ప్రధాన వార్తలు

మోదీ దెబ్బ.. ఇది ట్రంప్ రాయబారమా?
అమెరికా విషయంలో ఏదైతే అది అయ్యిందనే నిర్ణయానికొచ్చింది భారత్. ఇప్పటిరకూ అమెరికాతో సంబంధాలపై ఆచితూచి అడుగులేసిన భారత్.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రష్యాతో వాణిజ్య ఒప్పందానికే ఓకే చెప్పింది. గత కొంతకాలంగా ట్రంప్ విధించే సుంకాలపై సహనంగా ఉన్న భారత్.. అమెరికా ఆయుధాల కొనుగోలుకు తాత్కాలికంగా ఫుల్స్టాప్ పెట్టింది. ‘రోజూ భయపడుతూ కూర్చుంటే ట్రంప్ ఏదొక నిర్ణయంతో ఇరకాటంలో పెడుతూనే ఉంటారని నిర్ణయానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో భారత్.. ఎట్టకేలకు స్పందించింది. ఎంత సుంకాన్ని అయినా భరిస్తామని, అయితే రష్యాతో వాణిజ్య ఒప్పందం విషయంలో రాజీ పడేది లేదనే సంకేతాలు పంపింది. ఇప్పటివరకూ అమెరికాను మిత్రదేశంగా భావించిన భారత్.. ఉపయోగం లేని మిత్రత్వం అవసరం లేదనే విషయాన్ని యూఎస్కు అర్థమయ్యేలా చెప్పేసింది. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు తాము లొంగమనే విషయాన్ని తేటతెల్లం చేసింది. నెతాన్యాహూ భారత్ పర్యటన..?అమెరికా-భారత్ల మిత్రత్వం దాదాపు చెడిందనే సంకేతాల నడుమ ఇజ్రాయిల్ రంగంలోకి దిగింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ భారత్ పర్యటనకు రాబోతున్నట్లు తెలుస్తోంది. భారత పర్యటనలో నెతాన్యాహూ మోదీని కలిసి ఓ సలహా ఇవ్వనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ సలహా ఏమిటనేది పక్కన పెడితే.. డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన నెతాన్యాహూ భారత్కు ఎందుకు రానున్నారనే చర్చ నడుస్తోంది. ఇది అమెరికా ఆడుతున్న డ్రామాగా ఉంందని మరొక వాదన వినిపిస్తోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన భారత్ను ఒప్పించేందుకు నెతాన్యాహూను ట్రంప్ రాయబారిగా పంపడానికి సిద్ధమయ్యారనే వాదన తెరపైకి వచ్చింది. ప్రత్యేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి మోదీ మాట్లాడటం, అమెరికా ఆయుధాలను, వైమానిక క్షిపణులకు కొనుగోలుపై భారత్ విముఖత వ్యక్తం చేసిన తరుణంలో నెతాన్యాహూ ఆ దిశగానే మోదీతో మాట్లాడేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అనేది భారత్కు అతిపెద్ద మార్కెట్ అనే అంశం అందరికి తెలిసిందే. ఆటువంటి తరుణంలో కూడా భారత్.. అమెరికాతో రాజీ పడేందుకు సిద్ధంగా లేకపోవడంతో నెతాన్యాహూను ట్రంప్ రంగంలోకి దింపే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. ట్రంప్ అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారనే విమర్శ కూడా ఆయనపై ఉంది. అగ్రరాజ్యం అమెరికా అనేది మినహాయిస్తే ఇక్కడ ట్రంప్ గొప్పతనం ఏమీ లేదు. తాము చెప్పినట్లు ‘ఆడాలని’ ట్రంప్ అనుకుంటూ ఉంటారని, అది అన్ని దేశాలతో కుదరదనే విషయం భారత్ చెప్పకనే చెప్పేసింది.. ఇప్పుడు భారత్, రష్యా, చైనాల మైత్రితో అమెరికాకు గుండెల్లో రాయి పడినట్లే ఉంది.మూడు అగ్రదేశాలు ఏకం అవుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ను కాస్త ఇరకాటంలో పడేసినట్లే ఉంది. ఎప్పుడూ భారత్కు వ్యతిరేకంగా ఉండే చైనా కూడా, ఇప్పుడు ట్రంప్ బెదిరింపులను తట్టుకోలేకపోతోంది. మన మంచిని కోరలేని శత్రువుకు అంగుళం చోటిస్తే మొత్తం ఆక్రమిస్తారంటూ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకున్న ట్రంప్.. నెతాన్యాహూను అనధికార రాయబారిగా పంపుతున్నారా? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఒకవేళ నెతాన్యాహూ భారత్ పర్యటనకు వస్తే మాత్రం, కచ్చితంగా అమెరికాతో భారత్ సంబంధాలపై మాట్లాడి రాజీ కుదిర్చే అవకాశాల్ని కూడా కొట్టిపారేయలేం. ఇంకా భారత్-అమరికాల బంధం చాలా బలంగా ఉందని స్వయంగా నెతాన్యాహూ చెప్పిన తరుణంలో.. ఆ దిశగానే పావులు కదిపే అవకాశం ఉంది.

ఏంటి టీసీఎస్లో ఇలా చేస్తున్నారు?
దేశంలో అగ్ర ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరిన ఫ్రెషర్లతో కూడా బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ తన బెంచ్ పాలసీని సవరించిన కొన్ని వారాల తరువాత ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.ఓవైపు లేఆఫ్ ఆందోళనలున్నా జీతాల పెంపు ప్రకటించి ఉద్యోగులకు కాస్త ఊరట కల్పించింది టీసీఎస్. అయితే ఈ ప్రకటనకు ఒక రోజు ముందు, ఒక రెడ్డిట్ యూజర్ తాను బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందంటూ పేర్కొన్నారు. 'టీసీఎస్ ఫైరింగ్ ఫ్రెషర్స్?' అనే శీర్షికతో ఓ పోస్టు పెట్టారు. అహ్మదాబాద్, పుణెకు చెందిన పలువురు ట్రైనీలను కేవలం నాలుగైదు వారాల పాటు బెంచ్పై ఉంచి ఆ తర్వాత ఉద్వాసన పలికారని పేర్కొన్నారు.బెంచ్ పాలసీలో మార్పు, క్రియాశీల క్లయింట్ ప్రాజెక్ట్ లేకుండా అనుమతించదగిన వ్యవధిని 35 రోజులకు తగ్గించడం వంటివాటితో ఒత్తిడి తెచ్చి చప్పుడు లేకుండా ఉద్యోగులను టీసీఎస్ వదిలించుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగాలు తగ్గించుకునేందుకు ఫ్రెషర్లను కూడా వదిలిపెట్టడం లేదన్నారు.బలవంతంగా రాజీనామా చేయించారు'నేను కొన్ని రోజుల క్రితం బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్న రెడ్డిట్ యూజర్ ఫ్రెషర్స్ కూడా జాబ్ కట్ రాడార్ లో ఉన్నారని ఆరోపించారు. హెచ్ఆర్ తనను ఒక సమావేశానికి పిలిచి, తనతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయించి ఆపై తనకు రెండు ఆప్షన్లు ఇచ్చాడని పేర్కొన్నాడు. అవి వెంటనే రాజీనామా చేయడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.రాజీనామా చేయకపోతే ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నెగటివ్ రిలీజ్ లెటర్ జారీ చేస్తామని బెదిరించారని రాసుకొచ్చారు. అదే చెప్పినట్లు రాజీనామా చేస్తే మూడు నెలల వేతనం ఇచ్చి ఎటువంటి నెగటివ్ లేకుండా మంచిగా రిలీజ్ లెటర్ ఇస్తామన్నారని వివరించాడు. తన లాగే మరో నలుగురు ఫ్రెషర్లను కూడా ఏడిపించి బలవంతంగా రాజీనామా చేయించారని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు.తనను క్రియాశీల ప్రాజెక్టుకు కేటాయించినప్పటికీ బలవంతంగా రాజీనామా చేయించి ఆ ఆకస్మిక రాజీనామాకు వ్యక్తిగత కారణాలను పేర్కొనాలని హెచ్ఆర్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజీనామా, తొలగింపు రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని, తన కుటుంబంతో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని ఫ్రెషర్ ఆరోపించారు.👉 చదవండి: హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్..

‘విరాట్ భయ్యా అరుస్తూనే ఉన్నాడు.. నాకేమో భయం’
టెస్టుల్లో అరంగేట్రం సందర్భంగా తనకు ఎదురైన అనుభవం గురించి టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఓవైపు తనను భయపెడుతుంటే.. మరోవైపు.. విరాట్ భయ్యా, రాహుల్ భయ్యా తనను ‘ఆందోళన’కు గురిచేశారంటూ సరదా విషయాలు పంచుకున్నాడు.తొలి వికెట్గా అతడుకాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టు ద్వారా హర్షిత్ రాణా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో అతడు బంతితో రంగంలోకి దిగాడు. ట్రవిస్ హెడ్ (11) రూపంలో తన తొలి అంతర్జాతీయ వికెట్ దక్కించుకున్న ఈ రైటార్మ్ పేసర్.. జిడ్డు ఇన్నింగ్స్తో క్రీజులో పాతుకుపోయిన మిచెల్ స్టార్క్ (112 బంతుల్లో 26)ను కూడా వెనక్కి పంపించాడు.నాకు ఇది గుర్తుండిపోతుందిఈ క్రమంలో హర్షిత్.. స్టార్క్కు బౌన్సర్ సంధించగా.. బంతి అతడి హెల్మెట్కు బలంగా తాకింది. దీంతో కంగారుపడ్డ హర్షిత్.. అంతా ఒకేనా అన్నట్లు స్టార్క్కు సైగ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేను నీకంటే ఫాస్ట్గా బౌల్ చేయగలను. నాకు ఇది గుర్తుండిపోతుంది’’ అంటూ స్టార్క్ సరదాగా వ్యాఖ్యానించాడు.చచ్చానురా దేవుడా!ఈ విషయం గురించి హర్షిత్ రాణా తాజాగా మాట్లాడుతూ.. ‘‘చాలా సేపటి తర్వాత ఆరోజు నేను స్టార్క్కు బౌన్సర్ వేశాను. అతడు స్లెడ్జ్ చేయగానే.. నేను నవ్వేశాను. కానీ.. తిరిగి బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నపుడు.. ‘చచ్చానురా దేవుడా!.. ఇక ఇప్పుడు అతడు నాకు కూడా బౌన్సర్సే వేస్తాడు’ అని భయపడ్డాను.కొట్టు.. ఇంకా కొట్టుఇంతలో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ భయ్యా, కేఎల్ భాయ్.. ‘సేమ్ స్పాట్లో అతడికి మళ్లీ బంతి తగిలేలా బౌలింగ్ వెయ్’ అని అరుస్తూనే ఉన్నారు. నేనేమో.. ‘భయ్యా మీరైతే అతడి బౌలింగ్లో సులభంగానే ఆడేస్తారు. మరి నా పరిస్థితి ఏమిటి?అనుకున్నదే జరిగిందిఅతడు కూడా నన్ను హెల్మెట్పై బంతితో కొడతాడు’ అని మనసులోనే అనుకున్నా. అనుకున్నట్లుగానే రెండో టెస్టులో స్టార్క్ బాల్ను నా హెల్మెట్ మీదకు వేశాడు’’ అని బీర్బైసెప్స్ పాడ్కాస్ట్లో చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ చాంపియన్గా నిలవడంలో స్టార్క్, హర్షిత్లు కీలక పాత్ర పోషించారు.ఇక పెర్త్ టెస్టులో హర్షిత్ రాణా మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలోని టీమిండియా ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే, ఐదు మ్యాచ్ల బోర్డర్- గావస్కర్ ట్రోఫీని మాత్రం 1-3తో చేజార్చుకుంది. చదవండి: AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్!Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2— cricket.com.au (@cricketcomau) November 23, 2024

Rahul Vs EC: ఈసీకి రాహుల్ ఐదు ప్రశ్నలు
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు. ఎక్స్ వేదికగా ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం బీజేపీతో చేతులు కలిపి, దేశంలో ఎన్నికలను ప్రభావితం చేస్తోందంటూ నిన్న (గురువారం) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పని చేస్తోందంటూ.. ఆధారాలతో సహా బయటపెట్టారు. ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా నకిలీ ఓటర్లను చేరుస్తోందని ఆరోపించారు.ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఐదు ప్రశ్నలతో ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ‘‘డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?. సీసీ టీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?. నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేపోతున్నారు?. ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్గా మారిందా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.चुनाव आयोग, 5 सवाल हैं - देश जवाब चाहता है:1. विपक्ष को डिजिटल वोटर लिस्ट क्यों नहीं मिल रही? क्या छिपा रहे हो?2. CCTV और वीडियो सबूत मिटाए जा रहे हैं - क्यों? किसके कहने पर?3. फर्जी वोटिंग और वोटर लिस्ट में गड़बड़ी की गई - क्यों?4. विपक्षी नेताओं को धमकाना, डराना - क्यों?… pic.twitter.com/P0Wf4nh5hc— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2025కాగా, ఇవాళ (శుక్రవారం) బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.

ఈసారి మేడ్ ఇన్ ఇండియా రాఖీలదే హవా.. ఏకంగా రూ.17000 కోట్ల బిజినెస్
రాఖీ (రక్షాబంధన్) పండుగ వస్తుందంటే.. మార్కెట్లు కోలాహలంగా మారిపోతాయి. తోబుట్టువులు రాఖీలు కొనుగోలు చేస్తే.. వారి కోసం అన్నదమ్ములు గిఫ్ట్స్ కోనేస్తుంటారు. ఈ సంవత్సరం రాఖీ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 17,000 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది.''ఈ సంవత్సరం మార్కెట్లలో చైనీస్ రాఖీలు, వస్తువులు కనిపించడం లేదు" అని CAIT సెక్రటరీ జనరల్ & చాందినీ చౌక్ ఎంపీ 'ప్రవీణ్ ఖండేల్వాల్' పేర్కొన్నారు. వినియోగదారులు కూడా చాలావరకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంచుకుంటున్నారని అన్నారు.రక్షా బంధన్ కేవలం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు మాత్రమే కాదు, జాతీయవాదానికి కూడా ప్రతీకగా నిలిచింది. ఈ కారణంగానే ఈ సీజన్లో మోదీ రాఖీ, ఆపరేషన్ సిందూర్ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీలు, డిజిటల్ రాఖీలు కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఖాదీ, వెదురు, పత్తితో తయారు చేసిన పర్యావరణ అనుకూల రాఖీలకు అధిక డిమాండ్ ఉంది. వీటిలో చాలా వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులు, చేతివృత్తులవారు, స్వయం సహాయక బృందాలు చేతితో తయారు చేసినవే ఉన్నాయి.ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..రాఖీలు మాత్రమే కాకుండా.. స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్లు, అలంకరణ వస్తువులు వంటి వస్తువుల ద్వారా ఏకంగా రూ.4,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కైట్ అంచనా వేసింది. ఢిల్లీ, జైపూర్, ముంబై, లక్నో అంతటా ఎక్కువగా దేశభక్తి ఇతివృత్తాలతో కూడిన రాఖీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. రక్షాబంధన్ భారతదేశంలో అత్యంత బలమైన పండుగ సీజన్లలో ఒకటిగా ఉంటుందని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు.

