అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండి: టీమిండియా దిగ్గజం
విశ్వ విజేతగా అవతరించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ట్రోఫీని ముద్దాడిన హర్మన్ సేన విజయాన్ని భారతావని ఉత్సవంగా జరుపుకొంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ (ICC Women's World Cup) టోర్నమెంట్లో.. 2005, 2017లో రన్నరప్తోనే సరిపెట్టుకున్న భారత్.. ఈసారి మాత్రం ఆఖరి గండాన్ని అధిగమించింది.గావస్కర్ వ్యాఖ్యలు వైరల్నవీ ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా (Ind Beat SA)ను 52 పరుగుల తేడాతో ఓడించి.. జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే.. టీమిండియా దిగ్గజం, 1983 వరల్డ్కప్ విజేత సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండాస్పోర్ట్స్స్టార్కి రాసిన కాలమ్లో.. ‘‘కొంతమంది భారత పురుషుల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్కప్- 1983 విజయాన్ని.. తాజాగా అమ్మాయిలు చాంపియన్గా నిలవడంతో పోలుస్తున్నారు. అయితే, 1983 ఎడిషన్ కంటే ముందు మెన్స్ టీమ్ ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేదు.నాకౌట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు అప్పుడు అస్సలు తెలియవు. అలాంటిది మేము తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండా విజేతలుగా నిలిచాము.అందుకే అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండిఅయితే మన మహిళా జట్టు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడింది. తర్వాత ఇలా అద్భుతమైన విజయంతో విజేతగా నిలిచింది’’ అని గావస్కర్.. తమ విజయాన్ని అమ్మాయిలతో పోల్చవద్దని స్పష్టం చేశాడు.అదే విధంగా.. ‘‘83లో టీమిండియా సాధించిన విజయం భారత క్రికెట్ రూపురేఖలు మార్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రికెట్ వైపు నడిపించేలా చేసింది. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత క్రికెట్ మరో స్థాయికి చేరుకుంది.ఇప్పుడు భారత జట్టులో కేవలం మెట్రో నగరాల నుంచి వచ్చినవారే కాకుండా.. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు. కాగా నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.సమిష్టి కృషితోఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలి వర్మ (87) గట్టి పునాది వేయగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (58), వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (34) ఇన్నింగ్స్ నిర్మించారు. జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20) స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. అయితే, మంధాన, షఫాలి దీప్తి, రిచా రాణించడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. షఫాలి వర్మ రెండు, నల్లపురెడ్డి శ్రీ చరణి ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సఫారీ జట్టులో ఓపెనర్, కెప్టెన్ లారా వొల్వర్ట్ (101) శతకంతో పోరాడగా.. మిగతా వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (23), సూనే లూస్ (25) అనిరె డెర్క్సెన (35) ఓ మోస్తరుగా రాణించారు. అయితే, భారత బౌలర్ల విజృంభణ ముందు నిలవలేకపోయిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో కేవలం 246 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 52 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సరికొత్త చాంపియన్గా అవతరించింది.చదవండి: అందుకే అర్ష్దీప్ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్
ఆదుకోవాల్సింది పోయి.. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మండిపడ్డారు. లోకేష్ 4 గంటల్లో 4వేల దరఖాస్తులు తీసుకున్నారని ఎల్లోమీడియా రాసింది. పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలు నమ్ముతారో లేదో తెలుసుకోరా? అని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ల విషయంలోనూ దారుణంగా మోసం చేశారు. 5 లక్షల మంది పెన్షన్ దారులను తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు’’ అంటూ నిలదీశారు.‘‘రైతులపై తుపాను దెబ్బ కొడితే వారిని ఆదుకోవాల్సిందిపోయి గాలికి వదిలేశారు. చంద్రబాబు లండన్, లోకేష్ క్రికెట్ చూడటానికి వెళ్లారు. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?. గూగుల్ సెంటర్ వల్ల లక్షా 80 ఉద్యోగాలు వస్తాయని పబ్లిసిటీ ఇస్తున్నారు. నిజానికి పదివేల ఉద్యోగాలైనా తెప్పించగలరా?. ఆరోగ్యశ్రీ లేక జనం అల్లాడిపోతుంటే పట్టించుకోరా?. ఏ ఆస్పత్రిలోనూ ఆరోగ్యశ్రీ అమలు కావటం లేదు. రాష్ట్రంలో రైతులు బతకటమే కష్టం అన్నట్టుగా మారింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు టమోట, మామిడి, ఉల్లి పంటలను రోడ్డు మీద కాలువల్లో పడేసే దుస్థితి నెలకొంది...అన్ని వర్గాల ప్రజలు అసహనంతో ఉన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సమస్యలతో జనం ఉంటే చంద్రబాబు లండన్లో విహరిస్తారా?. లులూ మాల్ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేస్తారా?. అందులో పెద్ద స్కాం ఉందన్న సంగతి సాధారణ ప్రజలకు కూడా తెలుసు. వైఎస్ జగన్ 18 సార్లు ప్రెస్మీట్ పెట్టి ప్రశ్నిస్తే ఒక్క దానికీ సమాధానం చెప్పలేదు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్క జడ్పీటీసీ అయినా గెలవగలరా?. జగన్ సీటు ఇస్తే గెలిచి తర్వాత పార్టీ మారిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?..పోలీసులను అడ్డం పెట్టుకుని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి వీరుడిలాగ మాట్లాడతావా?. పోలీసులు లేకుండా ఒక్క సీటైనా గెలవగలరా?. అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. మహిళా క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదు?. మిగతా అన్ని రాష్ట్రాల క్రికెటర్లకు ఆయా ప్రభుత్వాలు కోటి చొప్పున పారితోషికం ఇచ్చాయి. ముంబాయి వెళ్లి క్రికెట్ చూసిన లోకేష్ ఎందుకు శ్రీచరణికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు?. నకిలీ మద్యాన్ని బయట పెట్టారనే జోగి రమేష్ ని అరెస్టు చేశారు. బెల్టు షాపులోని మద్యనే బస్సు ప్రమాదానికి కారణమన్నందుకు మా పార్టీ నేత శ్యామలాకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఏ గ్రామానికి వచ్చినా బెల్టుషాపును చూపిస్తా’’ అంటూ సతీష్రెడ్డి సవాల్ విసిరారు.
మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) చారిత్రాత్మక విజయం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆది నుంచి చురుకైన ఉపన్యాసాలు, పదునైన విమర్శలతో దూసుకుపోయిన మామ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టించాడు. అయితే ఆయన ఈ విజయం వెనుక ప్రముఖంగా నిలిచింది ఎవరో తెలుసా?జోహ్రాన్ మమ్దానీ భార్య కళాకారిణి, యానిమేటర్, రైటర్ రమా దువాజీ (Rama Duwaji). భర్త విజయంలో తన వంతు ప్రచారంలో కీలక భూమిక నిర్వహించారు. ప్రచార లోగోలు, ప్రచారం మొత్తాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి పర్యాయపదంగా మారిందని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనతాను ఎక్కువగా వెలుగులోకి రాకుండానే రమా దువాజీ నిశ్శబ్దంగా తెర వెనుక ఉంటూనే భర్త విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. డెమొక్రాటిక్ సోషలిస్ట్ విలక్షణమైన ప్రచార గుర్తింపు, సోషల్ మీడియా ఉనికిని రూపొందించడంలో తన ఘనతను చాటుకున్నారు. ఎన్నికల రోజు వరకు జరిగే చర్చలు, ప్రచార కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండేవారు.. అలాగే మేయర్ రేసు గురించి ఆన్లైన్లో అరుదుగా పోస్ట్ చేసేవారు. అయితే మమ్దానీ ఆశ్చర్యకరమైన ప్రాథమిక విజయం తర్వాత జూన్లో ఆమె ఎన్నికలకు సంబంధించిన ఏకైక సోషల్ మీడియా పోస్ట్ విశేషంగా నిలిచింది. “ఇంతకంటే గర్వం కారణం ఏముంటుంది.” ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. చదవండి: పనస కాయ చిప్స్తో ఏడాదికి రూ. 12 లక్షలుతాజాగా మంగళవారం నాటి ఓటింగ్ సమయంలో మమ్దానీ తన ఓటు వేసే క్రమంలో భర్తకు అండగా నిలిచారు. ది డైలీ షోలో కనిపించినప్పుడు భర్త పక్కనే కొండంత అండగా ఉండటంతోపాటు, క్వీన్స్లోని ఫారెస్ట్ హిల్స్ స్టేడియంలో ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, సెనేటర్ బెర్నీ సాండర్స్తో కలిసి మమ్దానీ తన చివరి ర్యాలీ ప్రసంగం సమయంలో కూడా 10వేల మంది మద్దతుదారులతో పాటు ఆమె కూడా కనిపించింది. దువాజీ న్యూయార్క్ కు చెందిన సిరియన్-అమెరికన్ ఆర్టిస్ట్ దువాజీ. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్కు వెళ్లినా ఆమె డల్లాస్లో పెరిగారు. దుబాయ్లో చదివారు. ఆమె అనేక జర్నల్స్ను కూడా ప్రచురించారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి మమ్దానీ ఎన్నికైనపుడు 2021లో దువాజీ, మమ్దానీ డేటింగ్ యాప్ హింజ్లో కలుసుకున్నారు. వారి మొదటి డేట్ బ్రూక్లిన్లోని యెమెన్ కేఫ్ అయిన క్వాహ్వా హౌస్లో జరిగింది. మమ్దానీ తన మేయర్ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 2024లో వారు నిశ్చితార్థం చేసుకున్నారు. గత డిసెంబర్లో దుబాయ్లో వేడుకలు జరుపుకున్న తర్వాత, ఫిబ్రవరిలో లోయర్ మాన్హట్టన్లోని ఒక సాధారణ కోర్టు హౌస్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. దువాజీ సోషల్ మీడియా ఫీడ్ అంతా సిరామిక్, ఇలస్ట్రేషన్ వర్క్స్తో నిండి ఉంటాయి. పాలస్తీనాతో సంఘీభావాన్ని వ్యక్త పరిచే అనేక రచనలు కూడా చూడొచ్చు. ఆమెకు పెరుగుతున్న ప్రజా ఆకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు మెడ్రన్ డే ప్రిన్సెస్ డయానా అంటూ ముద్దుగా పిలుచుకోవడం విశేషం.
లోకేష్ టైం ఇవ్వలేదు.. నిరాశగా వెనుదిరిగిన కొలికపూడి
సాక్షి,అమరావతి: టీడీపీలో కొలికపూడి వర్సెస్ చిన్ని రచ్చ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి,చిన్ని హాజరయ్యారు. నివేదికను క్రమశిక్షణ కమిటీకి కొలికపూడి అందించారు. పార్టీ పదవుల అమ్మకాలపై కొలికపూడి ఫిర్యాదు చేశారు.తిరువూరు సీటు కోసం చిన్నికి ఇచ్చిన రూ.5 కోట్ల వివరాలను అందించారు. చిన్ని పీఏ అక్రమాలపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ను కలిసేందుకు కొలికపూడి ప్రయత్నించారు. అందుకు లోకేష్ టైం ఇవ్వకపోవడంతో కొలికపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.గత నెల అక్టోబర్లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా గురువారం పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు.2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. టీడీపీలో కోవర్టులున్నారు: టీడీపీలో కోవర్టులు ఉన్నారని..ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చి పోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు.‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు.ఇలా ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కామెంట్స్తో టీడీపీలో పాలిటిక్స్ రచ్చ పీక్ స్టేజీకి చేరింది. ఈ క్రమంలో కొలికపూడి,కేశినేని చిన్న ఇద్దరూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో కొలికపూడి నారాలోకేష్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తదుపురి భవిష్యత్ కార్యచరణపై కొలికపూడి దృష్టిసారించినట్లు తిరువూరు పొలిటికల్ సర్కిళ్ల చర్చ కొనసాగుతోంది.
రూ.31 లక్షల నంబర్ ప్లేట్ కొన్న ఒకప్పటి ఆటోడ్రైవర్..
చర్లపల్లి జైలులో జవాన్పై ఐఎస్ఐ ఖైదీ దాడి?
ఎన్సీఎల్ఏటీలో వాట్సప్కి పాక్షిక ఊరట
ఛ!.. నేను అలాంటి వాడిని కాదు: యువరాజ్ సింగ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. 121 నియోజకవర్గాల్లో పోలింగ్
‘కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్టే’
జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు.. ఆ రాక్షసుడి వల్ల డిప్రెషన్లో.. నటి కన్నీటిగాథ
వరల్డ్కప్ విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం
వైఎస్సార్సీపీ నేత గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖలు ఇవే
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
సచిన్, లక్ష్మణ్, రోహిత్ వచ్చారు.. మీరెక్కడా సార్?
బంగారం ధరలు మళ్లీ రివర్స్.. ఒక్క గ్రాము..
బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్న 'ప్రభాస్'..!
బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
కావ్య మారన్ సంచలన నిర్ణయం..
అంబానీ ఇంట్లో కనిపించని ఏసీ: యాంటిలియాలో ఎందుకిలా?
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
పాపం సౌతాఫ్రికా.. ఓడినా మనసులు గెలుచుకుంది..!
ఫ్యామిలీలో కొత్త మెంబర్.. బుల్లితెర జంట పోస్ట్
అలా చేస్తే మరి ఇలా ఎండనకా,వాననకా తిరగడం ఎందుకు సార్! ఇంట్లో కూర్చుంటే పోలా!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి ఉద్యోగయోగం.. వ్యాపార వృద్ధి
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
సాక్షి కార్టూన్ 05-11-2025
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా: ఏఐతో వాత!
ఐసీసీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఇంకా చురుగ్గా పని చేయించడానికట!
ఈ రాశి వారికి భూ, వాహనలాభాలు
రూ.31 లక్షల నంబర్ ప్లేట్ కొన్న ఒకప్పటి ఆటోడ్రైవర్..
చర్లపల్లి జైలులో జవాన్పై ఐఎస్ఐ ఖైదీ దాడి?
ఎన్సీఎల్ఏటీలో వాట్సప్కి పాక్షిక ఊరట
ఛ!.. నేను అలాంటి వాడిని కాదు: యువరాజ్ సింగ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. 121 నియోజకవర్గాల్లో పోలింగ్
‘కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్టే’
జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు.. ఆ రాక్షసుడి వల్ల డిప్రెషన్లో.. నటి కన్నీటిగాథ
వరల్డ్కప్ విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం
వైఎస్సార్సీపీ నేత గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖలు ఇవే
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
సచిన్, లక్ష్మణ్, రోహిత్ వచ్చారు.. మీరెక్కడా సార్?
బంగారం ధరలు మళ్లీ రివర్స్.. ఒక్క గ్రాము..
బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్న 'ప్రభాస్'..!
బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
కావ్య మారన్ సంచలన నిర్ణయం..
అంబానీ ఇంట్లో కనిపించని ఏసీ: యాంటిలియాలో ఎందుకిలా?
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
ఫ్యామిలీలో కొత్త మెంబర్.. బుల్లితెర జంట పోస్ట్
పాపం సౌతాఫ్రికా.. ఓడినా మనసులు గెలుచుకుంది..!
అలా చేస్తే మరి ఇలా ఎండనకా,వాననకా తిరగడం ఎందుకు సార్! ఇంట్లో కూర్చుంటే పోలా!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి ఉద్యోగయోగం.. వ్యాపార వృద్ధి
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
సాక్షి కార్టూన్ 05-11-2025
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా: ఏఐతో వాత!
ఐసీసీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఇంకా చురుగ్గా పని చేయించడానికట!
ఈ రాశి వారికి భూ, వాహనలాభాలు
సినిమా
ఓటీటీలో 'మిత్రమండలి'.. 20 రోజుల్లోనే స్ట్రీమింగ్
నటుడు ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త చిత్రం ‘మిత్రమండలి’ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్,సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 16న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేదు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అయితే, ఈ మూవీకి సమర్పకులుగా నిర్మాత బన్నీ వాస్ ఉన్నారు.మిత్రమండలి(Mithra Mandali) సినిమా నవంబర్ 6న ఓటీటీ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను షేర్ చేశారు. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.కథేంటంటే...జంగ్లీపట్నానికి చెందిన నారాయణ(వీటీవీ గణేష్)కి కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకంటే.. వారిని చంపేసే రకం. తుట్టె కులం అండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక ఎన్ఎమ్) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్)ని కలుస్తాడు. లంచం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు.అయితే, స్వేచ్ఛ పారిపోవడం వెనక ఆ ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నలుగురు ఆవారాగాళ్లు. రోజంతా బాతకాలు కొట్టడం.. సాయంత్రం మందేసి చిందులు వేయడమే వీరి పని. ఇలాంటి చిల్లర గాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వేచ్ఛ పారిపోవడం వెనున ఉన్న అసలు కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా(Mithra Mandali) చూడాల్సిందే.
హీరో మంచు మనోజ్ సతీమణి ఎమోషనల్.. ఆ ఒక్క పాటతో కన్నీళ్లు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ చిత్రాలతో వెండితెరపై సందడి చేశారు. ఇటీవలే విడుదలైన మిరాయ్తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తేజ సజ్జా కీలక పాత్రలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది.అయితే హీరో మంచు మనోజ్ తాజాగా ఓ మూవీ ఈవెంట్కు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా సాంగ్ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మంచు మనోజ్ అన్నారు. అంతేకాకుడా మౌనికతో తన ప్రేమ విషయాన్ని కూడా పంచుకున్నారు. రాజ్యాలేమీ లేకపోయినా.. రాణిలా చూసుకుంటానని మాటిచ్చానని తెలిపారు.అయితే ఈవెంట్కు హాజరైన మిట్టపల్లి సురేందర్ ఓ సాంగ్ను ఆలపించారు. 'రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా' అంటూ మంచు మనోజ్, మౌనికలను ఉద్దేశించి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలోని పాట పాడారు. భర్తను ప్రేమించే ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదేనంటూ మాట్లాడారు. ఈ పాట విన్న భూమా మౌనిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వేదికపైనే కన్నీళ్లు ఆపులేకపోయింది. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Celebrities Tollywood (@celebrities_tollywood_)
దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్ గెలిచింది మాత్రం!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ కొన్నిసార్లు దెయ్యాలకొంపలానూ మారిపోతుంటుంది. ఏమాటకామాట.. దెయ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది సోహైల్! భయమనేది మా ఇంటావంటా లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చి చీకటి గదిలోకి వెళ్లాడు. తీరా అక్కడ చిన్న వెలుతురు లేకపోగా వింత శబ్ధాలు, ఫ్లాష్ లైట్లలో దెయ్యం ఆకారాలు చూసి మామూలుగా జడుసుకోలేదు. ఇప్పుడదే టాస్క్ తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లోనూ రిపీట్ అవుతోంది.ఆడపులి..ఈ మేరకు ప్రోమో కూడా వదిలారు. తనూజ భయంభయంగానే ఆ గదిలోకి వెళ్లి తనకిచ్చిన టాస్క్ పూర్తి చేసింది. తర్వాత రీతూ వంతు వచ్చింది. లోపల జాగ్రత్త.. అని సంజనా ధైర్యం చెప్తుంటే.. ఆడపులి ఇక్కడ అని బిల్డప్ ఇచ్చింది. తీరా లోపలకు వెళ్లాక ఆ దెయ్యం కాళ్లు పట్టుకోవడమే తక్కువ అన్నట్లుగా మారింది. ఇలా చేస్తే నేను బయటకు పోతా.. అన్న ప్లీజ్.. ప్లీజ్.. అంటూ వేడుకుంటూనే ఉంది. చివర్లో మాత్రం దెయ్యంలా ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు దెయ్యాలే జడుసుకుని పారిపోవడం ఖాయం! ఈ గేమ్లో తనూజ గెలిచినట్లు తెలుస్తోంది. ఇక సుమన్, దివ్య ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్ టాస్కులు పూర్తి చేస్తున్నారు. మరి చివరకు ఎవరు కెప్టెన్సీ కంటెండర్లవుతారో చూడాలి! చదవండి: బండ్ల గణేశ్ సెటైర్లు.. కౌంటరిచ్చిన అల్లు అరవింద్
హీరోలకే నా సలహా.. రెమ్యునరేషన్ తగ్గించండి: విష్ణు విశాల్
చాలామంది హీరోలు తమ ప్రతి సినిమాకు ఎంతోకొంత పారితోషికం పెంచుకుంటూ పోతారు. అందులోనూ హిట్టు పడిందంటే రెట్టింపు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ మన జీతాల గురించే కాకుండా నిర్మాతల కోణంలోనూ ఆలోచించాలంటున్నాడు తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal). ఈయన హీరోగా నటించడంతోపాటు నిర్మించిన లేటెస్ట్ మూవీ ఆర్యన్ (Aaryan Movie). ఈ సినిమా తమళనాడులో అక్టోబర్ 31న విడుదలైంది. హీరోలకే నా సలహామిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్లు పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడవడంతో నిర్మాత గండం గట్టెక్కినట్లే కనిపిస్తోంది! ఇకపోతే ఈ సినిమా తెలుగులో ఆలస్యంగా నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఓ ఈవెంట్లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. నేను నిర్మాతలకు ఎటువంటి సలహాలు ఇవ్వను. హీరోలకు, ఆర్టిస్టులకు మాత్రం ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ రెమ్యునరేషన్ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం ఖాయంఅప్పుడే నిర్మాతలు సినిమాను మరింత క్వాలిటీగా తీయగలరు. లేదంటే చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం! అని చెప్పుకొచ్చాడు. చాలామంది హీరో అభిప్రాయాన్ని కొనియాడుతున్నారు. కోట్లకు పడగలెత్తిన హీరోలు ఓసారి విష్ణు చెప్పేది వింటే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కె దర్శకత్వం వహించాడు.చదవండి: దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్ గెలిచింది మాత్రం!
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా
తెలంగాణలో విధ్వంసం సృష్టించిన ‘మోంథా’... ఉమ్మడి వరంగల్పై తీవ్ర ప్రభావం
ఏపీలో తీరం దాటిన మోంథా తుఫాను
క్రీడలు
సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన.. షమీకి స్థానం ఉందా?
సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని ఈ టీమ్కు పదిహేను మంది సభ్యులను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఇక ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant).. ప్రొటిస్ జట్టుతో సిరీస్ ద్వారా టీమిండియా తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటికే పంత్.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో భారత్- ‘ఎ’ (IND A vs SA) కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.పడిక్కల్పై సెలక్టర్ల నమ్మకంబెంగళూరు వేదికగా జరిగిన తొలి అనధికారిక టెస్టులో పంత్ 90 పరుగులతో రాణించి.. భారత్ను గెలిపించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. సాయి సుదర్శన్తో పాటు దేవదత్ పడిక్కల్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు.ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. ఇటీవల సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో విఫలమైనా పడిక్కల్పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం విశేషం. మరోవైపు.. పంత్ వికెట్ కీపర్గా రీఎంట్రీ ఇవ్వగా.. ధ్రువ్ జురెల్ స్పెషలిస్టు బ్యాటర్గా తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.షమీకి మరోసారి మొండిచేయిఇక స్పిన్నర్ల కోటాలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్తో పాటు.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్థానం సంపాదించగా.. పేసర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ క్రమంలో వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మరోసారి మొండిచేయే ఎదురైంది. రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఇటీవల బెంగాల్ తరఫున షమీ సత్తా చాటినా సెలక్టర్లు అతడిని కనికరించలేదు. మరో బెంగాల్ పేసర్ ఆకాశ్కు చోటిచ్చి షమీని మాత్రం పక్కనపెట్టారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా.. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. నవంబరు 14- నవంబరు 26 వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయి. తొలి టెస్టుకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కాగా.. రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా డీకే.. పన్నెండు జట్ల వివరాలు ఇవే
నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా
న్యూజిలాండ్ పర్యటనను వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో ఆతిథ్య కివీస్పై విండీస్ ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం (West Indies Beat New Zealand) సాధించింది. తద్వారా ఐదు టీ20ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.కాగా ఐదు టీ20 మ్యాచ్లు, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం ఆక్లాండ్లో ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరిగింది. ఈడెన్ పార్క్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. విండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులుదీంతో బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (3), అలిక్ అథనాజ్ (16) విఫలమైనా.. వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న హోప్ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో రోస్టన్ చేజ్ (28), రోవ్మన్ పావెల్ (23 బంతుల్లో 33) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కివీస్ బౌలర్లలో జేకబ్ డఫీ, జకారీ ఫౌల్క్స్ రెండేసి వికెట్లు తీయగా.. కైలీ జెమీషన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు.ఇక విండీస్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్ (27), డెవాన్ కాన్వే (13) ప్రభావం చూపలేకపోయారు. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (21) నిరాశపరచగా.. మార్క్ చాప్మన్ (7), డారిల్ మిచెల్ (13), మైకేల్ బ్రాస్వెల్ (1), జేమ్స్ నీషమ్ (11) పూర్తిగా విఫలమయ్యారు.సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథాఇలాంటి దశలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్లు బాది.. 55 పరుగులు సాధించిన సాంట్నర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, మిగిలిన వారి నుంచి సహకారం అందకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన కివీస్.. 157 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా విండీస్ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ ఛేజ్ చెరో మూడు వికెట్లు కూల్చారు. మిగిలిన వారిలో మాథ్యూ ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, అకీల్ హొసేన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇరుజట్ల మధ్య గురువారం (నవంబరు 6) ఇదే వేదికపై రెండో టీ20 నిర్వహణకై ముహూర్తం ఖరారైంది.చదవండి: అందుకే అర్ష్దీప్ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్
అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండి: టీమిండియా దిగ్గజం
విశ్వ విజేతగా అవతరించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ట్రోఫీని ముద్దాడిన హర్మన్ సేన విజయాన్ని భారతావని ఉత్సవంగా జరుపుకొంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ (ICC Women's World Cup) టోర్నమెంట్లో.. 2005, 2017లో రన్నరప్తోనే సరిపెట్టుకున్న భారత్.. ఈసారి మాత్రం ఆఖరి గండాన్ని అధిగమించింది.గావస్కర్ వ్యాఖ్యలు వైరల్నవీ ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా (Ind Beat SA)ను 52 పరుగుల తేడాతో ఓడించి.. జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే.. టీమిండియా దిగ్గజం, 1983 వరల్డ్కప్ విజేత సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండాస్పోర్ట్స్స్టార్కి రాసిన కాలమ్లో.. ‘‘కొంతమంది భారత పురుషుల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్కప్- 1983 విజయాన్ని.. తాజాగా అమ్మాయిలు చాంపియన్గా నిలవడంతో పోలుస్తున్నారు. అయితే, 1983 ఎడిషన్ కంటే ముందు మెన్స్ టీమ్ ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేదు.నాకౌట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు అప్పుడు అస్సలు తెలియవు. అలాంటిది మేము తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండా విజేతలుగా నిలిచాము.అందుకే అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండిఅయితే మన మహిళా జట్టు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడింది. తర్వాత ఇలా అద్భుతమైన విజయంతో విజేతగా నిలిచింది’’ అని గావస్కర్.. తమ విజయాన్ని అమ్మాయిలతో పోల్చవద్దని స్పష్టం చేశాడు.అదే విధంగా.. ‘‘83లో టీమిండియా సాధించిన విజయం భారత క్రికెట్ రూపురేఖలు మార్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రికెట్ వైపు నడిపించేలా చేసింది. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత క్రికెట్ మరో స్థాయికి చేరుకుంది.ఇప్పుడు భారత జట్టులో కేవలం మెట్రో నగరాల నుంచి వచ్చినవారే కాకుండా.. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు. కాగా నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.సమిష్టి కృషితోఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలి వర్మ (87) గట్టి పునాది వేయగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (58), వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (34) ఇన్నింగ్స్ నిర్మించారు. జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20) స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. అయితే, మంధాన, షఫాలి దీప్తి, రిచా రాణించడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. షఫాలి వర్మ రెండు, నల్లపురెడ్డి శ్రీ చరణి ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సఫారీ జట్టులో ఓపెనర్, కెప్టెన్ లారా వొల్వర్ట్ (101) శతకంతో పోరాడగా.. మిగతా వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (23), సూనే లూస్ (25) అనిరె డెర్క్సెన (35) ఓ మోస్తరుగా రాణించారు. అయితే, భారత బౌలర్ల విజృంభణ ముందు నిలవలేకపోయిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో కేవలం 246 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 52 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సరికొత్త చాంపియన్గా అవతరించింది.చదవండి: అందుకే అర్ష్దీప్ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా డీకే.. పూర్తి వివరాలు
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్కు భారత్ తమ జట్టును ప్రకటించింది. హాంకాంగ్లో నవంబరు 6 నుంచి 9 వరకు మోంగ్ కాక్ వేదికగా జరిగే ఈ పొట్టి టోర్నీలో భారత్కు.. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సారథ్యం వహించనున్నాడు.డీకేతో పాటు రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్లు హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్లో పాల్గొననున్నారు. అదే విధంగా.. దేశీ వెటరన్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) కూడా ఈ టోర్నీలో భాగం కానున్నాడు.ఆరు ఓవర్ల పాటు ఆట కాగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో.. ఒక్కో టీమ్లో ఆరుగురు సభ్యులు (మాజీ క్రికెటర్లు) ఉంటారు. ఆరు ఓవర్ల పాటు ఆట సాగుతుంది. ఇక ఈ షార్టెస్ట్ క్రికెట్ ఈవెంట్లో 2005లో టైటిల్ గెలిచిన భారత్.. రెండుసార్లు రన్నరప్తో సరిపెట్టుకుంది.అయితే, గతేడాది రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలో కనీసం ఫైనల్ కూడా చేరలేదు టీమిండియా. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త సారథిగా డీకే రావడం విశేషం. కాగా తాజా ఎడిషన్లో పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.పన్నెండు జట్లు ఇవేభారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, నేపాల్, ఇంగ్లండ్, యూఏఈ, కువైట్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ (చైనా) ఈసారి టోర్నీలో భాగం కానున్నాయి. పూల్- ‘ఎ’ నుంచి సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్, నేపాల్.. పూల్- ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ యూఏఈ.. పూల్- ‘సి’ నుంచి ఇండియా, పాకిస్తాన్, కువైట్... పూల్- ‘డి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ పోటీపడతాయి.హాంకాంగ్ సిక్సెస్-2025లో పాల్గొనే జట్ల వివరాలుభారత్దినేశ్ కార్తిక్ (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్.ఆస్ట్రేలియాఅలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హోబ్సన్, క్రిస్ గ్రీన్, విల్ బొసిస్టొ, ఆండ్యూ టై.ఇంగ్లండ్జో డెన్లీ (కెప్టెన్), జేమ్స్ కోల్స్, ఈథన్ బ్రూక్స్, టోబీ అల్బర్ట్, జార్జ్ హిల్ డాన్ మౌస్లే, టామ అస్పిన్వాల్.బంగ్లాదేశ్అక్బర్ అలీ (కెప్టెన్) అబు హైదర్ రోని, జిషాన్ ఆలం, మొహమ్మధ్ సైఫుద్దీన్, మొసాడెక్ హొసేన్, రకీబుల్ హసన్, టొఫేల్ అహ్మద్.యూఏఈకౌశిక్ హర్షిత్ (కెప్టెన్), ఖలీద్ షా, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ సాగిర్ ఖాన్, నిలాన్ష్ కేస్వాని, రెజిత్ కురుంగొడె, జాహిద్ అలీ.కువైట్యాసిన్ పటేల్ (కెప్టెన్), ఉస్మాన్ పటేల్, మీట్ భవ్సార్, బిలాల్ తాహిర్, రవిజ సాండరువాన్, అద్నాన్ ఇద్రీస్, మొహమద్ షఫీక్.నేపాల్శరద్ వేసావ్కర్ (కెప్టెన్), సందీప్ జోరా, లోకేశ్ బామ్, బాసిర్ అహ్మద్, ఆదిల్ ఆలం, రషీద్ ఖాన్, రూపేశ్ సింగ్.శ్రీలంకలాహిరు మధుషాంక (కెప్టెన్), ధనంజయ లక్షణ్, తనుక దబారే, నిమేశ్ విముక్తి, లాహిరు సమారకూన్, థారిందు రత్నాయక, సచిత జయతిలకె.సౌతాఫ్రికాజోర్డాన్ మోరిస్ (కెప్టెన్), అబ్దుల్లా బయోమి, ఈథన్ కన్నింగ్హామ్, బులెలొ దూబే, కషీఫ్ జోసెఫ్, బ్లేక్ సింప్సన్, జోరిచ్ వాన్ షాల్వేక్.హాంకాంగ్యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయత్, అన్షుమాన్ రథ్, ఐజాజ్ ఖాన్, నిజాకత్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్, నస్రుల్లా రాణా.అఫ్గనిస్తాన్గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), ఇక్రామ్ అలిఖిల్, కరీం జన్మత్, షరాఫుద్దీన్ ఆష్రఫ్, ఫర్మానుల్లా సఫీ, ఐజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, సెదీకుల్లా పచా.పాకిస్తాన్అబ్బాస్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఖవాజా మొహమద్ నఫాయ్, మాజ్ సదాకత్, మొహమద్ షాజాద్, సాద్ మసూద్ షాహిద్ అజీజ్.చదవండి: యాషెస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
బిజినెస్
జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?
డబ్బు సంపాదించడం ఒక కళ. ధనవంతులు అయ్యేందుకు చాలా మార్గాలు అనుసరించి లక్ష్యం చేరినా, దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎంతో కష్టపడి సంపాదించిన ధనం దేనికి ఖర్చు చేస్తున్నారో సరైన అవగాహన లేకుండానే చాలా మంది నష్టపోతున్నారు. ఇది కేవలం తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే కాదు, అపార సంపద ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛకు పునాదులు వేసుకోవడానికి బదులు, దారిద్ర్యం వైపు నడిపించే ప్రమాదకరమైన అలవాట్లు, ఆర్థిక నిర్ణయాలు ఏమిటో తెలుసుకోవడం అత్యవసరం.అదుపులేని వినియోగం‘నాకు ఇప్పుడే ఆ వస్తువు అవసరం లేదు, కానీ కొనాలి’ అనే భావన పేదరికానికి మొదటి మెట్టు. క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలపై వస్తువులను కొనుగోలు చేయడం, వాటిపై భారీ వడ్డీ చెల్లించడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. తరచుగా కొత్త మోడల్ ఫోన్లు, కార్లు లేదా ఫ్యాషన్ వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేయడం వంటి విధానాల ద్వారా డబ్బు కరిగిపోతుంది. కొనుగోలు చేసిన వస్తువుల విలువ కాలక్రమేణా తగ్గిపోతుంది. ఇతరులను అనుకరించడానికి లేదా సమాజంలో గొప్పగా కనిపించడానికి స్థోమతకు మించిన ఖర్చులు చేయకూడదు.ఆర్థిక అవగాహన లేకపోవడండబ్బు సంపాదించడం గురించి తెలుసుకోవడమే కాదు, అది ఎలా పనిచేస్తుందో తెలియకపోవడం అతిపెద్ద లోపం. డబ్బును బ్యాంకులో ఉంచడం సురక్షితమని భావించి చాలా మంది దాని విలువ ద్రవ్యోల్బణం కారణంగా క్రమంగా తగ్గిపోతోందని గ్రహించడం లేదు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ముఖ్యం. కానీ ఆ పొదుపును తెలివిగా పెట్టుబడి పెట్టకపోతే ఆర్థిక లక్ష్యాలు నెరవేరవు. పన్నుల విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనవసరంగా ఎక్కువ పన్నులు చెల్లించడం లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.అత్యవసర నిధి..ఊహించని సంఘటనలకు (ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం, ప్రమాదాలు) సిద్ధంగా లేకపోవడం వల్ల పేదరికం అంచుల్లోకి వెళుతారు. అత్యవసర సమయాల్లో డబ్బు లేకపోతే అధిక వడ్డీకి అప్పులు చేయక తప్పదు. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. కనీసం ఆరు నెలల జీవన వ్యయాలకు సరిపడా డబ్బును పక్కన పెట్టుకోవాలి. ఏ చిన్న విపత్తు వచ్చినా తీవ్ర సంక్షోభం నుంచి కపాడుకోవడానికి ఇది తోడ్పడుతుంది.ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడటంఒకే ఉద్యోగం లేదా ఒకే వ్యాపారంపై పూర్తిగా ఆధారపడటం ఆర్థిక ప్రమాదానికి సంకేతం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఉద్యోగం పోతుందో చెప్పలేం. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లేకపోతే కుటుంబ పోషణ కష్టమవుతుంది. అదనపు ఆదాయ వనరుల ద్వారా సంపదను వేగంగా పెంచుకునే అవకాశం ఉంది. అన్ని గుడ్లను ఒకే బుట్టలో ఉంచడం మంచిది కాదనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక..రేపటి గురించే కాకుండా 20-30 సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వల్ల కూడా చాలామంది పేదరికంలోకి వెళ్తున్నారు. యువతలో రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు. దానికోసం పొదుపు/పెట్టుబడి పెట్టడం లేదు. దాంతో వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది. ఇల్లు కొనడం, పిల్లల విద్య వంటి స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే పరిస్థితులు తారుమారవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లభించే చక్రవడ్డీ శక్తిని గుర్తించాలి.ఇదీ చదవండి: దొంగలించి ‘ట్రేడ్-ఇన్’ ద్వారా కొత్త ఫోన్!
దొంగలించి ‘ట్రేడ్-ఇన్’ ద్వారా కొత్త ఫోన్!
దొంగిలించబడిన ఐఫోన్ల వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నంలో టెక్ దిగ్గజం యాపిల్ సహకరించడం లేదని యూకే మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ (Met Police) తీవ్రంగా ఆరోపించింది. దొంగిలించబడిన ఫోన్లకు క్రెడిట్ పొందేందుకు నేరస్థులు యాపిల్ ట్రేడ్-ఇన్ (Trade-in) ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.యూకే పార్లమెంటు సభ్యులకు (MPs) మెట్ పోలీస్ సమర్పించిన నివేదికలో.. యాపిల్ సంస్థకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR)కు అవకాశం ఉందని తెలిపారు. ట్రేడ్-ఇన్ పరికరాల నెట్వర్క్ స్థితిని తనిఖీ చేయడానికి మాత్రమే యాపిల్ ప్రతిరోజూ దీన్ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో ఫోన్ల దొంగతనానికి సంబంధించిన అంశాలను తనిఖీ చేయడం లేదని చెప్పారు. అంటే ఎవరైనా ఐఫోన్లు దొంగతనం చేసి ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా క్రెడిట్లు పొంది తిరిగి కొత్త ఫోన్ను పొందవచ్చు. లేదా యాపిల్ గిఫ్ట్ కార్డులు పొందవచ్చు. యాపిల్ సరైన తనిఖీలు చేయకుండా దొంగిలించబడిన పరికరాలు మళ్లీ చలామణిలోకి రావడానికి సమర్థవంతంగా అనుమతిస్తుందని పోలీసులు చెబుతున్నారు.నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR) అనేది దొంగిలించబడిన పరికరాలను గుర్తించడానికి, తిరిగి వాటిని బాధ్యులకు ఇవ్వడానికి చట్ట పరంగా అధికారులు ఉపయోగించే డేటాబేస్. యాపిల్ తన ట్రేడ్-ఇన్ పథకంలో ఈ రిజిస్టర్ను ఉపయోగించడం లేదని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.క్రెడిట్ పాయింట్లువినియోగదారులు తమ పాత ఐఫోన్ను మార్చుకున్నప్పుడు కొత్త ఐఫోన్ కొనుగోలుకు ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్లో ఉదాహరణకు సుమారు 670 యూరోల వరకు క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. సరైన దొంగతనం తనిఖీలు లేకుండా దొంగిలించబడిన ఐఫోన్లను ఈ వ్యవస్థలోకి అంగీకరించి తిరిగి విక్రయించడం లేదా పునరుద్ధరిరిస్తున్నట్లు(Refurbished) పోలీసులు చెబుతున్నారు.పెరిగిన దొంగతనాలుమెట్ పోలీస్ అందించిన సమాచారం ప్రకారం 2024లోనే లండన్లో 80,000 కంటే ఎక్కువ ఫోన్లు దొంగిలించబడ్డాయి. ఇది 2023లో నమోదైన 64,000 దొంగతనాల కంటే పెరిగింది. దొంగిలించబడిన ఈ ఫోన్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలంటే 50 మిలియన్ యూరోలు ఖర్చవుతుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఫోన్లలో 75% పైగా విదేశాలకు తరలివెళ్తున్నాయని, అక్కడ వాటిని విడదీసి విడిభాగాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.యాపిల్ ప్రతిస్పందనమెట్ పోలీస్ విమర్శలను యాపిల్ ఖండించింది. దొంగిలించబడిన డివైజ్ల కోసం కంపెనీ Stolen Device Protection వంటి చర్యలు తీసుకుంటుందని హైలైట్ చేసింది. ఫోన్ యజమాని ధ్రువీకరణ లేకుండా నేరస్థులు డివైజ్లోని డేటాను తొలగించడం లేదా తిరిగి విక్రయించకుండా నిరోధించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: భవిష్యత్తు బంగారు లోహం!
భవిష్యత్తు బంగారు లోహం!
ఏడాది కాలంగా బంగారం, వెండి ధరలు అసాధారణ రీతిలో దూసుకుపోతున్నాయి. ధరల ర్యాలీతో సంతోషిస్తున్న పెట్టుబడిదారులు ఇప్పుడు కీలక దశలో ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా.. లేదా అనే అనుమానం వ్యక్తం కావడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో కామొడిటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కాపర్(రాగి) ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు. పారిశ్రామిక డిమాండ్, సరఫరా కొరత కారణంగా కాపర్ ధరలు సైతం కొంతకాలంగా పెరుగుతున్నాయి. దాంతో కాపర్ ‘భవిష్యత్తు బంగారం’(లాభాల పరంగా)గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాపర్ ధరలు గడచిన ఏడాది కాలంలో దాదాపు 25 శాతం పెరిగాయని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం కేజీ కాపర్ ధర సుమారు రూ.750గా ఉంది. ఇది 2026లో రూ.1500-రూ.1800 వరకు పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.అసలు బంగారం, వెండి ధరలు ఎందుకు పెరిగాయి?బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ అంశాలు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం చూస్తారు. చరిత్రలో బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేసే సాధనంగా ఉంది. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు అధికమయ్యాయి.అనేక దేశాల కేంద్ర బ్యాంకులు భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో తమ నిల్వలను పెంచుకోవడానికి భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశాయి.సాధారణంగా యూఎస్ డాలర్ విలువ తగ్గినప్పుడు డాలర్ ఆధారిత బంగారం ఇతర కరెన్సీలు ఉన్న కొనుగోలుదారులకు చౌకగా మారుతుంది. తద్వారా డిమాండ్ పెరుగుతుంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో సంక్షోభం వంటి సంఘటనలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పెట్టుబడిదారులు భద్రంగా ఉండే బంగారం వైపు మళ్లారు.ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వంటి పరిశ్రమల నుంచి వెండికి పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుంది.కాపర్ (రాగి) ధరల పెరుగుదలకు కారణాలు..ఒకప్పుడు కేవలం పారిశ్రామిక లోహంగా మాత్రమే పరిగణించబడిన కాపర్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మెటల్గా మారుతుంది. కొన్ని నివేదికల ప్రకారం కాపర్ లోహం గత రెండు దశాబ్దాల్లో దాదాపు 700 శాతం పెరిగింది. ఇది పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా గనుల్లో ఉత్పత్తి సమస్యలు, స్థానిక ఆందోళనలు, కొత్త గనుల అభివృద్ధిలో జాప్యం కారణంగా కాపర్ సరఫరా గణనీయంగా తగ్గింది. దీనికి తోడు పెరిగిన డిమాండ్ ధరలను మరింత పెంచింది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుండడం, భారీ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, భవన నిర్మాణ రంగం నుంచి కాపర్కు డిమాండ్ బలపడుతోంది.భవిష్యత్తు అంచనామార్కెట్ నిపుణులు, మైనింగ్ దిగ్గజాలు రాగిని ‘తదుపరి బంగారం’గా పేర్కొంటున్నారు. కాపర్ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలు: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక సంప్రదాయ కారు కంటే ఒక ఎలక్ట్రిక్ కారుకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ కాపర్ అవసరం అవుతుంది. ఈవీల అమ్మకాలు పెరిగే కొద్దీ కాపర్ డిమాండ్ అపారంగా పెరుగుతుంది.క్లీన్ ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన వనరుల్లో ముఖ్యంగా సోలార్, పవన విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణకు కాపర్ అవసరం అనివార్యం. కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థల్లో రాగి కీలకమైన లోహం.డిజిటలైజేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, 5G టెక్నాలజీ, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో కాపర్కు డిమాండ్ పెరుగుతోంది.కాపర్ వినియోగించే పరిశ్రమలుపరిశ్రమవినియోగంవిద్యుత్, ఎలక్ట్రానిక్స్వైర్లు, కేబుల్స్, మోటార్లు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (PCBs)నిర్మాణ రంగం హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, పైపులు, రూఫింగ్రవాణాఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రైల్వేలు, విమానయాన రంగంపునరుత్పాదక శక్తిసోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, బ్యాటరీలుపారిశ్రామిక యంత్రాలుఉష్ణ మాపకాలు(Heat Exchangers), పంపులుగమనిక: పెట్టుబడికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పనిసరని గమనించాలి.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగి ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ
Air India survivor: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం..
జూన్ 12న అహ్మదాబాద్లో టేకాప్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేశ్..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆ రోజు తానెలా బతకాననేది ఒక అద్భుతం కానీ ఇవాళ అదొక పీడకలలా వెంటాడుతోందని ఆవేదనగా చెబుతున్నాడు. ప్రమాద ఘటన అనంతరం బ్రిటన్లో నివాసం ఉంటున్న ఆయన.. స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో అతడి హృదయ విదారక పరిస్థితి వెలుగులోకి వచ్చింది. లక్కీమ్యాన్ కాదు..అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ఇండియా ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడిగా రమేశ్ వార్తల్లో నిలిచారు. బ్రిటన్లో నివాసముంటున్న విశ్వాస్ కుమార్.. గుజరాత్లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు విమానంలో 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి అంబులెన్సు ఎక్కిన దృశ్యాలు ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అంత పెద్ద ప్రమాదంలో బయటపడ్డ లక్కీమ్యాన్గా అందరూ అతన్నిచూస్తుంటే..ఆయన మాత్రం రోజు రోజుకి కుంగిపోతున్నాడు. నిత్య నరకం అనుభవిస్తున్నా అంటూ కన్నీటిపర్యంతమవుతున్నాడు. ఆ ప్రమాదం కారణంగా తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడిని కోల్పోయా..అని బోరుమన్నాడు. ఆ తర్వాత తన జీవితమే తలకిందులైపోయిందని, తన సోదరుడితో కలిసే చేసిన వ్యాపారం కూడా మూతపడిందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తాను తిరిగి నార్మల్గా అవ్వడం అంత సులభం కాదని అంటున్నాడు. ఆ ఘటన తర్వాత నెలలతరబడి మౌనంగా ఉన్నట్లు తెలిపాడు. తానెప్పుడు ఇంటిని వదలి బయటకు వెళ్లడం లేదని, బెడ్రూంలోనే ఒంటిరిగా కూర్చొని ఉంటానని. తనకోసం తలుపు బయట అమ్మ కూర్చొని ఉంటుందని చెబుతున్నాడు. కనీసం తన కొడుకుతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. భరించలేని మానసిక గాయంతో బాధపడుతున్నాని చెబుతున్నాడు. ఇంకా శారీరక అసౌక్యర్యాన్ని ఎదుర్కొటున్నట్లు వివరించాడు. భార్య సాయం లేనిదే కనీసం..తన మోకాలు, భుజం, వెన్ను నొప్పి తోపాటు చేతికి అయ్యిన కాలిన గాయాలతో బాధపడుతున్నానని, భార్య సాయం లేనిదే స్నానం కూడా చేయలేకపోతున్నట్లు బాధగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా, లండన్ లీసెస్టర్ కమ్యునిటీ నాయకుడు, సంజీవ్ పటేల్, అతని సలమాదారు, ప్రతినిధి రాడర్ సీగర్లు కూడా తమ వంతుగా రమేష్కి మద్దతు అందిస్తున్నామని అన్నారు. అలాగే ఎయిర్ ఇండియా కూడా రమేష్కు సుమారు రూ. 21 లక్షల పరిహారం అందించిందని తెలిపారు. అతనికి ఇప్పుడు ఆర్థిక సాయంతోపాటు మానసిక స్థైర్యం, భరోసా అందించాలని అన్నారు. అదే అతడిని తిరిగి కోలుకునేలా చేయగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా సైతం రమేష్కు అవసరమైన సహాయాన్ని అందించడం తమ బాధ్యత అని పేర్కొనడం విశేషం.#WATCH | New video shows miracle survivor from seat 11A walking away from Ahmedabad plane crash site.More news & updates ▶️https://t.co/cetvZaId2H#AirIndiaPlaneCrash #AhmedabadPlaneCrash pic.twitter.com/QdcZJNqef6— Hindustan Times (@htTweets) June 16, 2025 (చదవండి: భారత్పై జర్మన్ పర్యాటకుడి ప్రశంసల జల్లు...!)
స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?
భారత మహిళా క్రికెట్ జట్టు సారధిగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తొలిసారి ఐసీసీ మహిళల ప్రపంచకప్ ట్రోఫీ అందుకొని చరిత్ర సృష్టించారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్గా ప్రతిభ కనబర్చి ప్రపంచ అత్యుత్తమ మహిళ క్రికెటర్లలో నిలవడమే కాదు, ప్రపంచకప్ను సాధించిన కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్ తరువాత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రోలెక్స్ వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.ఇటీవలి లెక్కల ప్రకారం భారత రిచెస్ట్ మహిళా క్రికెటర్గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ నికర విలువ రూ. 25 కోట్లు. ఆమె ధరించి లిమిటెడ్ ఎడిషన్ వాచ్లను కూడా ఇష్టపడుతుంది. ది ఇండియన్ హోరాలజీ అందించిన వివరాల ప్రకారం తాజా వీడియోలో ఆమె ధరించిన వాచ్ ఐకానిక్ రోలెక్స్ డేట్జస్ట్గా గుర్తించారు. చదవండి: జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకిహర్మన్ ప్రీత్కు క్లాసీ టచ్ ఇచ్చిన ఈ రోలెక్స్ డేట్జస్ట్ విలువ భారతదేశంలో సుమారు రూ. 8.7 లక్షలు. 36 mm ఓస్టర్స్టీల్ కేసు, స్క్రూ-డౌన్ స్టీల్ క్రౌన్, రోమన్ సంఖ్యలతో కూడిన తెల్లటి డయల్ స్పెషల్ లుక్లో కనిపిస్తోంది. అంతేకాదు విజయానికి చిహ్నంగా, ఐకానిక్గా రాయల్ లుక్లో ప్రీమియం అనుభవాన్నిస్తుంది.చదవండి: బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్అలాగే ప్రపంచ కప్ ట్రోఫీతో ఆమె పంచుకున్న ఫోటోకూడా వైరల్గా మారింది. క్రికెట్ అనేది జెంటిల్ మేన్ గేమ్కాదు ప్రతీ ఒక్కరిదీ అని అర్థం వచ్చేలా ఉన్న టీ షర్ట్ ట్రెండింగ్లో ఉంది. క్రికెట్ అందరి ఆట అనేది సందేశాన్ని హర్మన్ప్రీత్ గట్టిగానే ఇచ్చినట్టైంది. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)కాగా పంజాబ్కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్ ప్రయాణం పంజాబ్ నుంచే ప్రారంభమైంది.2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసింది మొదలు క్రికెట్ లో అద్భుతమైన క్రీడాకారిణిగా రాణిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మహిళల క్రికెట్లో అత్యంత ప్రభావ వంతమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ప్రతీ ఫార్మాట్లోనూ ఆమెది ప్రత్యేకమైన ముద్ర. తాజాగా మహిళల ప్రపంచకప్ 2025 (Women's World Cup 2025) ట్రోఫిని దక్కించుకుని సూపర్ స్టార్గా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది.
ఘనంగా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట
కోకాపేటలోని ఏఎస్బీఎల్ స్పైర్లో శ్రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన కుంభాభిషేకం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక అక్టోబర్ 31, 2025 శుక్రవారం ఉదయం 10:26 గంటలకు పూర్తి భక్తి శ్రద్దలతో, ఆగమ శాస్త్ర నియమాలు, తెన్నాచార్య సంప్రదాయానికి అనుగుణంగా జరిగాయి.ASBL స్పైర్ లోపల కొత్తగా నిర్మించిన ఆలయం భక్తి, సాంస్కృతిక కొనసాగింపుకు చిహ్నంగా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. సాంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిలో రూపొందించిన ఈ ఆలయ గర్భగుడి దైవిక కృప, ప్రశాంతతను వెదజల్లుతుంది.ఈ సందర్భంగా ASBL గ్రూప్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ, “ ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు భక్తులందర్నీ దగ్గర చేస్తాయని, ఆధునిక జీవనానికి అర్థాన్ని జోడిస్తాయని మేము విశ్వసిస్తున్నాం. మా భవిష్యత్ ప్రాజెక్టులన్నింటిలో ఈ తరహా పవిత్ర స్థలాలను సృష్టించాలని, విశ్వాసం, శాంతి, సామరస్యాన్ని సమిష్టి వేడుకగా జరుపుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము”అని అన్నారు.ఈ వేడుకకు అనేక మంది భక్తులు, నివాసితులు, ASBL కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యాగాలు, హోమాలను నిర్వహించారు. గోవింద, హరే కృష్ణ మంత్రాలతో ప్రాంగణం మొత్తం ప్రతిధ్వనించింది.(చదవండి: యాత్రికులు, నివాసితుల సౌకర్యార్థం రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి)
'ఇంత స్వేచ్ఛగా ఎప్పుడూ అనిపించలేదు'!
మన మాతృగడ్డపై చాలామంది విదేశీయలు పలు విధాలుగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ తన మనసుకి హత్తుకున్న వాటి గురించి కూడా మాట్లాడారు. తాజాగా ఆ కోవలోకి జర్మన్ మోటార్ సైకిల్ రైడర్ చేరిపోయాడు. ఆయన కూడా భారతదేశంలో పర్యటించేటప్పుడూ తనకు కలిగిన అనుభూతిని పంచుకోవడమే కాదు, ఇతర దేశాలతో పోల్చుతూ ఇక్కడే లభించే ఆనందం మాటలకందనిది అంటూ తన అనుభూతిని సోషల్ మీడియలో షేర్ చేసుకున్నాడు.జర్మన్కి చెందిన మోటార్ రైడర్ మార్క్ ట్రావెల్స్గా పేరుగాంచిన మార్కస్ ఎంగెల్ భారతదేశాన్ని బెస్ టూరిస్ట్ ప్లేస్గా అభివర్ణిస్తూ..ఈ మాతృగడ్డపై తన అనుభవాన్ని షేర్ చేశారు. తన పర్యటనలో భారతదేశం అంతటా ప్రయాణించేటప్పుడూ..ప్రపంచంలో మరెక్కడా లేనంత స్వేచ్ఛను అనుభవించానంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో భారతదేశం గురించి ఇంతకముందు చెప్పాను..మళ్లీ ఇప్పుడూ చెబుతాను. నేను ఇప్పటివరకు చాలా దేశాల్లో పర్యటించాను, కానీ భారతదేశంలో పొందిన స్వేచ్ఛ మరెక్కడ పొందలేదు. ఈ ప్రదేశం నాకెంతో ఇష్టమైనది అని వీడియోలో చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి, మార్కస్ ఎంగెల్ సాహసయాత్రలు, సుదూర మోటార్ సైకిల్ పర్యటనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆ నేపథ్యంలోనే భారత్ వచ్చి కొన్నాళ్లు ఇక్కడ గడిపాడు కూడా. అతను కేవలం ద్విచక్ర వాహనంపై ఆ ప్రాంతంలోని సంస్కృతిని అన్వేషిస్తాడు. ఇక మార్కస్ వీడియోలో తాను మళ్లీ కచ్చితంగా భారత్కి తిరిగి వస్తానని చెప్పాడు. ఇక్కడ ఉండటం అంటే చాలా ఇష్టం. చాలాకాలం ఇక్కడ ఉన్నా. అయినా నాకు ఇక్కడ ఉండేలా ఐదేళ్ల వీసా ఉంది. కాబట్టి మళ్లీ అవకాశం వచ్చినప్పుడల్లా భారత్లో వాలిపోతా. ఇక్కడ పర్యటిస్తే కలిగే ఫీల్ వేరేలెవెల్. అని వీడియోని ముగించాడు. ఈ వీడియో నెట్టింట రెండు లక్షలు పైనే వ్యూస్, వేలల్లో లైక్లు వచ్చాయి. భారతదేశం అద్దం లాంటిదని..ఇక్కడ తన అందమైన గమ్యస్థానాలను చూపిస్తూ..తనలో కలిపేసుకుంటుంది. అలానే మిమ్మల్ని వశపరుచుకుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, 15 సంవత్సరాలకు పైగా ప్రొఫెషనల్ సంగీతకారుడిగా పనిచేసిన తర్వాత మార్క్ 2020లో పూర్తి సమయం మోటో-వ్లాగర్గా మారాడు. View this post on Instagram A post shared by Marc Travels (@marc.travels.blog)(చదవండి: వండర్ బర్డ్స్..థండర్ కిడ్స్..)
ఫొటోలు
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)
తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్ (ఫోటోలు)
వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)
జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్ ఎమోషనల్ (ఫోటోలు)
గ్రీన్ లెహంగాలో మెరిసిపోతున్న అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత.. ఫోటోలు
కన్నడ నటికి అవార్డు.. సీఎం చేతుల మీదుగా సన్మానం (ఫోటోలు)
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖుషీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు
పూసలమ్ముతూ ఫేమస్.. మోనాలిసా తెలుగు సినిమా లాంచ్ (ఫోటోలు)
ఫ్యామిలీ వెకేషన్ ట్రిప్లో కాజల్ అగర్వాల్ చిల్.. (ఫోటోలు)
#KartikaPournami : భక్త జనసంద్రంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ (ఫొటోలు)
అంతర్జాతీయం
‘ఇస్కాన్’పై ఉగ్ర ముద్ర.. ‘బంగ్లా’లో ఆందోళనలు
న్యూఢిల్లీ: శ్రీకృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) ఇప్పుడు బంగ్లాదేశ్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ దేశంలోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులన్నీ ‘ఇస్కాన్’పై ఉగ్రవాద ముద్ర వేశాయి. అలాగే ఈ సంస్థపై సంపూర్ణ నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. గత కొంతకాలంగా ఇస్కాన్ దేవాలయంతో సహా బంగ్లాదేశ్లోని పలు హిందూ దేవాలయాలను ఇస్లాంవాదులు తగులబెట్టారు. హిందూ వ్యతిరేక నినాదాల హోరుఇస్కాన్ ను వెంటనే నిషేధించాలని కోరుతూ పలువురు మతఛాందసవాదులు బంగ్లాదేశ్ వీధుల్లో నిరసనలు వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత రాజధాని ఢాకా, చట్టోగ్రామ్లో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలలో హిందూ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. ఇస్కాన్ ను తక్షణం బ్యాన్ చేయాలంటూ నినదించారు. ఈ నేపధ్యంలోనే చట్టోగ్రామ్తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇస్లామిక్ సమావేశాలు జరిగాయి. హెఫాజత్-ఎ-ఇస్లాం, ఇంతిఫాదా బంగ్లాదేశ్ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ను నిషేధించాలని పిలుపునిచ్చిన ఇస్లామిస్ట్ గ్రూప్ హెఫాజత్ ఎ ఇస్లాం సంస్థ గతంలో ముస్లిం మహిళలకు సమాన హక్కుల కోసం చేసిన సిఫార్సులను తీవ్రంగా ఖండించింది. యూనస్ ప్రభుత్వం రాకతో..ఇటీవల ఢాకాలోని బైతుల్ ముకర్రం మసీదు సమీపంలో జరిగిన సమావేశంలో ఇంతిఫాదా బంగ్లాదేశ్ సంస్థ పలు డిమాండ్లను ప్రస్తావించింది. ఇస్కాన్ను నిషేధించడమనేది వాటిలో ప్రధానమైనది. ఢాకాకు చెందిన బంగ్లా దినపత్రిక దేశ్ రూపాంతర్ తెలిపిన వివరాల ప్రకారం అల్-ఖైదా అనుబంధ అన్సరుల్లా బంగ్లా టీం (ఏబీటీ) చీఫ్ జాసిముద్దీన్ రెహమానీ ఇటీవల ఇస్కాన్ను ఒక తీవ్రవాద సంస్థగా అభివర్ణించారు. కాగా 2024, ఆగస్టులో యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రెహ్మాన్ ను జైలు నుంచి విడుదల చేశారు. పలు నేరాలకు పాల్పడిన అవామీ లీగ్ను నిషేధించిన విధంగానే, తీవ్రవాద సంస్థగా ఇస్కాన్ను కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ చట్టోగ్రామ్ ర్యాలీలో ఒక ఇస్లాం వక్త ప్రసంగించినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ పేర్కొంది.1970 నుండి నిస్వార్థ సేవలు2024, ఆగస్టులో హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత నుంచి బంగ్లాదేశ్లో ఇస్కాన్పై నిరసనలు పెరిగాయి. పలు ఇస్కాన్ దేవాలయాలు , కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. ప్రముఖ హిందూనేత కృష్ణ దాస్ ప్రభును అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. 1970 నుండి బంగ్లాదేశ్లో ఇస్కాన్ నిస్వార్థ సేవలు అందిస్తోంది. 1971లో విముక్తి యుద్ధం, వరదల కాలంలో లక్షలాది మందికి ఉచితంగా ఆహారపానీయాలు అందించింది. మతంతో సంబంధం లేకుండా అక్కడి నిరుపేద పిల్లల కోసం అనేక పాఠశాలలను కూడా స్థాపించింది. వృద్ధాశ్రమాలను కూడా నిర్వహిస్తున్నది. ఇది కూడా చదవండి: బుడిబుడి అడుగులతో రోబో గోమాత
భారత ట్రక్కు డ్రైవర్ కేసులో మరో మలుపు
న్యూయార్క్: ఇటీవల కాలిఫోర్నియాలో ముగ్గురు మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్ కేసు మరో మలుపు తిరిగింది. అతను మద్యం మత్తులో వాహనం నడపడం లేదని, అది నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదమని విచారణలో తేలిందని యూఎస్ అధికారులు మీడియాకు తెలిపారు. ప్రాథమిక నివేదికలో సదరు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పేర్కొన్నారు. యుబా సిటీకి చెందిన 21 ఏళ్ల జషన్ప్రీత్ సింగ్ను అక్టోబర్ 21న మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడనే అనుమానంతో అమెరికా పోలీసులు అరెస్టు చేసి, అతనిపై హత్యా నేరం మోపారు. నాడు కాలిఫోర్నియాలోని ఒంటారియోలో డ్రైవర్ జషన్ప్రీత్ సింగ్ కారణంగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ జషన్ప్రీత్ సింగ్కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని రక్తంలో మత్తు కలిగించే పదార్థాలు ఏవీ లేవని నిర్ధారణ అయ్యింది. అయితే వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో జరిగిన హత్యగా దీనిని గుర్తిస్తున్నట్లు శాన్ బెర్నార్డినో కౌంటీ అటార్నీ కార్యాలయం మీడియాకు తెలిపింది.డాష్క్యామ్ ఫుటేజ్లో నాడు సింగ్ రద్దీగా ఉన్న ట్రాఫిక్లో అధిక వేగంతో ట్రక్కును నడిపినట్లు తేలింది. ఇది ముగ్గురు ప్రాణాలను బలిగొన్న దారుణమైన విషాదం. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. నిందితుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని శాన్ బెర్నార్డినో కౌంటీ జిల్లా న్యాయవాది జాసన్ ఆండర్సన్ పేర్కొన్నారు. సింగ్కు ఇప్పుడే బెయిల్ ఇవ్వలేమని, నేరం తీవ్రత, ప్రమాదం తీరు ఆధారంగా బెయిల్ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా అక్రమ వలసదారుడైన సింగ్ 2022లో యూఎస్ దక్షిణ సరిహద్దును దాటాడు. అతని ఇమ్మిగ్రేషన్ విచారణ పెండింగ్లో ఉందని గత నెలలో ‘ఫాక్స్ న్యూస్’ పేర్కొంది. ఇది కూడా చదవండి: మళ్లీ భారత్ను టార్గెట్ చేసిన ట్రంప్
మళ్లీ భారత్ను టార్గెట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: రష్యా , ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్, చైనాలు కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరువైపులా అణ్వాయుధ ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నందున ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమని ‘సీబీఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగే తాను అమెరికా దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సమర్థించుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సీబీఎస్’కు 60 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 33 ఏళ్ల నిషేధం తర్వాత అమెరికన్ దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ తాను ఆదేశాలు జారీ చేశానన్నారు. చైనా, పాకిస్తాన్ ఇప్పటికే రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. అయితే ఆ దేశాలు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదని, తాము అందుకు భిన్నమని అన్నారు. ఉత్తర కొరియా, పాకిస్తాన్ పరీక్షలు చేస్తున్నాయనే సమాచారం తమవద్ద ఉందన్నారు. భారత్, పాక్లు గత మే నెలలో అణు యుద్ధం అంచునకు చేరాయని, అయితే తాను వాణిజ్యం, సుంకాలతో దానిని అడ్డుకున్నానని అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోకపోతే లక్షలాది మంది చనిపోయేవారని ట్రంప్ పేర్కొన్నారు.ఆ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు భూగర్భంలో పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలతో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అయితే కంపనం అనుభూతి మాత్రం కలుగుతుంది. గ్లోబల్ మానిటరింగ్ స్టేషన్లు భూగర్భ అణు పేలుళ్ల వల్ల కలిగే భూకంపం లాంటి కంపనాలను గుర్తిస్తాయి. అటువంటి పరీక్షలను రహస్యంగా నిర్వహించవచ్చని, వాటిని గుర్తించలేమని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ చైనా, పాకిస్తాన్లు అణ్వాయుధాలను పరీక్షిస్తుంటే, అది భారతదేశాన్ని మరింత అస్థిరంగా మారుస్తుందని ట్రంప్ పరోక్షంగా పేర్కొన్నారు.
లోకల్ గ్యాంగ్ హాలీవుడ్ రేంజ్ చోరీ
అది పారిస్లోని ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే మ్యూజియం.. కళలు, చరిత్రకు ప్రతీకగా నిలిచే లూవ్రె మ్యూజియం. అలాంటి చోట గత నెలలో జరిగిన 88 మిలియన్ యూరోలు (సుమారు రూ. 760 కోట్లు) విలువైన ఆభరణాల చోరీ యా వత్ ఫ్రాన్స్ను, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ అత్యంత నాటకీయమైన దోపిడీకి పాల్పడింది.. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠా కాదని, సాధారణ చిల్లర దొంగలని పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించడం విస్మయపరిచింది. సినిమాను తలపించే దొంగతనం దోపిడీ జరిగిన తీరు చూస్తే, అది పక్కా ప్రొఫెషనల్స్ పనే అని అంతా భావించారు. ఎందుకంటే, ఆ రోజు ఉదయం 9.30 గంటలకు, మ్యూజియాన్ని సందర్శకుల కోసం తెరిచిన కొద్దిసేపటికే దొంగలు లోపలికి చొరబడ్డారు. లిఫ్ట్తో ఎంట్రీ నలుగురు దొంగలు దొంగిలించిన మెకానికల్ లిఫ్ట్ వాహనం సాయంతో మ్యూజియం బాల్కనీకి చేరుకున్నారు. 4 నిమిషాల్లో క్లీన్ స్వీప్ అక్కడి నుంచి నేరుగా ’గ్యాలరీ డి అపోలో’లోకి దూరి, డిస్క్ కట్టర్ ఉపయోగించి ప్రదర్శన షో కేసులను పగలగొట్టారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో అత్యంత విలువైన 8 నగలను దోచుకున్నారు. స్కూటర్లపై పరారీఉదయం 9.38 గంటలకు దొంగలు బయట సిద్ధంగా ఉంచిన రెండు స్కూటర్లపై పరారై, ఆ తర్వాత కార్లలోకి మారి పారిపోయారు. ఈ హడావిడిలో దొంగలు దొంగిలించిన ఒక కిరీటాన్ని మాత్రం కింద పడేసి వెళ్లారు. మిగతా ఏడు నగలు ఇప్పటికీ దొరకలేదు. నలుగురు పట్టివేత అరెస్ట్ అయిన నలుగురిలో.. ముగ్గురు పురుషులు, ఒక మహిళ పారిస్కు ఉత్తరాన ఉన్న పేద ప్రాంతమైన సీన్–సెయింట్–డెనిస్లో నివసించే స్థానికులేనని పారిస్ ప్రాసిక్యూటర్ లారె బెకో స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు పురుషులు గతంలో కూడా అనేక దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవించినట్టు పోలీసుల రికార్డుల్లో ఉంది. వీరు వృత్తిపరమైన చిల్లర నేరగాళ్లే తప్ప, అంతర్జాతీయ మాఫియా ముఠాలకు చెందిన వారు కారు. వీరిలో ఒక జంట మాత్రం తమకు ఈ దొంగతనంతో సంబంధం లేదని వాదిస్తోంది. అరెస్టయిన ఇద్దరు పురుషులు మాత్రం.. తమ ప్రమేయాన్ని పాక్షికంగా అంగీకరించారు. ఈ నలుగురు కాక, ఈ దొంగతనాన్ని అమలు చేసిన ఒక వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. చారిత్రక నగలు చోరీ చేసిన ఆభరణాలలో.. ఎంప్రెస్ యూజీనీ (నెపోలియన్ ఐఐఐ భార్య) ధరించిన బంగారు కిరీటం, మేరీ–లూయిస్ నెక్లెస్, చెవిపోగులు వంటి అత్యంత చారిత్రక విలువైన వస్తువులు ఉన్నాయి. దొంగిలించిన వస్తువులు ఇప్పటికే విదేశాలకు తరలిపోయి ఉండవచ్చని ఆందోళన చెందుతున్నప్పటికీ.. వాటిని భద్రంగా తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న ఆశాభావాన్ని ప్రాసిక్యూటర్ వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత, ఫ్రాన్స్ దేశంలోని ఇతర సాంస్కృతిక సంస్థల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాక, లూవ్రె మ్యూజియం నిర్వాహకులు.. తమ విలువైన ఆభరణాలలో కొన్నింటిని మరింత భద్రత కోసం బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్కు తరలించారు. ఏదేమైనా, ಲచోరీల చరిత్రలో, ఈ సైన్–సెయింట్–డెనిస్ గ్యాంగ్ తమ ’మెకానికల్ లిఫ్ట్’, ’స్కూటర్ ఎస్కేప్’ స్టయిల్తో ఒక నవ్వుల పేజీని లిఖించింది! – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం
ఛత్తీస్గఢ్లో ఢీకొన్న రైళ్లు
బిలాస్పూర్: గూడ్స్ను ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో లోకో పైలట్ సహా 8 మంది చనిపోయారు. 14 మంది గాయపడ్డారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. మెము(మెయిన్లైన్ ఎలక్ట్రిక్ మలి్టపుల్ యూనిట్) రైలు కొర్బాలోని గెవ్రా నుంచి పొరుగునే ఉన్న బిలాస్పూర్ వైపు వెళుతోంది. గటోరా–బిలాస్పూర్ స్టేషన్ల మధ్య ఉండగా మెము రైలు ముందు వెళ్తున్న గూడ్స్ను ఢీకొట్టింది. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ ప్యాసింజర్ రైలు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు మెలికలు తిరిగిపోయిన ప్యాసింజర్ రైలు బోగీ ఒకటి గూడ్స్ రైలు వ్యాగన్లపైకి ఎక్కింది.ఘటనలో లోకో పైలట్, ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అసిస్టెంట్ లోకో పైలట్ రష్మీరాజ్ తీవ్రంగా పడ్డారు. గూడ్స్ రైలు గార్డ్ ఆఖరి క్షణంలో బయటకు దూకి స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నుజ్జయిన రైలు బోగీలో చిక్కుకున్న మరో ఇద్దరు లేదా ముగ్గురిని వెలుపలికి తీసేందుకు భారీ యంత్ర సామగ్రి, గ్యాస్ కట్టర్లతో ప్రయత్నాలు చేస్తున్నామని బిలాస్పూర్ కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. క్షతగాత్రులను బిలాస్పూర్లోని అపోలో, ఛత్తీస్గఢ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సీఐఎంఎస్)లో చేరి్పంచామన్నారు.14 మందికిగాను ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రైళ్లు ఢీకొని ఒక్కసారిగా వచ్చిన శబ్ధంతో ఉలిక్కి పడిన సమీప గ్రామస్తులు అక్కడికి చేరుకుని, రక్షణ చర్యల్లో పాలుపంచుకున్నారన్నారు. రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ.లక్ష అందజేస్తామని ప్రకటించింది. ఘటనకు దారి తీసిన కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే సేఫ్టీ కమిషనర్ స్థాయిలో సవివర దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. గూడ్స్ రైలు, రెడ్ సిగ్నల్ స్పష్టంగా కనిపిస్తున్నా లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులను వాడటంలో విఫలమవడంపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. సహాయక, ట్రాక్ పునరుద్ధరణ చర్యలను రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని, స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం కారణంగా హౌరా–ముంబై సెక్షన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వృత్తి, వ్యక్తిగత జీవితంలో సమతుల్యత ఉందా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ విధులు, పని–వ్యక్తిగత జీవితాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను సాధించడం కీలకంగా మారింది. వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంతోపాటు జీవన నాణ్యతను ఎంత వరకు సమతౌల్యంగా ఉండేలా చూస్తున్నారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సంప్రదాయ ‘పని–జీవిత సమతౌల్యత’విధానాల మాదిరిగా కాకుండా ‘జీవితం–పని సమతుల్యత’సాధన అనే అంశానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. మెరుగైన జీవనశైలితో జీవితానికి మొదటగా, పని లేదా విధులకు ఆ తర్వాత ప్రాధాన్యతనివ్వడం కొంతకాలంగా ఓ నూతన ధోరణిగా ప్రచారంలోకి వచి్చంది. సంతోషకరమైన జీవితం గడుపుతూ పనిపై ఆధిపత్యం చెలాయించకుండా చూడటాన్ని ప్రభావపూరితమైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్గా అంచనా వేస్తున్నారు. చాలా దేశాల్లో ఎక్కువ పని గంటలు, అసమతౌల్య ఆహారం గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇదీ అధ్యయనం...గ్లోబల్ హెచ్ఆర్ సంస్థ ‘రిమోట్’ఏటా ప్రపంచంలోని అత్యధిక జీడీపీ ఆధారిత 60 దేశాలను సర్వే చేస్తోంది. ఆయా దేశాల్లో చట్టబద్ధమైన చెల్లింపు సెలవులు, ప్రభుత్వ సెలవులు, అనారోగ్య సెలవులు, ప్రసూతి సెలవులు, కనీస వేతనం, ఆరోగ్య సంరక్షణ, సంతోష సూచిక, వారంలో పని గంటలు, ప్రజాభద్రత, ‘ఎల్జీబీటీక్యూ ప్లస్’హక్కులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. ప్రజలు నాణ్యమైన జీవితాన్ని గడపడానికి, విధుల్లో పని చేయడానికి ఎలాంటి పరిస్థితులు వీలు కల్పిస్తాయో, ఏవి వెనుకబడి ఉన్నాయో అంచనా వేసి ర్యాంకులు ఇస్తోంది. అయితే బలమైన విధానాల కారణంగా ఉద్యోగుల శ్రేయస్సులో చిన్న ఆర్థిక వ్యవస్థలు తరచూ పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగ్గా ఉంటాయని నివేదిక పేర్కొంది. ఈ ఏడాదికిగాను హెచ్ఆర్ సంస్థ విడుదల చేసిన నివేదికలో అమెరికా సహా అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు టాప్–10లో స్థానం లభించలేదు.యూఎస్ ర్యాంక్ 60లో 59...మొత్తం 60 దేశాల్లో గ్లోబల్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్–2025 పేరుతో నిర్వహించిన అధ్యయనంలో భారత్ 42వ ర్యాంకుతో అమెరికా కంటే చాలా ముందుంది. అగ్రరాజ్యం అమెరికా మాత్రం 59వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆధునిక, డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటారు. అమెరికా వంటి దేశాల్లో ప్రజలు పగలు, రాత్రి పని చేస్తారు. అయితే పని–జీవిత సమతౌల్యత అమెరికన్లకు ప్రధాన సమస్యగా మారింది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఉద్యోగులు తక్కువ వేతనంతో కూడిన సెలవులు, తక్కువ కనీస వేతనం పొందుతున్నట్లు వెల్లడైంది. భారత్లో ఉద్యోగులు 35 రోజుల వేతనంతో కూడిన సెలవులను పొందుతున్నారు. పేలవమైన ఆరోగ్య సంరక్షణ, పరిమిత అనారోగ్య సెలవులు, సుదీర్ఘ పనిగంటలు మాత్రం భారత ఉద్యోగులకు సవాళ్లుగా నిలుస్తున్నాయి.న్యూజిలాండ్కు టాప్ ర్యాంక్...ఈ నివేదికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడి ఉద్యోగులు మంచి వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులను పొందుతున్నారు. దీంతో వారి ఉద్యోగ జీవితం ఉత్తమంగా ఉంది. వారికి 32 రోజుల వేతనంతో కూడిన సెలవు లభిస్తోంది. అనారోగ్య సెలవు తీసుకుంటే జీతంలో కోత విధింపు లేదు. 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా అక్కడి ఉద్యోగులకు గంటకు సగటు జీతం మెరుగ్గా చెల్లిస్తున్నారు.నివేదికలోని టాప్–10 దేశాలివే...ర్యాంకు దేశం 1 న్యూజిలాండ్2 ఐర్లాండ్3 బెల్జియం4 జర్మనీ5 నార్వే6 డెన్మార్క్7 కెనడా8 ఆస్ట్రేలియా9 స్పెయిన్10 ఫిన్లాండ్
రేపే బిహార్ తొలి పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ప్రచార ఘట్టానికి తెరపడింది. తొలి దశలో భాగంగా గురువారం 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొలి దశ ఎన్నికలు జరిగే స్థానాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. చివరిరోజు ఇటు ఎన్డీయే, అటు మహాగఠ్బంధన్ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ ముఖ్య నేతలు ఎన్డీయే తరఫున... ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నాయకులు మహా కూటమి తరఫున చివరి అ్రస్తాలను సంధించారు.తేజస్వీ యాదవ్ ‘10 లక్షల ఉద్యోగాల’ హామీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, నితీశ్ కుమార్ తనదైన శైలిలో జంగిల్రాజ్ను గుర్తుచేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనపై విమర్శలు గుప్పించారు. తలరాతను నిర్ణయించనున్న తొలి దశ బిహార్ ఎన్నికల్లో పారీ్టల భవితవ్యాన్ని తొలి దశ ఎన్నికలే నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ 121 స్థానాల్లోనే ఆర్జేడీ, జేడీ(యూ) బలాబలాలు పరీక్షకు నిలవనున్నాయి. ఆర్జేడీ తన ‘ముస్లిం–యాదవ్’ సమీకరణాన్ని పటిష్టం చేసుకుందో లేక నితీశ్ కుమార్ తన ‘ఈబీసీ, మహాదళిత్’ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నారో లేదో మొదటి దశ ఎన్నికలే స్పష్టం చేస్తాయి.అందరి కళ్లూ చిరాగ్పైనేఈ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగల ఏకైక అంశం ‘చిరాగ్ ఫ్యాక్టర్’. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీకి జై కొడుతూనే సీఎం నితీశ్ కుమార్ను టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీ–రామ్ విలాస్).. ఈ తొలి దశలో అత్యంత కీలకంగా మారారు. జేడీ(యూ) పోటీ చేస్తున్న దాదాపు అన్ని స్థానాల్లో ఎల్జేపీ–రామ్ విలాస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ అభ్యర్థులు జేడీ(యూ) ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఓట్ల చీలిక నేరుగా మహాగఠ్బంధన్ అభ్యర్థుల గెలుపునకు దారితీస్తుందని విశ్లేషకుల అంచనా. పోటాపోటీ ఇక్కడే తొలి దశలో నితీశ్ కేబినెట్లోని 8 మంది మంత్రులతో సహా పలువురు ఉద్ధండుల భవితవ్యం తేలనుంది. ⇒ ఇమామ్గంజ్: మాజీ సీఎం జితన్రామ్ మాంఝీ (హిందూస్తానీ అవామ్ మోర్చా) భవితవ్యాన్ని తేల్చనున్న ప్రతిష్టాత్మక స్థానం. ⇒ జముయి: అంతర్జాతీయ షూటర్ శ్రేయసి సింగ్ (బీజేపీ) రాజకీయ అరంగేట్రం చేస్తున్న స్థానం.⇒ గయా టౌన్: బీజేపీ కంచుకోటలో మంత్రి ప్రేమ్ కుమార్ మరోసారి బరిలో ఉన్నారు.⇒ బాంకా: మంత్రి రామ్ నారాయణ్ మండల్ (బీజేపీ), మాజీ మంత్రి జైప్రకాశ్ నారాయణ్ యాదవ్ (ఆర్జేడీ) మధ్య ముఖాముఖి పోరు.ప్రభావిత అంశాలు ⇒ ఈ ఎన్నికల మొత్తంలో రాజకీయ చర్చను నిర్దేశించిన ఏకైక అంశం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పస్తూ తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించడం కులాలకు అతీతంగా యువతను ఆకర్శిస్తోంది. ⇒ 15 ఏళ్ల నితీశ్ కుమార్ పరిపాలనపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి విపక్ష కూటమి తీవ్రంగా యతి్నంచింది. ⇒ ఎన్డీయేకు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాయే అతిపెద్ద బలం. నితీశ్పై ఉన్న వ్యతిరేకతను మోదీ ఇమేజ్తో అధిగమించాలని బీజేపీ వ్యూహరచన చేసింది. ⇒ నితీశ్ కుమార్ తన ప్రచారంలో ప్రధానంగా అభివృద్ధి, శాంతి భద్రతల గురించే ప్రస్తావించారు. రాష్ట్రానికి ‘జంగిల్రాజ్’ నుంచి విముక్తి కల్పించానని చెప్పారు. ప్రతి గ్రామానికీ విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించానని గుర్తుచేశారు. ⇒ నితీశ్ కుమార్ ‘అభివృద్ధి’ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇచ్చాయి. రాష్ట్రంలోనే పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఉంటే బిహార్ బిడ్డలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారని ప్రశ్నించాయి.
భారతీయులే టార్గెట్
న్యూఢిల్లీ: కెనడాలో ప్రభుత్వం మారినా, ప్రధాని మారినా భారత వ్యతిరేక విధానాల్లో ఏ మార్పూ రాలేదు. భారతీయుల వీసాలను తిరస్కరించటమే లక్ష్యంగా ఆ దేశం వలస, ఆశ్రయ చట్టానికి సవరణలు ప్రతిపాదించటమే అందుకు ఉదాహ రణగా నిలుస్తోంది. కెనడా ప్రభుత్వం ఇటీవల ఆ దేశ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేలా చట్ట సవరణకు అనుమతి ఇచ్చినట్టు సీబీసీ న్యూస్ సంస్థ వెల్లడించింది. ఇమిగ్రేషన్, రిఫ్యూజీ అండ్ సిటిజన్షిప్ కెనడా (ఐఆర్సీసీ), కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) నుంచి సేకరించిన పత్రాలను విశ్లేషించి సీబీసీ న్యూస్ ఈ వివరాలు వెల్లడించింది.దీని ప్రకారం తాత్కాలిక నివాస వీసాల (టీఆర్వీ)ను గంపగుత్తగా తిరస్కరించేందుకు ఇమిగ్రేషన్ విభాగానికి అధికారాలు దఖలుపడేలా చట్టసవరణ ప్రతిపాదించారు. ఇందులో ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ పౌరులనే టార్గెట్ చేస్తూ ఈ మార్పులు ప్రతిపాదించారని సీబీసీ కథనంలో పేర్కొంది. ఎవరిదైనా వీసా తిరస్కరించాలంటే దానిపై ప్రత్యేకంగా విచారణ జరిపి, దుర్వినియోగం అయ్యిందని తేలితే చర్యలు తీసుకుంటారు.కానీ, ఇకపై ఒక్కో కేసును కాకుండా మూకుమ్మడిగా వీసాలను తిరస్కరించేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. కెనడా ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో భారతీయ విద్యార్థుల నుంచి వచ్చిన వీసా దరఖాస్తుల్లో 74 శాతం దరఖాస్తులను తిరస్కరించిందని రిపోర్టులు చెబుతున్నాయి. అదే నెలలో చైనా నుంచి వచ్చిన విద్యార్థి వీసాల్లో 24 శాతం మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. 2023 ఆగస్టులో భారతీయ విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 32 శాతం మాత్రమే.పెరుగుతున్న ఆశ్రయ దరఖాస్తులుకొన్నేళ్లుగా భారత్ నుంచి కెనడాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2024లో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి కెనడాకు 20,245 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భారత్, నైజీరియా నుంచే అధికంగా ఉన్నాయి. 2023 మేలో భారత్ నుంచి ఆశ్రయం కోరుతూ వచ్చిన విద్యార్థుల దరఖాస్తులు 500 వరకు ఉండగా, 2024 జూలై నాటికి నెలకు 2,000లకు పెరిగాయి.వీటికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఇమిగ్రేషన్ చట్టంలో సవరణలు ప్రతిపాదించినట్టు సీబీసీ పేర్కొంది. కెనడా నిర్ణయంపై వలసల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. కెనడా ప్రభుత్వం తన ప్రయత్నాలను మానుకోవాలని దాదాపు 300 సంఘాలు విజ్ఞప్తి చేశాయి. చట్ట సవరణ అమలైతే ప్రస్తుతం అమెరికా నుంచి విదేశీయులను గెంటివేస్తున్నట్టుగానే కెనడా నుంచి కూడా విదేశీయులను మూకుమ్మడిగా గెంటేస్తారని ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు.
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వహించిన “చెంచు లక్ష్మి” నృత్య నాటిక, కళా పరిమళాలను విరజిమ్ముతూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యా సేవతో మిళితం చేస్తూ, సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF) కు అందజేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కాంతివంతమైన మార్గం వేస్తుందనే సంకేతంగా నిలిచింది. వేదికపై దీపాల కాంతి, పూజా మంత్రాల నినాదం మధ్య వేడుక ప్రారంభమైంది. మంచినీటి వంటి స్వరంతో హర్షిణి చుండి మరియు శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయకర్తలుగా ప్రవేశించి కార్యక్రమాన్ని నడిపారు.మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు — “కళ మనసును మేల్కొలుపుతుంది, విద్య భవిష్యత్తును వెలిగిస్తుంది” అనే మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ. తర్వాత దీపప్రజ్వలన కార్యక్రమంలో, ఫోర్సిత్ కౌంటీకి చెందిన ఎన్నో ప్రముఖులు ఒకచోట చేరారు రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్),మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్).దీప కాంతుల జ్యోతి విరజిమ్మగా, వేదిక ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. “చెంచు లక్ష్మి” — ప్రేమ, పరమాత్మకత, ప్రకృతి గాథకథ — దేవుడు నరసింహ స్వామి, భక్తి రూపిణి లక్ష్మి, మరియు అరణ్యాల గుండెల్లో పుట్టిన చెంచు లక్ష్మి మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ.నల్లమల అడవుల సౌందర్యం, మనసుని తాకే సంగీతం, భక్తి పుష్టి తో నిండిన నాట్యరూపాలు — అన్నీ కలగలసిన ఆ అద్భుత నాటిక.నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారులు నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం — ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25) మరియు కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి.వేదికపై సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలు అందజేయబడ్డాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల ,టాడ్ జోన్స్ ఈకార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు.
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది.
క్రైమ్
భార్య పీక నొక్కి హత్య
తూర్పు గోదావరి జిల్లా: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. మద్యంకు బానిసైన భర్త వేధింపులు ఆఖరికి అతనే యముడై భార్య ప్రాణాలు తీసిన విషాద ఘటన యానాంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం స్ధానిక బళ్లావారివీధిలో నివాసం ఉంటున్న పెమ్మాడి దీనా(26)ను ఆమె భర్త పెమ్మాడి నాని సోమవారం రాత్రి పీక నొక్కి హత్య చేశాడని ఎస్సైలు పునీత్రాజ్, శేరు నూకరాజు తెలిపారు. గుత్తెనదీవికి చెందిన పెమ్మాడి నానితో దీనాకు వివాహం అయ్యింది. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. అయితే కొన్నాళ్లు కాపురం సజావుగా సాగిన అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. యానాం సబ్కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. భర్త నాని సరిగా పనికి వెళ్లకుండా, మద్యం తాగుతూ తిరుగుతుండేవాడని దీంతో విరక్తి చెందిన భార్య దీనా నాలుగు నెలల క్రితం యానాంలో బల్లావారివీధిలో గృహం అద్దెకు తీసుకుని విడిగా ఉంటోందన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె కుటుంబ పోషణకు టైలరింగ్ చేసేంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త నాని కొద్ది రోజుల క్రితం దీనా ఉంటున్న ఇంటికి వచ్చి తాను బాగా చూసుకుంటానని, నీవు లేకుండా ఉండలేనని ఆమెను నమ్మించాడు. మళ్లీ మద్యం తాగి వచ్చి భార్యను కొట్టడమే కాక ఆమె పట్ల అనుమానం వ్యక్తం చేసి వేధింపులకు గురి చేసేవాడు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి భోజనం చేశాడు. అనంతరం తీవ్రంగా కొట్టి పీకనొక్కి చంపేసి అనంతరం ఆమె మృతదేహాన్ని నిద్రపోతున్న ఆరేళ్ల పాప వద్ద ఉంచి అతను పరారయ్యాడు. మంగళవారం ఉదయాన్నే నిద్ర లేచిన పాప పక్కనే ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి స్థానికులకు తెలపగా వారు యానాం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ వరదరాజన్ ఆదేశాల మేరకు ఎస్సై పుష్పరాజ్ ఆధ్వర్యంలో రెండు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్కు సమాచారం అందించినట్లు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో కిడ్నాప్ కలకలం
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లి వద్ద కిడ్నాప్ కలకలం రేపుతుంది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ ఘటనపై కూతురు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక.. వెల్గటూర్ మండలం రాజక్క పల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇక, పెద్దలను ఎదిరించి ఈ ఏడాది జూలై 27న ప్రియాంకా, రాకేష్ వివాహం చేసుకున్నారు.అయితే, రాకేష్ దళితుడైన కారణంగా ప్రియాంకా తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని వ్యతిరేకించారు.. అలాగే, ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్లో చూపిస్తామని నమ్మించిన తల్లిదండ్రులు.. హాస్పిటల్కి చూపించి తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకుంది. ఈ విషయంపై తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులతో తనకు తన భర్త రాకేష్కు ప్రాణహాని ఉందని కంప్లైంట్లో తెలిపింది. ఈ ఘటనపై ప్రియాంకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రోడ్డు ప్రమాదంలో రియాల్టీ షో డ్యాన్సర్ దుర్మరణం
బెంగళూరు: రియాలిటీ షోలలో తన పెర్ఫామెన్స్తో పేరు తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్సర్ సుధీంద్ర (30) మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కొత్త కారు కొనుగోలు చేసిన సుధీంద్ర, ఈ ఆనందాన్ని తన సోదరుడితో పంచుకునేందుకు వెడుతుండగా బెంగళూరు నగర శివార్లలోని నెలమంగళలోని పెమ్మనహళ్లి సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన కుటుంబం సభ్యులు విచారంలో మునిగిపోయారు.‘డాన్స్ షో’తో సహా కన్నడ రియాలిటీ షోలతో పేరుతెచ్చుకున్న సుధీంద్ర,కర్ణాటకలోని త్యామగోండ్లు గ్రామానికి చెందిన వాడు. డోబ్స్పేటలో ఒక పాఠశాలను కూడా నడుపుతూ ప్రజాదారణ పొందాడు. సోమవారం కొత్త కారును కొనుగోలు చేశాడు. అనంతరం పెమ్మనహళ్లిలోని సోదరుడికి ఇంటికి బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో, కారులో సాంకేతిక లోపం ఏర్పడింది, దీనితో డ్యాన్సర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి తనిఖీ చేస్తుండగా, అటునుంచి వస్తున్న ట్రక్కు అతణ్ని బలంగా ఢీట్టింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.#Accident near #Bengaluru 36-year-old dancer Sudheendra died near Nelamangala after a truck rammed into him. He had stopped to inspect his new car that developed a snag. He was on his way to his brother’s house to show the car when the mishap occurred.@timesofindia pic.twitter.com/DyeIROeWuL— TOI Bengaluru (@TOIBengaluru) November 4, 2025 సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట సంచలనగా మారింది. ఇది ప్రమాదం కాదు, హత్య అనే ఆరోపణలు వినిపించాయి. టక్కు వేగంగా లేదనీ, కావాలనే ఢికొట్టినట్టు కనిపిస్తోందని, లేదంటే డ్రైవర్ తాగి ఉన్నాడా? నిద్ర మత్తులో ఉన్నాడా? అనే అనుమానాలు వెల్లువెత్తాయి. ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో తేలనుంది. మరోవైపు కేసు నమోదు చేసిన డోబ్స్పేట పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేశారు.
ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేయించిన మొదటి భార్య.!
అంబర్పేట: అంబర్పేట పరిధిలోని డీడీ కాలనీలో గత నెల 29న జరిగిన కిడ్నాప్ కేసును పోలీసుల ఛేదించారు. బాధితుడి మొదటి భార్యే కిడ్నాప్నకు సూత్రధారి అని తేల్చారు. ఈమేరకు మంగళవారం ఈస్ట్జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ హరిష్కుమార్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. డీడీ కాలనీలో నివాసం ఉండే మంత్రి శ్యామ్ను అక్టోబరు 29న కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై శ్యామ్ రెండో భార్య ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ వ్యవహారం ఇలా... శ్యామ్కు అమెరికాలో మాధవీలత అనే యువతితో వివాహం, అక్కడే విడాకులు జరిగాయి. వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇద్దరు నగరానికి విచ్చేసి విడివిడిగా ఉంటున్నారు. శ్యామ్ అలీగా పేరు మార్చుకుని ఫాతమా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా ఇటీవల శ్యామ్ బంజారాహిల్స్లో తనకు వారసత్వంగా వచి్చన ఆస్తిని సుమారు రూ.20 కోట్లకు విక్రయించాడు. అందులో తనకు వాటా కావాలని మాధవీలత భావించి కిడ్నాప్నకు ప్రణాళిక వేసింది. ఈ మేరకు తనకు పరిచయం ఉన్న పటేల్నగర్కు చెందిన దుర్గావినయ్ను సంప్రదించింది. దుర్గా వినయ్ రామ్నగర్లో నివసించే స్నేహితుడు కట్టా దుర్గాప్రసాద్ అలియాస్ సాయి సాయంతో కిడ్నాప్కు పథకం రచించారు. ఈమేరకు మొదట కూకట్పల్లికి చెందిన ప్రీతి, మలక్పేటకు చెందిన సరితలను బాధితుడు శ్యామ్ నివసిస్తున్న అపార్ట్మెంట్లోని ఎదురు ఫ్లాట్లో అద్దెకు దించి అతని కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. అనంతరం ఈ నెల 29న కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యానగర్కు చెందిన కాటమోని పురుషోత్తం, పురానాఫూల్కు చెందిన సందోలు నరే కుమార్, ఆగాపురాకు చెందిన పవన్కుమార్, మంగళ్హాట్కు చెందిన నారాయణ రిషికేష్, పటేల్నగర్కు చెందిన పిల్లి వినయ్లతో కలిసి శ్యామ్ను కిడ్నాప్ చేశారు. పోలీసులకు తెలిసిందని... శ్యామ్ కిడ్నాప్పై పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిసి నిందితులు మొదట కిడ్నాప్నకు వినియోగించిన కారును చర్లపల్లిలో వదిలి వేరే వాహనంలో వెళ్లారు. అనంతరం మొదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. రూ.30 లక్షలు డిమాండ్ చేయడంతో శ్యామ్ అతని స్నేహితుడు రఘునాథ్రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు అడగడంతో పాటు కిడ్నాప్ అయినట్లు సమచారం ఇచ్చారు. అప్పటికే పోలీసులు ముమ్మరంగా గాలిస్తుడడంతో కిడ్నాపర్లు విజయవాడకు వెళ్లారు. ఈ విషయాన్ని ఎలా ముగించాలని కిడ్నాపర్లు మాధవీలతను సంప్రదించగా ఆమె సరిగ్గా స్పందించలేదు. దీంతో బాధితుడు తానే డబ్బులు ఇస్తానని కిడ్నాపర్లను నమ్మించి బంజారాహిల్స్లోని ఓ బ్యాంకుకు తీసుకువెళ్లాడు. అక్కడ శ్యామ్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని పోలీసుల చెంతకు చేరి జరిగింది వివరించాడు. దీంతో కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, 8 సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు.
వీడియోలు
Maoists: ఎన్కౌంటర్లో ముగ్గురు మృతి
కాళ్లావేళ్లా పడ్డ కనికరించలేదు ... YSRCP మద్దతుదారులపై టీడీపీ నేతల కక్షసాధింపు
YSRCP నేతలపై టీడీపీ రాళ్ళ దాడి జేసీపై రెచ్చిపోయిన పెద్దారెడ్డి
Breaking News : మరో బస్సు ప్రమాదం
Mexico: దేశ అధ్యక్షురాలిని నడిరోడ్డు మీద లైంగికంగా..
Galla Madhavi: వృద్ధులకు ఇంటికెళ్లి రేషన్ ఇవ్వాలి కానీ ఆ పరిస్థితి లేదు
ACB Raids: వణికిపోతున్న సబ్ రిజిస్ట్రార్ అధికారులు
AP Govt: ఐదో తేదీ వచ్చినా ఉద్యోగులకు పూర్తి జీతాలివ్వని ప్రభుత్వం
ట్రంప్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన మమ్దనీ
Satish Kumar: భారతమ్మ గొప్పతనం ఏంటో చూపిస్తా? ఆదినారాయణ రెడ్డికి గూబపగిలేలా కౌంటర్

