తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)
నా షో వస్తుంది చూడు నాన్న ..!
నిన్న దుబాయ్లో జరిగిన ఎయిర్షోలో తేజస్ ఫైటర్ కుప్పకూలడంతో భారత ఫైలట్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటన వివరాలు యూట్యూబ్ రీల్స్ చూస్తుండగా తెలిసిందని ఆయన తండ్రి మీడియాతో తెలిపారు. ఈ ఘటన వివరాలు తెలియగానే తన కోడలికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు గొప్ప స్థానాల్లో ఉంటే చూడాలని కలలుగంటారు. ఇక వారి పిల్లల గొప్పతనాన్ని ఏవరైనా ప్రశంసిస్తే ఇక వారి ఆనందానికి అవదులే ఉండవు. అయితే తమ పిల్లల గొప్పతనాన్ని చూసి సంబరపడిపోదామనుకున్న తల్లిదండ్రులకు వారు మృతిచెందడం చూడాల్సి వస్తే ఇక ఆ బాధ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో వారు ప్రత్యక్ష నరకమే అనుభవిస్తారు. నిన్న దుబాయ్లో జరిగిన ఎయిర్షో అటువంటి చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. దుబాయ్ లో జరిగిన ఎయిర్ షో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతుందని దానిని చూడాలని వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ తన తండ్రికి చెప్పారు. దీంతో ఎంతో సంబురంగా తన కొడుకు ప్రతిభను చూడాలనుకున్న తండ్రికి ప్రమాదంలో కుమారుడు మృతి చెందడం చూడాల్సి వచ్చింది.దుబాయ్ లో జరిగిన ఎయిర్ క్రాష్ ఘటనపై వింగ్ కమాండర్ నమాన్ష్ సయీల్ తండ్రి స్పందించారు. " నిన్న 4 గంటల ప్రాంతంలో ఎయిర్ షో లైవ్ వీడియోల కోసం యూట్యూబ్ లో వెతుకుతున్నాను. అప్పుడే జెట్ క్రాష్ అయిందనే సంగతి నాకు తెలిసింది. దీంతో వెెంటనే తన కోడలుకు కాల్ చేశానని, కొద్ది సేపటికే ఐదుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు తమ ఇంటికి రావడంతో ఎదో జరిగిందని నాకు అర్థమైంది" అన్నారు. ఈ ప్రమాద ఘటనకు ఒకరోజు ముందే తన కొడుకుతో మాట్లాడనని ఎయిర్ షో టీవీలో వస్తుంది చూడాలని తనకు తెలిపాడన్నారు.నమాన్ష్ సయీల్ తండ్రి హిమాచల్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా రిటైరయ్యారు. సయీల్ భార్య సైతం ఐఏఎఫ్ లో వింగ్ కమాండర్గా విధులు నిర్వహిస్తుంది. నిన్న దుబాయ్ లో జరిగిన ఎయిర్ షోలో ప్రమాదవశాత్తు తేజస్ ఫైటర్ కూలి వింగ్ కమాండర్ సయీల్ మృతి చెందారు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో 46ను విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది.సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయనుంది. పంచాయతీ రాజ్ జీవో 46 ప్రకారం.. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు. రిజర్వేషన్ కేటాయింపునకు Socio-Economic, Education, Employment, Political and Caste Survey (SEEPC) 2024 జనాభా డేటా ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్టీ-ఎస్సీ-బీసీ-మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలి. సర్పంచ్ రిజర్వేషన్కు కోసం 2011 జనగణన + SEEPC డేటా వినియోగించాలి. మునుపటి ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు/గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయరాదు. వందకు వంద శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయాలి. ఎస్టీ రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి, తరువాత ఎస్సీ నుంచి బీసీ కేటాయింపు జరపాలి. మహిళల రిజర్వేషన్ అన్ని కేటగిరీలలో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేయాలి. గ్రామ పంచాయతీ/వార్డుల సంఖ్య తక్కువైతే.. మొదట మహిళా ప్రాధాన్యత ఆ తరువాత లాటరీ పద్ధతి పాటించాలి. 2019 ఎన్నికల్లో అమలుకాలేని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగవచ్చు. వార్డు రిజర్వేషన్ల నిర్ణయం ఎంపీడీవో, సర్పంచ్ రిజర్వేషన్ ఆర్డీవోల ఆధ్వర్యంలో జరగాలి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు & ఎలక్షన్ అథారిటీలను అమలు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.జీవో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బిగ్బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!
ప్రతివారం బిగ్బాస్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. గతవారం గౌరవ్, నిఖిల్ బయటకొచ్చేశారు. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయినట్లు అయింది. మరి ఈ వారం ఎవరు ఔట్ అవుతారా అందరూ ఎదురుచూశారు. అందుకు తగ్గట్లే ఈ వారం ఆరుగురు నామినేషన్స్లోకి రాగా.. ఈమెనే ఎలిమినేట్ అవుతుందని చాలామంది ఊహించారు. ఇప్పుడు అలానే జరిగినట్లు తెలుస్తోంది.ఈ వారం నామినేషన్స్లోకి కళ్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి, సంజన, దివ్య వచ్చారు. ఇన్నివారాల పాటు మిస్ అవుతూ వచ్చిన ఇమ్ము.. తొలిసారి నామినేషన్స్లోకి వచ్చాడు. ఇదేమైనా ఇతడికి మైనస్ అవుతుందా అని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. అభిమానులు గట్టిగానే ఓట్లు వేశారట. తద్వారా ఓటింగ్లో తొలిస్థానం కల్యాణ్ దక్కించుకోగా.. రెండో స్థానంలో ఇమ్ము నిలిచాడట.(ఇదీ చదవండి: 'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్)తర్వాత స్థానాల్లో పవన్, భరణి నిలిచారు. డేంజర్ జోన్లో సంజన, దివ్య ఉన్నారు. సంజనతో పోలిస్తే దివ్యపై గత కొన్నివారాల నుంచి నెగిటివిటీ పెరుగుతూనే వచ్చింది. దీనికి కారణం తనూజ. ప్రతిసారి తనూజతో దివ్య గొడవ పడుతూ వచ్చింది. శుక్రవారం ఎపిసోడ్లోనూ కెప్టెన్సీ విషయమై వీళ్లిద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ఇప్పటికే కెప్టెన్సీ, ఇమ్మ్యూనిటీ ఉన్న కారణంగా తనూజని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించేందుకు తాను ఓటు వేస్తున్నానని దివ్య చెప్పింది.ఇలా పలు కారణాలతో పాటు నామినేషన్స్లో ఉన్న మిగతా వాళ్లతో పోలిస్తే దివ్యకు ఓటు బ్యాంక్ తక్కువగా ఉండటంతో 11వ వారం ఈమెనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈమె బయటకొచ్చేస్తే.. హౌస్లో ఉన్న కామనర్స్ కల్యాణ్, పవన్ మాత్రమే అవుతారు. చూడాలి మరి ఈసారి ఊహించినట్లే దివ్య ఎలిమినేట్ అవుతుందా లేదంటే మరెవరైనా బయటకొచ్చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)
సర్జ్ ఈక్వెస్ట్రీయన్ లీగ్ గ్రాండ్ ఫినాలే.. హాజరైన వైఎస్ జగన్, కేటీఆర్
తెలుగు గంగ ప్రాజెక్ట్.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
హత్యకు ప్లాన్.. రూ. 10 లక్షలకు బేరం.. సుపారీ గ్యాంగ్ అరెస్ట్
పాటలు వినేందుకు వెళ్తే రూ.18 లక్షలు స్వాహా
రేపే జట్టు ప్రకటన.. టీమిండియాకు కొత్త కెప్టెన్?
అమెరికాలో ప్రమాదం.. హైదరాబాద్ విద్యార్థికి గాయాలు
తొక్కిసలాట తర్వాత ప్రజల ముందుకు విజయ్
'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్లో..
వడివడిగా మలక్పేట్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి
సెమీస్లో ఆసీస్ చిత్తు..
భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు
కెప్టెన్గా ఇషాన్ కిషన్ పేరు ప్రకటన
కట్టుబట్టలతో ఇంటినుంచి పారిపోయి..: అమల
వివాదాల 'డర్టీ సాంగ్' ఫుల్ వీడియో వచ్చేసింది
Traffic Challans: సగం చలానా చెల్లిస్తే చాలు
బంగారం ధరల్లో ఊహించని మార్పు!: గంటల వ్యవధిలో..
తారుమారైన బంగారం ధరలు: సాయంత్రానికే..
ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది, అనుకూల మార్పులు
అంతరిక్షంలో ఏలియన్ రాకను గుర్తించిన నాసా
ఈ రాశివారు శుభవార్తలు వింటారు, వ్యవహారాలలో విజయం
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
బిగ్బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!
టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
ముచ్చల్తో నిశ్చితార్థాన్ని ధ్రువీకరించిన మంధన
ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!
అబ్బే! పెండింగ్ ఫైల్స్ కాద్సార్! పైరవీల లేఖలు
7,000 మంది ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ షాక్!
ఈ రాశి వారికి భూములు, వాహనాలు కొంటారు
సాక్షి కార్టూన్ 22-11-2025
మళ్లీ భారత్ × పాకిస్తాన్ ఫైనల్?
సర్జ్ ఈక్వెస్ట్రీయన్ లీగ్ గ్రాండ్ ఫినాలే.. హాజరైన వైఎస్ జగన్, కేటీఆర్
తెలుగు గంగ ప్రాజెక్ట్.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
హత్యకు ప్లాన్.. రూ. 10 లక్షలకు బేరం.. సుపారీ గ్యాంగ్ అరెస్ట్
పాటలు వినేందుకు వెళ్తే రూ.18 లక్షలు స్వాహా
రేపే జట్టు ప్రకటన.. టీమిండియాకు కొత్త కెప్టెన్?
అమెరికాలో ప్రమాదం.. హైదరాబాద్ విద్యార్థికి గాయాలు
తొక్కిసలాట తర్వాత ప్రజల ముందుకు విజయ్
'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్లో..
వడివడిగా మలక్పేట్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి
సెమీస్లో ఆసీస్ చిత్తు..
కట్టుబట్టలతో ఇంటినుంచి పారిపోయి..: అమల
Traffic Challans: సగం చలానా చెల్లిస్తే చాలు
తారుమారైన బంగారం ధరలు: సాయంత్రానికే..
ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది, అనుకూల మార్పులు
అంతరిక్షంలో ఏలియన్ రాకను గుర్తించిన నాసా
ఈ రాశివారు శుభవార్తలు వింటారు, వ్యవహారాలలో విజయం
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
బిగ్బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!
ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!
7,000 మంది ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ షాక్!
సాక్షి కార్టూన్ 22-11-2025
ఐదేళ్లూ సిద్ధరామయ్యనే కర్ణాటక సీఎం: డిప్యూటీ సీఎం శివకుమార్
టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్
బిహార్ సీఎంగా నితీశ్ పదోసారి ప్రమాణ స్వీకారం..
1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్!
ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చిన 'రాజ్-కోటి' ఎలా విడిపోయారు..?
సొంత వదిననే పెళ్లాడాడు, ఎందుకో తెలుసా?
వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్లో టీమిండియా ఓటమి
ఇమ్మూకి తల్లి ఊహించని గిఫ్ట్! కొత్త కెప్టెన్ ఎవరంటే?
శ్రేయస్ అయ్యర్కు సంబంధించి బిగ్ అప్డేట్
ఫొటోలు
ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)
తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)
‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్
హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం సక్సెస్మీట్ (ఫొటోలు)
తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)
బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)
వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
సినిమా
తెరపై ముద్దు.. ఎలా ఉంటుందో చెప్పిన నటి!
