breaking news
Stock Market
-
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లలో ఫాగ్-ఎండ్ కొనుగోళ్ల కారణంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ చివరి గంటలో పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 944 పాయింట్లు లేదా 1.17 శాతం పెరిగి 81,666 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 263 పాయింట్లు లేదా 1.06 శాతం పెరిగి 25,088 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.94 శాతం, మిడ్ క్యాప్ 1.31 శాతం నష్టపోయాయి.సెన్సెక్స్లో పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఆర్ఐఎల్, ఎం&ఎం టాప్ గెయినర్లలో ఉన్నాయి. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ట్రెంట్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. -
15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మొత్తం 15 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో బడ్జెట్ రోజున సెన్సెక్స్ ఎనిమిది సార్లు నష్టాలు మూటగట్టుకుంది. ఏడు పర్యాయాలు లాభాలు ఆర్జించింది. ఇందులో 2019, 2024 సాధారణ ఎన్నికలకు ముందు రెండుసార్లు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.బడ్జెస్ట్ రోజు సెన్సెక్స్ ఇలా..➤2014 జూలై 10 - 72 పాయింట్ల లాభం: 25,373 వద్ద ముగింపు➤2015 ఫిబ్రవరి 28 - 141 పాయింట్ల లాభం: 29,362 వద్ద ముగింపు➤2016 ఫిబ్రవరి 29 - 152 పాయింట్ల నష్టం: 23,002 వద్ద ముగింపు➤2017 ఫిబ్రవరి 1 - 486 పాయింట్ల లాభం: 28,142 వద్ద ముగింపు➤2018 ఫిబ్రవరి 1 - 58 పాయింట్ల నష్టం: 35,907 వద్ద ముగింపు➤2019 ఫిబ్రవరి 1 - 213 పాయింట్ల లాభం: 36,469 వద్ద ముగింపు➤2019 జూలై 5 - 58 పాయింట్ల నష్టం: 39,513 వద్ద ముగింపు➤2020 ఫిబ్రవరి 1 - 395 పాయింట్ల నష్టం: 39,736 వద్ద ముగింపు➤2021 ఫిబ్రవరి 1 - 2,315 పాయింట్ల లాభం: 48,601 వద్ద ముగింపు➤2022 ఫిబ్రవరి 1 - 848 పాయింట్ల లాభం: 58,863 వద్ద ముగింపు➤2023 ఫిబ్రవరి 1 - 158 పాయింట్ల లాభం: 59,708 వద్ద ముగింపు➤2024 ఫిబ్రవరి 1 - 107 పాయింట్ల నష్టం: 71,645 వద్ద ముగింపు➤2024 జూలై 23 - 73 పాయింట్ల నష్టం: 80,429 వద్ద ముగింపు➤2025 ఫిబ్రవరి 1 - 5 పాయింట్ల నష్టం: 77,506 వద్ద ముగింపు➤2026 ఫిబ్రవరి 1 - 1,843 పాయింట్ల నష్టం: 80,723 వద్ద ముగింపు -
ఫ్లాట్గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 7 పాయింట్లు తగ్గి 24,836 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 పెరిగి నష్టపోయి 80,872 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 02-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ డకౌట్
2026 బడ్జెట్ మ్యాచ్లో నిర్మలా సీతారామన్ వేసిన తొలి ఓవర్కే స్టాక్ మార్కెట్ డకౌట్ అయింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పై ఆర్థిక మంత్రి వేసిన పన్నుల ఫుల్ టాస్కి బ్రోకరేజీలు క్లీన్ బౌల్డ్ అయ్యాయి. బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ పాయింట్ల బ్యాటింగ్ చేస్తుందనుకుంటే నిర్మలా సీతారామన్ వేసిన అనూహ్య బౌన్సర్కు సెన్సెక్స్–నిఫ్టీ స్టంపులు ఎగిరిపోయాయి. ఓపెనింగ్ ఓవర్లోనే సెన్సెక్స్పై భారీ అమ్మకాల యార్కర్ల దాడి జరిగింది. మిడ్ సెషన్కల్లా రెడ్ స్కోర్బోర్డ్ దడ పుట్టించింది.. ఇన్వెస్టర్లు డకౌట్ అయ్యి వెనుదిరిగితే, ఎల్బీడబ్లు్య అప్పీల్కి బుల్స్ చేతులు ఎత్తేశారు. బడ్జెట్ మ్యాచ్ లాభాల గెలుపుతో కాకుండా.. నష్టాల ఓటమి షాక్తో ముగిసింది.న్యూడిల్లీ: నిర్మలమ్మ బడ్జెట్ స్టాక్ మార్కెట్పై ‘పన్నుల’ దాడి చేసింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ) 0.02% నుంచి 0.05 శాతానికి పెంచడం, కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్లపై 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్లపై 30% పన్ను విధింపు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచింది. కీలక మౌలిక రంగాలకు ఆశించిన స్థాయిలో మూలధన వ్యయాన్ని కేటాయించకపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా బడ్జెట్ రోజైన ఆదివారం సెన్సెక్స్ 1,547 పాయింట్లు క్షీణించి 80,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 496 పాయింట్లు కుప్పకూలి 25 వేల స్థాయి దిగువన 24,825 వద్ద నిలిచింది. మార్కెట్ పతన తీవ్రత ఎంతలా ఉందంటే..., ఒక్కరోజులో రూ.9.40 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.450 లక్షల కోట్లకు దిగివచ్చింది. ట్రేడింగ్ సాగిందిలా బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన ట్రేడింగ్లో స్టాక్ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 82,389 వద్ద, నిఫ్టీ 25,334 వద్ద మొదలయ్యాయి. ఎస్టీటీ రద్దు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులపై ఆశలతో తొలిభాగంలో లాభాలు ఆర్జించాయి. ఒక దశలో సెన్సెక్స్ 457 పాయింట్లు పెరిగి 82,727 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు బలపడి 25,321 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. బడ్జెట్ ప్రసంగంలో పన్నుల ప్రతిపాదన మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడడంతో సూచీలు క్షణాల్లో కుప్పకూలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 2,371 పాయింట్లు క్షీణించి 79,899 వద్ద, నిఫ్టీ 549 పాయింట్లు కోల్పోయి 24,572 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. దిగువ స్థాయిల్లో కొంతమేర రికవరీ వచి్చనప్పటికీ.., సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్ష ‘‘బడ్జెట్లో ఎస్టీటీ, కార్పొరేట్ బైబ్యాక్లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. ట్రేడింగ్ వ్యాపారంపై పన్నుల భారం పెరగడంతో భవిష్యత్లో వాల్యూమ్ తగ్గే అవకాశం ఉంది. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్షగా మారనుంది. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ’’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని అంశాలు ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు బడ్జెట్లో రూ.40,000 కోట్ల ప్రతిపాదనతో ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల షేర్లు వెలిగిపోయాయి. అత్యధికంగా సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ 6% లాభపడింది. డిక్సాన్ టెక్నాలజీస్ 4.21%, కేన్స్ టెక్నాలజీ 3.82%, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్స్ 2.95%, డీసీఎక్స్ సిస్టమ్స్ 2.06%, సైయంట్ డీఎల్ఎం 1 శాతం లాభపడ్డాయి. → సెన్సెక్స్ 30 షేర్లలో టీసీఎస్(2%), ఇన్ఫోసిస్(1.17%), సన్ఫార్మా(0.95%), టైటాన్ (0.33%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. ఎస్బీఐ(5.61%), అదానీపోర్ట్స్(5.53%), బీఈఎల్(5.36%), ఐటీసీ (3.91%), టాటా స్టీల్ (3.88%) õÙర్లు నష్టపోయాయి. → ఒక ఐటీ షేర్లకు మాత్రమే స్వల్పంగా డిమాండ్ లభించింది. బీఎస్ఈలో రంగాల వారీ సూచీల్లో పీఎస్యూ బ్యాంక్స్ 5.60%, మెటల్ 3.85% క్షీణించాయి. కమోడిటీస్ 3.35%, ఇంధన 3.14%, క్యాపిటల్ గూడ్స్ 3.08%, వినిమయ 2.98%, → ఇండ్రస్టియల్స్ 2.66%, విద్యుత్ 2.52% పతనమయ్యాయి. బీఎస్ ఈ స్మాల్, మిడ్క్యాప్ ఇండెక్సులు వరుసగా 3%, 2% పతనమయ్యాయి. → ఎస్టీటీ పెంపు ప్రభావం బ్రోకరేజ్ కంపెనీల షేర్లపై తీవ్రంగా కనిపించింది. ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గుతుందనే ఆందోళనలతో ఈ రంగంలోని కీలక కంపెనీల షేర్లు 12% వరకు క్షీణించాయి. → క్యూ3లో లాభం 16% వృద్ధి నమోదుతో సన్ఫార్మా షేరు 1% పెరిగి రూ.1,610 వద్ద స్థిరపడింది. -
బడ్జెట్ దెబ్బ.. కుప్పకూలిన మార్కెట్లు
బడ్జెట్ 2026 దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)ను 50-150 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించిన తరువాత మదుపరులు ఈక్విటీ మార్కెట్ల నుండి పారిపోవడంతో భారత ఈక్విటీ మార్కెట్లు ఆదివారం ప్రత్యేక సెషన్ తీవ్ర నష్టాలతో ముగించాయి.ఫ్యూచర్ ట్రేడ్స్ పై ఎస్టీటీని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆప్షన్స్ ప్రీమియంపై ఎస్టీటీని 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,843 పాయింట్లు లేదా 2.23 శాతం 80,723 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 495 పాయింట్లు లేదా 1.96 శాతం నష్టపోయి 24,825 వద్ద నిలిచింది.సెషన్లో అంతకుముందు సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు పడిపోయి 79,899.42 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 24,572 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది.విస్తృత మార్కెట్లు కూడా భారీ అమ్మకపు ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 2 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 2.7 శాతం నష్టపోయాయి. పెట్టుబడిదారులలో భయాన్ని సూచించే ఫియర్ గేజ్ - ఇండియా వీఐఎక్స్ దాదాపు 12 శాతం పెరిగింది.రంగాలవారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మినహా అన్ని సూచీలు పడిపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 6 శాతం, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 2 శాతానికి పైగా క్షీణించాయి.నిఫ్టీలోని 50 స్టాక్లలో భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, ఓఎన్జీసీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. వాటి షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయాయి. ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, నెస్లే ఇండియా, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రధానంగా నష్టపోయిన స్టాక్స్లో ప్రముఖంగా ఉన్నాయి. మరోవైపు విప్రో, టీసీఎస్, మ్యాక్స్ హెల్త్కేర్ లాభాలను అందుకున్నాయి. ఒక్కొక్కటి 2 శాతం లాభపడ్డాయి. -
కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
సండే స్టాక్ మార్కెట్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
సాధారణంగా ఆదివారం రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు. అయితే యూనియన్ బడ్జెట్ 2026 కారణంగా.. ఈ రోజు (ఫిబ్రవరి 1) కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు యధావిధిగా కొనసాగుతున్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఆదివారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు 290.58 పాయింట్ల నష్టంతో 82,275.79 వద్ద, నిఫ్టీ 117.45 పాయింట్ల నష్టంతో 25,301.45 వద్ద కొనసాగుతున్నాయి.యునైటెడ్ ఫుడ్బ్రాండ్స్ లిమిటెడ్, సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్, రాజ్దర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, IKIO టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఆదివారం స్పెషల్ ట్రేడింగ్..!
కేంద్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆదివారం(ఫిబ్రవరి 1న) స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగనుంది. సాధారణ పనిదినాల మాదిరిగానే ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు మార్కెట్ పనిచేస్తుంది. ఎంసీఎక్స్లో ఉదయం 9నుంచి 5 గంటల వరకు మొదటి సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది.సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు రోజులు. అయితే యూనియన్ బడ్జెట్ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘటన.. కాబట్టి ఆ రోజు స్టాక్ మార్కెట్ యధావిధిగా తెరిచే ఉంటుంది (స్టాక్ మార్కెట్కు ఆదివారం సెలవు లేదన్నమాట). -
త్వరలో బడ్జెట్.. నష్టాల్లో మార్కెట్!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 296.59 పాయింట్ల నష్టంతో 82,269.78 వద్ద, నిఫ్టీ 98.25 పాయింట్ల నష్టంతో 25,320.65 వద్ద నిలిచాయి.పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, రేమండ్ రియాల్టీ లిమిటెడ్, రేమండ్ లైఫ్స్టైల్ లిమిటెడ్, భారత్ బిజ్లీ లిమిటెడ్, భారత్ రోడ్ నెట్వర్క్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, హిందూస్తాన్ జింక్ లిమిటెడ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, వేదాంత లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్ అప్డేట్: నష్టాల నుంచి లాభాల్లోకి..
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 221.69 పాయింట్ల (0.27 శాతం) లాభంతో.. 82,566.37 వద్ద, నిఫ్టీ 76.15 పాయింట్ల (0.30 శాతం) లాభంతో 25,418.90 వద్ద నిలిచాయి.హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జింకుశల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. తారా చంద్ ఇన్ఫ్రాలాజిస్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్, డిజికాంటెంట్ లిమిటెడ్, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్, సువిధా ఇన్ఫోసర్వ్ లిమిటెడ్, జిందాల్ డ్రిల్లింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
రెండు రోజుల లాభాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి లాభాల్లో కదలాడిన మార్కెట్లు ఈరోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 115 పాయింట్లు తగ్గి 25,223 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 436 పాయింట్లు నష్టపోయి 81,898 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 29-01-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మునుపటి ముగింపుతో పోలిస్తే 34.88 పాయింట్లు పెరిగి 81,892.36 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 83.45 పాయింట్ల లాభంతో 25,258.85 వద్ద ప్రారంభమైంది.భారత్-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) ఖరారు చేయడంపై సానుకూల సెంటిమెంట్ మధ్య భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో పయనిస్తున్నాయి.Today Nifty position 28-01-2026(time: 9:25 am)నేటి క్యూ3 ఫలితాలులార్సెన్ & టూబ్రో, మారుతి సుజుకి ఇండియా, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, టివిఎస్ మోటార్, లోధా డెవలపర్స్, ఎస్బిఐ కార్డ్స్, జిఇ వెర్నోవా టిడి ఇండియా, ఫీనిక్స్ మిల్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్, మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, కొచ్చిన్ షిప్యార్డ్, గ్లాండ్ ఫార్మా, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్, టివిఎస్ హోల్డింగ్స్, పైన్ ల్యాబ్స్, స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్, పిరమల్ ఫార్మా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ, ఇక్లెర్క్స్ సర్వీసెస్ తదితరాలు ఈ రోజు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రేడ్ డీల్ జోష్
ముంబై: ఐరోపా సమాఖ్య(ఈయూ)తో మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ముగిసింది. బ్యాంకులు, మెటల్ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 81,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 127 పాయింట్లు బలపడి 25,175 వద్ద నిలిచింది.⇒ దేశీయ ఆటో రంగ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. భారత్–ఈయూల మధ్య కుదిరిన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంతో ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు చౌకగా లభించనున్నాయి. దీంతో మార్కెట్లో మరింత పోటీతత్వం పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా మహీంద్రాఅండ్మహీంద్రా 4%, హ్యుందాయ్ మోటార్స్ 4% పతనమయ్యాయి. మారుతీ సుజుకీ 1.50%, టాటా మోటార్స్ పీవీ 1.22%, ఎంఆర్ఎఫ్ 1.20%, అశోక్ లేలాండ్ 0.50% నష్టపోయాయి. ⇒ ఈయూతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంతో రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్, హోమ్ టెక్స్టైల్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గి ఎగుమతులు మరింత పెరగొచ్చనే ఆశావహ అంచనాలతో దేశీయ టెక్స్టైల్స్ కంపెనీ షేర్లకు డిమాండ్ నెలకొంది. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, కేఆర్పీ మిల్స్ 6% ర్యాలీ చేశాయి. వెల్స్పన్ లివింగ్ 4.22%, అలోక్ ఇండస్ట్రీస్ 2.50%, ట్రిడెంట్ 2%, అరవింద్ అరశాతం లాభపడ్డాయి. భారత టెక్స్టైల్, రెడీమేడ్ వ్రస్తాల ఎగుమతులకు అమెరికా తర్వాత యూరోపియన్ యూనియన్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. -
లక్షను 50 లక్షలు చేసిన స్టాక్.. పండగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..!
-
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.77 పాయింట్ల లాభంతో.. 81,857.48 వద్ద, నిఫ్టీ 126.75 పాయింట్ల లాభంతో 25,175.40 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ లిమిటెడ్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, కామధేను లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వన్సోర్స్ స్పెషాలిటీ ఫార్మా లిమిటెడ్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్, SBFC ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
25,100 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ(Nifty) 104 పాయింట్లు పెరిగి 25,152 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు పుంజుకొని 81,771 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 27-01-2026(time: 9:32 am)ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
విశ్రాంత జీవనంలోనూ ‘ఫండించొచ్చు!
స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటేనే కాస్త టెన్షన్. ఎందుకంటే ఇక్కడ రాబడుల వెనకాల రిస్కూ ఉంటుంది. వయసులో ఉన్నవారికైతే ఓకే. మార్కెట్లు పడినా కొన్నాళ్లు వేచిచూస్తే మళ్లీ సర్దుకుంటాయి. మరి రిటైరీల మాటేంటి? నెలవారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సిన సీనియర్ సిటిజన్లు ఈ టెన్షన్లతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించటం సాధ్యమా? అలాగని ఎఫ్డీలపైనే ఆధారపడితే అంతకంతకూ వడ్డీ రేట్లు తగ్గుతూ పోతున్నాయి. పైపెచ్చు జీవన వ్యయాలు, వైద్యం ఖర్చుల్లాంటివి పెరిగిపోతున్నాయి. మరి విశ్రాంత జీవనం గౌరవప్రదంగా, ఆర్థికంగా స్వేచ్ఛతో సాగించాలంటే దారేంటి? ద్రవ్యోల్బణాన్ని మించి కాకపోయినా బ్యాంకు ఎఫ్డీలకన్నా మెరుగైన రాబడి అందించే సాధనాలు ఏమున్నాయి? మ్యుచువల్ ఫండ్స్ వైపు మళ్లొచ్చా? అసలు సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా అనే ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు దొర కవు. కాకపోతే ఆచి తూచి, సరైన వ్యూహంతో ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లకూ ఫండ్స్ ప్రయోజనకరంగానే ఉంటాయనేది నిపుణుల మాట. దాన్ని వివరించే ప్రయత్నమే ఈ వెల్త్ స్టోరీ....ప్రాధాన్యాలు మారుతాయి.. వయస్సు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మారుతాయి. యువ ఇన్వెస్టర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలు, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. వారికి రాబడికన్నా తమ పెట్టుబడిని కాపాడుకోవటం ముఖ్యం. క్రమం తప్పకుండా, కచ్చితంగా కొంత మొత్తం ఆదాయంగా చేతికి అందటం అంతకన్నా ముఖ్యం. అది కూడా పెరిగే ధరలను తట్టుకునే భరోసానివ్వాలి. ఆరోగ్యం పరంగానో లేక మరొకటో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే చేతిలో నగదు ఉండాలి. ఇలా ఒకటా, రెండా.. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో విషయాలు చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు తోడుగా ఉంటూ, ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయకరంగానూ ఉంటాయి. సౌకర్యవంతంగా జీవించాలంటే... ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో, అద్దెను మినహాయించి తక్కువలో తక్కువగా, ఓ మధ్యతరగతి సీనియర్ సిటిజన్ కుటుంబ ఖర్చులు ఇలా ఉంటున్నాయి... → కరెంటు, ఇంటి మెయింటెనెన్సు మొదలైనవి: రూ. 8,000–10,000 → నిత్యావసరాలు : రూ. 10,000–12,000 → వైద్యం, ఔషధాల ఖర్చులు: రూ. 5,000–7,000 → ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ఖర్చులు: రూ. 5,000–6,000 → ఇలా, ఒక మోస్తరు సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకు సింపుల్గా రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అవసరమవుతోంది. → మరికాస్త సౌకర్యవంతంగా ఉండాలంటే (ట్రావెల్, హాబీలు, పని మనుషులు) ఖర్చులు నెలకు రూ. 45,000–60,000 వరకు పెరుగుతాయి.ఇంత ఆదాయం రావాలంటే ఎంత దాచిపెట్టాలి? రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చుల కోసం నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అందుకోవాలంటే, అందుకు ఏ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి? వార్షికంగా ఎంత మొత్తం రాబడిని ఆశించవచ్చు అనేది మరో ప్రశ్న. సీనియర్ సిటిజన్లకు, పెట్టుబడి భారీగా వృద్ధి చెందడం కన్నా, రాబడిపరమైన భద్రత అవసరం కాబట్టి తక్కువలో తక్కువగా ఏటా 6–7 శాతం రాబడిని ఆశించవచ్చు. దాన్ని బట్టి, పెద్దగా రిస్కులు ఉండని, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రాతిపదికన చూస్తే..సీనియర్ సిటిజన్లకు పెట్టుబడి ఆప్షన్లు.. → బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములు – స్థిరత్వం కోసం ఇవి పెట్టుబడులకు భద్రతనిచ్చేలా, రాబడులు అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది. కాకపోతే పెరిగే ధరలకు తగ్గ స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. కాబట్టి పోర్ట్ఫోలియోలో వీటికి 30–40 శాతం పెట్టుబడిని కేటాయించవచ్చు. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో వివిధ కేటగిరీలున్నా.. సీనియర్ సిటిజన్లకు ఈ కిందివి అనువైనవిగా ఉంటాయి. → సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్స్ → స్వల్పకాలిక ఫండ్స్ → కార్పొరేట్ బాండ్ ఫండ్స్ వీటిని ఎందుకు పరిశీలించవచ్చంటే, ఇవి ఎఫ్డీలతో పోలిస్తే పన్నుల అనంతరం మరింత మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు కింద మార్చుకునే (లిక్విడిటీ) వీలుంటుంది. విత్డ్రాయల్ సులభతరంగా ఉంటుంది. వీటికి 30–35 శాతం కేటాయించవచ్చు. → ఎస్డబ్ల్యూపీ (సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్) – పొదుపు మొత్తం నుంచి నెలవారీ జీతం ఎస్డబ్ల్యూపీ అనేది మ్యుచువల్ ఫండ్స్ నుంచి ప్రతి నెలా ఇంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పెన్షనో లేదా శాలరీగానో అనుకోవచ్చు. వడ్డీ ఆదాయంతో పోలిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎంత విత్డ్రా చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. డెట్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్తో కలిపి ఉపయోగించుకోవచ్చు. → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ – పరిమిత స్థాయిలోనే, కాకపోతే కీలకం సీనియర్ సిటిజన్స్ అయినంత మాత్రాన షేర్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. పెట్టుబడుల్లో 10–20 శాతానికి మించకుండా ఈక్విటీలకు కేటాయించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి పొదుపు మొత్తాలను కాపాడుకోవడానికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. శాంపిల్ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో (రూ. 1 కోటి నిధి) → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు + ఎస్సీఎస్ఎస్: రూ. 35 లక్షలు → డెట్/కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: రూ. 35 లక్షలు → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ / ఇండెక్స్ ఫండ్స్: రూ. 15 లక్షలు → ఎమర్జెన్సీ నగదు – సేవింగ్స్: రూ. 15 లక్షలు పోర్ట్ఫోలియోను ఇలా తీర్చిదిద్దుకుంటే ఒక మోస్తరు స్థిరత్వంతో ప్రతి నెలా సుమారు రూ.45,000 నుంచి రూ. 55,000 వరకు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ గుర్తుంచుకోతగిన కీలకమైన అయిదు సూత్రాలు .. → భారీ రాబడుల హామీలతో ఊరించే స్కీములకు దూరంగా ఉండాలి → వడ్డీపై మాత్రమే ఆధారపడకుండా ఎస్డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలి→ చేతిలో ఉన్న మొత్తం నిధిని ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయొద్దు.→ నామినేషన్లు, వీలునామా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోవాలి → తగినంత స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 769.66 పాయింట్ల నష్టంతో 81,537.70 వద్ద, నిఫ్టీ 241.25 పాయింట్ల నష్టంతో 25,048.65 వద్ద నిలిచాయి.ధంపూర్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, ఎవరెస్ట్ కాంటో సిలిండర్ లిమిటెడ్, బైడ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!
దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఎందరో హాజరవుతారు. ఈ సారి ఆ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) హాజరయ్యారు. ఈ సమయంలో మాక్రాన్ ధరించిన సన్గ్లాసెస్ ఎందోమందిని ఆకట్టుకుంది.మాక్రాన్ ఉపయోగించిన సన్గ్లాసెస్ చూడటానికి చాలా స్టైలిష్గా, కొత్తగా కనిపించడంతో.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా చాలామంది అవి ఏ బ్రాండ్?, అని తెలుసుకోవడానికి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆలా తెలుసుకునే క్రమంలోనే అవి iVision Tech కంపెనీ తయారు చేసినవని తెలుసుకున్నారు.మాక్రాన్ ధరించిన కళ్లజోడు పసిఫిక్ ఎస్1 మోడల్, దీని ధర 659 యూరోలు అని కంపెనీ తన వెబ్సైట్లో వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు వంటి ప్రముఖ వ్యక్తి వాడిన ఉత్పత్తి అంటే, ఆ కంపెనీపై నమ్మకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పెట్టుబడిదారులు కూడా ఈ కంపెనీ భవిష్యత్తులో ఇంకా ఎదిగే అవకాశం ఉందని భావించి ఆ సంస్థ షేర్లు కొనడం మొదలుపెట్టారు. దాంతో స్టాక్ మార్కెట్లో సంస్థ షేర్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని సీఈఓ స్టెఫానో ఫుల్చిర్ పేర్కొన్నారు.ఈ షేర్ ధర పెరగడం వల్ల కంపెనీ మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) సుమారు 38 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఒక కళ్లజోడు వల్లే కంపెనీకి కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇది సాధారణంగా ఊహించని విషయం.ఈ రోజుల్లో ఫ్యాషన్, టెక్నాలజీ, వ్యాపారం అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఒక ప్రముఖ నాయకుడు ఉపయోగించిన వస్తువు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టగలదు. అదే సమయంలో, ఒక చిన్న కంపెనీకి కూడా పెద్ద అవకాశాలు తీసుకురాగలదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి.. -
Stock Market Updates: లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు పెరిగి 25,332 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 120 పాయింట్లు లాభపడి 82,427 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.4బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.5% లాభపడింది.నాస్డాక్ 0.9% లాభపడింది.Today Nifty position 23-01-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.45 పాయింట్ల (0.59 శాతం) లాభంతో 82,389.08 వద్ద, నిఫ్టీ 161.35 పాయింట్ల (0.64 శాతం) లాభంతో 25,318.85 వద్ద నిలిచాయి.బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్, ట్రాన్స్వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఫిజిక్స్ వాలా లిమిటెడ్, అక్ష్ ఆప్టిఫైబర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. షేఖావతి ఇండస్ట్రీస్ లిమిటెడ్, హ్యూబాచ్ కలరెంట్స్ ఇండియా లిమిటెడ్, IIFL ఫైనాన్స్ లిమిటెడ్, పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
Stock Market Updates: పడిలేచిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం పుంజుకున్నాయి. లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 250 పాయింట్లు ఎగిసి 25,408 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 793 పాయింట్లు పుంజుకుని 82,703 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.03 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.2 శాతం పెరిగింది.నాస్డాక్ 1.18 % లాభంతో ముగిసింది.Today Nifty position 22-01-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం వరుసగా మూడవ సెషన్లోనూ క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 270.84 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 81,909.63 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 75 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టపోయి 25,157.5 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.9 శాతం క్షీణించాయి. -
మార్కెట్ క్రాష్ ఈరోజూ కొనసాగుతుందా?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు తగ్గి 25,242 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 31 పాయింట్లు నష్టపోయి 82,127 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి మార్కెట్ సెషన్లో సూచీలు దారుణంగా పడిపోయాయి.నిన్నటి స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలువాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.Today Nifty position 21-01-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రాష్ మార్కెట్
ముంబై: అమెరికా, ఐరోపా దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ అనిశ్చితి దలాల్ స్ట్రీట్ను వణికించాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పతనం ప్రతిబంధకాలయ్యాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,066 పాయింట్లు పతనమైన 83 వేల స్థాయి కింద 82,180 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయి 25,232 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. మార్కెట్ పతన తీవ్రత ఎంతలా ఉందంటే..., ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సందగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.465 లక్షల కోట్ల నుంచి రూ.455 లక్షల కోట్లకు దిగివచి్చంది. రోజంతా నష్టాల ట్రేడింగ్: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఏ దశలోనూ కోలుకోలేక రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,235 పాయింట్లు క్షీణించి 82,011 వద్ద, నిఫ్టీ 414 పాయింట్లు కుప్పకూలి 25,171 వద్ద కనిష్టాలు తాకాయి. హెచ్డీఎఫ్సీ షేరుకు మాత్రమే లాభాలు సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు మాత్రమే 0.38% స్వల్ప లాభంతో గట్టెక్కింది. ఇదే సూచీలో ఎటర్నల్ 4%, బజాజ్ ఫైనాన్స్ 3.88% సన్ఫార్మా 3.68%, బజాజ్ ఫిన్సర్వ్ 3.05%, ఇండిగో 3% అత్యధికంగా నష్టపోయిన టాప్ 5 షేర్లు. అన్ని రంగాల ఇండెక్సులు డీలామార్కెట్లోని విస్తృత స్థాయి అమ్మకాలతో బీఎస్ఈలో అన్ని రంగాల ఇండెక్సులు డీలాపడ్డాయి. రియల్టీ 5.21%, సర్వీసెస్ 3%, క్యాపిటల్ గూడ్స్ 2.76%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.73%, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.71%, టెలికమ్యూనికేషన్ 2.42%, ఆటో 2.36%, విద్యుత్ 2.23 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.74%, 2.52 శాతం క్షీణించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనం ట్రంప్ టారిఫ్ భయాలు, గ్లోబల్ టారిఫ్విధానంపై అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లూ నష్టాల్లో ట్రేడయ్యాయి. చైనా, జపాన్, సింగపూర్, హాంగ్కాంగ్ మార్కెట్లు 1.50% నుంచి 0.50% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% క్షీణించాయి. అమెరికా స్టాక్ సూచీలు ఒకటిన్నరశాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నష్టాలకు 4 కారణాలుసూచీలకు ఐటీ షేర్ల పోటు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ల కారణంగా ఐటీ రంగ కంపెనీలు డిసెంబర్ త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. బలహీన ఆదాయాల ప్రకటనతో విప్రో 3%, ఎల్టీఐ మైండ్ట్రీ 7%, ఇన్ఫోసిస్ 1%, టీసీఎస్ 2% నష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ ఏకంగా 3% పతనమైంది. ఐటీ షేర్లలో అమ్మకాలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. ట్రంప్ టారిఫ్ బెదిరింపులు గ్రీన్లాండ్ విషయంలో తనకు సహకరించకుంటే వాణిజ్య సుంకాలు విధిస్తానని యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ టారిఫ్ వార్ భయాలు మార్కెట్లలో మొదలయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. విదేశీ ఇన్వెస్టర్ల టేకాఫ్ మూడ్భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ ఆగడంలేదు. సోమ, మంగళవారాల్లో రూ.6,200 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో 11వ రోజూ అమ్మకాలు కొనసాగాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలహీన పడి జీవిత కాల కనిష్ట ముగింపు 90.97 వద్ద ముగిసింది. పెరిగిన క్రూడ్; వీఐఎక్స్ ఇండెక్స్అంతర్జాతీయంగా బ్రెంట్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు రేకెత్తాయి. మరోవైపు ఈక్విటీ మార్కెట్లో అనిశి్చతిని సూచించే వీఐఎక్స్ ఇండెక్సు 4% పెరిగి 12.34 వద్దకు చేరుకుంది. దీనికి తోడు మంగళవారం ‘నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ’ కారణంగా భారీ ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. -
బడ్జెట్ 2026.. ఆదివారం సెలవు లేదు!
కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘటన, అంతే కాకుండా ఈ రోజు స్టాక్ మార్కెట్ కూడా పెట్టుబడిదారుల కోసం తెరిచి ఉంటుందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) & నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వెల్లడించాయి.సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు రోజులు. అయితే యూనియన్ బడ్జెట్ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు, కాబట్టి ఆ రోజు స్టాక్ మార్కెట్ యధావిధిగా తెరిచే ఉంటుంది (స్టాక్ మార్కెట్కు ఆదివారం సెలవు లేదన్నమాట).బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్ జరుగుతాయి.సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. -
స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసిన తరువాత.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. మంగళవారం ఉదయం ఉన్న ధరలకు, సాయంత్రం ధరలకు పొంతన లేకుండా.. ఊహించని స్థాయికి చేరిపోయాయి. దీంతో గోల్డ్ రేటు రూ.1.50 లక్షలు క్రాస్ చేయగా.. సిల్వర్ 3.4 లక్షల వద్దకు చేరింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాల్లో ఉదయం రూ. 1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,37,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 147280 రూపాయల దగ్గర నుంచి రూ. 1,49,780 వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,000 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,51,640 వద్ద నిలిచాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,37,450 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,49,910 వద్ద నిలిచాయి.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేటు రూ. 22000 పెరిగింది. దీంతో 1000 గ్రాముల ధర 3.40 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. -
స్టాక్ మార్కెట్ క్రాష్.. ప్రధాన కారణాలు ఇవే!
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు భారీ నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో.. ఒక్క రోజులోనే మదుపర్ల సంపద రూ.9 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.ప్రస్తుత పరిస్థితులు.. పెట్టుబడిదారులలో భయాన్ని రేకెత్తించాయి. సోమవారం మొదలైన అమ్మకాల ఒత్తిడి.. ఈ రోజు (జనవరి 20) కూడా కొనసాగడంతో.. దలాల్ స్ట్రీట్ నేలచూపులు చూస్తోంది. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటనే విషయానికి వస్తే..స్టాక్ మార్కెట్ పతనం: ప్రధాన కారణాలువాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.ఇదీ చదవండి: వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్లో డబ్బు! -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్ల సంపద ఆవిరి!
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో ఒక్క రోజులోనే మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది. ఆర్తి సర్ఫ్యాక్టెంట్స్ లిమిటెడ్, పటేల్ రిటైల్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, అంజని పోర్ట్ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారత్ రసయాన్ లిమిటెడ్, ఆల్మండ్జ్ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్, బెస్ట్ అగ్రోలైఫ్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
25,500 మార్కు కిందకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 93 పాయింట్లు తగ్గి 25,493 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 288 పాయింట్లు నష్టపోయి 82,967 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 20-01-2026(time: 9:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 324.17 పాయింట్ల నష్టంతో 83,246.18 వద్ద, నిఫ్టీ 108.85 పాయింట్ల నష్టంతో 25,585.50 వద్ద నిలిచాయి.భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఏఎండీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిందాల్ సా లిమిటెడ్, బజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్, శ్రీ రామ న్యూస్ప్రింట్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ (ఇండియా) లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, డిలిజెంట్ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు
అమెరికా ఓవల్ ఆఫీస్లో రెండోసారి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్.. గడిచిన 365 రోజుల్లో తన ‘ట్రంపరితనాన్ని’ చూపిస్తూనే ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే మంత్రాన్ని జపిస్తూ శరవేగంగా వెలువడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చైనాతో టారిఫ్ల యుద్ధం, అక్రమ వలసలపై ఉక్కుపాదం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో కలిసి డోజ్(DOGE) ద్వారా ప్రభుత్వ ప్రక్షాళన.. ఇలా ప్రతి అడుగులోనూ ట్రంప్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ఏడాది పొడవునా సాగిన ఈ సంచలన నిర్ణయాల తుపాను ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ముద్ర వేసింది? జీడీపీ లెక్కలు, ఏఐ బూమ్ వెనుక దాగిన మార్కెట్ వాల్యుయేషన్లు ట్రంప్నకు విజయ కేతనం పడుతున్నాయా లేక 2026లో రాబోయే భారీ ఆర్థిక పరీక్షకు సంకేతాలు ఇస్తున్నాయా? వంటి అంశాలపై విశ్లేషణ..అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి రేపటితో ఏడాది పూర్తవుతుంది. ఈ సంవత్సరం కాలంలో సుంకాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(DOGE), కృత్రిమ మేధ (ఏఐ)లో భారీ పెట్టుబడుల వంటి నిర్ణయాలతో వైట్హౌస్ నిరంతరం వార్తల్లో నిలిచింది. రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకున్న ఈ ఏడాది ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలను అందించింది.ఆరంభంలో సంకోచం.. ఆపై..ట్రంప్ పాలన 2025 ప్రారంభంలో కొంత ఒడిదుడుకులతో సాగింది. 2025 మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 0.6 శాతం క్షీణించింది. 2022 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇలా వెనకబడటం ఇదే తొలిసారి. అయితే, ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదై ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కింది. వినియోగదారుల ఖర్చు పెరగడం, ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతుల్లో తగ్గుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.ద్రవ్యోల్బణం, ఉద్యోగాల సవాలుద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. పీసీఈ (PCE) ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 2.8 శాతంగా ఉండగా, డిసెంబర్ నాటికి 2.7 శాతానికి తగ్గింది. సుంకాల వల్ల ధరలు భారీగా పెరుగుతాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అటువంటి నాటకీయ మార్పులు కనిపించలేదు. కానీ, ఉద్యోగ మార్కెట్ ఆందోళన కలిగిస్తోంది. యూఎస్లో నిరుద్యోగ రేటు 2025 నవంబర్లో 4.5 శాతానికి చేరింది. 2025లో నెలకు సగటున కేవలం 49 వేల ఉద్యోగాలు మాత్రమే జోడయ్యాయి. ఇది గడిచిన ఏడేళ్ల సగటు (1.41 లక్షలు) కంటే చాలా తక్కువ. బిగ్ టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లేఆఫ్స్ దీనికి ప్రధాన కారణం.అమెరికా కంటే ప్రపంచమే ముందంజట్రంప్ 2.0 తొలి ఏడాదిలో అమెరికా మార్కెట్లు లాభాలను పంచాయి. గడిచిన ఏడాదిలో..ఎస్ అండ్ పీ 500: +16%నాస్డాక్: +20%డౌ జోన్స్: +14%ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్ల జోరు తక్కువగానే ఉంది. జపాన్ నిక్కీ (40%), కొరియా కోస్పి (92%), హాంగ్ సెంగ్ (37%) వంటి అంతర్జాతీయ సూచీలు అమెరికాను మించిపోయాయి. డాలర్ ఇండెక్స్ 9.3 శాతం పడిపోవడం, బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం ఈ ఏడాది విశేషం.ఏఐ బూమ్ట్రంప్ హయాంలో ఏఐ రంగానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా ‘స్టార్గేట్’ వంటి 500 బిలియన్ డాలర్ల మెగా ప్రాజెక్టులు టెక్ రంగాన్ని ఉత్సాహపరిచాయి. ఆల్ఫాబెట్, ఎన్విడియా వంటి ‘మాగ్-7’ స్టాక్స్ మార్కెట్ విలువలో 20 శాతం వృద్ధి సాధించాయి. ప్రస్తుతం ఎస్ అండ్ పీ 500లో 42 శాతం వాటా కేవలం ఏఐ అనుబంధ కంపెనీలదే ఉండటం గమనార్హం.అసలైన పరీక్ష ముందే?ప్రస్తుతం అమెరికా మార్కెట్లు 28 రెట్ల పీఈ(ప్రైస్ టు ఎర్నింగ్ - ఉదాహరణకు.. కంపెనీ రేషియో 20 ఉంటే ఆ కంపెనీ సంపాదించే 1 రూపాయి లాభం కోసం 20 రూపాయలు చెల్లిస్తున్నారని అర్థం) వద్ద ట్రేడవుతున్నాయి. ఇది 2000 నాటి డాట్కామ్ బబుల్ స్థాయిని గుర్తుచేస్తోంది. 2026లో వడ్డీ రేట్ల నిర్ణయాలు, ఫెడ్ రిజర్వ్ వైఖరి, సుంకాల దీర్ఘకాలిక ప్రభావం అమెరికా ఆర్థిక స్థితిని నిర్ణయించనున్నాయి. రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లపై ట్రంప్ గర్వపడుతున్నా పెరుగుతున్న రుణాలు, మార్కెట్ వాల్యుయేషన్ల మధ్య ఈ ఏఐ బూమ్ ఎంతకాలం నిలుస్తుందనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.. -
25,500 మార్కు వద్దకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు తగ్గి 25,545 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 449 పాయింట్లు నష్టపోయి 83,116 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 19-01-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ
-
ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్, ఐపీఓలో పెట్టుబడుల పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు సుమారు రూ.2.54 కోట్లు నష్టపోయినట్లు పోలీసులు వెల్లడించారు.రిటైర్డ్ బ్యాంకర్కు రూ.1.25 కోట్ల నష్టంసికింద్రాబాద్కు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్ ఈ మోసానికి ప్రధాన బాధితురాలుగా ఉన్నారు. నేరగాళ్లు ముందుగా బాధితురాలిని ఓ వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అందులో సంస్థాగత ఐపీఓల ద్వారా వచ్చే భారీ లాభాల స్క్రీన్షాట్లను చూపి నమ్మించారు. ఒక యూఎస్ నంబర్ ద్వారా వచ్చిన లింక్ సహాయంతో బోగస్ ట్రేడింగ్ యాప్ను ఆమె డౌన్లోడ్ చేసుకునేలా చేశారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 12 మధ్య ఆమె తన మూడు వ్యక్తిగత ఖాతాల నుంచి 11 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు 15 దఫాలుగా రూ.1.25 కోట్లు బదిలీ చేశారు. యాప్లో ఆమె బ్యాలెన్స్ రూ.1.9 కోట్లుగా కనిపిస్తున్నప్పటికీ విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యం కాలేదు. పైగా ‘క్లియరింగ్ ఛార్జీల’ పేరుతో మరో రూ.58.58 లక్షలు కట్టాలని ఒత్తిడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.మరో మూడు కేసులుజనవరి 14, 15 తేదీల్లో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇలాంటివే మరికొన్ని ఫిర్యాదులు అందాయి.మణికొండకు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగిని స్టాక్ బ్రోకరేజ్ విశ్లేషకులుగా నటించిన స్కామర్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రలోభపెట్టారు. గత ఏడాది మార్చి-మే మధ్య ఆయన రూ.50.8 లక్షలు పోగొట్టుకున్నారు.76 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ఐపీఓ ట్రేడింగ్ సలహాలను నమ్మి డిసెంబర్ 30 నుంచి జనవరి 5 మధ్య రూ.46.25 లక్షలు నష్టపోయారు.మియాపూర్కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి యూఎస్ స్టాక్స్లో పెట్టుబడుల పేరుతో నకిలీ యాప్ ద్వారా రూ.32.1 లక్షలు కోల్పోయారు.పోలీసుల హెచ్చరికలుఈ నాలుగు ఘటనలపై హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ (IT) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపరిచిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలను నమ్మవద్దని, అనధికారిక ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం తెలియాజేయాలని సూచించారు.ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే.. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 187.64 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 83,570.91 వద్ద, నిఫ్టీ 28.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,694.90 వద్ద నిలిచాయి.అజ్మీరా రియాల్టీ & ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆసోమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, వర్ధమాన్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రామా ఫాస్ఫేట్స్ లిమిటెడ్, HBL ఇంజనీరింగ్ లిమిటెడ్, L&T టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
అదృష్టం అంటే వీళ్లదే.. లక్షకు 8 లక్షలు..
-
స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 25,693 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 146 పాయింట్లు నష్టపోయి 83,549 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.17 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.నాస్డాక్ 0.25 శాతం పుంజుకుంది.Today Nifty position 16-01-2026(time: 9:19 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీఓలంటే అద్భుతాలు కావు!
స్టాక్ మార్కెట్లలోని కంపెనీలన్నీ ఎప్పుడో ఒకప్పుడు పబ్లిక్ ఇష్యూకు వచ్చినవే. కాకపోతే వాటిలో అగ్రశ్రేణి కంపెనీలుగా (లార్జ్క్యాప్) మారినవి కొన్నే. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయాలో.. వద్దో తెలిసిపోతుంది. ఎందుకంటే ఐపీఓలంటే అద్భుతాలు కావు. ఆటోమేటిగ్గా సంపదను సృష్టించే సాధనాలూ కావు. అవి అవకాశాలతో పాటే రిస్కులనూ మన ముందుంచుతాయి. అలాగని ఐపీఓలకు దూరంగా ఉండమని కాదు. ఐపీఓ అంటే... మార్కెట్లు పంపే ఆహ్వాన పత్రికలు. దేన్ని స్వీకరించాలో... దేన్ని తిరస్కరించాలో మనమే నిర్ణయించుకోవాలి. అది ఎలాగో.. 2025లో ఐపీఓకు వచి్చన కంపెనీల పరిస్థితేంటో... 2026లో ఎలా వ్యవహరించాలో సమగ్రంగా వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...ప్రస్తుతం ప్రైమరీ (ఐపీఓ) మార్కెట్ మంచి దూకుడు మీదుంది. దాదాపు 200కు పైగా కంపెనీలు లిస్టింగ్లకు సన్నద్ధమవుతున్నాయి. వీటిలో ఫిన్టెక్ యూనికార్న్లు, గ్రీన్ ఎనర్జీ వెంచర్ల నుంచి కన్జూమర్ బ్రాండ్లు, ఇన్ఫ్రా రంగ దిగ్గజాల వరకు చాలా ఉన్నాయి. జీడీపీ ఏడు శాతానికి పైగా కొనసాగుతుందనే సానుకూల అంచనాలు, డీమ్యాట్ ఖాతాలు 15 కోట్ల స్థాయిని దాటిపోవడం, ప్రతి నెలా సిప్ల ద్వారా రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు మార్కెట్లలోకి వస్తుండటం వంటి పరిణామాలు కంపెనీలకు మంచి ఊపునిస్తున్నాయి.ఐపీవోలు ఎందుకు..కంపెనీలు వివిధ కారణాలరీత్యా పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరిస్తుంటాయి. అవేంటంటే.. → కార్యకలాపాలను విస్తరించడానికి, కొత్త టెక్నాలజీల ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవటానికి → రుణాలుంటే తీర్చెయ్యడానికి... → ప్రారంభ దశలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, అలాగే ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించుకోవటానికి → బ్రాండ్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకునేందుకు ఇలాంటి అవసరాలకు సంబంధించి ఐపీవోలనేవి కంపెనీకి సహాయకరంగానే ఉంటాయి. అయితే, షేరు ధర అదే పనిగా పెరుగుతూనే ఉంటుందనే గ్యారంటీ ఏమీ ఉండదు. మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పుడు కొన్ని కంపెనీలు లిస్టింగ్లో మంచి లాభాలే ఇవ్వొచ్చు. మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ వేళ నిరాశపర్చినా, ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ పుంజుకుని మెరుగైన రాబడులు అందించే అవకాశం ఉంది. అదే సమయంలో చాలా మటుకు కంపెనీలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనలేక చతికిలబడి, షేర్లు కనుమరుగైపోతుంటాయి కూడా.రిటైల్ ఇన్వెస్టర్ల తప్పులివీ...ఆ ఐపీవో బాగా లిస్టయ్యింది.. ఈ ఇష్యూ బాగా లాభాలు తెచ్చిందనే అత్యుత్సాహంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు. చేతులు కాల్చుకుంటూ ఉంటారు. కొందరు గ్రే మార్కెట్లను ఫాలో అవుతూ అక్కడ ప్రీమియం రేటు పలికే వాటి వెంటబడుతుంటారు. ఇంకొందరు భారీగా ఓవర్సబ్్రస్కయిబ్ అయ్యింది కదా కచి్చతంగా లాభాలొచ్చేస్తాయనుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. మరికొందరు లిస్టింగ్ రోజున భలే ఎగ్జైటింగ్గా ఉంటుందని పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, ఈ అత్యుత్సాహంలో కొన్ని విషయాలు విస్మరిస్తుంటారు. వ్యాపారం మోడల్ నిజంగా బలమైనదేనా? దీర్ఘకాలికంగా నిలబడేదేనా? ప్రమోటర్ల ట్రాక్ రికార్డు బాగుందా లేదా? ఐపీవో ద్వారా తీసుకున్న డబ్బును కంపెనీ ఏ అవసరాల కోసం వాడుకుంటోంది? ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. 2025లో ఏం జరిగిందంటే... గతేడాది ఐపీవోలు తీపి, చేదు జ్ఞాపకాలు రెండింటినీ ఇచ్చాయి. దాదాపు 373 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.95 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో 103 మెయిన్ బోర్డ్ ఇష్యూ లు కాగా 270 కంపెనీలు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై లిస్టయ్యాయి. టాటా క్యాపిటల్ (రూ.15,512 కోట్లు), హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (రూ.12,500 కోట్లు) వంటి దిగ్గజాలు భారీగా నిధులు సమీకరించాయి. కొత్త తరం సంస్థలు మీషో రూ. 5,421 కోట్లు సమీకరించగా, గ్రో క్యాపిటల్ రూ.6,632 కోట్లు రాబట్టుకుంది. వీటిలో లిస్టింగ్ నాడు ఏకంగా 136 శాతం లాభాన్నిచి్చన స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లాంటి కంపెనీలతో పాటు తొలిరోజే 56 శాతం నష్టాన్నిచ్చిన గ్లోటిస్ లిమిటెడ్ వంటి కంపెనీలూ ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద ఇష్యూల్లో మీషోనే తీసుకుంటే ఇష్యూ ధర రూ.111 అయితే దాదాపు 46 శాతం అధికంగా రూ.162.50 వద్ద లిస్టయ్యింది. అలాగని అన్నీ ఇదే రీతిలో లిస్టింగ్ లాభాలిచ్చాయనుకోవడానికి లేదు. గతేడాది సగటున లిస్టింగ్ లాభాలు చూస్తే 8 శాతం స్థాయికే (అంతకు ముందటి సంవత్సరాలకన్నా తక్కువగా) పరిమితమయ్యాయి. వీటిలో దాదాపు సగ భాగం లిస్టింగ్లో ఏడాది చివరి నాటికి లాభాల్లోనే ఉండగా, మిగతావి ఇష్యు రేటు కన్నా కిందికి పడిపోయాయి. ఇక ఎస్ఎంఈ ఐపీవోలైతే మరీ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని మలీ్టబ్యాగర్లుగా మారినప్పటికీ మిగతావి భారీగా పడిపోయాయి. హైప్ అనేది ఎల్లకాలం ఉండదని, వాస్తవంగా వ్యాపారానికి ఉండే బలమే కీలకమనే పాఠాన్ని 2025 మరోసారి నేరి్పంది.2026 ప్రత్యేకత ఏంటి.. ఈసారి 200 పైగా కంపెనీలు ఐపీవోలకు సిద్ధమవుతున్నాయి. ఇవి రూ. 2.5 లక్షల కోట్లకు మించి సమీకరించవచ్చనే అంచనాలున్నాయి. వీటిలో పలు కంపెనీలు భారీ వేల్యుయేషన్లతో రాబోతున్నాయి. ఉదాహరణకు రూ. 11– 12 లక్షల కోట్ల వేల్యుయేషన్తో రిలయన్స్ జియో ఐపీవో దేశంలోనే అతి పెద్ద ఇష్యూగా ఉంటుందనేది నిపుణుల అంచనా. ఇది 2026 ప్రథమార్ధంలోనే రావచ్చు. అలాగే ఎన్ఎస్ఈ, ఫోన్పే, ఫ్లిప్కార్ట్, ఓయో, జెప్టో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్... ఇలా బోలెడు పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఈ ఇష్యూల ద్వారా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు తమ వాటాలను విక్రయించుకుని ని్రష్కమించనున్నాయి. డీమ్యాట్ ఖాతాలు పెరుగుతుండటం, సిప్ పెట్టుబడుల వెల్లువతో వీటికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగానే డిమాండ్ ఉంటుందనే అంచనాలున్నాయి. వెరసి ఈసారి కూడా స్టాక్ మార్కెట్లు సందడిగానే ఉండనున్నాయి.ఏం చేయాలంటే... ఇదంతా చూసిన తర్వాత ఇంతకీ ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే... ఇవి మీ పోర్ట్ఫోలియోలో స్మార్ట్ భాగంగా ఉండొచ్చు. సముచిత రేటులో లభిస్తున్న బలమైన కంపెనీల ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయండి. కానీ పెట్టుబడులకు సంబంధించి అదొక్కటే వ్యూహంగా మాత్రం పెట్టుకోవద్దు. → మంచి అవకాశాల కోసం కాస్త వేచి చూడండి. ఇలాంటివి ఏడాదిలో 4– 6 వరకు వస్తుంటాయి. → బాగుందనిపించగానే ఇన్వెస్ట్ చేసేయొద్దు. వ్యాపార ప్రాథమిక విషయాలను తెలుసుకునేందుకు ప్రాస్పెక్టస్ని కూడా కాస్త తిరగేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. → పబ్లిక్ ఇష్యూల్లో పెట్టుబడులను మీ దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్లూ–చిప్ స్టాక్స్కి అనుబంధంగానే ఉంచుకోవడం మంచిది. చివరిగా చెప్పేదేమిటంటే పబ్లిక్ ఇష్యూలంటే లాటరీలు కావు! యుఫోరియాకి లోను కాకుండా జాగ్రత్త వహించాలి. లిస్టింగ్కి వచ్చిన కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉంటే కేవలం లిస్టింగ్ రోజునే కాదు దీర్ఘకాలికంగా కూడా మంచి రాబడులను అందుకోవచ్చని గుర్తుంచుకోవాలి. -
Business: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
వరుస నష్టాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 604.72 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 83,576.24 వద్ద, నిఫ్టీ 193.55 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 25,683.30 వద్ద నిలిచాయి.ఆసోమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, యాషో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆకాష్ ఇన్ఫ్రా-ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎలెకాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రాజ్రతన్ గ్లోబల్ వైర్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, అహ్లాదా ఇంజనీర్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
Stock Market Updates: నష్టాల్లో నిఫ్టీ.. సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ప్రారంభమై నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు తగ్గి 25,862 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 44 పాయింట్లు నష్టపోయి 84,136 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.9బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 62.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.17 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25% తగ్గిందినాస్డాక్ 0.93 శాతం తగ్గిందిToday Nifty position 09-01-2026(time: 9:33 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్
వరుస నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 780.18 పాయింట్ల నష్టంతో 84,180.96 వద్ద, నిఫ్టీ 263.90 పాయింట్ల నష్టంతో 25,876.85 వద్ద నిలిచాయి.ఆకాష్ ఇన్ఫ్రా-ప్రాజెక్ట్స్ లిమిటెడ్, జిందాల్ ఫోటో లిమిటెడ్, బాలాజీ అమైన్స్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, యాషో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
Stock Market Updates: నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 46 పాయింట్లు తగ్గి 26,094 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 120 పాయింట్లు నష్టపోయి 84,840 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.58బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.16 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.3% తగ్గిందినాస్డాక్ 0.2 శాతం పెరిగిందిToday Nifty position 08-01-2026(time: 9:48 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మాదిరిగానే.. బుధవారం కూడా నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 92.45 పాయింట్ల నష్టంతో.. 84,970.90 వద్ద, నిఫ్టీ 35.15 పాయింట్ల నష్టంతో 26,143.55 వద్ద నిలిచాయి.జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, అహ్లాదా ఇంజనీర్స్ లిమిటెడ్, ఎన్ఐబిఎల్ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఓరియంట్ సెరాటెక్ లిమిటెడ్, ఇన్క్రెడిబుల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
Stock Market Updates: 26,150 దిగువన నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 36 పాయింట్లు కరిగి 26,141 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 75 పాయింట్లు క్షీణించి 84,988 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.26బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 61.79 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.18 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.6 శాతం పెరిగింది.నాస్డాక్ 0.6 శాతం పెరిగింది.Today Nifty position 07-01-2026(time: 9:33 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 376.27 పాయింట్ల నష్టంతో 85,063.34 వద్ద, నిఫ్టీ 74.70 పాయింట్ల నష్టంతో 26,175.60 వద్ద నిలిచాయి.శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్, గోయల్ అల్యూమినియంస్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సిస్టమ్మాటిక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్, ట్రెంట్ లిమిటెడ్, రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
Stock Market Updates: నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 26,211 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 263 పాయింట్లు నష్టపోయి 85,176 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.5బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 62 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.20 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.6% పైగా పెరిగిందినాస్డాక్ 0.9 శాతం పెరిగిందిToday Nifty position 06-01-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా స్వల్ప నష్టాల్లో ప్రారంభమై.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నిఫ్టీ(Nifty) 90.60 పాయింట్లు నష్టంతో 26,237.95 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 351.07 పాయింట్లు క్షీణించి 85,410.94 వద్ద నిలిచాయి.రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్ లిమిటెడ్, బిపిఎల్ లిమిటెడ్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్ లిమిటెడ్, క్రితి న్యూట్రియంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్యుపిడ్ లిమిటెడ్, వివిమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్, కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎల్డెకో హౌసింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు -
ఆన్లైన్లో కొన్న బంగారంపై లోన్ ఇస్తారా?
దైనందిన ఆర్థిక జీవనంలో మనకు అనేక అనుమానాలు, సందేహాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో రియల్టీ, బ్యాంకింగ్, బంగారం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్.. ఇలా భిన్న అంశాలపై పాఠకులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తోంది ‘సాక్షి బిజినెస్’..రియల్టీ..ఆదాయంతో పోల్చితే గృహ రుణంపై చెల్లించే ఈఎంఐ ఎంతవరకూ ఉండాలి?సాధారణంగా అయితే గృహరుణంపై చెల్లించే ఈఎంఐగా మీ ఆదాయంలో 30 శాతాన్ని మించకపోతే మంచిది. 35–40 శాతమైతే కాస్త రిస్కే. ఎందుకంటే నెలవారీ క్యాష్ ఫ్లో తక్కువగా ఉంటుంది. ఇక 40 శాతం దాటితే వద్దనే చెప్పాలి. ఇంటి ఖర్చులకు డబ్బులు మిగలటం చాలా కష్టమవుతుంది. మెడికల్, ఉద్యోగ ఎమర్జెన్సీలు తలెత్తితే మేనేజ్ చేయటం కష్టం. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇరుక్కుపోయే ప్రమాదముంటుంది. ఒకవేళ ఎక్కువ మంది సంపాదిస్తుంటే, 6–12 నెలల ఎమర్జెన్సీ నిధి చేతిలో ఉన్నపుడు, ఇతరత్రా రుణాలేవీ లేనప్పుడు మాత్రం 40 శాతానికి అటూ ఇటుగా ఉన్నా మేనేజ్ చేయొచ్చు.బ్యాంకింగ్..నా భార్యతో జాయింట్గా ఎఫ్డీలను ఓపెన్ చేయొ చ్చా? పన్ను ప్రయోజనాలు?ఇద్దరూ కలిసి ఫిక్స్డ్ డిపాజిట్లు ఓపెన్ చేయటానికి ఇబ్బందులుండవు. పన్ను ప్రయోజనాలు ఫస్ట్ హోల్డర్కే వర్తిస్తాయి. ఎఫ్డీ తెరిచేటపుడు దాన్ని విత్డ్రా చేయటం, రెన్యూవల్ చేయటం వంటి హక్కులు ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉండేలా స్పష్టంగా పేర్కొనాలి. అలాకాని పక్షంలో ఫస్ట్ హోల్డర్కే ఆ హక్కులుంటాయి. తన మరణం తరువాతే మిగిలిన వ్యక్తికి వస్తాయి. ఇద్దరు కలిసి ఎఫ్డీ తెరిటేపుడు ఒకరు సీనియర్ సిటిజన్ అయితే వారినే ఫస్ట్ హోల్డర్గా పేర్కొంటే వడ్డీ కాస్త ఎక్కువ వస్తుంది. లేని పక్షంలో ఇద్దరిలో ఎవరు తక్కువ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో వారి పేరిట తెరిస్తే... వడ్డీపై పన్ను తక్కువ చెల్లించాల్సి వస్తుంది.బంగారంబంగారం ఆన్లైన్లో కొన్నాను. దీన్ని తనఖా పెట్టవచ్చా?ఆన్లైన్లో కాయిన్లు, ఆభరణాల రూపంలో కొంటే దాన్ని తనఖా పెట్టవచ్చు. స్వచ్ఛతకు సంబంధించిన కొన్ని నిబంధనలున్నాయి. వాటికి లోబడి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తనఖా పెట్టుకుంటాయి. ఒరిజినల్ బిల్లు తప్పనిసరిగా ఉండాలి. బంగారం 22 లేదా 24 క్యారెట్ల స్వచ్ఛతను కలిగి ఉండాలి. హాల్మార్క్ ఉంటే ఈజీగా అంగీకరిస్తారు. కొన్ని బ్యాంకులైతే ప్రయివేటు మింట్ల నుంచి వచి్చన కాయిన్లను 50 గ్రాములకన్నా ఎక్కువ తీసుకోవటం లేదు. అలాంటి పక్షంలో ముత్తూట్, మణప్పురం వంటి ఎన్బీఎఫ్సీలు బెటర్. మీకు బంగారంపై రుణం సత్వరం కావాలంటే ఎన్బీఎఫ్సీలే నయం. బ్యాంకులు నిబంధనల విషయంలో కఠినంగా ఉంటాయి.స్టాక్ మార్కెట్...ట్రేడింగ్ ఖాతా ఓపెన్ చేయడానికి నిబంధనలేంటి? సిబిల్ స్కోరు అవసరమా?ట్రేడింగ్ ఖాతా తెరవటానికి సిబిల్ స్కోరు అవసరం లేదు. కాకపోతే 18 ఏళ్లు నిండి ఉండాలి. పాన్ కార్డు, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఉండాలి. షేర్లలో ఇన్వెస్ట్ చేయటం వరకూ పర్వాలేదు గానీ... ఎఫ్అండ్ఓ, కమోడిటీ–కరెన్సీ డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేయాలంటే మాత్రం ఆదాయపు ధ్రువీకరణ పత్రం అవసరం. దీనికోసం ఐటీఆర్, 3 నెలల శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, నెట్వర్త్ సర్టిఫికెట్ వంటివాటిలో ఏదైనా సరిపోతుంది. షేర్లను హోల్డ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. మనకైతే మామూలు కేవైసీ సరిపోతుంది. ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ఎన్ఆర్ఈ ఖాతా అవసరం.మ్యూచువల్ ఫండ్స్...సిప్లలో ఎంతశాతం రాబడిని ఆశించవచ్చు?సిప్లలో రాబడులనేవి అది ఏ తరహా ఫండ్.. ఎంతకాలం ఇన్వెస్ట్ చేశారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పదేళ్లకు మించి చూస్తే... లార్జ్క్యాప్ ఫండ్లు 10–012 శాతం, మిడ్ క్యాప్ ఈక్విటీ 12–15 శాతం, స్మాల్ క్యాప్ ఈక్విటీ 14–18 శాతం, హైబ్రిడ్ ఫండ్లు 8–10 శాతం, డెట్ ఫండ్లు 5–7 శాతం రాబడులను అందించిన పరిస్థితి ఉంది. సిప్లు కనీసం ఏడేళ్లకు పైబడి చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి. స్వల్పకాలా నికైతే ఒకోసారి నెగెటివ్ రాబడులూ ఉండొచ్చు. మార్కెట్లలో ఎగుడుదిగుళ్లు సహజం. వాస్తవ రాబడులనేవి మార్కెట్ సైకిల్స్, మీరు ఎంచుకున్న ఫండ్ నాణ్యత, మీ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా.. దీర్ఘకాలమైతేనే ‘సిప్’ చెయ్యండి.ఇన్సూరెన్స్హెల్త్ ఇన్సూరెన్స్కు టాప్–అప్ చేయించడం మంచిదేనా?హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తక్కువగా ఉందని భావిస్తే టాప్–అప్ మంచిదే. మీ అవసరాలు, బడ్జెట్ కూడా చూసుకోవాలి. టాప్–అప్ మీ ఇన్సూరెన్స్ మొత్తం సరిపోని పక్షంలో మాత్రమే అక్కరకొస్తుంది. అంటే మీకు రూ.5 లక్షల బీమా ఉందనుకుందాం. రూ.10 లక్షలకు టాప్–అప్ తీసుకుంటే... మీకు అవసరం వచి్చనపుడు రూ.5 లక్షలు పూర్తయిపోయాక ఈ టాప్ అప్ మొత్తం అక్కరకొస్తుంది. అందుకని మీకు ప్రస్తుత ఇన్సూరెన్స్ సరిపోదని భావిస్తున్నపుడే టాప్–అప్ వైపు చూడాలి. మీరు యువకులై ఉండి, మీకు కవరేజీ గనక రూ.10 లక్షల వరకూ ఉందనుకుందాం. అపుడు టాప్–అప్ అవసరం చాలా తక్కువపడుతుంది.మీ సందేహాలకూ నిపుణుల ద్వారా సమాధానాలు కావాలంటే business@sakshi.com కు మెయిల్ చేయండి. -
Stock Market Updates: ఫ్లాట్గా సెన్సెక్స్.. నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 9 పాయింట్లు నష్టంతో 26,318 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 117 పాయింట్లు క్షీణించి 85,644 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.5బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 60.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.20 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.2 శాతం లాభపడింది.నాస్డాక్ 0.03 శాతం పెరిగింది.Today Nifty position 05-01-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కోటి ఆశలతో కొత్త ఏడాది
కొత్త కేలండర్ ఏడాదిలో దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ దౌడు తీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు యూటర్న్ తీసుకోవచ్చనే అంచనాలు, క్యూ3 ఫలితాలపై ఆశలు, ఊపందుకుంటున్న వినియోగం ఇందుకు దోహదపడచ్చని అంచనా. గత వారం సాంకేతిక అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడం దీనిని బలపరుస్తోంది! వివరాలు చూద్దాం.. ఈ వారం ప్రధానంగా భారత్సహా యూఎస్, చైనా పీఎంఐ ఇండెక్సుల గణాంకాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఆశావహ ఆటోరంగ విక్రయాలు, జోరుమీదున్న ఆర్థిక పురోగతి, పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి బలహీనతలు, వాణిజ్య టారిఫ్లు కొంతమేర ప్రతికూల ప్రభావానికి కారణంకాన‡ున్నాయి. దేశీయంగా చూస్తే → గత నెల హెచ్ఎస్బీసీ సరీ్వసుల పీఎంఐ, కాంపోజిట్(తయారీ) పీఎంఐ తుది గణాంకాలు వెలువడనున్నాయి. → వచ్చే వారం ప్రారంభంకానున్న క్యూ3 కార్పొ రేట్ ఫలితాల సీజన్పై ఆశావహఅంచనాలున్నాయి. 12న ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ అక్టోబర్–డిసెంబర్(క్యూ3) పనితీరును వెల్లడించనున్నాయి. → 2025లో దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా విదేశీ ఇన్వెస్టర్లు 18.9 బిలియన్ డాలర్ల(రూ. 1.66 లక్షల కోట్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈ బాటలో 2026 తొలి రెండు రోజుల్లో సైతం నికరంగా రూ. 7,608 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే గతంలో ఇలా జరిగిన తదుపరి ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న అంశాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. విదేశీ అంశాలు ఇలా → ఈ వారం 2025 డిసెంబర్ నెలకు చైనా తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ ఇండెక్సుల వివరాలు విడుదలకానున్నాయి. విదేశీ నిల్వలు, ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. మరోవైపు వివిధ యూఎస్ గణాంకాలు వెలువడనున్నాయి. సరికొత్త రికార్డ్ గత వారం నిఫ్టీ ఇంట్రాడేలో 26,340 పాయింట్లను తాకింది. సరికొత్త గరిష్టానికి చేరి రికార్డ్ నెలకొల్పింది. గత వారం నికరంగా సెన్సెక్స్ 721 పాయింట్లు(0.84%) పుంజుకుని 85,762 వద్ద నిలవగా.. నిఫ్టీ 286 పాయింట్లు(1.1%) ఎగసి 26,329 వద్ద స్థిరపడింది.బుల్లిష్ వేవ్లో.. యూఎస్ వెనెజువెలా ప్రెసిడెంట్ను బందీగా పట్టుకుని స్వదేశానికి తరలించిన నేపథ్యంలో ఈ వారం అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం సైతం స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే జీడీపీ వృద్ధి, క్యూ3 ఫలితాలపై అంచనాలు, ప్రభుత్వ వ్యయాలు వంటి అంశాలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు చెబుతున్నారు. వెరసి మార్కెట్లు బలాన్ని పుంజుకునేందుకే అధికంగా వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → గత వారం అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 26,000 స్థాయికి ఎగువన నిలుస్తూ 26,340 వద్ద కొత్త గరిష్టాన్ని అందుకుంది. దీంతో ఈ వారం నిఫ్టీ 26,720– 26,900 పాయింట్ల వరకూ బలపడవచ్చు. ఒకవేళ బలహీనపడితే 26,000– 25,750 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించే వీలుంది. → గత వారం 85,350 పాయింట్లను దాటి 85,762కు ఎగసింది. వెరసి ఈ వారం 86,800, 87,200 పాయింట్లవరకూ పురోగమించవచ్చు. ఇలాకాకుండా నీరసిస్తే 84,800– 84,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ కనిపించే అవకాశముంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 573.41 పాయింట్లు లేదా 0.67 శాతం లాభంతో 85,762.01 వద్ద, నిఫ్టీ 182.00 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 26,328.55 వద్ద నిలిచాయి.రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్, బీపీఎల్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్, కృతి న్యూట్రియంట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టూరిజం ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, క్యుపిడ్, వివిమెడ్ ల్యాబ్స్, కిరి ఇండస్ట్రీస్, ఎల్డెకో హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్ అప్డేట్: లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 333.44 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 85,522.04 వద్ద, నిఫ్టీ 105.60 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 26,252.15 వద్ద కొనసాగుతున్నాయి.స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్, సింటర్కామ్ ఇండియా, కేఎస్ఆర్ ఫుట్వేర్ లిమిటెడ్, లాసా సూపర్జెనరిక్స్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వివిమెడ్ ల్యాబ్స్, ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఒసియా హైపర్ రిటైల్ లిమిటెడ్, నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, కిరి ఇండస్ట్రీస్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
బుధవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ఉదయం కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 209.55 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 85,430.15 వద్ద, నిఫ్టీ 63.95 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 26,193.55 వద్ద కొనసాగుతున్నాయి.కేఎస్ఆర్ ఫుట్వేర్ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, పనామా పెట్రోకెమ్, లాసా సూపర్జెనరిక్స్, పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు లాభాల బాట పట్టగా.. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, టెంబో గ్లోబల్ ఇండస్ట్రీస్, ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, వివిమెడ్ ల్యాబ్స్, ఐటీసీ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
2026లో స్టాక్ మార్కెట్ హాలిడేస్: ఫుల్ లిస్ట్ ఇదే..
2025 డిసెంబర్ 31న స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇక రేపటి నుంచి (2026 జనవరి 1) కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ తరుణంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వచ్చే సంవత్సరం మార్కెట్ సెలవుల జాబితాను విడుదల చేసింది.➤26 జనవరి (సోమవారం): గణతంత్ర దినోత్సవం➤3 మార్చి (మంగళవారం): హోలీ➤26 మార్చి (గురువారం): రామనవమి➤31 మార్చి (మంగళవారం): మహావీర్ జయంతి➤3 ఏప్రిల్ (శుక్రవారం): గుడ్ ఫ్రైడే➤14 ఏప్రిల్ (మంగళవారం): అంబేద్కర్ జయంతి➤1 మే (శుక్రవారం): మహారాష్ట్ర దినోత్సవం➤28 మే (గురువారం): బక్రీద్➤26 జూన్ (శుక్రవారం): మొహర్రం➤14 సెప్టెంబర్ (సోమవారం): గణేష్ చతుర్థి➤2 అక్టోబర్ (శుక్రవారం): మహాత్మా గాంధీ జయంతి➤20 అక్టోబర్ (మంగళవారం): దసరా➤10 నవంబర్ (మంగళవారం): దీపావళి-బలిప్రతిపాద➤24 నవంబర్ (మంగళవారం): గురునానక్ జయంతి➤25 డిసెంబర్ (శుక్రవారం): క్రిస్మస్2026 NSE సెలవుల జాబితా ప్రకారం.. భారత స్టాక్ మార్కెట్ 15 రోజులు మూసివేయబడుతుంది. ఇవి కాకుండా శని, ఆదివారాలు మార్కెట్ సెలవు.శని & ఆదివారాల్లో వచ్చే పండుగ సెలవులు➤15 ఫిబ్రవరి (ఆదివారం): మహాశివరాత్రి➤21 మార్చి (శనివారం): రంజాన్➤15 ఆగస్టు (శనివారం): స్వాతంత్య్ర దినోత్సవం➤8 నవంబర్ (ఆదివారం): దీపావళి -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 544.66 పాయింట్లు లేదా 0.64 శాతం లాభంతో 85,219.74 వద్ద, నిఫ్టీ 197.50 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 26,136.35 వద్ద నిలిచింది.కేఎస్ఆర్ ఫుట్వేర్ లిమిటెడ్, ఆస్పిన్వాల్ అండ్ కంపెనీ, కాలిఫోర్నియా సాఫ్ట్వేర్, కిరి ఇండస్ట్రీస్, ఓరియంట్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రివి స్పెషాలిటీ కెమికల్స్, వోడాఫోన్ ఐడియా, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మళ్లీ 26,000 మార్కుపైకి నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 69 పాయింట్లు పెరిగి 26,009 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 201 పాయింట్లు పుంజుకొని 84,877 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 31-12-2025(time: 9:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం.. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ 103.16 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 84,798.70 వద్ద, నిఫ్టీ 27.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,969.85 వద్ద నిలిచాయి.ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, ఓరియంట్ టెక్నాలజీస్, ఓరియంట్ సెరాటెక్, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పావ్నా ఇండస్ట్రీస్, మోదీ రబ్బర్ లిమిటెడ్, ప్రకాష్ స్టీలేజ్, నందని క్రియేషన్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 48 పాయింట్లు నష్టంతో 25,895 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 పాయింట్లు తగ్గి 84,549 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.04బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 61.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.11 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.35 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.5 శాతం తగ్గింది.Today Nifty position 30-12-2025(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 345.91 పాయింట్లు, లేదా 0.41 శాతం నష్టంతో 84,695.54 వద్ద, నిఫ్టీ 100.20 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 25,942.10 వద్ద నిలిచాయి.ప్రకాష్ స్టీలేజ్, రాజనందిని మెటల్, కంట్రీ కాండోస్ లిమిటెడ్, ఓరియంట్ బెల్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మోడీ రబ్బరు, బ్రూక్స్ లాబొరేటరీస్, టీమో ప్రొడక్షన్స్ హెచ్క్యూ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
26 వేల మార్కు వద్దే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు లాభంతో 26,056 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 17 పాయింట్లు పెరిగి 85,061 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 29-12-2025(time: 9:24)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
2026లో సంపద సృష్టించే ‘టాప్-4’ థీమ్స్ ఇవే!
2025లో భారత స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 2026వ సంవత్సరం ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారబోతోందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి, కార్పొరేట్ లాభాలు పుంజుకోనుండటం మార్కెట్కు కొత్త ఊపిరి పోయనున్నాయని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా నిఫ్టీ-50 ఇండెక్స్ 2026 చివరి నాటికి 28,000 పాయింట్ల మైలురాయిని చేరుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా.. కృత్రిమ మేధ(AI), గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించి పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలికంగా భారీ లాభాలు అందనున్నాయని చెబుతున్నాయి. మరి 2026లో మదుపరుల అదృష్టాన్ని మార్చబోతున్న ఆ కీలక రంగాలు ఏమిటో చూద్దాం.కృత్రిమ మేధభారతదేశం ప్రస్తుతం ఏఐ విప్లవంలో ఒక కీలక దశలో ఉంది. ఇది కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఉత్పాదకతను పెంచే ప్రధాన సాధనంగా మారుతోంది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు సుమారు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం కేటాయించాయి. 2026 ఫిబ్రవరి 19-20 తేదీల్లో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ఈ రంగానికి దిశానిర్దేశం చేయనుంది. భారత ప్రభుత్వ లక్ష్యం ప్రకారం, స్వదేశీ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పాదకతను పెంచే ‘చిన్న మోడల్స్’(Small Language Models) అభివృద్ధిపై దృష్టి సారించింది.ఈవీ చార్జింగ్ సదుపాయాలుఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్నా, వాటికి అవసరమైన చార్జింగ్ సౌకర్యాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 45 శాతం మంది ఈవీ వినియోగదారులు పబ్లిక్ చార్జింగ్ పాయింట్లపై ఆధారపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ అంతరాన్ని పూడ్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఈ మేరకు సర్వీసులు అందిస్తున్న కంపెనీలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.ఆఫీస్ వర్క్స్పేస్భారతదేశం ఇప్పుడు కేవలం బ్యాక్ ఆఫీస్ హబ్గా కాదు.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ సెంటర్లను భారత్లో ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల అత్యాధునిక సౌకర్యాలు గల 50-100 సీటర్ ఆఫీసులకు, మీటింగ్ రూమ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.లగ్జరీ, ప్రీమియం వస్తువులుపెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ వల్ల లగ్జరీ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, ఖరీదైన వాచీలు, ప్రీమియం కార్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో బలమైన వృద్ధి కనిపిస్తోంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే.. -
స్టాక్ మార్కెట్.. నష్టాల ముగింపు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం నష్టాలలో ముగిశాయి. ఐటీ, ఆటో స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి, సెన్సెక్స్ గడువు ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్ మరింత మందగించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 367.25 పాయింట్లు లేదా 0.43 శాతం నష్టపోయి 85,041.45 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 99.80 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 26,042.30 వద్ద స్థిరపడింది.టైటాన్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ బీఎస్ఈలో టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్స్.ఎన్ఎస్ఈలో టైటాన్, హిండాల్కో, నెస్లే ఇండియా టాప్ విన్నర్లుగా ఉండగా, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు కూడా ప్రతికూలంగానే ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.23 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.08 శాతం నష్టపోయాయి. సెక్టార్ వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 1.03 శాతం, ఆటో 0.52 శాతం నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ మెటల్ 0.59 శాతం లాభంతో ముగిసింది. -
26,000 మార్కు వద్దకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 56 పాయింట్లు నష్టంతో 26,086 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 201 పాయింట్లు దిగజారి 85,209 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 26-12-2025(time: 9:50am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. గడిచిన సెషన్తో పోలిస్తే స్వల్ప లాభాలలో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 31 పాయింట్లు లాభంతో 26,208 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 63 పాయింట్లు పెరిగి 85,588 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.91బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.15 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.5 శాతం పెరిగింది.నాస్డాక్ 0.6 శాతం పుంజుకుంది.Today Nifty position 24-12-2025(time: 9:35)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 43 పాయింట్లు కోల్పోయి 85,525 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అయిదు పాయింట్లు పెరిగి 26,177 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ రోజు కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 85,343 – 85,705 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 26,119 వద్ద కనిష్టాన్ని, 26,234 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 0.71%, రియల్టీ 0.21%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.10% నష్టపోయాయి. మరోవైపు కమోడి టీస్ 0.68%, వినిమయ 0.59%, మెటల్ 0.52%, విద్యుత్ 0.40%, ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఇంధన 0.36% లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.38%, 0.07% పెరిగాయి. ⇒ తన అనుబంధ సంస్థలు ఏసీసీ లిమిటెడ్, ఓరియంట్ సిమెంట్స్ కంపెనీల విలీనానికి అంబుజా సిమెంట్స్ సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ షేరు 4.40% పెరిగి రూ.171 వద్ద ముగిసింది. ఒక దశలో 10% పెరిగి రూ.180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అంబుజా సిమెంట్స్ షేరు 1.25% పెరిగి రూ.547 వద్ద స్థిరపడింది. ఒక దశలో 4.30% లాభపడి రూ.563 వద్ద గరిష్టాన్ని తాకింది. ఏసీసీ షేరు 1.21% నష్టపోయి రూ.1,754 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.50% పతనమై రూ.1,802 కనిష్టాన్ని తాకింది. ⇒ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ షేరు లిస్టింగ్లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.384)తో బీఎస్ఈలో 3.50% డిస్కౌంటుతో రూ.370 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 9% క్షీణించి రూ.350 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 8% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 65.43 పాయింట్లు లేదా 0.076 శాతం నష్టంతో 85,502.05 వద్ద, నిఫ్టీ 6.35 పాయింట్లు లేదా 0.024 శాతం నష్టంతో 26,166.05 వద్ద నిలిచాయి.ఓమాక్స్, మోడీ రబ్బర్ లిమిటెడ్, టీమో ప్రొడక్షన్స్ హెచ్క్యూ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్, ప్రిజం జాన్సన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ష్రెనిక్ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విన్నీ ఓవర్సీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్గా పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 27 పాయింట్లు నష్టంతో 26,144 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 128 పాయింట్లు దిగజారి 85,434 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 23-12-2025(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 638.12 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 85,567.48 వద్ద, నిఫ్టీ 195.20 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 26,161.60 వద్ద నిలిచాయి.క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, జూపిటర్ వ్యాగన్స్, ష్రెనిక్, ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, సద్భావ్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, దావణగెరె షుగర్ కంపెనీ, ఆర్వీ లాబొరేటరీస్, మీషో లిమిటెడ్, రిలయన్స్ పవర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
26,100 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు లాభంతో 26,128 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 484 పాయింట్లు పుంజుకొని 85,408 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 22-12-2025(time: 09:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
శాంట క్లాజ్ ర్యాలీకి చాన్స్!
సుమారు 3 వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు మద్దతు స్థాయిలనుంచి రికవర్ అవుతూ వస్తున్నాయి. తొలుత అమ్మకాలు.. తదుపరి కొనుగోళ్లతో నిఫ్టీ 26,000, సెన్సెక్స్ 85,000 పాయింట్లకు అటూఇటుగా కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు మరోసారి సైడ్వేస్లో కదలనున్నాయా లేక శాంటా ర్యాలీకి దారి ఏర్పడుతుందా చూడవలసి ఉంది! క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం(25న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మరోపక్క యూఎస్ సహా.. పలు యూరోపియన్ మార్కెట్లకు కొత్త ఏడాది సెలవులు సైతం జత కలవనుండటంతో దేశీయంగానూ ట్రేడింగ్ పరిమాణం నీరసించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఆటు పోట్ల మధ్య మార్కెట్లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో కదులుతున్నాయి. దీంతో ఈ వారం కూడా హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నచందాన ట్రేడ్కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరోపక్క ఇదే సమయంలో ఈ వారం శాంట క్లాజ్ ర్యాలీకి బీజం పడవచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో? పరిశీలించదగ్గ అంశాలు → దేశీయంగా నేడు(22న) నవంబర్ నెలకు మౌలిక రంగ పురోగతి వివరాలు వెల్లడికానున్నాయి. 2025 అక్టోబర్లో దాదాపు యథాతథంగా 3.3 శాతం వృద్ధి నమోదైంది. 14 నెలల తదుపరి ఎలాంటి పురోగతి నమోదుకాకపోవడం గమనార్హం! యూఎస్ టారిఫ్లు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. → డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టం 91 స్థాయి నుంచి భారీ రికవరీ సాధించింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకపు విలువ వారాంతాన 89.67 వద్ద స్థిరపడింది. → దేశీ మార్కెట్లలో పటిష్ట లిక్విడిటీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు పలు ఐపీవోలతో ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతుంటే.. మరోపక్క సెకండరీ మార్కెట్లలో రిటైలర్లతోకలసి దేశీ ఫండ్స్ పెట్టుబడులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కొద్ది నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో విక్రయాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నప్పటికీ మార్కెట్లు నిలదొక్కుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. విదేశీ ఎఫెక్ట్ → ఈ వారం(23న) యూఎస్ మూడో త్రైమాసిక(జూలై–సెపె్టంబర్) జీడీపీ వృద్ధిపై ద్వితీయ అంచనాలు వెలువడనున్నాయి. క్యూ2(ఏప్రిల్–జూన్)లో యూఎస్ జీడీపీ వార్షికంగా 3.8%పుంజుకుంది. 3.3% అంచనాలను అధిగమించింది. → ఇదే రోజు యూఎస్ ప్రయివేట్ రంగ ఉద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. 24న నిరుద్యోగ గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. → ద్రవ్యోల్బణం, ఉపాధి గణాంకాల ప్రభావంతో యూఎస్ ఫెడ్ మరోసారి వడ్డీ రేట్ల కోత అమలు కు మొగ్గు చూపవచ్చని అంచనాలు పెరిగాయి.సాంకేతిక అంచనాలు ఇలా గత వారం అంతక్రితం వారంలాగే మార్కెట్లు రెండో సపోర్ట్ లెవల్స్వద్ద నుంచి రికవరీ సాధించాయి. సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ వారం శాంట ర్యాలీకి తెరతీయవచ్చని అంచనా. నిఫ్టీ 26,060కు ఎగువన నిలదొక్కుకుంటే 26,450 వరకూ బలపడవచ్చు. 25,700 స్థాయిలో పటిష్ట మద్దతు లభిస్తోంది. బలహీనపడి 25,600కు చేరితే మరింత నీరసించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 447.55 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 84,929.36 వద్ద, నిఫ్టీ 150.85 పాయింట్లు లేదా 0.58 శాతం లాభంతో 25,966.40 వద్ద నిలిచాయి.ఆర్వీ లాబొరేటరీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్, జీ లెర్న్, ప్రెసిషన్ కామ్షాఫ్ట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఉగార్ షుగర్ వర్క్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, భగీరధ్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్, అవధ్ షుగర్ & ఎనర్జీ, ది వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 147 పాయింట్లు లాభంతో 25,961 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 488 పాయింట్లు పుంజుకొని 84,976 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.46బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 59.68 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.13 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.79 శాతం పెరిగింది.నాస్డాక్ 1.38 శాతం పుంజుకుంది.Today Nifty position 19-12-2025(time: 09:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు నష్టంతో 25,795 వద్ద, సెన్సెక్స్(Sensex) 66 పాయింట్లు నష్టపోయి 84,492 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 18-12-2025(time: 9:38)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా ప్రారంభమై స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 35 పాయింట్లు లాభంతో 25,895 వద్ద, సెన్సెక్స్(Sensex) 115 పాయింట్లు లాభపడి 84,795 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 17-12-2025(time:9:37 )(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
534 పాయింట్లు డౌన్
ముంబై: వాణిజ్య లోటు పెరుగుతుండటం, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత తదితర అంశాల కారణంగా రూపాయి మారకం విలువ రోజురోజుకీ పడిపోతోంది. తాజాగా ఇంట్రాడేలో 91 మార్కును దాటేసింది. చివరికి డాలరుతో పోలిస్తే మరో 15 పైసలు క్షీణించి 90.93 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో క్రితం ముగింపుతో పోలిస్తే ఇంట్రాడేలో 36 పైసల క్షీణతతో 91.14 స్థాయిని కూడా తాకింది. కేవలం 10 ట్రేడింగ్ సెషన్లలోనే రూపాయి మారకం విలువ 90 నుంచి 91కి పడిపోయింది. గత అయిదు సెషన్లలో ఏకంగా 1 శాతం పతనమైంది. ఈ నెలలోనే 92 మార్కును కూడా దాటేయొచ్చని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఈడీ అనిల్ కుమార్ భన్సాలీ తెలిపారు. ఈ ఏడాది 5.1 శాతం డౌన్.. రాజ్యసభలోనూ ఈ అంశం చర్చకు రాగా, డేటా ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 3 వరకు రూపాయి విలువ 5.1 శాతం క్షీణించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. వాణిజ్య లోటు, అమెరికా–భారత్ ఒప్పందానికి సంబంధించిన పరిణామాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. అయితే, రూపాయి పతనంతో ఎగుమతులపరంగా పోటీతత్వం మెరుగుపడొచ్చని, ఇది ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. డేటా ప్రకారం డాలరుతో పోలిస్తే రూపాయి 2015లో 4.5 శాతం, 2016లో 2.6 శాతం క్షీణించగా, 2017లో 6.4 శాతం పెరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం క్షీణత కొనసాగింది. 91కి జారిన రూపాయిముంబై: విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ డీలాపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేమి, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 91 స్థాయిని బ్రేక్ చేయడం ఇన్వెస్టర్లను కలవరపరిచింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 84,680 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 167 పాయింట్లు కోల్పోయి 25,860 వద్ద నిలిచింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు, అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో రోజంతా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 592 పాయింట్లు క్షీణించి 84,621 వద్ద, నిఫ్టీ 193 పాయింట్లు పతనమై 25,834 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు మాత్రమే రాణించాయి. రియల్టీ 1.36%, బ్యాంకెక్స్ 1.03%, కమోడిటీస్ 0.91%, ఐటీ 0.90%, ఐటీ 0.86%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83%, మెటల్ 0.82 శాతం నష్టపోయాయి. మిడ్క్యాప్ ఇండెక్సు 0.78%, స్మాల్క్యాప్ సూచీ 0.69% పతనమయ్యాయి. ∙యాక్సిస్ బ్యాంకు షేరు 5% పతనమై రూ.1,220 వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ వరకూ నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి కొనసాగొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సిటి ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ షేరు పడింది. -
రెండోరోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 533.50 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 84,679.86 వద్ద, నిఫ్టీ 167.20 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 25,860.10 వద్ద నిలిచాయి.అసహి సాంగ్వాన్ కలర్స్, అమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్, అగ్రి టెక్ ఇండియా, ఈప్యాక్ డ్యూరబుల్స్, న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సలోనా కాట్స్పిన్, ఆర్వీ లాబొరేటరీస్, విపుల్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎల్జీ రబ్బరు వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:12 సమయానికి నిఫ్టీ(Nifty) 138 పాయింట్లు తగ్గి 25,890కు చేరింది. సెన్సెక్స్(Sensex) 464 పాయింట్లు నష్టపోయి 84,748 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 16-12-2025(time: 10:12 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: నష్టాల్లో సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 111 పాయింట్లు తగ్గి 25,935కు చేరింది. సెన్సెక్స్ (Sensex) 325 పాయింట్లు నష్టపోయి 84,942 వద్ద ట్రేడవుతోంది.🔻అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.4🔻బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 61.4 డాలర్లు🔻యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.17 శాతానికి చేరాయి.🔻గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.07 శాతం పడింది.🔻నాస్డాక్ 1.69 శాతం పతనమైంది.Today Nifty position 15-12-2025(time:9:54 )(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పడిలేచిన కెరటంలా నిఫ్టీ సూచీ
ఏడాదిలో ఇక్విటీ రిటైలర్లను నిఫ్టీ సూచీ ఓ ఆట ఆడేసుకొని చివరకు గరిష్టాలను చేరుకుంది. మొదటి త్రైమాసికంలో నష్టాల్లో ఉన్న నిఫ్టీ సూచీ ఏడాది చివరినాటికి జీవితకాల గరిష్టాలను చేరింది. అందుకు దేశీయంగా, అంతర్జాతీయంగా చాలా కారణాలున్నాయి. ఏడాదిలో చోటుచేసుకున్న చాలా పరిణామాల వల్ల నిఫ్టీ కదలికలపై ఇయర్ ఎండర్ రివ్యూ.భారత స్టాక్ మార్కెట్లకు ప్రధాన కొలమానమైన నిఫ్టీ 50 సూచీకి 2025 సంవత్సరం రికార్డుల ఇయర్గా మిగిలింది. జనవరి 1, 2025న సూచీ ప్రారంభ విలువతో పోలిస్తే ఏడాది ముగిసే నాటికి(డిసెంబర్ 12 వరకు) నిఫ్టీ సుమారు 18.5% నికర వృద్ధిని నమోదు చేసింది. ఇది ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ), దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) నుంచి భారీ నిధుల ప్రవాహానికి, స్థూల ఆర్థిక వ్యవస్థలో ఆశాజనకమైన వృద్ధి అంచనాలకు నిదర్శనం.సంవత్సరం మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) నిఫ్టీ సూచీలో సుమారు 4% తగ్గుదల కనిపించింది. అందుకు ప్రధానంగా అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ఆందోళనలు కారణం అయ్యాయి. అయితే, ఏప్రిల్ నుంచి సంవత్సరం చివరి వరకు నిఫ్టీ స్థిరంగా కదలాడుతూ పండుగ సీజన్, కార్పొరేట్ ఆదాయాల ఆశాజనక అంచనాలతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను తాకింది.నిఫ్టీ కదలికలపై ప్రభావం చూపిన కీలక అంశాలుభౌగోళిక-రాజకీయ అంశాలుఎర్ర సముద్రంలో కొనసాగిన ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీశాయి. ఇది ముడి చమురు ధరలను పెంచి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తెచ్చింది. తద్వారా నిఫ్టీ ఏడాది ప్రారంభంలో తగ్గుదలకు కారణమైంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్నికల ప్రభావం వాటి ఆర్థిక విధానాలపై ప్రభావం చూపవచ్చనే అనిశ్చితి నెలకొనడం వల్ల స్వల్పకాలికంగా మార్కెట్లో అస్థిరత ఏర్పడింది.దేశీయ ఆర్థిక పరిస్థితులు2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి అంచనాలు 6.8% - 7.0% మధ్య ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దాంతో దేశీయ డిమాండ్లో స్థిరత్వం మార్కెట్ సెంటిమెంట్ను బలోపేతం చేసింది.ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల నుంచి ఆశాజనకమైన త్రైమాసిక ఆదాయాలు (క్యూ1 నుంచి క్యూ3 వరకు) నిఫ్టీకి మద్దతునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరమైన వృద్ధి బ్యాంకింగ్ సూచీని కొత్త శిఖరాలకు చేర్చింది.అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ 2025 ద్వితీయార్థంలో ఆర్బీఐ కీలక రేట్లలో మార్పులు చేయడం వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది.యూఎస్ సుంకాలు, వాణిజ్య విధానాలుయూఎస్, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా అనేక అంతర్జాతీయ తయారీ కంపెనీలు తమ దృష్టిని భారతదేశం వైపు మళ్లించాయి. ఈ ‘చైనా ప్లస్ వన్’ వ్యూహం కారణంగా భారతదేశ ఎగుమతి ఆధారిత రంగాల్లో (ముఖ్యంగా కెమికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్) బలమైన వృద్ధి అంచనాలు నిఫ్టీ వృద్ధికి దోహదపడ్డాయి.ఫెడ్ వడ్డీ రేట్ల స్థిరీకరణ2025 చివరిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటానికి, భారత మార్కెట్లోకి ఎఫ్ఐఐల ప్రవాహం పెరగడానికి దారితీసింది.జీఎస్టీ సవరణలు2025-26 కేంద్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాలపై భారీ కేటాయింపులు, తయారీ రంగానికి ఉద్దీపనలు ఇవ్వడం వల్ల క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ వంటి రంగాలు లాభపడ్డాయి. 2025 మధ్యలో జీఎస్టీ కౌన్సిల్ కొన్ని కీలకమైన రంగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించింది. ఈ నిర్ణయం వినియోగదారుల ఖర్చులకు ఊతమివ్వడం, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం ద్వారా మార్కెట్కు సానుకూల అంశంగా మారింది.ఇదీ చదవండి: చాట్జీపీటీలో డిస్నీ పాత్రలు -
మెటల్ షేర్ల మెరుపులు..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. మెటల్ స్టాక్స్ లో బలమైన కొనుగోళ్లు, గ్లోబల్ ర్యాలీతో వరుసగా రెండవ సెషన్ లోనూ లాభాలను విస్తరించాయి. మధ్యాహ్నం 3:30 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 449.53 పాయింట్లు లేదా 0.53 శాతం పెరిగి 85,267.66 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 148.40 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 26,046.95 వద్ద ఉంది.టాటా స్టీల్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, మారుతి సుజుకీ, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఈ రోజు నిఫ్టీ గెయినర్లుగా నిలిచాయి. హెచ్యూఎల్, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్ షేర్లు పతనమయ్యాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.18 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.94 శాతం పెరిగాయి. సెక్టార్లలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2.63 శాతం పెరిగి టాప్ పెర్ఫార్మింగ్ ఇండెక్స్ గా నిలిచింది. దీంతోపాటు నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, మీడియా సెక్టార్లకు నష్టాలు తప్పలేదు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 119 పాయింట్లు పెరిగి 26,017కు చేరింది. సెన్సెక్స్(Sensex) 408 పాయింట్లు లాభపడి 85,226 వద్ద ట్రేడవుతోంది.ఎల్ అండ్ టీ, హిందాల్కో, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, జియో ఫైనాన్స్, మారుతి సుజుకీ, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు నిఫ్టీ గెయినర్లుగా నిలిచాయి. విప్రో, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, హెచ్ యూఎల్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ ఎం షేర్లు లాభాల బుకింగ్ లో పతనమయ్యాయి.Today Nifty position 12-12-2025(time: 9:51 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిఫ్టీ నష్టాలకు బ్రేక్.. 427 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత భారత ఈక్విటీలు పుంజుకున్నాయి. మూడు రోజుల నష్టాల పరంపరకు ముగింపు పలికాయి.మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 426.86 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 84,818.13 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 140.55 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 25,898.55 వద్ద ముగిసింది.ఎటర్నల్, టాటా స్టీల్, మారుతి సుజుకి, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ ఈరోజు సెన్సెక్స్ లో 1.7 శాతం వరకు లాభపడ్డాయి. టైటాన్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.87 శాతం, 0.74 శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 0.9 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.33 శాతం, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.08 శాతం క్షీణించాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించింది. నిఫ్టీ మెటల్, ఆటో సూచీలు వరుసగా 0.6 శాతం, 0.4 శాతం పెరిగాయి. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు తగ్గి 25,736కు చేరింది. సెన్సెక్స్(Sensex) 81 పాయింట్లు నష్టపోయి 84,332 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 11-12-2025(time: 9:20 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: లాభాల్లోకి మార్కెట్లు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయానికి ముందు భయం మధ్య బుధవారం ఫ్లాట్ ప్రారంభమైన భారత స్టాక్స్ తరువాత ఊపందుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 184 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 84,850 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 25,886 వద్ద ఉంది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ (USD Index) 99.03బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 62.41 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.19 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.1 శాతం తగ్గింది.నాస్డాక్ 0.1 శాతం లాభపడింది.Today Nifty position 10-12-2025(time: 9:36)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: తీవ్ర నష్టాల్లో మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 198 పాయింట్లు తగ్గి 25,761కు చేరింది. సెన్సెక్స్(Sensex) 620పాయింట్లు నష్టపోయి 84,482 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.06బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 62.47 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.168 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.35 శాతం తగ్గింది.నాస్డాక్ 0.14 శాతం నష్టపోయింది.Today Nifty position 09-12-2025(time: 9:52 )(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: నష్టాల్లో స్టాక్ మార్కెట్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 50 పాయింట్లు తగ్గి 26,135కు చేరింది. సెన్సెక్స్(Sensex) 154 పాయింట్లు నష్టపోయి 85,557 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.88 వద్ద ట్రేడవుతోందిబ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.84 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.14% వద్ద ఉన్నాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 6,870.40 వద్ద ముగిసిందినాస్డాక్ 23,578.13 వద్ద ముగిసిందిToday Nifty position 08-12-2025(time: 9:44)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: ఫ్లాట్గా మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు భారత ఈక్విటీ మార్కెట్లు స్పల్ప నష్టాల్లో చలిస్తున్నాయి. ఆర్బీఐ ఎంపీసీ మూడు రోజుల సమావేశం ఈరోజు రెపో రేట్ ప్రకటనతో ముగియనుంది.ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 79 పాయింట్లు లేదా 0.09 శాతం నష్టపోయి 85,187 వద్ద, నిఫ్టీ 50 సూచీ 12 పాయింట్లు లేదా 0.05 శాతం తగ్గి 26,021 వద్ద ఉంది.ఈ రోజు సెన్సెక్స్లో రిలయన్స్, ట్రెంట్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ పీవీ, సన్ ఫార్మా, టైటాన్ టాప్ లూజర్స్ గా ఉండగా, ఎటర్నల్, బీఈఎల్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్స్గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఫార్మా, మెటల్ సూచీలు 0.3 శాతం నష్టపోయాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 0.28 శాతం పెరిగింది.Today Nifty position 05-12-2025(time: 10:03 )(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రూపాయి బలహీనత, ఎఫ్ఐఐ అమ్మకాల ప్రభావం దలాల్ స్ట్రీట్ లో ఇంకా కొనసాగుతోంది. యూఎస్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడంతో గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి పెరిగింది. స్థిరమైన మూలధన ప్రవాహాలు, యూఎస్ తో వాణిజ్య చర్చలపై నిరంతర అనిశ్చితి, స్థిరమైన డాలర్ డిమాండ్ కారణంగా రూపాయి విలువ నిన్న డాలర్ మార్కుకు 90 వరకు జారిపోయింది.ఈరోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 25,994కు చేరింది. సెన్సెక్స్(Sensex) 44 పాయింట్లు లాభపడి 85,151 వద్ద ట్రేడవుతోంది. విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మిశ్రమంగా ఉన్నాయి.హెచ్యూఎల్, టైటాన్, ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్ పీవీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ రోజు సెన్సెక్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ ఎం, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్ మాత్రమే లాభపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లిస్టెడ్ కంపెనీల్లో అంతా మిస్టర్లేనా!
కంపెనీల సిబ్బందిలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా లిస్టెడ్ సంస్థల్లో వారి వాటా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన దాదాపు సగం కంపెనీల్లో (52 శాతం) ఉద్యోగినుల సంఖ్య 10 శాతం లోపే ఉంది. స్వచ్ఛంద సంస్థ ఉదైతీ విడుదల చేసిన ’సీజీజీ డ్యాష్బోర్డ్ 2024–25’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,386 కంపెనీల బాధ్యతాయుత వ్యాపారం, పర్యావరణహిత కార్యకలాపాల నివేదికలు (బీఆర్ఎస్ఆర్), సంస్థల వార్షిక నివేదికల ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందింది. వివిధ రంగాలవ్యాప్తంగా మహిళలు .. పురుషుల ప్రాతినిధ్యం, జీతాల్లో అంతరాలు, నాయకత్వ స్థానాల్లో సమ్మిళితత్వం, అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) తదితర అంశాలను ఇందులో పరిశీలించారు.‘సిబ్బందిలో మహిళల ప్రాతినిధ్యం గత అయిదేళ్లుగా స్థిరంగా పెరుగుతోంది. అయినప్పటికీ ఈ ఏడాది గణాంకాలు చూస్తుంటే అది అంత వేగంగా పెరగడం లేదని తెలుస్తంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన 2,615 సంస్థల్లో కేవలం సగం మాత్రమే లింగ ప్రాతినిధ్య డేటాను ఇస్తున్నాయి కాబట్టి మన ముందు ప్రస్తుతం ఉన్నది పాక్షిక ముఖ చిత్రమే‘ అని ఉదైతీ వ్యవస్థాపక సీఈవో పూజా శర్మ గోయల్ తెలిపారు. రిపోర్ట్లో మరిన్ని విశేషాలు.. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 శాతం పెరగ్గా, మహిళా ఉద్యోగుల సంఖ్య 7 శాతం పెరిగింది. మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరుతున్నప్పటికీ నిర్దేశిత లక్ష్యాల స్థాయిలో వారి వాటా పెరగడం లేదు. ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో మహిళల ప్రాతినిధ్యం 45 శాతం నుంచి 48 శాతానికి, వినియోగదారుల సర్వీసుల్లో 30 % నుంచి 34 శాతానికి పెరగ్గా, ఐటీ (34 శాతం), బ్యాంకింగ్ (26 శాతం)లో పెద్దగా మార్పు నమోదు కాలేదు. మహిళలు, పురషుల జీతాల మధ్య వ్యత్యాసం 2024, 2025 ఆర్థిక సంవత్సరాల్లో 6.7 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది. అయితే, మహిళల ప్రాతినిధ్యం ఎక్కువే ఉన్నప్పటికీ టెక్స్టైల్స్ (30.4 శాతం), డైవర్సిఫైడ్ (28.5 శాతం), మెటల్స్ .. మైనింగ్ (17 శాతం)లో మాత్రం వ్యత్యాసరం ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు పురుషాధిక్యం ఎక్కువగా ఉండే కొన్ని రంగాల్లో జీతాల మధ్య వ్యత్యాసం రివర్స్లో ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఆర్జిస్తున్న రంగాల్లో ఫార్మా (8 శాతం), కన్జూమర్ డ్యూరబుల్స్ (7 శాతం) ఉన్నాయి. లైంగిక వేధింపుల నివారణ నిబంధనలు (పీవోఎస్హెచ్) గురించి అవగాహన పెరుగుతోంది. పని ప్రదేశాల్లో సహోద్యోగుల తప్పుడు ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నారు. లైంగిక వేధింపు ఫిర్యాదులు 16 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. అయితే, ఫిర్యాదుల స్థాయిలో పరిష్కారాల వేగం ఉండటం లేదు. పెండింగ్ కేసులు 28 శాతం దీన్ని సూచిస్తంది. ఈ నేపథ్యంలో భద్రత, సమాన అవకాశాలు, వర్క్ప్లేస్ డిజైన్ విషయాల్లో వ్యవస్థాగతంగా ఉన్న అవరోధాలను అధిగమించే దిశగా ఇటీవలి లేబర్ కోడ్ ముందడుగులాంటిది. వీటిని మార్చుకోగలిగి, స్మార్ట్ విధానాలను అమలు చేస్తే, ప్రభుత్వం..కంపెనీలు చొరవ చూపితే మరింత మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. -
Stock Market Updates: నష్టాల్లో కదులుతున్న సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 90.35 పాయింట్లు తగ్గి 25,941.85 కు చేరింది. సెన్సెక్స్(Sensex) 241.18 పాయింట్లు నష్టపోయి 84,897.09 వద్ద ట్రేడవుతోంది.హెచ్యూఎల్, టైటాన్, టాటా మోటార్స్ పీవీ, ఎన్టీపీసీ, బీఈఎల్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకీ, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, ఐటీసీ నేతృత్వంలోని 30 సెన్సెక్స్ స్టాక్స్ ఈ రోజు నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ ఎం, అదానీ పోర్ట్స్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి.రంగాలవారీగా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా సూచీలు వరుసగా 0.7 శాతం, 0.3 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock market: మూడోరోజూ డీలా
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత, బ్లూ చిప్(అధిక వెయిటేజీ) షేర్లలో షేర్లలో విక్రయాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 504 పాయింట్లు నష్టపోయి 85,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు కోల్పోయి 26,032 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి.ఒక దశలో సెన్సెక్స్ 589 పాయింట్లు కోల్పోయి 85,053 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు పతనమై 25,998 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఫైనాన్సియల్, సర్విసెస్, బ్యాంకులు, ఇండ్రస్టియల్స్, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెలికం, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.49%, 0.14% నష్టపోయాయి. జపాన్ కీలక వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్లలో అమ్మకాలు, క్రిప్టో కరెన్సీ పతనంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి.వరుస అయిదు ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ.9,642 కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. మంగళవారం ఒక్కరోజే రూ.3,642 కోట్ల షేర్లను అమ్మేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు(–1.25%), రిలయన్స్ ఇండస్ట్రీస్(–1.25%), ఐసీఐసీఐ బ్యాంకు(–1.25%), ఎల్అండ్టీ(–1%), యాక్సిస్ బ్యాంకు (–1.29%)శాతం నష్టపోయి ఇండెక్సు పతనానికి ప్రధాన కారణమయ్యాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 503.62 పాయింట్లు లేదా 0.59 శాతం నష్టంతో.. 85,138.27 వద్ద, నిఫ్టీ 143.55 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 26,032.20 వద్ద నిలిచాయి.సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ, టిప్స్ ఫిల్మ్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, ఆల్పా లాబొరేటరీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీతి ఇంటర్నేషనల్, జేహెచ్ఎస్ స్వెండ్గార్డ్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, విజి ఫైనాన్స్ లిమిటెడ్, ష్రెనిక్, అనిక్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 27 పాయింట్లు తగ్గి 26,146కు చేరింది. సెన్సెక్స్(Sensex) 146 పాయింట్లు నష్టపోయి 85,488 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 02-12-2025(time: 9:33 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎల్ఐసీ స్టాక్స్ కొనుగోళ్లపై సలహాలివ్వం
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై తమ శాఖ ఎలాంటి సలహాలివ్వదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే ఈ విషయంలో మార్గనిర్దేశం సైతం చేయదని తెలియజేశారు. అదానీ గ్రూప్ కంపెనీలలో ప్రామాణిక నిర్వహణా సంబంధ నిబంధనల (ఎస్వోపీ)మేరకే ఎల్ఐసీ వాటాల కొనుగోళ్లు చేపట్టినట్లు ఒక ప్రశ్నకు గాను లోక్సభకి ఇచి్చన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. టాప్ ర్యాంక్ బీమా దిగ్గజం అనేక సంవత్సరాలుగా ఆయా కంపెనీల ఆర్థిక మూలాలు (ఫండమెంటల్స్) ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీలపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాక మాత్రమే స్టాక్స్ కొనుగోళ్లు చేపడుతుందని వివరించారు. వెరసి ఎస్వోపీల ప్రకారం తగిన పరిశీలనతోపాటు.. రిసు్కలపై అధ్యయనం చేశాక అదానీ గ్రూప్లోని ఆరు కంపెనీలలో ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్ కంపెనీల పుస్తక విలువ రూ. 38,659 కోట్లుకాగా.. సంబంధిత కంపెనీల రుణ పత్రాలలోనూ మరో రూ. 9,626 కోట్లవరకూ పెట్టుబడులు చేపట్టినట్లు తెలియజేశారు. ఎల్ఐసీ ఫండ్ చేపట్టే పెట్టుబడి నిర్ణయాలపై ఆర్థిక శాఖ ఎలాంటి సూచనలు లేదా సలహాలు ఇవ్వబోదని, స్టాక్ కొనుగోళ్లలో ఎలాంటి ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. చట్టాల ప్రకారమే ... ఎల్ఐసీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు 1938 బీమా చట్టం, ఐఆర్డీఏఐ నియంత్రణలు, ఆర్బీఐసహా.. సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులకు వీలుగా ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను రూపొందించినట్లు అక్టోబర్లో వాషింగ్టన్ పోస్ట్లోని ఒక నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో రుణభారంతోపాటు.. యూఎస్లో నిశిత పరిశీలనను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులకు ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను అమలు చేసినట్లు నివేదిక ఆరోపించింది. 2025 మే నెలలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో ఎల్ఐసీ 57 కోట్ల డాలర్లు (సుమారు రూ. 5,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్వోపీలు, బోర్డు అనుమతులతో 2025 మేలో ఎల్ఐసీ.. అదానీ పోర్ట్స్ జారీ చేసిన ఎన్సీడీలలో రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన టాప్–500 కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడులు చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం పెట్టుబడుల్లో ప్రధాన వాటా భారీ కంపెనీలలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 50 కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల పుస్తక విలువ 2025 సెపె్టంబర్ 30 కల్లా రూ. 4,30,777 కోట్లుగా పేర్కొన్నారు. -
స్టాక్ మార్కెట్లు ఫ్లాట్..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం రికార్డు గరిష్టాలను తాకిన స్టాక్ సూచీలు తర్వాత స్వల్ప నష్టాలతో ఫ్లాట్గా స్థిరపడ్డాయి. ఫారిన్ ఇన్ఫ్లోలు మందగించడం, కీలక వాణిజ్య చర్చలపై దీర్ఘకాల అనిశ్చితి మధ్య రూపాయి కొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తగ్గించింది.ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 64.77 పాయింట్లు లేదా 0.08 శాతం నష్టపోయి 85,641.9 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27.2 పాయింట్లు లేదా 0.1 శాతం నష్టపోయి 26,175.75 వద్ద ఉన్నాయి. ప్రారంభ డీల్స్లో సెన్సెక్స్ 86,159 వద్ద రికార్డు స్థాయిని తాకగా, నిఫ్టీ 26,325.8 వద్ద రికార్డు స్థాయిని తాకింది.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గా ముగియగా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం పెరిగింది. రంగాల సూచీలలో నిఫ్టీ రియల్టీ 1 శాతానికి పైగా పడిపోగా హెల్త్కేర్, ఫార్మా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు అనుసరించాయి. దీనికి విరుద్ధంగా, నిఫ్టీ ఆటో, మెటల్, ఐటీ సూచీలు గ్రీన్లో స్థిరపడ్డాయి.సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. టాటా మోటార్స్ పీవీ, మారుతి సుజుకి, భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. -
ఆల్టైమ్ గరిష్ఠాలను చేరిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 97 పాయింట్లు పెరిగి 26,299కు చేరి ఆల్టైమ్ గరిష్టాలను తాకింది. సెన్సెక్స్(Sensex) 335 పాయింట్లు పుంజుకొని 86,018 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 01-12-2025(time: 09.39am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
డిసెంబర్లో స్టాక్ మార్కెట్ హాలిడేస్
2025 దాదాపు ముగిసింది. రేపటి (సోమవారం) నుంచి చివరి నేలలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ నెలలో (డిసెంబర్) బ్యాంకులకు వివిధ ప్రాంతీయ, జాతీయ పండుగల కారణంగా దాదాపు 18 రోజులు సెలవులు ఉంటాయని తెలుసుకున్నాం. ఈ కథనంలో స్టాక్ మార్కెట్ హాలిడేస్ గురించి తెలుసుకుందాం.డిసెంబర్ నెలలో ఒక్క రోజు (క్రిస్మస్) మాత్రమే స్టాక్ మార్కెట్కు సెలవు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా శని, ఆది వారాలు సాధారణంగా స్టాక్ మార్కెట్ క్లోజ్. మొత్తం మీద శని, ఆదివారాలు.. క్రిస్మస్ కలిపి 9 రోజులు స్టాక్ మార్కెట్ సెలవులన్నమాట. ఇవి పోగా.. 22 రోజులు స్టాక్ మార్కెట్ సెషన్స్ జరిగుతాయి.నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లుశుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 13.71 పాయింట్లు లేదా 0.016 శాతం నష్టంతో 85,706.67 వద్ద, నిఫ్టీ 12.60 పాయింట్లు లేదా 0.048 శాతం నష్టంతో 26,202.95 వద్ద నిలిచాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 13.71 పాయింట్లు లేదా 0.016 శాతం నష్టంతో 85,706.67 వద్ద, నిఫ్టీ 12.60 పాయింట్లు లేదా 0.048 శాతం నష్టంతో 26,202.95 వద్ద నిలిచాయి.సుదీప్ ఫార్మా లిమిటెడ్, నెక్టార్ లైఫ్ సైన్సెస్, మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్, 63 మూన్స్ టెక్నాలజీస్, రికో ఆటో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మాగెల్లానిక్ క్లౌడ్, యాథార్త్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్, ఇండో యుఎస్ బయో-టెక్, క్రియేటివ్ ఐ, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ కు కొత్త జోష్.. నిఫ్టీ సరికొత్త రికార్డ్
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 37 పాయింట్లు లేదా 0.04 శాతం నష్టపోయి 85,683 వద్ద ఉండగా, నిఫ్టీ 25 పాయింట్లు లేదా 0.10 శాతం తగ్గి 26,190 వద్ద ఉంది.బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండు సూచీలు గురువారం ఇంట్రాడే ట్రేడింగ్ లో తాజా ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. మొదటిసారిగా సెన్సెక్స్ 86,000, నిఫ్టీ 26,300 స్థాయిలను అధిగమించాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం పడిపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిఫ్టీకి ‘నూతన’ ఊపు.. 14 నెలలకు ఆల్-టైమ్ హై
భారత స్టాక్మార్కెట్లో గురువారం (నవంబర్ 27) కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రధాన బెంచ్మార్క్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 నూతన చరిత్ర సృష్టించింది. 14 నెలల తర్వాత కొత్త ఆల్–టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.సెషన్ ప్రారంభంలోనే నిఫ్టీ 50 సూచీ 26,295 పాయింట్లపైకి ఎగబాకి, 2024 సెప్టెంబర్ 27న నమోదైన పూర్వపు రికార్డు 26,277.35 పాయింట్లను అధిగమించింది. నిఫ్టీకి ఈ కొత్త మైలురాయిని చేరుకోవడానికి మొత్తం 287 ట్రేడింగ్ సెషన్లు పట్టింది.రికార్డు హైకి దోహదం చేసిన అంశాలుస్టాక్ మార్కెట్లో కొనుగోలు ధోరణి పెరగడానికి అనేక కారకాలు దోహదం చేశాయి.దేశీయ, అంతర్జాతీయ వడ్డీ రేట్లు కోతపై మార్కెట్ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను గణనీయంగా పెంచాయి.కంపెనీల బలమైన క్యూ2 ఫలితాలు, అనేక రంగాల్లో ఆదాయ వృద్ధి ఊపందుకోవడం వల్ల సూచీకి శక్తి లభించింది.మ్యూచువల్ ఫండ్స్, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ ఇన్ఫ్లోలు కొనసాగాయి.మార్కెట్ వాల్యుయేషన్లు కొంత సడలించడంవల్ల కొనుగోలు ఆకర్షణ పెరిగింది.గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్, అంతర్జాతీయ ట్రేడ్ & మాక్రో డేటా మెరుగుదల కూడా ప్రభావం చూపాయి.నిఫ్టీ పరిణామ క్రమంనిఫ్టీ సూచీ తన ప్రారంభం (1995–96) నుంచి ఇప్పటి వరకు నిర్మాణాత్మకంగా పెరుగుతూ భారీ వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది.2007లో తొలిసారి 5,000 మార్క్ను దాటిన నిఫ్టీ 2017లో 10,000 మార్క్ను 2021లో 20,000 మైలురాయిని తాకింది. 2024లో 25,000 మార్క్ను అందుకున్న ఈ ఎన్ఎస్ఈ ఇండెక్స్ 2025లో 26,000 మైలురాయిని దాటింది.నిఫ్టీ సూచీకి 2024 సంవత్సరం అనేక రికార్డులు అందించింది. ఆ ఒక్క ఏడాదిలోనే నిఫ్టీ 59 కొత్త రికార్డు హైలు నమోదు చేసింది.ఏ స్టాక్స్ మెరిశాయంటే..తాజా ర్యాలీలో ముఖ్యంగా బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగంలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ మెరిశాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ఇంజనీరింగ్ సెక్టార్లో లార్సెన్ & టూబ్రో, కన్స్యూమర్ & మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఏషియన్ పెయింట్స్ వంటి స్టాక్స్ ఉత్తమ పనితీరు కనబర్చాయి. ఇతర బ్లూ–చిప్ కంపెనీలు కూడా సానుకూల త్రైమాసిక ఫలితాలు వెలువరించడంతో సూచీకి కొత్త ప్రాణం పోశాయి.నిపుణుల విశ్లేషణమార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిఫ్టీ ప్రస్తుత ర్యాలీ పూర్తిగా ఫండమెంటల్స్ ఆధారిత స్థిరమైన వృద్ధిగా కనిపిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం, ఎఫ్ఐఐ రాకల్లో మెరుగుదల, దేశీయ డిమాండ్ పెరుగుదల.. ఇవన్నీ మార్కెట్కు మద్దతునిస్తున్నాయి.ఇకపోతే, అంతర్జాతీయ స్థూల అనిశ్చితులు, డాలర్ బలం, క్రూడ్ ధరల్లో మార్పులు వంటి అంశాలు వచ్చే రోజుల్లో మార్కెట్లో అస్థిరతకు దారితీయవచ్చు అని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.బ్రోకరేజ్ సంస్థల అంచనాల ప్రకారం.. పాలసీ సడలింపులు, ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగితే నిఫ్టీ 2026 నాటికి 30,000 మార్క్ను తాకే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ ఆల్టైమ్ హిట్!
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ సరికొత్త రికార్డు గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఇండెక్స్ 26,295.55 వద్ద కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది. 2024 సెప్టెంబర్ 27 నాటి దాని మునుపటి రికార్డు గరిష్ట స్థాయి 26,277 హిట్ను అధిగమించింది. కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకునేందుకు నిఫ్టీ 50 ఇండెక్స్కు 287 సెషన్లు పట్టింది.ఉదయం 9:41 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 189 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 85,799 వద్ద ఉంది. నిఫ్టీ 52 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 26,251 వద్ద ట్రేడవుతున్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం పెరిగాయి.సెక్టార్లలో, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగి ఎన్ఎస్ఈలో ప్రధాన లాభం పొందింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 0.35 శాతం లాభపడి రెండో స్థానంలో నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.4 శాతం పెరిగి 59,802.65 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. -
లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలలోకి వచ్చాయి. భారత బెంచ్ మార్క్ సూచీలు క్రితం రోజు నష్టాల నుంచి పుంజుకొని లాభాల్లో కదులుతున్నాయి. ఉదయం 9.30 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 298 పాయింట్లు లేదా 0.35 శాతం లాభపడి 84,885 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 100 పాయింట్లు లేదా 0.39 శాతం పెరిగి 25,985 వద్ద ట్రేడవుతున్నాయి.టాటా మోటార్స్ పీవీ, ట్రెంట్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ ఎం ఈరోజు సెన్సెక్స్ లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. భారతీ ఎయిర్ టెల్, హెచ్యూఎల్, టీసీఎస్ మాత్రమే నష్టపోయాయి. డిసెంబర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై మదుపరులు ఆశావాద దృక్పథంతో ప్రపంచ మార్కెట్లు వరుసగా మూడవ రోజు లాభాలను కలిగి ఉన్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.79 శాతం పెరిగాయి.రంగాలవారీగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.7 శాతం లాభంతో ర్యాలీలో ముందంజలో ఉంది. నిఫ్టీ పీఎస్యూూ బ్యాంక్ ఇండెక్స్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 0.8 శాతం వరకు లాభపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ లూజర్..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నవంబర్ సిరీస్కు సంబంధించి నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల నెలవారీ గడువు ముగింపు ఒత్తిడితో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 క్షీణించాయి.సెషన్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 313.7 పాయింట్లు లేదా 0.37 శాతం నష్టపోయి 84,587.01 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 74.7 పాయింట్లు లేదా 0.29 శాతం తగ్గి 25,884.8 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లో ట్రెంట్, టాటా మోటార్స్ పీవీ, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్గా మిగిలిపోగా బీఈఎల్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఎటర్నల్ టాప్ గెయినర్స్ లో చోటు దక్కించుకున్నాయి.రంగాలవారీగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకులు వరుసగా 1.62 శాతం, 1.44 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ 0.57 శాతం, నిఫ్టీ మీడియా 0.8 శాతం క్షీణించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.36 శాతం, 0.19 శాతం లాభపడ్డాయి. -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 13.64 పాయింట్ల లాభంతో 84,914.35 వద్ద, నిఫ్టీ 7.00 పాయింట్ల లాభంతో.. 25,966.50 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ క్రౌన్ లిఫ్టర్స్, జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, పావ్నా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు చేరగా.. బీఐఎల్ వ్యాపార్ లిమిటెడ్, RKEC ప్రాజెక్ట్స్, విన్నీ ఓవర్సీస్ లిమిటెడ్, అగ్రి-టెక్ (ఇండియా), క్యాపిటల్ ట్రస్ట్ వంటి కంపెనీలు నష్టాల బాట పట్టాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 445.06 పాయింట్లు లేదా 0.52 శాతం నష్టంతో 84,786.86 వద్ద, నిఫ్టీ 108.65 పాయింట్లు లేదా 0.42 శాతం నష్టంతో.. 25,959.50 వద్ద నిలిచాయి.RKEC ప్రాజెక్ట్స్, జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, విఎల్ఎస్ ఫైనాన్స్, NRB ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మంగళం డ్రగ్స్ & ఆర్గానిక్స్, మాగెల్లానిక్ క్లౌడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, సుమిత్ వుడ్స్, యూరో ప్యానెల్ ప్రొడక్ట్స్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో కొనుగోళ్ల మధ్య బెంచ్ మార్క్ సూచీలు 0.1 శాతం పైగా పెరిగాయి. ఉదయం 9.26 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 127 పాయింట్ల లాభంతో 85,359 వద్ద ట్రేడ్ కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 26,107 వద్ద ట్రేడవుతోంది.అయితే, విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం క్షీణించింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతి సుజుకీ, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఎటర్నల్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, బీఈఎల్, టాటా మోటార్స్ పీవీ, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్ నష్టాలలో పయనిస్తున్నాయి.నేటి కీలక ఐపీవో అప్ డేట్స్ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్కేటాయింపు తేదీ: నవంబర్ 24జాబితా తేదీ: నవంబర్ 26, 2025ఇష్యూ పరిమాణం: రూ.500 కోట్లు (రూ. 180 కోట్ల తాజా ఇష్యూ + 2.66 కోట్ల షేర్ల OFS)ప్రైస్ బ్యాండ్: ఒక్కో షేరుకు రూ.114– 120లాట్ పరిమాణం: 125 షేర్లు (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది..
గడిచిన వారమంతా బుల్ పరుగులే. నిఫ్టీ ఏకంగా 1.64 శాతం పెరగగా సెన్సెక్స్ 1.39 శాతం పెరిగింది. మరి ఈ వారం ఏమవుతుంది? ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? వాస్తవానికి మార్కెట్లు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిలకు దగ్గర్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది.అమెరికాతో వాణిజ్య చర్చలు కొన్నాళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ వారంలో ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. డీల్ మాత్రం కుదరటం లేదు. కుదిరినా అది మన వ్యవసాయ రక్షణలకు ప్రతికూలంగా నిలుస్తుందా? అలాంటి ఆందోళనలేవీ అవసరం లేని స్థాయిలో ఉంటుందా? అనేది తెలియదు. దీనికితోడు నవంబరు నెల ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ కూడా ఉంది. ఎక్స్పైరీ రోజుల్లో... అంటే మంగళవారం, గురువారం మార్కెట్లు తీవ్రమైన హెచ్చుతగ్గులు చూసే అవకాశముంది. ప్రతికూల, అనుకూల అంశాలివీ...దేశీయంగా...ఈ ఏడాది (2025–26) రెండో త్రైమాసిక(జూలై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు 28న వెలువడతాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో దేశ ఆరి్థక వ్యవస్థ 7.8 శాతం పురోగతి సాధించింది. ఇది గత ఐదు త్రైమాసికాలలోనే అత్యధికం. ఈ సారి గణాంకాలు ఎలా ఉంటాయో చూడాలి.అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు కూడా 28నే వెల్లడవుతాయి. సెపె్టంబర్లో ఐఐపీ 4% ఎగసింది. ఈసారీ ఆ స్థాయిలో ఉండొచ్చనే అంచనాలున్నాయి.విదేశీ అంశాలుకొద్ది రోజులుగా ఎఫ్ఐఐలు (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) దేశీ స్టాక్స్లో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కాకపోతే దేశీ ఫండ్లు కొనుగోళ్లు చేస్తుండటంతో మార్కెట్లు పెద్దగా పడటం లేదు. యూఎస్ మార్కెట్ల తీరు, అమెరికా, చైనా డేటాను గమనించాల్సి ఉంటుంది.గత వారం రూపాయి విలువ డాలరుతో పోలిస్తే సరికొత్త ఆల్టైమ్ కనిష్టానికి (89.66) పతనమైంది. ఇది ప్రతికూలమే. ఈ వారం పతనం కొనసాగుతుందా? లేదా? చూడాలి...గమనించాల్సిన ప్రధాన షేర్లు...హెచ్డీఎఫ్సీడిపాజిట్లలో వృద్ధి వివరాలు వెల్లడవుతాయి. మార్జిన్లపై కంపెనీ వెల్లడించే వివరాలు అనుకూల ప్రభావాన్ని చూపించొచ్చు. లిక్విడిటీ బలహీనంగా ఉండటం... కాస్ట్ ఆఫ్ ఫండ్స్ వంటివి ప్రతికూలాంశాలు.జేఎస్డబ్ల్యూ స్టీల్...ఎగుమతులకు డిమాండ్ బాగుండి, స్టీల్ ధరలు పెరిగితే అది ఈ షేరుకు సానుకూలం.స్టీల్ ధరలు పతనమై.. చైనా నుంచి డిమాండ్ బలహీనపడితే అది షేరుకు ప్రతికూలంటీసీఎస్రూపాయి ధర స్థిరంగా ఉండి, అమెరికా టెక్నాలజీ కంపెనీల ఫలితాలు బాగుంటే అది షేరుకు సానుకూలం.అంతర్జాతీయ టెక్ కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకుంటున్నట్లు ప్రకటిస్తే అది ప్రతికూలం.హెచ్ఏఎల్రక్షణ శాఖ నుంచి, ఎగుమతుల కోసం ఆర్డర్లు వచ్చే చాన్సుంది. విదేశీ భాగస్వామ్యాలపై కొత్త సమాచారం వెలువడితే అది సానుకూలం.ప్రాజెక్టులను పూర్తి చేయటంలో, పేమెంట్లలో జాప్యం వార్తలు ప్రతికూలమనే చెప్పాలి. సాంకేతికంగా.. ఈ వారం ఎన్ఎస్ఈ నిఫ్టీకి 26,200 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఈ స్థాయి దాటితే 26,350 వద్ద తదుపరి అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. నిఫ్టీ బలహీనపడితే 25,900 పాయింట్ల వద్ద తొలి సపోర్ట్ లభించవచ్చు. తదుపరి 25,850 పాయింట్ల వద్ద కొనుగోళ్ల మద్దతుకు వీలుంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 400.76 పాయింట్లు లేదా 0.47 శాతం నష్టంతో 85,231.92 వద్ద, నిఫ్టీ 129.95 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 26,062.20 వద్ద నిలిచాయి.అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, మాగెల్లానిక్ క్లౌడ్, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, మాలు పేపర్ మిల్స్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. స్పెక్ట్రమ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా), జైప్రకాష్ పవర్ వెంచర్స్, కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం
భారతదేశంలో కోట్లాది మంది కుటుంబాలకు జీవిత బీమా (Life Insurance) అంటే గుర్తుకొచ్చే పేరు ఎల్ఐసీ (LIC). పాలసీదారులకు రక్షణ కల్పించడం, వారి జీవితాలకు భద్రతనివ్వడం ఎల్ఐసీ ప్రధాన విధి అయినప్పటికీ కేవలం పాలసీ ప్రీమియంల ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థల్లో ఒకటిగా నిలవలేదు. ఎల్ఐసీ భారీగా సంపదను పోగుచేయడానికి, ప్రభుత్వానికి సైతం ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి ఉపయోగించే అసలైన వ్యాపార రహస్యం ఏమిటో చూద్దాం.ఎల్ఐసీకి వచ్చే ఆదాయం ప్రధానంగా రెండు విధాలుగా ఉంటుంది.పాలసీ ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం.. ఇది బీమా పాలసీలను విక్రయించడం ద్వారా సంస్థకు లభించే ప్రాథమిక ఆదాయ వనరు.పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం.. ఇదే ఎల్ఐసీకి అత్యధిక లాభాన్ని, ఆర్థిక శక్తిని అందించే కీలకమైన వ్యాపారం. పాలసీదారుల నుంచి సేకరించిన నిధులను (పాలసీ మెచ్యూరిటీ చెల్లింపుల కోసం ఉంచాల్సినవి) సంస్థ వివిధ లాభదాయక మార్గాల్లో పెట్టుబడి పెడుతుంది.స్టాక్ మార్కెట్ఎల్ఐసీ భారతీయ స్టాక్ మార్కెట్లో కీలకంగా వ్యవహరిస్తోంది. ఎల్ఐసీ వద్ద ఉన్న భారీ నిధుల్లో చాలా వరకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల షేర్లలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడుతుంది. ప్రైవేట్ సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు అవసరమైన మూలధనాన్ని అందిస్తూ ఆయా కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేస్తుంది. కంపెనీలు లాభాలు ఆర్జించినప్పుడు ఎల్ఐసీకి డివిడెండ్ల రూపంలో ఆదాయం వస్తుంది. కంపెనీల షేర్ ధరలు పెరిగినప్పుడు ఎల్ఐసీకి ఆయా షేర్లను విక్రయించడం ద్వారా భారీగా పెట్టుబడి లాభాలు లభిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ ఈ మార్గం అత్యంత లాభదాయకంగా మారుతుంది.ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లుఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నిబంధనల ప్రకారం, ఎల్ఐసీ తన నిధుల్లో ఎక్కువ భాగాన్ని సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ క్రమంలో ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్లు అతిపెద్ద మార్గంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ద్రవ్య అవసరాల కోసం జారీ చేసే బాండ్లు, ట్రెజరీ బిల్లులను ఎల్ఐసీ కొనుగోలు చేస్తుంది. ఈ పెట్టుబడులు దాదాపు రిస్క్ రహితమైనవి. వీటిపై నిర్ణీత కాల వ్యవధిలో స్థిరమైన, కచ్చితమైన వడ్డీ ఆదాయం ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక స్థిరమైన నిధిని అందిస్తుంది.మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యంఎల్ఐసీ భారీ మొత్తంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కూడా పెట్టుబడి పెడుతుంది. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులు, సామాజిక రంగ పథకాలకు ఎల్ఐసీ రుణాలను అందిస్తుంది. కొన్నిసార్లు వాటి బాండ్లలో పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే రుణ వడ్డీ ఎల్ఐసీకి స్థిరమైన, సుదీర్ఘ కాల ఆదాయ వనరుగా పనిచేస్తుంది.రియల్ ఎస్టేట్ఎల్ఐసీకి దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులు, కార్యాలయ భవనాలు, నివాస సముదాయాలు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా లేదా కాలక్రమేణా ఆస్తుల విలువ పెరిగినప్పుడు వాటిని విక్రయించడం ద్వారా సంస్థ ఆదాయాన్ని ఆర్జిస్తుంది.అద్దె ఆదాయం, ఆస్తి విలువ పెరుగుదల ద్వారా ఎల్ఐసీ తన బ్యాలెన్స్ షీట్ను బలోపేతం చేసుకుంటుంది.ఫండ్ మేనేజ్మెంట్ఎల్ఐసీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫండ్ మేనేజర్ల్లో ఒకటిగా ఉంది. కోట్లాది మంది పాలసీదారుల నుంచి సేకరించబడిన వేల కోట్ల రూపాయల నిధులను సురక్షితంగా, లాభదాయకంగా నిర్వహించడం ఎల్ఐసీ ప్రధాన వ్యాపారం. దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథాన్ని కలిగి ఉండటం వల్ల మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని కాలక్రమేణా అధిక రాబడిని పొందే సామర్థ్యం ఎల్ఐసీ సొంతం.ఇదీ చదవండి: బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు.. -
లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలు
ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే.. తప్పకుండా పొదుపు చేయాలి. ఈ పొదుపును సరైన మార్గంలో పెట్టుబడిగా పెడితే.. ఊహకందని లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్, రియల్ ఎస్టేట్ వంటి చాలామార్గాలు ఉన్నాయి.ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చేది అనే విషయాన్ని వెల్త్ మోజో.. తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి, ఈరోజు దాని విలువ సుమారుగా..నిఫ్టీ 50: రూ. 1.8 లక్షలునిఫ్టీ నెక్స్ట్ 50: రూ. 2.2 లక్షలుమిడ్క్యాప్ ఇండెక్స్: రూ. 2.7 లక్షలుస్మాల్ క్యాప్ ఇండెక్స్: రూ. 3.1 లక్షలుబంగారం: రూ. 1.9 లక్షలువెండి: రూ. 2.0 లక్షలుఫిక్స్డ్ డిపాజిట్: రూ. 1.35 లక్షలురియల్ ఎస్టేట్: రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.25 లక్షలుబిట్కాయిన్: రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలుదీన్నిబట్టి చూస్తే ఐదు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి.. ఇప్పుడు సుమారు రూ. 2 లక్షలు వస్తుందన్నమాట. అంటే లక్ష రూపాయలకు, మరో లక్ష లాభం. కాగా బంగారం వెండి ధరలు కూడా ఐదేళ్లలో ఊహకందని రీతిలో పెరిగాయి.ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..If you had invested ₹1,00,000 five years ago, here’s what it would roughly be worth today:📊 Nifty 50: ~₹1.8L🚀 Nifty Next 50: ~₹2.2L📈 Midcap Index: ~₹2.7L🔥 Smallcap Index: ~₹3.1L🪙 Gold: ~₹1.9L🥈 Silver: ~₹2.0L🏦 Fixed Deposit: ~₹1.35L🏢 REITs/InvITs:…— Wealthmojo™ (@wealthmojo1) November 18, 2025 -
Stock Market: 26వేల మార్కుపైన ముగిసిన నిఫ్టీ
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 446.21 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో.. 85,632.68 వద్ద, నిఫ్టీ 139.50 పాయింట్లు లేదా 0.54 శాతం లాభంతో 26,192.15 వద్ద నిలిచాయి.సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, లగ్నమ్ స్పింటెక్స్, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, ప్రీమియర్ పాలీఫిల్మ్, వాస్వానీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. మాగెల్లానిక్ క్లౌడ్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ, మంగళం డ్రగ్స్ & ఆర్గానిక్స్, ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ వంటివి నష్టాలను చవిచూసాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో టెక్ షేర్లు పుంజుకున్న నేపథ్యంలో భారత స్టాక్ సూచీలు ఎగువన పయనిస్తున్నాయి. ఉదయం 9.26 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 134.43 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 85,320.90 వద్ద, ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ 38.65 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 26,091.30 వద్ద ట్రేడవుతున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మేజర్ ఎన్విడియా బలమైన త్రైమాసిక ఫలితాలను నివేదించింది. వాల్ స్ట్రీట్ ఆదాయాలు, ఆదాయ అంచనాలను అధిగమించింది. పర్యవసానంగా, ఆసియాలోని కీలక సూచీలు 4 శాతం వరకు పెరిగాయి. యూఎస్ బెంచ్ మార్క్ లు 0.1 శాతం నుండి 0.6 శాతం వరకు పెరిగాయి.దేశీయ మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, ఆటో సూచీలు 0.3 శాతం పెరిగాయి. -
ఫ్లాట్గా కదులుతున్న స్టాక్ సూచీలు
ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ పోకడల మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.23 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 81 పాయింట్లు లేదా 0.10 శాతం తగ్గి 84,592 వద్ద ఉండగా, నిఫ్టీ 50 34 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టపోయి 25,877 వద్ద ట్రేడవుతోంది.టాటా మోటార్స్ పీవీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ సెన్సెక్స్లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. హెచ్ యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్, టెక్ ఎం, ట్రెంట్ వంటివి టాప్ గెయినర్స్గా ఉన్నాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం క్షీణించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.62 శాతం లాభపడింది. దీనికి విరుద్ధంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయింది. -
ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 278 పాయింట్లు కోల్పోయి 84,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 25,910 వద్ద నిలిచింది. దీంతో స్టాక్ సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లైంది. సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడవుతూ... ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 393 పాయింట్లు పతనమై 84,558 వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 25,876 వద్ద కనిష్టాలు తాకాయి.డిసెంబర్లో యూఎస్ ఫెడరల్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు రేకెత్తడంతో పాటు టెక్నాలజీ రంగంలో అధిక వాల్యుయేషన్ల ఆందోళలనతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియాలో జపాన్ 3.33%, కొరియా 3.43%, తైవాన్ 2.58%, హాంగ్కాంగ్ 2%, సింగపూర్, చైనా 1% క్షీణించాయి. యూరప్లో ఫ్రాన్స్ 1.7%, జర్మనీ 1.6%, బ్రిటన్ 1.3% నష్టపోయాయి.⇒ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్)లో తాజాగా పీఈ సంస్థ సయిఫ్ పార్ట్నర్స్ 1.86 శాతం వాటా విక్రయించింది. దీంతో పేటీఎమ్లో సయిఫ్ వాటా 15.33 శాతం నుంచి 13.47 శాతానికి తగ్గింది. షేరుకి రూ. 1,305 సగటు ధరలో రూ. 1,556 కోట్లకు అమ్మివేసింది. పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో 3% పతనమై రూ. 1,293 వద్ద ముగిసింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 324.96 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 84,625.99 వద్ద, నిఫ్టీ 121.40 పాయింట్లు లేదా 0.47 శాతం నష్టంతో 25,910.05 వద్ద నిలిచాయి.ఫిజిక్స్ వాలా లిమిటెడ్, సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ, బ్యాంగ్ ఓవర్సీస్, పన్సారి డెవలపర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్, పావ్నా ఇండస్ట్రీస్, సాండ్స్ పవర్ స్విచ్, పయనీర్ ఎంబ్రాయిడరీస్, రీటాన్ టీఎంటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు తగ్గి 25,952కు చేరింది. సెన్సెక్స్(Sensex) 185 పాయింట్లు నష్టపోయి 84,764 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 18-11-2025(time: 9:25am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 388.17 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 84,950.95 వద్ద, నిఫ్టీ 103.40 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 26,013.45 వద్ద నిలిచాయి.వీఎల్ఎస్ ఫైనాన్స్, బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్, బన్నారి అమ్మన్ స్పిన్నింగ్ మిల్స్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ, మాక్పవర్ CNC మెషీన్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. వాస్వానీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గాబ్రియేల్ ఇండియా, సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్, డెక్కన్ సిమెంట్స్, ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత వారాంతపు నష్టాల నుండి కోలుకుని లాభాల్లోకి వచ్చాయి.బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 196 పాయింట్లు లేదా 0.23 శాతం పెరిగి 84,759 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు లేదా 0.21 శాతం పెరిగి 25,963 వద్ద ఉంది.కోటక్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, టైటాన్ కంపెనీ, ఎం అండ్ ఎం, ఎస్ బీఐ, టెక్ ఎం, ఐటీసీ ప్రారంభ డీల్స్ లో 1 శాతం వరకు లాభపడ్డాయి. టాటా మోటార్స్ పివి 6 శాతం నష్టపోయాయి. తరువాత ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, టిసిఎస్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.45 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.48 శాతం పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.5 శాతం పెరిగి 58,830 వద్ద తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.2 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ సూచీలు 0.5 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.4 శాతం పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 152.29 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో.. 84,630.96 వద్ద, నిఫ్టీ 36.00 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 25,915.15 వద్ద నిలిచాయి.ILandFS ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, ఆర్వి ఎన్కాన్, ఐపీసీఏ లాబొరేటరీస్, పైన్ ల్యాబ్స్ లిమిటెడ్, కెఆర్బిఎల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టోలిన్స్ టైర్స్, ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, వెల్త్ ఫస్ట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్, ఆల్కార్గో టెర్మినల్స్, మాస్టర్ ట్రస్ట్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 68 పాయింట్లు తగ్గి 25,812కు చేరింది. సెన్సెక్స్(Sensex) 247 పాయింట్లు నష్టపోయి 84,228 వద్ద ట్రేడవుతోంది. బిహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.18బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.12 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.66 శాతం తగ్గిపోయింది.నాస్డాక్ 2.29 శాతం నష్టపోయింది.Today Nifty position 14-11-2025(time- 9:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.01 శాతం లేదా 12.16 పాయింట్లు పెరిగి 84,478.67 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ సూచీ కూడా 0.01 శాతం లేదా 3.35 పాయింట్లు పెరిగి 25,879.15 వద్ద ముగిసింది.బీఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్లుగా ఉండగా, ఎటర్నల్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (టీఎంసీవీ), ఎంఅండ్ఎం ప్రధానంగా వెనుకబడినవాటిలో ఉన్నాయి. అదేవిధంగా, ఎన్ఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, ఇండిగో టాప్ గెయినర్లుగా ఉండగా, ఎటర్నల్, టీఎంసీవీ, ఎంఅండ్ఎం టాప్ లూజర్లలో ఉన్నాయి.ఇక విస్తృత సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.35 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.37 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా నిఫ్టీ మెటల్, ఫార్మా, రియల్టీ వరుసగా 0.44 శాతం, 0.41 శాతం, 0.42 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.68 శాతం నష్టపోయింది. -
లాభాల స్వీకరణ.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు తగ్గి 25,811కు చేరింది. సెన్సెక్స్(Sensex) 198 పాయింట్లు నష్టపోయి 84,265 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.52బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 62.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.08 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.06 శాతం పెరిగింది.నాస్డాక్ 0.26 శాతం నష్టపోయింది.Today Nifty position 13-11-2025(Time: 9:23am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో స్టాక్స్ లో బలమైన లాభాల కారణంగా భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 595.19 పాయింట్లు లేదా 0.71 శాతం పెరిగి 84,466.51 వద్ద, నిఫ్టీ 50 సూచీ 180.85 పాయింట్లు లేదా 0.7 శాతం పెరిగి 25,875.80 వద్ద ముగిసింది.బీఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్గా ఉండగా, టాటా స్టీల్, టాటా మోటార్స్ పీవీ, బీఈఎల్ ప్రధాన వెనుకబడివాటిలో ఉన్నాయి. ఇక ఎన్ఎస్ఈ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంట్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ కాగా టాటా మోటార్స్ పీవీ, టాటా మోటార్స్ సీవీ, టాటా స్టీల్ టాప్ లూజర్స్గా నిలిచాయి.బెంచ్మార్క్తోపాటు విస్తృత సూచీలు కూడా లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.79 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.82 శాతం లాభపడింది. రంగాలవారీగా 2.04 శాతం లాభంతో నిఫ్టీ ఐటీ టాప్ గెయినర్గా ఉంది. ఇక నిఫ్టీ ఆటో 1.24 శాతం, ఫార్మా 1 శాతం లాభపడ్డాయి. -
400 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 133 పాయింట్లు పెరిగి 25,826కు చేరింది. సెన్సెక్స్(Sensex) 441 పాయింట్లు పుంజుకొని 84,328 వద్ద ట్రేడవుతోంది.కొన్ని రోజులుగా నిఫ్టీ సూచీ 25,500(50 పాయింట్లు బఫర్) నుంచి 26,000 మార్కు మధ్యే కదలాడుతుంది. పైన తెలిపిన కనిష్ట మార్కు వద్దకు సూచీ రాగానే కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ 26,000 మార్కు పైకి వచ్చి ఒకటి లేదా రెండు రోజులు నిలకడగా ఉంటే టెక్నికల్ సమాచారం ప్రకారం మార్కెట్ సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: ట్రేడింగ్ ఆరంభ నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం లాభపడ్డాయి. అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 336 పాయింట్లు పెరిగి 83,871 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్లు బలపడి 25,695 వద్ద నిలిచింది. ఢిల్లీలో పేలుడు ఘటన ఆందోళనలతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి.వీక్లీ ఎక్స్పైరీ రోజు కావడంతో మరింత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 411 పాయింట్లు కోల్పోయి 83,124 వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు పతనమై 25,449 వద్ద కనిష్టాన్ని తాకాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు, దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో కనిష్ట స్థాయిల వద్ద కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకోవడమే కాకుండా.. అరశాతం లాభంతో ట్రేడింగ్ను ముగించాయి. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ ముగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలపడంతో ఆసియాలో కొరియా, హాంగ్కాంగ్, జపాన్ సూచీ లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1% పెరిగాయి. లాభాల స్వీకరణతో అమెరికా స్టాక్ సూచీలు అరశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలపడి 88.50 వద్ద స్థిరపడింది. అమెరికా–భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు, యూఎస్ ప్రభుత్వం షట్డౌన్ ముగింపు అంశాలు దేశీయ కరెన్సీ ర్యాలీకి దన్నుగా నిలిచాయి.⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో సర్విసెస్ 1.6%, టెలికం 1.59%, ఐటీ 1.21% రాణించాయి. -
నష్టాలకు బ్రేక్: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 335.97 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో.. 83,871.32 వద్ద, నిఫ్టీ 120.60 పాయింట్లు లేదా 0.47 శాతం లాభంతో 25,694.95 వద్ద నిలిచాయి.గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, యాత్ర ఆన్లైన్, వీనస్ రెమెడీస్, జువారీ ఇండస్ట్రీస్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎం & బీ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, హెచ్ఎల్ఈ గ్లాస్కోట్, తమిళనాడు పెట్రోప్రొడక్ట్స్, లార్డ్స్ క్లోరో ఆల్కలీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:25 సమయానికి నిఫ్టీ(Nifty) 36 పాయింట్లు తగ్గి 25,539కు చేరింది. సెన్సెక్స్(Sensex) 134 పాయింట్లు దిగజారి 83,389 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 290.38 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 83,506.66 వద్ద, నిఫ్టీ 83.00 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 25,575.30 వద్ద నిలిచాయి.గల్లంట్ ఇస్పాట్, బ్లిస్ జీవీఎస్ ఫార్మా, లుమాక్స్ ఆటో టెక్నాలజీస్, ఇండిగో పెయింట్స్, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరగా.. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా, కామత్ హోటల్స్ ఇండియా, పెన్నార్ ఇండస్ట్రీస్, అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రూవరీస్, ఎస్హెచ్ కేల్కర్ & కంపెనీ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు పెరిగి 25,564కు చేరింది. సెన్సెక్స్(Sensex) 221 పాయింట్లు లాభపడి 83,421 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 94.73 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో 83,216.28 వద్ద, నిఫ్టీ 17.40 పాయింట్లు లేదా 0.068 శాతం నష్టంతో 25,492.30 వద్ద నిలిచాయి.హెచ్బీ స్టాక్హోల్డింగ్స్ లిమిటెడ్, ఎం అండ్ బీ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఇంటర్ఆర్చ్ బిల్డింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, రోసెల్ టెక్సిస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. బ్లిస్ జివిఎస్ ఫార్మా, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ (ఇండియా), సాత్విక్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, వెంకీస్ షేర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 132 పాయింట్లు తగ్గి 25,377కు చేరింది. సెన్సెక్స్(Sensex) 457 పాయింట్లు దిగజారి 82,861 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.79బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.59 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.09 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.12 శాతం తగ్గింది.నాస్డాక్ 1.9 శాతం నష్టపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 90.33 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 83,368.82 వద్ద, నిఫ్టీ 78.30 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో.. 25,519.35 వద్ద నిలిచాయి.ఎక్స్క్సారో టైల్స్, రెడింగ్టన్, ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్, స్మార్ట్లింక్ హోల్డింగ్స్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫైనోటెక్స్ కెమికల్, అప్డేటర్ సర్వీసెస్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్, జ్యోతి స్ట్రక్చర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 25 పాయింట్లు పెరిగి 25,624కు చేరింది. సెన్సెక్స్(Sensex) 206 పాయింట్లు లాభపడి 83,676 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సెన్సెక్స్ 519 పాయింట్లు మైనస్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ మార్కెట్ రెండు వారాల కనిష్టానికి దిగివచ్చింది. ఐటీ, మెటల్, వినిమయ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా సెన్సెక్స్ 519 పాయింట్లు నష్టపోయి 83,459 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 25,598 వద్ద నిలిచింది. సూచీలు ఉదయం లాభాలతో మొదలైనప్పటికీ.., అదే జోరును రోజంతా కొనసాగించలేకపోయాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 566 పాయింట్లు కోల్పోయి 83,413 వద్ద, నిఫ్టీ 185 పాయింట్లు పతనమై 25,578 వద్ద కనిష్టాన్ని తాకాయి. ఆసియాలో దక్షిణ కొరియా, జపాన్, హాంగ్కాంగ్ స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు 1% పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు అరశాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల ఇండెక్సుల్లో యుటిలిటీస్ 1.56%, మెటల్ 1.40%, కమోడిటీస్ 1.11%, ఐటీ 1.06%, విద్యుత్ 0.99%, రియల్టీ 0.83% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.69%, 0.26 శాతం నష్టపోయాయి. ⇒ టైటాన్ షేరు 2% లాభపడి రూ.3,813 వద్ద స్థిరపడింది. క్యూ2లో కంపెనీ లాభం 59% వృద్ధితో షేరుకు కొనుగోలు మద్దతు లభించింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ⇒ క్యూ2లో నికరలాభం రెట్టింపుతో ఎయిర్టెల్ షేరు 2% పెరిగి రూ.2,113 వద్ద స్థిరపడింది.నేడు మార్కెట్లకు సెలవుగురునానక్ జయంతి సందర్భంగా నేడు దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. కమోడిటీ మార్కెట్లు సాయంత్రం నుంచి పనిచేస్తాయి. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమాయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 519.34 పాయింట్లు లేదా 0.62 శాతం నష్టంతో 83,459.15 వద్ద, నిఫ్టీ 165.70 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో.. 25,597.65 వద్ద నిలిచాయి.కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్, 3ఎం ఇండియా, తంగమైల్ జ్యువెలరీ, ఎక్సారో టైల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్కేర్, ఫైనోటెక్స్ కెమికల్, ఎస్పీఎల్ ఇండస్ట్రీస్, టీఎస్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు తగ్గి 25,746కు చేరింది. సెన్సెక్స్(Sensex) 25 పాయింట్లు నష్టపోయి 83,949 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 39.78 పాయింట్లు లేదా 0.047 శాతం లాభంతో.. 83,978.49 వద్ద, నిఫ్టీ 41.25 పాయింట్లు లేదా 0.16 శాతం లాభంతో 25,763.35 వద్ద నిలిచింది.డాల్ఫిన్ ఆఫ్షోర్ ఎంటర్ప్రైజెస్, తంగమైల్ జ్యువెలరీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా, లాంకోర్ హోల్డింగ్స్, బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పంజాబ్ కెమికల్స్ & క్రాప్ ప్రొటెక్షన్, ది గ్రోబ్ టీ కంపెనీ లిమిటెడ్, ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, స్టవ్ క్రాఫ్ట్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు తగ్గి 25,664కు చేరింది. సెన్సెక్స్(Sensex) 276 పాయింట్లు నష్టపోయి 83,645 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 465.75 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో.. 83,938.71 వద్ద, నిఫ్టీ 155.75 పాయింట్లు లేదా 0.60 శాతం నష్టంతో 25,722.10 వద్ద నిలిచాయి.ఫైనోటెక్స్ కెమికల్, లాంకోర్ హోల్డింగ్స్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, ముఫిన్ గ్రీన్ ఫైనాన్స్, ది గ్రోబ్ టీ కంపెనీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, నెల్కాస్ట్, మాన్ అల్యూమినియం లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ కంపెనీల క్యూ2 ఫలితాలపై మదుపరుల అంచనాల మధ్య భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు అస్థిరంగా ఉన్నాయి. ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు వెంటనే పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 146 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 84,550 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా, నిఫ్టీ 50 సూచీ 33 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 25,911 వద్ద కదులుతోంది.మారుతి సుజుకి, టీసీఎస్, బీఈఎల్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ పీవీ, ఎల్ అండ్ టీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం మార్కెట్ రికవరీలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు కూడా లాభాల వైపు పయనిస్తున్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.61 శాతం, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.06 శాతం క్షీణించాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.8 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.5 శాతం, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఏస్ ఇన్వెస్టర్ డాలీ ఖన్నా పోర్ట్ఫోలియో చూశారా?
స్టాక్ మార్కెట్లో టాప్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కదలికలను మదుపరులు, మార్కెట్ ఔత్సాహికులు నిశితంగా గమనిస్తుంటారు. వారి ఇన్వెస్ట్ శైలి, పోర్ట్ఫోలియో గురించి ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏస్ ఇన్వెస్టర్ డాలీ ఖన్నా ఆసక్తికరమైన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో గురించి తెలుసుకుందామా..డాలీ ఖన్నా షేర్ హోల్డింగ్ డేటా ఆధారంగా 2025 సెప్టెంబర్ త్రైమాసికం నుండి 2025 అక్టోబర్ 30 నాటికి సుమారు రూ. 484 కోట్ల విలువైన 11 స్టాక్స్ను ఆమె బహిరంగంగా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు పరంగా, ఈ స్టాక్స్ లో సగం ఘనమైన రాబడిని అందించాయి. 2025లో 101% వరకు ర్యాలీ చేశాయి. అదే సమయంలో మిగిలినవి తక్కువ పనితీరు కనబరిచాయి. 10% నుంచి 40% క్షీణించాయి.టాప్ గెయినర్లు ఇవే..మంగళూరు కెమికల్స్ & ఫెర్టిలైజర్స్: ఈ షేరు 101 శాతం పెరిగి రూ.154 నుంచి రూ.309కి పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 3.99%. దీని విలువ సుమారు రూ .146 కోట్లు.కాఫీ డే ఎంటర్ప్రైజెస్: ఈ స్టాక్ 86% పెరిగి రూ .23 నుండి రూ .42 కు పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.19% వాటా ఉంది. దీని విలువ సుమారు రూ .20 కోట్లు.సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్: ఈ షేరు 26 శాతం లాభపడి రూ.73 నుంచి రూ.92కు చేరుకుంది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.98%. దీని విలువ సుమారు రూ .51 కోట్లు.సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్: ఈ స్టాక్ 18% పెరిగి రూ .110 నుండి రూ .129 కు పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.43%. విలువ దాదాపు రూ .65 కోట్లు.ప్రకాష్ ఇండస్ట్రీస్: ఈ స్టాక్ 7% పెరిగి రూ .154 నుండి రూ .165 కు పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.94%. దీని విలువ సుమారు రూ .87 కోట్లు.రాణించని స్టాక్స్ ఇవే..ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్: స్టాక్ రూ .315 వద్దే ఉంది. ఎలాంటి మార్పు లేదు. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.73%. దీని విలువ సుమారు రూ .22 కోట్లు.సావేరా ఇండస్ట్రీస్: ఈ స్టాక్ 3% క్షీణించి రూ .167 నుండి రూ .161 కు పడిపోయింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.14%. దీని విలువ దాదాపు రూ .2 కోట్లుజీహెచ్సీఎల్: ఈ షేరు 11 శాతం పడిపోయి రూ.724 నుంచి రూ.648కి పడిపోయింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.21%. దీని విలువ సుమారు రూ .75 కోట్లు.నేషనల్ ఆక్సిజన్: ఈ స్టాక్ 19% పడిపోయింది. రూ .134 నుండి రూ .109 కి తగ్గింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.22%. దీని విలువ సుమారు రూ .67 లక్షలు.కె.సి.పి. షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్: ఈ స్టాక్ 30 శాతం క్షీణించి రూ.45 నుంచి రూ.31కి చేరుకుంది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.8%. దీని విలువ సుమారు రూ .6 కోట్లు.ప్రకాష్ పైప్స్: ఈ స్టాక్ 41 శాతం పడిపోయి రూ.509 నుంచి రూ.298కి తగ్గింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.69%. దీని విలువ సుమారు రూ .12 కోట్లు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి.సెన్సెక్స్ 592.67 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో 84,404.46 వద్ద, నిఫ్టీ 176.05 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో.. 25,877.85 వద్ద నిలిచాయి.యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రూవరీస్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్ప్లోరేషన్, సార్థక్ మెటల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గీకే వైర్స్, ఓసీసీఎల్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ, ZIM లాబొరేటరీస్, షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 132 పాయింట్లు తగ్గి 25,920కు చేరింది. సెన్సెక్స్(Sensex) 414 పాయింట్లు నష్టపోయి 84,583 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు సానుకూల ప్రపంచ సంకేతాలు, ఆశావాదం మధ్య భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఎగిశాయి. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తారనే వార్తలు కూడా మదుపరుల సెంటిమెంట్ను పెంచాయి.ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 368.97 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 84,977.13 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 117.7 పాయింట్లు లేదా 0.45 శాతం లాభపడి 26,053.9 పాయింట్ల వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.64 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.43 శాతం లాభపడ్డాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ప్రతికూలంగా స్థిరపడ్డాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 2.12 శాతం లాభపడగా, ఎనర్జీ, మెటల్, మీడియా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ లో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఎటర్నల్, మహీంద్రా & మహీంద్రా, మారుతి సుజుకీ, బజాజ్ ఫైనాన్స్ వెనుకబడినవాటిలో అగ్రస్థానంలో ఉన్నాయి. -
తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్పై ప్రభావం ఎంతంటే..
Cyclone Montha Impact On Stock Market: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మోంథా తుపాను ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం అర్థరాత్రి తర్వాత నరసాపురం సమీపంలో తీరం దాటిన ఈ తుపాను.. తీర ప్రాంతాన్ని కల్లోలంలో ముంచెత్తింది. ప్రస్తుతం సుమారు రెండు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతుండగా, రాబోయే ఆరు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ పరిణామం భారీ వర్షాలకు దారితీసి, సాధారణ జనజీవనాన్ని, తీరప్రాంత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.పారిశ్రామిక, పోర్ట్లపై ప్రభావంమోంథా ధాటికి తీరప్రాంతంలో లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. బలమైన గాలులు, వర్షాల కారణంగా రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతినడం, వంతెనలు కొట్టుకుపోవడం వంటివి జరిగి రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. ముఖ్యంగా ఓడరేవుల కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవడం వల్ల సరుకుల రవాణాకు (లాజిస్టిక్స్) తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.మోంథా తుపాను కారణంగా విశాఖపట్నం (వైజాగ్) పోర్ట్, మచిలీపట్నం, కాకినాడ పోర్ట్ల్లో షిప్పింగ్, లాజిస్టిక్స్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. తుపాను తీవ్రతను బట్టి పోర్ట్ కార్యకలాపాలు మూడు ప్రధాన అంశాలలో ప్రభావితమవుతాయి.పోర్ట్ కార్యకలాపాల నిలిపివేతతీవ్ర తుపాను హెచ్చరికల నేపథ్యంలో నష్టం జరగకుండా పోర్ట్ అధికారులు తక్షణమే అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తారు. బంగాళాఖాతంలో అలలు తీవ్రంగా ఎగసిపడుతుండటం (2 మీటర్ల ఎత్తు), బలమైన గాలుల కారణంగా నౌకల రాకపోకలు పూర్తిగా రద్దు చేస్తారు. పోర్టులో ఉన్న నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేదా లంగరు వేసి నిలిపేస్తారు.కార్గో నిలిపివేతకంటైనర్లు, బల్క్ కార్గో, ఇతర సరుకులను ఎగుమతి/దిగుమతి చేసే ప్రక్రియలు పూర్తిగా నిలిచిపోతాయి. కాకినాడ పోర్ట్ ఎక్కువగా బల్క్ కార్గో (ముడిసరుకు, వ్యవసాయ ఉత్పత్తులు)ను హ్యాండిల్ చేస్తుంది కాబట్టి, సరుకు పాడయ్యే ప్రమాదం ఉంది.పోర్టులలోని భారీ క్రేన్లు, కన్వేయర్ బెల్ట్లు, ఇతర కార్గో హ్యాండ్లింగ్ పరికరాలు తీవ్రమైన గాలులు, ఉప్పెన వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.సప్లై-చెయిన్ అంతరాయంపోర్ట్ గేట్లు మూసివేయడం, రోడ్డు రవాణా దెబ్బతినడం వల్ల పూర్తి లాజిస్టిక్స్ సరఫరా గొలుసు దెబ్బతింటుంది. తుపాను ప్రభావంతో రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతినడం లేదా వరదలకు గురికావడం వల్ల పోర్ట్ నుంచి లోతట్టు ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాల నుంచి పోర్ట్లకు సరుకుల రవాణా పూర్తిగా ఆగిపోతుంది. దీనివల్ల ఎగుమతి చేసేందుకు సరుకు పోర్టుకు చేరదు, దిగుమతి సరుకు బయటకు వెళ్లదు.స్టోరేజ్ సమస్యలుపోర్ట్ టెర్మినల్స్లో లేదా చుట్టుపక్కల నిల్వ ఉన్న కంటైనర్లు, వ్యవసాయ ఉత్పత్తులు (మచిలీపట్నం, కాకినాడ పోర్ట్లలో) నీటిలో మునిగి లేదా గాలులకు పడిపోయి నష్టపోతాయి. దీనివల్ల సరుకు యజమానులకు భారీ నష్టం వాటిల్లుతుంది. పోర్ట్ కార్యకలాపాలు సాధారణ స్థితికి రావడానికి, రవాణా మార్గాలను పునరుద్ధరించడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. దీనివల్ల సరఫరా గొలుసులో ఆలస్యం ఏర్పడి, పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడవచ్చు.ఆర్థిక, దీర్ఘకాలిక ప్రభావాలుపోర్ట్ కార్యకలాపాల నిలిపివేత వల్ల ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. ప్రతి పోర్ట్లో రోజువారీ కార్యకలాపాల విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుంది. ఈ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ఆయా పోర్ట్లకు, కస్టమ్స్ రెవెన్యూకు భారీ నష్టం వాటిల్లుతుంది. తుపాను వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను (డాక్స్, జెట్టీలు, రోడ్లు), క్రేన్లను మరమ్మతు చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. పోర్ట్ టెర్మినల్స్, నౌకలు, సరుకుపై (కార్గో) నష్ట పరిహారం కోసం భారీగా బీమా క్లెయిమ్లు పెరుగుతాయి.మౌలిక సదుపాయాలుమోంథా తుపాను వల్ల భారీ గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, టవర్లు, టెలిఫోన్ లైన్లు కూలిపోయి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. తాగునీటి సరఫరా వ్యవస్థలు కలుషితం కావచ్చు. పారిశ్రామిక భవనాలు, గిడ్డంగులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వీటితోపాటు తీర ప్రాంతంలోని వైజాగ్ ఎయిర్పోర్ట్ ద్వారా రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ, దేశీయ విమాన ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. కోస్తా జిల్లాల్లోని మత్స్య పరిశ్రమ, నౌకాశ్రయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ రంగం భారీ నష్టంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితి వల్ల ఉపాధి కోల్పోతారు.గత తుపానుల ప్రభావం ఇలా..గతంలో వచ్చిన తిత్లీ వంటి తీవ్ర తుపానులు తీర ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించాయి. ఆ సమయంలో ఇళ్లు, పశువులు, పెంపుడు జంతువులు, పంటలకు భారీగా నష్టం జరిగింది. సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి రావడం వల్ల వ్యవసాయ భూములు దీర్ఘకాలికంగా పంటలు పండించడానికి పనికిరాకుండా పోయాయి. కొన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి.తుపాను నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలుప్రస్తుత మోంథా తుపాను తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు చేపట్టాలి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలి. నిత్యావసర సరుకులు, తాగునీరు, మందులు సిద్ధంగా ఉంచాలి. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు రియల్టైమ్లో తెలియజేయాలి. విద్యుత్ అంతరాయం కలగకుండా మొబైల్ టవర్ల వద్ద పవర్ బ్యాకప్(జనరేటర్లు) ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలి. రైతుల కోసం టార్పాలిన్లు సిద్ధం చేయాలి.తక్షణ, సహాయ చర్యలువిద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. NDRF, SDRF బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలను వేగవంతం చేయాలి. పారిశుద్ధ్యంపై దృష్టి సారించి వ్యాధులు(మలేరియా, డయేరియా) వ్యాప్తిని అరికట్టాలి. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి 108, 104 వంటి అత్యవసర సేవలను అప్రమత్తం చేయాలి.స్టాక్ మార్కెట్పై ప్రభావం ఎలా?మోంథా తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇండియన్ స్టాక్ మార్కెట్పై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పారిశ్రామిక కార్యకలాపాలు ఆగిపోవడం, రవాణా అంతరాయం, ఆస్తుల నష్టం వంటి అంశాల వల్ల ఈ విభాగంలో సర్వీసులు అందించే కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్, సిమెంట్, లాజిస్టిక్స్, పోర్ట్ సంబంధిత స్టాక్స్ ప్రభావితం కావొచ్చు.పెట్టుబడి విధానం - దీర్ఘకాలిక లక్ష్యాలుతుపాను వల్ల ఏర్పడే పరిస్థితులు తాత్కాలికమే అని గమనించాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న పెట్టుబడిదారులు ఈ తాత్కాలిక పతనంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఇలాంటి సందర్భాల్లో షేర్లను హడావిడిగా అమ్మడం వల్ల నష్టపోతారు. తుపాను వంటి సంఘటనల ప్రభావం కొన్ని రోజుల్లో సద్దుమణుగుతుంది. బేసిక్ ఫండమెంటల్స్ బలంగా ఉన్న నాణ్యమైన కంపెనీల షేర్లు మార్కెట్ అస్థిరత కారణంగా తక్కువ ధరలో లభించినప్పుడు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడానికి, స్థిరమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి క్రమానుగుత పెట్టుబడి విధానాన్ని(సిప్) అనుసరించడం ఉత్తమం.ఒకే రంగంలో కాకుండా నష్టాలను తట్టుకోగల ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, టెక్నాలజీ, ఇన్ప్రా.. వంటి ఇతర రంగాలతో పాటు దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ వల్ల లాభపడే రంగాల్లో పెట్టుబడిని వైవిధ్యపరచాలి.ఇదీ చదవండి: ఆర్బీఐ ఖజానాలో బంగారం ధగధగలు -
26వేల మార్కు వద్ద నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు పెరిగి 26,004కు చేరింది. సెన్సెక్స్(Sensex) 201 పాయింట్లు పుంజుకొని 84,802 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ అటూ ఇటూ
ముంబై: ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయి 84,628 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 25,936 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు లాభాల్లోనే మొదలయ్యాయి.ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 560 పాయింట్లు కోల్పోయి 84,219 వద్ద, నిఫ్టీ 156 పాయింట్లు పతనమై 25,810 వద్ద కనిష్ట స్థాయిని తాకాయి. ట్రేడింగ్ చివర్లో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర రికవరీ అయ్యాయి. ఆసియాలో కొరియా, జపాన్, చైనా, హాంగ్కాంగ్ సూచీలు ఒక శాతానికి వరకు పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల ఇండెక్సుల్లో రియల్టీ 1%, యుటిలిటీ 0.82%, ఐటీ 0.72%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.60% నష్టపోయాయి. మరోవైపు మెటల్ 1.30%, కమోడిటిస్ 0.55%, ఇండ్రస్టియల్స్ 0.21%, బ్యాంకెక్స్ 0.06% లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.12%, 0.06 శాతం పెరిగాయి. ⇒ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకుంటున్న చైనా ప్రకటనతో అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆశలతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. జిందాల్ స్టీల్ 4%, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 3%, సెయిల్, వెల్స్పన్ కార్ప్ 2% రాణించాయి. హిందాల్కో, ఏపీఎల్అపోలో, ఎన్ఎండీసీ షేర్లు 1–0.50% పెరిగాయి. ⇒ ప్రభుత్వ బ్యాంకుల్లో ఎఫ్డీఐ పరిమితిని 20% నుంచి 49% వరకు పెంచాలని కేంద్రం యోచిస్తుందనే వార్తల నేపథ్యంలో పీఎస్యూ బ్యాంకుల షేర్లకు డిమాండ్ నెలకొంది. ఇండియన్ బ్యాంక్ 3.50%, మహారాష్ట్ర బ్యాంకు 2%, యూనియన్ బ్యాంకు, పీఎస్బీ 1.50%, సెంట్రల్ బ్యాంక్, పీఎన్బీ, యూకో బ్యాంకు, బీఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, కెనరా బ్యాంకు 1% లాభపడ్డాయి.


