Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Criticizes Chandrababu Leadership in Diwali Tweet1
చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై వైఎస్ జగన్ ట్వీట్

సాక్షి,తాడేపల్లి: చంద్రబాబూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై సోమవారం (అక్టోబర్‌ 20) వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో .. చంద్రబాబు మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్‌, నెల నెలా రూ.4వేలు.4.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్‌ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట5.ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,0006.ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు7.అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం…8.ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలుఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?. వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా.మా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య… ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు’ అంటూ ధ్వజమెత్తారు. .@ncbn గారూ… మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా? 1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్‌,…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025

Big Twist In Nizamabad Constable Pramod Case2
కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కేసు: రియాజ్‌ ఖతం, డీజీపీ ఏమన్నారంటే..

సాక్షి, నిజామాబాద్‌: కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్‌(24) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు. నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్‌ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ నుంచి గన్‌ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు. రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందిస్తూ(Telangana DGP reacts On Riyaz Encounter).. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్‌ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్‌ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్‌ గన్‌పైర్‌ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు. రియాజ్‌ చేతిలో మరణించిన కానిస్టేబుల్‌ ప్రమోద్‌చైన్‌స్నాచర్‌ టు కానిస్టేబుల్‌ హత్య.. చిన్నచిన్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే రియాజ్‌ ఆచూకీ గురించి శుక్రవారం(అక్టోబర్‌ 17వ) తేదీన నిజామాబాద్‌ సీసీఎస్‌కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్‌ ఎస్‌ఐ భీమ్‌రావు, కానిస్టేబుల్‌ ప్రమోద్‌(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్‌పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్‌ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు.అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్‌ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్‌ శాఖ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి ఆదేశాలతో.. మల్టీజోన్‌-1 ఐజీపీ చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు 8 బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు.. రూ.50 వేల రివార్డుతో రియాజ్‌ పేరిట మోస్ట్‌ వాంటెడ్‌ పోస్టర్లు వెలిశాయి. ఈలోపు.. రియాజ్‌ను ఆదివారం మధ్యాహ్నాం ఎట్టకేలకు చిక్కినట్లు పోలీసులు ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌ అంటూ ప్రచారం.. శుక్రవారం ప్రమోద్‌ను హత్య చేశాక.. ఘటనా స్థలం నుంచి తన స్నేహితుడి బైకుపై పరారైన అతను మహ్మదీయకాలనీలోని తన ఇంటికి వెళ్లి, దుస్తులు మార్చుకుని బయటకొచ్చాడు. నగరంలోనే వివిధ ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగాడు. అతడు నగర పరిధి దాటలేదన్న సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాల సాయంతో జల్లెడపట్టారు. అయితే.. ఈలోపు ఓ చోట రియాజ్‌ కంటపడగా పట్టుకునే లోపే కెనాల్‌లోకి దూకి తప్పించుకున్నాడు. అక్కడ అతడి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని సారంగాపూర్‌ శివారులో రియాజ్‌ ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్‌లో దాక్కొని.. పోలీసులు రావడం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికుడు సయ్యద్‌ ఆసిఫ్‌ అతన్ని పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకోగా.. రియాజ్‌ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్‌ ఎడమచేతిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే పోలీసు బృందం నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించింది. అయితే ఆ సమయంలో రియాజ్‌ ఎన్‌కౌంటర్‌ అయినట్లు ప్రచారం జరగ్గా.. పోలీసులు ఖండించారు. నిందితుడు రియాజ్‌ను సజీవంగానే పట్టుకున్నామని, తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించామని, గాయపడ్డ అసిఫ్‌ను కూడా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించామని స్పష్టత ఇచ్చారు. ఈలోపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్‌ పారిపోయే క్రమంలో ఎన్‌కౌంటర్‌ కావడం గమనార్హం.ఇదీ చదవండి: పోలీసులకే రక్షణ లేదు.. ఇలాగైతే ఎలా?

England Beat New Zealand By 65 Runs In 2nd T20I3
సాల్ట్‌, బ్రూక్‌ విధ్వంసం.. రషీద్‌ మాయాజాలం.. ఇంగ్లండ్‌ ఘన విజయం

మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 20) రెండో టీ20 జరిగింది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (New Zealand vs England) పర్యాటక జట్టు 65 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. మూడో టీ20 ఆక్లాండ్‌ వేదికగా అక్టోబర్‌ 23న జరుగనుంది. అనంతరం 26, 29, నవంబర్‌ 1 తేదీల్లో మౌంట్‌ మౌంగనూయ్‌, హ్యామిల్టన్‌, వెల్లింగ్టన్‌ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.సాల్ట్‌, బ్రూక్‌ విధ్వంసంటాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఫిల్‌ సాల్ట్‌ (Phil Salt) (56 బంతుల్లో 85; 11 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) (35 బంతుల్లో 78; 5 సిక్సర్లు, 6 ఫోర్లు) విధ్వంసం సృష్టించారు.జేకబ్‌ బేతెల్‌ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్‌ బాంటన్‌ (12 బంతుల్లో 29 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోస్‌ బట్లర్‌ (4) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌ 2, డఫీ, బ్రేస్‌వెల్‌కు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేసిన స్కోర్‌ టీ20ల్లో న్యూజిలాండ్‌పై రెండో అత్యధికం. రషీద్‌ మాయాజాలం237 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. ఒక్క బ్యాటర్‌ కూడా భారీ స్కోర్‌ చేయలేకపోయారు. ఓటమి ఖరారయ్యాక కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (36) బ్యాట్‌ ఝులిపించాడు. టిమ్‌ సీఫర్ట్‌ (39), చాప్‌మన్‌ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆదిల్‌ రషీద్‌ (Adil Rashid) (4-0-32-4) తన అద్భుతమైన స్పిన్‌ మాయాజాలంతో న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు. అతనికి లూక్‌ వుడ్‌ (4-0-36-2), బ్రైడన్‌ కార్స్‌ (3-0-27-2), లియామ్‌ డాసన్‌ (4-0-38-2) సహకరించారు. వీరి ధాటికి న్యూజిలాండ్‌ 18 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 10 మంది ఆటగాళ్లు క్యాచ్‌ ఔట్‌ల రూపంలో ఔటయ్యారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇలా జరగడం కేవలం 13వ సారి మాత్రమే.చదవండి: ఆల్‌ ఫార్మాట్‌ గ్రేట్‌గా ఎదుగుతాడు: నితీశ్‌ రెడ్డిపై రోహిత్‌ శర్మ ప్రశంసలు

Ysrcp Zptc Assassinated In Alluri Sitarama Raju District4
అల్లూరి జిల్లా: కొయ్యూరు వైఎస్సార్‌సీసీ జెడ్పీటీసీ దారుణ హత్య

అల్లూరి జిల్లా: కొయ్యూరు వైఎస్సార్‌సీసీ జెడ్పీటీసీ హత్యకు గురయ్యారు. జెడ్పీటీసీ వారం నూకరాజును దుండుగులు హత్య చేశారు. రోలుగుంట మండలం పెదపేట వద్ద ఈ దారుణం జరిగింది. గతంలో కూడా నూకరాజుపై ప్రత్యర్థులు దాడి చేశారు.

One DA, Too Many Conditions: Employees Slam Chandrababu Govt5
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు బిగ్‌షాక్‌

సాక్షి,విజయవాడ: ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మస్కా కొట్టింది. డీఏ జీవోలోనూ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది. డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తామంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వం డీఏ జీవో ఇచ్చింది. అయితే, డీఏ జీవో చూసి ప్రభుత్వ ఉద్యోగులు విస్తుపోతున్నారు. 2024 జనవరి డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాకే ఇస్తామని కొర్రీ పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రిటైర్డ్‌ అయిన పెన్షనర్లను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. పెన్షనర్ల డీఏ అరియర్స్ వాయిదా వేయడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీవోను చూసి ఉద్యోగ సంఘాలు విస్తుపోతుంటే.. ఇచ్చిన ఒక్క డీఏకి ఇన్ని కొర్రీలా అంటూ మండిపడుతున్నారు.

PM Modi Greetings on the occasion of Diwali6
INS విక్రాంత్‌లో మోదీ దీపావళి వేడుకలు.. పాకిస్తాన్‌కు కౌంటర్‌

సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.గోవా సముద్ర తీరంలోని ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొని సైనికులతో సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో మావోయిస్టుల లొంగుబాటు కూడా మొదలైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గోవాలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించారు. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది. సైనికులే భారత్‌ బలం. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఉంది. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు, దీపావళికి వెలిగించే దీపాల లాంటివి. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టింది. పాక్‌ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయి.#WATCH | Prime Minister Narendra Modi says, "The night spent yesterday on INS Vikrant is hard to put into words. I saw the immense energy and enthusiasm you all were filled with. When I saw you singing patriotic songs yesterday, and the way you described Operation Sindoor in your… pic.twitter.com/UrGF2gngn6— ANI (@ANI) October 20, 2025ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియాకు ప్రతీక. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పరాక్రమం చూపించిన త్రివిధ దళాలకు సెల్యూట్‌. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పేరు వింటే శత్రువులకు నిద్ర కూడా పట్టదు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక. బ్రహ్మోస్‌, ఆకాశ్‌ మిస్కైల్‌ తమ సత్తా ఏంటో చూపించాయి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరం’ అని చెప్పుకొచ్చారు.#WATCH | Prime Minister Narendra Modi says, "... Just a few months ago, we witnessed how the very name Vikrant sent waves of fear across Pakistan. Such is its might — a name that shatters the enemy’s courage even before the battle begins. This is the power of INS Vikrant... On… pic.twitter.com/TL03Z9CFdg— ANI (@ANI) October 20, 2025ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సింధూర్‌ విజయం తర్వాత తొలి దీపావళిలో మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. 2014 నుంచి సాయుధ దళాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఇక, అంతకుముందు ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోదీ..‘దీపావళి వెలుగుల పండగ మన జీవితాలను సౌభాగ్యంతో, సంతోషంతో నింపాలి. సానుకూలత మన చుట్టూ వ్యాపించాలి’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.Greetings on the occasion of Diwali. May this festival of lights illuminate our lives with harmony, happiness and prosperity. May the spirit of positivity prevail all around us.— Narendra Modi (@narendramodi) October 20, 2025

Actor krishna and dj tillu movie director father behind story7
45 ఏళ్ల క్రితం.. ఇదే దీపావళి నాడు కృష్ణ చేరదీస్తే.. ఈ పోటో కథ తెలుసా?

ఈ ఫోటో సుమారు పదేళ్ల క్రితం నాటిది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారితో కృష్ణకు చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం.. 1973 సమయంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ చెన్నైలో ఉన్నారు. తెల్లవారితో దీపావళి.. అయితే, తెలంగాణలోని మానుకోట నుంచి ఓ కుర్రాడు మద్రాసు పారిపోయాడు. కేవలం సినిమాలంటే పిచ్చితో తన ఊరి నుంచి వెళ్లిపోయాడు. ఏడో తరగతి పరీక్షలు రాసేసి.. రాత్రి సెకండ్‌ షో సినిమా చూసేసి మద్రాస్‌ రైలెక్కేశాడు. అయితే, అక్కడ పగలంతా చాలామంది సినిమా వాళ్ల ఇళ్ల చుట్టూ తిరిగేశాడు. కానీ, రాత్రి కాగానే భయంతో ఎక్కడ ఉండాలో తెలియిని పరిస్థితిలో ఉన్నాడు.ఒక రోజు హీరో కృష్ణ ఇంటి ముందుకు చేరిన ఆ కుర్రాడు అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే విజయనిర్మల కంట్లో పడ్డాడు. ఇంతలోనే కృష్ణ రావడంతో ఆ కుర్రాడిని దగ్గరికి పిలిచి ఎవరు నువ్వు అంటూ వివరాలు అడిగాడు. అయితే, నేను అనాథను అని ఆ పిల్లాడు అబద్ధం చెప్పాడు. దీంతో కృష్ణకు జాలి కలిగింది. సర్లే.. ఇక్కడే ఉండు అనేసి తన కారు డ్రైవర్‌ను పిలిపించాడు. ఈ కుర్రాడికి కొత్త బట్టలు కొనివ్వమని డబ్బులు ఇచ్చేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు దీపావళి కొత్త దుస్తులతో ఉన్న ఆ పిల్లాడితో టపాకులు కూడా కృష్ణ దంపతులు కాల్పించారు. అలా అనాథ అని చెప్పి నాలుగు నెలలపాటు ఆ కుర్రాడు అక్కడే ఉన్నాడు.అయితే, తమ కుమారుడి జాడ కోసం రాష్ట్రం మొత్తం తల్లిదండ్రులు ఎతుకుతున్నారు. పోలీసు కేసు కూడా పెట్టారు. పత్రికలలో ఫోటో కూడా ప్రచురించారు. ఫైనల్‌గా అతని జాడ కనుక్కొని కృష్ణ ఇంటికి చేరుకున్నారు. జరిగిన విషయం అంతా ఆయనతో పంచుకున్నారు. దీంతో వెంటనే ఆ కుర్రాడిని పిలిపించి తల్లిదండ్రులను బాధపెట్టకుండా బాగా చదువుకోవాలని హితవు చెప్పాడు. కావాలంటే ఆ తరువాత సినిమాల గురించి ఆలోచించాలని కోరాడు. అలా నచ్చజెప్పి వాళ్లతో పంపించేశాడు. అయితే, ఆ రోజు కృష్ణ ఇచ్చిన ఒక కీచైన్ గిఫ్టు తీసుకుని తల్లిదండ్రులతో వెళ్లిపోయాడు. ఆ తరువాత 40 ఏళ్లపాటు ఆ కుర్రాడు కృష్ణ దగ్గరకు వెళ్లలేదు. కానీ, తనను చిన్నప్పుడు చేరదీసిన కృష్ణను మరిచిపోలేదు. నాలుగు నెలలపాటు కన్నబిడ్డలా తనను చూసుకోవడంతో అభిమానం విపరీతంగా పెంచుకున్నాడు. దీంతో తన కొడుకు పేరు విమల్ కృష్ణ, కూతురు పేరు రమ్య కృష్ణ అని పెట్టుకున్నాడు. ఆ విమల్ కృష్ణనే డీజే టిల్లు సినిమా దర్శకుడు.నాన్న ఆశయాన్ని 'డీజె టిల్లు'తో తీర్చాడు ​ఏడు తరగతిలోనే పారిపోయిన ఆ కుర్రాడి పేరు శ్రవణ్ కుమార్.. బాగా చదువుకోవమని కృష్ణ ఇచ్చిన సలహాని పాటించి ఉన్నత స్థాయిలోకి వచ్చాడు. అతని కొడుకు విమల్ కృష్ణ బీటెక్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం జోలికిపోలేదు. శ్రవణ్‌ మాదిరే తనకు కూడా సినిమాలంటే మక్కువే. దీంతో చాలా ప్రయత్నాలు చేసి దర్శకుడిగా డీజె టిల్లు సినిమాను తెరకెక్కించి భారీ విజయం అందుకున్నాడు. అలా తన నాన్న కోరికను విమల్ కృష్ణ పూర్తిచేశాడు. ఈ విషయం తెలిసిని వాళ్లు కృష్ణ గొప్పతనం మరిచిపోరు. అలా అనాథ అని వచ్చిన ఒక కుర్రాడిని కన్నబిడ్డలా చూసేవారు ఉంటారా.. దటీజ్ కృష్ణ.

British Museum Inaugural Pink Ball Isha Ambaniwith Nita Ambani8
35 మంది, 3,670 గంటలు : పింక్‌ బాల్‌ ఈవెంట్‌లో మెరిసిన ఇషా అంబానీ

లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో చారిటీ ఈవెంట్‌ "పింక్ బాల్" ఈవెంట్‌ గ్లామర్‌కు ప్రతిరూపంగా మారింది. బ్రిటిష్ మ్యూజియం డైరెక్టర్ నికోలస్ కల్లినన్‌తో కలిసి, రిలయన్స్‌ రీటైల్‌ హెడ్‌ ఇషా అంబానీ దీనికి సహ అధ్యక్షత వహించారు. అలాగే ఆమె తల్లి, రిలయన్స్‌ ఫౌండర్‌ చైర్‌పర్సన్‌ ,NMACC వ్యవస్థాపకురాలు పింక్ బాల్ థీమ్‌లో అద్భుతమైన లుక్‌లో మెరిసారు.కీలకమైన కారణాల కోసం నిధులను సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమంలో బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషీ సునాక్‌తోపాటు, ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, దాతలు, సామాజిక ,రాజకీయ ఉన్నత వర్గాలకు చెందిన 800 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తగా, గొప్ప దాతగా పేరుగాంచిన నీతా అంబానీ తనదైనఫ్యాషన్‌ లుక్‌తో అలరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేసిన ఈ ఈవెంట్‌ ఏన్షియంట్ ఇండియా: లివింగ్ ట్రెడిషన్స్'తో పాటు జరిగిన పింక్-నేపథ్య సోయిరీలో సాగింది.పింక్ బాల్ సహ చైర్‌గా, ఇషా అంబానీ లుక్‌లో వారసత్వం, కళాత్మకత ఉట్టిపడింది. అబు జాని సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా రూపొందించిన హ్యాండ్‌ మేడ్‌ కోచర్ డ్రెస్‌లో మెరిసి పోయింది. పింక్‌ ధీమ్‌కు తగ్గట్టుగా బ్లష్ పింక్ చామోయిస్ శాటిన్ జాకెట్ , గులాబీ రంగు జర్డోజీలో ముత్యాలు, సీక్విన్స్ ,స్ఫటికాలతో డిజైన్‌ స్కర్ట్‌ను ధరించింది.35 మందికి పైగా కళాకారులుదీన్ని తయారు చేయడానికి 3,670 గంటలు శ్రమించారు. దీనికి సంబంధించిన వీడియోను సందీప్ ఖోస్లా షేర్‌ చేశారు. కార్సెట్ బ్లౌజ్‌ను డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టైల్ చేశారు. అలాగే నీతా అంబానీ స్వదేశ్‌లో తయారు చేసిన కాంచీవరం, మల్బరీ సిల్క్‌ చీరలో అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india) ఈ కార్యక్రమానికి మిక్ జాగర్, జానెట్ జాక్సన్, నవోమి కాంప్‌బెల్, సర్ నార్మన్ ఫోస్టర్, లేడీ కిట్టి స్పెన్సర్, ల్యూక్ ఎవాన్స్ , జేమ్స్ నార్టన్ వంటి అనేక మంది సృజనాత్మక ప్రముఖులు హాజరయ్యారు. హాజరైన ప్రతీవ్యక్తి సీటు కోసం 2,000 పౌండ్లు చెల్లించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla)

Gold and Silver Price Today in India 20th October 2025 on Diwali9
పసిడి ప్రియులకు ‘పండుగ’.. మళ్లీ తగ్గిన బంగారం

గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు (Gold Price) ఎట్టకేలకు దిగివచ్చాయి. ధనత్రయోదశి (Dhanteras) రోజున కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని కలిగించిన బంగారం ధరలు దీపావళి (Diwali) రోజున కూడా ఊరట కలిగించాయి. వెండి ధరలు (Silver Price) కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి.. దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం వాటి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

 OTT: Upcoming Movies Release From 20th October to 26th October, 202510
దీపావళి ధమాకా.. ఓటీటీలో 19 సినిమాలు/ సిరీస్‌లు

బాక్సాఫీస్‌ దగ్గర దీపావళి సందడి నెలకొంది. మిత్రమండలి, తెలుసుకదా, డ్యూడ్‌, కె-ర్యాంప్‌ చిత్రాలు పండగ రేసులో నిలబడ్డాయి. వీటిలో కొన్ని తడబడుతుంటే మరికొన్ని దూసుకుపోతున్నాయి. పోటీకి సై అంటూ రష్మిక మందన్నా థామా కూడా అక్టోబర్‌ 21న విడుదల కాబోతోంది. తమిళంలో పాజిటివ్‌ టాక్‌ అందుకున్న బైసన్‌ కూడా అక్టోబర్‌ 24న తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ హీరో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించారు. థియేటర్ల సంగతి సరే.. మరి ఓటీటీలో ఈ వారం (అక్టోబర్‌ 20- 26 వరకు) ఏయే సినిమాలు రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోఎలివేషన్‌: అక్టోబర్‌ 21లజారస్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 22విషియస్‌ - అక్టోబర్‌ 22ఈడెన్‌ - అక్టోబర్‌ 24పరమ్‌ సుందరి - అక్టోబర్‌ 24జియో హాట్‌స్టార్‌భద్రకాళి - అక్టోబర్‌ 24మహాభారత్‌: ఏక్‌ ధర్మయుధ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25పిచ్‌ టు గెట్‌ రిచ్‌ (రియాలిటీ షో) - అక్టోబర్‌ 20నెట్‌ఫ్లిక్స్‌మాబ్‌ వార్‌: ఫిలడెల్ఫియా వర్సెస్‌ ద మాఫియా (డాక్యుమెంటరీ సిరీస్‌) - అక్టోబర్‌ 22ద మాన్‌స్టర్‌ ఆఫ్‌ ఫ్లోరెస్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 22ఓజీ - అక్టోబర్‌ 23నోబడీ వాంట్స్‌ దిస్‌ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 23ద ఎలిక్సిర్‌ - అక్టోబర్‌ 23కురుక్షేత్రం - పార్ట్‌ 2 (యానిమేటెడ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 24ఎ హౌజ్‌ ఆఫ్‌ డైనమైట్‌ - అక్టోబర్‌ 24పరిష్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 24ది డ్రీమ్‌ లైఫ్‌ ఆఫ్‌ మిస్టర్‌ కిమ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25సన్‌ నెక్స్ట్‌ఇంబం - అక్టోబర్‌ 20సింప్లీ సౌత్‌దండకారణ్యం - అక్టోబర్‌ 20చదవండి: ఒక్కరాత్రిలోనే ఫ్యామిలీ అంతా కోల్పోయింది.. ఎవరికీ తెలీదు!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement