Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

CBN your record in dropping crop rates is unbeatable Says YS Jagan1
బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్‌పై తన ఎక్స్‌ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.... క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్‌ చేశారాయన. .@ncbn గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ… pic.twitter.com/swvxxr9hse— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2025

masood azhar family torn apart over operation sindoor2
‘ఆపరేషన్‌ సిందూర్‌’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్‌

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబం తునాతునకలైనట్లు పాకిస్తాన్‌ జైషే మహమ్మద్ కమాండర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.తాజాగా, పాకిస్తాన్‌లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు. ఉర్దూలో కాశ్మీరీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్‌పూర్‌లో భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో ఏప్రిల్‌ 22 మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో జరిపిన మెరుపుదాడులతో ఈ ఉగ్రసంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌తో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. వారితో పాటు జైషే నెంబర్‌-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌, మౌలానా అమర్‌ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు బహవల్‌పూర్‌లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటిని పునర్‌నిర్మించుకునేందుకు పాక్‌ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించింది.ఈ క్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌లో భారత బలగాలు పీవోకే, పాకిస్తాన్‌లో ఎంతటి బీభత్సం సృష్టించాయో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వివరించడం చర్చాంశనీయంగా మారింది. 🚨 #Exclusive 🇵🇰👺Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces. Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy— OsintTV 📺 (@OsintTV) September 16, 2025 Markaz Subhan Allah, Bahawalpur (Punjab, Pakistan) was the headquarters of Jaish-e-Mohammad. This facility was a key hub for orchestrating terror operations, including the Pulwama attack on Feb 14, 2019. The perpetrators of the bombing were trained at this very site. Demolished. pic.twitter.com/zNhcMylVxW— Amit Malviya (@amitmalviya) May 7, 2025 4th Month Anniversary of Operation Sindoor. Enjoy Guys pic.twitter.com/fJAL3vQvsh— rae (@ChillamChilli) September 7, 2025

Supreme Court Key Comments On Viveka Case3
వివేకా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్‌ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్‌.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్‌జీ తెలిపారు.‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్‌ వాదనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్‌ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్‌ కోర్టులో ఎందుకు చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్‌ రన్‌ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది. ఈ దశలో మేం చేసేది ఏం లేదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్‌ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది.

Australia A Scored 337 Runs After Losing 5 Wickets At Day 1 Stumps Against India A In First Un Official Test Match4
కొన్‌స్టాస్‌ శతకం.. శ్రేయస్‌ సేనపై ఆసీస్‌ బ్యాటర్ల పైచేయి

శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని భారత్‌ ఏ జట్టుతో ఇవాళ (సెప్టెంబర్‌ 16) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ బ్యాటర్లు పైచేయి సాధించారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌ (114 బంతుల్లో 109; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. మరో ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ కెల్లావే (97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వన్‌, టు డౌన్‌ బ్యాటర్లు నాథన్‌ మెక్‌స్వీని (1), ఒలివర్‌ పీక్‌ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచినా.. ఆతర్వాత వచ్చిన కూపర్‌ కన్నోల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటాడు. ఆట ముగిసే సమయానికి లియామ్‌ స్కాట్‌ 47, జోష్‌ ఫిలిప్‌ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.టీ విరామం వరకు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన భారత బౌలర్లు.. ఆతర్వాత 26 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపించారు. అయితే ఈసారి కూపర్‌ కన్నోల్లీ-లియామ్‌ స్కాట్‌ భారత్‌ పైచేయి సాధించకుండా అడ్డు తగిలారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 109 పరుగులు జోడించి ఆసీస్‌ను పటిష్ట స్థితికి చేర్చారు. కన్నోల్లీ ఔటైనా లియామ్‌ స్కాట్‌ బాధ్యతగా ఆడుతూ ఆసీస్‌ను భారీ స్కోర్‌ దిశగా తీసుకెళ్తున్నాడు. అంతకుముందు కొన్‌స్టాస్‌-కెల్లావే జోడీ తొలి వికెట్‌కు 198 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది.గుర్నూర్‌ బ్రార్‌ భారత్‌కు తొలి బ్రేక్‌ అందించారు. కెల్లావేను ఔట్‌ చేశాడు. అనంతరం లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ హర్ష్‌ దూబే ఒక్కసారిగా చెలరేగాడు. స్వల్ప వ్యవధిలో కెప్టెన్‌ మెక్‌స్వీనిని, సెంచరీ హీరో కొన్‌స్టాస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత ఖలీల్‌ అహ్మద్‌ ఒలివర్‌ పీక్‌ను ఔట్‌ చేశాడు. అనంతరం కన్నోల్లీ, లియామ్‌ స్కాట్‌ భారత బౌలర్ల సహనాన్ని చాలాసేపు పరీక్షించారు. 333 పరుగుల వద్ద హర్ష్‌ భారత్‌కు మరోసారి బ్రేక్‌ ఇచ్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న కన్నోల్లీని బోల్తా కొట్టించాడు.కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు (నాలుగు రోజుల మ్యాచ్‌లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే​ తొలి టెస్ట్‌ మొదలైంది. రెండో టెస్ట్‌ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్‌ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 3, 5 తేదీల్లో కాన్పూర్‌లో వన్డేలు జరుగుతాయి.