అదిరిపోయే ఫీచర్స్తో వన్ప్లస్ నార్డ్ సీఈ5.. ధర ఎంతంటే..
ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ 'వన్ప్లస్' వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 'వన్ప్లస్ నార్డ్ సీఈ' సిరీస్ను ఒక ప్రధాన లక్ష్యంతో తీసుకొచ్చింది. ఇది శక్తివంతమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్స్, యూజర్ ఇంటర్ఫేస్తో కూడిన సిగ్నేచర్ వన్ప్లస్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది. దీనికి 'వన్ప్లస్ నార్డ్ సీఈ5' (OnePlus Nord CE5) ఒక ఉదాహరణ. లేటెస్ట్ వన్ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాలను కలిగి, ఆక్సిజన్ఓఎస్ అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా ఇది మంచి పనితీరును అందిస్తుంది. ఇది దాని విభాగంలో.. ధరకు తగిన ఫ్రీమియం ఫీచర్స్ అందిస్తుంది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 - వాల్యూ ఫర్ మనీరూ.25వేలు లోపు ధర వద్ద బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ఫోన్ వన్ప్లస్ నార్డ్ సీఈ5. మీరు చెల్లించే డబ్బుకు, తగిన ఫీచర్స్ తప్పకుండా ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ను మీరు మాత్రమే కాకుండా.. మీ సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా పండుగల సమయంలో గిఫ్ట్గా ఇవ్వడానికి అనువైనది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 ఫీచర్లు ఇలా..మీడియాటెక్ 8350 అపెక్స్ప్రతి మొబైల్కు కీలకంగా వ్యవహరించేది దాని ప్రాసెసర్. నార్డ్ సీఈ5లో మీడియాటెక్ 8350 అపెక్స్ చిప్ సెట్ ఉంది. ఇది దాని పనితీరును సూచిస్తుంది. వినియోగదారుల కోసం రూపొందించబడిన కొత్త తరం ప్రాసెసర్ ఇది. యువత మొబైల్ స్పీడ్లో రాజీపడకుండా మెరుగైన పనితీరును కోరుకుంటారు. కాబట్టి దీన్ని సమర్థవంతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించారు. యూజర్లకు అంతరాయం లేకుండా యాప్ను రన్ చేస్తూ, అప్రయత్నంగా మల్టీ టాస్కింగ్ నిర్వహిస్తుంది. పెద్ద సైజ్లో ఉన్న గేమ్లను కూడా 120 ఎఫ్పీఎస్తో స్మూత్ గేమింగ్ పనితీరును నిర్ధారిస్తుంది. వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా పనితీరును ఆప్టిమైజ్ చేసేలా కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తుంది.సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేనార్డ్ సీఈ5లో 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది మంచి విజువల్ను అందిస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, బటర్ స్మూత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో స్క్రీన్ వేగంగా స్పందిస్తుంది. సాధారణంగా అధిక బ్రైట్నెస్ అవుట్ డోర్ విజిబిలిటీకి సమస్యగా ఉంటుంది. హెచ్డీఆర్10+ కాంట్రాస్ట్, కలర్ క్లారిటీతో ఈ సమస్యకు నార్డ్ సీఈ5 చెక్ పెడుతుంది. ఇందులోకి ఏఐ విజువల్ ఎన్హాన్స్మెంట్ విభిన్న లైటింగ్ కండిషన్స్లో వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. గేమ్ ఆడుతున్నా, ఎక్కువగా స్క్రీన్ చూస్తున్నా ఈ డిస్ప్లే యూజర్లకు మెరుగైన అనుభవాన్ని సొంతం చేస్తుంది.కెమెరా సిస్టమ్వన్ప్లస్ నార్డ్ సీఈ5లో కేవలం మెగాపిక్సెల్స్ కోసమే కాకుండా అర్థవంతమైన ఫొటోగ్రఫీ కోసం డిజైన్ చేసిన రిఫైన్డ్ డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది.50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్: తక్కువ వెలుతురులో కూడా అదిరిపోయే క్లారిటీ, డైనమిక్ రేంజ్ అందిస్తుంది.8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా: ల్యాండ్స్కేప్, గ్రూప్ షాట్స్, ఆర్కిటెక్చర్ కోసం ఇది ప్రత్యేకమైంది.60 ఎఫ్పీఎస్ వద్ద 4కే వీడియో: రియల్ టైమ్ స్టెబిలైజేషన్తో ఫ్లూయిడ్, సినిమా క్వాలిటీ రికార్డింగ్ అందిస్తుంది.ఈ ఫోన్లో ప్రతి కెమెరా షాట్ను ఎలివేట్ చేసేలా ఏఐ ఆధారిత ఫొటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి. సీన్ రికగ్నిషన్, ఇంటెలిజెంట్ హెచ్డీఆర్, నైట్ స్కేప్ ఆప్టిమైజేషన్, సోషల్ రెడీ కంటెంట్ కోసం రూపొందించిన సృజనాత్మక ఫిల్టర్లు ఉన్నాయి.అర్థం చేసుకునే ఏఐనార్డ్ సీఈ5ను మార్కెట్లోని ఇతర ఫోన్లతో నిజంగా వేరు చేసేది అందులో వాడుతున్న కృత్రిమ మేధ. ఇందులో స్మార్ట్ ఉత్పాదకత సాధనాలను వాడారు. ఫోన్లోని ఏఐ యూజర్ షెడ్యూల్ను నిర్వహించగలదు. ఈమెయిల్లను చదివి సంక్షిప్తంగా తెలపగలదు. సందర్భోచితంగా నోటిఫికేషన్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వగలదు.కెమెరా ఏఐ: ఫొటో తీస్తున్న సమయంలో సబ్జెక్ట్, బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా ఫోకస్, లైటింగ్, కలర్ టోన్లను ఆటో అడ్జస్ట్ చేస్తుంది. దీంతో మాన్యువల్గా మళ్లీ సదరు ఫొటో లేదా కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్లి మార్పులు చేయాల్సిన పని ఉండదు.120 ఎఫ్పీఎస్ గేమింగ్ పవర్ హౌస్స్మార్ట్ ఫోన్లో గేమింగ్ అనేది ప్రస్తుత రోజుల్లో ప్రధానంగా మారింది. నార్డ్ సీఈ 5 ఈ అనుభవాన్ని చాకచక్యంగా అందిస్తుంది. దాని 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కు అందుకు ఎంతో తోడ్పడుతుంది. 120 ఎఫ్పీఎస్ వద్ద అసాధారణ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.డిజైనింగ్నార్డ్ సీఈ 5 బ్రష్డ్ మ్యాట్ ఫినిష్తో హై-గ్రేడ్ పాలీకార్కొనేట్తో తయారైంది. యూనిబాడీతో ప్రీమియం లుక్ ఉండేలా డిజైన్ చేశారు. ఇది విజువల్ అప్పీల్ మాత్రమే కాకుండా మంచి గ్రిప్ను కూడా నిర్ధారిస్తుంది. సీఈ5లోని కలర్ ఆప్షన్లు కింది విధంగా ఉన్నాయి.గ్రాఫైట్ ఐస్ - రిఫ్లెక్టివ్ షైనింగ్తో మెటాలిక్ గ్రే కలర్.మిస్ట్ బ్లూ - హిమానీనదాల నుండి ప్రేరణ పొంది ఈ రంగులో అందిస్తున్నారు.సన్సెట్ కాపర్ఆక్సిజన్ఓఎస్ఆక్సిజన్ఓఎస్ తాజా వెర్షన్తో నడుస్తున్న నార్డ్ సీఈ 5 రెస్పాన్సివ్, యాడ్ ఫ్రీ సాఫ్టేవేర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఇందులోని స్మార్ట్ ఎఫిషియెన్సీ టూల్స్ మెరుగైన షెల్ఫ్ విడ్జెట్లు, సందర్భోచిత యాప్ సజెషన్లను అందిస్తున్నాయి. వినియోగదారులకు వారి డిజిటల్ గోప్యతపై మరింత నియంత్రణను కల్పించేలా మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే థీమ్స్, ఫింగర్ ప్రింట్ యానిమేషన్లు, ఐకాన్ ప్యాక్లను నియంత్రిస్తుంది. మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు, ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేషన్లను అందిస్తుంది.5జీ కనెక్టివిటీనార్డ్ సీఈ5 డ్యూయల్ 5జీ సిమ్ స్లాట్లను కలిగి ఉంది. ఇది విస్తృత శ్రేణి గ్లోబల్ 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది. అధిక రిజల్యూషన్ కంటెంట్ను స్ట్రీమింగ్ చేస్తున్నా, రియల్ టైమ్ క్లౌడ్ గేమింగ్లో పాల్గొంటున్నా లేదా అధిక మొబిలిటీ సందర్భాల్లో వీడియో కాలింగ్ చేసినా సీఈ 5 అల్ట్రా లో-లేటెన్సీ వల్ల స్థిరమైన వేగంతో పని చేస్తుంది.హై-స్పీడ్, మెరుగైన ఇంటర్నెట్ కోసం వై-ఫై 6ఈడ్యూయల్ డివైజ్ ఆడియో సపోర్ట్, బ్లూటూత్ 5.3 టెక్నాలజీఅంతరాయం లేని మొబైల్ పేమెంట్లు, డివైజ్ పెయిరింగ్ కోసం ఎన్ఎఫ్సీవేగవంతమైన డేటా బదిలీ, రివర్స్ ఛార్జింగ్ సామర్థ్యాల కోసం యూఎస్బీ-ఈ 3.2 జెన్ 1 సదుపాయంఆడియో ఎక్స్ పీరియన్స్ఆడియో కోసం నార్డ్ సిఇ 5 డాల్బీ అట్మోస్ సర్టిఫికేషన్తో స్టీరియో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. గేమింగ్, వీడియోలు చూడటం లేదా కాల్స్లో ఉన్నా స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. మ్యూజిక్ వింటున్న సమయంలో స్పష్టమైన సంగీతం ఆస్వాదించేలా ఏర్పాటు చేశారు. యూఎస్బీ-సీ ద్వారా హై-రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. రియల్టైమ్లో పరిసరాల శబ్దం ఆధారంగా వాల్యూమ్ స్థాయిలను నిర్వహించే ఏఐ ఆధారిత ట్యూనింగ్ సిస్టమ్ ఉంది. 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ను సపోర్ట్ చేస్తుంది.కూలింగ్ సిస్టమ్ఫోన్లో అధిక సైజ్ ఉన్న గేమ్లు ఎక్కువసేపు ఆడితే మొబైల్ వేడవ్వడం సహజం. దీన్ని కట్టడి చేసేందుకు నార్డ్ సీఈ5 మెరుగైన మల్టీ లేయర్ గ్రాఫైట్, వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థను పరిచయం చేస్తుంది. ఇది మునుపటి నార్డ్ మోడళ్ల కంటే వేడిని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుంది. సుదీర్ఘ గేమింగ్ లేదా వీడియో సెషన్ల సమయంలో కూడా సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుంది.భద్రత ఫీచర్లునార్డ్ సీఈ5 డిస్ప్లేపై ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ను అందిస్తుంది. దాంతోపాటు వేగవంతమైన, మరింత సురక్షితమైన యాక్సెస్ కోసం ఏఐ ఆధారిత ఫేస్ అన్లాక్ వెసులుబాటును ఇస్తుంది. ఇందులోని ప్రైవేట్ సేఫ్ 3.0 ద్వారా సున్నితమైన డాక్యుమెంట్లు, ఇమేజ్లు, ఫైళ్లను ఎన్ క్రిప్టెడ్గా స్టోర్ చేసుకోవచ్చు.చివరగా..మిడ్ రేంజ్ మార్కెట్లో వన్ప్లస్ నార్డ్ సీఈ5 కీలకంగా వ్యవహరించనుంది. వినియోగదారులను ఆకర్షించే ఇన్నోవేషన్ ప్రీమియం ధరలతోనే రావాల్సిన అవసరం లేదని వన్ప్లస్ బ్రాండ్ మరోసారి నిరూపించింది. రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్, అర్థవంతమైన ఫీచర్లు, ఇంటెలిజెంట్ డిజైన్ ఎంపికలకు ప్రాధాన్యమిచ్చే నార్డ్ సీఈ5ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీ నుంచి దాని ఏఐ ఆధారిత కెమెరా వరకు, ఫ్లూయిడ్ 120 హెర్ట్జ్ గేమింగ్ నుంచి ప్రాసెసింగ్ ఎనర్జీ వరకు నార్డ్ సీఈ5 వినియోగదారుకు నమ్మశక్యం కాని అనుభవాన్ని అందిస్తుంది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 వేరియంట్స్ & ధరలు1) 8 జీబీ + 128 జీబీ: రూ. 24,9992) 8 జీబీ + 256 జీబీ: రూ. 26,9993) 12 జీబీ + 256 జీబీ: రూ. 28,999

ఓటమి భయం.. పులివెందులలో కూటమి కుతంత్రాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని గత కొన్నిరోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ప్రశాంత వాతావరణంలో గనుక పోలింగ్ జరిగితే ఓటమి ఖాయమని భావిస్తున్న అధికార టీడీపీ.. ఎప్పటికప్పుడు కుట్రలకు, కుతంత్రాలకు తెరతీస్తోంది. తాజాగా..పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక భాగం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. ఇందులో అధికంగా ఓట్లు ఉన్న నల్లపురెడ్డిపల్లి, ఎర్రిబల్లి, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్లనే జబ్లింగ్ చేయడం గమనార్హం. ఎర్రిబల్లి ఓటర్లకు నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ బూత్, నల్లపురెడ్డిపల్లి ఓటర్లకు ఎర్రిబల్లిలో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. దాదాపు 7 వేల ఓట్లు ఈ నిర్ణయంతో ప్రభావితం కానున్నాయి. అయితే.. ఓటర్లను పోలింగ్ బూత్ల వద్దకు రాకుండా చేసేందుకే టీడీపీ నేతలు ఈ కుట్ర పన్నారంటున్న వైఎస్సార్సీపీ అంటోంది. ఎటువంటి సంప్రదింపులు లేకుండా నామినేషన్ల సందర్భంగా ఇచ్చిన పోలింగ్ బూత్ల లిస్టును మళ్లీ ఎలా మారుస్తారని ప్రశ్నిస్తోంది. బూత్లు మార్చేప్పుడు రాజకీయ పార్టీలతో సంప్రదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంటుందని.. కేవలం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఇలా బూత్లను మార్చారంటూ మండిపడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా పోలింగ్ బూత్లను జంబ్లింగ్ చేయడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు.

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ సంచలన ప్రకటన
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్లు జరపొద్దని నిర్ణయించింది. ఎలాంటి సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్లోని అన్ని యూనియన్ల ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది. వారితో ఎలాంటి చర్చలు, సంప్రదింపులు చేయకుండా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా స్టూడియోలు, ఔట్డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుమతి లేకుండా ఎలాంటి సేవలూ అందించకూడదని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది.