ఇది సోషల్ మీడియా యుగం. ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలియదు. అసలు ఎందుకు ట్రెండ్ అవుతారనే విషయం చెప్పడం కూడా కష్టమే. గత 15 రోజులుగా ఓ నటి పేరు నెట్టింట మారుమోగుతుంది. ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. ఒకే ఒక ఇంటర్వ్యూతో వచ్చింది. ఆ ట్రెండింగ్ బ్యూటీ ఎవరోకాదు మరాఠీ ముద్దుగుమ్మ గిరిజా ఓక్(Girija Oak). ఓ సినిమా కోసం గుల్షన్ దేవయ్యతో రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ ఫన్నీ ఇన్నిడెంట్ని షేర్ చేసుకోవడంతో గిరిజా పేరు నెట్టింట వైరల్గా మారింది. ఇంత వైరల్ అవుతుందని ఆమె కూడా ఊహించలేదు. ఆ ఇంటర్వ్యూ తర్వాత గిరిజాకు సంబంధించిన ఓ కిస్ సీన్ కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ లిప్లాక్ సీన్ గురించి కూడా స్పందించారు గిరిజా. ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న ఆమెకు ముద్దు సన్నివేశాలు ఎలా షూట్ చేస్తారు? రొమాంటిక్ సీన్ల షూటింగ్కి ప్రత్యేకమైన నైపుణ్యం ఏమైనా అవసరం ఉంటుందా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి గిరిజా సమాధానం ఇస్తూ.. అదంతా మెకానికల్గా ఉంటుంది తప్ప..నిజమైన భావాలకు ఏమాత్రం చోటు ఉండదని స్పష్టం చేసిది.‘షూటింగ్ సమయంలో సౌండ్కి ఇబ్బంది అవుతుందని ఏసీలను సైతం ఆఫ్ చేస్తారు. చెమటలు కారుతూనే ఉంటాయి. ఒకరు వచ్చి చెమటలు తూడుస్తుంటారు. మరొకరు వచ్చి హెయిర్ని సెట్ చేస్తుంటారు. ఇంకోవైపు లైట్ సరిగా పడడం లేదంటూ థర్మాకోల్ తీసుకొస్తారు.. ఇలా ఇన్ని కళ్లు చూస్తున్నప్పుడు రొమాన్స్ ఎక్కడ నుంచి వస్తుంది? అదంతా మెకానికల్, టెక్నికల్ ప్రాసెస్ మాత్రమే. ఆ సీన్లు షూట్ చేసేటప్పుడు హీరో ముఖం కంటే ఎక్కువగా సౌండ్ ఇంజనీరింగ్ ముఖమే గుర్తుకు వస్తుంది’ అని నవ్వుతూ చెప్పింది గిరిజా.ఇక ముద్దు సీన్ గురించి మాట్లాడుతూ.. తెరపై కిస్ అంటే.. కార్ట్బోర్డ్ని ముద్దు పెట్టుకున్నట్లే ఉంటుందని చెప్పింది. క్లోజప్ సీన్స్ తీసేటప్పుడు ఎదుటివాడు అక్కడ ఉండడు కూడా. కెమెరాని చూస్తూనే నటించాల్సి ఉంటుంది. అక్కడ ఏ మాత్రం ఎమోషన్ ఉండదు. చాలా సార్లు నేను కెమెరా దగ్గర ఉన్న ఒక స్టాండ్ లేదా థర్మాకోల్ ముక్కను చూస్తూ రొమాంటిక్ డైలాగులు చెప్పాను’ అని గిరిజా చెప్పుకొచ్చింది.ఎవరీ గిరిజా?స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజా ఓక్.. హిందీలోనూ పలు మూవీస్ చేసింది. బాలీవుడ్లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి సినిమా. ఆ తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ(2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది. రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఇన్స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది.
కవర్ సాంగ్లో కల్యాణి.. రకుల్ ఓ రేంజ్ గ్లామర్!
హిందీ కవర్ సాంగ్ కోసం గ్లామరస్గా కల్యాణిపెళ్లి తర్వాత కూడా రకుల్ అందాల విందువింటేజ్ కెమెరాతో యాంకర్ రష్మీ పోజులుకెన్యా టూర్ వీడియో పోస్ట్ చేసిన అనసూయసొట్టబుగ్గతో అందంగా 'రాంబాయి' తేజస్వీటామ్ బాయ్లా మారిపోయిన షాలినీ పాండే View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Tejaswi. (@tej_aswiii) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan)
చెత్త రీల్స్ ఒక్కచోట చేర్చితే డ్యూడ్.. దర్శకుడి రిప్లై ఇదే!
దీపావళికి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సినిమా డ్యూడ్ (Dude Movie). ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఏకంగా రూ.100 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంతోనే కీర్తిశ్వరన్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోకి అందుబాటులోకి వచ్చింది.అది నార్మల్ కాదుదీంతో ఓటీటీలో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సినిమా గురించి నేరుగా దర్శకుడికే మెసేజ్ చేసింది. బ్రో.. మీ ఇంటర్వ్యూ క్లిక్ కూడా చూశాను. మమిత మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసే సన్నివేశాన్ని నార్మలైజ్ చేశారు. అలాంటివి చాలా మామూలు విషయం అన్నట్లు చూపించకండి.చెత్త రీల్స్నిజమైన స్నేహితులెప్పుడూ అలా మాట్లాడుకోరు. సినిమా మొత్తం అర్థంపర్థం లేకుండా ఉంది. సన్నివేశాల మధ్య కనెక్షన్ మిస్ అయింది. చెత్త రీల్స్ను ఒకచోట చేర్చినట్లుగా ఉంది. ఇకనుంచైనా కాస్త మంచి సినిమాలు తీయు అని సలహాచ్చింది. దీనికి కీర్తిశ్వరన్ స్పందిస్తూ... నాకు మెసేజ్లు చేసే బదులు నీ బతుకేదో నువ్వు చూసుకో.. అని వెటకారంగా బదులిచ్చాడు. విమర్శించే హక్కుఈ చాటింగ్ను స్క్రీన్షాట్ తీసిన ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డ్యూడ్ సినిమాతో పాటు దర్శకుడి ఇంటర్వ్యూ క్లిప్ చూశాను. నా జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా చూసినప్పుడు దాన్ని విమర్శించే హక్కు నాకుంది. నా అభిప్రాయాన్ని దర్శకుడితో పంచుకున్నాను. కొత్త డైరెక్టర్.. నా విమర్శను స్వీకరిస్తాడనుకున్నాను.. కానీ, ఇదిగో ఇలా రిప్లై ఇచ్చాడు. దమ్ము లేదుఇక్కడే అతడి మైండ్సెట్ ఏంటో తెలిసిపోతుంది. ఫీడ్బ్యాక్ను తీసుకునే దమ్ము లేదని రుజువవుతోంది అని రాసుకొచ్చింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. డ్యూడ్ సినిమా ప్రదీప్తో కాకుండా వేరే హీరోతో చేసుంటే కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది.. విమర్శలు తీసుకోవడం కూడా రావాలని దర్శకుడిని మందలిస్తున్నారు. మెజారిటీ జనాలు మాత్రం.. ఇది సినిమానా? చెత్త రీల్స్ అన్ని కలగలిసినట్లుగా ఉందని నానామాటలు అంటే ఇలాగే స్పందిస్తారని దర్శకుడిని వెనకేసుకొస్తున్నారు. Dude Director “ Keerthishwaran “ reply to a influencer question about the worst scene in movie. It’s just a Audacity way of response :( pic.twitter.com/EdQKaI50eI— Kolly Censor (@KollyCensor) November 21, 2025 చదవండి: చెల్లి పెళ్లయిన మూడున్నరేండ్లకు.. బుల్లితెర నటి ఎంగేజ్మెంట్
తనూజ వల్ల సుమన్ బలి.. పవన్పై చిన్నచూపు?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో పదకొండోవారం కెప్టెన్ రీతూ అన్న విషయం ఈపాటకే బయటకు వచ్చేసింది. అయినప్పటికీ అదేదో సస్పెన్స్ అన్నట్లుగా సాగదీస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ వేయనేలేదు. ఈరోజు ఎపిసోడ్లో సుమన్, రీతూ కెప్టెన్సీ కోసం ఎలా పోటీపడ్డారో చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు.బోల్తా కొట్టిన సుమన్ఇందులో సుమన్ చకచకా ఆడేశాడు. చివర్లో ఓ బోర్డు సెట్ చేస్తుంటే సంచాలక్గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. పర్లేదు, వెళ్లు వెళ్లంటూ పంపించేసింది. అలా ఫస్ట్ సుమన్ కెప్టెన్ అని రాసున్న జెండా ఎగరేశాడు. కొద్ది క్షణాల తేడాతో రీతూ జెండా ఎగరేసింది. అయితే సుమన్ చివరి బోర్డ్ సరిగా పెట్టలేదని డిమాన్ పవన్ ప్రశ్న లేవనెత్తాడు. అది దగ్గరుండి మరీ చూపించాడు. సైలెంట్ అయిన తనూజదాంతో తనూజ.. వాళ్లిద్దరు ఫైట్ చేసుకుంటారు. నువ్వెందుకు మాట్లాడుతున్నావ్? నువ్వేంటి చెప్పేది? అని పవన్ను తీసిపడేసింది. ఇంతలో కల్యాణ్.. నువ్వు డిక్లేర్ చేశాకే సుమన్ చివరి బోర్డ్ వదిలేశాడని వాదించాడు. దీంతో తనూజ సైలెంట్ అయిపోయింది. తనూజ చేసిన ఆగం పని వల్ల సుమన్ బలైపోయాడు. రీతూ కెప్టెన్ అయింది. చదవండి: సీజన్లో పెద్ద లొల్లి.. సీరియల్ స్టార్ వర్సెస్ సింపతీ స్టార్
క్రీడలు
అతడిని చూసి భయపడ్డాము: స్టోక్స్
యాషెస్ సిరీస్ 202-26ను ఇంగ్లండ్ ఘోర ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చిత్తు అయింది. బౌలింగ్ పరంగా ఇంగ్లీష్ జట్టు ఫర్వాలేదన్పించినప్పటికి.. బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే కుప్పకూలిన స్టోక్స్ సేన.. రెండో ఇన్నింగ్స్లో కూడా అదే తీరును కనబరిచింది. బోలాండ్, స్టార్క్, డాగెట్లు నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలర్లు కూడా తేలిపోయారు.ట్రావిస్ హెడ్ తుపాన్ను ఇంగ్లీష్ బౌలర్లు ఆపలేకపోయారు. హెడ్ కేవలం 83 బంతుల్లోనే 123 పరుగులు చేసి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. స్టార్క్ బౌలింగ్, హెడ్ మెరుపు బ్యాటింగ్ ధాటికి తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అందించాడు. హెడ్ తన సంచలన బ్యాటింగ్తో మ్యాచ్ తమ నుంచి దూరం చేశాడని స్టోక్స్ తెలిపాడు."ట్రావిస్ హెడ్ నిజంగా ఒక అద్భుతం. అతడు బ్యాటింగ్ చూసి మేము షాక్కు గురయ్యాము. నాలుగో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సరికి మ్యాచ్ మా నియంత్రణలోనే ఉందని భావించాం. కానీ హెడ్ తన తుపాన్ బ్యాటింగ్ విజయాన్ని మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. పిచ్లో ఎటువంటి మార్పు లేదు. అయితే ఈ వికెట్పై క్రీజులో ఎక్కువ సేపు నిలదొక్కకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. డిఫెన్స్ ఆడటం కంటే, సులువైన బంతులను బౌండరీలకు తరలించిన వారికే ఈ వికెట్ మీద పరుగులు వచ్చాయి. మేము బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాము.మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను ఈ గేమ్లో కొనసాగించలేకపోయాము. హెడ్ దూకుడును ఆపేందుకు మేము మూడు, నాలుగు రకాల ప్లాన్లు అమలు చేశాం. కానీ అతడు జెట్ స్పీడ్తో దూసుకుపోతుండడంతో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. రెడ్ బాల్, వైట్ బాల్ క్రికెట్లో అతడు అద్భతమైన ఫామ్లో ఉన్నాడు. అతడు తన రిథమ్ను అందుకుంటే ఆపడం చాలా కష్టం.సిరీస్ ఆరంభ మ్యాచ్లో ఓడిపోవడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. కానీ తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం మాకు ఉంది. ఇంకా మాకు నాలుగు మ్యాచ్లు ఉన్నాయి. ఈ ఓటమిని పక్కన పెట్టి బ్రిస్బేన్లో జరగబోయే టెస్టు కోసం సిద్ధమవుతాము అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో స్టోక్స్ పేర్కొన్నాడు.
హెడ్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
యాషెస్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 28.2 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి ఛేదించారు.ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. టెస్టు మ్యాచ్లో టీ20 తరహా బ్యాటింగ్ చేశాడు. ఫార్మాట్ ఏదైనా తనకు తెలిసిందే బాదుడు ఒక్కటే అన్నట్లు హెడ్ ఇన్నింగ్స్ కొనసాగింది. తన తుపాన్ బ్యాటింగ్తో ఇంగ్లండ్ బజ్బాల్ను భయపెట్టేశాడు.ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన హెడ్.. ఒంటి చేత్తో తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో కేవలం 69 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్లతో 123 పరుగులు చేశాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన హెడ్..👉టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4వ ఇన్నింగ్స్లో(ఛేజింగ్) అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ గిల్బర్ట్ జెస్సోప్ పేరిట ఉండేది. జెస్సో 1902 యాషెస్లో ఆస్ట్రేలియాపై నాల్గవ ఇన్నింగ్స్లో 76 బంతుల్లో శతక్కొట్టాడు. తాజా ఇన్నింగ్స్తో 123 ఏళ్ల గిల్బర్ట్ రికార్డును బ్రేక్ చేశాడు.👉టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన చేసిన ఓపెనర్గా డేవిడ్ వార్నర్(69 బంతులు) రికార్డును హెడ్ సమం చేశాడు.👉యాషెస్ సిరీస్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా హెడ్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్క్రిస్ట్(57) అగ్రస్ధానంలో ఉన్నాడు.👉 ఒక టెస్టు మ్యాచ్లో విజయవంతమైన రన్ ఛేజ్లో అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించిన ప్లేయర్గా హెడ్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో(147.82) పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో 148.19 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించిన హెడ్.. బెయిర్స్టో రికార్డును బ్రేక్ చేశాడు.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?
ముగిసిన తొలి రోజు ఆట.. సఫారీలదే పై చేయి
గువహటి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో సౌతాఫ్రికా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ముత్తుసామి (25*), వెర్రిన్ (1*) ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రోటీస్ జట్టుకు ఓపెనర్లు మార్క్రమ్ (38), రికెల్టన్ (35) శుభారంభాన్ని అందించారు. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్ తయారు చేయడంతో తొలి వికెట్ను సాధించేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో మార్క్రమ్ను ఔట్ చేయడంతో భారత్కు తొలి వికెట్ లభించింది. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ టెంబా బవుమా (41) నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే రెండో సెషన్లో మాత్రం భారత బౌలర్లు పుంజుకున్నారు.ముఖ్యంగా స్పిన్నర్లు కీలక వికెట్లు పడగొట్టారు. రికెల్టన్, స్టబ్స్, ముల్డర్లను కుల్దీప్ యాదవ్ పెవిలియన్కు పంపగా.. బవుమాను జడ్డూ బోల్తా కొట్టించాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్
యాషెస్ సిరీస్ 2025-26ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఆసీస్ చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని కంగారులు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించారు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.లక్ష్య చేధనలో ఇంగ్లీష్ జట్టు బౌలర్లను హెడ్ ఉతికారేశాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన హెడ్.. కేవలం 69 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్లతో 123 పరుగులు చేశాడు.అతడితో పాటు మార్నస్ లబుషేన్(51) అజేయ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టిన జోఫ్రా అర్చర్, బెన్ స్టోక్ట్స్ రెండో ఇన్నింగ్స్లో తేలిపోయారు.ఇంగ్లండ్ అట్టర్ ప్లాప్..కాగా రెండు ఇన్నింగ్స్లలోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్(7 వికెట్లు) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే కుప్పకూలిన స్టోక్స్ సేన.. రెండో ఇన్నింగ్స్లో కూడా అదే తీరును కనబరిచింది. బోలాండ్, స్టార్క్, డాగెట్లు నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఆసీస్ ముందు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఉంచింది. అయితే తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్లో విఫలమైన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఫలితంగా మొదటి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. కాగా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి 10 వికెట్లు పడగొట్టిన స్టార్క్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. రెండో టెస్టు డిసెంబర్ 4 నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానుంది.పెర్త్ టెస్టు సంక్షిప్త సమాచారంఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 172/10టాప్ స్కోరర్ హ్యారీ బ్రూక్ (52)టాప్ బౌలర్ మిచెల్ స్టార్క్ (7/58)ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 132/10టాప్ స్కోరర్ క్యారీ(26)టాప్ బౌలర్ బెన్ స్టోక్స్ (5/23)ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 164/10టాప్ స్కోరర్: గస్ అట్కిన్సన్ (37)బెస్ట్ బౌలింగ్: స్కాట్ బోలాండ్ (4 వికెట్లు)ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్: 205/2టాప్ స్కోరర్: ట్రావిస్ హెడ్(123)చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?
న్యూస్ పాడ్కాస్ట్
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా?... సీఎం చంద్రబాబు
ఉప్పొంగిన అభిమానం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హైదరాబాద్లో ఘన స్వాగతం
మనమంతా సాయి మార్గంలో నడుద్దాం... శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
భద్రతాబలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మడివి హిడ్మా. ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోలు సైతం మృతి
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలోగా నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగ ఉండండి.
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
బిజినెస్
వందలాది ఇంజినీర్ల తొలగింపు: 2026లో మరోమారు!
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ 2025 అక్టోబర్ నెలలో 14,000 కంటే ఎక్కువ తొలగింపులను ప్రకటించింది. ఈ ప్రభావం క్లౌడ్ సర్వీసెస్, గ్రోసరీ, రిటైల్, ప్రకటనలకు సంబంధించిన విభాగాలపై మాత్రమే కాకుండా.. ఇంజినీర్ బృందాలపై కూడా పడింది.అమెజాన్ తొలగింపులలో 1,800 మంది ఇంజినీర్లు ఉన్నారని.. న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ లేఆఫ్స్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం ఉద్యోగుల తొలగింపులు 4,700 కంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇందులో 40 శాతం ఇంజినీర్లే ఉన్నట్లు.. వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ఫైలింగ్ల ద్వారా అమెజాన్ వెల్లడించింది. కాగా జనవరి 2026లో కూడా మరోసారి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!కంపెనీ ఖర్చులను తగ్గించడంలో భాగంగానే.. అమెజాన్ ఈ ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడం వల్ల.. మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీసే అవకాశం ఉందని 2025 జూన్లో సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 15.5 లక్షలు.
ఉద్యోగుల గ్రాట్యుటీకి ఇక ఏడాది చాలు..
కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రవేశపెట్టింది. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం.. అన్ని రంగాల్లోని ఉద్యోగులు ఇప్పుడు కేవలం ఒక సంవత్సరం సర్వీస్ ఉంటే చాలు గ్రాట్యుటీకి అర్హులు అవుతారు. దేశంలో ఇప్పటివరకూ ఉన్న 29 కార్మిక చట్టాలను ప్రభుత్వం నాలుగు సరళీకృత లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది.కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, విస్తృత సామాజిక భద్రతా కవరేజ్, మెరుగైన ఆరోగ్య రక్షణ అందించడమే ఈ మార్పుల లక్ష్యం. ఈ సంస్కరణలు అనధికారిక కార్మికులు, గిగ్ , ప్లాట్ఫామ్ వర్కర్లు, వలస కార్మికులు, మహిళా ఉద్యోగులు వంటి విభిన్న వర్గాలకు వర్తిస్తాయి.గ్రాట్యుటీ అర్హతలో భారీ మార్పుపేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం.. ఇప్పటిదాకా ఒక ఉద్యోగి ఐదు సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాతే గ్రాట్యుటీకి అర్హుడు. అయితే, కొత్త లేబర్ కోడ్ల అమలుతో నిర్ణీత కాలానికి అంటే రెండేళ్లకో.. మూడేళ్లకో ఒప్పందంపై చేరే ఉద్యోగులు (ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ (FTEs) కూడా ఇప్పుడు ఏడాది సర్వీస్ అనంతరం గ్రాట్యుటీకి అర్హత పొందుతారు.మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఈ మార్పు ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులతో సమాన హోదాలోకి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు కూడా శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే జీతాలు, సెలవు సదుపాయాలు, వైద్య ప్రయోజనాలు, సామాజిక భద్రతా పరిరక్షణలు పొందుతారు.గ్రాట్యుటీ అంటే..గ్రాట్యుటీ అనేది ఉద్యోగి దీర్ఘకాలిక సేవకు గుర్తింపుగా కంపెనీల యాజమాన్యాలు చెల్లించే ఆర్థిక ప్రయోజనం. సాధారణంగా, ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు, పదవీ విరమణ చేసినప్పుడు లేదా అర్హతగల సర్వీస్ కాలాన్ని పూర్తి చేసినప్పుడు ఈ మొత్తం చెల్లిస్తారు.లెక్కిస్తారిలా..ఉద్యోగికి చెల్లించే గ్రాట్యుటీ మొత్తం ఈ ఫార్ములాతో లెక్కిస్తారు. గ్రాట్యుటీ = (చివరిగా అందుకున్న వేతనం) × (15/26) × (సర్వీస్ కాలం సంవత్సరాల్లో)ఇక్కడ చివరిసారిగా అందుకున్న వేతనం అంటే బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ (DA) కలిపి తీసుకోవాలి.ఉదాహరణకు ఒక ఉద్యోగి 5 సంవత్సరాలు పనిచేసి చివరిగా బేసిక్, డీఏ కలిపి రూ.50 వేలు అందుకున్నారనుకుంటే.. గ్రాట్యుటీ రూపంలో సదరు ఉద్యోగి అందే మొత్తం రూ.1,44,230 అవుతుంది.
బిట్కాయిన్ క్రాష్: కియోసాకి షాకింగ్ ప్రకటన
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఫైనాన్షియల్ గురూ రాబర్ట్ కియోసాకి ఇటీవల తన దగ్గరున్న 2.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ.20 కోట్లు) విలువైన బిట్కాయిన్లను ఒక్కోటి సుమారు 90 వేల డాలర్ల (సుమారు రూ.80 లక్షలు) ధర వద్ద విక్రయించినట్లు వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం ఒక్కో బిట్కాయిన్ను 6 వేల డాలర్లకు కొనుగోలు చేసినట్లు తెలిపారు.క్రిప్టో మార్కెట్ గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, బిట్కాయిన్ (Bitcoin) తిమింగలం ఓవెన్ గుండెన్ 1.3 బిలియన్ డాలర్ల విలువైన బిట్కాయిన్లను అమ్మేసినట్లు చెబుతున్న క్రమంలోనే రాబర్ట్ కియోసాకి నుంచి కూడా ఈ ప్రకటన రావడం గమనార్హం. బిట్కాయిన్లపై బుల్లిష్గా ఉండే కియోసాకి కూడా ఆఫ్లోడింగ్కు వెళ్లడం క్రిప్టో ఇన్వెస్టర్లను షాక్కు గురి చేస్తోంది.రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ‘ఎక్స్’ పోస్టులో ఈ విక్రయం తన “లాభాలను స్థిరమైన, నగదు ప్రవాహం ఇచ్చే ఆస్తుల్లోకి మార్చే” దీర్ఘకాల వ్యూహాన్ని అనుసరించిందని చెప్పారు. బిట్కాయిన్ల విక్రయం ద్వారా వచ్చిన నగదుతో రెండు సర్జరీ సెంటర్లు, బిల్బోర్డ్ వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడులు వచ్చే ఫిబ్రవరి నాటికి నెలకు సుమారు 27,500 డాలర్ల పన్ను రహిత నగదు ప్రవాహం ఇవ్వగలవని ఆయన అంచనా.ఈ కొత్త పెట్టుబడులు, ఇప్పటికే తన వద్ద ఉన్న నగదు ప్రవాహం కలిగించే రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేస్తాయని, తద్వారా తన మొత్తం నెలవారీ ఆదాయం “వందల వేల డాలర్లకు” చేరుతుందని కియోసాకి చెప్పారు.బిట్కాయిన్లను అమ్మేసినప్పటికీ, దాని భవిష్యత్తుపై విశ్వాసం కోల్పోలేదని, ఈ కొత్త పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంతో మరిన్ని బిట్కాయిన్లను తిరిగి కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది బిట్కాయిన్ను విడిచిపెట్టడం కాదని, లాభాలను పన్ను ప్రయోజనాలు ఇచ్చే, పునరావృత ఆదాయం సృష్టించే ఆస్తుల్లోకి మార్చే తన దీర్ఘకాల తత్వం అమలులో భాగమని పేర్కొన్నారు.భద్రతా కారణాల వల్ల ఈ అమ్మకాన్ని బహిరంగంగా ప్రకటించవద్దని తనకు ఆప్తులు సలహా ఇచ్చినప్పటికీ, “నకిలీ డబ్బు, నకిలీ గురువుల ప్రపంచంలో, నేను బోధించేదాన్ని నేనూ అనుసరిస్తానని చూపడం ముఖ్యం” అని కియోసాకి రాసుకొచ్చారు. చివరగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళ దిశగా కదులుతోందని హెచ్చరిస్తూ, అందరూ తమ సొంత సంపద పెంపు వ్యూహాల గురించి ఆలోచించాల్సిన సమయం ఇదేననంటూ పిలుపునిచ్చారు.PRACTICING WHAT I TEACH:I sold $2.25 million in Bitcoin for approximately $90,000. I purchased the Bitcoin for $6,000 a coin years ago.With the cash from Bitcoin I am purchasing two surgery centers and investing in a Bill Board business.I estimate my $2.25 million…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 21, 2025
ఇదిగో ఇల్లు కొనాల్సింది ఇప్పుడే..
రాష్ట్రంలో కొంతకాలం వరకూ స్థిరాస్తి మార్కెట్ స్తబ్దుగా ఉంది. ఇటీవల ప్రభుత్వ పోత్సాహకర నిర్ణయాలు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు తదితరాలతో మార్కెట్ మళ్లీ గాడిలో పడుతోంది. ఇలాంటి సమయంలో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలంటే వేగవంతంగా విధానపరమైన నిర్ణయాలతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, క్రయవిక్రయాలు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఈ ప్రతికూల వాతావరణంలోనే ధరలు, వసతుల విషయంలో కస్టమర్లకు బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. నగదు లభ్యత కావాలి కాబట్టి డెవలపర్లూ అంగీకరించే వీలుంటుంది. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడి దారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్బుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.ఢోకా లేదు.. హైదరాబాద్లోని భౌగోళిక వాతావరణం, వనరులు, మౌలిక సదుపాయాలు, దేశ, విదేశీ సంస్థల కార్యాలయాలు.. ఇలా ఎన్నెన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్కు ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్లో గృహాల ధరలు, అద్దెలు, భూముల రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం వంటివి నగరానికి అదనపు అంశాలు. దీంతో పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఏమాత్రం అలసత్వం ఉండదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ మార్కెట్కు ఢోకా ఉండదు.ఇదీ చదవండి: ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!
ఫ్యామిలీ
దటీజ్ ఫాతిమా బాష్..! వివాదాలు, హేళనలే ఆమె బలం..
మిస్ యూనివర్స్ 2025 విజేతగా మిస్ మెక్సికో ఫాతిమా బాష్(25) కిరీటం దక్కించుకుని, టబాస్కో నుంచి గెలుపొందిన తొలి మహిళగా బాష్ చరిత్ర సృష్టించింది. నిజానికి ఈ కీరిటం అంత సులభంగా రాలేదు. పైగా ఆమె ఈ పోటీలో పాల్గొనే స్థాయికి చేరుకోవడానికి ఎన్నో హేళనలు, అవమానాలు, ధిక్కారాలను దాటుకుని వచ్చింది. తగ్గేదే లే అంటూ తాను ఎంత వరకు ఎఫెక్ట్ పెట్టాలో అంతా పెట్టి.. గెలుపుని పాదాక్రాంతం చేసుకుని శెభాష్ అనిపించుకుంది ఫాతిమా బాష్. నిజానికి ఫాతిమాని చిన్నప్పటి నుంచి స్కూల్లో తోటి విద్యార్థులు చులకనగా చూసేవారు. టబాస్కోలోని శాంటియాగో డి టీపాలో జన్మించిన ఆమెకు పుట్టుకతోనే స్లెక్సియా, ADHD అనే నాడి సంబంధిత సమస్యల ఉన్నాయి. దీని కారణంగా బాష్ చదువులో వెనకుండేది. సింపుల్గా చెప్పాలంటే మాట్లాడటంలో తడబాటు, ఒకచోట కుదురుగా కూర్చొని చదవలేని మానసిక సమస్య. ఆ సమస్యను చేధించి తానేంటో ప్రూవ్ చేసుకుని అందాల పోటీకి వస్తే..మళ్లీ ఇక్కడ కూడా వివాదం వెంటాడింది. ఆమె స్థానంలో మరొకరెవరైనా..తప్పుకునేవారేమో. ఇక్కడుంది ఫాతిమా కాదన్న వాళ్ల నోళ్లే మూయించేలా.. తడకా చూపించాలనుకుంది. అందుకే ఆ అవమానాలు, ధిక్కారాలను బలంగా మార్చుకుని విజయం తన ముంగిట్లోకి వచ్చేలా చేసుకుని యావత్తు ప్రపంచం తనవైపు చూసేలా చేసుకుంది. ఇంతకీ ఫాతిమా బాష్కు అందాల పోటీలో ఎదురైన వివాదం ఏంటంటే..ఈ అందాల రాణి అంత సులభంగా కిరీటాన్ని తన ఖాతాలో వేసుకోలేదు. ఎందుకంటే మిస్ యూనివర్స్2025 సాష్ వేడుకల్లోనే ఆమెకు అవమానం, బెదిరింపులు ఎదురయ్యాయి. మొత్తం ప్రపంచ దేశ సుందరీమణుల అందరి ముందు ఘోరంగా అవమానపాలైంది. సాక్షాత్తు మిస్ యూనివర్స్పోటీల అధికారి నవాత్ ఇత్సారగ్రిసిల్ ఆమెను నిందించడం బాధకరం. అంతేగాదు ఒక మహిళగా తన వ్యక్తిత్వాన్నే కించపరిచేలా సోషల్ మీడియా లైవ్స్ట్రీమింగ్లో ఆయన ఇలా వ్యాఖ్యానించడం అందర్ని విస్తుపోయేలా చేసింది. దాంతో ఒక్కసారిగా ఫాతిమాకు సోషల్మీడియా నెటిజన్లతో సహా తోటి సుందరీమణులు మద్దతు వెల్లువెత్తింది. ఆ అధికారి దృష్టిలో ఇక్కడ బాష్ చేసిన తప్పిదం ఏంటంటే..అందాల పోటీలు జరుగుతున్న ధాయిలాండ్ గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయకపోవడం, అలాగే తన జాతీయ అధికారి మాటలనే ఆదేశిస్తుందనేది నవాత్ ఇత్సారగ్రిసిల్ ఆరోపణలు. ఆనేపథ్యంలోనే ఆమెను దారుణంగా అవమానిస్తూ దుర్భాషలాడాడు. ఆఖరికి ఆమె పోటీ నుంచి నిష్క్రమించేలా పరిస్థితి తారాస్థాయికి చేరుకుంది. ఇదేం పద్దతి అంటూ మిస్ యూనివర్స్ పోటీలపై సర్వత్రా విమర్శలు రావడంతో మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబెట్టింది. అంతేగాదు ఈ ఘటనకు క్షమాపణు చెప్పడమే గాక సదరు అధికారికి చీవాట్లు సైతం పెట్టింది. ఈ పోటీల్లో అతడు జోక్యం ఉండదని నామామాత్రంగానే న్యాయనిర్థేధికారిగా ఉంటాడని వివరణ కూడా ఇచ్చింది. ఇంతటి పరిస్థితుల్లో కూడా ఆమె మీడియా ముందు..ఒక మహిళగా తనకు గౌరవం ఇవ్వలేదని, తన దేశ జాతీయుడితో ఉన్న సమస్యను..నాతో ముడివేసి ఆ అధికారి ఇబ్బందులకు గురిచేశాడని ధైర్యంగా చెప్పింది. అంతేగాదు తనెనెవరు ఈ పోటీల్లో పాల్గొనకుండా చేయలేరు, కిరీటం దక్కించుకోకుండా చేయలేరు అని నర్మగర్భంగా చెప్పి అందర్ని విస్మయానికి గురి చేసింది. ఆ తర్వాత జరిగిన ప్రతి పోటీలోనూ తన దైన శైలిగా న్యాయనిర్థేతలను, ప్రేక్షకులను మెప్పించింది. ఆఖరికి క్వశ్చన్ రౌండ్లో కూడా ప్రపంచ వేదికపై మహిళలు తమ గొంతున వినిపించి..మార్పు తీసుకురావాలని శక్తిమంతంగా సమాధానమిచ్చి జడ్జీల మన్ననలను అందుకుంది. ఊహించని ఝలక్..!థాయ్లాండ్లోని నోంతబురి నగరంలో అంగరంగవైభవంగా ఈ గ్రాండ్ ఫినాలే జాలిస్కో, లోపెజ్, ఫెర్నాండా ప్యూమా, ఎమిరే అరెల్లానో, ఎలెనా రోల్డాన్ వంటి అందాల భామలతో తలపడింది బాష్. వివాదంలో నిలిచింది కాబట్టి బాష్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అంతా మిస్ జాలిస్కోదే కిరీటం అనుకున్నారు. అయితే అక్కడ న్యాయనిర్థేతలు అనూహ్యంగా ఫాతిమా బాష్ను మిస్ యూనివర్స్గా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మీడియా ముందు చెప్పినట్లుగానే కిరీటం దక్కించుకుంది కదా అంటూ..అందరూ సాహో రాణి అని కీర్తించారు. చిన్నప్పుడూ మాటల్లో స్పష్టత లేక తడబడి అల్లాడిన ఆ చిన్నారే..ఆ మానసిక సమస్యను బలంగా మార్చుకుని తన గొంతు విప్పి..తనను కాదన్న వాళ్లని ఒక్క గెలుపుతో నోరూమూయించింది. అంతేగాదు అవమానాలు, చీత్కారాలు గెలుపుకి ఆటంకాలు కాదు బలం అని చాటి చెప్పి స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: మిస్ యూనివర్స్గా ఫాతిమా బాష్)
పేదింటమ్మ పెద్ద మనసు
‘ధనానికి పేదను కావచ్చుగానీ గుణానికి కాదు’ అన్నట్లుగా ఉంటుంది కొందరి ధోరణి. వారి గుణంలోనే దానగుణం ఉంటుంది. అలాంటి ఒక మహిళ ఆత్రం లేతుబాయి.ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం సహేజ్ గ్రామానికి చెందిన లేతుబాయి తనకు ఉన్న మూడెకరాల స్థలంలో ఒక ఎకరం స్థలాన్ని పది కోలాం కుటుంబాలు ఇళ్లు కట్టుకోడానికి ప్రభుత్వానికి దానంగా ఇచ్చింది...ఆత్రం లేతుబాయి... అడవులను, చెట్టుపుట్టలనూ నమ్ముకొని జీవిస్తోంది. వ్యవసాయమే జీవనాధారంగా అతిసాధారణ జీవితాన్ని గడుపుతోంది. బాహ్య ప్రపంచం, ఆధునిక పోకడలు అస్సలు తెలియని అలాంటి మహిళపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కారణం... దుబ్బగూడ గ్రామంలో పది కొలాం కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. స్థలం లేకపోయినప్పటికీ ప్రత్యేక నిబంధనలతో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది. మంజూరైతే చేశారు గానీ ఆ ఇండ్లను కట్టేందుకు స్థలం అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో ఆత్రం లేతుబాయి తన భర్త జంగు, ముగ్గురు కుమారులతో చర్చించింది. తన పేరిట ఉన్న మూడెకరాల నుంచి ఒక ఎకరం ప్రభుత్వానికి అందజేసింది.లేతుబాయి గతంలో కూడా ఇలానే తమ బంధువులు కొంతమందికి పూరిగుడిసెలు వేసుకునేందుకు చోటు కల్పించింది. ‘మా కొలాం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నాయి. పక్కా ఇల్లు అనేది మాకు కల లాంటిది. అది నిజమైతే మా జీవితాలు మారుతాయి. అందుకే మాకు ఉన్న మూడు ఎకరాల్లో ఒక ఎకరం ఇచ్చాను’ అంటుంది 56 సంవత్సరాల లేతుబాయి. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా లేతుబాయి–జంగు దంపతులను ఘనంగా సన్మానించారు. లేతుబాయి నిర్ణయం ఎందరికో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. – గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్, ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి
మహిళల మానసిక ప్రపంచంలోకి...
ఉత్తరాన కశ్మీర్ నుండి దక్షిణాన మలయాళం వరకు, పశ్చిమాన రాజస్థానీ నుంచి తూర్పున అస్సామీ వరకు ‘బ్యాండెజ్ట్ మూమెంట్స్’ పుస్తకంలో ఎంతోమంది మహిళల గొంతులు వినిపిస్తాయి. మానసిక ఆరోగ్యం నుంచి సామాజిక శ్రేయస్సు వరకు ఎన్నో అంశాలపై పదిహేను భారతీయ భాషలలో, మూడు మాండలికాలలో (మార్వారీ, మాగహి, భోజ్పురి) మహిళలు రాసిన కథల ఇంగ్లీష్ అనువాదం... బాండెజ్ట్ మూమెంట్స్ పేరుతో ముందుకు వచ్చింది.ఉపాధ్యాయులైన ఇద్దరు మహిళలు ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. పేదరికం మాత్రమే కాదు మానసిక అనారోగ్యం కూడా పెద్ద సమస్యే అని చెబుతాయి ఈ పుస్తకంలోని కథలు. ఆందోళన, నిరాశ, అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (వోసిడి), స్కిజోఫ్రేనియా...మొదలైన వాటి గురించి రచయిత్రులు తమ జీవితానుభవాల నుంచి చెప్పిన కథలు ఇందులో ఉన్నాయి.గ్లాస్ వాల్స్ (తమిళ్), ప్లైయింగ్ షిష్ (అస్సామీ), ది టేల్ ఆఫ్ ది టాయిలెట్ (కన్నడ), కన్వర్ట్ మై బ్యాడ్ కర్మ టు గుడ్ (హిందీ)... మొదలైన కథలు స్త్రీలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల గురించి రాసినవే.మానసిక ఆరోగ్యం కూడా ఒక సామాజిక సమస్య అని, అది వివక్షతకు గురవుతుందని చెప్పే కథలు... ఓ మై టెనిఫాక్టర్ (మైథిలి), గర్ల్ ఇన్ ది డాల్హౌస్ (పంజాబీ)... మొదలైనవి.అబ్సెషన్ అనేది వ్యక్తి యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. విసియస్ సైకిల్ (గుజరాతి), ది స్మెల్ ఆఫ్ న్యూస్ (మలయాళం), బ్రేకింగ్ అవుట్ (ఉర్దూ), బోర్డర్ లైన్ (బెంగాలీ) అనేవి అబ్సెషన్ కేంద్రంగా నడిచే కథలు. క్రేజీ రివర్ (ఒడియా) అనేది మాట్లాడాలనే కోరికను, ఉత్సాహాన్ని కోల్పోయిన మహిళ కథ. ది షాడో (ఒడియా) ఒక మహిళ మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణించడాన్ని గురించి చెబుతుంది. ది ఎల్లో రోజ్ (ఉర్దూ) మానసిక సమస్యల్లో ఉన్న వారి ఒంటరితనం గురించి చెబుతుంది.
World Television Day: చిత్రలహరి వస్తుంది పద...
కొద్దిగా ఉన్నప్పుడే బాగుండేది. టీవీ ఉన్న ఇంటికి టీవీ లేని వాళ్లంతా వచ్చి కూచునేవారు. ఆదివారం రామాయణం కోసం ప్రతి ఇల్లూ ఆతిథ్యం ఇచ్చేది. చిత్రలహరికి గడప బయట నిలబడి తొంగి చూసే పిల్లల్ని అదిలించేవారు కాదు. ఇంటి పైన యాంటెనా, ఇంట్లో డయనారా అదీ హోదా అంటే. టెలివిజన్ జీవితంలో భాగం అయిన రోజులు బాగుండేవి. ఇవాళ జీవితమంతా టీవీగా మారి ఊపిరి సలపడం లేదు. టీవీ వచ్చిన రోజులకూ ఇప్పటికీ ఎంత తేడా!సినిమా తెర మీద కాకుండా మరో తెర మీద, అదీ ఇంట్లో ఉండే తెర మీద బొమ్మ పడుతుందని ఊహించని రోజుల్లో టెలివిజన్ వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నాటి హైద్రాబాద్, లేదా మద్రాస్ (చెన్నై), లేదా కొండపల్లి నుంచి సిగ్నల్స్ సరిగా ఆ రోజుకి అందాయో ఇక పండగే పండగ. ఎందుకు పండగ? సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు ఆ తెలుపు నలుపు టీవీలో ఏదో ఒకటి ఉచితంగా ప్రసారం అవుతూ ఉంటుంది. చూడొచ్చు. అందుకని.సమయం ఉన్న రోజులుమన దేశంలో 1959లో టెలివిజన్ మొదలైనా సరైన ప్రసారాలు రూపుదిద్దుకోవడానికి 1976కి కాని సాధ్యపడలేదు. నగరాలను దాటి ఊళ్లకు సిగ్నల్ అందే వ్యవస్థ ఏర్పడటానికి మరో పదేళ్లు పట్టింది. కలర్ ప్రసారాలు 1982లో మొదలైనా 1990లకు గాని కలర్ టీవీలు కొనే శక్తి ఊళ్లల్లో ఏ కొద్దిమందికో తప్ప అందరికీ రాలేదు. ఏతా వాతా 1985 నుంచి తెలుపు, నలుపు టీవీ ప్రసారాలు తెలుగు ప్రేక్షకులకు తెలుస్తూ వచ్చాయి. ఆ రోజుల్లో మనుషులందరి దగ్గరా ఎక్కడ లేని తీరిక, సమయం. కాబట్టి టీవీ ఆన్ చేసి అర్థమైనా కాకపోయినా చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. ఇక అందులో ఆసక్తికరమైన కార్యక్రమాలు మొదలయ్యాక అతుక్కుపోయారు. టెలివిజన్ చేసిన మొదటి పని ఏమిటంటే– దేశ వాసులందరికీ ఒకే టీవీ ఒకే వినోదం అనే భావన కలిగించడం. ప్రాంతీయ ప్రసారాలు ఉన్నా ముఖ్యమైన మీట ఢిల్లీలో ఉంటుందని అందరికీ తెలియచేయడం. కేంద్ర శక్తిని స్థాపించడంలో టెలివిజన్ ముఖ్య పాత్ర పోషించింది.రామాయణం సంచలనం1987 నుంచి మొదలైన ‘రామాయణం’ సీరియల్ టెలివిజన్ పవర్ ఏంటో దేశానికి చాటింది. వ్యాపార ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో వెల్లువెత్తడం కూడా మొదలయ్యాయి. అంతవరకూ టికెట్ ఇచ్చి సినిమా హాల్లో రామాయణం చూసిన జనం ఈ ఉచిత రామాయణాన్ని తండోపతండాలుగా చూశారు. ఆ తర్వాత ‘మహాభారత్’, ‘హమ్లోగ్’, ‘నుక్కడ్’, ‘ఉడాన్’, ‘మాల్గుడీ డేస్’... ప్రేక్షకులకు అందమైన డేస్ మిగిల్చాయి.చిత్రహార్–చిత్రలహరిప్రతి బుధవారం వచ్చే హిందీ పాటల ‘చిత్రహార్’, శుక్రవారం వచ్చే ‘చిత్రలహరి’ సూపర్హిట్ ఆదరణ పొందాయి. జనం తెలుగు పాటల కోసం టీవీల ముందు కొలువు తీరేవారు. ఆ రోజుల్లో ప్రతివారం ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ 1988) పాట తప్పనిసరిగా ఉండేది. పండగల ముందు ఆయా పండగలకు తగ్గట్టుగా పాటలు ఉండేవి. అదే సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ‘ఆనందో బ్రహ్మ’ సూపర్హిట్ అయ్యింది. ఆదివారం రోజు అతి పాత తెలుగు చిత్రం వచ్చినా జనం విరగబడి చూసేవారు.అపురూప క్షణాలుఇంటి పైనా యాంటెనా, ఇంట్లో టీవీ ఉండటం ఎంతో గొప్పయిన రోజులు అవి. ఇక కలర్ టీవీ ఉన్న ఇంటికి డిమాండ్ జాస్తిగా ఉండేది. వాన వచ్చినా, గాలి వీచినా నిలువని బొమ్మతో వేగినా అదే పెద్ద సంబరం. ఇన్స్టాల్మెంట్లో కొని ఇంటికి టీవీ తెచ్చిన రోజు పండగ ఉండేది. మధ్యతరగతి జీవులకు తగినట్టుగా ‘మినీ టీవీ’లు కంపెనీలు తెచ్చాక వాటితోనే సర్దుబాటు చేసుకున్న సన్నజీవులెందరో. దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్తో సహా దూరదర్శన్ అందరికీ అభిమాన పాత్రమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా సబ్టైటిల్స్తో చూసేవారు. అలా ఎన్నో ఉత్తర కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు చూశారు. టీవీ ప్రసారాల వల్ల ఇరుగిల్లు పొరుగిల్లు ఒకే ఇల్లయినట్టుగా అందరూ కలిసి మెలిసి ఉండేవారు. టీవీలో క్రికెట్ లైవ్ చూడటానికి ఎంతో మంచిగా వ్యవహరించాల్సి వచ్చేది. స్నేహాలు చేయాల్సి వచ్చేది.ఇప్పుడు చేతిలో ఫోన్. అనుక్షణం రీల్స్. చేతిలోనే కదిలే బొమ్మ. దేనికీ విలువ లేదు. ఓటీటీల్లో వందల సినిమాలు ఉన్నా దేనిని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఏదీ నచ్చదు. కానీ ఆ రోజుల్లో వచ్చిందే నచ్చేది. అతిగా లభ్యమైనది ఏదైనా విలువ కోల్పోతుంది. ఇవాళ విజువల్ ఎంటర్టైన్మెంట్ వేయి రూ పాలు సంతరించుకున్నా, ఇరవై నాలుగ్గంటల న్యూస్ చానల్స్ ఉన్నా అవన్నీ జల్లెడలో జారే ఊకలానే ఉంటున్నాయి. టెలివిజన్ ప్రసారాల ప్రొఫెషనలిజమ్, హుందాతనం, ఆ న్యూస్రీడర్లు, ఆ యాంకర్లు... ఆ మాట... ఉచ్చారణ... పలుకు... ఇప్పుడెక్కడ. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది.
అంతర్జాతీయం
వైరల్ వీడియో: బంగ్లాదేశ్లో భూకంపం.. భారత్ ప్రకంపనలు
ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. బంగ్లా రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. భూకంపం ప్రకంపనల కారణంగా బంగ్లాదేశ్లో పలు భవనాలు కూలిపోయాయి.. దీంతో, ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల ప్రకారం.. బంగ్లా రాజధాని ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్డిలో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. పేర్కొంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఈ ప్రకంపనల ధాటికి భారత్లోనూ భూమి కంపించింది. కోల్కతా (Kolkata) సహా ఉత్తర భారతంలో (Northeast India) ప్రకంపనలు నమోదయ్యాయి. కోల్కతాలో ఉదయం 10:10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. బెంగాల్లోని కూచ్బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్పూర్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గువాహటి, అగర్తల, షిల్లాంట్ వంటి నగరాల్లోనూ భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.🚨🇧🇩 BREAKING: BANGLADESH ROCKED BY 6.0 EARTHQUAKE A magnitude 6.0 earthquake struck Bangladesh early Friday, shaking the densely populated region around Dhaka.The quake hit at 4:38 GMT at a depth of 36 kilometers, with its epicenter roughly 28 kilometers northeast of the… pic.twitter.com/LC1w1RrS3z— Mario Nawfal (@MarioNawfal) November 21, 2025మరోవైపు.. ఈ భూకంపం కారణంగా బంగ్లాదేశ్-ఐర్లాండ్ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కు అంతరాయం కలిగింది. ప్రకంపనలతో కొన్ని నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత కొనసాగించారు. అయితే, ఈ విపత్తులో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Reportedly there is a Strong earthquake in Bangladesh, hope everyone is safe. 🇧🇩 pic.twitter.com/2spGn9yUnB— Kashif (@KashifNdmCric) November 21, 2025 #WATCH | A 5.5-magnitude earthquake struck near Narsingdi in Bangladesh, this morning.Visuals from Dhaka as the agencies work to restore damages caused by the tremors. pic.twitter.com/rqHmCggN3L— ANI (@ANI) November 21, 2025
విశ్వ సుందరి ఫాతిమా
బ్యాంకాక్: మెక్సికో భామ ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ 2025 సంవత్సరానికి గాను విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో 74వ మిస్ యూనివర్స్ పోటీలు కన్నుల పండువగా జరిగాయి. వివిధ దేశాల నుంచి 120 మంది సుందరీమణులు పాల్గొన్నారు. 25 ఏళ్ల ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ అన్ని రౌండ్లలో నెగ్గి విశ్వసుందరిగా అవతరించింది. మిస్ థాయ్లాండ్ ప్రవీనర్ సింగ్(29) మొదటి రన్నరప్గా ఘనత సాధించింది. మిస్ వెనెజువెలా స్టెఫానీ అడ్రియానా అబాసలీ నసీర్(25) మూడో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన మణికా విశ్వకర్మ కిరీటం దక్కించుకోలేకపోయారు. టాప్–12 స్థానానికి సైతం ఆమె చేరుకోలేకపోయారు. మిస్ యూనివర్స్–2025 పోటీలకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించడం విశేషం. View this post on Instagram A post shared by Miss Universe (@missuniverse)మేమంతా కలిసికట్టుగా చరిత్ర సృష్టిస్తాం మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా తుది రౌండ్లో జడ్జిలు అడిగిన ప్రశ్నకు ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ చెప్పిన సమాధానం అందరినీ మెప్పించింది. ప్రస్తుత ఆధునిక యుగంలో మీరు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పర్చడానికి ఈ కిరీటాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు? అని ప్రశ్నించగా.. ‘‘భద్రత, సమాన అవకాశాల విషయంలో నేటి మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ వారు తమ భావాలను వ్యక్తం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. నేటితరం మహిళలు మార్పును కోరుకుంటున్నారు. మా గళాన్ని వినిపించడానికి, మార్పును ఆహా్వనించడానికి ఇక్కడికి వచ్చాం. మేమంతా కలిసికట్టుగా చరిత్ర సృష్టిస్తాం’’ అని ఫాతిమా దృఢంగా బదులిచ్చి విజేతగా నిలిచింది. ఫాతిమా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అభ్యసించారు. స్కూల్లో చదువుకుంటున్న సమయంలో డిస్లెక్సియా, హైపర్ యాక్టివిటీ డిజార్డర్తో బాధపడ్డానని గతంలో ఆమె చెప్పారు. చిన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, చివరకు సేవా మార్గంలో నడిచానని అన్నారు. మిస్ యూనివర్స్ విజేతకు 2.50 లక్షల డాలర్ల నగదు బహుమతి అందజేస్తారని సమాచారం. అంతేకాకుండా ప్రతినెలా 50 వేల డాలర్ల చొప్పున వేతనం కూడా అందుకోవచ్చు.
ఆయనవి అనవసరపు వ్యాఖ్యలు.. రమఫోసాపై వైట్హౌజ్ ఆగ్రహం
అమెరికా దక్షిణాఫ్రికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. జీ20 సదస్సు నేపథ్యంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కీలక వ్యాఖ్యలు చేయగా.. వాటిపై వైట్హౌజ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆయన అనవసరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడుతోంది.జీ20 సమావేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల్ని ఊచకోత కోస్తున్నారని.. అందుకే ఆ గడ్డపై జరగబోయే సదస్సుకు తాను, తన బృందం హాజరుకాబోదని చెప్పారాయన. అయితే.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా తాజాగా మరో ప్రకటన చేశారు.అమెరికా చివరి నిమిషంలో మనసు మార్చుకుందని.. జీ20 సమావేశాలకు హాజరు కాబోతోందని.. ఇది సానుకూల పరిణామం అని ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. ‘‘ఒక దేశం మరొక దేశాన్ని బలవంతపెట్టకూడదని.. ఏ దేశం మరొక దేశాన్ని బెదిరించలేదని.. అమెరికా నిర్ణయంతో జీ20 సదస్సుపై ఎలాంటి ప్రభావం ఉండబోదు’’ అని అన్నారు. దీంతో ట్రంప్కే ఆయన వార్నింగ్ ఇచ్చారంటూ కథనాలు వెలువడ్డాయి.ఈ వ్యాఖ్యలపై తాజాగా వైట్హౌజ్ స్పందించింది. ‘‘ఆయన అనవసరపు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్, ఆయన బృందం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని వ్యాఖ్యానించింది. జోహెనెస్బర్గ్లో జరగబోయే జీ20 సమావేశంలో అమెరికా పాల్గొనబోదు. అమెరికా రాయబారి కేవలం హ్యాండోవర్ కార్యక్రమానికి హాజరవుతారు. అంతేగానీ అధికారిక చర్చల్లో పాల్గొనరు’’ అని వైట్ హౌస్ సెక్రటరీ కారోలిన్ లేవిట్ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా G20 ప్రాధాన్యతలు (తక్కువ ఆదాయ దేశాల అప్పు సమస్య, న్యాయమైన ఎనర్జీ మార్పు, ఖనిజ వనరుల వినియోగం) అమెరికా విధానాలకు విరుద్ధమని, అందువల్ల ఏకాభిప్రాయం సాధించలేమని అమెరికా రాయబారి కార్యాలయం మరో ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. COP30 వాతావరణ సమావేశాన్ని సైత అమెరికా బహిష్కరించింది.రెండు దేశాల మధ్య ఎందుకీ వివాదందక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1994 వరకు వర్ణవివక్ష విధానం కొనసాగింది. తెల్లవాళ్లకు (white minority) అధిక హక్కులు, అధికారం ఉండేది. నల్లజాతీయులు (Black majority) సొంతగడ్డపైనే వివక్షను ఎదుర్కొనేవారు. 1994లో నెల్సన్ మండేలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఈ వివక్షకు ఫుల్స్టాప్ పడి సమానత్వం మొదలైంది. అయితే..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై చాలాకాలంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైన కొన్నిరోజులకు.. ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను వైట్హౌజ్కు రప్పించుకుని మరీ శ్వేత జాతీయుల్ని ఊచకోత కోస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కొన్ని ఫొటోలను ఆయన చూపించారు(వాటిలో చాలావరకు తప్పుడు ఫొటోలు అని ఫ్యాక్ట్ చెక్లో తేలింది).తాజాగా.. ఆ దేశంలో ఉన్న తెల్లజాతీయుల్ని నల్లజాతీయుల్ని హత్యలు చేస్తూ.. వాళ్ల భూములు, పొలాలు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సు నిర్వహించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అయితే.. ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ దేశంలో వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత కూడా శ్వేత జాతీయులు ఆఫ్రికన్ల కంటే మెరుగైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారంటూ చెబుతోంది.దక్షిణాఫ్రికాపై సుంకాలునిరాధార ఆరోపణలు చేస్తున్న ట్రంప్.. దక్షిణాఫ్రికా రాయబారిని బహిష్కరించారు. ఆ ఆఫ్రికా దేశంపై 30% వాణిజ్య సుంకాలు విధించారు. అయితే అమెరికా ప్రభుత్వ బహిష్కరణ ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికాలో అమెరికా కంపెనీలు కార్యకలాపాలు(సుమారు 600 కంపెనీలు) యధావిధిగా కొనసాగుతున్నాయి. జోహానెస్బర్గ్లో జరిగిన Business 20 (B20) సమావేశంలో అమెరికా కంపెనీలు చురుకుగా పాల్గొన్నాయి. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు సుజాన్ క్లార్క్ ఆ సందర్భంలో దక్షిణాఫ్రికా నాయకత్వాన్ని ప్రశంసించడం గమనార్హం.దక్షిణాఫ్రికా పర్యటనకు మోదీ జీ20 సమావేశాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. ఇందులో 40దేశాలు పాల్గొనబోతున్నాయి. భారత్ తరఫున హాజరయ్యేందుకు ప్రధాని మోదీ ఈ వేకువజామున దక్షిణాఫ్రికాకు బయల్దేరారు.
Brazil: ఐరాస కాప్30 సదస్సులో అగ్నిప్రమాదం
బెలెం: బ్రెజిల్లోని బెలెం నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి COP30 వాతావరణ సదస్సు ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలక సమావేశాలు జరిగే "బ్లూ జోన్"లో ఈ ప్రమాదం జరగడంతో వేలాది మందిని తరలించారు. అగ్ని ప్రమాదం సందర్బంగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే వారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. They chopped down acres of old growth Amazonian rain forest to hold this COP30 event. Then it catches fire. 😂 Absolute metaphor for how the fake climate agenda is burning down.We need more CO2 to feed plants, not less.#COP30 pic.twitter.com/WqZpT2Zm4j— Bruce (@bruce_barrett) November 20, 2025వివరాల ప్రకారం.. బ్రెజిల్లో ఐక్యరాజ్యసమితి COP30 వాతావరణ సదస్సు జరుగుతోంది. ఈ సమావేశంలో దాదాపు 200 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ వాతావరణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి సంధానకర్తలు ప్రయత్నిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ పెవిలియన్ వద్ద మంటలు చెలరేగి భవనం గోడలు, పైకప్పును కప్పి ఉంచిన ఫాబ్రిక్ షెల్ పైకి వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో 13 మంది గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.#COP30 in #Belem has been a logistical nightmare. I hope lessons can be learnt from this experience @Cop30noBrasil pic.twitter.com/z9XvJrtEYD— Elizabeth Gulugulu (@lizgulaz) November 20, 2025ఇక, అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేవలం ఆరు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, విద్యుత్ పరికరాలు, మైక్రోవేవ్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
జాతీయం
త్యాగాలకు కూడా ఓ హద్దు ఉంటుంది!
ఆయన పార్టీ కోసం ఎంతో చేశారు. అలాంటి వ్యక్తిని మోసం చేయడం వెన్నుపోటు కిందే లెక్క. త్యాగాలకు కూడా ఓ హద్దు ఉంటుంది. అది దాటితే పరిస్థితులు మరోలా మారతాయ్.. డీకే శివకుమార్ వర్గీయులు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల సారాంశం ఇది. శనివారం కర్ణాటక పవర్ పాలిటిక్స్ ఎపిసోడ్కు పుల్స్టాప్ పడుతుందనే ప్రచారం వేళ.. ఈ తరహా పోస్టులు కుప్పలుగా కనిపిస్తున్నాయక్కడి గ్రూపుల్లో!.. కర్ణాటకలో నాయకత్వం మార్పు కోరుతూ అధికార పార్టీ రాజకీయం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం చేయాలంటూ ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే డజను మంది ఎమెల్యేలు ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి తమ గళం వినిపించారు. ఇవాళ బెంగళూరు పర్యటనలో ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మరోసారి కలవాలనుకుంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయని డీకే శివకుమార్ మాత్రం గప్చుప్గా జైల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ములాఖత్కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆయన త్యాగాలకు అంతే లేదా?.. బిహార్ ఎన్నికల ఫలితంతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో రాజకీయ సంక్షోభాన్ని కోరుకోవడం లేదు. అందుకే నాయకత్వ మార్పు ఉండదనే సంకేతాలను కాంగ్రెస్ వర్గాలకు పంపిస్తోంది. ఇది సిద్ధరామయ్య వర్గీయులకు ఊరట ఇచ్చే విషయమే. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గం మాత్రం అధిష్టానంపై ఒత్తిడి పెంచాలనే చూస్తోంది. సోషల్ మీడియాలో వినూత్న ప్రచారానికి దిగింది. ఆయనపై సింపథీ పెంచేందుకు గత త్యాగాలను గుర్తు చేస్తోంది. డీకే త్యాగాల ట్రాక్ రికార్డుడీకే శివకుమార్.. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలోకి అడుగుపెట్టి 1989లో తొలిసారి సతనుర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నెగ్గారు. యువ నాయకుడిగా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. రెండో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎస్ఎం కృష్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే ఉన్నారాయన. 2004–2013 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉంది. ఆ సమయంలో పార్టీని నిలబెట్టడానికి డీకే శివకుమార్ విశేషంగా కృషి చేశారు. ఆ సమయంలోనే సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు చేయాలంటూ అనుచరులు ఒత్తిడి చేసినా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ వాళ్లకు సర్దిచెప్పారు. ఈలోపు 2014–2019 మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో సిద్దూ సర్కార్లో మంత్రిగా పని చేశారు సిద్ధరామయ్య. అయితే.. 2019లో ED (Enforcement Directorate) దర్యాప్తు కారణంగా మంత్రిత్వ పదవి కోల్పోయారు. ఆ సమయంలో తన వ్యక్తిగత భవిష్యత్తును పక్కన పెట్టి, పార్టీ కోసం త్యాగం చేశారు.అలా ట్రబుల్ షూటర్గా దేశవ్యాప్తంగా..2019లో.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా.. ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకున్నారు డీకే శివకుమార్. అలా “ట్రబుల్ షూటర్”గా ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆపై 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(KPCC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్నివిధాల కృషి చేశారు. అక్కడి నుంచి 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన పేరు దేశం మొత్తం వినిపించింది. అయితే తన అనుచరులు ఆయనను ముఖ్యమంత్రి కావాలని కోరినా.. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించారు.కష్టపడి.. త్యాగాలు చేసినవాళలకు ఆశలు ఉండడం సహజమేనని.. అయినా తనకు పార్టీ నిర్ణయమే తుదిదని చెబుతూ వస్తున్న డీకేకు ఇప్పుడు మద్దతు పెరుగుతోంది. తొలి నుంచి చేస్తున్న త్యాగాలు.. పార్టీ బలోపేతం కోసం చేసిన ప్రయత్నాలు.. ప్రభుత్వం కుప్పకూలకుండా చూసిన వైనం.. పార్టీ గెలుపు కోసం చేసిన కృషి, చివరకు ప్రత్యర్థులు ఎంత ఆశ చూపినా.. అధికారం కంటే పార్టీనే ముఖ్యమనుకుంటున్న ఆయన నిజాయితీతో కూడిన రాజకీయానికి పార్టీ తగిన న్యాయం చేయాలని మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు.
నూడుల్స్ ప్యాకెట్లో బల్లి
చెన్నై: తిరుపూర్ సమీపం కున్నత్తూర్లోని దొరవలూర్ రోడ్డుకు చెందిన ఆనందకుమార్(35) పాఠశాల ముగించుకుని ఇంటికి వచ్చిన తన పిల్లలకు వంట చేయడానికి అదే ప్రాంతంలోని ఒక కిరాణా దుకాణం నుండి ప్రముఖ బ్రాండ్ నుంచి నూడుల్స్ ప్యాకెట్ను కొనుగోలు చేశాడు. నూడుల్స్ వండడానికి ప్యాకెట్ను తెరిచినప్పుడు, నూడుల్స్లో చనిపోయిన బల్లి తల ఇరుక్కుపోయి ఉండడం చూసి అతను దిగ్భ్రాంతి చెందాడు. ఆ తర్వాత నూడుల్స్కు అంటుకున్న బల్లి చనిపోయిన తలను వీడియో తీసి తన స్నేహితులకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అయి సంచలనం సృష్టించింది. ప్రముఖ బ్రాండ్ కంపెనీలు ఆహార ఉత్పత్తులను అమ్ముతున్నాయని కొందరు సామాజిక కార్యకర్తలు అంటున్నారు. మానవ శ్రమకు బదులుగా ఆధునిక యంత్రాలను ఉపయోగించి తయారు చేసే ఆహార ఉత్పత్తులలో ఇటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ప్రసిద్ధ కంపెనీల ప్యాకెట్లు ప్లాస్టిక్తో తయారు చేయబడినందున, ఆహార ఉత్పత్తులను తిన్న తర్వాత ప్రజలు వివిధ శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ కవర్లను విసిరేయడంతో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వ్యర్థాల నిర్వహణలో స్థానిక అధికారులకు భారీ సమస్య ఏర్పడుతుంది. ఆహార ఉత్పత్తులను ఇలా ప్యాకేజ్ చేసి విక్రయించే సంస్థలతో కలిగే ప్రమాదాలను ఆహార భద్రతా శాఖ నియంత్రించాలని వారు అన్నారు.
రెండు రోజుల్లో ఇద్దరు.. మరో విద్యార్థిని ఆత్మహత్య
ముంబై: ఢిల్లీలో విద్యార్థి శౌర్య పాటిల్ మృతి ఘటన మరువక ముందే మహారాష్ట్రలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ఎనిమిదో తరగతి విద్యార్థిని(13) పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సీఐ సందీప్ భారతీ తెలిపిన వివరాల ప్రకారం.. జల్నా నగరంలోని CTMK గుజరాతీ విద్యాలయంలో ఆరోహి దీపక్ బిట్లాన్(13) ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రతీరోజు మాదిరిగానే ఆమె.. శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అనంతరం, ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకింది. దీంతో, వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి తర్వాత.. సివిల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే బాధితురాలు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు.మరోవైపు, బాధితురాలు తల్లిదండ్రులు తమ బిడ్డ మరణంపై మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నిరంతర వేధింపులు, చిత్రహింసల కారణంగానే మా కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. చాలా రోజులుగా ఆమె ఆవేదనతో ఉంది. కానీ, తను ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. మాకు న్యాయం కావాలి. మా బిడ్డను వేధించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇక, విద్యార్థిని మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. ఆమె మృతి విషాదకరమని అన్నారు. దీనిపై దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపారు. పోలీసులు తమ విచారణను పూర్తి చేసిన తర్వాతే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.#WATCH | Jalna, Maharashtra: Sadar Police Inspector Sandeep Bharti says, "This morning, around 7:30-8 o'clock, information was received about a 13-year-old schoolgirl jumping from the school roof and committing suicide. Investigation is underway. Preliminary investigation is… pic.twitter.com/TqNohmAL0R— ANI (@ANI) November 21, 2025
రీల్ ఎంత పని చేసింది రాములా!
సోషల్ మీడియా అల్గారిథం ఎప్పుడు ఎలా పని చేస్తుందో?.. ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో అర్థంకాని పరిస్థితి. అందుకే పోస్టులు, వీడియోలు పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పెళ్లి కాబోతుందన్న సంబురంలో.. ముందు వెనకా ఆలోచించకుండా ఓ వీడియో తీసుకుని పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డాడు ఇక్కడో వైద్యుడు. ఇక్కడి ఈ కింది వీడియోలో బనీయన్ మీద కిందపడి మరీ దొర్లుతూ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఓ డాక్టర్. ఆ పక్కనే ఒయలు ఒలకబోస్తోంది అతనికి కాబోయే భార్య. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఎవరికేం నొప్పి అంటారా? అక్కడికే వస్తున్నాం. ఆ డ్యాన్స్ తన బెడ్రూంలో వేస్తే ఫర్వాలేదు. కానీ, ఆస్పత్రిలోనే దుకాణం పెట్టేశాడు. यूपी –शामली जिले के एक सरकारी अस्पताल के ड्यूटी रूम में डॉक्टर का डांस, CMO ने नोटिस देकर जवाब मांगा !!कहा जा रहा है कि डॉक्टर अफकार सिद्दीकी सगाई की खुशी में डांस कर रहे हैं और साथ में डांस करने वाली उनकी मंगेतर है। pic.twitter.com/q7FWRs7xdV— Sachin Gupta (@SachinGuptaUP) November 21, 2025 ఆస్పత్రి గదిలో.. అదీ ఎమర్జెన్సీ డ్యూటీని ఎగ్గొట్టి మరీ తనకు కాబోయే భార్యతో డ్యాన్స్ చేశాడు షామ్లీ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ వకార్ సిద్ధిఖీ. ఈ వీడియో కాస్త నెట్టింట రీల్ రూపంలో వైరల్ అయ్యింది. అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఆఖరికి అధికారుల దృష్టికి చేరింది. దీంతో సిద్ధిఖీని వివరణ కోరారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించి.. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయించారు. \బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వకార్ సిద్ధిఖీ రెండేళ్ల కాంట్రాక్ట్ కింద ఆ ఆస్పత్రిలో చేరారని.. అతని ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవైపు డాక్టర్ల కొరత కొనసాగుతున్నవేళ.. ఈ కాంట్రాక్ట్ డాక్టర్ చేసిన పని ప్రజాగ్రహానికి దారి తీసింది.
ఎన్ఆర్ఐ
శ్రీ శ్రీ రవిశంకర్కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు
బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలతోఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి.
ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు.
బహ్రెయిన్లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి
ముగ్గురు కళాశాల డ్రాపౌట్లు 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి ప్రవేశించారు. తద్వారా మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ రికార్డును చెరిపేశారు. ఫోర్బ్స్ ప్రకారం, మెర్కోర్ (Mercor )అనే AI-ఆధారిత రిక్రూటింగ్స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురుస్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా,ప్రపంచంలోనే అతి చిన్న బిలియనీర్లుగా నిలిచారు. ఈ ముగ్గురూ, స్వయంకృషితో బిలయనీర్లుగా ఎదిగారు. వీరిలో హిరేమత్ భారతీయసంతతికి చెందినవాడు కావడం విశేషం. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మెర్కోర్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 88,560.68 కోట్లకు (10 బిలియన్ డాలర్లు)గా ఉంది. 350 మిలియన్ల డాలర్ల తాజా నిధులతో కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి ఎగిసింది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా ఈ ముగ్గురూ నిలిచారు. మెర్కోర్ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.ఈ ముగ్గురి ప్రయాణంకాలిఫోర్నియాలోని శాన్జోస్లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బోయిస్ స్కూలు నుంచే మొదలైంది.అక్కడ డిబేట్ టీమ్లో టాప్ మెంబర్స్గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచు కున్న తొలి వ్యక్తులు.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో మెర్కోర్పై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి చదువును విడిచి పెట్టాల్సి వచ్చింది. మెర్కోర్లో పని చేయకపోతే, రెండు నెలల క్రితమే పట్టభద్రుడయ్యేవాడినని, ఇంతలోనే తన జీవితం 180-డిగ్రీల యు-టర్న్ తీసుకుందని పేర్కొన్నాడు. అలాగే సూర్య మిధా జార్జ్టౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్న సమయంలోనే బ్రెండన్ ఫుడీని కలిశాడు. దీంతో హిరేమత్తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు. అలా వారి అభిరుచులు కలిసి, నైపుణ్యాన్ని మేళవించి మెర్కోర్ నాంది పలికింది. ప్రపంచ రికార్డుకు దారి తీసింది.
క్రైమ్
అసిస్టెంట్ పైలట్పై 'పైలట్' అత్యాచారం!
సాక్షి, హైదరాబాద్: మహిళా అసిస్టెంట్ పైలెట్ పై ఓ పైలెట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 20న బిజినెస్ ఫ్లైట్లో బేగంపేట నుండి పుట్టపర్తి చెన్నై మీదుగా బాధితురాలు బెంగళూరు వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం 4.20 నిమిషాలకు ఆ బిజినెస్ ఫ్లైట్ బెంగళూరు చేరుకుంది. అనంతరం బెంగళూరులోని ఓ హోటల్లో మహిళా అసిస్టెంట్ పైలెట్ తో పాటు మరో ఇద్దరు పైలెట్లు (male) బస చేశారు. అనంతరం ఇద్దరు పైలట్లతో కలిసి బయటికి వచ్చిన బాధితురాలు. అనంతరం సదరు పైలెట్ తనపై అత్యాచారం చేశాడంటూ హైదరాబాద్లోని బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్.ఐ.ఆర్ కేసు నమోదు చేసిన పోలీసులు తిరిగి ఈ కేసును బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేశారు.
బడే దామోదర్ ఎక్కడ?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఉమ్మడి వరంగల్కు చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఎక్కడ? ఇటీవల సాగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆయన వ్యూహం ఏమిటీ? ఓ వైపు ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాడంటుండగా.. మరోవైపు లొంగుబాటు ప్రయత్నం చేస్తున్నాడని వైరల్ అవుతోంది? ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, సౌత్బస్తర్, ఏఓబీలో కీలకమైన బడే దామోదర్ ఎక్కడున్నాడు? ఏం జరుగుతోంది? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇటీవల ములుగు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన పేరిట ఫోన్ కాల్స్ రావడం, ఓ రాజకీయ నేతను కలవాలని సూచించడం కూడా కలకలం రేపుతోంది. దామోదర్ వ్యూహం ఏంటో..ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వ లపలి్లకి చెందిన బడే దామోదర్ది సీపీఐ (మావోయిస్టు) ఉద్యమ చరిత్రలో ఓ అధ్యాయం. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021 జూన్ 21న కొవిడ్ బారిన పడి మృతిచెందగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బాధ్యతలను దామోదర్కు పార్టీ అప్పగించింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో కీలకంగా మారిన ఈయన ఈ ఏడాది జనవరిలో పూజారి కాంకేర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరలైంది. ఐదారు రోజుల తేడాతో దామోదర్ బతికే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ 11 మాసాల వ్యవధిలో మావోయిస్టు పార్టీ నాయకత్వం ఎన్నో ఉత్థానపతనాలను చూసింది. అగ్రనేతలు ఎన్కౌంటర్లకు గురికావడం.. కేంద్ర కమిటీ స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఆయుధాలతో లొంగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో ఏఓబీ సరిహద్దు మారేడుమిల్లి ఏరియాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో హిడ్మా సహా 13 మంది మృతిచెందడం... పదుల సంఖ్యలో ముఖ్య నేతలు విజయవాడలో అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించడం ఆ పార్టీ మనుగడకు సవాల్గా పరిణవిుంచింది. ఇదే సమయంలో బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తదితరులు సైతం లొంగిపోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటివరకు అధికారికంగా ఎటునుంచి ప్రకటన వెలువడలేదు.దామోదర్ పేరుతో ఫోన్ చేస్తున్నదెవరు..?కాల్వపలి్లకి చెందిన మావోయిస్టు అగ్రనేత బడే దామోదర్ పేరిట కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఫోన్లు వస్తుండడం కలకలంగా మారింది. తాను దామోదర్ను అంటూ ఫోన్ చేస్తున్న సదరు వ్యక్తి.. జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడిని కలిసి డబ్బులు ఇవ్వాలని సూచించడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఇద్దరు అధికార పార్టీ నాయకులు, ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్లు రావడం.. ఆ ఫోన్లో మాట్లాడిన పలు విషయాలను బహిరంగంగానే మా ట్లాడుకుంటుండటం గమనార్హం. నిత్యనిర్బంధం మధ్య దామోదర్ ఎక్కడున్నాడు.. ఎలా ఉన్నాడు.. అన్న చర్చ జరుగుతున్న తరుణంలో దామోదర్ వాయిస్తో ఫోన్లో చేస్తున్నదెవరు? ఒకవేళ దామోదరే అయితే ఎవరిని కలవమన్నారు? అనే అంశాలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.
నాన్నా.. అమ్మను బాగా చూసుకో
ఏలూరు జిల్లా: ‘నాన్నా.. అమ్మను బాగా చూసుకో.. ఏమీ అనవద్దు.. ఐ మిస్ యూ.. మావయ్య.. సారీ.. ఐ మిస్ యూ... చెల్లెళ్లిద్దరూ బంగారం.. వా రిని బాగా చదివించండి.. మా ప్రిన్సిపాల్, హౌస్ టీచర్ చాలా మంచివాళ్లు.. ఏమీ అనవద్దు..’ అని సూసైడ్ నోట్ రాసి గురుకుల విద్యార్థిని బలవన్మరణం చెందింది. పోలీసులు, పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని పొడవాటి కావ్య (15) శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పిల్లలందరూ భో జనానికి వెళ్లగా తరగతి గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉ రివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ ఎంవీ సు భా‹Ù, ఎస్సై ఎన్వీ ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రిన్సిపాల్ గంగాభవాని, మహిళా టీచ ర్లు, కావ్య స్నేహితులను విచారించారు. సీసీ టీవీ రికార్డులను పరిశీలించారు. కావ్య స్నేహితులు మాట్లాడుతూ కావ్య తల్లి ఉషారాణి కిడ్నీ సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్నారని, తరచూ డ యాలసిస్ చేయాల్సి రావడంతో కుటుంబం ఇబ్బంది పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లి బాధను చూడలేక చదువు మానేయాలని ఉందని పలుమార్లు తమకు చెప్పిందని అన్నారు. తల్లి అనారోగ్యంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. కావ్యకు ఇద్దరు చెల్లెళ్లు ఉండగా, పెద్ద చెల్లెలు సౌమ్య ఇదే గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తాడువాయి పంచాయతీ జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి గంగాధరరావు, ఉషారాణి పెద్ద కుమార్తె కావ్య. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పాఠశాల వద్ద పీడీఎస్యూ, దళిత సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొద్దిసేపు ఆందోళన చేశారు.
iBomma Ravi: లీకులు లేకుండా టాప్ సీక్రెట్గా..
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో కస్టడీ విచారణ మూడో రోజుకి చేరింది. అత్యంత గోప్యంగా, ఎలాంటి లీకులు లేకుండా సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి వివరాలు రాబడుతున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నత స్థాయి అధికారులే స్వయంగా ఈ విచారణను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పైరసీ కేసులో నిందితుడు ఇమ్మడి రవికి సంబంధించిన ఆరు అకౌంట్ల వివరాల కోసం బ్యాంకు అధికారులకు సీసీఎస్ లేఖ రాసింది. ఇప్పటికే డబ్భుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు ఒప్పుకున్న రవి.. 1xbet యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించాడు. అలాగే.. మూవీ రూల్జ్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశానని.. అందుగానూ క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్జ్కి డబ్బులు చెల్లించానని రవి పోలీసులకు తెలిపాడు. దర్యాప్తులో రవి తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్సైట్ను బెట్టింగ్ యాప్స్కి గేట్ వే చేసి.. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతోనే రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఫ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ని పోస్ట్ చేసేవాడని.. కరేబియన్ దీవుల్లో ఆఫీస్ ఏర్పాటు చేసి ఏకంగా 20 మంది యువకుల్ని రవి నియమించినట్లు తెలుస్తోంది. అయితే రెండ్రోజులపాటు జరిగిన విచారణలో రవి నుంచి కొద్దిపాటి సమాచారాన్నే మాత్రమే సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో రవి నెట్ వర్క్ పై లోతైన విచారణ జరుపుతున్నారు. రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు.
వీడియోలు
పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు
తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు
జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్
Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను
మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్
Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా
తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల
TJR Sudhakar: దమ్ముంటే ముగ్గురూ రండి, జగన్ ఒక్కడే వస్తాడు.. ఛాలెంజ్..