Disha Patani Sister Khushboo Teach Self Defence Tips5
కేబుల్‌ వైర్‌ చాలు ముఖం పచ్చడే... ఖుష్బూ స్ట్రాంగ్‌ రిప్లై

బరేలీలోని తన కుటుంబ నివాసం వెలుపల జరిగిన దిగ్భ్రాంతికరమైన కాల్పుల సంఘటన తర్వాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న, రిటైర్డ్‌ ఇండియన్‌ ఆర్మీ మేజర్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి దిశా పటానీ(Disha Patani) సోదరి ఖుష్బూ పటానీ వీటికి తనదైన శైలిలో బలంగా బదులిచ్చారు. తన ఇన్‌ స్ట్రాగామ్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేసిన వీడియోలో ఆమె తనను తాను రక్షించుకోవడానికి కేవలం ఒక డేటా కేబుల్‌ వంటి సాధారణ రోజువారీ వస్తువు కూడా సరిపోతుందంటూ తనను చంపుతామని బెదిరిస్తూన్న వర్గాలకు ఆమె పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు ప్రమాద క్షణాల్లో తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లోని సాధారణ వస్తువులనే ఎలా సృజనాత్మకంగా ఉపయోగించవచ్చో ఖుష్బూ ఈ వీడియోలో వివరంగా ప్రదర్శించింది. బెదిరింపు పరిస్థితులలో ప్రతిస్పందించడానికి ఎల్లప్పుడూ ఆయుధాలు లేదా యుద్ధ కళల్లో శిక్షణ వంటివి అవసరం లేదని ఈ వీడియోలో ఆమె హైలైట్‌ చేస్తుంది. బదులుగా, కొంత సమయస్ఫూర్తి, తెగింపు, చురుకుగా ప్రతిస్పందించడం వంటివి సరిపోతాయంటూ ఆమె సాటి మహిళలకు సందేశాన్ని అందించింది. ఒక డేటా కేబుల్‌ వైర్‌ను దానిలో పొదిగిన కొన్ని ఇనుప వస్తువులను ఆమె ఒక బలమైన ఆయుధంగా మార్చింది. ఆ వైర్‌ చూడడానికి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మరక్షణ సమయంలో ఎదుటి వ్యక్తి ముఖం పగలగొట్టడానికి సరిగ్గా సరిపోతుందని ఆమె స్పష్టం చేసింది. కాల్పుల అనంతరం ధైర్యంగా స్పందిస్తూ, ఖుష్బూ చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, తెగువను ప్రశంసించారు. ఆమె ఫాలోయర్స్‌ ఆమెను ఒక ఆధునిక యోథురాలుగా కొనియాడారు. ‘‘మేము ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాం మేడమ్‌’’ అంటూ మరికొందరు ప్రోత్సహించారు. ‘‘మేడమ్, మీరు అద్భుతంగా స్పందించారు. ఈ పరిస్థితుల్లో ఇలా బలంగా ఉండటానికి ధైర్యంతో పాటు సంకల్ప శక్తి అవసరం’’ అంటూ కొందరు ఆమెను పొగిడారు. ‘‘నిజంగా మేడమ్, మీరు మాకు చాలా స్ఫూర్తినిస్తున్నారు’’అంటూ మరికొందరు యువతులు ఆమెను కొనియాడారు. కొందరు ఆమె క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సహజంగానే కొందరు మాత్రం ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ ట్రోల్‌ చేశారు.మొత్తం మీద ఈ ఉదంతం ఇప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియని ఒక ప్రముఖ నటి సోదరిగా మాత్రమే గుర్తింపు పొందిన ఒక సాధారణ యువతిని సెలబ్రిటీగామార్చేసింది.బాలీవుడ్‌ని కుదిపేసిన ఈ కలకలానికి మూలం శుక్రవారం ఉదయం, బరేలీలోని సివిల్‌ లైన్‌లోని విల్లా నంబర్‌ 40 వెలుపల మోటారుబైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులుతో మొదలైంది, అక్కడ పఠానీ కుటుంబం నివసిస్తుంది. ఈ కాల్పులకు కారణం తామేనని ఓ అతివాద వర్గం ప్రకటించుకోవడంతో పాటు ఇకపై తమ మనోభావాలు దెబ్బతీస్తే పఠానీ కుటుంబంతో పాటు ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరికలు జారీ చేసింది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani)