‘బకాసుర రెస్టారెంట్’ మూవీ రివ్యూ
వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రవీణ్. ఆయన తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. ఎస్జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటించాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తిసేస్తుంది. ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్(ప్రవీణ్) గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక కామెడీ హారర్ చిత్రం. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో దెయ్యాన్ని తిండిబోతుగా చూపించడం డిఫరెంట్గా అనిపిస్తుంది. సాధారణగా కామెడీ హారర్ చిత్రాల్లో ఒక ఆత్మ ఉండడం..దానికో ఎమోషల్ ప్లాష్బ్యాక్.. క్లైమాక్స్లో దాని కోరిక నెరవేర్చడం.. ఇదే కథ. ఈ చిత్రంలో కూడా అవన్నీ ఉంటాయి. తాంత్రిక పూజకు సంబంధించిన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది. హీరో పరిచయ సన్నివేశంతోనే అసలు కథ ప్రారంభం అవుతుంది. డబ్బుల కోసం యూట్యూబ్ వీడియోలు చేయాలనుకోవడం..గోస్ట్హౌస్కి వెళ్లడం..అక్కడ జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే ప్రతిసారి ఆ తరహా కామెడీనే చూపించడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. అంజిబాబు పాత్ర ఎంట్రీ, అతనిలోకి బకాసుర ఆత్మ వెళ్లిన తర్వాత మళ్లీ కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశారు. ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. బక్క సూరి ప్లాష్బ్యాక్ సన్నివేశాలు ఎమోషనల్గా సాగుతాయి. ఆత్మను అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించే సన్నివేశాలు అలరిస్తాయి. ప్రీక్లైమాక్స్లో వచ్చే అల్లరి దెయ్యాలు కామెడీ ట్రాక్ వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ని కాస్త ఎమోషనల్గా మలిచే ప్రయత్నం చేశారు. రొటీన్ కామెడీ హారర్ కథే అయినా... తిండిబోతు దెయ్యం మాత్రం కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు కమెడియన్గా అలరించిన ప్రవీణ్.. ఇందులో హీరోగా నటించి సినిమా భారం మొత్తం తన భుజాన వేసుకున్నాడు. తన బలమైన కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించాడు. వైవా హర్ష తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే యాక్ట్ చేశాడు. అంజిబాబు పాత్రకి ఫణి న్యాయం చేశాడు. ప్రవీణ్ స్నేహితులుగా నటించిన కుర్రాళ్ల కామెడీ టైమింగ్ బాగుంది. చాలా రోజుల తర్వాత కృష్ణ భగవాన్ వెండితెరపై మెరిశాడు. ఓ హోటల్ యజమానిగా కనిపించిన ఆయన.. తనదైన పంచ్ డైలాగులతో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు రండి
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం మొదలైంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ సిరిసిల్ల, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.కాగా, నగరంలో నిన్న (గురువారం) రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.
ఆర్మీ అన్నలకు ‘రాఖీ’ సెల్యూట్!
బ్యాంకులకు 15 రోజులే టైమ్.. సెటిల్ చేయాల్సిందే!
ప్రతీ వరద నీటి బొట్టు మూసీలోకి చేరేలా ప్రణాళిక సిద్ధం చేయండి: సీఎం రేవంత్
‘నువ్వేరకం పఠాన్వి?.. అలా అనొద్దు.. 15 కుట్లు పడ్డాయి’
గుంటూరు జైలు నుంచి తురకా కిషోర్ విడుదల
రజినీకాంత్ వీరాభిమాని.. హీరో అంటే ఇంత పిచ్చేంటి సామీ?
‘విరాట్ భయ్యా అరుస్తూనే ఉన్నాడు.. నాకేమో భయం’
ఏంటి టీసీఎస్లో ఇలా చేస్తున్నారు?
మోదీ దెబ్బ.. ఇది ట్రంప్ రాయబారమా?
అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు
అమ్మా.. కుండ పగిలింది ఇంటికి పోదాం
చైనా పర్యటనకు ప్రధాని మోదీ
ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు.. భూవివాదాలు తీరతాయి
పాలన అలాగే కొనసాగిస్తారట!!
తల్లి తీరు నచ్చక కొడుకు ఆత్మహత్య
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్
మూడు రోజుల వరుస సెలవులు.. ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు!
భారత పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్ల ప్రకటన.. హైలైట్గా నిలిచిన కొన్స్టాస్ ఎంపిక
దుక్కి దున్ని.. నాట్లు వేసి
సాక్షి కార్టూన్ 08-08-2025
టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోయావా జైస్వాల్..: రోహిత్
ఆసియాకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్..?
జింబాబ్వే ప్లేయర్ వరల్డ్ రికార్డు..
‘బకాసుర రెస్టారెంట్’ మూవీ రివ్యూ
IND vs ENG: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్
విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్!
‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
మొన్న నేషనల్ అవార్డ్.. ఇప్పుడు తెలుగు సింగర్ నిశ్చితార్థం
ప్రీతి జింటా జట్టుకు కొత్త కెప్టెన్
ఆర్మీ అన్నలకు ‘రాఖీ’ సెల్యూట్!
బ్యాంకులకు 15 రోజులే టైమ్.. సెటిల్ చేయాల్సిందే!
ప్రతీ వరద నీటి బొట్టు మూసీలోకి చేరేలా ప్రణాళిక సిద్ధం చేయండి: సీఎం రేవంత్
‘నువ్వేరకం పఠాన్వి?.. అలా అనొద్దు.. 15 కుట్లు పడ్డాయి’
గుంటూరు జైలు నుంచి తురకా కిషోర్ విడుదల
రజినీకాంత్ వీరాభిమాని.. హీరో అంటే ఇంత పిచ్చేంటి సామీ?
‘విరాట్ భయ్యా అరుస్తూనే ఉన్నాడు.. నాకేమో భయం’
ఏంటి టీసీఎస్లో ఇలా చేస్తున్నారు?
మోదీ దెబ్బ.. ఇది ట్రంప్ రాయబారమా?
అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు
అమ్మా.. కుండ పగిలింది ఇంటికి పోదాం
చైనా పర్యటనకు ప్రధాని మోదీ
ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు.. భూవివాదాలు తీరతాయి
పాలన అలాగే కొనసాగిస్తారట!!
తల్లి తీరు నచ్చక కొడుకు ఆత్మహత్య
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్
మూడు రోజుల వరుస సెలవులు.. ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు!
భారత పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్ల ప్రకటన.. హైలైట్గా నిలిచిన కొన్స్టాస్ ఎంపిక
దుక్కి దున్ని.. నాట్లు వేసి
సాక్షి కార్టూన్ 08-08-2025
టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోయావా జైస్వాల్..: రోహిత్
ఆసియాకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్..?
జింబాబ్వే ప్లేయర్ వరల్డ్ రికార్డు..
‘బకాసుర రెస్టారెంట్’ మూవీ రివ్యూ
IND vs ENG: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్
విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్!
‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
మొన్న నేషనల్ అవార్డ్.. ఇప్పుడు తెలుగు సింగర్ నిశ్చితార్థం
ప్రీతి జింటా జట్టుకు కొత్త కెప్టెన్
సినిమా

కూలీ సినిమా రిలీజ్.. అక్కినేని ఫ్యాన్స్కు నాగార్జున బిగ్ సర్ప్రైజ్!
అక్కినేని నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. 1990లో రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున సైతం శివ రోజులను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్లో ఒకటిగా నిలుస్తుందని నాన్న చెప్పారని అన్నారు.4కెలో శివ ..అయితే అప్పట్లో సినీ ప్రియులను ఓ రేంజ్లో అలరించిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజైతే ఎలా ఉంటుంది. శివ సినిమాను ఇప్పుడున్న టెక్నాలజీతో మీ ముందుకు తీసుకొస్తే మీ ఫీలింగ్ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే మీ కోసమే నాగార్జున బిగ్ ప్లాన్తో వస్తున్నారు. సరికొత్త టెక్నాలజీతో శివ మూవీ చూసే అవకాశం త్వరలోనే రానుంది. మొట్ట మొదటిసారి అత్యాధునిక 4కె డాల్బీ అట్మాస్ సౌండ్తో ఈ చిత్రాన్ని వీక్షించే ఛాన్స్ అభిమానులకు దక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాగార్జున వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులకు నాగ్ గుడ్ న్యూస్ చెప్పారు.కూలీ థియేటర్లలో ట్రైలర్..అంతే కాకుండా రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ మూవీ రిలీజ్ రోజే నాగార్జున్ ఈ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదే రోజు థియేటర్లలో శివ ట్రైలర్ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దీంతో కూలీ సినిమా చూసే నాగ్ ఫ్యాన్స్కు డబుల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. శివ రీ రిలీజ్ డేట్ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నాగార్జున ట్వీట్ చేశారు. ఇది చూసిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కంగ్రాట్స్ టూ శివ టీమ్ అంటూ పోస్ట్ చేశారు.Hey @iamnagarjuna CONGRATS to #ShivaTeam ,and all your FANS #Shiva4KDolbyAtmos https://t.co/6zfsam7uvr— Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2025

అవకాశాల్లేవంటున్న బ్యూటీ.. బాస్ పాటతోనైనా కలిసొచ్చేనా?
'నాగిని' సీరియల్తో పాపులారిటీ సంపాదించుకుంది బుల్లితెర నటి మౌనీ రాయ్ (Mouni Roy). బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లాలన్న ఆశ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే పంజాబీ చిత్రంతో నెరవేరింది. 'గోల్డ్' అనే హిందీ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి చిత్రానికి బెస్ట్ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. భారీ బడ్జెట్ మూవీ 'బ్రహ్మాస్త్ర: పార్ట్ 1'లోనూ భాగమైంది. అంచనాలు తలకిందులుఈ చిత్రానికిగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్, ఐఫా అవార్డులు గెలుచుకుంది. అయితే తాను ఊహించినంతగా భారీ సినిమాల అవకాశాలు మాత్రం రావడం లేదని బాధపడుతోంది. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీరాయ్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర మూవీ తర్వాత చాలా ఆఫర్లు వస్తాయనుకున్నాను. కానీ అది నిజమవలేదు. సినిమాకు ఎవర్ని సెలక్ట్ చేయాలన్నప్పుడు కనీసం నా పేరు కూడా ప్రస్తావించడం లేదనుకుంటా!ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీఅందుకు గల కారణాలేంటో తెలియడం లేదు. అయితే కెరీర్ మాత్రం ఆగిపోలేదు. ఓటీటీ ప్రాజెక్టులతో పాటు రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తూ, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇలా ఏదో ఒకరకంగా ఎప్పుడూ బిజీగా ఉంటున్నాను. అవకాశాలు సరైన సమయంలో వాటంతటవే వస్తాయని ఎదురుచూస్తున్నాను. దాని గురించి అంతగా బాధపడుతూ కూర్చోవట్లేదు.నా జర్నీని తక్కువ చేయలేనుఎందుకంటే నా కెరీర్ ఎక్కడో మొదలై.. ఇంతదూరం వచ్చాను. ఇప్పటివరకు ఎన్నో సాధించాను. ఈ విషయంలో సంతృప్తిగా ఉండాలే తప్ప చేసిన పనిని చులకన చేసి మాట్లాడలేను. అయినా సినిమా ఫైనలైజ్ అవ్వాలంటే ముందు ఎన్నో ఉంటాయి. స్క్రిప్ట్ కుదరాలి, నిర్మాణ సంస్థలు భాగమవ్వాలి, బడ్జెట్ లెక్కలేసుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాకే నటీనటుల సెలక్షన్ ఉంటుంది. విశ్వంభరతోనైనా దశ తిరిగేనా?వాళ్లనుకునే పాత్రలో మనల్ని ఊహించుకోలేకపోతే కనీసం లుక్ టెస్ట్కు కూడా పిలవరు. కాబట్టి సినిమాలో భాగం అవడమనేది నటీనటుల చేతిలో ఉండదు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మౌనీరాయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! విశ్వంభర మూవీలో ఈ నటి చిరంజీవితో స్టెప్పులేసిందట! ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. విశ్వంభరతోనైనా మౌనీ దశ తిరుగుతుందేమో చూడాలి!చదవండి: 49 ఏళ్ల వయసులో సత్తా చాటిన ప్రగతి.. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్

జపాన్ భాషలో మాట్లాడిన నాగార్జున, చైతూ.. ఏం చెప్పారంటే?
టాలీవుడ్ సినిమాలకు కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటు మనదేశంలోనూ క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. మనదేశంలో అత్యంత ఆదరణ దక్కించుకుంటోన్న ఇండస్ట్రీలో మన సినిమాలే ముందుంటాయి. ఇక విదేశాల్లోనూ మన చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఇక జపాన్ ప్రజలైతే ఇండియన్ సినిమాలంటే పడి చచ్చిపోతారు. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు అక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే పలు టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు జపాన్లో విడుదల చేశారు. జపాన్కు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఏకంగా తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే మరో టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాన్ని జపాన్లో విడుదలైంది. అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ నటించిన మనం సినిమా జపాన్ థియేటర్లలో సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. జపాన్ ప్రజలను వారి భాషలోనే పలకరిస్తూ మాట్లాడారు. ఈ సినిమా తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. మీకు కూడా ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నామంటూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో నాగ్, చైతూ జపాన్ భాషలో మాట్లాడడం విశేషం.కాగా.. అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ను కవర్ చేస్తూ వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం 'మనం'. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సైతం నటించారు. సమంత, శ్రియా శరణ్ హీరోయిన్లుగా మెప్పించిన ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. గతేడాది పదేళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. దీంతో సమంత-నాగ చైతన్యను బిగ్ స్క్రీన్పై మరోసారి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.The evergreen classic #Manam releasing in Japan on August 8th ❤️🔥Here's the special video byte by King @iamnagarjuna & Yuvasamrat @chay_akkineni to all the audience of Japan #ANRLivesOn pic.twitter.com/Fu5gxBRhx4— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) August 7, 2025

ఏఐ మాయ.. సౌత్ స్టార్స్ ఇలా అయిపోయారేంటి?
ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీని కాస్తా గట్టిగానే వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫన్ క్రియేట్ చేసేందుకు ఏఐని విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఫోటోలు, వీడియోల కంటెంట్ను ఎక్కువగా సృష్టిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్స్ వారి సతీమణులతో ఉన్న ఫన్నీ వీడియోను నెట్టింట హల్చల్ చేశాయి. ఈ వీడియో ఫ్యాన్స్కు తెగ నవ్వులు తెప్పించింది.తాజాగా అలాంటి వీడియోనే దక్షిణాది సూపర్ స్టార్స్తో రూపొందించారు. హీరోలు సూర్య, అజిత్, బన్నీ, మహేశ్ బాబు, విజయ్, రామ్ చరణ్తో కలిసి ఫన్నీగా రూపొందించారు. ఇందులో హీరోలంతా హీరోయిన్స్కు ఫుడ్ తినిపిస్తూ కనిపించారు. ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. తమ స్టార్ హీరోలేంటి ఇలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి.Prabhas annaaaaaa😂🤣😁#Prabhas𓃵 pic.twitter.com/43OVHX8wYQ— G.O.A.T Prabhas (@goatPB1) August 8, 2025
న్యూస్ పాడ్కాస్ట్

ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచాం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి

భారత్పై మరో 25 శాతం టారిఫ్ విధించిన డొనాల్డ్ ట్రంప్... 50 శాతానికి చేరిన అమెరికా సుంకాల భారం

ఆంధ్రప్రదేశ్లో న్యాయం, ధర్మం లేకుండా దుర్మార్గ పాలన సాగుతోంది... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

సూత్రధారి చంద్రబాబే. తీగల విజయేందర్ రెడ్డి సహకారంతోనే 11 కోట్ల రూపాయల జప్తు డ్రామా.

కృష్ణా నదిలో నిత్యం ఇసుక దోపిడీ... ఏపీ సీఎం చంద్రబాబు నివాసం పక్కనే భారీ కుంభకోణం

చంద్రబాబు మోసం ఇవాళ మరోసారి నిజమైంది.... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఆంధ్రప్రదేశ్లో సుఖీభవకు కోత, అన్నదాతకు వాత... పెట్టుబడి సాయం ఎగ్గొడుతున్న చంద్రబాబు ప్రభుత్వం

పార్టీ వాళ్లను నేను కలవడానికి ఇన్ని ఆంక్షలెందుకు? నెల్లూరు పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్

నేడు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. కూటమి సర్కార్ భారీ ఆంక్షలు.. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా..

ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం... వేధింపులకు గురైన వారి కోసం త్వరలో ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు వెల్లడి
క్రీడలు

టీమిండియా సెలక్టర్లు కాదు.. ఇకపై అతడే డిసైడ్ చేస్తాడా?
టీమిండియాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ (Sandeep Patil) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవతరం ఆటగాళ్లంతా పనిభారం అంటూ సాకులు చూపడం సరికాదని విమర్శించాడు. ఆధునిక క్రికెట్లో కెప్టెన్, హెడ్కోచ్ కంటే ఫిజియోలకే ఎక్కువ ప్రాముఖ్యం దక్కుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు టీమిండియా ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను గిల్ సేన 2-2తో సమంగా ముగించింది. బుమ్రా మూడే ఆడాడుఅయితే, ఈ సిరీస్లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా.. అతడిని కేవలం మూడు టెస్టుల్లోనే ఆడించారు. పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా కీలక సమయంలో.. కీలక మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది. సిరీస్ డ్రా అయింది కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే బుమ్రాతో పాటు మేనేజ్మెంట్పై విమర్శల దాడి మరింత ఎక్కువయ్యేది. ఈ నేపథ్యంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అతడే డిసైడ్ చేస్తాడా?‘‘అసలు బీసీసీఐ ఇలాంటి వాటికి ఎలా అంగీకరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. కెప్టెన్, హెడ్కోచ్ కంటే వీరికి ఫిజియోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయ్యేలా ఉన్నాడు. అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు?సెలక్షన్ కమిటీ సమావేశాల్లో వీరితో కలిసి ఫిజియో కూడా కూర్చుంటాడా ఏమిటి?. ఎవరి వర్క్లోడ్ ఎంత? ఎవరు ఆడాలని అతడే డిసైడ్ చేస్తాడా?’’ అని 1983 వన్డే వరల్డ్కప్ విన్నర్ సందీప్ పాటిల్ అసహనం వ్యక్తం చేశాడు.పనికిమాలిన వ్యవహారంఅదే విధంగా.. ‘‘వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేదే ఓ పనికిమాలిన వ్యవహారం. ఆటగాళ్లు ఫిట్గా ఉన్నారా? లేదంటే అన్ఫిట్?.. ఈ రెండిటి ఆధారంగానే జట్ల ఎంపిక ఉండాలి. అంతేగానీ.. ఈ వర్క్లోడ్ బిజినెస్ను పట్టించుకోకూడదు.మా రోజుల్లో అయితే ఫ్యాన్సీ స్ట్రోక్స్ ఆడేందుకు ప్రయత్నించినా సునిల్ గావస్కర్ తిట్టేవాడు. అయితే, రోజులు మారాయి. కానీ ఈ నవతరం క్రికెటర్లు తరచూ మ్యాచ్లు మిస్ కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా’’ అని సందీప్ పాటిల్ మిడ్-డేతో పేర్కొన్నాడు.చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్

IPL 2026: నన్ను విడిచిపెట్టండి.. వెళ్లిపోతా!.. సీఎస్కేకు గుడ్బై?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే ట్రేడింగ్ రూపంలో జట్లలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సంజూ శాంసన్ (Sanju Samson). రాజస్తాన్ రాయల్స్కు కెప్టెన్గా రాణించిన ఈ కేరళ బ్యాటర్.. వచ్చే ఎడిషన్లో ఈ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాను ఫిట్గా ఉన్నా రియాన్ పరాగ్ (Riyan Parag)కు కెప్టెన్సీ ఇవ్వడం, మెగా వేలంలో జోస్ బట్లర్ను విడిచిపెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో సంజూ.. రాయల్స్ను వీడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.సీఎస్కేకు అశ్విన్ గుడ్బై?ఈ క్రమంలో తెరమీదకు వచ్చిన మరో ఆసక్తికర వార్త ఇందుకు బలం చేకూరుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. తనను విడిచిపెట్టమని సీఎస్కేను కోరాడని దాని సారాంశం. దీనిని బట్టి సీఎస్కే అశూను రాయల్స్కు ఇచ్చి.. వారి నుంచి సంజూను ట్రేడ్ చేసుకోనుందనే ప్రచారం ఊపందుకుంది.కాగా 2009లో అశ్విన్ సీఎస్కేతోనే తన ఐపీఎల్ కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత రైజింగ్ పుణె సూపర్జెయింట్ (ఇప్పుడు మనుగడలో లేదు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడాడు. ఇక 2022లో రాజస్తాన్ రాయల్స్లో చేరిన అశ్విన్.. గతేడాది వరకు అక్కడే విజయవంతంగా కొనసాగాడు.రూ. 9.75 కోట్లకు కొనుగోలుఅయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని విడుదల చేయగా.. సీఎస్కే రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ.. ఈ సీజన్లో అశ్విన్కు తొమ్మిది మ్యాచ్లలో ఆడే అవకాశం మాత్రమే దక్కింది. అయితే, అందులోనూ అతడు నిలకడగా రాణించలేకపోయాడు. కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వేరే జట్టుకు మారతాడా?యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో మేనేజ్మెంట్ అశూను పలు మ్యాచ్లలో బెంచ్కే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ సీఎస్కేను వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, రాయల్స్ అతడిని తిరిగి తీసుకుంటుందా? లేదంటే వేరే జట్టుకు మారతాడా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా ఐపీఎల్లో అశ్విన్ మొత్తంగా 220 మ్యాచ్లు ఆడి 187 వికెట్లు కూల్చాడు.ఇక గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే అశూ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ చెన్నై ప్లేయర్.. టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు కూల్చాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3503, 707, 184 పరుగులు సాధించాడు.చదవండి: అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఆసియాకప్లో ఆడాల్సిందే: గంగూలీ

నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్
విరాట్ కోహ్లి (Virat Kohli).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్లో సంచలనాలు సృష్టించిన ఈ దిగ్గజ బ్యాటర్.. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. టీమిండియా లెజెండ్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సెంచరీలు (82) బాదిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.ప్రపంచ రికార్డుఇక వన్డేల్లో సచిన్కూ సాధ్యం కాని విధంగా.. 51 శతకాలు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే, గతేడాది అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకొన్న ఈ రన్మెషీన్.. ఇటీవలే టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఊహించని విధంగాసంప్రదాయ క్రికెట్లో టీమిండియాను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన విరాట్ కోహ్లి.. తనలో ఇంకా ఆడగలిగే సత్తా ఉండి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ.. ‘‘గడ్డానికి కొన్ని రోజుల క్రితమే రంగు వేసుకున్నాను.తరచూ ఇలా గడ్డానికి రంగే వేయాల్సి వస్తుందంటేనే.. మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని అర్థం’’ అంటూ లండన్లో యువీ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన కోహ్లి సరదాగా వ్యాఖ్యానించాడు. తాజాగా కోహ్లి న్యూ లుక్కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.నిన్ను ఇలా చూడలేకపోతున్నాం విరాట్ భయ్యా! భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త షాష్ విరాట్ కోహ్లితో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో గురువారం షేర్ చేశాడు. ఇందులో కోహ్లి గడ్డం, మీసం తెల్లబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది చూసిన కింగ్ అభిమానులు.. ‘‘నిన్ను ఇలా చూడలేకపోతున్నాం విరాట్ భయ్యా! నువ్వు పెద్దవాడివై పోతున్నామంటే మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు ఎల్లప్పుడూ యాంగ్రీ యంగ్మేన్ లుక్లోనే ఉండాలి’’ అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు.వన్డేలకు కూడా రిటైర్మెంట్?మరికొందరేమో టెస్టులోకి తిరిగి రావాలని కోరుతుండగా.. ఇంకొందరు మాత్రం వన్డేలకు కూడా కోహ్లి త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టుల నుంచి వైదొలిగిన 36 ఏళ్ల కోహ్లి.. వన్డేల్లో, ఐపీఎల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. తిరుగులేని ఛేజింగ్ కింగ్కాగా విరాట్ కోహ్లి తదుపరి ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా టీమిండియాలో పునరాగమనం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 123 టెస్టులు, 125 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 9230, 4188 పరుగులు సాధించాడు.ఇక వన్డేల్లో ఛేజింగ్ కింగ్గా పేరొందిన కోహ్లి ఇప్పటికి 302 మ్యాచ్లు ఆడి 14181 పరుగులు చేశాడు. చివరగా ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కోహ్లి ఆడాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలన్న కోహ్లి, ఆర్సీబీ పదిహేడేళ్ల కల నెరవేరింది. ఇక కోహ్లి తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్లతో కలిసి లండన్లోనే ఎక్కువగా నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. చదవండి: సంజూ శాంసన్కు మీకిస్తే బదులుగా ఇద్దరిని ఇవ్వండి.. రాయల్స్ డిమాండ్..!

అదొక హేయమైన చర్య: టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయంతో బాధపడుతున్న ఆటగాడిపై కనికరం చూపకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. కొంతమంది ఆటగాళ్లను బెంచ్కే పరిమితం చేసి.. మరికొందరిని మాత్రం రేసు గుర్రాల్లా ఎందుకు పరుగెత్తిస్తున్నారంటూ మండిపడ్డాడు.అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ (IND vs ENG)తో చావోరేవో తేల్చుకోవాల్సిన ఐదో టెస్టులో టీమిండియా ఆఖరి వరకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఓవల్ టెస్టులో భారత్ విధించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) శతకాలతో చెలరేగి తమ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.ఇంజక్షన్ తీసుకున్నావా?ఆరంభంలోనే ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. ఈ తరుణంలో కెప్టెన్ శుబ్మన్ గిల్.. పేసర్ ఆకాశ్ దీప్ను ఉద్దేశించి.. ‘‘ఇంజక్షన్ తీసుకున్నావా’’ అంటూ ఆరా తీయడం స్టంప్ మైకులో రికార్డయింది. కాగా వెన్నునొప్పి వల్ల నాలుగో టెస్టుకు దూరమైన ఈ రైటార్మ్ పేసర్కు.. ఐదో టెస్టులోనూ కాలికి గాయమైంది. అయినా సరే అతడిని ఆటలో కొనసాగించారు.ఎట్టకేలకు ఆఖరిదైన ఐదో రోజు టీమిండియా విజయానికి నాలుగు వికెట్లు అవసరం కాగా.. మహ్మద్ సిరాజ్ మూడు, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీసి జట్టును గెలిపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. ‘‘ఆకాశ్ దీప్ ఇంజక్షన్ తీసుకున్నాడా? లేదా? అన్న విషయం గురించి అడిగినట్లు ఇంగ్లిష్ కామెంట్రీలో స్పష్టంగా వినిపించింది.హేయమైన చర్యఓ బౌలర్కు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా టెస్టు మ్యాచ్ ఆడిస్తున్నారా? ఫిట్గా ఉన్న లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను మాత్రం బెంచ్ మీదే ఉంచుతారు. ఆకాశ్ బదులు అతడిని ఎందుకు ఆడించరు?పూర్తి ఫిట్గా లేని ఆటగాడితో బరిలోకి దిగడం నేరం లాంటిదే. హేయమైన తప్పిదం. మీ జట్టులోని మరో ఇద్దరు బౌలర్లు పూర్తి ఫిట్గా ఉన్నా వారిని ఆడించరు. రేసుగుర్రాల్లా మిగతావారిని పరిగెత్తిస్తారు.సిరాజ్కు విశ్రాంతే లేదుసిరాజ్ను కూడా మీరు వరుస మ్యాచ్లలో వాడుకున్నారు. అతడు కూడా పూర్తిగా అలసిపోయాడు. అదే ఇంగ్లండ్ జట్టును చూడండి. వాళ్లు నలుగురు పేస్ బౌలర్లను ఆడించారు. అందులో ఒక్కరు గాయపడినా.. మిగతా ముగ్గురు బాగానే ఉన్నారు.మీకు మాత్రం ముగ్గురంటే ముగ్గురే బౌలర్లు. అందులో ఒకరు సగం సగం ఫిట్గా ఉంటారు. అయినా ఇందులో ఆకాశ్ దీప్ తప్పేం లేదు’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు టీమిండియా మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. ఇదిలా ఉంటే.. పనిభారం తగ్గించే దృష్ట్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఇంగ్లండ్లో ఐదింట కేవలం మూడు మ్యాచ్లలోనే యాజమాన్యం ఆడించింది.వారిద్దరు ఒక్క మ్యాచ్ ఆడకుండానే..మరోవైపు.. సిరాజ్ మాత్రం ఐదింటిలోనూ ఆడి వెయ్యికి పైగా బంతులు వేసి 23 వికెట్లు కూల్చాడు. ఇక.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోగా.. అర్ష్దీప్ సింగ్ టెస్టు అరంగేట్రం కూడా వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది. చదవండి: చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్
బిజినెస్

ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును వెనక్కితీసుకున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను వెనక్కి తీసుకుంది. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ నూతన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను తాజాగా ఉపసంహరించుకుంది.బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సులను చేర్చి నూతన ఆదాయపు పన్ను బిల్లు సరికొత్త వెర్షన్ ఆగస్టు 11న అంటే సోమవారం తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లులో కొత్త మార్పులు చేస్తన్న క్రమంలో బహుళ వెర్షన్ల గందరగోళాన్ని నివారించడానికి అన్ని మార్పులతో స్పష్టమైన, నవీకరించిన ఆదాయపు పన్ను బిల్లును ఆగస్టు 11న సభ పరిశీలన కోసం ప్రవేశపెట్టనున్నారు.ఆదాయపు పన్ను బిల్లు 2025 మార్పులుగత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు- 2025 అరవై సంవత్సరాల నాటి భారతదేశ ప్రత్యక్ష పన్ను చట్టంలో పలు కీలక మార్పులు తీసుకొస్తోంది. 298-సెక్షన్ ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ప్రస్తుత శాసనం కంటే 50 శాతం తక్కువ సరళమైన భాషలో రాసిన ఆధునిక, పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వక చట్టాన్ని తీసుకురావడం ఆదాయపు పన్ను బిల్లు- 2025 ముఖ్యమైన లక్ష్యం.

హైస్పీడ్ డేటాతో కొత్త రీఛార్జ్ ప్లాన్
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పరిచయం చేస్తూ.. యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే వోడాఫోన్ ఐడియా (VI) రూ.365 రీఛార్జ్ ప్యాక్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వోడాఫోన్ ఐడియా.. తన కస్టమర్ల కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్, కాలింగ్ను అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 365 తీసుకొచ్చింది. ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే.. అన్లిమిటెడ్ కాల్స్తో పాటు రోజుకి 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. హై-స్పీడ్ 4G ఇంటర్నెట్ ఆస్వాదించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

‘ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ సర్వనాశనం’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మాది గొప్ప అంటే మాది గొప్ప.. అంటూ చంకలు చరుచుకోవడం కంపెనీలకు అలవాటైంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను నాశనం చేస్తుందని చెప్పారు.సత్య నాదెళ్ల పోస్ట్ చేస్తూ..‘ఈ రోజు జీపీటీ-5 మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, కోపైలట్, గిట్హబ్ కోపైలట్, అజూర్ ఏఐ ఫౌండ్రీతో సహా మా ప్లాట్ఫామ్ల్లో లాంచ్ అవుతుంది. ఇది ఓపెన్ఏఐ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన మోడల్. ఇది రీజనింగ్, కోడింగ్, చాట్లో మెరుగైన పురోగతిని అందిస్తుంది. దీని మోడల్స్ అన్నీ అజూర్లో శిక్షణ పొందాయి. సామ్ఆల్ట్మన్ మాతో చేరి రెండున్నరేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాం. బింగ్లో జీపీటీ-4 ఇంప్లిమెంట్ చేసేందుకు సామ్ మాతో చేరారు. అప్పటి నుంచి ఎంతో సాధించాం. తాజా పురోగతితో వేగం పెరుగుతుంది. ఈ మోడల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.Today, GPT-5 launches across our platforms, including Microsoft 365 Copilot, Copilot, GitHub Copilot, and Azure AI Foundry. It's the most capable model yet from our partners at OpenAI, bringing powerful new advances in reasoning, coding, and chat, all trained on Azure.It’s… pic.twitter.com/jHDA94YOL0— Satya Nadella (@satyanadella) August 7, 2025ఇదీ చదవండి: ‘భారత్ను బెదిరిస్తారు’.. సూపర్ పవర్గా ఎదగాలంటే..సత్య పోస్ట్పై ఎలాన్మస్క్ స్పందిస్తూ.. ‘త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను బ్రతికుండగానే మింగేస్తుంది’ అన్నారు. దీనిపై సత్య ప్రతిస్పందిస్తూ.. ‘కొందరు 50 ఏళ్లుగా అందుకోసం ప్రయత్నిస్తున్నారు. అదే సరదా అయిన విషయం! ప్రతిరోజూ మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. సృజనాత్మకతను జోడిస్తూ భాగస్వామిగా మారుతారు. తర్వాత ఇతరులతో పోటీపడతారు. అజూర్లో గ్రోక్ 4 వినియోగంపట్ల ఉత్సాహంగా ఉన్నాను. గ్రోక్ 5 కోసం ఎదురుచూస్తున్నాను!’ అని రాసుకొచ్చారు. ‘గ్రోక్ 4 హెవీ రెండు వారాల క్రితం జీపీటీ 5 కంటే స్మార్ట్గా ఉంది’ అని మస్క్ రిప్లై ఇచ్చారు. దాన్ని సూచించే కొన్ని డేటా పాయింట్లు ఉన్న పోస్ట్ను కోట్ చేశారు.OpenAI is going to eat Microsoft alive— Elon Musk (@elonmusk) August 7, 2025People have been trying for 50 years and that’s the fun of it! Each day you learn something new, and innovate, partner, and compete. Excited for Grok 4 on Azure and looking forward to Grok 5!— Satya Nadella (@satyanadella) August 7, 2025

ట్రాఫిక్ సమస్యకు చెక్!.. జపాన్ కంపెనీ వ్యూహం ఇదే..
అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ అనేది వాహన వినియోగదారులకు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. దీనిని పరిష్కరించే దిశలోనే జపాన్ విమానయాన సంస్థ 'ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్' (ANA) అడుగులు వేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ (ANA) కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ జాబీ ఏవియేషన్తో భాగస్వామ్యం ద్వారా జపాన్లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు కంపెనీలు ఒక జాయింట్ వెంచర్ను స్థాపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీని ద్వారా 100కి పైగా ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) ట్యాక్సీలను మోహరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2027 నాటికి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.జపాన్ కంపెనీ తయారు చేయనున్న.. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఐదు సీట్లను కలిగి ఉంటాయి. ఇందులో ఒక పైలట్, నలుగురు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలరు. ఇది గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఈ తరహా ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చిన తరువాత నరిటా, హనేడా విమానాశ్రయాలు - సెంట్రల్ టోక్యో మధ్య ప్రయాణించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ వెల్లడించింది.ఇదీ చదవండి: 75 దేశాల్లో కోటి మంది కొన్నారు: ధర కూడా తక్కువే..ఎయిర్ టాక్సీల ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా సంస్థ తన మొదటి ఎయిర్ టాక్సీని అక్టోబర్ 2025లో జరిగే ఒసాకా ఎక్స్పోలో ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఇవి తక్కువ శబ్దంతో.. వినియోగంలో లేనప్పుడు జీరో ఉద్గారాలను ఉత్పత్తి చేసేలా కంపెనీ నిర్మించనుంది.
ఫ్యామిలీ

70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ రోష్ని దేవి సంగ్వాన్ డైట్ సీక్రెట్..!
చాలామంది ప్రముఖుల డైట్ సీక్రెట్ల గురించి విన్నాం. అలా చేస్తే మనం కూడా స్మార్ట్గా మారిపోవచ్చు అని ప్రేరణ కలిగించేలా ఉంటాయి అవి. కానీ అలా ఏదీ పడితే అది ఫాలో కావొద్దని చెబుతోంది ఈ 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్. శరీరం మాట వినండి, అందరికీ ఒక విధమైన డైట్ ఎట్టిపరిస్థితిలో సరిపడదని కూడా సూచిస్తోంది. ఈ వయసులో కూడా చురుగ్గా బరువులు ఎత్తే ఆమె తన డైట్ సీక్రెట్ని షేర్ చేసుకోవడమే గాక ఎలా ఆహారం తీసుకుంటే మంచిదో కూడా సూచించారు. రోష్ని దేవి సంగ్వాన్ 68 సంవత్సరాల వయస్సులో వెయిట్లిఫ్టింగ్ ప్రారంభించి ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్గా మారారు. ఆమె ఆర్థరైటిస్తో బాధపడుతున్నప్పటికీ తన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ.. ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారామె. అంత లేటు వయసులు బరువులు ఎత్తడం మొదలు పెట్టినా..అంతలా ఎనర్జీగా చేసేందుకు ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుందంటే..రోజు పది బాదంపప్పులు, ఎండుద్రాక్ష తీసకుంటుందట. సాయంత్రం పెసరపప్పుతో చేసే అట్లు, పనీర్, ఒక కప్పు పాలు తీసుకుంటానని అన్నారు. చాలా తక్కువ మోతాదులో రైస్ తీసుకుంటానని చెప్పారామె. భారతీయ వంటకాలు శరీరానికి మంచి రిప్రెష్ని అందిస్తాయని అంటున్నారామె. పప్పు, బియ్యం, పెరుగు, ఓట్స్, బాదం, మూంగ్ చిల్లా, పనీర్లను కలిగి ఉన్న ఈ డైట్ ప్లాన్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ మిశ్రమాన్ని అందిస్తుంది. శరీరం నెమ్మదిగా జీర్ణమయ్యే శక్తిని, మెరుగైన ప్రేగు ఆరోగ్యం తోపాటు రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలు ఉండేలా చేసే పోషకమైన ఆహారం ఇది. ఇక్కడ పెసరపప్పు, బాదం, పనీర్ వంటి పదార్థాలు జీవక్రియ, కండరాల మరమతఉకు మద్దతు ఇచ్చే అద్భుతమైన శాకాహార ప్రోటీన్ వనరులు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అయితే వెయిట్ లిఫ్టర్ రోష్ని దేవి ఈ ఆహారాలన్నీ ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ..తినే క్వాండిటీ అనేది అత్యంత ప్రధానం అని చెబుతోందామె. ఉదహారణకు నట్స్, పనీర్ పోషకాలు, కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి తీసుకునే క్వాండిటి ప్రధానం. అలాగే ఈ ఆహారాలు అందరికీ సరిపడకపోవచ్చని అంటున్నారామె. ఎందుకంటే కొందరికి లాక్టోస్ పడకపోవచ్చు, అలాగే వీటిలో కొన్ని పీసీఓడీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తీసుకోకూడనివి కూడా అయి ఉండొచ్చని అమె చెబుతున్నారు. ఇన్సులిన్, ధైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ఎక్కువ ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు అవసరం కావొచ్చు. అందువల్ల ఈ డైట్ని ఫాలో కావొద్దని చెబుతున్నారు రోష్ని దేవి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఆన్లైన్ కంటెంట్ ఆధారంగా ఆహారంలో మార్పులు చేయడం కంటే మంచి డైటీషియన్ని సంప్రదించి అనుసరించడమే మంచిదని సూచించారామె. చివరగా ఆమె ఒక్క విషయానికి తప్పక కట్టుబడి ఉండండని అంటున్నారామె. భారతీయ భోజనం సదా శక్తిమంతంగా ఉంటుంది, వ్యక్తిగతమైనది కూడా అనేది గ్రహించండని అంటోందామె. ఒక వ్యక్తికి బాగా పనిచేసిన ఆహారం మరొకరికి ఇబ్బందికరంగా ఉండొచ్చని అన్నారు. అన్నింట్లకంటే మన శరీరం చెప్పింది వినాలని అన్నారామె. సో వ్యక్తిగత వైద్యులను సంప్రదించి శరీరానికి సరపడా డైట్ తీసుకుని ఫిట్గా ఉందామా మరి.. View this post on Instagram A post shared by Ranveer Allahbadia (@ranveerallahbadia) (చదవండి: Parenting Tip: తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..)

ఆటోలో రెండు రోజుల్లో 1400 కి.మీ. ప్రయాణం!
'ఆశ కేన్సర్ ఉన్న వాడిని బతికిస్తుంది. భయం అల్సర్ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది'.. జులాయి సినిమాలోని డైలాగ్ ఇది. ఇప్పుడీ డైలాగ్ ఎందుకు గుర్తుకు వచ్చిందనేగా మీ డౌటు? అయితే మనవ గురుగ్రామ్కు చెందిన ఇజ్రాయెల్, అష్రఫుల్ అనే ఇద్దరు ఆటోడ్రైవర్ల గురించి తెలుసుకోవాలి. అంత ఘనకార్యం ఏం చేశారని అనుకుంటున్నారా? మామూలుగా సేఫ్టీ ఫీచర్లన్నీ సవ్యంగా ఉన్న కారులో ఓ వంద కిలోమీటర్ల ప్రయాణం అంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ పైన చెప్పుకున్న ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి రెండు ఆటోల్లో ఏకబిగిన 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. వారేదో సరదా కోసమో, థ్రిల్ కోసమో అలా చేయలేదు. మరెందుకు చేశారు?ఇజ్రాయెల్, అష్రఫుల్ అన్నదమ్ములు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా గజోల్ పట్టణం నుంచి పని వెతుక్కుంటూ 16 ఏళ్ల క్రితం ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్కు వలస వెళ్లారు. చిన్న చిన్న పనులు చేసి కూడబెట్టిన డబ్బుతో రెండు ఆటోలు కొనుక్కుని జీవనం సాగిస్తున్నారు. భర్తలకు తోడుగా వారి భార్యలు గురుగ్రామ్ (Gurugram) సెక్టార్ 49లో ఇళ్లల్లో పనిచేసేవారు. ఇజ్రాయెల్కు 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అంతా సాఫీగా గడిచిపోతుదనుకుంటున్న సమయంలో 15 రోజుల క్రితం వారి జీవితాల్లో కల్లోలం రేగింది.బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చేడనే అనుమానంతో ఇజ్రాయెల్, అష్రఫుల్ బంధువొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత పోలీసులు అతడిని విడుదల చేసినప్పటికీ, ఇద్దరు సోదరులకు ఇబ్బందులు మొదలయ్యాయి. వారుంటున్న ఇల్లు ఖాళీ చేయాలని యజమాని హుకుం జారీచేశాడు. దీనికి తోడు పోలీసుల భయం. 'మమ్మల్నిఇంటి ఓనర్ ఖాళీ చేయమన్నాడు. మా దగ్గర ఆధార్ కార్డు, EPIC ఉన్నాయి. కానీ ఏదో భయం. పోలీసులు మమ్మల్ని కూడా తీసుకెళ్తారని బాగా భయపడిపోయాం. అలాంటి అనిశ్చితిలో గురుగ్రామ్ను విడిచిపెట్టాలనుకున్నాం. మాకు జీవనాధారమైన ఆటోలను వదిలిపెట్టేందుకు మనసు రాలేదు. ఆటోల్లోనే గజోల్కు తిరిగి వెళ్లాలనుకున్నామ'ని ఇజ్రాయెల్ చెప్పాడు.పోలీసులకు లంచాలు ఇచ్చి..అనుకున్నదే తడవుగా కొన్ని ముఖ్యమైన వస్తువులను ప్యాక్ చేసుకుని ఇద్దరు సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి రెండు ఆటోల్లో ఆగస్టు 1 గురుగ్రామ్ నుంచి బెంగాల్కు ప్రయాణం మొదలుపెట్టారు. అయితే వారి ప్రయాణం సాఫీగా సాగలేదు. హైవేలపై పోలీసులు కనిపించిప్పుల్లా భయంతో వణికిపోయారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గుండా వెళుతున్నపుడు కొంత మంది పోలీసులకు లంచాలు ఇచ్చి ముందుకు సాగారు. బిహార్లో దారి తప్పిపోయారు. ఉత్తర దినాజ్పూర్లోని రాయ్గంజ్లో వెళ్లడంతో రూటు మారిపోయింది. చివరకు దక్షిణ దినాజ్పూర్లోని బునియాద్పూర్ వద్ద ట్రాఫిక్ పోలీసుల సహాయంతో మళ్లీ సరైన దారిలోకి వచ్చారు. ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా రెండున్నర రోజుల్లో ఆటోల్లో 1400 కిలోమీటర్లు ప్రయాణించి సొంతూరికి చేరుకున్నారు. వీరి గురించి మాల్దా జిల్లా (Malda District) అధికార యంత్రాంగానికి సమాచారం అందడంతో కలెక్టర్ నితిన్ సింఘానియా స్పందించారు. అన్నిధాలుగా వారికి సహాయం అందిస్తామని హామీయిచ్చారు.మళ్లీ గురుగ్రామ్కు..సొంతూరికి వచ్చిన తర్వాత మళ్లీ భవిష్యత్తు గురించి బెంగ మొదలైంది. పని కోసం మళ్లీ గురుగ్రామ్కు వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే అక్కడ పోలీసుల వేధింపులు తగ్గే వరకు వేచి ఉంటామని వారు మీడియాకు చెప్పారు. పోలీసు భయం కారణంగానే ఈ సోదరులిద్దరూ ఇంత రిస్క్ చేసి ఆటోల్లో సొంతూరికి తిరిగొచ్చారు. చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!

ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్బాక్స్ రిటన్ గిఫ్ట్స్
ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. కానీ 2016లోనే జరిగిన ఒక వెడ్డింగ్ వివాహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైందిగా రికార్డ్ దక్కించుకుంది. అదేంటో తెలుసా? పదండి తెలుసుకుందాం.భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దాని విలాసవంతమైన వివాహ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. కానీ రష్యన్ బిలియనీర్ మిఖాయిల్ గుట్సేరీవ్ తన కొడుకు పెళ్లి కోసం పెట్టిన ఖర్చు ఏకంగా ఒక బిలియన్ డాలర్లు (ప్రస్తుత ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 876.94 కోట్లు). 2016లో అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డు క్రియేట్ చేసింది.మరిన్ని విశేషాలుమిఖాయిల్ గుట్సేరీవ్ కుమారుడు, 29 ఏళ్ల సయీద్ గుట్సేరీవ్, ఇరవై ఏళ్ల ఖాదీజా ఉజాఖోవ్స్ను వివాహం చేసుకున్నాడు. మాస్కోలోని ఒక విలాసవంతమైన రెస్టారెంట్లో ఈ జంట వివాహం చేసుకున్నారు. అతిరథమహారథులు హాజరయ్యే ఈ వివాహానికి భద్రత రీత్యా ఈ వేదికను ఎంచుకున్నారు.వధువు 11.5 కిలోల ఎలీ సాబ్ గౌను ధరించింది. పెళ్లి నాటి తన దుస్తులు, తరాల బడి గుర్తుండిపోయేలా, ప్రత్యేకంగా ఉండాలని భావించిందట. అందుకే ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ ఎలీ సాబ్ చేత ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది. ఈ దుస్తులను పారిస్ నుండి దిగుమతి చేసుకున్నారు.ఈ వెడ్డింగ్ గౌను బరువు దాదాపు 11.5 కిలోలు. పెద్ద ఫ్లేర్ ,అంతే పొడవైన వీల్తో దీన్ని రూపొందించారు. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, ఆ గౌను విలువ రూ. 2.28 కోట్లు.అత్యంత విలువైన వజ్రాభరణాలతో రాయల్ లుక్లో మెరిసిపోయింది వధువు. వజ్రాలు పొదిగిన తలపాగా, భారీ వజ్రాల చెవిపోగులు, మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. రెండు చేతులకు బ్రాస్లెట్లతో యువరాణిలా కనిపించింది.తొమ్మిది అంచెల వివాహ కేక్సాయిద్ గుట్సేరీవ్- ఖాదీజా ఉజాఖోవ్ వివాహ కేక్ మరో ప్రత్యేకత. అద్భుతమైన తొమ్మిది అంచెల ఐస్డ్ వెడ్డింగ్ కేక్ మరీ ముఖ్యంగా, నూతన వధూవరుల కంటే రెండు రెట్లు ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారట. దీనిని వైట్ క్రీమ్లో తయారు చేశారు.దానిపై పింక్ ఫ్రాస్టింగ్తో చేశారు.గిఫ్ట్లుగా గోల్డ్ బాక్స్లు: లగ్జరీ పెళ్లితోనే కాదు, అతిథులను కూడా ఆశ్చర్య పరిచాడు. ఈ వేడుకకు హాజరైన వారికి తీపి జ్ఞాపకంలా ఉండేలా గోల్డ్ బాక్స్ గిఫ్ట్గా అందించారు. ఇందులో జంట పేరు, వివాహ తేదీ చెక్కబడి ఉన్నాయి. వివాహ వేడుకలో జెన్నిఫర్ లోపెజ్, స్టింగ్, ఎన్రిక్ ఇగ్లేసియాస్ ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు.ఎవరీ గుట్సెరీవ్ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం సఫ్మార్ గ్రూప్ వ్యవస్థాపకుడు, రష్యన్ బిలియనీర్ గుట్సెరీవ్ చమురు, బొగ్గు, రియల్ ఎస్టేట్ , రిటైల్ రంగాలలో వ్యాపారాలున్నాయి 2024 నాటికి ఆ కుటుంబ నికర విలువ రూ. 31,574.41 కోట్లు.కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం కోసం ముఖేష్ అంబానీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంచనా. ఇది అంబానీ కుటుంబం నికర విలువలో 0.5శాతం మాత్రమేనని అంచనా. అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ పెళ్లి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..
ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా ఎంతో కొంత ప్రతిభ దాగి ఉంటుంది. అయితే ఉప్పొంగేలా బయటకు రావాలంటే..బలమైన గాయం లేదా ఎదురదెబ్బ తగిలినప్పుడే కసితో బయటకు వస్తుంది. లేదా ఎవ్వరైనా..మనల్ని విమర్శిస్తూ ఇచ్చే సలహాలు జీవితాన్ని అనుహ్యంగా మలుపుతిప్పుతాయి. అలా తండ్రి కారణంగా మంచి యూటర్న్ తీసుకుంది ఆమె జీవితం. ప్రపంచం ముందు ఓ గొప్ప హోదాలో ఉన్న ప్రముఖ వ్యక్తిగా నిలిచేలా చేసింది. ఇది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన గొప్ప పేరెంటింగ్ పాఠం కూడా. ఆమెనే యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్. ఆమె ఏమి వారసత్వంగా కంపెనీకి సీఈవోగా అయిపోలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ మారుమూల పట్టణం నుంచి క్లర్క్గా ఉద్యోగ జీవితం మొదలు పెట్టి తన అపారమైన ప్రతిభ పాటవాలతో ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీకి సీఈవో అయ్యిందామె. ఈ విజయం తన తండ్రి సపోర్ట్ వల్లే వచ్చిందని చెబుతుంటారామె. కారు పెయింటర్, ఆర్మీ వ్యక్తి అయినా ఆమె తండ్రి జూలీకి డబ్బు సంపాదన గురించి తరుచుగా చెబుతుండేవాడు. ఒకరోజు ఆ తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ కూతురు జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పి అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది. ఆ విషయాన్ని సీఈవో జూలీ స్వీట్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఒక డిబేట్ టోర్నమెంట్ సెమీఫైనల్లో ఓటమిని చవిచూశానని నాటి సంఘటనను గుర్తుచేసుకుందామె. ఆ డిబేట్ పోటీలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడి కుమార్తె విజేతగా నిలిచింది. దాంతో తాను తన తండ్రితో తన బాధను పంచుకున్నట్లు చెప్పుకొచ్చింది జూలీ.ఆమె లయన్స్ క్లబ్ కుమార్తె కాబట్టేగా ఫస్ట్ ఫ్రైజ్ ఇచ్చారు అంటూ తన నిరాశాసను వ్యక్తం చేసింది తండ్రి దగ్గర. దానికి అతడి తండ్రి నుంచి వచ్చిన శక్తిమంతమైన ప్రతిస్పందన జూలీ మనసుని బలంగా తాకింది. "నువ్వు ఎప్పటికీ లయన్స్ క్లబ్ కుమార్తెవి కాలేవన్నది నిజం. అంటే ఇక్కడ నువ్వు మెరుగ్గా ఉండేలి అదే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టగలదు. ఈ ప్రపంచం న్యాయం గురించి మాట్లాడదు..అచంచలమైన టాలెంట్ ఉన్నవాడికి ఫిదా అవుతుంది. అదే గుర్తుపెట్టుకో ఈ క్షణం నువ్వు మెరుగ్గాలేవు అందువల్లే గెలవలేకపోయావు. విజేత కావాలనుకుంటే అనుక్షణం నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటేనే వెనుకబడవు." అని తండ్రి సూచించాడు. ఆ మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి. దాంతో ఆమె వెనుకబడటం అన్న మాట దరిచేరనీయకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. అలా తన ప్రతిభను సానబెట్టుకుంటూ టీనేజ్ వయసులో ఒక క్లర్క్గా ఉద్యోగం సంపాదించుకుంది. అక్కడ నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ..న్యాయ సంస్థ క్రావత్ స్వైన్ & మూర్ నుంచి యాక్సెంచర్ జనరల్ కౌన్సెల్ సీఈవో స్థాయికి ఎదిగేలే చేసింది. బలహీనతలను జయిస్తూ..తన చుట్టూ ఉన్న ప్రపంచం కంటే మెరుగ్గా ఉండటంపై శ్రద్ధ పెట్టింది, నేర్చుకోవడం అనేదాన్ని ఎన్నటికి వదలిపెట్టలేదు. అదే తన సక్సెస్ మంత్ర అని సగర్వంగా చెప్పింది జూలీ. ఇది నిజంగా గొప్ప పేరెంటింగ్ పాఠం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓటమిని నిజాయితీగా అంగీకరించేలా చేస్తూ..తనలో ఆత్మవిశ్వాసాన్ని చైతన్యవంతం చేయాలి.విజయం కోసం ఏం చేస్తే మంచిది అనేది సూటిగా చెప్పాలి. ఆ మాటలు పిల్లవాడిలో ఓటమికి చెక్ చెప్పేలా తయారయ్యేలా ఉండాలి. అంతేతప్ప ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా, ఇతరులతో పోల్చి చులకనభావం కలిగించేలా ఉండకూడదు. తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే ప్రతి మాట పిల్లవాడిపై తీవ్ర ప్రభావం చూపుతుందనేందుకు ఈ యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ కథే ఉదాహరణ.(చదవండి: Punita Arora: ఎవరీ పునీతా అరోరా..? సైన్యం, నేవీలలో అత్యున్నత హోదాలు..)
ఫొటోలు


12th ఫెయిల్ హీరోయిన్ మేధా శంకర్ బర్త్ డే స్పెషల్ (ఫోటోలు)


యూఎస్లో డైరెక్టర్ సుకుమార్ దంపతులు (ఫోటోలు)


వరాలిచ్చే వరలక్ష్మితో..లక్ష్మీ కళ ఉట్టిపడుతున్న గృహలక్ష్మిలు (ఫోటోలు)


జగ్గారెడ్డి కూతురి పెళ్లిలో ప్రముఖుల సందడి (చిత్రాలు)


వరలక్ష్మి వ్రతం ఆచరించిన సెలబ్రిటీలు (ఫోటోలు)


ఆలయం-చర్చి-దర్గా.. అక్కినేని కోడలు లేటెస్ట్ ట్రిప్ (ఫొటోలు)


హైదరాబాద్లో వర్ష బీభత్సం (ఫొటోలు)


Varalakshmi Vratam 2025 : వరమహాలక్ష్మి వ్రతం, ముహూర్తం, పూజ


ఎంపీ లేటు వయసు పెళ్లి.. గ్రాండ్ రిసెప్షన్, అతిథుల్లో సీఎం రేవంత్ (ఫొటోలు)


వైఎస్సార్సీపీ విక్టరీ.. టీడీపీ కూటమికి విశాఖలో బిగ్ షాక్ (చిత్రాలు)
అంతర్జాతీయం

గాజా బాధితులకు ఇండోనేషియా ప్రత్యేక వైద్య సదుపాయం
జకార్తా: ఇజ్రాయెల్ సాగిస్తున్న నిరంతర దాడులకు గాజాలో లెక్కలేనంతమంది క్షతగాత్రులుగామారారు. ఈ నేపధ్యంలో గాజాలోని బాధితులను ఆదుకునేందుకు ఇండోనేషియా ముందుకొచ్చింది. తమ దేశానికి చెందిన జనావాసాలు లేని గలాంగ్ ద్వీపంలో గాజా బాధితుల కోసం వైద్య సౌకర్యాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ గాజాలో గాయపడిన రెండు వేల మందికి చికిత్స అందించనున్నారు. వారు కోలుకున్న తర్వాత వారిని ఇంటికి తరలించనున్నారని ఇండోనేషియా ప్రతినిధి తెలిపారు.2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇండోనేషియా.. గాజాకు మానవతా సహాయం పంపింది. ఇప్పుడు యుద్ధంలో బాధితులైన, గాయపడిన సుమారు రెండు వేల ఇండోనేషియా వైద్య సహాయం అందించనుంది. గాయపడిన గాజా ప్రజలకు చికిత్స అందించేందుకు, వారి కుటుంబసభ్యులకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించేందుకు ఇండోనేషియా సుమత్రా ద్వీపంతోపాటు గలాంగ్ ద్వీపంలో వైద్య సదుపపాయాలను ఏర్పాటు చేస్తోంది. గాయపడిన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించేందుకు అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేసిన ప్రతిపాదనకు ఇండోనేషియా మతాధికారులు తొలుత వ్యతిరేకించినా తరువాత మద్దతు పలికారు.

మరోమారు అమెరికా పర్యటనకు పాక్ ఆర్మీ చీఫ్?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోమారు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. అసిమ్ మునీర్ రెండు నెలల్లో రెండవసారి అమెరికాను సందర్శిస్తున్నారు. ఇస్లామాబాద్- వాషింగ్టన్ మధ్య సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయనడానికి ఈ పర్యటన సూచికగా నిలిచింది.సుంకాల విషయంలో అమెరికా-భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ పాక్ ఆర్మీ చీఫ్ అమెరికాను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్తో ట్రంప్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తున్నందుకు శిక్షగా ట్రంప్ భారత్ ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. రష్యా చమురును కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా ఇలాంటి చర్యలే ఉంటాయని హెచ్చరించారు.కాగా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ మునీర్ గత జూన్లో వాషింగ్టన్ను సందర్శించారు. ట్రంప్ ఆ సమయంలో అతనికి వైట్ హౌస్లో ఆతిథ్యం ఇచ్చారు. అప్పట్లో పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్.. మునీర్ మరోమారు ఈ ఏడాది చివర్లో అమెరికాను సందర్శిస్తారని పేర్కొంది. కాగా జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది మరణించిన అనంతరం భారతదేశం తన ప్రతిదాడిని ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో చూపింది.ఈ నేపధ్యంలో నాటి నుంచి భారత్- అమెరికా మధ్య సంబంధాల్లో అస్థిరత నెలకొంది.. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ పదేపదే పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ వాదనను తిరస్కరించింది. ఆపరేషన్ సిందూర్ను ఆపివేయాలని ప్రపంచంలో ఏ దేశాధి నేతలూ తమను అడగలేదని ప్రధాని మోదీ పార్లమెంటులో పేర్కొన్నారు.

భారత్ సుంకాల మోతపై పునరాలోచన! ట్రంప్ ఏమన్నారంటే..
భారత్పై పెనాల్టీగా మరో 25 శాతం టారిఫ్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాతో చమురు వాణిజ్యం కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతుండగా.. ఇదే పని చేస్తున్న ఈయూ, చైనాలాంటి దేశాల విషయంలో ట్రంప్ ఉదాసీనతపై భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో.. భారత్పై అదనపు సుంకాల నిర్ణయంపై ట్రంప్ వెనక్కి తగ్గుతారా?.. ఆయన ఏమన్నారంటే.. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున) వైట్హౌజ్లోని తన ఓవెల్ ఆఫీస్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంలో రష్యాతో చమురు వాణిజ్యం ఇంకా కొనసాగితే భారత్పై ద్వితీయ శ్రేణి ఆంక్షలు (Secondary Sanctions) తప్పవంటూ హెచ్చరించారు. అయితే.. రష్యా నుంచి చైనా కూడా చమురును కొనుగోలు చేస్తోంది కదా.. కేవలం భారత్ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నారు? అని కొందరు మీడియా ప్రతినిధులు ట్రంప్నుప్రశ్నించారు. ‘‘ఇప్పటికి 8 గంటలకేగా గడిచింది. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ సమాధానం ఇచ్చారాయన. మరిన్ని సుంకాలను మీరు చూడబోతున్నారు’’ అంటూ బదులిచ్చారు.ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంతో.. అమెరికా రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యాతో చమురు కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా secondary sanctions విధించే అవకాశాలు ఉన్నాయి. తాను వద్దన్నా కూడా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే.. రెండు విడతలుగా భారత్పై 50 టారిఫ్ విధించారు. ఇప్పుడు ఆంక్షల హెచ్చరికలూ జారీ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఉల్టా చోర్.. అమెరికా సహా పెద్ద దేశాల దొంగ నాటకంఅయితే ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లో భాగంగా అతిత్వరలో ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీలను కలవనున్నట్లు వైట్హౌజ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఉద్రిక్తతలు చల్లారితే భారత్పై అదనపు సుంకాల నిర్ణయాన్ని తొలగిస్తారా? అనే ప్రశ్న ట్రంప్కు ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ఆ అంశాన్ని తర్వాత పరిశీలిస్తాం అని పేర్కొన్నారు. ఇక రష్యాతో ఆయిల్ కొనుగోలు జరుపుతున్న చైనాపైనా సుంకాల మోత తప్పదా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘ఇప్పుడే ఏం చెప్పలేను.. బహుశా అది జరగొచ్చు. భారత్ విషయంలో అది జరిగింది. అలాగే మరికొన్ని దేశాలకూ అది తప్పకపోవచ్చు. అందులో చైనా కూడా ఉండొచ్చు’’ అని అన్నారాయన. ఉక్రెయిన్ దురాక్రమణకు ప్రయత్నిస్తున్న రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసే దేశాలను ఉపేక్షించబోనంటూ ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్పై తొలుత 25 శాతం, తాజాగా మరో 25 శాతం టారిఫ్లను ప్రకటించారు. దీంతో.. భారత్పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

ఫ్రాన్స్లో రగిలిన కార్చిచ్చు.. ఒకరి మృతి
పారిస్: దక్షిణ ఫ్రాన్స్లో కార్చిచ్చు వేగంగా వ్యాప్తి చెందుతోంది. స్పెయిన్ సరిహద్దులో అడవిలో నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో తొమ్మది మంది గాయపడ్డారు. ఒకరు గల్లంతయ్యారు. ఔదీ ప్రాంతంలోని రిబాటీలో మంగళవారం మధ్యాహ్నం మొదలైన మంటలు బుధవారం మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు 1,500 మంది అగి్నమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రాజధాని పారిస్ విస్తీర్ణంతో సమానమైన ప్రాంతంలో కార్చిచ్చు రగిలినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం 12 గంటల వ్యవధిలో 11,000 హెక్టార్ల భూభాగాన్ని మంటలు చుట్టుముట్టాయని తెలిపారు. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద కార్చిచ్చు అని స్పష్టంచేశారు. దక్షిణ యూరప్లో వేసవి కాలంలో కార్చిచ్చులు రగలడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా మారిపోయింది. కాలుష్యం, వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
జాతీయం

తెరపైకి కర్ణాటక ‘ఓట్ చోరీ’ స్టింగ్ ఆపరేషన్!
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేసిందని, ఈవీఎంలపైనా అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో.. 2024 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక్క మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే లక్షకుపైగా ఫేక్ ఓట్లు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. రెండేళ్ల కిందట.. ఓ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్లోనూ ఈ అవకతవకలే బయటపడడం గమనార్హం. రాహుల్ గాంధీ ప్రెస్మీట్ నేపథ్యంలో ఆ మీడియా సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్య రాజేంద్రన్ ఆ విషయాన్ని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో గుర్తు చేశారు. అయితే ఆనాడు జరిగిన ఆ ఓట్ల చోరీ గురించి ఆమె మాటల్లోనే ఇలా.. ద న్యూస్ మినిట్ 2023లో నిర్వహించిన ఓ ఇన్వెస్టిగేషన్ను అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నా. ఈ పరిశోధన కూడా బెంగళూరు సెంట్రల్లోని మహదేవపురతోపాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నియమించిన ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తూ ఓటర్ల సమాచారం చోరీ చేసింది. ఆ ఎన్జీవో పేరు చిలుమే. ఇది ఎన్నికల నిర్వహణ సంస్థతోపాటు, డిజిటల్ సమీక్ష అనే మొబైల్ అప్లికేషన్ను కూడా నడిపేది. ఈ యాప్ ఓటర్ల సమాచారాన్ని క్రోడీకరించి రాజకీయ పార్టీలు, నేతలకు విక్రయించేది. ఒక బీజేపీ నేత కొనుగోళ్లను మేము సాక్ష్యంగా ఆనాడు చూపించాం కూడా. ఇందుకోసం బీజేపీ వార్డు కార్యాలయాల్లో చిలుమే తన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేది. మా మనిషి ఒకరు ఆ శిక్షణ కేంద్రంలో చేరి అక్కడ ఫొటోలతో సహా ఆధారాలు కూడా సేకరించారు. ఇదెలా జరిగిందంటే.. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. బూత్ లెవల్ అధికారులుగా చెలామణి అవుతూ సమాచారం సేకరించారు. ఆ సేకరణ తర్వాత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న శివాజీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపునకు ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదెలా జరిగిందంటే.. బీజేపీ సానుభూతి పరులు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు 26,000 ఫేక్ ఓటర్లు ఉన్నట్లు ఆరోపించారు. అవసరమైన పత్రాలను నింపకుండానే వాటి తొలగింపునకు పట్టుపట్టారు. చివరకు ఒక కోర్టు కేసు తరువాత ఏడువేల ఓట్లు తొలగించారు. అయితే ద న్యూస్ మినిట్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపినప్పుడు.. తొలగించిన ఓటర్లలో చాలామంది అదే అసెంబ్లీ సెగ్మెంట్లో, అవే చిరునామాల్లో నివసిస్తున్నట్లు స్పష్టమైంది.అంతేకాదు.. మా స్టింగ్ ఆపరేషన్లో.. చిలుమే వ్యవస్థాపకుడు కృష్ణప్ప రవికుమార్ సొంతూరులో కొంతమంది వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో రూ.1.4 లక్షల నుంచి రూ.40 వేల వరకూ డబ్బులు పడ్డాయి. వీటిల్లో ఎక్కువ శాతం ‘సీఎస్సీ ఈ-గవర్నెన్స్’ నుంచి వచ్చినవే ఉండేవి. ఆ ఊరి ప్రజలు డబ్బు విత్డ్రా చేసుకుని కృష్ణప్ప రవికుమార్కు ఇచ్చేవారు. ఈ సీఎస్సీ ఈ-గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ కావడం గమనార్హం. మా స్టింగ్ ఆపరేషన్ తర్వాత.. చాలామంది అరెస్ట్ అయ్యారు. మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. చిలుమేతో బీబీఎంపీ సంబంధాలు లేవని ప్రకటించుకుంది. శివాజినగర, చిక్పేట్, మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది కూడా. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో గ్రామస్తుల అకౌంట్లలోకి డబ్బులెందుకు వచ్చాయి? చిలుమే సంస్థ సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలు ఏమయ్యాయి? ఈ అంశంపై ప్రభుత్వ విచారణ సక్రమంగా జరగలేదు(కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ..)’’ అని ఆమె పోస్ట్ చేశారు.Just wanted to remind everyone of TNM's investigation in 2023- which also focused on assembly segments in Bangalore Central seat including Mahadevapura. We found that a Bengaluru NGO- recruited by the BBMP- working with the ECI- was stealing voter data. Chilume NGO also ran…— Dhanya Rajendran (@dhanyarajendran) August 7, 2025

Tamil Nadu: పొత్తుతో 50 సీట్లలో బీజేపీ పోటీ? ప్రభుత్వంలో చక్రం తిప్పేందుకు వ్యూహం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే వివిధ పార్టీలు ఉత్సాహంగా, తమ ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకేలో పొత్తులో భాగంగా 50కి పైగా సీట్లలో పోటీ చేయాలని భావిస్తోందని సమాచారం.2021 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన 20 సీట్ల కంటే ఇది గణనీయమైన పెరుగుదల. నాడు బీజేపీ తమిళనాడులో కేవలం నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే దీనిపై అటు బీజేపీ లేదా ఇటు ఏఐడీఎంకే ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు బీజేపీ మరిన్ని సీట్ల కోసం పట్టుబట్టడం చూస్తుంటే భవిష్యత్ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోందని తెలుస్తోంది.ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ నాయకత్వం, అన్నాడీఎంకే రాష్ట్ర నాయకత్వంతో ఒకవేళ బీజేపీ కూటమి గెలిస్తే, ప్రభుత్వంలో కీలకంగా చేరాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు నటుడు విజయ్ తన తమిళగా ‘వెట్రీ కజగం’తో రాజకీయాల్లోకి ప్రవేశించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మాట్లాడుతూ తమిళనాడులో 2026 ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో అన్నాడీఎంకే ఎడప్పాడి కె. పళనిస్వామి నాయకత్వంలో జరుగుతాయని ప్రకటించారు.అయితే బీజేపీ ప్రతిష్టాత్మక సీట్ల డిమాండ్కు ఏఐడీఎంకే అంగీకరిస్తుందా ? అనేది ఇప్పడు ప్రశ్నగా మారింది. మరోవైపు నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. విజయ్ ‘తమిళగా వెట్రీ కజగం’ను స్థాపించారు. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఏఐడీఎంకే నంబర్ టూ పార్టీ అని సర్వేలు పలు చెబుతున్నాయి. ‘ఓట్ వైబ్ సర్వే’.. డిఎంకే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదని, 2026 లో తిరిగి అధికారంలోకి రావచ్చని పేర్కొంది. 2021లో 234 సభ్యుల అసెంబ్లీలో డీఎంకె 159 సీట్లను గెలుచుకుని విజయం సాధించింది.

ట్రంప్కు కంబోడియా మద్దతు.. అసాధారణ రాజనీతిజ్ఞుడంటూ కితాబు
న్యూఢిల్లీ:ప్రపంచంలోని పలు దేశాలపై ఇష్టమొచ్చిన రీతిలో సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దీనికి భిన్నంగా కంబోడియా ట్రంప్కు మద్దతు పలుకుతోంది. పైగా ఆయన అసాధారణ రాజనీతిజ్ఞుడంటూ కితాబిచ్చింది. దీనివెనుక ప్రత్యేక కారణముంది.పాకిస్తాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు కంబోడియా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతిని ప్రధానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ కూడా తాను ప్రపంచ శాంతిదూతను అని చెప్పుకుంటూ నోబెల్కు అర్హుడనని అంటున్నారు. ఇస్లామాబాద్, టెల్ అవీవ్ ఇప్పుడు కంబోడియాలోని మిత్రదేశాలు ట్రంప్కు నోబెల్ ఇవ్వాలంటూ ఒకే స్వరాన్ని ఆలపిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కంబోడియా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. దీనితో నోబెల్ శాంతి బహుమతి డిమాండ్కు మద్దతు ఇస్తున్న మూడవ దేశంగా కంబోడియా నిలిచింది.ఈ అంశంపై కంబోడియా ప్రధాని హున్ మానెట్ మాట్లాడుతూ తాము ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నామని, కంబోడియా- థాయిలాండ్ మధ్య సరిహద్దు వివాదాన్ని నియంత్రించడంలో ఆయన అసాధారణ రాజనీతిజ్ఞతను చూపారని ప్రశంసించారు. అలాగే తమ దేశంపై సుంకాన్ని 49 శాతం నుంచి 19 శాతానికి తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫేస్బుక్ పోస్ట్లో హున్ మానెట్ ఈ ప్రకటన చేశారు. ట్రంప్ జోక్యం అనేది ప్రపంచంలోని అత్యంత అస్థిర ప్రాంతాలలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, దోహదపడుతున్నదంటూ నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఆయన పేరును పంపినట్లు పేర్కొన్నారు. జూలై 26న ట్రంప్ పిలుపు కారణంగా థాయిలాండ్- కంబోడియా మధ్య యుద్ధ ప్రతిష్టంభన తొలగిందని, జూలై 28న కాల్పుల విరమణ జరిగిందనే వార్తలు వినిపించాయి. ఈ ఘర్షణల్లో 43 మంది మృతిచెందగా, మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాగా భారత్- పాక్ మధ్య జరిగిన ఘర్షణలతో సహా ఆరు వివాదాలకు ట్రంప్ ముగింపు పలికేలా చేశారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల అన్నారు.

భారత్కు మరో షాకిచ్చిన ట్రంప్.. మోదీ కీలక భేటీ!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ను టార్గెట్ చేసి అదనపు సుంకాలు విధిస్తున్నారు. ఇక, తాజాగా భారత్ సుంకాలపై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో భారత్తో చర్చలకు తాను సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరో చర్చకు దారి తీశాయి.వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధించడంతో ట్రంప్ విధించిన భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ చూస్తోంది. అయితే, అందుకు అధ్యక్షుడు ట్రంప్ మాత్రం సిద్ధంగా లేనట్లు స్పష్టం చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. టారిఫ్ల వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవు అని తేల్చి చెప్పారు. దీంతో, భారత్కు గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. ఇదిలా ఉండగా.. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగితే భారత్పై మరిన్ని ఆంక్షలు ఉంటాయని ట్రంప్ మళ్లీ హెచ్చరించడం గమనార్హం.#WATCH | Responding to ANI's question, 'Just to follow up India's tariff, do you expect increased trade negotiations since you have announced the 50% tariffs?', US President Donald Trump says, "No, not until we get it resolved."(Source: US Network Pool via Reuters) pic.twitter.com/exAQCiKSJd— ANI (@ANI) August 7, 2025ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీకి సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్లపై భారత్ ఎలా స్పందించాలనే విషయంపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం తర్వాత సుంకాలపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.Prime Minister Narendra Modi will chair a high-level Cabinet meeting at 1 pm on Friday to review the impact of the recent tariff hike imposed by the United States on Indian exports.— indian DOTS (@AMEERALIHU1807) August 8, 2025అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన..మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో ప్రకటన చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. టారిఫ్ల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంతో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామన్నారు. వాణిజ్యం, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో ట్రంప్ స్పష్టంగా ఉన్నారన్నారు. దానికి ప్రతిస్పందనగానే ట్రంప్ నేరుగా చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో శానోజె నగరంలో అద్భుత శివపదం కార్యక్రమం
అమెరికాలో శానోజె నగరంలో అద్భుత శివపదం కార్యక్రమం జూలై 26న ఘనంగా జరిగింది. శివపదం రచయితసామవేదం షణ్ముఖ శర్మ సమక్షంలో వాణి గుండ్లాపల్లి నిర్వహణలో జరిగిన ఈకార్యక్రమానికి 900 మంది హాజరయ్యారు. ఈ శక్తి ఆ గీతాల్లో ఉందా, భారతీయ నృత్య రీతుల్లో భక్తి తత్త్వం ఉప్పొంగేలా అభినయించిన ఆ కళాకారుల్లో ఉందా అన్నంత సంశయాత్మక సమ్మోహనాన్ని కలిగించాయి దాదాపు 40 మంది కళాకారులు పాల్గొన్నారు.సామవేదం షణ్ముఖ శర్మ కాలిఫోర్నియాలోని బే ఏరియాలో అయిదురోజులపాటు (జూలై 22-26) జ్ఞానయజ్ఞంగా నిర్వహించిన 'శివ మహిమామృతం 'ప్రవచనోత్సవాలకు పూర్ణాహుతి ఇదే అన్నంత నేత్రపర్వంగా ఆయన రచించిన శివపదాలను వివిధ భారతీయ నృత్య రీతుల్లో అమెరికాలోని కళాకారులు శివ విష్ణు దేవాలయ ప్రాంగణంలోని లకిరెడ్డి ఆడిటోరియంలో ప్రదర్శించారు. మోహినీయాట్టంలో బాలా త్రిపుర సుందరి శక్తివర్ణన, కూచిపూడిలో నదీ రూపంతో - పరబ్రహ్మ స్వరూపమైన సాగరంలోకి - ఒంపుసొంపులతో సరస్వతి ప్రయాణం, మైసూర్ భరతనాట్యంలో శివకామ సుందరిగా అమ్మవారి మూర్తి-శక్తి వర్ణన, ఒడిస్సీలో 'వారాహీ రక్షతు మాం ' అంటూ వారాహి రూపంలో అమ్మవారి ఆరాధన, కథక్ లో కాళీమాత శక్తి స్వరూప పరమార్థం, మోహినీయాట్టం + భరతనాట్యంలో 'శ్రీగజలక్ష్మి చింతయామ్యహం ', భరతనాట్యంలో 'నీ కాలిగోటి రాకా సుధాంశువులు ' అంటూ అమ్మవారి శక్తివర్ణన, భరతనాట్యంలో 'అగజాధరమున నగవులవే, సిగపై వెన్నెల చిన్నబోయెరా..' అంటూ అమ్మవారి చిరునవ్వుల కాంతి వర్ణన .., ఇంకా శివ శివాని ఛిద్రస రూపా, పాయసాన్న ప్రదాత కాశీ అన్నపూర్ణ, ఆది పరాశక్తి తత్త్వం తదితర నృత్య రూపాల్లో ప్రతి ఒక్కటీ - నేపథ్యంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మల్లాది సూరిబాబు వంటి గాయకుల గాత్రంతో - ప్రేక్షకుల్ని భక్తి తన్మయుల్ని చేశాయి. ముఖ్యంగా 'అమ్మా వాణి అక్షర వాణి...' అంటూ మనస్విని (రెండు రోజుల వ్యవధిలో సాధన చేసిన) అణువణువునా భక్తి భావన పలికించే అభినయంతో, ముద్రలతో, మెరుపు వేగంతో చేసిన నృత్యం ప్రేక్షకుల్ని ఎంత మంత్రముగ్ధుల్ని చేసిందంటే, ఒక్కసారిగా అందరూ లేచి నిలబడి కరతాళధ్వనులతో (Standingg Ovation) హర్షం వ్యక్తం చేశారు. "సరస్వతి దేవిని ఇక్కడ మనస్విని సాక్షాత్కరింపజేసింది " అని షణ్ముఖ శర్మ ప్రశంసించారు.ఒడిస్సి + భరతనాట్యంలో కళాకారుల బృందం 'శివుడు ధరించిన మాతృరూపమిది..' అంటూ నయనాందకరంగా ప్రదర్శించిన శివ-శక్తి రూపాల వర్ణన కూడా ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేసింది. మిల్పిటాస్ నగర మేయర్ కార్మెన్ మొంటానో భారతీయ నృత్య రీతులను ప్రశంసించారు. షణ్ముఖ శర్మ నిర్వాహకులకు మల్లాది రఘు బృందాన్ని, శివవిష్ణు ఆలయ కమిటీని అభినందించారు. ముఖ్యంగా వేయికి పైగా శివపదాల్లోంచి ఎంపిక చేసిన వాటికి వాణి గుండ్లాపల్లి 12 దేశాల్లో ఇలా భారతీయ నృత్య రీతుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తూండాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడు పారిస్ నగరంలోకూడా వాణి ప్రదర్శన ఇవ్వబోతున్నారని ప్రకటించారు.

మరో భారత సంతతి వ్యక్తిపై అమానుషం : చేయి తెగి వేలాడింది, కానీ
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని భారతసంతతికి చెందిన వ్యక్తిపై దుండగులు దాడి చేశాడు. సౌరభ్ ఆనంద్ (33) మందులు కొనుగోలు చేసి ఫార్మసీ నుండి ఇంటికి వెళుతుండగా, ఐదుగురు యువకులు కత్తితో దారుణంగా దాడి చేశారు. దీంతో అతనుతీవ్రంగా గాయపడ్డాడు.మెల్బోర్న్లో ఈ నెల(జూలై) 19న ఘటన చోటు చేసుకుంది. దీంతో భారతీయులపై వరుస జాత్యహంకార దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది.జూలై 19న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆల్టోనా మెడోస్లోని సెంట్రల్ స్క్వేర్ షాపింగ్ సెంటర్లోని మందుల దుకాణంలో సౌరభ్ మందులు తీసుకున్నాడు. తన స్నేహితుడితో కాల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఐదుగురు యువకులు అతన్ని చుట్టుముట్టి, చితకబాదారు. మరొకరు అతని తలపై నేలపై పడే వరకు కొట్టారు. మూడవ యువకుడు ఒక కత్తితో గొంతుకు పట్టుకుని దాడిచేయబోతే వెంటనే తన చేతిని రక్షణ కోసం పైకి లేపాడు. దీంతో అతని ఎడమ చేయి దాదాపు వేరుపడి పోయింది. ఒక చిన్న నూలుపోగు లాంటి నరం సాయంతా వేలాడుతూ ఉండింది. అతని భుజంపై, వీపుపై కూడా పొడిచారు. దీంతో వెన్నెముక విరిగింది ఇతర ఎముకలు కూడా విరిగిపోయాయి. తనను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, కత్తి నా మణికట్టుపై వేటు పడింది. రెండో కత్తిపోటు మరో చేతితి గుండా పోయింది. మూడవ దాడి ఎముక గుండా పోయిందనీ, నొప్పి మాత్రమే గుర్తుంది, నా చేయి దాదాపు వేరుపడిన స్థితిలో ఉంది అంటూ బాధితుడు ఆస్ట్రేలియన్ మీడియాతో తెలిపాడు. చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదనతీవ్రగాయాలతో రక్తపు మడుగులతో పడి వున్న సౌరభ్ షాపింగ్ సెంటర్ బయటకొచ్చి సహాయాన్ని అర్థించాడు. దీంతో అతడిని సమీపంలోని రాయల్ మెల్బోర్న్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మొదట అతని చేతిని తీసివేయాల్సి వస్తుందని భావించారు. కానీ అదృష్టవశాత్తూ చేతిని తిరిగి అటాచ్ చేయగలిగారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఐదుగురు యువకులలో నలుగురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. కాగా గత వారం ఆస్ట్రేలియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. కారు పార్కింగ్ వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు చరణ్ప్రీత్ సింగ్ అనే భారతీయుడిపై దారుణంగా దాడి చేసి, జాతిపరంగా దుర్భాషలాడిన సంగతి తెలిసిందే.

తెలంగాణ స్ఫూర్తిని చాటుతూ అమెరికాలో కొత్త చాప్టర్లు ప్రారంభించిన జీటీఏ
న్యూజెర్సీ/న్యూయార్క్: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను 43 దేశాల్లో ఘనంగా చాటుతున్న తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ (GTA) మరో కీలక ముందడుగు వేసింది. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో జీటీఏ చాప్టర్లను అంగరంగ వైభవంగా ప్రారంభించింది. జూలై నెలలో న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్సిప్పనీ మేయర్ జేమ్స్ ఆర్ బార్బెరియో ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జీటీఏ ఫౌండర్స్ అలుమల మల్లారెడ్డి (ఇండియా ఛైర్మన్), విశ్వేశ్వర్ రెడ్డి (అమెరికా ఛైర్మన్) అతిథులను ఆత్మీయంగా సత్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో ఆహ్లాదంగా సాగిన ఈవెంట్లో కపిడి శ్రీనివాస్ రెడ్డి జీటీఏ న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "జీటీఏలో భాగమవడం ఒక గౌరవం. అమెరికాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా జీటీఏ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తాను" అని హామీ ఇచ్చారు.ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో ప్రముఖులు టీటీఏ అమెరికా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, యూఎస్ జీటీఏ ప్రెసిడెంట్ బాపు రెడ్డి, చార్లెస్ చాప్టర్ డైరెక్టర్ మన్మోహన్, న్యూజెర్సీ ఐకా ప్రతినిధులు మహేందర్ రెడ్డి ముసుగు, పృథ్వీ రెడ్డి, వాషింగ్టన్ డీసీ ప్రెసిడెంట్ తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ అలుమల మల్లారెడ్డి మాట్లాడుతూ.. “జీటీఏ మూడేళ్ల క్రితం ప్రారంభమై అప్పుడే 43 దేశాలకు విస్తరించింది. డిసెంబర్లో విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మా టీం అందరి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కన్వెన్షన్ ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క తెలంగాణ ఎన్నారై తమ సొంత గ్రామానికి కనెక్ట్ చేసే విధంగా జీటీఏ సంస్థ ప్రయత్నిస్తుంది. సొంత గ్రామానికి, ప్రాంతానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలి. రాజకీయాలను సైతం మార్చే శక్తిగా మారాలి. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఎన్నారైల పిల్లలు కూడా పాటించడం, సొంత గ్రామానికి నాయకులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం, మన యువతకు మద్దతుగా నిలవడం వంట కార్యక్రమాలు చేపడతాం.” అని తెలిపారు. జీటీఏ ఫౌండర్, అమెరికా ఛైర్మన్ విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ ఎన్నారైలందరిని ఒకే వేదికపైకి తీసుకు వచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ ప్రారంభించాము. మూడేళ్లలోనే జీటీఏ 43 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్య, వైద్యం, ఉపాధి, సాంస్కృతిక రంగాల్లో ఒక చోటికి తీసుకు వస్తోంది జీటీఏ..” అని చెప్పారు.టీటీఏ అమెరికా అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ, “జీటీఏతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. డిసెంబర్ 10న అమెరికాలో, డిసెంబర్ 25న హైదరాబాద్లో టీటీఏ దశాబ్దోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అలాగే వచ్చే జూలైలో చార్లెస్లో జీటీఏ కన్వెన్షన్ ఉంటుందని, అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం” అన్నారు.జీటీఏ కో ఫౌండర్ శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ, “న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ల ప్రారంభం ఒక మంచి మైలురాయిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలకు ఒక సమర్థవంతమైన వేదికగా జీటీఏ నిలుస్తోంది. సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తాం” అన్నారు.జీటీఏ: ఒక ఉద్యమం – ఒక వ్యవస్థజీటీఏ ప్రారంభమైన మూడేళ్లలోనే 43కి పైగా దేశాల్లో విస్తరించింది. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, సాంస్కృతిక అభివృద్ధి, తెలంగాణ గ్రామీణ అభివృద్ధి వంటి అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణ పౌరుడి గొంతును ప్రపంచమంతా వినిపించాలనే సంకల్పంతో జీటీఏ ఫౌండర్స్ విశ్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. "జీటీఏ పేరు కాదు – ఇది ఒక సామాజిక శక్తి, ఒక సేవా వ్యవస్థ" అని నిర్వాహకులు గర్వంగా చెబుతున్నారు. ప్రపంచంలోని అన్ని రాష్ట్రాలలోనూ జీటీఏ కార్యకలాపాలు విస్తరించడం లక్ష్యంగా జీటీఏ బృందం ముందుకు సాగుతోంది.

ఎవరీ లండన్ చాయ్వాలా.. ఏంటి ప్రత్యేకత?
ఇండియన్ కల్చర్లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్వాలా. అది కుడా లండన్లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. "చెకర్స్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్వాలాకు మరో చాయ్వాలా..భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్వాలాకు మరో చాయ్వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు. ఎవరీ అఖిల్ పటేల్?భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్లోని హాంప్స్టెడ్లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్షిప్లు పూర్తి చేశాడు.చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్.
క్రైమ్

తల్లి తీరు నచ్చక కొడుకు ఆత్మహత్య
నెన్నెల: తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ కొడుకు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నెన్నెల మండలం గంగారాం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (21) ఇంటర్ వరకు చదువుకున్నాడు. అనిల్ తల్లి ఆవుడం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మంగళి తిరుపతితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై అనిల్ తండ్రి తన భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. ఈ విషయం తెలిసిన అనిల్ కూడా తల్లిని మందలించాడు. అంతేకాకుండా తిరుపతి ఇంటికి వెళ్లి హెచ్చరించాడు. అయితే తిరుపతి వినకపోగా, అనిల్నే చంపుతానని బెదిరించాడు. తల్లి తీరు మారకపోవడం, తిరుపతి బెదిరింపులతో మనస్తాపం చెందిన అనిల్.. బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీసుకుని, మిత్రులు, కుటుంబ సభ్యులకు పంపించాడు. వారు అనిల్ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువులు గురువారం అనిల్ మృతికి కారణమైన తిరుపతి ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి ముందే ఆందోళన చేశారు. తిరుపతి అప్పటికే ఇంటికి తాళం వేసి పారిపోయాడు. దీంతో తాళం బద్దలుకొట్టి సామాగ్రిని ధ్వంసం చేసి కిచెన్షెడ్కు నిప్పు పెట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, తిరుపతిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హామీ ఇవ్వడంతో అనిల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

భార్య పేకాట ఆడుతుందంటూ భర్త ఫిర్యాదు
సాక్షి,విశాఖ: నగరంలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట ముఠా గుట్టు రట్టైంది. టాస్క్ ఫోర్స్, ఫోర్త్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా పేకాట ఆడుతున్న మహిళలు స్థానికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆగడాల్ని తట్టుకోలేని పేకాట ఆడుతున్న ఓ మహిళ భర్త సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్ని పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయారు. పేకాట ఆడటం.వాగ్వాదానికి దిగడం.. అడ్డు చెప్పిన వారిపై దాడులకు తెగబడ్డారు.ఈ క్రమంలో స్థానికులు వరుస ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

‘ఉద్యోగం లేదు.. బతకాలని లేదు’
పల్నాడు జిల్లా: మండలంలోని పెదగార్లపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (25) బుధవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. శ్రీనివాస రెడ్డి, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. బీటెక్ పూర్తి చేసిన చిన్న కుమారుడు బ్రహ్మారెడ్డి హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మూడేళ్లుగా ప్రయతి్నస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. దీంతో బుధవారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఉద్యోగం సాధించలేకపోయానని.. తానిక బతకలేనని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపి ఫోన్ పెట్టేశాడు. కుటుంబ సభ్యులు అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం హైదరాబాద్ లింగంపల్లి సమీపంలో రైలు కిందపడి బ్రహ్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతిచెందడంతో శ్రీనివాస్ రెడ్డి, భూలక్ష్మి బోరున విలపించారు. పోస్టుమార్టం పూర్తి కావడంతో బుధవారం రాత్రి బ్రహ్మారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన పెదగార్లపాడు తీసుకువచ్చారు.

వివాహేతర సంబంధం కొనసాగించలేదని కాల్పులు
కాకినాడ: శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శృంగధార గ్రామంలో ఈ నెల 3న మణికుమార్ (గబ్బర్సింగ్) అనే వ్యక్తి భార్యాభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధం కొనసాగించలేదనే కక్షే కారణమని పోలీసు విచారణలో తేలింది. బుధవారం అన్నవరం పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శృంగధార గ్రామానికి చెందిన కాకూరి చంద్రయ్య (చంద్రబాబు) భార్య సూర్యావతితో అదే గ్రామానికి చెందిన మణికుమార్కు వివాహేతర సంబంధం ఉంది. కొంత కాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే ఇటీవల సూర్యావతి తన భర్త చంద్రయ్య వద్దకు వచ్చేసింది. తనను వదిలేసి వచ్చిందని సూర్యావతిపై మణికుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 3న అర్ధరాత్రి చంద్రయ్య, సూర్యావతి వారి ఇంటి అరుగుపై నిద్రపోతుండగా మణికుమార్ వారిపై నాటు తుపాకీతో కాల్పులు జరపగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని డీఎస్పీ వివరించారు. మణికుమార్పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం పెదమల్లాపురం వద్ద ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి నాటు తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ వివరించారు.
వీడియోలు


మెడిసిటీ మెడికల్ కాలేజ్ మెడికోల గంజాయి కేసులో కొత్తకోణం


World Cup 2027: రోహిత్, కోహ్లి ఖేల్ ఖతం.. గంభీర్ గర్జన!


తురుకా కిషోర్ విడుదల


అమెరికా-ఉక్రెయిన్ మధ్య రక్షణ సహకారంలో కొత్త మలుపు


తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు


అవినాష్ రెడ్డి సమక్షంలో YSRCPలో చేరిన 40 మంది TDP కార్యకర్తలు


నా భర్తను బ్లాక్ మెయిల్ చేసి సంచలన నిజాలు బయటపెట్టిన అనిల్ రెడ్డి భార్య


శాతవాహన భూముల కబ్జాకు కుట్ర జరుగుతోంది : మల్లాది


చంద్రబాబు ఏరోజూ నిజాయితీగా రాజకీయాలు చేయలేదు: మేరుగు నాగార్జున


ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను రేవంత్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోంది