్యేలా చెప్పేసింది. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు తాము లొంగమనే విషయాన్ని తేటతెల్లం చేసింది. నెతాన్యాహూ భారత్‌ పర్యటన..?అమెరికా-భారత్‌ల మిత్రత్వం దాదాపు చెడిందనే సంకేతాల నడుమ ఇజ్రాయిల్‌ రంగంలోకి దిగింది. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతాన్యాహూ భారత్‌ పర్యటనకు రాబోతున్నట్లు తెలుస్తోంది. భారత పర్యటనలో నెతాన్యాహూ మోదీని కలిసి ఓ సలహా ఇవ్వనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ సలహా ఏమిటనేది పక్కన పెడితే.. డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన నెతాన్యాహూ భారత్‌కు ఎందుకు రానున్నారనే చర్చ నడుస్తోంది. ఇది అమెరికా ఆడుతున్న డ్రామాగా ఉంందని మరొక వాదన వినిపిస్తోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన భారత్‌ను ఒప్పించేందుకు నెతాన్యాహూను ట్రంప్‌ రాయబారిగా పంపడానికి సిద్ధమయ్యారనే వాదన తెరపైకి వచ్చింది. ప్రత్యేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్‌ చేసి మోదీ మాట్లాడటం, అమెరికా ఆయుధాలను, వైమానిక క్షిపణులకు కొనుగోలుపై భారత్‌ విముఖత వ్యక్తం చేసిన తరుణంలో నెతాన్యాహూ ఆ దిశగానే మోదీతో మాట్లాడేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అనేది భారత్‌కు అతిపెద్ద మార్కెట్‌ అనే అంశం అందరికి తెలిసిందే. ఆటువంటి తరుణంలో కూడా భారత్‌.. అమెరికాతో రాజీ పడేందుకు సిద్ధంగా లేకపోవడంతో నెతాన్యాహూను ట్రంప్‌ రంగంలోకి దింపే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. ట్రంప్‌ అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారనే విమర్శ కూడా ఆయనపై ఉంది. అగ్రరాజ్యం అమెరికా అనేది మినహాయిస్తే ఇక్కడ ట్రంప్‌ గొప్పతనం ఏమీ లేదు. తాము చెప్పినట్లు ‘ఆడాలని’ ట్రంప్‌ అనుకుంటూ ఉంటారని, అది అన్ని దేశాలతో కుదరదనే విషయం భారత్‌ చెప్పకనే చెప్పేసింది.. ఇప్పుడు భారత్‌, రష్యా, చైనాల మైత్రితో అమెరికాకు గుండెల్లో రాయి పడినట్లే ఉంది.మూడు అగ్రదేశాలు ఏకం అవుతున్న తరుణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ను కాస్త ఇరకాటంలో పడేసినట్లే ఉంది. ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా ఉండే చైనా కూడా, ఇప్పుడు ట్రంప్‌ బెదిరింపులను తట్టుకోలేకపోతోంది. మన మంచిని కోరలేని శత్రువుకు అంగుళం చోటిస్తే మొత్తం ఆక్రమిస్తారంటూ ట్రంప్‌ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకున్న ట్రంప్‌.. నెతాన్యాహూను అనధికార రాయబారిగా పంపుతున్నారా? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఒకవేళ నెతాన్యాహూ భారత్‌ పర్యటనకు వస్తే మాత్రం, కచ్చితంగా అమెరికాతో భారత్‌ సంబంధాలపై మాట్లాడి రాజీ కుదిర్చే అవకాశాల్ని కూడా కొట్టిపారేయలేం. ఇంకా భారత్‌-అమరికాల బంధం చాలా బలంగా ఉందని స్వయంగా నెతాన్యాహూ చెప్పిన తరుణంలో.. ఆ దిశగానే పావులు కదిపే అవకాశం ఉంది.

I was forced to resign in 15 minutes TCS fresher claims2
ఏంటి టీసీఎస్‌లో ఇలా చేస్తున్నారు?

దేశంలో అగ్ర ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరిన ఫ్రెషర్లతో కూడా బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ తన బెంచ్ పాలసీని సవరించిన కొన్ని వారాల తరువాత ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.ఓవైపు లేఆఫ్‌ ఆందోళనలున్నా జీతాల పెంపు ప్రకటించి ఉద్యోగులకు కాస్త ఊరట కల్పించింది టీసీఎస్‌. అయితే ఈ ప్రకటనకు ఒక రోజు ముందు, ఒక రెడ్డిట్ యూజర్ తాను బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందంటూ పేర్కొన్నారు. 'టీసీఎస్ ఫైరింగ్ ఫ్రెషర్స్?' అనే శీర్షికతో ఓ పోస్టు పెట్టారు. అహ్మదాబాద్, పుణెకు చెందిన పలువురు ట్రైనీలను కేవలం నాలుగైదు వారాల పాటు బెంచ్‌పై ఉంచి ఆ తర్వాత ఉద్వాసన పలికారని పేర్కొన్నారు.బెంచ్ పాలసీలో మార్పు, క్రియాశీల క్లయింట్ ప్రాజెక్ట్ లేకుండా అనుమతించదగిన వ్యవధిని 35 రోజులకు తగ్గించడం వంటివాటితో ఒత్తిడి తెచ్చి చప్పుడు లేకుండా ఉద్యోగులను టీసీఎస్‌ వదిలించుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగాలు తగ్గించుకునేందుకు ఫ్రెషర్లను కూడా వదిలిపెట్టడం లేదన్నారు.బలవంతంగా రాజీనామా చేయించారు'నేను కొన్ని రోజుల క్రితం బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్న రెడ్డిట్‌ యూజర్‌ ఫ్రెషర్స్ కూడా జాబ్ కట్ రాడార్ లో ఉన్నారని ఆరోపించారు. హెచ్‌ఆర్ తనను ఒక సమావేశానికి పిలిచి, తనతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయించి ఆపై తనకు రెండు ఆప్షన్లు ఇచ్చాడని పేర్కొన్నాడు. అవి వెంటనే రాజీనామా చేయడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.రాజీనామా చేయకపోతే ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నెగటివ్‌ రిలీజ్‌ లెటర్‌ జారీ చేస్తామని బెదిరించారని రాసుకొచ్చారు. అదే చెప్పినట్లు రాజీనామా చేస్తే మూడు నెలల వేతనం ఇచ్చి ఎటువంటి నెగటివ్‌ లేకుండా మంచిగా రిలీజ్‌ లెటర్‌ ఇస్తామన్నారని వివరించాడు. తన లాగే మరో నలుగురు ఫ్రెషర్లను కూడా ఏడిపించి బలవంతంగా రాజీనామా చేయించారని రెడ్డిట్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.తనను క్రియాశీల ప్రాజెక్టుకు కేటాయించినప్పటికీ బలవంతంగా రాజీనామా చేయించి ఆ ఆకస్మిక రాజీనామాకు వ్యక్తిగత కారణాలను పేర్కొనాలని హెచ్ఆర్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజీనామా, తొలగింపు రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని, తన కుటుంబంతో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని ఫ్రెషర్ ఆరోపించారు.👉 చదవండి: హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్‌..

Virat Bhai Kept Shouting: India Pacer Breaks Silence On Spat With Starc3
‘విరాట్‌ భయ్యా అరుస్తూనే ఉన్నాడు.. నాకేమో భయం’

టెస్టుల్లో అరంగేట్రం సందర్భంగా తనకు ఎదురైన అనుభవం గురించి టీమిండియా యువ పేసర్‌ హర్షిత్‌ రాణా (Harshit Rana) తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) ఓవైపు తనను భయపెడుతుంటే.. మరోవైపు.. విరాట్‌ భయ్యా, రాహుల్‌ భయ్యా తనను ‘ఆందోళన’కు గురిచేశారంటూ సరదా విషయాలు పంచుకున్నాడు.తొలి వికెట్‌గా అతడుకాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా హర్షిత్‌ రాణా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో అతడు బంతితో రంగంలోకి దిగాడు. ట్రవిస్‌ హెడ్‌ (11) రూపంలో తన తొలి అంతర్జాతీయ వికెట్‌ దక్కించుకున్న ఈ రైటార్మ్‌ పేసర్‌.. జిడ్డు ఇన్నింగ్స్‌తో క్రీజులో పాతుకుపోయిన మిచెల్‌ స్టార్క్‌ (112 బంతుల్లో 26)ను కూడా వెనక్కి పంపించాడు.నాకు ఇది గుర్తుండిపోతుందిఈ క్రమంలో హర్షిత్‌.. స్టార్క్‌కు బౌన్సర్‌ సంధించగా.. బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో కంగారుపడ్డ హర్షిత్‌.. అంతా ఒకేనా అన్నట్లు స్టార్క్‌కు సైగ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేను నీకంటే ఫాస్ట్‌గా బౌల్‌ చేయగలను. నాకు ఇది గుర్తుండిపోతుంది’’ అంటూ స్టార్క్‌ సరదాగా వ్యాఖ్యానించాడు.చచ్చానురా దేవుడా!ఈ విషయం గురించి హర్షిత్‌ రాణా తాజాగా మాట్లాడుతూ.. ‘‘చాలా సేపటి తర్వాత ఆరోజు నేను స్టార్క్‌కు బౌన్సర్‌ వేశాను. అతడు స్లెడ్జ్‌ చేయగానే.. నేను నవ్వేశాను. కానీ.. తిరిగి బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నపుడు.. ‘చచ్చానురా దేవుడా!.. ఇక ఇప్పుడు అతడు నాకు కూడా బౌన్సర్సే వేస్తాడు’ అని భయపడ్డాను.కొట్టు.. ఇంకా కొట్టుఇంతలో స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్‌ భయ్యా, కేఎల్‌ భాయ్‌.. ‘సేమ్‌ స్పాట్‌లో అతడికి మళ్లీ బంతి తగిలేలా బౌలింగ్‌ వెయ్‌’ అని అరుస్తూనే ఉన్నారు. నేనేమో.. ‘భయ్యా మీరైతే అతడి బౌలింగ్‌లో సులభంగానే ఆడేస్తారు. మరి నా పరిస్థితి ఏమిటి?అనుకున్నదే జరిగిందిఅతడు కూడా నన్ను హెల్మెట్‌పై బంతితో కొడతాడు’ అని మనసులోనే అనుకున్నా. అనుకున్నట్లుగానే రెండో టెస్టులో స్టార్క్‌ బాల్‌ను నా హెల్మెట్‌ మీదకు వేశాడు’’ అని బీర్‌బైసెప్స్‌ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చాంపియన్‌గా నిలవడంలో స్టార్క్‌, హర్షిత్‌లు కీలక పాత్ర పోషించారు.ఇక పెర్త్‌ టెస్టులో హర్షిత్‌ రాణా మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్సీలోని టీమిండియా ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే, ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని మాత్రం 1-3తో చేజార్చుకుంది. చదవండి: AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్‌ ఓ జోకర్‌!Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2— cricket.com.au (@cricketcomau) November 23, 2024

Rahul Gandhi Poses 5 Questions Day After Big Vote Theft Claim4
Rahul Vs EC: ఈసీకి రాహుల్‌ ఐదు ప్రశ్నలు

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్‌ చేశారు. ఎక్స్‌ వేదికగా ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం బీజేపీతో చేతులు కలిపి, దేశంలో ఎన్నికలను ప్రభావితం చేస్తోందంటూ నిన్న (గురువారం) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పని చేస్తోందంటూ.. ఆధారాలతో సహా బయటపెట్టారు. ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా నకిలీ ఓటర్లను చేరుస్తోందని ఆరోపించారు.ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఐదు ప్రశ్నలతో ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ‘‘డిజిటల్‌ ఓటర్‌ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?. సీసీ టీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?. నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేపోతున్నారు?. ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.चुनाव आयोग, 5 सवाल हैं - देश जवाब चाहता है:1. विपक्ष को डिजिटल वोटर लिस्ट क्यों नहीं मिल रही? क्या छिपा रहे हो?2. CCTV और वीडियो सबूत मिटाए जा रहे हैं - क्यों? किसके कहने पर?3. फर्जी वोटिंग और वोटर लिस्ट में गड़बड़ी की गई - क्यों?4. विपक्षी नेताओं को धमकाना, डराना - क्यों?… pic.twitter.com/P0Wf4nh5hc— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2025కాగా, ఇవాళ (శుక్రవారం) బెంగళూరులో ఓట్‌ అధికార్‌ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటర్‌ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని రాహుల్‌ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్‌ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్‌ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదంటూ రాహుల్‌ చెప్పుకొచ్చారు.

Rakhi 2025 Set To Touch Rs 17000 Crore Says CAIT5
ఈసారి మేడ్‌ ఇన్‌ ఇండియా రాఖీలదే హవా.. ఏకంగా రూ.17000 కోట్ల బిజినెస్‌

రాఖీ (రక్షాబంధన్) పండుగ వస్తుందంటే.. మార్కెట్లు కోలాహలంగా మారిపోతాయి. తోబుట్టువులు రాఖీలు కొనుగోలు చేస్తే.. వారి కోసం అన్నదమ్ములు గిఫ్ట్స్ కోనేస్తుంటారు. ఈ సంవత్సరం రాఖీ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 17,000 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది.''ఈ సంవత్సరం మార్కెట్లలో చైనీస్ రాఖీలు, వస్తువులు కనిపించడం లేదు" అని CAIT సెక్రటరీ జనరల్ & చాందినీ చౌక్ ఎంపీ 'ప్రవీణ్ ఖండేల్వాల్' పేర్కొన్నారు. వినియోగదారులు కూడా చాలావరకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంచుకుంటున్నారని అన్నారు.రక్షా బంధన్ కేవలం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు మాత్రమే కాదు, జాతీయవాదానికి కూడా ప్రతీకగా నిలిచింది. ఈ కారణంగానే ఈ సీజన్‌లో మోదీ రాఖీ, ఆపరేషన్ సిందూర్ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీలు, డిజిటల్ రాఖీలు కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఖాదీ, వెదురు, పత్తితో తయారు చేసిన పర్యావరణ అనుకూల రాఖీలకు అధిక డిమాండ్ ఉంది. వీటిలో చాలా వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులు, చేతివృత్తులవారు, స్వయం సహాయక బృందాలు చేతితో తయారు చేసినవే ఉన్నాయి.ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..రాఖీలు మాత్రమే కాకుండా.. స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్లు, అలంకరణ వస్తువులు వంటి వస్తువుల ద్వారా ఏకంగా రూ.4,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కైట్ అంచనా వేసింది. ఢిల్లీ, జైపూర్, ముంబై, లక్నో అంతటా ఎక్కువగా దేశభక్తి ఇతివృత్తాలతో కూడిన రాఖీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. రక్షాబంధన్ భారతదేశంలో అత్యంత బలమైన పండుగ సీజన్లలో ఒకటిగా ఉంటుందని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు.

one of best mobile OnePlus Nord CE5 powerful mid range 5G smartphone6
అదిరిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5.. ధర ఎంతంటే..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ 'వన్‌ప్లస్‌' వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 'వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ' సిరీస్‌ను ఒక ప్రధాన లక్ష్యంతో తీసుకొచ్చింది. ఇది శక్తివంతమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్స్, యూజర్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన సిగ్నేచర్ వన్‌ప్లస్‌ అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది. దీనికి 'వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5' (OnePlus Nord CE5) ఒక ఉదాహరణ. లేటెస్ట్ వన్‌ప్లస్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాలను కలిగి, ఆక్సిజన్ఓఎస్ అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా ఇది మంచి పనితీరును అందిస్తుంది. ఇది దాని విభాగంలో.. ధరకు తగిన ఫ్రీమియం ఫీచర్స్ అందిస్తుంది.వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5 - వాల్యూ ఫర్ మనీరూ.25వేలు లోపు ధర వద్ద బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5. మీరు చెల్లించే డబ్బుకు, తగిన ఫీచర్స్ తప్పకుండా ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు మాత్రమే కాకుండా.. మీ సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా పండుగల సమయంలో గిఫ్ట్‌గా ఇవ్వడానికి అనువైనది.వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5 ఫీచర్లు ఇలా..మీడియాటెక్ 8350 అపెక్స్ప్రతి మొబైల్‌కు కీలకంగా వ్యవహరించేది దాని ప్రాసెసర్‌. నార్డ్ సీఈ5లో మీడియాటెక్ 8350 అపెక్స్ చిప్ సెట్ ఉంది. ఇది దాని పనితీరును సూచిస్తుంది. వినియోగదారుల కోసం రూపొందించబడిన కొత్త తరం ప్రాసెసర్ ఇది. యువత మొబైల్‌ స్పీడ్‌లో రాజీపడకుండా మెరుగైన పనితీరును కోరుకుంటారు. కాబట్టి దీన్ని సమర్థవంతమైన ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. యూజర్లకు అంతరాయం లేకుండా యాప్‌ను రన్‌ చేస్తూ, అప్రయత్నంగా మల్టీ టాస్కింగ్ నిర్వహిస్తుంది. పెద్ద సైజ్‌లో ఉన్న గేమ్‌లను కూడా 120 ఎఫ్‌పీఎస్‌తో స్మూత్ గేమింగ్ పనితీరును నిర్ధారిస్తుంది. వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా పనితీరును ఆప్టిమైజ్ చేసేలా కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తుంది.సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేనార్డ్ సీఈ5లో 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది మంచి విజువల్‌ను అందిస్తుంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్, బటర్ స్మూత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ వేగంగా స్పందిస్తుంది. సాధారణంగా అధిక బ్రైట్‌నెస్‌ అవుట్ డోర్ విజిబిలిటీకి సమస్యగా ఉంటుంది. హెచ్‌డీఆర్‌10+ కాంట్రాస్ట్, కలర్ క్లారిటీతో ఈ సమస్యకు నార్డ్‌ సీఈ5 చెక్‌ పెడుతుంది. ఇందులోకి ఏఐ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌ విభిన్న లైటింగ్ కండిషన్స్‌లో వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. గేమ్‌ ఆడుతున్నా, ఎక్కువగా స్క్రీన్‌ చూస్తున్నా ఈ డిస్‌ప్లే యూజర్లకు మెరుగైన అనుభవాన్ని సొంతం చేస్తుంది.కెమెరా సిస్టమ్వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5లో కేవలం మెగాపిక్సెల్స్ కోసమే కాకుండా అర్థవంతమైన ఫొటోగ్రఫీ కోసం డిజైన్ చేసిన రిఫైన్డ్ డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది.50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్: తక్కువ వెలుతురులో కూడా అదిరిపోయే క్లారిటీ, డైనమిక్ రేంజ్ అందిస్తుంది.8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా: ల్యాండ్‌స్కేప్‌, గ్రూప్ షాట్స్, ఆర్కిటెక్చర్ కోసం ఇది ప్రత్యేకమైంది.60 ఎఫ్‌పీఎస్‌ వద్ద 4కే వీడియో: రియల్ టైమ్ స్టెబిలైజేషన్‌తో ఫ్లూయిడ్, సినిమా క్వాలిటీ రికార్డింగ్ అందిస్తుంది.ఈ ఫోన్‌లో ప్రతి కెమెరా షాట్‌ను ఎలివేట్ చేసేలా ఏఐ ఆధారిత ఫొటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి. సీన్ రికగ్నిషన్, ఇంటెలిజెంట్ హెచ్‌డీఆర్‌, నైట్ స్కేప్ ఆప్టిమైజేషన్, సోషల్ రెడీ కంటెంట్ కోసం రూపొందించిన సృజనాత్మక ఫిల్టర్లు ఉన్నాయి.అర్థం చేసుకునే ఏఐనార్డ్ సీఈ5ను మార్కెట్‌లోని ఇతర ఫోన్లతో నిజంగా వేరు చేసేది అందులో వాడుతున్న కృత్రిమ మేధ. ఇందులో స్మార్ట్ ఉత్పాదకత సాధనాలను వాడారు. ఫోన్‌లోని ఏఐ యూజర్‌ షెడ్యూల్‌ను నిర్వహించగలదు. ఈమెయిల్‌లను చదివి సంక్షిప్తంగా తెలపగలదు. సందర్భోచితంగా నోటిఫికేషన్‌లకు కూడా ప్రాధాన్యత ఇవ్వగలదు.కెమెరా ఏఐ: ఫొటో తీస్తున్న సమయంలో సబ్జెక్ట్, బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా ఫోకస్, లైటింగ్, కలర్ టోన్‌లను ఆటో అడ్జస్ట్‌ చేస్తుంది. దీంతో మాన్యువల్‌గా మళ్లీ సదరు ఫొటో లేదా కెమెరా సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్పులు చేయాల్సిన పని ఉండదు.120 ఎఫ్‌పీఎస్‌ గేమింగ్ పవర్ హౌస్స్మార్ట్ ఫోన్‌లో గేమింగ్‌ అనేది ప్రస్తుత రోజుల్లో ప్రధానంగా మారింది. నార్డ్ సీఈ 5 ఈ అనుభవాన్ని చాకచక్యంగా అందిస్తుంది. దాని 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు అందుకు ఎంతో తోడ్పడుతుంది. 120 ఎఫ్‌పీఎస్‌ వద్ద అసాధారణ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.డిజైనింగ్‌నార్డ్ సీఈ 5 బ్రష్డ్ మ్యాట్ ఫినిష్‌తో హై-గ్రేడ్ పాలీకార్కొనేట్‌తో తయారైంది. యూనిబాడీతో ప్రీమియం లుక్‌ ఉండేలా డిజైన్‌ చేశారు. ఇది విజువల్ అప్పీల్ మాత్రమే కాకుండా మంచి గ్రిప్‌ను కూడా నిర్ధారిస్తుంది. సీఈ5లోని కలర్ ఆప్షన్లు కింది విధంగా ఉన్నాయి.గ్రాఫైట్ ఐస్‌ - రిఫ్లెక్టివ్‌ షైనింగ్‌తో మెటాలిక్‌ గ్రే కలర్‌.మిస్ట్ బ్లూ - హిమానీనదాల నుండి ప్రేరణ పొంది ఈ రంగులో అందిస్తున్నారు.సన్‌సెట్‌ కాపర్‌ఆక్సిజన్ఓఎస్ఆక్సిజన్ఓఎస్ తాజా వెర్షన్‌తో నడుస్తున్న నార్డ్ సీఈ 5 రెస్పాన్సివ్‌, యాడ్ ఫ్రీ సాఫ్టేవేర్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్‌ల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఇందులోని స్మార్ట్ ఎఫిషియెన్సీ టూల్స్ మెరుగైన షెల్ఫ్ విడ్జెట్లు, సందర్భోచిత యాప్‌ సజెషన్లను అందిస్తున్నాయి. వినియోగదారులకు వారి డిజిటల్ గోప్యతపై మరింత నియంత్రణను కల్పించేలా మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ఆల్‌వేస్‌ ఆన్ డిస్‌ప్లే థీమ్స్‌, ఫింగర్ ప్రింట్ యానిమేషన్లు, ఐకాన్ ప్యాక్‌లను నియంత్రిస్తుంది. మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు, ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేషన్లను అందిస్తుంది.5జీ కనెక్టివిటీనార్డ్ సీఈ5 డ్యూయల్ 5జీ సిమ్ స్లాట్లను కలిగి ఉంది. ఇది విస్తృత శ్రేణి గ్లోబల్ 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది. అధిక రిజల్యూషన్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నా, రియల్ టైమ్ క్లౌడ్ గేమింగ్‌లో పాల్గొంటున్నా లేదా అధిక మొబిలిటీ సందర్భాల్లో వీడియో కాలింగ్ చేసినా సీఈ 5 అల్ట్రా లో-లేటెన్సీ వల్ల స్థిరమైన వేగంతో పని చేస్తుంది.హై-స్పీడ్, మెరుగైన ఇంటర్నెట్ కోసం వై-ఫై 6ఈడ్యూయల్ డివైజ్ ఆడియో సపోర్ట్, బ్లూటూత్ 5.3 టెక్నాలజీఅంతరాయం లేని మొబైల్ పేమెంట్లు, డివైజ్ పెయిరింగ్ కోసం ఎన్‌ఎఫ్‌సీవేగవంతమైన డేటా బదిలీ, రివర్స్ ఛార్జింగ్ సామర్థ్యాల కోసం యూఎస్‌బీ-ఈ 3.2 జెన్ 1 సదుపాయంఆడియో ఎక్స్ పీరియన్స్ఆడియో కోసం నార్డ్ సిఇ 5 డాల్బీ అట్మోస్ సర్టిఫికేషన్‌తో స్టీరియో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. గేమింగ్, వీడియోలు చూడటం లేదా కాల్స్‌లో ఉన్నా స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. మ్యూజిక్‌ వింటున్న సమయంలో స్పష్టమైన సంగీతం ఆస్వాదించేలా ఏర్పాటు చేశారు. యూఎస్‌బీ-సీ ద్వారా హై-రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. రియల్‌టైమ్‌లో పరిసరాల శబ్దం ఆధారంగా వాల్యూమ్ స్థాయిలను నిర్వహించే ఏఐ ఆధారిత ట్యూనింగ్ సిస్టమ్‌ ఉంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ను సపోర్ట్‌ చేస్తుంది.కూలింగ్ సిస్టమ్ఫోన్‌లో అధిక సైజ్‌ ఉన్న గేమ్‌లు ఎక్కువసేపు ఆడితే మొబైల్‌ వేడవ్వడం సహజం. దీన్ని కట్టడి చేసేందుకు నార్డ్ సీఈ5 మెరుగైన మల్టీ లేయర్ గ్రాఫైట్, వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థను పరిచయం చేస్తుంది. ఇది మునుపటి నార్డ్ మోడళ్ల కంటే వేడిని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుంది. సుదీర్ఘ గేమింగ్ లేదా వీడియో సెషన్ల సమయంలో కూడా సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుంది.భద్రత ఫీచర్లునార్డ్ సీఈ5 డిస్‌ప్లేపై ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఫీచర​్‌ను అందిస్తుంది. దాంతోపాటు వేగవంతమైన, మరింత సురక్షితమైన యాక్సెస్ కోసం ఏఐ ఆధారిత ఫేస్ అన్‌లాక్‌ వెసులుబాటును ఇస్తుంది. ఇందులోని ప్రైవేట్ సేఫ్ 3.0 ద్వారా సున్నితమైన డాక్యుమెంట్‌లు, ఇమేజ్‌లు, ఫైళ్లను ఎన్ క్రిప్టెడ్‌గా స్టోర్‌ చేసుకోవచ్చు.చివరగా..మిడ్ రేంజ్ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5 కీలకంగా వ్యవహరించనుంది. వినియోగదారులను ఆకర్షించే ఇన్నోవేషన్ ప్రీమియం ధరలతోనే రావాల్సిన అవసరం లేదని వన్‌ప్లస్‌ బ్రాండ్ మరోసారి నిరూపించింది. రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్, అర్థవంతమైన ఫీచర్లు, ఇంటెలిజెంట్ డిజైన్ ఎంపికలకు ప్రాధాన్యమిచ్చే నార్డ్‌ సీఈ5ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీ నుంచి దాని ఏఐ ఆధారిత కెమెరా వరకు, ఫ్లూయిడ్ 120 హెర్ట్జ్ గేమింగ్ నుంచి ప్రాసెసింగ్ ఎనర్జీ వరకు నార్డ్ సీఈ5 వినియోగదారుకు నమ్మశక్యం కాని అనుభవాన్ని అందిస్తుంది.వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5 వేరియంట్స్ & ధరలు1) 8 జీబీ + 128 జీబీ: రూ. 24,9992) 8 జీబీ + 256 జీబీ: రూ. 26,9993) 12 జీబీ + 256 జీబీ: రూ. 28,999

Kutami Prabhutvam Kottha Kutra For Pulivendula ZPTC BYPoll7
ఓటమి భయం.. పులివెందులలో కూటమి కుతంత్రాలు

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని గత కొన్నిరోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ప్రశాంత వాతావరణంలో గనుక పోలింగ్‌ జరిగితే ఓటమి ఖాయమని భావిస్తున్న అధికార టీడీపీ.. ఎప్పటికప్పుడు కుట్రలకు, కుతంత్రాలకు తెరతీస్తోంది. తాజాగా..పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక భాగం ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లను ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. ఇందులో అధికంగా ఓట్లు ఉన్న నల్లపురెడ్డిపల్లి, ఎర్రిబల్లి, నల్లగొండువారిపల్లి పోలింగ్‌ బూత్‌లనే జబ్లింగ్‌ చేయడం గమనార్హం. ఎర్రిబల్లి ఓటర్లకు నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్‌ బూత్‌, నల్లపురెడ్డిపల్లి ఓటర్లకు ఎర్రిబల్లిలో పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. దాదాపు 7 వేల ఓట్లు ఈ నిర్ణయంతో ప్రభావితం కానున్నాయి. అయితే.. ఓటర్లను పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా చేసేందుకే టీడీపీ నేతలు ఈ కుట్ర పన్నారంటున్న వైఎస్సార్సీపీ అంటోంది. ఎటువంటి సంప్రదింపులు లేకుండా నామినేషన్ల సందర్భంగా ఇచ్చిన పోలింగ్‌ బూత్‌ల లిస్టును మళ్లీ ఎలా మారుస్తారని ప్రశ్నిస్తోంది. బూత్‌లు మార్చేప్పుడు రాజకీయ పార్టీలతో సంప్రదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కి ఉంటుందని.. కేవలం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఇలా బూత్‌లను మార్చారంటూ మండిపడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా పోలింగ్‌ బూత్‌లను జంబ్లింగ్‌ చేయడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు.

Tollywood Film Chamber OF Commerce Key Decision About Film Shootings8
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ సంచలన ప్రకటన

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్‌లు జరపొద్దని నిర్ణయించింది. ఎలాంటి సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్ల ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది. వారితో ఎలాంటి చర్చలు, సంప్రదింపులు చేయకుండా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుమతి లేకుండా ఎలాంటి సేవలూ అందించకూడదని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది.

Bakasura Restaurant Movie Review And Rating In Telugu9
‘బకాసుర రెస్టారెంట్‌’ మూవీ రివ్యూ

వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రవీణ్‌. ఆయన తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌'. ఎస్‌జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటించాడు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(ఆగస్ట్‌ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..పరమేశ్వర్‌(ప్రవీణ్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్‌ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్‌ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్‌ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్‌ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్‌ అంతా తిసేస్తుంది. ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్‌ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్‌ గ్యాంగ్‌ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్‌(ప్రవీణ్‌) గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్‌ పెట్టాలన్న పరమేశ్వర్‌ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక కామెడీ హారర్‌ చిత్రం. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో దెయ్యాన్ని తిండిబోతుగా చూపించడం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సాధారణగా కామెడీ హారర్‌ చిత్రాల్లో ఒక ఆత్మ ఉండడం..దానికో ఎమోషల్‌ ప్లాష్‌బ్యాక్‌.. క్లైమాక్స్‌లో దాని కోరిక నెరవేర్చడం.. ఇదే కథ. ఈ చిత్రంలో కూడా అవన్నీ ఉంటాయి. తాంత్రిక పూజకు సంబంధించిన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అవుతుంది. హీరో పరిచయ సన్నివేశంతోనే అసలు కథ ప్రారంభం అవుతుంది. డబ్బుల కోసం యూట్యూబ్‌ వీడియోలు చేయాలనుకోవడం..గోస్ట్‌హౌస్‌కి వెళ్లడం..అక్కడ జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే ప్రతిసారి ఆ తరహా కామెడీనే చూపించడంతో కొన్ని చోట్ల బోర్‌ కొడుతుంది. అంజిబాబు పాత్ర ఎంట్రీ, అతనిలోకి బకాసుర ఆత్మ వెళ్లిన తర్వాత మళ్లీ కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ బాగా ప్లాన్‌ చేశారు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ కాస్త బెటర్‌. కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. బక్క సూరి ప్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఆత్మను అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించే సన్నివేశాలు అలరిస్తాయి. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే అల్లరి దెయ్యాలు కామెడీ ట్రాక్‌ వర్కౌట్‌ కాలేదు. క్లైమాక్స్‌ని కాస్త ఎమోషనల్‌గా మలిచే ప్రయత్నం చేశారు. రొటీన్‌ కామెడీ హారర్‌ కథే అయినా... తిండిబోతు దెయ్యం మాత్రం కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు కమెడియన్‌గా అలరించిన ప్రవీణ్‌.. ఇందులో హీరోగా నటించి సినిమా భారం మొత్తం తన భుజాన వేసుకున్నాడు. తన బలమైన కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్‌ సీన్లలోనూ చక్కగా నటించాడు. వైవా హర్ష తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే యాక్ట్‌ చేశాడు. అంజిబాబు పాత్రకి ఫణి న్యాయం చేశాడు. ప్రవీణ్‌ స్నేహితులుగా నటించిన కుర్రాళ్ల కామెడీ టైమింగ్‌ బాగుంది. చాలా రోజుల తర్వాత కృష్ణ భగవాన్‌ వెండితెరపై మెరిశాడు. ఓ హోటల్‌ యజమానిగా కనిపించిన ఆయన.. తనదైన పంచ్‌ డైలాగులతో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం జస్ట్‌ ఓకే. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Hyderabad Heavy Rains Updates10
హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. అత్యవసరమైతేనే బయటకు రండి

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల వర్షం మొదలైంది. దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్‌ సిరిసిల్ల, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.కాగా, నగరంలో నిన్న (గురువారం) రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్‌ నాలాలు, డ్రైనేజీల మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్‌ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్, శ్రీనగర్‌ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్‌మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement