పెళ్లి వేదికపై కత్తిపోట్ల కలకలం.. నిందితుణ్ని వెంటాడిన డ్రోన్ కెమెరా.. వీడియో వైరల్
ముంబై: తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అంటూ బంధు పరివారమంతా ఆనందంగా పాటలు పాడుకుంటుండగా పెళ్లి వేదికపై కత్తిపోట్లు కలకలం రేపాయి. పెళ్లి తంతుపూర్తయి బంధువులతో కలిసి నూతన వధూవరులు ఫొటోలు దిగుతుండగా ఓ వ్యక్తి పెళ్లి కొడుకును కత్తితో పొడిచి పరారయ్యాడు. దీంతో పెళ్లి వేదికపై ఏం జరుగుతుందో అర్థం కాక బంధువులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మహరాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సోమవారం జరిగిన ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది. వేదికపై ఉన్న పెళ్లికుమారుడు సజల్ రామ్ సముద్ర (22)పై నిందితుడు రాఘో జితేంద్ర బక్షి అనే వ్యక్తి కత్తితో మూడు సార్లు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తన స్నేహితుడు బైక్తో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పెళ్లి వీడియోగ్రాఫర్ తన డ్రోన్ కెమెరాతో నిందితుణ్ని దాదాపు రెండు కిలోమీటర్లు ట్రాక్ చేశాడు. అప్రమత్తమైన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రోన్ ఫుటేజ్ ఆధారంగా నిందితుణ్ని,అతను దాక్కున్న ప్రాంతాన్ని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో, ఈ దాడికి కారణం డీజే డాన్స్ సమయంలో జరిగిన చిన్న గొడవ అని తేలింది. ఆ గొడవతో ఆగ్రహించిన నిందితుడు పెళ్లికుమారుడిపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సజల్ రామ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.अमरावती में एक शादी समारोह में दो लड़कों ने दूल्हे पर जानलेवा हमला कर दिया। इसके बाद ड्रोन कैमरामैन में जो किया वो काबिल ए तारीफ है। pic.twitter.com/38SnObPAOO— Shashank shukla (@shashaankshukla) November 12, 2025
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్కు ముందు టీమిండియాలో కీలక మార్పు
కోల్కతా వేదికగా నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్ట్కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటు చేసుకుంది. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి విడుదల చేశారు. నవంబర్ 13 నుంచి 19 మధ్యలో సౌతాఫ్రికా-ఏతో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో పాల్గొనాలని ఆదేశించారు. నవంబర్ 22 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్ సమయానికి తిరిగి సీనియర్ జట్టులో చేరతాడని పేర్కొన్నారు.నితీశ్ను భవిష్యత్ విదేశీ పర్యటనల కోసం సిద్దం చేస్తున్నామని బీసీసీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో నితీశ్ ఖంగుతిన్నాడు. నితీశ్కు ఈ పరిస్థితి రావడానికి సరైన అవకాశాలు రాకపోవడం ఓ కారణమైతే, ధృవ్ జురెల్ ఫామ్ మరో కారణం.పంత్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన జురెల్ జట్టులో స్థిరపడిపోయాడు. ఇటీవల విండీస్పై సెంచరీతో పాటు తాజాగా సౌతాఫ్రికా-ఏపై ఒకే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. మరోపక్క గాయం నుంచి కోలుకున్న పంత్ జట్టులోకి వచ్చాడు. అతను కూడా పూర్వపు ఫామ్ను కొనసాగించాడు. దీంతో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో పంత్, జురెల్ ఇద్దరిని ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితుల్లో ఎవరిపై వేటు వేయాలని ఆలోచిస్తే మేనేజ్మెంట్కు నితీశ్ కుమార్ రెడ్డి మొదటి ఆప్షన్ అయ్యాడు. నితీశ్ తాజాగా విండీస్తో జరిగిన సిరీస్లో రెండు మ్యాచ్ల్లో ఆడినా రెండు విభాగాల్లో (బ్యాటింగ్, బౌలింగ్) సరైన అవకాశాలు రాలేదు.తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో ఇన్నింగ్స్లో నితీశ్కు బంతినే ఇవ్వలేదు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అవకాశం రాగా, దానికి నితీశ్ న్యాయం చేశాడు. అప్పటికే భారత్ భారీ స్కోర్ చేయగా.. నితీశ్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 43 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో నితీశ్కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. విండీస్ స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతో నితీశ్కు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. చదవండి: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఎవరూ ఊహించని ఆటగాడు..!
బంగారం ఇప్పట్లో భారీగా తగ్గుతుందా?
బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి. కొన్ని రోజులుగా కొంత తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించినా మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో బంగారం ధరలు తగ్గుతాయా.. కొనగలమా అని సామాన్య కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ ఎమ్కే వెల్త్ మేనేజ్ మెంట్ (Emkay Wealth) బంగారం ధరలకు సంబంధించి కీలక అంచనాలు వెల్లడించింది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ మార్పులు, సంస్థాగత డిమాండ్ బంగారాన్ని “సురక్షిత స్వర్గధామ” ఆస్తిగా మరింత బలపరిచాయి. ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ ప్రకారం.. బంగారం ప్రస్తుతం దృఢమైన సాంకేతిక పునాదిలో ఉంది. సంస్థ అప్సైడ్ లక్ష్యాలను ఔన్స్కు 4,368 డాలర్ల నుంచి 4,600 డాలర్లుగా, అలాగే మద్దతు స్థాయిలను 3,890 డాలర్ల నుంచి 3,510 డాలర్ల వద్దగా నిర్దేశించింది.కాగా ప్రస్తుతం (12 నవంబర్ 2025 నాటికి) బంగారం ఔన్స్ ధర సుమారు 4,100 డాలర్ల వద్ద ఉంది. అదే తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,510 లుగా, 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,15,050 లుగా కొనసాగుతోంది.బంగారం పెరుగుదలకు ప్రాధాన కారణాలుడాలర్ బలహీనత: గత సంవత్సరం యూఎస్ డాలర్ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే 8% క్షీణించడం వల్ల, డాలర్ కాకుండా ఇతర కరెన్సీలలో ఉన్న పెట్టుబడిదారులకు బంగారం సాపేక్షంగా చౌకగా మారింది.ద్రవ్యోల్బణ అనిశ్చితి: అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమతుల్యత భయాలు బంగారాన్ని ద్రవ్యోల్బణ కవచంగా బలపరిచాయి.సెంట్రల్ బ్యాంక్ డైవర్సిఫికేషన్: డాలర్పై ఆధారాన్ని తగ్గించే క్రమంలో, వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ రిజర్వుల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి.ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు: 2025లో రికార్డు స్థాయి 65 బిలియన్ డాలర్ల మేర ఈటీఎఫ్ల ప్రవాహాలు బంగారంపై రిటైల్, సంస్థాగత విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.భౌగోళిక రాజకీయ అస్థిరత: తూర్పు ఐరోపా, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సురక్షిత-స్వర్గధామ ఆస్తులపై డిమాండ్ను నిలబెట్టాయి.
చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ నెల 26లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, హోంశాఖ, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.విచారణ సందర్భంగా జోగి రమేష్ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తినే నిందితుడిగా అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..‘సిట్ విచారణ ఎలా జరుగుతోంది? సీబీఐకి కేసు అప్పగించాలా?’ అనే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లైంది.
అమెరికాలో అందెశ్రీకి ఘన నివాళి
ఆఫ్రికా వెకేషన్లో అనసూయ.. సీమంతం ఫోటోలు షేర్ చేసిన శివజ్యోతి..!
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
యమహా నుంచి రెండు కొత్త ప్రీమియం బైకులు
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్కు ముందు టీమిండియాలో కీలక మార్పు
బంగారం ఇప్పట్లో భారీగా తగ్గుతుందా?
అనకాపల్లి జిల్లా వడ్డాదిలో 30 మందిని కరిచిన పిచ్చి కుక్క
భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి
బజాజ్ ఫిన్సర్వ్ లాభం రూ. 2,244 కోట్లు
నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం
డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారవృద్ధి
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
వెండి ధర అక్కడికి!.. కియోసాకి ట్వీట్
పసిడి, వెండి.. ధరల తుపాను
ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
నేను నా చాంబర్ నుంచి బయటికి వెళ్లినా ‘ఇన్’ అనే ఉంచు.. పరిస్థితులు బాగోలేవ్
ఈ రాశి వారికి ఆస్తి ఒప్పందాలు.. ఆర్థికాభివృద్ధి
అసలు ఓటర్ల లిస్టే డస్ట్ బిన్లో వేశారు..!!
వరుస ఫ్లాప్స్.. రవితేజ షాకింగ్ డెసిషన్!
ఈ రాశి వారికి ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.. ఆర్థికాభివృద్ధి
విశాఖ: భర్త శారీరకంగా దూరం పెట్టాడని..
బిగ్బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్
వన్డే ఆల్టైమ్ జట్టు.. రోహిత్కు దక్కని చోటు
సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్
ఎర్రకోట సమీపంలో పేలుడు - 12 మంది మృతి
తిరుమలలో మరో అపచారం.. తప్పు ఒప్పుకున్న టీటీడీ!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెర
సినిమా ప్రారంభోత్సవంలో సందడిగా నిహారిక (వీడియో)
అమెరికాలో అందెశ్రీకి ఘన నివాళి
ఆఫ్రికా వెకేషన్లో అనసూయ.. సీమంతం ఫోటోలు షేర్ చేసిన శివజ్యోతి..!
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
యమహా నుంచి రెండు కొత్త ప్రీమియం బైకులు
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్కు ముందు టీమిండియాలో కీలక మార్పు
బంగారం ఇప్పట్లో భారీగా తగ్గుతుందా?
అనకాపల్లి జిల్లా వడ్డాదిలో 30 మందిని కరిచిన పిచ్చి కుక్క
భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి
బజాజ్ ఫిన్సర్వ్ లాభం రూ. 2,244 కోట్లు
నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం
డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారవృద్ధి
వెండి ధర అక్కడికి!.. కియోసాకి ట్వీట్
పసిడి, వెండి.. ధరల తుపాను
ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
నేను నా చాంబర్ నుంచి బయటికి వెళ్లినా ‘ఇన్’ అనే ఉంచు.. పరిస్థితులు బాగోలేవ్
ఈ రాశి వారికి ఆస్తి ఒప్పందాలు.. ఆర్థికాభివృద్ధి
అసలు ఓటర్ల లిస్టే డస్ట్ బిన్లో వేశారు..!!
వరుస ఫ్లాప్స్.. రవితేజ షాకింగ్ డెసిషన్!
ఈ రాశి వారికి ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.. ఆర్థికాభివృద్ధి
విశాఖ: భర్త శారీరకంగా దూరం పెట్టాడని..
బిగ్బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్
వన్డే ఆల్టైమ్ జట్టు.. రోహిత్కు దక్కని చోటు
సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్
ఎర్రకోట సమీపంలో పేలుడు - 12 మంది మృతి
తిరుమలలో మరో అపచారం.. తప్పు ఒప్పుకున్న టీటీడీ!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెర
సినిమా ప్రారంభోత్సవంలో సందడిగా నిహారిక (వీడియో)
సినిమా
ఆఫ్రికా వెకేషన్లో అనసూయ.. సీమంతం ఫోటోలు షేర్ చేసిన శివజ్యోతి..!
కెన్యాలో చిల్ అవుతోన్న టాలీవుడ్ నటి అనసూయ.వియత్నాం వెకేషన్లో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్..సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ శివజ్యోతి..భర్తతో కలిసి ఆస్ట్రేలియా టూర్లో కాజల్ అగర్వాల్..హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ పిక్స్.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet)
14 సినిమాల్లో 10 బ్లాక్ బస్టర్స్.. 49 ఏళ్లకే మృతి.. ఎవరీ సూపర్ స్టార్?
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అంతా అందంగానే కనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరు స్టార్ అవుతారు..ఎవరు జీరో అవుతారో ఊహించలేం.డబ్బు, ఫేమ్ ఎలా వస్తుందో, ఎలా పోతుందో ఎవరూ అంచనా వేయలేం. స్టార్ అవ్వడానికి ఎంత కష్టపడాలో ఆ స్టార్డమ్ని కాపాడుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. ఒక చిన్నతప్పు చాలు ‘స్టార్’ని కాస్త జీరో చేయడానికి. ఉన్న ఫేమ్ పోయిన తర్వాత మళ్లీ తిరిగి తెచ్చుకోవడం కష్టం. రాలేదు కూడా. అలా ఓ వ్యక్తి తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది.. ఈగోతో గొడవలకు పోయి ఉన్న పేరుని కాస్త చెడగొట్టుకోవడమే కాదు.. హత్య కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు.అంతేకాదు 49 ఏళ్లకే తన జీవితానికి ‘శుభం’ కార్డు వేసుకున్నాడు. ఆయనే ఎంకే త్యాగరాజ భాగవతార్ అలియాస్ ఎంకేటీ.14 సినిమాల్లో 10 బ్లాక్ బస్టర్స్ఈ తరం ప్రేక్షకులకు ఎంకే త్యాగరాజ భాగవతార్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒకప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్. ఆయన నటించిన 14 చిత్రాలలో 10 సినిమాలు బ్లాక్బస్టర్ విజయాలు సాధించాయి.ఆయన నటించిన హరిదాస్ వంద వారాలకు పైగా ఆడిందట. ఎంకే త్యాగరాజ భాగవతార్ పూర్తి పేరు మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్. అభిమానులు ముద్దుగా ఎంకేటీ అని పిలుస్తారు. 1910లో పుట్టిన త్యాగరాజన్ది పేద కుటుంబం. కర్ణాటక సంగీత గాయకుడుగా పేరు సంపాదించింది తర్వాత సినిమాల్లోకి వచ్చాడు.1934-59 మధ్యకాలంలో 14 సినిమాల్లో హీరోగా నటిస్తే.. అందులో 10 భారీ విజయం సాధించాయి. దీంతో ఆయనకు సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చింది. 1940 ప్రాంతంలోనే మెర్సీడెస్ బెంజ్లో తిరగడమే కాక.. బంగారు పళ్లేల్లో భోజనం చేసేవాడట.హత్యకేసులో జైలుకు..స్టార్ హీరోగా మారిన తర్వాత ఎంకేటీ ప్రవర్తలో మార్పు వచ్చింది. ఓ ప్రముఖ దర్శకుడితో వివాదం ఎంకేటీ జీవితాన్ని తలకిందులు చేసిందట. ఈగోతో ఆ దర్శకుడితో గొడవపడడంతో తర్వాత అవకాశాలు తగ్గిపోయాయట. ఆ సమయంలోనే జరిగిన ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ఆయనను ఇరికించడంతో రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అవకాశాలు రాలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన అవకాశాల కోసం చాలా ప్రయత్నాలే చేశాడట. చివరకు అనారోగ్య భారిన పడి 1959 నవంబర్ 1వ 49 ఏళ్లకే కన్నుమూశారు.‘కాంత’ ఈ హీరో కథేనా?దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంతా’. రానా దగ్గుబాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే..ఇది ఎంకేటీ బయోపిక్లాగే అనిపిస్తుంది. ఇందులో ఎంకేటీ పాత్రలో దుల్కర్ నటించగా.. ఆయన పతనానికి కారణం అయిన దర్శకుడి పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇది ఎంకేటీ బయోపిక్ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
'అన్నకు మేమే ఫ్యాన్స్.. ఇప్పుడేస్తాం డ్యాన్స్'.. మాస్ సాంగ్ రిలీజ్
మాస్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ మరో క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ మాస్ సాంగ్ రామ్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు దినేశ్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. వివేక్ అండ్ మెర్విన్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.
కాంతార చాప్టర్-1.. రిషబ్ శెట్టి గూస్బంప్స్ వీడియో చూశారా?
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్-1. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో విక్కీ కౌశల్ ఛావాను దాటేసింది. దీంతో 2025లో అత్యధి వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. కాంతారకు ప్రీక్వెల్గా వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి అద్భుతమైన వీడియోను పోస్ట్ చేసింది ఓటీటీ సంస్థ. ఈ మూవీలో రిషబ్ శెట్టి గులిగా మారే సీన్కు సంబంధించిన వీడియోను పంచుకుంది. రిషబ్ శెట్టి ఐకానిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఈ సీన్ ఆడియన్స్కు గూస్ బంప్స్ తెప్పించేలా మాత్రమే కాదు.. ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటుంది. ఈ సీన్లో గుల్షన్ దేవయ్య నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
క్రీడలు
ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్ట్లో రిషబ్ పంత్ (Rishabh Pant), ధృవ్ జురెల్ (Dhruv Jurel) బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైపోయింది. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే ధృవీకరించాడు. జురెల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడని, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాన్ని పంత్ భర్తీ చేస్తాడని వెల్లడించాడు.డస్కటే ప్రకటనతో టీమిండియా తుది జట్టు కూర్పుపై క్లారిటీ వచ్చేసింది. ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్, వన్డౌన్లో సాయి సుదర్శన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆతర్వాతి స్థానాల్లో జురెల్, పంత్, జడేజా, సుందర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలుతొలి టెస్ట్లో తనూ, పంత్ ఇద్దరూ బరిలోకి దిగడం ఖరారైన నేపథ్యంలో జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్స్టార్ "ఫాలో ద బ్లూస్"తో మాట్లాడుతూ పంత్తో పోటీ ఉంటుందా అన్న అంశంపై స్పందించాడు. పంత్తో పోటీ ఉండదని, ఇద్దరం టీమిండియాకు ఆడుతున్నామని అన్నాడు. ఇద్దరిలో ఎవరు బాగా ఆడినా, అంతిమంగా తమ లక్ష్యం భారత్ గెలుపేనని తెలిపాడు.పంత్ బాగా ఆడినా, నేను బాగా ఆడినా సంతోషిస్తానని అన్నాడు. ఇద్దరు బాగా ఆడితే అంతకు మించిన సంతోషం లేదని తెలిపాడు. అంతిమంగా జట్టు ఫోకస్ అంతా గెలుపుపైనే ఉంటుందని చెప్పుకొచ్చాడు.ఇదే సందర్భంగా సౌతాఫ్రికాతో పోటీపై కూడా స్పందించాడు. ఈ సిరీస్ హోరాహోరీగా ఉండబోతుందని అంచనా వేశాడు. ఇరు జట్లలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని అన్నాడు. వారికి రబాడ, జన్సెన్ ఉంటే.. మాకు బుమ్రా, సిరాజ్ ఉన్నారని చెప్పుకొచ్చాడు.కాగా, పంత్ గైర్హాజరీలో టీమిండియాలోకి వచ్చిన జురెల్ అసాధారణ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల అహ్మదాబాద్ టెస్ట్లో వెస్టిండీస్పై సూపర్ సెంచరీ చేసిన అతను.. తాజాగా సౌతాఫ్రికా-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ల్లో రెండు ఇన్నింగ్స్ల్లో అజేయ సెంచరీలు చేశాడు. జురెల్ ప్రస్తుత ఫామ్ టీమిండియాలో అతని స్థానాన్ని సుస్థిరం చేసేలా ఉంది.చదవండి: బాబర్ ఆజమ్ను వెనక్కు నెట్టిన విరాట్ కోహ్లి
బాబర్ ఆజమ్ను వెనక్కు నెట్టిన విరాట్ కోహ్లి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగింది. తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ను (Babar Azam) వెనక్కు నెట్టి టాప్-5లోకి చేరాడు.గత వారం ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో ఉండిన విరాట్ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకాడు. సౌతాఫ్రికా సిరీస్లో ఘెరంగా విఫలమైన బాబర్ రెండు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. టాప్-10 మరో టీమిండియా స్టార్ ఆటగాడు కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ సిరీస్లో ఓ హాఫ్ సెంచరీతో రాణించిన శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో స్థానాన్ని కాపాడుకున్నాడు.తాజాగా ర్యాంకింగ్స్లో ఇద్దరు పాక్ ఆటగాళ్లు భారీగా లబ్ది పొందారు. సౌతాఫ్రికా సిరీస్లో రాణించినందుకు యువ ఆల్రౌండర్ సైమ్ అయూబ్ ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకొని 36వ స్థానానికి ఎగబాకాడు. అదే సౌతాఫ్రికా సిరీస్లో పర్వాలేదనిపించి, నిన్న శ్రీలంకతో జరిగిన వన్డేలో శతక్కొట్టిన పాక్ టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా 14 స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు.పాక్తో సిరీస్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 15వ స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ప్లేస్కు చేరాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్ నుంచి టాప్-10లో కుల్దీప్ యాదవ్ (6) ఒక్కడే ఉన్నాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్ను కాపాడుకోగా.. భారత ఆటగాడు అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.చదవండి: IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త
2025, జూన్ 3.. ఆర్సీబీ అభిమానుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఆ రోజు ఆర్సీబీ (RCB) తమ తొలి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లకు, ముఖ్యంగా అభిమానులకు ఆ ఆనందం ఎంతో సేపు మిగల్లేదు. మరుసటి రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. అభిమానుల ఉత్సాహం, అధికారుల నిర్లక్ష్యం కలిసినప్పుడు ఎంతటి విషాదం చోటు చేసుకుంటుందో ఈ ఘటన రుజువు చేసింది.సురక్షితం కాదుఈ ఘోర విషాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి జాన్ మైఖేల్ డికున్హా నేతృత్వంలో ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. ఈ స్టేడియం భారీ జనసమూహాలు గుమి కూడటానికి అనర్హంగా ప్రకటించింది. కమిషన్ నిర్ణయం వల్ల ఆర్సీబీ 2026 ఐపీఎల్ సీజన్లో తమ హోం మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సమాచారం తెలిసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ తమ తాత్కాలిక హోం గ్రౌండ్గా పూణేలోని గహున్జే స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం.. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుణేలోని గహున్జే స్టేడియాన్ని ఆర్సీబీకి తాత్కాలిక హోం గ్రౌండ్గా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ అంశంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని సాంకేతిక అంశాలు పరిష్కారమైతే, ఆర్సీబీకి పుణే వేదికగా మారే అవకాశం ఉంది.ఆర్సీబీ అభిమానులకు చేదు వార్తఈ వార్త ఆర్సీబీ అభిమానులకు తీరని శోకాన్ని కలిగిస్తుంది. 17 ఏళ్ల తర్వాత తొలి టైటిల్ సాధిస్తే.. ఆ సంతోషాన్ని హోం గ్రౌండ్లో ఆస్వాదించలేమా అని వారు వాపోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తాము హోం గ్రౌండ్లో మ్యాచ్లు ఆడలేమని తెలిసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అన్నీ కుదిరి హోం గ్రౌండ్ పూణేకి మారితే ఆర్సీబీకి సొంత అభిమానులు దూరమయ్యే ప్రమాదం ఉంది. కొత్త వాతావరణంలో ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఇమడటానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కాని ఐపీఎల్ నుంచి కాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్
శతక్కొట్టిన హసన్ జాయ్.. భారీ స్కోర్ దిశగా బంగ్లాదేశ్
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 246 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్ముదుల్ హసన్ జాయ్ (Mahmudul Hasan joy) సెంచరీతో (125 నాటౌట్) కదంతొక్కి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మరో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (80) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. హసన్ జాయ్కు జతగా మొమినుల్ హాక్ (38) క్రీజ్లో ఉన్నాడు. షద్మాన్ వికెట్ మాథ్యూ హంఫ్రేస్కు దక్కింది.అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కాన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30), బ్యారీ మెక్కార్తీ (31) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ 3, హసన్ మహమూద్, తైజుల్ ఇస్లాం, హసన్ మురద్ తలో 2, నహిద్ రాణా ఓ వికెట్ తీసి ఐర్లాండ్ను దెబ్బ కొట్టారు. బంగ్లాదేశ్ ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు దాటి 40 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.రెండు టెస్ట్లు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్ సిల్హెట్ వేదికగా నవంబర్ 11న మొదలు కాగా.. రెండో టెస్ట్ ఢాకా వేదికగా నవంబర్ 19 నుంచి జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనంతరం నవంబర్ 27, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. తొలి రెండు మ్యాచ్లకు చట్టోగ్రామ్, మూడో టీ20కి ఢాకా ఆతిథ్యమివ్వనున్నాయి. చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్
బిజినెస్
పేలుడు ఘటనల్లో సత్య శోధన
ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో నవంబర్ 10న భారీ పేలుడు సంభవించింది. సిగ్నల్ వద్ద నిలిపిన ఐ20 కారు అకస్మాత్తుగా పేలింది. ఈ విస్ఫోటనంతో చుట్టుపక్కల ప్రజలు మరణించడంతోపాటు సమీపంలోని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇటువంటి సంఘటనల్లో అత్యాధునిక ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచ్ఛిన్నమైన సాక్ష్యాలను సేకరించి, వాటిని ఏకం చేయాలి. ఒక సంఘటన ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందో నిర్ణయించడమే కాకుండా కోర్టులో ఫలితాలు నిలబడేలా చూడాలి. ఈ పేలుడు ఘటనతో న్యూదిల్లీలోని అధికార యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఈ విషాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్లు కొన్ని అనుమానిత ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నిజాన్ని వెలికితీసేందుకు ఎక్స్పర్ట్లు అనుసరించే అత్యాధునిక పద్ధతుల గురించి తెలుసుకుందాం.ఈ ఘటన జరిగిన అరగంటలోపే ఢిల్లీ ఫోరెన్సిక్ లాబొరేటరీ పేలుడు పదార్థాల విభాగానికి చెందిన నిపుణులు పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమికంగా సంఘటన స్థలం నుంచి అనుమానిక సాక్ష్యాలను పరిశీలించి వాటిని విశ్లేషిస్తారు. సాంప్రదాయ నేరాల మాదిరిగా కాకుండా పేలుళ్లు ప్రత్యేకమైన సవాళ్లను కలిగి ఉంటాయి. తీవ్రమైన ఒత్తిడి, వేడి కారణంగా వస్తువులు బూడిదవుతాయి. దాంతో ఆధారాలు సేకరించడం కష్టమవుతుంది.ఫోరెన్సిక్ సైన్స్లో ‘లోకార్డ్ మార్పిడి సూత్రం’ అని ఉంటుంది. ఇది ప్రతి నేరస్థుడు సంఘటనా స్థలంలో ఏదో ఆధారం వదిలివేసి లేదా ఏదో తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెబుతుంది. పేలుడు గందరగోళంలో ఒత్తిడికి గురికాకుండా నిపుణులు అనుమానితులను సంఘటన స్థలానికి అనుసంధానించే కోణంలో పరిశోధనలు చేస్తారు. వారు ఉపయోగించిన పేలుడు పదార్థాలు ఏ రకమైనవో, వాటి తీవ్రత ఎలా ఉంటుందో విశ్లేషిస్తారు.కాలి బూడిదైనా...అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో నిపుణులు ముఖ్యంగా పేలుడు పదార్థాల అవశేషాలు, అగ్ని ప్రమాదానికి కారణమైన పదార్థాల జాడలు, వేడి ప్రభావంతో మారిన వస్తువుల భౌతిక ఆధారాల కోసం వెతుకుతారు. కాలిన శిథిలాల నుంచి చిన్న చిన్న అవశేషాలను చాలా జాగ్రత్తగా కలుషితం కాకుండా ఉండేలా సేకరిస్తారు. సాధారణంగా మండే స్వభావం ఉన్న ద్రవాలు నేలలోకి లేదా ఇతర శోషక పదార్థాలలోకి ఇంకిపోతాయి. కాబట్టి కార్బన్ అవశేషాలు (Soot), కాలిన భాగాల అంచులు, మట్టి నమూనాలను సేకరిస్తారు.ప్యాకేజింగ్సేకరించిన నమూనాలను తక్షణమే గాలి చొరబడని ప్రత్యేక డబ్బాల్లో (Airtight Containers) ప్యాక్ చేస్తారు. ప్లాస్టిక్ సంచులను నివారిస్తారు. ఎందుకంటే అవి మండే ద్రవాల ఆవిరులను (Vapors) పీల్చుకోవచ్చు లేదా కలుషితం చేయవచ్చు.డాక్యుమెంటేషన్సంఘటన స్థలాన్ని చాలా కోణాల నుంచి ఫోటోలు తీస్తారు. లేజర్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా 3డీ స్కెచ్లు వేయిస్తారు. ఇది అగ్ని వ్యాప్తి చెందిన విధానాన్ని (Fire Propagation), పేలుడు కేంద్ర బిందువును అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.సంఘటనకు లింక్ చేయడంఅగ్ని ఎంత వేగంగా, ఏ దిశలో వ్యాపించింది అనే నమూనా, అత్యంత ఎక్కువ నష్టం జరిగిన ప్రదేశం ఆధారంగా పేలుడు/ అగ్ని ప్రారంభ స్థానాన్ని గుర్తిస్తారు. కాలిపోయిన లోహపు శకలాల నమూనా, వాటి కదలికను బట్టి అది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదమా లేదా పేలుడు పదార్థాలను ఉపయోగించిన దాడినా అని నిర్ధారిస్తారు.గ్యాస్ క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీఇది అత్యంత ముఖ్యమైన సాంకేతికత. నమూనాలోని మండే ద్రవాల ఆవిరులను (పెట్రోల్, కిరోసిన్ వంటివి) గుర్తించడానికి ఉపయోగిస్తారు. పేలుడు అవశేషాల రసాయన మిశ్రమాలను కూడా వేరు చేసి ఇందులో గుర్తిస్తారు.ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీకాలిన అవశేషాలు కాంతితో ఎలా చర్య చెందుతాయో విశ్లేషించి అందులోని రసాయన బంధాలను గుర్తిస్తుంది. ఇది పేలుడు పదార్థాల రసాయన కూర్పును తెలుసుకోవడానికి సహాయపడుతుంది.స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీపేలుడు శకలాల ఉపరితల స్వరూప శాస్త్రాన్ని (Morphology) పరిశీలిస్తుంది. ముఖ్యంగా పేలుడు తర్వాత మిగిలిపోయిన మూలకాల జాడలను (ఉదా: సల్ఫర్, నైట్రోజన్, లెడ్) గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది పేలుడు పదార్థం రకాన్ని నిర్ధారిస్తుంది.అంతిమంగా దోషులను కనిపెట్టే మార్గాలుదోషులను గుర్తించడానికి ఫోరెన్సిక్ అధికారులు కేవలం రసాయన ఆధారాలపైనే కాకుండా చాలా పద్ధతులను అనుసరిస్తారు. ప్రయోగశాలలో ఏదైనా ప్రత్యేకమైన లేదా వాణిజ్యపరమైన పేలుడు పదార్థాలను గుర్తిస్తే ఆ పదార్థాన్ని కొనుగోలు చేసిన, తయారు చేసిన లేదా నిల్వ చేసిన వ్యక్తులపై దర్యాప్తు చేస్తారు.వాహనం పేలుడు ఘటనకు కేంద్ర బిందువు అయితే ట్యాంపరింగ్కు గురైన ఇంజిన్ లేదా ఛాసిస్ నంబర్లను థర్మోకెమికల్ ఎచింగ్ ద్వారా తెలుసుకుంటారు. దీని ద్వారా వాహనం యజమాని వివరాలు తెలుస్తుంది.సంఘటన స్థలం చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరించి సంఘటనకు ముందు అనుమానాస్పద కదలికలను ట్రాక్ చేస్తారు. అనుమానితుల డిజిటల్ పరికరాలలో (ఫోన్లు, కంప్యూటర్లు) పేలుడు తయారీకి సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తారు.ఇదీ చదవండి: అంతా కాకపోయినా కొంత ఊరట! తులం ఎంతంటే..
అంతా కాకపోయినా కొంత ఊరట! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్న తులంపై సుమారు రూ.2,250 పెరిగిన బంగారం ధరలు బుధవారం కొంతవరకు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
400 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 133 పాయింట్లు పెరిగి 25,826కు చేరింది. సెన్సెక్స్(Sensex) 441 పాయింట్లు పుంజుకొని 84,328 వద్ద ట్రేడవుతోంది.కొన్ని రోజులుగా నిఫ్టీ సూచీ 25,500(50 పాయింట్లు బఫర్) నుంచి 26,000 మార్కు మధ్యే కదలాడుతుంది. పైన తెలిపిన కనిష్ట మార్కు వద్దకు సూచీ రాగానే కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ 26,000 మార్కు పైకి వచ్చి ఒకటి లేదా రెండు రోజులు నిలకడగా ఉంటే టెక్నికల్ సమాచారం ప్రకారం మార్కెట్ సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఈక్విటీ ఫండ్స్కు తగ్గుతున్న ఆకర్షణ!
ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు ఫండ్స్లో తాజా పెట్టుబడులపై ప్రభావం చూపిస్తున్నాయి. అక్టోబర్లోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 19 శాతం తక్కువగా రూ.24,691 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. సెప్టెంబర్లో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.30,422 కోట్లుగా ఉండడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది. బంగారం ధరల ర్యాలీ మద్దతుతో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి మరిన్ని పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్లో రూ.7,743 కోట్ల తాజా పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్లు ఆకర్షించాయి. నెలవారీ గరిష్ట రికార్డు ఇది. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ మొదటిసారి రూ.లక్ష కోట్ల మార్క్ను అధిగమించింది. సిప్ పెట్టుబడులు స్థిరం..దీర్ఘకాల లక్ష్యాల కోసం క్రమానుగత పెట్టుబుడుల (సిప్) విషయంలో ఇన్వెస్టర్ల ధోరణి స్థిరంగానే కొనసాగుతోంది. ఇందుకు నిదర్శనంగా సిప్ ద్వారా అక్టోబర్లో ఈక్విటీ ఫండ్స్లోకి వచి్చన పెట్టుబడులు రూ.29,529 కోట్లుగా ఉన్నాయి. సెపె్టంబర్లో సిప్ పెట్టుబడులు రూ.29,631 కోట్లతో పోల్చితే స్వల్ప తగ్గుదల కనిపించింది. విభాగాల వారీగా..అక్టోబర్లో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మినహా మిగిలిన విభాగాల పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా ఫ్లెక్సీకాŠయ్ప్ ఫండ్స్లోకి రూ.8,928 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెపె్టంబర్లో వచి్చన రూ.7,029 కోట్లతో పోల్చి చూస్తే 27 శాతం పెరిగాయి. మిడ్క్యాప్ ఫండ్స్ సెపె్టంబర్ నెల కంటే 25 శాతం తక్కువగా రూ.3,807 కోట్లు, స్మాల్క్యాప్ ఫండ్స్ 20 శాతం తక్కువగా రూ.3,476 కోట్లు చొప్పున ఆకర్షించాయి.లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్లోకి రూ.3,177 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్లోకి రూ.2,500 కోట్లు, లార్జ్క్యాప్ ఫండ్స్లోకి రూ.972 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్లోకి రూ.939 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.1,366 కోట్లు ఆకర్షించాయి.ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నుంచి రూ.665 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ నుంచి రూ.179 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.1.59 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు రెండు నెలల్లోనూ ఇవి నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ రూ.89,375 కోట్లు, ఓవర్నైట్ ఫండ్స్ రూ.24,050 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.15,066 కోట్లు చొప్పున రాబట్టాయి. హైబ్రిడ్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్ కలయిక) 14,156 కోట్ల పెట్టబుడులు వచ్చాయి. సెప్టెంబర్లో పెట్టుబడులు రూ.9,397 కోట్ల కంటే 51 శాతం పెరిగాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్లోకి రూ.6,919 కోట్లు, మల్టీ అసెట్ ఫండ్స్లోకి రూ.5,344 కోట్లు చొప్పున పెట్టుబడులు వచ్చాయి. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్/అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లోకి రూ.1,139 కోట్లు వచ్చాయి. ప్యాసివ్ ఫండ్స్ అయిన ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు 13 శాతం తగ్గి రూ.16,668 కోట్లకు పరిమితమయ్యాయి.అక్టోబర్లో 18 కొత్త పథకాలు (న్యూఫండ్ ఆఫర్/ఎన్ఎఫ్వో) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.6,062 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. అక్టోబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) సెప్టెంబర్ నుంచి 5 శాతం పెరిగి రూ.79.88 లక్షల కోట్లకు పెరిగింది. లాభాల స్వీకరణ వల్లే..ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం ఫలితంగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు తగ్గినట్టు యాంఫి సీఈవో వీఎన్ చలసాని తెలిపారు. ‘‘సిప్ ఏయూఎం రూ.16.25 లక్షల కోట్లకు చేరింది. పరిశ్రమ మొత్తం ఏయూఎంలో సిప్ వాటా ఐదంట ఒక వంతుకు చేరింది. మొత్తం యాక్టివ్ సిప్ ఖాతాలు 9.45 కోట్లకు పెరిగాయి’’అని చలసాని తెలిపారు.ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు!
ఫ్యామిలీ
డీప్ఫేక్ ఇప్పటి విలన్
సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా స్త్రీల ఇష్టాయిష్టాల వ్యక్తీకరణకు చోటు దొరికిందని భావిస్తున్నంతలోనే కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ట్రోలింగ్ చేసే ధోరణికి బదులు డీప్ఫేక్స్, న్యూడిటీ యాప్స్ ద్వారా స్త్రీలను భయభ్రాంతం చేయడం దేశంలో పెరిగిందని న్యూఢిల్లీకి చెందిన‘బ్రేక్త్రూ ఇండియా’ అనే ఎన్.జి.ఓ. తన అధ్యయనం ద్వారా తెలిపింది. స్త్రీలను వంటగదికే పరిమితం చేసినట్టుగా సోషల్ మీడియాకు బయటే వారిని ఉంచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలుపురుష అహంకారం చాటుకోవడానికి మగవారికి స్త్రీలను అణిచే పద్ధతులు కావాలి. స్త్రీలు ముందుకు అడుగు వేసినా, ఆత్మవిశ్వాసం ప్రదర్శించినా, గట్టి రాజకీయ అబీప్రాయాలు వ్యక్తపరిచినా, ఫ్యాషనబుల్గా ఉన్నా, ఆనవాయితీలను ఉల్లంఘించినా వారిని ‘అదుపు’ చేసి అహాన్ని సంతృప్తి పరుచుకోవాలనుకుంటారు పురుషులు. ఈ పని ఇళ్లల్లో, సంఘంలో ఒక విధంగా జరిగితే సోషల్ మీడియాలో మరో విధంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో వివిధ ఆసక్తులతో గుర్తింపు పొందుతున్న స్త్రీలను బెదరగొట్టే ట్రోలింగులు గతంలో చూస్తే ఇప్పుడు ‘డీప్ఫేక్’లతో వారి మీద అంకుశం విసరాలని చూస్తున్నారు కొందరు. అంతేకాదు, డీప్ఫేక్ ఉపయోగిస్తూ ఆడవాళ్ల చిత్రాలను అసభ్యంగా రూపొందించి అవి చూపించి బెదిరించడం, డబ్బు వసూలు చేయడం, తాము చెప్పిన పనులకు ఉపయోగించడం చేస్తున్నారు. సామాన్య మహిళల నుంచి సెలబ్రెటీల వరకూ ఈ డీప్ఫేక్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల నటి అనుపమ పరమేశ్వరన్ తన డీప్ఫేక్ చిత్రాలను చూసి హతాశురాలైపోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలతో..భారతదేశం ఏఐ వినియోగ మార్కెట్లో ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది. ఏఐలో వస్తున్న అప్డేట్లను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మన దేశంలో అనేకరంగాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇదే సమయంలో నేరగాళ్లూ ఏఐని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్త్రీలు సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను తీసుకుని, ఏఐ ద్వారా తమకు నచ్చిన రీతిలో మార్చుకుంటున్నారు. అసభ్యంగా, నగ్నంగా తయారు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అవి నిజమైన చిత్రాలలాగే ఉండటంతో బాధితులు కంగారు పడుతున్నారు. అవి బయటకు వస్తే తమ పరువుపోతుందని బాధపడుతూ మానసిక వేదనకు గురవుతున్నారు. అనేక కుటుంబాల్లో ఇది తీవ్రమైన సమస్యగా పరిణమిస్తోంది.సోషల్ మీడియాలో పెట్టిన నిమిషాల్లోనే..సెలబ్రెటీల చిత్రాలతోపాటు సామాన్యుల సోషల్ మీడియా అకౌంట్లపైనా మాయగాళ్లు నిరంతరం కన్నేసి ఉంచుతున్నారు. ఎవరైనా కొత్తగా చిత్రాలుపోస్ట్ చేస్తే నిమిషాల్లోనే వాటిని సేవ్ చేసుకుంటున్నారు. అనంతరం ఏఐ సాయంతో తమకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నారు. ఇటీవలపోలీసుల వద్ద నమోదవుతున్న కేసుల్లో డీప్ఫేక్ కేసులు పెరుగుతున్నాయని ‘బ్రేక్త్రూ ఇండియా’ అధ్యయనంలో తేలింది. ఢిల్లీకి చెందిన ఈ ఎన్.జి.ఓ. సోషల్ మీడియాలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఇటీవల అధ్యయనం చేసింది.‘డబ్బుకోసమే కాకుండా మహిళల పట్ల కక్ష పెంచుకున్న కొందరు కావాలని ఆ మహిళల డీప్ఫేక్ అశ్లీల ఫొటోలు వారి కుటుంబసభ్యులకు పంపుతూ రాక్షసానందం పొందుతున్నారు. ప్రేమలో ఫెయిలైన అబ్బాయిలు తమ మాజీ ప్రియురాళ్ల చిత్రాలను ఇలా తయారు చేసి వాళ్లను బెదిరిస్తున్నారు. కొన్ని లోన్యాప్స్ తమ వద్ద లోన్ తీసుకున్నవారి చిత్రాలను మార్ఫింగ్ చేసి, వారి కుటుంబసభ్యులకు పంపిన ఉదంతాలు జరిగాయి’ ఆ అధ్యయనంలో తెలిసింది.డీప్ఫేక్ని గుర్తించే ప్రత్యేక చట్టాలేవీ? డీప్ఫేక్ రాజకీయ రంగాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. రాజకీయ నేతల చిత్రాలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా మార్చి, వారి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ అన్ని సోషల్ మీడియా సంస్థలకు డీప్ఫేక్ చిత్రాలు, వీడియోలను తక్షణం తొలగించాలని తెలిపాయి. అయినా ఆగడాలు ఆగడం లేదు. ఈ డీప్ఫేక్ మోసాలతో మహిళలతోపాటు పురుషులూ మానసికంగా ఆందోళన చెందుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ తరహా నేరాల తీవ్రత పెరుగుతున్నా డీప్ఫేక్ని నేరంగా గుర్తించే ప్రత్యేక చట్టం మన దేశంలో లేదు. ప్రస్తుతానికి ఈ తరహా నేరాలను మహిళలపై వేధింపులు, సైబర్ నేరాల పరిధిలోనేపోలీసులు నమోదు చేస్తున్నారు.కట్టడి చేయడమెలా?సోషల్ మీడియా వాడకం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో డీప్ఫేక్ నేరాలను అడ్డుకోవడం కత్తిమీద సాముగా మారింది. ప్రోఫైల్ లాక్ వంటివి కొంత ఉపకరిస్తున్నా, పూర్తిస్థాయిలో అవీ రక్షణ కల్పించలేకపోతున్నాయని బాధితులు అంటున్నారు. ఈ నేరాలకు భయపడి సోషల్ మీడియాకు పూర్తి దూరంగా ఉంటున్నామని అంటున్నారు. అయితే డీప్ఫేక్లు వచ్చినప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా ఆ విషయం తెలపాలని నిపుణులు అంటున్నారు. అలాగే సోషల్ మీడియా పరిచయంతో ఇతరులకు ఫొటోలు, వీడియోలు పంపడం మానుకోవాలని సూచిస్తున్నారు. మరీ అభ్యంతరకరంగా తోచేవి, పూర్తి వ్యక్తిగతమైన చిత్రాలనుపోస్ట్ చేయకపోవడం మంచిదంటున్నారు. ఎవరైనా డీప్ఫేక్ ఫొటోలు చూపించి బెదిరిస్తే భయపడక వెంటనేపోలీసులను సంప్రదించాలని అంటున్నారు.
కూతురి కలను నిజం చేసిన నాన్న!
పిల్లలకు ప్రేమ పంచడంలో తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా. బిడ్డలను కంటిరెప్పలా సాకడంతో పాటు, వారి ఆనందం కోసం ఎంతో శ్రమిస్తుంటారు. పిల్లల కళ్లలో సంతోషం చూడటానికి ఎన్ని ఇబ్బందులనైనా పంటి బిగువున భరిస్తారు. తన గారాలపట్టి ఆనందం కోసం ఓ తండ్రి చేసిన పని ఇప్పుడు పతాక శీర్షికల్లో నిలిచింది.అందరి లాగే బచ్చు చౌదరికి తన కుటుంబమే ప్రపంచం. ముఖ్యంగా కూతురంటే అతడికి ఎనలేని ప్రేమ ఆమె ఏది అడిగినా కాదనడు. అలాగనీ అతడేమి పెద్ద జమీందారు కాదు. అతడో చాయ్ వాలా. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లా (Midnapore District) మౌలా గ్రామంలో ఒక చిన్న టీ స్టాల్ నడుపుతున్నాడు. కొన్నేళ్ల క్రితం స్కూటీ కొనిపెట్టమని తన కూతురు సుష్మ అడిగింది. అంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బచ్చుకు బండి కొనడం అంటే కష్టమే అనిపించింది. కానీ కూతురు సంతోషమే తనకు ముఖ్యమని భావించాడు.బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ప్రతి రోజు తాను సంపాదించిన మొత్తంలో కొంత మొత్తం పొదుపు చేయడం ప్రారంభించాడు. టీ అమ్మి సంపాదించిన డబ్బు నుంచి రోజూ కొన్ని 10 రూపాయల నాణేలను పక్కన పెట్టేవాడు. వీటిని ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో వేసేవాడు. అతడు ఇలా వరుసగా నాలుగు సంవత్సరాలు పాటు చేశాడు. నాణేలతో డబ్బా నిండిపోవడంతో ఇటీవల దగ్గరలోని టూవీలర్ షోరూమ్కు వెళ్లాడు.రూ. 69 వేల నాణేలు!వెంటనే వెళ్లి నాణేలతో కూడిన పెద్ద డబ్బాను షోరూమ్కు తెచ్చాడు. డబ్బాలోని నాణేలను నేల మీద పోయగానే... అక్కడున్నవారంతా ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. నాణేలతో పాటు కొన్ని నోట్లను కూడా బచ్చు పొదుపు చేశాడు. వీటన్నింటిని 8 మంది రెండున్నర గంటల పాటు లెక్కించారు. డబ్బాలోని నాణేలన్ని కలిపి రూ. 69 వేలుగా లెక్క తేలింది. నోట్ల రూపంలో కూడబెట్టింది కూడా కలుపుకుంటే లక్ష రూపాయలు అయ్యాయి. మరో విశేషం ఏంటంటే బచ్చు చౌదరి కూతురు సుష్మ కూడా రూ. 10 వేలు పొదుపు చేసింది.ఆశ్చర్యపోయాంషోరూమ్ ఉద్యోగి అరిందమ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ''బచ్చు చౌదరి మా దగ్గరికి వచ్చి మొదట స్కూటర్ల ధరల గురించి అడిగారు. నాణేలు తీసుకుంటారా అని అడిగితే, తీసుకుంటామని చెప్పాం. డబ్బా నిండా నాణేలు తెచ్చి మా ముందు పోయడంతో ఆశ్చర్యపోయాం. మా కెరీర్లో ఇలాంటి అనుభవం మాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. కూతురి సంతోషం కోసం అతడు చూపించిన అంకిత భావం మమ్మల్ని భావోద్వేగానికి గురి చేసింద''ని అన్నారు.చదవండి: చిన్న కారణాలు.. పెద్ద భయాలుమా కల నెరవేరిందితన కూతురి కోసం స్కూటర్ కొనడం చాలా సంతోషంగా ఉందని బచ్చు చౌదరి తెలిపారు. "నా కూతురు చాలా సంవత్సరాల క్రితం స్కూటర్ (Scooter) అడిగింది. అప్పుడు నేను దానిని కొనలేకపోయాను. కాబట్టి, నేను నాకు వీలైనంత పొదుపు చేయడం ప్రారంభించాను. దీనికి సమయం పట్టింది, కానీ నేను ఆమె కోసం దాన్ని చేశాను. స్కూటర్ కొనుక్కోవాలనేది నా కూతురు కల మాత్రమే కాదు, నాది కూడా. ఇప్పుడు మా కల సాకారమయిందని" బచ్చు తెలిపారు.
4 వేల లీటర్ల పాల దిగుబడినిచ్చే ఆవుల గురించి తెలుసా?
హోల్స్టీన్ ఫ్రైసియన్, సాహివాల్ జాతుల కలయికతో రూపొందిన సంకరజాతి కొత్త ఆవుల జాతి ‘ఫ్రైస్వాల్’ (Frieswal). ఇప్పటికి ఉన్న గోజాతులన్నిటికన్నా అత్యధికంగా ఒక ఈత కాలంలో 4 వేల కిలోల పాల దిగుబడినివ్వటం దీని ప్రత్యేకత. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్)కు అనుబంధంగా మీరట్లోని కేంద్రీయ పశు పరిశోధనా సంస్థ (సీఐఆర్సీ) మిలటరీ ఫామ్స్ సర్వీస్ సంయుక్తంగా ఈ కొత్త పాడి పశుజాతిని రూపొందించాయి. ఇందులో హెచ్.ఎఫ్. గుణాలు 62.5%, సాహివాల్ గుణాలు 37.5% ఉంటాయి. అధిక పాల దిగుబడినిచ్చే హెచ్.ఎఫ్. గుణాలతో పాటు దేశంలోని వివిధ వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు తట్టుకొని మంచి ఫలితాలను ఇవ్వగలిగిన దేశీ గోజాతి సాహివాల్ లక్షణాలను ఫ్రైస్వాల్ పుణికిపుచ్చుకుంది. ఈనిన తర్వాత 300 రోజుల్లో 4% కొవ్వు కలిగిన 4 వేల లీటర్ల పాల దిగుబడిని ఫ్రైస్వాల్ ఆవు ఇస్తుందని ఐసీఏఆర్ ప్రకటించింది. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ఫ్రైస్వాల్ జాతి అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా 42 మిలటరీ ఫామ్స్లో పరిశోధనలు జరిగాయి. సైనికులకు మేలైన పాలను అందించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటైన మిలటరీ డెయిరీ ఫామ్స్ సరికొత్త సంకరజాతి గోజాతుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. కొత్త పశు జాతిని అభివృద్ధి చెయ్యటం కోసం శాస్త్రవేత్తలు సుమారు 4 దశాబ్దాల పాటు శ్రమించారు. 1984 సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఫ్రైస్వాల్ పరిశోధనలు కొద్ది నెలల క్రితమే పూర్తయ్యాయి. ఈ పరిశోధన ప్రాజెక్టు కోసం రూ. 800 కోట్లు ఖర్చయ్యాయి. ఈ బ్రీడ్ ఆవులు తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. చాలా సంవత్సరాల నుంచి ‘హెచ్ఎఫ్ సాహివాల్’ అనే పేరుతో ఈ ఆవులు రైతులకు అందుబాటులో వున్నాయి. అయితే ఈ బ్రీడ్కు కొత్తగా ‘ప్రైస్వాల్’ అని పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.ఇదీ చదవండి: పొట్టి ఆవులు గట్టి మేలు!20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
చిన్న కారణాలు పెద్ద భయాలు
భయం అనేది ఒక స్వాభావికమైన ఉద్వేగం. అది ప్రతి జీవితో పాటు మానవులందరిలో ఉండేదే. మనకు ముప్పు తెచ్చిపెట్టే అంశాల పట్ల భయం ఉండటం వల్లనే ఆ ప్రమాదాల నుంచి దూరంగా వెళ్తారు. అందువల్లనే మనుగడ సాధ్యమవుతుంది. ఇలా చూసినప్పుడు అన్ని జీవులతో పాటు మానవ మనుగడను సుసాధ్యం చేసే సహజమైన ఉద్వేగం అది. అయితే కొందరిలో ఆ భయం మోతాదులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఓ బొద్దింక వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా కొందరు దానికి భయపడతారు. ఇంకొందరు గోడ మీది బల్లని చూస్తే చాలు వణికిపోతారు. ఇలా ఉండాల్సినంత కాకుండా ఈ భయం అర్థం లేకుండా పెరిగిపోతూ, దాని వల్ల యాంగై్జటీ పెరిగిపోతూ... ఆ భయం మన రోజువారీ వ్యవహారాలకు సైతం అడ్డం పడేటంతగా పెరిగిపోయి ఏ పనీ చేయలేనంతగా ఆందోళన కలిగిస్తుంటే దాన్ని ‘ఫోబియా’గా అభివర్ణిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఫోబియాలకు మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉంది. ఈ ఫోబియాల గురించి అవగాహన కోసం ఈ కథనం.ఒక కేస్ స్టడీ : ఇటీవలే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం అమీన్పూర్కు చెందిన మనీషా అనే గృహిణి చీమలంటే భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ చీమలతో పాటు బతకడం నా వల్ల కాదంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టిందంటూ వార్తలు వచ్చాయి. ఇలా చీమల పట్ల ఉండకూడని భయానికి సైకియాట్రీలో ఉన్న పేరు ‘మిర్మెకోఫోబియా’ (myrmecophobia).ఏమిటీ ఫోబియాలు? ఒక్కమాటలో చెప్పాలంటే అంతగా భయపడకూడని అంశాల పట్ల కూడా తీవ్రమైన భయం ఉండటమే ‘ఫోబియా’ అని చెప్పవచ్చు. ఈ భయాల తీవ్రతలు చాలామందికి వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే భయం. మరికొందరికి అన్నివైపులా మూసి ఉండే ప్రదేశాలు... అంటే లిఫ్టుల వంటి చోట్ల భయంగా ఉంటుంది. ఇంకొందరికి హైవేల పై డ్రైవింగ్ అంటే విపరీతమైన ఆందోళన. ఇలా చాలామందిలో చాలారకాల భయాలుంటాయి. పాములూ, కీటకాలూ, సూదులూ అంటే అర్థం లేని భయాలుంటాయి. అంతెందుకు... ‘మన్మథుడు’ సినిమాలో హీరోకి నీళ్లపై నిర్మించిన వంతెనపై నడవడం కూడా తనకు భయమంటూ చెబుతాడు. ఇలా చాలామందికి చాలావాటి పట్ల అంటే... ఎరుగుతున్న కీటకాలంటే (ఉదా. గబ్బిలాలు), పాకుతుండే పాములంటే... ఆఖరికి సూది వాడాలన్నా అది గుచ్చుకుంటుందేమోనని కొందరికి భయమే. ఇలా ఏ అంశం గురించైనా అర్థం లేని భయాలు కలుగుతుండవచ్చు. కొందరిలో ఇవి చిన్నప్పట్నుంచీ ఉంటే... మరికొందరిలో పెద్దయ్యాక అభివృద్ధి చెందుతుంటాయి.నిర్హేతుకమైన ఈ భయాల ప్రభావాలు ఇలా... అకారణమైన ఈ భయాలు కొందరిలో వాళ్ల పనులను వాళ్లు చేసుకోనివ్వనంతగా దుష్ప్రభావాన్ని చూపుతాయి. చాలామంది తాము చేయాల్సిన పనిని వాయిదా వేయడం లేదా దాన్నుంచి తప్పుకుని తిరగడం చేస్తూ సమస్య నుంచి దూరంగా పారిపోతుంటారు. ఇది జీవితంలో ఎన్నో ఆనందాలను దూరం చేస్తుంది లేదా సులభంగా జరిగిపోయే పనులనూ జరగకుండా అడ్డుపడుతుంటుంది. ఉదాహరణకు ఓ ఆఫీసులో ఉద్యోగం చేసే వ్యక్తికి ఎత్తులంటే భయం. అతడు ఉద్యోగం చేసే ఆఫీసు ఏ పదో అంతస్తులోనో ఉంటే... మంచి వేతనం వచ్చే ఉద్యోగాన్ని కూడా తేలిగ్గా వదిలేసుకుంటాడు. అలాగే మరో వ్యక్తికి ఎత్తైన ఫ్లై ఓవర్ అంటే భయం. దాంతో ఫ్లై ఓవర్ ఎక్కితే కేవలం రెండు కిలోమీటర్లలో అధిగమించే దూరాన్ని... అదనంగా మరో పది కిలోమీటర్లు ప్రయాణించి చేరుతాడు. నిజానికి చూసేవారికి ఈ భయాలు అర్థం లేనివిగా కనిపిస్తాయి. పైగా ఇలాంటి చిన్నకారణాలతో పెద్ద పెద్ద ప్రయోజనాలు కోల్పోతారా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఫోబియాలతో బాధపడేవారికి అదే జీవన్మరణ సమస్య.ఈ ఫోబియాల (భయాల) విస్తృతి ఎంతంటే... ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తిలోనూ అన్ని రకాల భయాలూ అంతో ఇంటో ఉండనే ఉంటాయి. నిజానికి ఈ భయాలకు ఏ వ్యక్తి కూడా అతీతుడు కాడు. ఉదాహరణక బల్లి మీద పడితే ఎవరైనా మొదట ఆందోళన చెందుతారు. కాకపోతే ఆ తర్వాత వెంటనే సర్దుకుంటారు. కానీ మనలోని 29% మందిలో ఏదో ఒక అంశంపైన ‘ఫోబియా’లు ఉండనే ఉంటాయి. అందునా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ ఫోబియాలు రెట్టింపు మందిని బాధిస్తుంటాయని అంచనా. భయం, ఫోబియాల మధ్య తేడా... ఏదైనా ఆందోళన గొలిపే పరిస్థితుల్లో భయం కలగడమనేది చాలా సహజమైన ప్రక్రియ. ప్రమాదకరమైన ఆ పరిస్థితులనుంచి బయటపడటానికీ లేదా వాటి నుంచి దూరంగా పరుగెత్తడానికి భయం అవసరం కూడా. నిజానికి భయం కలగడం ఒక రక్షణాత్మకమైన చర్య. ఏవైనా ప్రాణాంతకమైన పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోడానికీ లేదా వీలుకాని పక్షంలో దాన్నుంచి దూరంగా పారిపోవడానికి ఈ భయం తోడ్పడుతుంది. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజమ్గా చెబుతారు. జీవులన్నింటి మనుగడకూ ఇదే అంశం దోహదపడుతుంది. ఇదీ భయం వల్ల కలిగే ప్రయోజనం. కానీ ఫోబియాలో ఇలా జరగదు. అక్కడ వాస్తవంగా లేని ప్రమాదాన్ని సైతం బాధితులు ఊహిస్తూ ఉంటారు. ఉదాహరణకు చాలా భయంకరమైన కుక్క ఎదురైనప్పుడుఅది కరుస్తుందేమో అని భయపడటం సహజం. కానీ ఒకవేళ అది పెంపుడు కుక్క అయినప్పటికీ భయపడటంలో అర్థం ఉండదు. అలాగే పాము కనిపిస్తే భయం కలగడం సహజం. అయితే టీవీ స్క్రీన్ మీద పాము కనిపించినా లేదా పాము బొమ్మ చూసినా భయపడటం అంటే అది ‘ఫోబియా’కు సూచన అని అర్థం. ఇక్కడ డాగ్స్ వల్ల కలిగే అనవసర భయాలను ‘సైనో ఫోబియా’ (గ్రీక్ భాషలో సైనో అంటే కుక్క అని అర్థం) అనీ, పాముల వల్ల కలిగే భయాన్ని ‘ఒఫిడియో ఫోబియా’ లేదా ‘ఓఫియో ఫోబియా’ అంటారు. కొన్నిసార్లు దాన్నే ‘హెర్పెటో ఫోబియా’ అని కూడా అంటారు. అంటే ‘ఓఫిడియో ఫోబియా’లో పాములంటే భయమైతే ‘హెర్పెటో ఫోబియా’లో పాము జాతికే చెందిన బల్లులూ, బల్లిలాంటి ఇతర జీవుల భయాలను కలుపుకుని ‘హెర్పెటో ఫోబియా’ అంటారు. ఇక ఈ భయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అరుదుగా కొందరికి స్నానం చేయడమన్నా భయముంటుంది దీన్ని ‘ఆల్బుటోఫోబియా’ అనీ, పసుపురంగుకు భయపడటాన్ని ‘గ్జాంథోఫోబియా’ అనీ, చివరకు అద్దంలో చూసుకోడానికి బయపడటాన్ని ‘స్పెక్ట్రోఫోబియా’ (spectrophobia) అని అంటారు.భయాలు ఎలా మొదలవుతాయంటే... సాధారణంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లలో చాలా అనవసరమైన భయాలు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ అవి తగ్గుతూ పోతుంటాయి. ఉదాహరణకు పిల్లలందరికీ చీకటి అంటే భయం. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ ఆ భయాన్ని వారు క్రమంగా అధిగమిస్తారు. ఒకవేళ అధిగమించనంత దాన్ని పూర్తిగా ఫోబియా అనడానికి వీలు కాదు. అయితే ఏదైనా భయం వల్ల మనం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం, దానివల్ల మన రోజువారీ పనులకూ, సామాజిక జీవనానికీ, పిల్లల్లోనైతే స్కూల్ జీవితానికీ, నిద్రకు ఆటంకం కలిగితే దాన్ని ఫోబియాగా గుర్తించి, దానికి అవసరమైన చికిత్స అందించాల్సి ఉంటుంది.ఏయే వయసు పిల్లల్లో ఎలాంటి భయాలు..?పిల్లల్లో సాధారణంగా కొన్ని కొన్ని వయసుల్లో కొన్ని విషయాలంటే భయం ఎక్కువగా ఉండవచ్చు. అవి... 0 – 2 ఏళ్ల పిల్లల్లో ... పెద్ద శబ్దాల పట్ల, అపరిచితులతో, తల్లిదండ్రులనుంచి విడిగా ఉండాల్సి రావడం వల్ల, పెద్ద పెద్ద వస్తువులంటే, కొన్ని జంతువుల పట్ల భయం ఉంటుంది. 3 – 6 ఏళ్ల పిల్లల్లో ... దెయ్యాలు, భూతాల వంటి అభూత కల్పనాత్మక పాత్రలంటే భయంతో పాటు ఒంటరిగా పడుకోవాల్సి రావడం, వింత శబ్దాలంటే భయం కలుగుతుంది. 7 – 16 ఏళ్ల పిల్లల్లో ... ఇలాంటి పిల్లల్లో అభూతకల్పనాత్మకమైన అంశాల కంటే వాస్తవ విషయాలపట్ల భయం కలుగుతుంది. అంటే ఆడుతున్నప్పుడు గాయాలవుతాయనే భయాలు, జబ్బు చేసినప్పుడు కలిగే భయాలు, స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గుతున్నప్పుడూ, ప్రకృతి విలయాలు, ఇతరత్రా ప్రకృతి విపత్తులు, ఉత్పాతాలంటే భయాలుంటాయి.ఫోబియాలు కలగడానికి కారణమయ్యే అంశాలు : ఫోబియాలను కలిగించడానికి కారణమయ్యే అంశాలు ఇవీ అంటూ నిర్దిష్టంగా చెప్పడానికి కుదరదు. అయితే చాలా సందర్భాల్లో కొన్ని భయాలు పెద్దల నుంచి పిల్లలకు వస్తుంటాయి. ఇలా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుండవచ్చు. ఈ భయాలకు సాంస్కృతిక అంశాలూ కారణం కావచ్చు. తల్లిదండ్రులకు ఒక తరహా భయాలు ఉంటే అవి పిల్లలకు వచ్చే అవకాశాలు మూడింతలు ఎక్కువ. పిల్లల పట్ల మరీ ఎక్కువ రక్షణాత్మకంగా వ్యవహరించే తల్లిదండ్రుల పిల్లలతో పాటు... మరీ ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిన తల్లిదండ్రుల పిల్లల్లోనూ ఫోబియాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనలేక దాన్ని అధిగమించే ప్రయత్నంలో తీవ్రమైన ఒత్తిడి అనుభవించి, అప్పటికీ అధిగమించని వారిలో ఫోబియాలు అభివృద్ధి చెందే అవకాశాలు మరీ ఎక్కువ.సాధారణంగా మనలో ఉండే భయాలు, ఫోబియాలు : సాధారణంగా మనందరిలో భయాలూ, ఫోబియాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... జంతువుల పట్ల ఫోబియా... చాలామందికి పాములు, తేళ్ల వంటి విషజీవులన్నా, సాలెపురుగులూ లేదా ఇతర కీటకాలూ, ఎలుకలు, కుక్కలు, బొద్దింకలు, గబ్బిలాలంటే భయంగా ఉంటుంది. కొన్ని రకాల పరిసరాల కారణంగా వచ్చే ఫోబియా... ఉదాహరణకు ఎత్తుకు ఎక్కాక కిందికి చూడటం వల్ల, తుఫానుల్లో చిక్కుకోవడం, విశాలమైన జలరాశి మధ్యన ఉన్నప్పడు ఆ అనంతమైన నీటిని చూడటం వల్ల, చిమ్మచీకటిలో ఉండిపోవాల్సి రావడం పట్ల భయాలు కలుగుతాయి. కొన్ని పరిస్థితుల వల్ల కలిగే ఫోబియాలు: కొన్ని పరిస్థితుల్లో మనకు చాలా భయంగా ఉంటుంది. ఉదాహరణకు... అన్నివైపులా మూసుకుపోయి ఉన్నట్లుండే పరిసరాల పట్ల... అంటే ఉదాహరణకు ఊపిరానట్టుగా ఉండే ఇరుకు గదులు, లిఫ్టుల్లో చిక్కుకుపోవడాల పట్ల (క్లాస్ట్రోఫోబియా), వేగంగా డ్రైవింగ్ చేస్తున్న సమయాల్లో, గుహల్లోకి ప్రవేశించినప్పుడు, బ్రిడ్జ్పైకి వెళ్లినప్పుడు. గాయం, రక్తం, ఇంజెక్షన్ వంటి భయాలు : చాలామంది ఇంజెక్షన్ వంటి వాటికి భయపడుతుంటారు. లేదా ఎవరికైనా జబ్బుగా ఉండటం లేదా తాము చనిపోతామేమో లాంటి భయాల వంటివి ఉంటాయి.ఫోబియా లక్షణాలు... ఏదైనా భయం కాస్తా ఫోబియాగా రూపోందినప్పుడు మొదట తీవ్రమైన ఉద్విగ్నత (యాంగై్జటీ) కలిగి అది కాస్తా మరింత తీవ్రమైన (΄్యానిక్ అటాక్) రూపం తీసుకుంటుంది. దీన్ని ‘ఫుల్బ్లోన్ ప్యానిక్ ఎటాక్’గా చెప్పవచ్చు. మనం ఏదైనా విషయానికీ లేదా అంశానికీ భయపడుతుంటే... దానికి మనం ఎంత దగ్గరగా ఉంటే భయం అంతగా తీవ్రమవుతుంది. ఇక ఈ భయం తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని అధిగమించడం లేదా దాన్నుంచి బయటపడటం అంతే కష్టమవుతుంది. ఈ ఆందోళన / భయం / ఉద్విగ్నత (యాంగై్జటీ) తాలూకు లక్షణాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. అవి... భౌతికంగా కనిపించే లక్షణాలు : ∙ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం ∙గుండె వేగం పెరగడం ∙చెమటలు పట్టడం ∙ఛాతీలో నొప్పి లేదా ఛాతీ బిగదీసుకుపోవడం ∙వణుకు ∙నిద్రవస్తున్నట్లు లేదా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం ∙కడుపులో తిప్పినట్లుగా / దేవినట్లుగా ఉండటం. ∙ఒంట్లోంచి వేడి ఆవిరులు బయటకు వస్తున్న భావన. ఉద్వేగపూరితమైన లక్షణాలు : యాంగై్జటీ ఎక్కువ కావడం ఆ తర్వాత ప్యానిక్ అటాక్గా మారడం స్థలం లేదా పరిస్థితుల నుంచి పారిపోవాలన్న బలమైన కాంక్ష తనపై తాను అదుపు కోల్పోవడం కాసేపట్లో చచ్చిపోతామేమోన్న భావన మితిమీరి స్పందిస్తున్నామని తెలిసినా దాన్ని నియంత్రించుకోలేని శక్తిఫోబియా వర్గీకరణ ఇలా... సైకియాట్రిస్టులు ఫోబియాలను సాధారణంగా మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. సామాజిక ఫోబియా (సోషల్ ఫోబియా): సాధారణంగా ఇవి అందరిలోనూ ఉండే సహజ భయాలే అయినా కొందరిలో మితిమీరి ఉంటాయి. ఉదాహరణకు కొందరు నలుగురిలో మాట్లాడటానికి చాలా ఎక్కువగా భయపడుతుండవచ్చు. అలాగే మరికొందరు బయట తినడం అనే విషయం పట్ల తీవ్రంగా ప్రతిస్పందిస్తూ దాని వల్ల కలిగే పరిణామాలను అతిగా ఊహించుకుంటారు. సాధారణంగా సోషల్ ఫోబియాలు చికిత్సకు ఒక పట్టాన తేలిగ్గా లొంగవు. సామాజిక ఫోబియాలు తమకు చిన్నప్పుడు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా కలుగుతాయి. సాధారణంగా పదవ ఏటి కంటే ముందు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా ఏర్పడ్డ భయాలు కొందరిలో కాలక్రమేణా తొలగిపోవచ్చు. కానీ యుక్తవయసులో తమ స్నేహితుల నిరాదరణకు గురైన కారణంగా ఏర్పడ్డ భయాలు అంత తేలిగ్గా తొలగిపోవు. కొందరిలో అవి వయసుతో పాటు పెరుగవచ్చు. నిర్దిష్ట ఫోబియాలు (స్పెసిఫిక్ ఫోబియాస్): ఈ ఫోబియాలు నిర్దిష్టంగా ఫలానా అంశం వల్ల కలుగుతుండే భయాలు అని చెప్పవచ్చు. ఉదాహరణకు పాములు, నీళ్లు, ఎత్తులు, లిఫ్ట్, విమానప్రయాణం, వ్యాధుల పట్ల భయం మొదలైనవి.అగారోఫోబియా : ఇది ఇంటికి దూరంగా ఉన్నప్పుడు లేదా మనకు సురక్షితంగా ఉన్న స్థలానికి దూరంగా ఉన్నప్పుడు కలిగే తీవ్రమైన భయాలు అని చెప్పవచ్చుప్యానిక్ అటాక్ అంటే...ఏదైనా ఫోబియాకు గురై భయపడటంలోని తీవ్రత తారస్థాయికి చేరినప్పుడు కలిగే మానసిక స్థితిని ప్యానిక్ అటాక్గా చెప్పవచ్చు. ఇది కలిగినప్పడు కనిపించే లక్షణాలివి... తమకు భయంగొలిపే ప్రదేశం / అంశం / పరిస్థితి నుంచి దూరంగా పారిపోవాలన్న బలమైన కాంక్ష తీవ్రమైన భయం గుండెవేగంలోని తీవ్రత చాలా ఎక్కువగా పెరగడం శ్వాస అందకపోవడం వణుకు ఒక్కోసారి స్పృహతప్పడం చనిపోయినట్లుగా అనుభూతి చెందడం. ఫోబియాల దుష్ప్రభావాలిలా : ఫోబియాలకు చికిత్స చేయించకుండా వదిలేస్తే అవి వ్యక్తిగత జీవితాన్ని దుర్భరం చేస్తాయి. వాటిని దాచిపెట్టినా సరే... దాని ఫలితాలు జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు విమాన ప్రయాణం అంటే భయం ఉంటే దాన్ని దాచితే జీవితంలో చాలా కోల్పోవచ్చు. అలాగే కొన్ని ఫోబియాల వల్ల వ్యక్తిగత జీవితంలో స్నేహితులను, బంధువులకు దూరం కావడం, ఉద్యోగం కోల్పోవాల్సి రావడం వంటి తీవ్రపరిణామాలు సంభవించవచ్చు. ఫోబియా ఉన్నవారు వాటిని అధిగమించదలచినప్పుడు క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది తప్ప... అకస్మాత్తుగా అంతా చక్కబడదు. మిగతా వారిలో పోలిస్తే ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి ఫోబియాలకు గురయ్యే అవకాశాలు పదింతలెక్కువ. ఇక అలాగే ఫోబియాలు ఉన్నవారు ఆల్కహాల్కు అలవాటు పడే అవకాశాలూ రెండింతలెక్కువ. ఒక్కోసారి ఫోబియా (Phobia) వల్ల కలిగే యాంగై్జటీ (ఉద్విగ్నత) ప్రమాదకరమైన పరిస్థితికి, కొన్నిసార్లు గుండెజబ్బులకు దారితీయవచ్చు.ఫోబియాలూ... చికిత్స : ఫోబియాకు సమర్థమైన చికిత్స సైకోథెరపీ (కౌన్సెలింగ్). దీనితో పాటు కొన్నిసార్లు కొన్ని మందులు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ అవసరమవుతాయి.మొదట స్వయంసహాయం... ఫోబియాల విషయానికి వస్తే స్వయంసహాయ పద్థతులు చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఒకవేళ వాటి వల్ల రోగి యాంగై్జటీ తగ్గక ΄్యానిక్ అటాక్స్ వస్తూనే ఉంటే అప్పుడు నిపుణుల సహాయం కావాలి. ఇప్పుడు శుభవార్త ఏమిటంటే... గతంతో పోలిస్తే ఫోబియాల చికిత్సతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.రిలాక్సేషన్ టెక్నిక్స్ అభ్యాసం చేయడం... మనకు ఏదైనా విషయంలో భయం వేయగానే ఉద్విగ్నత (యాంగ్జైటీ) కలుగుతుంది. దానివల్ల కొన్ని గుండెవేగం పెరగడం, ఊపిరి ఆడనట్లుగా ఉండటం (సఫొకేటింగ్) వంటి భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. వీటి వల్ల మన భయం మరింతగా పెరిగినట్లయి, నిరాశలోకి కూరుకుపోతారు. అందుకే యాంగై్జటీని అధిగమించే ప్రయత్నంలో భాగంగా రిలాక్సేషన్ టెక్నిక్స్ను నేర్చుకుని, వాటిని అభ్యాసం చేయడం వల్ల క్రమంగా ఉద్విగ్నతను, ప్యానిక్ ఫీలింగ్స్ను ఎదుర్కోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్లో బలంగా ఊపిరిపీల్చడం (డీప్ బ్రీతింగ్), ధ్యానం, యోగా వంటి వాటితో ఉద్విగ్న పరిస్థితుల్లోనూ స్థిమితంగా ఉండటం ప్రాక్టీస్ చేయవచ్చు.ప్రతికూల ఆలోచనలను అధిగమించడం... వాస్తవానికి ఒక ఫోబియా స్థితిలో అసలు భయం కంటే... దాని వల్ల కలిగే ప్రతికూల (నెగెటివ్) ఆలోచనల వల్లనే ఎక్కువగా భయం కలుగుతుంది. ఉదాహరణకు ఒక బ్రిడ్జ్పై వెళ్తుంటే... అది బాగానే ఉన్నా... ఒకవేళ కుప్పకూలితే అన్న ఆలోచన కలగగానే ఆ అనంతర పరిణామాలను ఊహించడం వల్ల కలిగే భయమే ఎక్కువ. కాబట్టి ఇలాంటి అనవసరమైన ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుంటే భయాలు కలగవు. కొన్ని సాధారణ ఆలోచనలనూ వదులుకోవాలి. ఏదైనా సంఘటన తర్వాత మనకూ అది జరుగుతుందనే ఆలోచన రావడం సహజమే అయినా అదేపనిగా వాటి గురించే ఆలోచించకూడదు. ఉదాహరణకు ఇటీవల బస్సు దహనం సంఘటనలూ, బస్సు ప్రమాదాలూ వరసగా చోటు చేసుకున్నాయి. దాంతో మనం ఎక్కే బస్సు కూడా ప్రమాదానికి లోనవుతుందేమో అన్న ఆలోచన రావడం సహజం. కానీ అదే నెగెటివ్ ఆలోచన మనను ఆవరించకుండా చూసుకోవాలి. అలాగే మనం విమాన ప్రయాణం చేస్తూ ఉంటే... ఇటీవల గుజరాత్లో కూలినట్టుగా అది కుప్పకూలిపోతోందేమోనని ఆలోచనను మనల్ని ఆవరించకుండా చూసుకోవాలి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) : ఫోబియాలను గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడే చికిత్స ప్రక్రియ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సీబీటీ అంటే ఒకరకమైన కౌన్సెలింగ్. దీనితో పాటు మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్స్, బీటా బ్లాకర్ మెడిసిన్స్, బెంజోడయాజిపైన్స్ వంటి మందులతో పాటూ సీబీటీ చేయాల్సి ఉంటుంది. చివరగా... కౌన్సెలింగ్, కాగ్నిటివ్ థెరపీ, రిలాక్సేషన్ టెక్నిక్స్లతో పాటు అవసరాన్ని బట్టి మందులు, ఇతర ప్రక్రియలన్నింటి సహాయంతో చేసే చికిత్సలు... వీటన్నింటి సహాయంతో ఇప్పుడు ఫోబియాలను దాదాపుగా పూర్తిగా తగ్గించడం సాధ్యమే.- డాక్టర్ పులి వనజారెడ్డి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ నిర్వహణ: యాసీన్
ఫొటోలు
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ట్రెడిషనల్ లుక్లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)
వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)
ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)
‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)
వణికిస్తున్న చలి.. జాగ్రత్తగా ఉండాల్సిందే (ఫొటోలు)
అల్లరి నరేశ్ 12ఏ రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
రెహమాన్ కన్సర్ట్ జ్ఞాపకాలతో మంగ్లీ (ఫొటోలు)
అంతర్జాతీయం
ఢిల్లీ పేలుడు.. పాక్ వణుకు?
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన పేలుడు దరిమిలా భారత్ నుంచి ప్రతీకార దాడులుంటాయనే అనుమానం, భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. ఈ నేపధ్యంలో పాక్ వైమానిక దళం రాజస్థాన్ సరిహద్దులో వైమానిక దళ గస్తీని ప్రారంభించిందని‘దైనిక్ భాస్కర్’ తన కథనంలో తెలిపింది. పాక్లోని త్రివిధ దళా అధిపతులు అత్యవసర సమావేశం నిర్వహించారని పేర్కొంది. ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు ఎన్ఎస్ఏ, ఐఎస్ఐతో సమావేశాలు నిర్వహించారని సమాచారం.ఢిల్లీ ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు తరువాత పాకిస్తాన్ తన అన్ని వైమానిక స్థావరాలు, వైమానిక స్థావరాల వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారతదేశం నుండి ప్రతీకారం ఎదురయ్యే అవకాశం లేదా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉందని నిఘా సంస్థల నుండి పాకిస్తాన్కు హెచ్చరికలు అందాయి. ఫలితంగా పాకిస్తాన్ తన సైన్యం, నేవీ, వైమానిక దళాలను హై అలర్ట్లో ఉంచింది. అలాగే పాకిస్తాన్ సెంట్రల్ కమాండ్.. పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యంలోని అన్ని శాఖలను ఆదేశించింది.అంతేకాకుండా భారతదేశం నుండి ఏదైనా దాడి జరిగితే తక్షణం ప్రతీకారం తీర్చుకునేందుకు వాయు రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ యాక్టివ్ చేసింది. భారతదేశం నుంచి ముందస్తు దాడి లేదా ఇతర సైనిక చర్యను ఊహించి పాక్ ఈ తరహా నిఘా కొనసాగిస్తోంది. వైమానిక రక్షణ రాడార్లు ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక సరిహద్దులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ నవంబర్ 11 నుండి 12 వరకు నోటమ్ (ఎయిర్మెన్కు నోటీసు) జారీ చేసింది. అంటే ఈ రెండు రోజుల్లో, సరిహద్దు ఆకాశంలో విమానాలు తిరిగేందుకు పరిమితులు, భద్రతా నిబంధనలు అమలులో ఉంటాయి.కాగా ఢిల్లీలో పేలుడు దరిమిలా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని యూకే విదేశాంగ కార్యాలయం (ఎఫ్సీడీఓ) ప్రయాణ సలహా జారీ చేసింది. భారత్-పాక్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో, జమ్ముకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాలలో ప్రయాణించవద్దని బ్రిటిష్ పౌరులకు యూకే ప్రభుత్వం సూచించింది. ఇదే విధంగా ఎర్రకోట తదితర పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీలోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం సూచించింది. ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్ విషాదాంతం
ఒంటరి దేశాలేవో మీకు తెలుసా?
ఒక రాష్ట్రానికి కానీ, దేశానికి కాని వాటి సరిహద్దులో ఉన్న ప్రాంతాలు చాలా కీలకం ఎందుకంటే నైబర్ హుడ్ ప్రాంతాలతో ఉండే సంబంధాల వల్ల ఆ ప్రాంత శాంతిభద్రతలు ఆధారపడతాయి అంతేకాకుండా అభివృద్దికి సైతం పొరుగు ప్రాంతాలు ఎంతో కీలకం.అయితే ఏ దేశాలతో సరిహద్దులు లేకుండా ఒంటరిగా ఉన్న కంట్రీస్ మీకు తెలుసా. ఆ దేశాలు ఇతర దేశాలతో ఎటువంటి బార్డర్స్ లేకుండా స్వతంత్ర్యంగా ఉంటున్నాయి. మరి అవేంటే తెలుసుకోవాలనుందా అయితే ఈస్టోరీ చదవండి.ఆస్ట్రేలియాఖండాలలో ఏడవదిగా పిలవబడే ఆస్ట్రేలియా ఒక ద్వీపం అని అందరికీ తెలుసు. అయితే ఆస్ట్రేలియాకు ఇతర ఏ దేశాలతో సరిహద్దులు లేవు.ఈ విధంగా ఉండడం వల్ల అక్కడ ప్రత్యేకమైన జీవవైవిధ్యత ఏర్పడింది.అంతే కాకుండా కంగారులాంటి అరుదైన జంతువులు ఈ ఖండంలోనే అధికంగా జీవిస్తాయి. ఆ దేశానికి సరాసరీ 150 కిలోమీటర్ల దూరాన పాపువా న్యూగియానా అనే దేశం ఉంది. న్యూజిలాండ్ న్యూజిలాండ్ అనగానే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. ఇక్కడి జలపాతాలు, సరస్సులు చూపరులను కట్టిపడేస్తాయి. ఇక్కడి ప్రజలు సైతం మంచి స్నేహపూర్వకంగా ఉంటూ అత్యన్నత జీవనవిధానాన్ని కలిగి ఉంటారు. ఆస్ట్రేలియాకు సూమారు 2000 కిమీ దూరంలో ఈ దేశం ఉంటుంది. ప్రకృతిని అస్వాదించుకునే పర్యాటకులకు ఈ న్యూజిలాండ్ మంచి ఛాయిస్.జపాన్ ఈ దేశం పేరు వింటే చాలు కష్టపడేతత్వం అధికంగా ఉన్న ప్రజలు గుర్తొస్తారు. సహజ సంపదలు అధికంగా లేకున్నా, అణుబాంబు బాధిత దేశమైనా, మానవశ్రమనే నమ్ముకొని సాంకేతికతతో దూసుకుపోతూ ప్రపంచంలోని అగ్రదేశాలకు పోటీ ఇస్తున్న దేశం. అయితే ఈ కంట్రీ సైతం ఏ ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకోవడం లేదు.ఇక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి సైతం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ప్రత్యేకంగా విభిన్నంగా ఉంటుంది.ఐస్ లాండ్ఐస్ లాండ్ ఉత్తర యూరప్ లో ఉన్న ఈ కంట్రీలో అగ్నిపర్వతాలు, హిమనదులు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ దేశంలో దోమలు ఉండేవి కావు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఐస్ లాండ్ లోనూ దోమలు వచ్చినట్లు ఇటీవల కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
తలొగ్గిన ట్రంప్.. ‘భారత్తో న్యాయమైన ఒప్పందం’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి తలొగ్గారు. సుంకాల విషయంలో ఆయన చేసిన తాజా ప్రకటన అందుకు నిదర్శనంగా నిలిచింది. ‘ఏదో ఒక సమయంలో సుంకాలను తగ్గించాలని అమెరికా యోచిస్తోందని, భారతదేశంతో తాము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని ట్రంప్ అన్నారు. భారతదేశంతో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తమ దేశం సుంకాలను తగ్గిస్తుందని ప్రకటించారు. రష్యాతో చమురు వ్యాపారం కారణంగా భారత్ తమ నుంచి అధిక సుంకాలను ఎదుర్కొంటున్నదని అంటూనే, న్యూఢిల్లీ.. రష్యా చమురు కొనుగోలును నిలిపివేసిందని కూడా అన్నారు. ఆగస్టులో భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన కొన్ని నెలల తర్వాత అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. గత కొంతకాలంగా భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ట్రంప్ భారత్.. రష్యాతో తన చమురు వాణిజ్యాన్ని ముగించబోతున్నదని పలుమార్లు అన్నారు. VIDEO | Washington: Responding to a question during a press conference at White House, US President Donald Trump (@POTUS) said: "Tariffs high on India because of Russian oil; they've reduced Russian oil substantially, at some point will bring tariffs down."(Source: Third Party)… pic.twitter.com/UhjGRqPKxa— Press Trust of India (@PTI_News) November 11, 2025ట్రంప్ తొలిసారి ఈ ప్రకటన చేసినప్పుడు, ప్రధాని మోదీ నుండి తనకు వచ్చిన హామీ వచ్చిందని, దాని ఫలితమే ఇది అని అన్నారు. అయితే అప్పట్లో ఇరు నేతల మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని భారత్ స్పష్టం చేసింది. నేడు(మంగళవారం) జరగబోతున్న వాణిజ్య చర్చల గురించి అడిగినప్పుడు, ట్రంప్ ఇలా అన్నారు ‘మేము భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఇది గతంలో చేసుకున్న దానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం, వారు నన్ను ప్రేమించడం లేదు. అయితే ఇప్పుడు మళ్లీ మమ్మల్ని ప్రేమిస్తారు. మేము న్యాయమైన ఒప్పందాన్ని చేసుకుంటాం. మేము దగ్గరవుతున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: హఫీజ్ మరో కుట్ర:‘బంగ్లా’ నుంచి భారత్పై దాడులు?
గిలియానీ తదితరులకు ట్రంప్ క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ వ్యక్తిగత లాయర్ రూడీ గిలియానీ, మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ తదితరులకు క్షమాభిక్ష ప్రకటించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ శ్రేణులు ఫలితాలను ప్రభావితం చేసేందుకు యత్నించగా సహకరించినట్లు వీరిపై ఆరోపణలు న్నాయి. వీరికి అధ్యక్షుడు ట్రంప్ ‘సంపూర్ణ, బేష రతు’ క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంతకం చేశారని ప్రభుత్వ అటార్నీ ఎడ్ మార్టిన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఈ అవకాశం దక్కిన వారిలో సిడ్నీ పావెల్, జాన్ ఈస్ట్మన్ అనే లాయర్లున్నారు. వీరితోపాటు 2020 ఎన్నికల్లో ట్రంప్ తరఫున నకిలీ ఓటర్లుగా మారిన రిపబ్లికన్ పార్టీకి చెందిన కనీసం డజను మంది ఉన్నారు. కాగా, ఈ క్షమాభిక్ష ట్రంప్నకు వర్తించదని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది.
జాతీయం
రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ
చిన్నప్పటినుంచీ తండ్రి వ్యాపారాన్ని చూస్తూ పెరిగింది. ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదు. అందుకే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఒకరోజు అనుకోకుండా కుల్ఫీ మేకింగ్లో ప్రయోగం చేసింది. అంతే అక్కడినుంచి ఆమె జీవితం, ఆలోచన మారి పోయింది. కట్ చేస్తే కోటి రూపాయలు ఆర్జించే బిజినెస్కు యజమానిగా మారిపోయింది. ఎవరామె? ఏమా సక్సెస్ జర్నీ. తెలుసుకుందామా ఢిల్లీకి చెందిన సమత బోత్రా(Samta Bothra) సగటు అమ్మాయి మాదిరిగా పెళ్లి చేసుకుని భర్త, పిల్లా పాపాలతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తోంది. అలాదాదాపు మూడు దశాబ్దాలు గడచిపోయాయి. 2018లో హోలీ పండుగ సందర్బంగా సరదాగా కుల్ఫీ తయారు చేసింది. అందరికి తెగ నచ్చేసింది. ఇంటికొచ్చిన బంధువులకు కూడా రుచి చూపించింది. అంతే అలాంటి కుల్పీ కావాలని బంధువులు మళ్లీ మళ్లీ అడగడం మొదలు పెట్టారు. దీంతో దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదనే ఆలోచన 51 ఏళ్ల సమత మదిలోవచ్చింది. View this post on Instagram A post shared by Foodler (@realfoodler)తన కొడుకు సహాయంతో, సమతా కేవలం మూడు రుచులతో ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టింది సమత. ఇంట్లో నుండే రబ్రీ, గులాబీ , కేసర్ కుల్ఫీ ఆర్డర్స్ మీద తయారు చేసింది. కేవలం రూ.5 వేలతో మమ్మీస్ కుల్ఫీ మొదలైంది. అలా ప్రారంభ రోజుల్లో ఆర్డర్ల సంఖ్య చాలా తక్కువగా అంటే రెండు రోజులకు ఒక ఆర్డర్ వచ్చేవి. స్నేహితులు ,బంధువుల తదితరుల ద్వారా దీనికి మరింత ప్రచారం లభించింది. అలా ఆదరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆరేడు నెలల తర్వాత రెగ్యులర్గా కుల్ఫీల కోసం ఆర్డర్ట్ మొదలైనాయి. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. దీంతో డిమాండ్ మరింత పుంజుకుంది. ప్రతి రోజు 60 నుంచి 70 దాకా ఆర్డర్లు వచ్చేవి.కార్పొరేట్ కంపెనీలు సైతం మమ్మీస్ కుల్ఫీలకు ఆర్డర్లు ఇచ్చేవారు. జొమాటోతో భాగస్వామ్యం కార్పొరేట్ల కోసం ఒకేసారి 2000 - 3000 కుల్ఫీ బల్క్ ఆర్డర్లు వచ్చేవి. మెట్ లైఫ్ , భారతి ఎయిర్టెల్తో సహా అనేక ఇతర కంపెనీలలో కుల్ఫీ స్టాల్లను కూడా ఏర్పాటు చేసింది. రూ. 5వేల నుంచి కోటి టర్నోవర్ దాకాడిమాండ్ బాగా పెరగడంతో రిటైల్ బిజినెస్లోకి కూడా ప్రవేశించింది సమత. ఈస్ట్ ఢిల్లీలోని కృష్ణా నగర్లో మమ్మీ కుల్ఫీ షాప్ను తెరించింది. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. మమ్మీ కుల్ఫీ రుచికి, నాణ్యతకు వినియోగదార్లు ఫిదా అయిపోయారు. దీంతో తరువాత ఏడాదికే మరో షాపును ఓపెన్ చేసే స్థాయికి చేరింది. ఇపుడు ఏడాదికి కోట రూపాయల టర్నోవర్ను సాధించింది. అన్నీ సహజ, సేంద్రీయ పదార్థాలతో తయారు చేస్తామని చెబుతున్నారు సమత. ఒక్క ఐడియాతో తన జీవితాన్ని మార్చేసుకుని తన లాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది సమత. సక్సెస్కు వయసుతో సంబంధం లేదని ఓర్పు, సహనం, మార్కెటింగ్ టెక్నిక్ తెలిస్తే చాలని చాటి చెప్పింది.
ఢిల్లీ పేలుడు.. LNJP ఆస్పత్రికి ప్రధాని మోదీ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలను ప్రధాని మోదీ పరామర్శించారు. బుధవారం మధ్యాహ్నం భూటాన్ పర్యటన తర్వాత మోడీ ఢిల్లీ చేరుకున్నారు. భూటాన్ పర్యటన ముగించుకొని ఢిల్లీ వచ్చిన మోదీ పేలుడు ఘటనలో తీవ్రగాయాల పాలై లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(LNJP)లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలతో భేటీ కానున్నారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. సోమవారం (నవంబర్10) సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పేలుడు తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS),క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery. Those behind the conspiracy will be brought to justice! pic.twitter.com/HfgKs8yeVp— Narendra Modi (@narendramodi) November 12, 2025‘ఢిల్లీలో విషాద సంఘటన జరిగింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల బాధను నేను అర్థం చేసుకోగలను’ అని మోదీ భూటాన్లోని థింఫు వేదికపై వ్యాఖ్యానించారు. ‘నేను బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చాను. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పేలుడు ఘటనపై కేంద్ర భద్రతా సంస్థలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయని ప్రధాని తెలిపారు. “ఈ దాడికి కారణమైన వారు ఎంతటివారైనా ఉపేక్షించబోము. వారిని తప్పకుండా న్యాయస్థానం ముందు నిలబెడతాం. కఠిన చర్యలు తీసుకుంటాం,” అని హెచ్చరించారు. బాధ్యులందరినీ న్యాయ స్థానం ముందు నిలబెడతామని సూచించారు.
Bihar: పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభం?
బిహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. శుక్రవారం (నవంబర్ 14న) జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బిహార్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించగా.. మొదటి దశలో 65.09 శాతం, రెండో దశలో దాదాపు 69 శాతం ఓట్లు పోలయినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తంగా రెండు విడతల్లో కలిపి 66.91 శాతం పోలింగ్ నమోదయినట్టు ఈసీ ప్రకటించింది. 2020 ఎన్నికలతో ఇది 9.6 శాతం అధికం కావడం గమనార్హం.పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓట్లు వేసినట్టు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళా ఓటర్లలో 71.6 శాతం మంది ఓటు వేయగా, పురుషుల్లో 62.8 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి దశలో మొత్తం 3.75 కోట్ల మంది, రెండవ దశలో 3.70 కోట్ల మంది పోలింగ్లో పాల్గొన్నారు. మొత్తం మీద 7.25 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. బిహార్లో పోలింగ్ శాతం పెరగడంపై అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. అదే సమయంతో పెరిగిన పోలింగ్ తమకే అనుకూలంగా ఉంటుందని ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి.మహిళలు మాకే ఓటేశారు సీఎం నితీశ్ కుమార్ను ఆశీర్వదించడానికే మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్లో పాల్గొన్నారని జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ (Neeraj Kumar) అన్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ''ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ కచ్చితంగా అంచనా వేస్తాయని చెప్పలేం. కానీ బిహార్లో మరోసారి నితీశ్ కుమార్ నాయకత్వంలో NDA సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని పోలింగ్ ట్రెండ్ను బట్టి స్పష్టమవుతోంది. మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు. నితీశ్ కుమార్కు అత్యధికంగా తమ ఆశీస్సులు అందించారు. 2019 లోక్సభ ఎన్నికలు, 2020 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితిని మనం చూశామ''ని అన్నారు. నితీశ్ను విమర్శించే అర్హత ప్రతిపక్షాలకు లేదని, ప్రచారానికి దూరంగా పని చేసుకుని పోవడమే ఆయన నైజమన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదైన వ్యక్తులు కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ.. తేజస్వీ యాదవ్ను పరోక్షంగా విమర్శించారు.తేజస్వీ సంతోషంఅసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం పట్ల ఆర్జేడీ నేత, మహాగఠ్బంధన్ (Mahagathbandhan) ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. తన మనసు ఆనందంతో నిండిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. "వృద్ధులు, మహిళలు, యువత, వ్యాపారులు, రైతులు, ప్రతి కులం, ప్రతి తరగతి ఈ గొప్ప ప్రజాస్వామ్య ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.గత మూడు ఎన్నికల నుంచి బిహార్లో మహిళల పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. 2020లో మహిళల ఓటింగ్ దాదాపు 59.6 శాతం కాగా, పురుషులు 54.45 శాతం మాత్రమే పోలింగ్లో పాల్గొన్నారు. 2015లో, మహిళల ఓటింగ్ దాదాపు 60.48 శాతం కాగా, పురుషులు దాదాపు 53.32 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. ఈ పరిణామం సామాజిక మార్పు, రాజకీయ వ్యూహం రెండింటినీ ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సీఎం నితీశ్ హయాంలో శాంతిభద్రతలు మెరుగవడం.. అలాగే పాలక, ప్రతిపక్షాలు మహిళల ఓట్ల కోసం ఆకర్షణీయ హామీలు గుప్పించడం కూడా.. మహిళా ఓట్ల శాతం కారణమని విశ్లేషిస్తున్నారు.పోటాపోటీగా హామీలుఉదాహరణకు.. జీవికా దీదీ కార్యక్రమం, లఖ్పతి దీదీ పథకం, ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన వంటి ప్రభుత్వ పథకాలు మహిళలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రతిపక్ష మహాగఠ్బంధన్ కూడా బ్లాక్ మై-బెహన్-మాన్ పథకం, మహిళా యాజమాన్యంలోని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ఆకర్షణీయ హామీలతో మహిళా ఓటర్లకు గాలం వేసింది. అధికార, విపక్ష కూటములు పోటాపోటీగా మహిళలకు హామీలిచ్చారు. ఎవరు వాగ్దానాలకు ఎన్నెన్ని ఓట్లు పడ్డాయనేది ఎన్నికల ఫలితాల తర్వాత వెల్లడవుతుంది.ఎన్డీఏవైపే మొగ్గు!మహిళా ఓటర్లు ఎన్డీఏ (NDA) కూటమివైపే మొగ్గు చూపినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇదే అంచనా వేశాయి. నితీశ్ కుమార్ సర్కారు అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, మహాగఠ్బంధన్కు నిరాశ తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే వీటికి భిన్నంగా ఫలితాలు వస్తాయని మహాగఠ్బంధన్ ఆశతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఎన్డీఏ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. చూడాలి ఏమవుతుందో!ఎగ్జిట్ పోల్స్పై ఎవరేమన్నారంటే..ఎగ్జిట్ పోల్ ఫలితాలపై అధికార, విపక్ష కూటమి నేతలు భిన్నంగా స్పందించారు. బిహార్ అంతటా ఓటర్లు 'ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్' అని నిర్ణయించుకున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ కంటే 'ఎగ్జాట్ పోల్స్'లో ఎన్డీఏకు ఇంకా ఎక్కువ స్థానాలు వస్తాయని బీజేపీ ఎమ్మెల్సీ సంజయ్ మయూఖ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల ఆధిక్యంతో అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ అన్నారు. జేడీయూ నేతలు కూడా ఎన్డీఏ గెలుపు పట్ల విశ్వాసంతో ఉన్నారు.బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయని తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని అన్నారు. ''ఈ సారి ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ప్రజలు ఈ (నితీష్ కుమార్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈసారి మార్పు రాబోతోంది, ఎటువంటి సందేహాలకు అవకాశం లేద''ని తేజస్వీ యాదవ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయని ఆర్జేడీ నాయకుడు మృత్యుంజయ్ తివారీ (Mrityunjay Tiwari) పేర్కొన్నారు. చదవండి: బిహార్ ఎన్నికలు.. ఆసక్తికర విషయాలు
Bihar Elections: ‘అవన్నీ ఫేక్.. అప్రమత్తంగా ఉండండి’: అఖిలేష్
లక్నో: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ను సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు. అవి అధికార పార్టీ రూపొందించిన కల్పిత సర్వేలని అభివర్ణించారు. మార్పును కోరుతూ ఎన్నికల్లో ఓటువేసిన ఓటర్లను ఆయన అభినందించారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతూ, యువతకు ఉద్యోగాలను సృష్టించే ప్రగతిశీల ప్రభుత్వం బీహార్లో త్వరలో ఏర్పడబోతోందని అఖిలేష్ పేర్కొన్నారు.అఖిలేష్ తన ‘ఎక్స్’ పోస్టులో బీహార్లోని ప్రతి ఓటరకు అభినందనలు తెలిపారు. ఉద్యోగాలను సృష్టించే కొత్త ప్రగతిశీల ప్రభుత్వం ఏర్పడుతుందంటూ, ముందస్తు అభినందనలు తెలిపారు. అధికార పార్టీ తప్పుదారి పట్టించే ఎగ్జిట్ పోల్స్ను రూపొందించిందని ఆయన విమర్శించారు. ఇవి ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపునకు అన్ని రోజులు తీసుకుంటే, ఈ ఛానెల్స్ కేవలం ఒక గంటలో ఫలితాలను ఎలా అందించగలవు? వారి తప్పుడు గ్రాఫిక్స్ కొన్ని రోజుల ముందుగానే తయారవుతాయి. వారు ‘వనరులు’ అందించే వారితో పొత్తు పెట్టుకుంటారు’ అని ఆరోపించారు.ఈ ఎగ్జిట్ పోల్స్ను నమ్మేవారు ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ను పరిశీలించాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. నాడు యూపీలో చాలా మంది ప్రముఖ బీజేపీ నేతలు ఓటమిని చవిచూశారన్నారు. బీహార్లో మహాకూటిమికి చెందిన చెందిన ప్రతి సభ్యుడు, అభ్యర్థి, మద్దతుదారుడు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అక్రమాలు జరిగితే వాటిని నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ యంత్రాల స్థానాలను నిశితంగా పరిశీలించాలని, కౌంటింగ్ రోజున 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘మహాకూటమి గెలుస్తోంది. మీకు విజయ ధృవీకరణ పత్రం వచ్చే వరకు విశ్రాంతి తీసుకోకండి’ అని ఆయన అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని పేర్కొన్నాయి. ఇది కూడా చదవండి: Delhi blast: అయోధ్యలో స్లీపర్ సెల్? వారణాసిలో..
ఎన్ఆర్ఐ
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒకేసారి రెండు ఉద్యోగాలు : డాలర్లకు కక్కుర్తి పడితే ముప్పు తప్పదు!
మూన్లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్లో దావాలనంలా వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. 2022 మార్చిలో గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరంగా పరిగణించిన దర్యాప్తు సంస్థప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.ఏంటీ నేరం; ఏలాంటి శిక్షసరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే: తరలి వెళ్లిన తారలుడాలర్లకు కక్కుర్తిపడితేడాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని, ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.గతంలో అమెరికా సంస్థలతో మూన్లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)
మనోళ్ల దీపావళి ఎఫెక్ట్: వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025
క్రైమ్
ట్రాన్స్జెండర్ రాజేశ్వరి ఆత్మహత్య
వరంగల్ జిల్లా: కుటుంబ సభ్యులకు దూరమయ్యాననే మనస్తాపంతో ఓ ట్రాన్స్జెండర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్లోని రామగోపాలపూర్లో చోటు చేసుకుంది. మామునూరు ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్న మడిసిలేరు గ్రామానికి చెందిన సోది కృష్ణ కుమారుడు శివప్రసాద్ అలియాస్ రాజేశ్వరి (20) నాలుగు సంవత్సరాల నుంచి బంధువు శ్యామల అక్షరతో కలిసి రామగోపాలపూర్లో నివసిస్తోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం శివప్రసాద్ ట్రాన్స్ జెండర్గా సర్జరీ చేయించుని రాజేశ్వరిగా పేరుమార్చకున్నాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నానని మనస్తాపానికి గురవుతోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రామగోపాలపూర్లో తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ట్రాన్స్ జెండర్ తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
యువతి సజీవ దహనం కేసు కీలక మలుపు
పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు మండలం ముద్దాపురంలో నిద్రిస్తున్న యువతి సజీవదహన మైన ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించగా తాజాగా కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగినట్లుగా సమాచారం. 2022లో జరిగిన ఈ ఘటనలో ముళ్లపూడి శ్రీను, రూప దంపతుల కుమార్తె నాగహారిక (19) తన గదిలోని మంచంపై సజీవదహనమైంది. షార్ట్సర్క్యూట్ కారణంగా మృతిచెంది ఉండవచ్చని అప్పట్లో అనుమానాస్పద మృతిగా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాగహారిక అమ్మమ్మ, మేనమామలు మాత్రం ఇది ఖచ్చితంగా హత్యేనంటూ అప్పట్లో ఆరోపణలు చేయడంతోపాటు పోరాటం చేశారు. ఇటీవల కేసుకు సంబంధించి వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టులో కీలకమైన ఆధారాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముందుగా యువతి తల పగలగొట్టి ఆపై పెట్రోలుపోసి నిప్పంటించి హత్యచేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. నాగహారిక తాడేపల్లిగూడెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా సెలవులకు ఇంటికి వచ్చి మృతిచెందడం అప్పట్లో సంచలనంగా మారింది.పోలీసుల అదుపులో నిందితులు?యువతి సజీవ దహనం ఘటనకు సంబంధించి తాజాగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. ముళ్లపూడి శ్రీనివాస్ మొదటి భార్య వసంత 2003లో మృతిచెందగా రూపను రెండవ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య కుమార్తె అయిన నాగహారిక విషయంలో అప్పట్లో ఆస్తి వ్యవహారంలో తగాదాలు రావడంతోనే హత్య చేసి ఉంటారనే ఆరోపణలు ఏర్పడ్డాయి. ప్రధానంగా యువతి తండ్రి శ్రీనివాస్తోపాటు సవతి తల్లి రూపపై కూడా అప్పట్లోనే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నది వారినేనని, సూత్రదారులు, పాత్రధారులు కూడా వారేనని అని పలువురు అనుమానిస్తున్నారు.
Nellore Lorry Incident: ఇంటికొస్తున్నా.. నీకేం కావాలి..
మాటేసిన మృత్యువు.. కంటైనర్ రూపంలో కాటేసింది. ఎన్నెన్నో కలలను కబళించింది. మూడు కుటుంబాలకు కన్నీరు మిగిలి్చంది. ఆస్పత్రికి వెళ్లొస్తున్న తండ్రి, తోడబుట్టిన సోదరుడు ఇక లేడని తెలుసుకొని ఓ అన్నా చెల్లెలు.. బయటకెళ్లిన భర్త కొబ్బరి నీరు తెస్తాడని ఎదురు చూసిన నిండు గర్భిణైన భార్య గుండెలు పగిలిలా తల్లడిల్లారు. జీవనోపాధి నిమిత్తం కంకులు విక్రయిస్తూ బతుకు పోరాటం చేస్తున్న మీజూరి మల్లిక.. కొబ్బరి బోండాలు అమ్మే మాలకొండయ్య గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. నెల్లూరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది.నెల్లూరు (క్రైమ్): కంటైనర్ మితిమీరిన వేగం వారి పాలిట మృత్యువైంది. తండ్రి, తోడబుట్టిన సోదరుడు ఇక రారని అన్నా, చెల్లెలు.. జీవితాంతం బాసటగా నిలుస్తానని బాస చేసిన భర్త కానరాని తీరాలకు వెళ్లిపోయారని తెలుసుకొని ఎనిమిది నెలల గర్భిణి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నెల్లూరులోని జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాలను చిదిమిసేంది. నెల్లూరు ఎస్వీజీఎస్ కళాశాల మైదాన సమీపంలో జాతీయ రహదారి పక్కన ఎనీ్టఆర్నగర్ రాయపుపాళేనికి చెందిన మీజూరు మల్లిక తోపుడు బండిపై మొక్కజొన్న కంకులు.. ఎనీ్టఆర్నగర్కు చెందిన చుండూరి మాలకొండయ్య టాటా ఏస్ వాహనంలో కొబ్బరి బోండాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.సూళ్లూరుపేటలో చేపలను అన్లోడ్ చేసిన మినీ కంటైనర్ నెల్లూరుకు మంగళవారం మధ్యాహ్నం బయల్దేరింది. గ్రీన్ సిటీ మార్గం వద్దకొచ్చేసరికి చెన్నై వైపు రహదారి నుంచి కావలి వైపు ఒక బైక్పై యూటర్న్ తీసుకుంది. మితిమీరిన వేగంతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ బైక్ను తప్పించే క్రమంలో వేగాన్ని నియంత్రించలేకపోయారు. బైక్తో పాటు ముందు వెళ్తున్న మరో బైక్, కంకులను కొనుగోలు చేస్తున్న వ్యక్తి, తోపుడు బండిని ఢీకొని దూసుకెళ్లి ముందున్న పెద్ద చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం సిరి గార్డెన్స్కు చెందిన ఒట్టూరు సురేష్ (36), తండ్రీకొడుకులు ఖాజా నజీమ్ మొహిద్దీన్ (70), ముజాహిద్ అలీ (35) అక్కడికక్కడే మృతి చెందారు. మల్లిక, మాలకొండయ్యతో పాటు కంకుల కొనుగోలుకు వచ్చిన లైన్మెన్ ఈదూరు అనిల్, యూటర్న్ తీసుకున్న ద్విచక్రవాహనదారుడు కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు.వైద్యచికిత్స చేయించి ఇంటికెళ్తూ..నెల్లూరు రూరల్ మండలం సిరి గార్డెన్స్కు చెందిన ఖాజా నజీమ్ మొహిద్దీన్ (70) విశ్రాంత పీఈటీ. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు తౌహీద్, కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న కుమారుడు ముజాహిద్ అలీ నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేటలోని సచివాలయంలో శానిటరీ అండ్ ఎని్వరాన్మెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ తరుణంలో హెల్త్ చెకప్ నిమిత్తం నారాయణ ఆస్పత్రికి తండ్రిని తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి జాతీయ రహదారి మీదుగా బయల్దేరారు. ఈ క్రమంలో కంటైనర్ ఢీకొని వారు మృతి చెందారు. తండ్రి, సోదరుడు మృతి చెందారనే విషయం తెలుసుకున్న తౌహీద్, సోదరి ఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.హాస్పిటల్లో మిన్నంటిన రోదనలుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లిక, మాలకొండయ్య, అనిల్.. మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన హాస్పిటల్కు చేరుకొని విషాదంలో మునిగిపోయారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన అనిల్కు భార్య మెర్సీ, ఇద్దరు పిల్లలున్నారు. ఆయన నెల్లూరులో లైన్మెన్గా పని చేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.ఎనీ్టఆర్నగర్కు చెందిన మల్లిక, రవిచంద్ర దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. జాతీయ రహదారి పక్కన తోపుడు బండిపై మొక్కజొన్న కంకులను విక్రయిస్తూ మల్లిక జీవనం సాగిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకొని రోదించారు.ఎనీ్టఆర్నగర్కు చెందిన మాలకొండయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. టాటా ఏస్ వాహనంలో కొబ్బరి బోండాలను విక్రయిస్తూ కొంతకాలంగా మాలకొండయ్య జీవనం సాగిస్తున్నారు.తిరుపతి జిల్లా కోట మండలం ఉచ్చువారిపాళేనికి చెందిన కోటేశ్వరరావు నెల్లూరు గ్రీన్ సిటీలోని సచివాలయ బిల్డింగ్కు వాచ్మెన్గా రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. మొక్కజొన్న కంకులు కొనుగోలు చేసేందుకెళ్తూ ప్రమాదంలో గాయపడ్డారు.ఇంటికొస్తున్నా.. నీకేం కావాలి..మూలాపేటకు చెందిన సురేష్ ప్రస్తుతం సిరి గార్డెన్స్లో ఉంటున్నా రు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం భార్య నిండు గర్భిణి. సురేష్ ఇంటికొస్తూ.. భార్యకు ఫోన్ చేసి నీకేం కావాలి తన అడిగారు. కొబ్బరి నీళ్లు తీసుకురావాలనడంతో అక్కడ ఆగడమే ఆయనకు ఆఖరి క్షణమని తెలియదు. సురేష్ మృతి విషయాన్ని భార్యకు చాలా సేపటి వరకు బంధువులు చెప్పలేదు. గర్భిణి కావడంతో కొంచెంగా చెప్పారు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కూప్పకూలిపోయారు.
ఒక్కటిగా మెలిగి.. ఒక్కటిగానే మృత్యు ఒడికి చేరిన స్నేహితులు
మృత్యువు మింగేసింది.. నిశీధి వేళలో నలుగురు స్నేహితులను కర్కశంగా కబళించేసింది.. వేకువ వెలుగుకు ముందే ప్రాణాల్ని తోడేసింది.. నెత్తుటి ముద్దల్ని మిగిల్చింది.. మృతదేహాల్ని మూటగట్టింది.. సరదాగా కారులో బయలుదేరిన వారికదే ఆఖరి మజిలీ అయ్యింది. ఆశల్ని,ఆశయాల్ని, బతుకుల్ని, బంగారు కలల్ని చిదిమేసింది.. కన్నవారికి, తోబుట్టువులకు, బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ముగ్గురు మొగల్రాజపురానికి చెందిన వారు కాగా, మరొకరు కంకిపాడు మండలం కుందేరుకు చెందిన యువకుడు. ఘటనపై ఉయ్యూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నప్పటి నుంచీ మిత్రులే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలోని మొగల్రాజపురానికి చెందిన చాట్రగడ్డ రాకేష్ బాబు(24), ఈటె ప్రిన్స్బాబు(22), గొరిపర్తి పాపారావు అలియాస్ పాపయ్య(23) చిన్నప్పటి నుంచీ స్నేహితులు. పదో తరగతి వరకూ కలిసే చదివి, ఆ తరువాత కూడా స్నేహం కొనసాగించారు. మొగల్రాజపురం బందులదొడ్డి సెంటర్ సమీపంలో నివాసం ఉండే రాకేష బాబు తండ్రి చక్రపాణి దస్తావేజు లేఖరి. చక్రపాణికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుండగా, చిన్న కుమారుడైన రాకేష్ తండ్రికి సహాయంగా ఉంటున్నాడు. ఇటీవలే స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ఐజీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్లో అటెండరుగా చేరాడు. కుమారుడి మర ణ వార్తతో చక్రపాణి సొమ్మసిల్లి పడిపోయాడు. ఇందిరాగాంధీ స్టేడియం సమీపంలోని గిరిపురంలో ఉండే ఈటే ప్రిన్స్బాబు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ప్రిన్స్ తండ్రి రామయ్య రాడ్ బెండింగ్ కార్మికుడు. పాపారావు అలియాస్ పాపయ్య మొగల్రాజపురంలోని బాలభాస్కర నగర్ కనకదుర్గ మ్మ గుడి రోడ్డులో కొండపైన నివాసం ఉండే గొరిపర్తి శివయ్య, యశోదకు రెండో కుమారుడు. ఈయన మెడికల్ విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. పాపయ్య తండ్రి శివ య్య ట్రాక్టరు డ్రైవరు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాపయ్య మాట్లాడుతుండటంతో కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పాపయ్య చికిత్స పొందుతూ మరణించారు. కొణతం చింతయ్య(19)ది కంకిపాడు మండలం కుందేరు స్వగ్రామం. చింతయ్య వ్యవసాయ కూలీ. చింతయ్య తండ్రి బాలకృష్ణ పాల వ్యాపారం చేస్తుంటాడు. అటు వ్యవసాయం, ఇటు పశుపోషణ సాగిస్తూ చింత య్య కుటుంబానికి తోడుగా ఉంటున్నాడు. మృతుల్లో ఒకరైన పాపారావుది కూడా కుందేరు గ్రామమే. అయితే కొన్నాళ్ల క్రితం విజయవాడలో స్థిరపడ్డారు. తల్లడిల్లి.. సొమ్మసిల్లి.. బయటకు వెళ్లిన బిడ్డలు ఇంటికి వస్తారని ఆశగా చూస్తున్న ఆ కుటుంబాలకు విషాదమే మిగిలింది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వచ్చిన ఫోన్తో గండిగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ బిడ్డలు ఇక లేరు అనే వార్త ఆ కుటుంబాలను శోకంలో ముంచెత్తింది. స్నేహితుడి కోసం వెళ్తున్నామని చెప్పి, పుట్టినరోజు వేడుక అని చెప్పి బయటకు వెళ్లి శవమై తిరిగి వచ్చారంటూ మృతుల తల్లిదండ్రులు, రక్తసంబం«దీకులు పెట్టిన రోధనలు ప్రతి ఒక్కరినీ కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది. బిడ్డల మృతదేహాలను చూస్తూ తల్లిడిల్లి సొమ్మసిల్లి పడ్డ కుటుంబ సభ్యులను చూసి అందరి మనసూ చలించింది. విజయవాడ నుంచి ఎందుకు వచ్చారు? ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు? ఉయ్యూరు వైపు ఎందుకు వస్తున్నారు? రావాల్సిన అవసరం ఏముంది? అర్థం కాని స్థితిలో రోడ్డు ప్రమాదం తమ బిడ్డలను తీసుకెళ్లిపోయిందంటూ మృతుల బంధువుల రోదనలు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో మిన్నంటాయి. తోడుగా ఉంటారనుకున్న కొడుకులకు తల కొరివి పెట్టే శిక్ష ఎందుకు వేశావంటూ గుండెలు బాదుకుంటూ రోధించారు.కలిసే మృత్యు ఒడికి.. చాట్రగడ్డ రాకేష్ బాబు స్నేహితుడిని రైల్వేస్టేషన్లో దింపుతానని సోమవారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి కారు తీసుకుని బయలుదేరి వెళ్లాడు. స్నేహితులు ప్రిన్స్బాబు, పాపయ్యను ఎక్కించుకున్న రాకేష్బాబు కుందేరులో ఉంటున్న పాపయ్య బంధువు వరుసకు తమ్ముడు కొణతం చింతయ్య వద్దకు వచ్చారు. తమ స్నేహితుడి పుట్టినరోజు అని చెప్పి చింతయ్యను కూడా కారులో ఎక్కించుకుని వెళ్లారు. రైల్వేస్టేషన్కు వెళ్లిన కొడుకు ఎంతకూ రాకపోయే సరికి రాకేష్బాబు తండ్రి చక్రపాణి అర్ధరాత్రి 12, ఒంటి గంట మధ్యలో ఫోన్ చేయగా తాను పాతపాడు చర్చికి వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే వీరంతా కుందేరులో చింతయ్యను ఎక్కించుకుని విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి మీదుగా ఉయ్యూరు వైపు ప్రయాణం సాగించారు. వీరు ప్రయాణిస్తున్న కారు గండిగుంట సమీపంలోని పెట్రోలు బంకు 1.32 గంటలకు క్రాస్ అయినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అనంతరం 1.34 గంటల సమయంలో అదుపుతప్పింది. జాతీయ రహదారి, సర్వసు రోడ్డుకు మధ్యన ఉన్న బోదెలోకి దూసుకెళ్లి మూడుకు పైగా పల్టీలు కొట్టింది. ఈ పల్టీలు కొట్టే క్రమంలో కారు పూర్తిగా ధ్వంసమై కారు అద్దాలలో నుంచి ఒక్కరొక్కరుగా రోడ్డుపై పడ్డారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదాన్ని ఊహించని వారు తీవ్ర గాయాలపాలై తనువు చాలించారు. ఘటనాస్థలంలోనే ఈటే ప్రిన్స్బాబు, చాట్రగడ్డ రాకేష్బాబు, కొణతం చింతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన గొరిపర్తి పాపారావును 108 అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందాడు. అతివేగం, మద్యం మత్తు కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ రహదారిపై డేంజర్ బెల్స్ జాతీయ రహదారి మార్గంపై డేంజర్బెల్స్ మోగుతున్నాయి. ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాని భయానక పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు, ప్రజలు జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే హడలెత్తిపోతున్నారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై కామయ్యతోపు, తాడిగడప, పోరంకి, పెనమలూరు, ఈడుపుగల్లు, గోసాల సెంటర్, కంకిపాడు బైపాస్, ప్రొద్దుటూరు, దావులూరు టోల్గేట్, నెప్పల్లి సెంటరు, పెద ఓగిరాల, చిన ఓగిరాల, గండిగుంట, గురజాడ, తాడంకి, గోపువానిపాలెం అడ్డరోడ్డు, కనుమూరు, నిడుమోలు జంక్షన్, మొదలైన ప్రదేశాల్లో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారి నిర్మాణంలో లోపాలు, సర్వసు రోడ్డు జంక్షన్లు, రాత్రిళ్లు హైవేపై లైట్లు వెలగకపోవటం వంటి అనేక సమస్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. దీనికి తోడు వాహనాల మితిమీరిన వేగం కూడా ప్రమాదాల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. ఎన్హెచ్ అధికారులు ప్రమాదాల నివారణకు తగుచర్యలు తీసుకోకపోవటం వల్లే ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు నివారణ, వీధి దీపాలు నిర్వహణ తదితర అంశాలపై సామాజిక కార్యకర్తలు ఇటీవల స్వయంగా జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు లేకపోవటం గమనార్హం.
వీడియోలు
Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
జగన్ కట్టించిన ఇళ్లకు... చంద్రబాబు హంగామా
Prakash Raj: అవును.. నేను చేసింది తప్పే
మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ
మా MROలు వేస్ట్.. జనసేన నేత సంచలన కామెంట్స్
Vidadala Rajini: రాసిపెట్టుకోండి.. జగనన్న ఒకసారి చెప్పాడంటే
New Delhi: పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన మోదీ
కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములకు అవమానం