acb caught on Electricity Department ADE ambedkar6
ఏసీబీకి ఏకంగా డైనోసార్‌ చిక్కింది.. ఏడీఈ అంబేద్కర్‌ ఆస్తులు 300కోట్లు

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం కాదు.. ఏకంగా డైనోసార్‌ చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.గత కొంతకాలంగా ఏడీఈ అంబేద్కర్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అంబేద్కర్‌ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని ఏడీఈ ఇల్లు,బంధువులు,కుటుంబసభ్యుల ఇళ్లతో పాటు గచ్చిబౌలి,మాదాపూర్‌ సహా 15 చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్‌ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఇతర జిల్లాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు అంబేద్కర్‌ రూ.300కోట్లకుపైగా ఆస్తిపాస్తులున్నట్లు గుర్తించారు.పదెకరాల స్థలంలో పెద్ద కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో తేలింది.

Gold to Bitcoin Jefferies Chris Wood Shares How To Invest7
నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్

డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం, బిట్‌కాయిన్ రెండింటిపైన పెట్టుబడులు పెరుగుతాయని, మార్కెట్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని.. జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ 'క్రిస్టోఫర్ వుడ్' పేర్కొన్నారు. గుర్గావ్‌లోని జెఫరీస్ ఇండియా ఫోరమ్‌లో మాట్లాడుతూ.. తన పోర్ట్‌ఫోలియో కేటాయింపులను కూడా వెల్లడించారు.ప్రస్తుతం పసిడి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. బంగారం ఔన్సుకు 3,698 డాలర్లకు పెరిగిన సమయంలో.. భారతదేశంలో కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.11 లక్షలు దాటేసింది.ఔన్స్ బంగారం 3600 డాలర్లకు చేరుతుందని.. నేను 2002లోనే అనుకున్నాను. ఊహించినట్లుగానే గోల్డ్ ఆ లక్ష్యాన్ని చేరుకుందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గోల్డ్ కొత్త ట్రేడింగ్ శ్రేణిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బంగారం (ఫిజికల్ గోల్డ్)పై ఆశ ఉన్నప్పటికీ.. నాకు గోల్డ్ మైనింగ్ స్టాక్‌లనే ఆసక్తి ఉందని అన్నారు. అయితే ఇది మొత్తం కంపెనీల లాభాల మీద ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబిట్‌కాయిన్‌ల విలువ కూడా భారీగా పెరుగుతోంది. నేను బంగారం & బిట్‌కాయిన్ రెండింటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ధనవంతులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవచ్చు. వారంతా బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేస్తారు. రాబోయే కాలం మొత్తం బిట్‌కాయిన్‌, బంగారంతోనే ముడిపడి ఉందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు.

Kim Another Sensational Decision: No More Ice Cream in North Korea8
కిమ్‌.. ‘క్రీమ్‌’.. బంద్‌

సంచలనాలకు నెలవైన ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరో నిర్ణయం తీసుకున్నారు. ఐస్‌ క్రీం అనేది ఇక ఆ దేశంలో వినిపించకూడదని నిర్ణయించారు. ఈ తరహా నిర్ణయాలు కిమ్‌ గతంలోనూ తీసుకున్నాడని చదివే ఉంటారు. వాటిని ఉల్లంఘిస్తే ఎంతటి భయంకరమైన శిక్షలు ఉంటాయో కూడా తెలిసే ఉండొచ్చు. మరి ఐస్‌ క్రీంపై కిమ్‌కు ఎందుకు కోపమొచ్చింది? ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా ఐస్‌క్రీం అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా వినిపించే పదమే. కానీ, ఇప్పుడది కొరియా రాజకీయాల్లో కీలకంగా మారింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు ఆ పదం కోపం తెప్పించింది. దీంతో ఆ పదమే ఇక దేశంలో ఏమూల కూడా వినిపించకూడదని ఆయన నిర్ణయించారు. బదులుగా.. ఎసుకిమో లేదంటే ఒరుంబోసూంగీ అని పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. నార్త్‌ కొరియన్‌ భాషలో ఈ పదాలకు అర్థం మంచు లాలీపాప్‌ లేదంటే మంచు ఐస్‌ బార్‌.డెయిలీ నార్త్‌ కొరియా కథనం ప్రకారం.. ఉత్తర కొరియాలో.. మరీ ముఖ్యంగా పర్యాటక రంగంలో పాశ్చాత్య (Western) పదాల వాడకం ఎక్కువగా ఉంటోంది. వాటిని కట్టడి చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణ కొరియాలా.. తమ దేశమూ కట్టుదాటి ఆ తరహా భాషకు బానిస అవ్వకూడదనే కిమ్‌ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు టూర్‌ గైడ్లకు స్థానిక పదాలను ఉపయోగించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. సాధారణంగా.. ఏ దేశంలో అయినా టూర్‌ గైడ్లు పర్యాటకులకు దగ్గరయ్యేందుకు ‘భాష’ను ఉపయోగిస్తుంటారు. అయితే కిమ్‌ నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూనే.. టూర్‌ గైడ్లు శిక్షణ పొందుతున్నారు. మూడు నెలల కాలపరిమితో కొనసాగే ఈ ట్రైనింగ్‌ ప్రొగ్రాం ఆగస్టు 21వ తేదీనే ప్రారంభమైంది. అయితే ఈ విధంగా భాషను నియంత్రించడం ద్వారా తన ప్రజలను, పర్యాటకులను విదేశీ ప్రభావాల నుండి దూరంగా కిమ్‌ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అయితే ఈ నిర్ణయం కేవలం ఐస్‌ క్రీమ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. హ్యామ్‌బర్గ్‌ ఇలా మరికొన్ని పదాలను కూడా లోకల్‌ భాషలోనే పిలవాలనే హుకుం జారీ అయ్యింది. పూర్తిగా ఉత్తర కొరియా సంస్కృతితో కొనసాగుతూ.. విదేశీ పదాలను, మరీ ముఖ్యంగా దక్షిణ కొరియా కల్చర్‌ ప్రభావం ఇక్కడి పర్యాటకంలో ఉండకూడదనే కిమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి పర్యాటక కంపెనీలు చెబుతున్నాయి. ఉల్లంఘిస్తే.. ఉత్తర కొరియాలో పాశ్చాత్య.. దక్షిణ కొరియా పదజాలాలంపై నిషేధం కొనసాగుతోంది. ఒకవేళ దీనిని గనుక ఉల్లంఘిస్తే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లపాటు నిర్బంధ కూలీగా కిమ్‌ ప్రభుత్వం కోసం పని చేయాలనే శిక్ష విధిస్తారు. ఆ సమయంలో సరైన భోజనం, వైద్య వసతులు అందవు. లేదంటే కుటుంబాలను వెలివేస్తారు. భారీగా జరిమానాలతో పాటు ఆస్తులనూ జప్తు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది కేవలం భాష ఉల్లంఘన మాత్రమే కాదు.. ఆన్టీ-సోషలిస్టు చర్యగా పరిగణించే అవకాశం లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో.. మరణశిక్ష కూడా విధించొచ్చు. కొసమెరుపు..ఎస్కిమోలు.. ఈ పదం ఎక్కడైనా విన్నట్లు ఉందా?.. అలస్కా, కెనడా, గ్రీన్‌లాండ్‌, సైబీరియా.. అర్కిటిక్‌ రీజియన్‌లోని మంచు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలు. అయితే.. ఇప్పుడా పదం అవుట్‌డేటెడ్‌ అయ్యింది. కొన్ని తెగలు ఆ పదాన్ని అభ్యంతరకరంగా కూడా భావిస్తున్నాయి. అందుకే ఈ పదం పెద్దగా వినియోగంలో కనిపించడం లేదు. అలాంటిది ఈ పదం ఇప్పుడు నార్త్‌ కొరియాలో ప్రముఖంగా వినిపిస్తుండడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇంగ్లీష్‌ నుంచి నేరుగా పదాన్ని తీసుకోవద్దనే ప్రయత్నంగా కనిపిస్తోంది. కిమ్.. కొన్ని సంచలన నిర్ణయాలువిదేశీ వినోదం.. మీడియాపై నిషేధం: ఉత్తర కొరియాలో విదేశీ సినిమాలు, సంగీతం, టీవీ షోలు చూడటం నేరంగా ప్రకటించారు. దీన్ని "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించి కఠిన శిక్షలు విధించారు.మొబైల్ ఫోన్లపై నియంత్రణ: విదేశీ నెట్‌వర్క్‌లను ఉపయోగించే మొబైల్ ఫోన్లు కలిగి ఉండటం నేరం. ప్రజలు గోప్యంగా మాట్లాడటం, సమాచారం పంచుకోవడం నిషేధంహాట్‌డాగ్‌లపై నిషేధం: పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే హాట్‌డాగ్ వంటి ఆహారాలను తినడం, తయారు చేయడం నిషేధించారు. ఇది "దేశద్రోహం"గా పరిగణించబడుతోంది.బుదాయ్-జిగే (Korean-American fusion dish) నిషేధం: దక్షిణ కొరియా నుండి వచ్చిన మాంసం, బీన్స్, సాసేజ్‌లతో తయారయ్యే ఈ వంటకం మార్కెట్లలో అమ్మకాన్ని నిలిపివేశారు.వివాహ విభజనపై శిక్షలు: విడాకులు తీసుకునే దంపతులను కారాగార శిక్షలకు గురిచేశారు. ఇది "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించబడుతోంది.ఆధ్యాత్మిక స్వేచ్ఛపై.. మత స్వేచ్ఛ, కార్యక్రమాలు, సంఘాలు ఏర్పరచడం వంటి పౌర హక్కులను పూర్తిగా నిషేధించారు.జూలై 8, డిసెంబర్ 17 తేదీల్లో పుట్టినరోజులపై నిషేధం: ఈ తేదీలు కిమ్‌ గత పాలకులు కిమ్ ఇల్-సంగ్ , కిమ్ జోంగ్-ఇల్ చనిపోయిన తేదీలు. దీంతో.. ఆరోజుల్లో ఉ.కొ. పౌరులు పుట్టినరోజు చేసుకోకూడదుహెయిర్‌స్టైల్‌, లెదర్‌జాకెట్లపై నిషేధం: కిమ్‌ ప్రభుత్వానికి నచ్చని హెయిర్‌స్టైల్‌లు వేసుకోవడం నేరంగా మారింది. ప్రత్యేకంగా నిర్దేశించిన స్టైల్‌లే అనుమతించబడ్డాయి. అలాగే కిమ్‌ వేసుకునే జాకెట్లు, డ్రెస్సింగ్‌ స్టయిల్‌ను ఫాలో అయినా సరే అది నేరమే. అలాగే.. యువత ఆలోచనా స్వేచ్ఛను కట్టడి చేసేందుకు, విదేశీ సమాచారం పొందకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. పైనే చెప్పుకున్న నేరాలన్నీ శిక్షార్హమైన నేరాలే. వీటికి పాల్పడినవారిని శ్రమ శిబిరాలకు పంపించడం సాధారణంగా మారింది. అక్కడ వారు జీతం లేకుండా, భద్రత లేకుండా పనిచేయాల్సి ఉంటుంది.ఒకవేళ అదే నేరాన్ని కిమ్‌ తీవ్రంగా భావిస్తే మాత్రం.. అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుకోవాల్సిందే!.

AP High Court verdict on Vijayawada Utsav9
‘విజయవాడ ఉత్సవ్‌’ స్థల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు

సాక్షి,వియవాడ: ‘విజయవాడ ఉత్సవ్‌’ స్థలవివాదంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆలయ భూమిని వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాలకు దేవాదాయ భూమి ఇవ్వొద్దని సూచించింది.గొల్లపూడిలోని 40 ఎకరాల ఆలయ భూమిలో విజయవాడ ఉత్సవ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే, ఆలయ భూమిని వాణిజ్యంగా ఎలా ఉపయోగిస్తారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.గొల్లపూడిలో దేవాదాయశాఖ భూమిని వినియోగించొద్దని, గోల్ఫ్ కోర్సుకు ఐదెకరాల కేటాయింపు ప్రతిపాదన పై స్టే విధించింది. దీంతోపాటు తాత్కాలిక ఉత్సవాలు కేటాయింపు పైనా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ భూములను యధాతధంగా ఉంచాలని హైకోర్టు వెల్లడించించింది.

Gemini Nano Banana AI Saree Trend Ratan Tatas aide Shantanu Naidu calls out10
నానో బనానా ఏఐ చీర ట్రెండ్‌ ప్రకంపనం..! ప్లీజ్‌ సోమరిగా మారకు..

జెమిని నానో బనానా ఏఐ చీర ట్రెండ్‌ ఎంతలా ప్రజాదరణ పొందుతుందో తెలిసిందే. నెట్టింట ఈ టెక్నాలజీ ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఈ టెక్నాలజీతో రోజుకో కొంగొత్త పోటోలు దర్శనమిస్తున్నాయి. అలానే ఈసారి ఓ ఫోటో వైరల్‌ అవ్వడమే కాదు..గగుర్పాటుకు గురిచేసేలా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఇది ఉపయోగించొచ్చా? వద్దా? అన్న మీమాంసలో పడేసింది. పైగా ఈ ట్రెండ్‌ని చూసి రతన్‌ టాటా సహాయకుడిగా ప్రసిద్ధి చెందిన శంతనునాయుడు ఓ ఆసక్తికర కామెంట్‌ చేశారు. అందుకు నెటిజన్లు మద్దతిస్తూ..ఔను కరెక్ట్‌ చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు.ఈ నయా ట్రెండ్‌లో ఓ మహిళ అందరిలా ఈమె కూడా తన ఫోటోని చిత్రించాలనుకుంది. తాను డ్రెస్‌లో ఉన్న చిత్నాన్ని ఈ టెక్నాలజీ సాయంతో చీరలో మార్చి..తన లుక్‌ చూడాలనుకుంది. అంతే అది ఏకంగా అత్యంత ఆకర్షణీయమైన చీర లుక్‌లో ఆమె ఆహార్యాన్ని అందంగా చూపించడమే కాదు. ఆమెకు తన శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉందో దాంతో సహా చూపించడంతో సదరు మహిళ విస్తుపోయింది. View this post on Instagram A post shared by झलक भावनानी ✨ (@jhalakbhawnani) ఒక్కసారిగా ఆమెకు నోట మాట రాలేదు. ఇది సురక్షితమేనా అని భయాందళోనలకు లోనయ్యింది. అందుకు సంబంధించిన పోటోని నెట్టింట షేర్‌ చేస్తూ..ఇది చాలా భయంకరంగా ఉంది. అస్సలు ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదు అని పోస్ట్‌లో రాసుకొచ్చిందామె. ఈ చీర ట్రెండ్‌ దివంగత రతన్‌ టాటా సహాయకుడిగా పేరొందిన శంతను నాయుడు టీజ్‌ చేస్తూ..ఆలోచింప చేసేలా ఒక కామెంట్‌ చేశారు. నిజానికి జెమిని యాప్‌లోని గూగుల్ డీప్‌మైండ్ ఇమేజ్-ఎడిటింగ్ మోడల్ క్యాజువల్ సెల్ఫీని సినిమాటిక్ పోర్ట్రెయిట్‌గా మార్చగల సాధనం. బాలీవుడ్‌ని తలపించేలా మన లుక్‌ని అందంగా మార్చే ఏఐ సాధనం. ప్రస్తుతం ఎటు చూసినా ఈ క్రేజీ ట్రెండ్‌ నడుస్తోంది. అయితే శంతను నాయుడు ఈ ‍క్రేజీ ట్రెండ్‌కి ఎవ్వరూ అమ్ముడుపోరని నమ్మకంగా చెప్పేశారు. నాకస్సలు అర్థం కావడం లేదు చీరలో భారతీయ ప్రజలు తమను తాము చూసుకోవడం ఏంటీ..ఇది చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఎందుకంటే భారతీయత చిహ్నమే చీర. అలాంటి చీరలో తమ లుక్‌ని చూసుకునేంత పిచ్చి ఉండటం ఏంటి. ఇప్పటికే వారి వార్డురోబ్‌లో దాదాపు 15 చీరలపైనే ఉంటాయి. చక్కగా వాటిని తీసి ధరించి చూసుకోండి చాలు. అంతేగానే ఏదో కొత్త ట్రెండ్‌ అని విచిత్రమైన చీరల్లో మీ లుక్‌ని చూసుకునేందుకు ఇంతలా ప్రయాస పడుతూ టెక్నాలజీని వాడాల్సిన పని లేదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతే ఆయన పోస్ట్‌ని చూసిన నెటిజన్లు..ఇది చాలా నిజం, చక్కగా చెప్పారు. బహుశా ఈ స్వభావాన్ని చూసే టాటా దిగ్గజం రత్‌న టాటా మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sock Talks (@socktalks.tv) (చదవండి: టేస్ట్‌ని మిస్‌ అవ్వకుండా హెల్దీగా తిందాం ఇలా..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement