breaking news
Stock Market
-
స్టాక్ మార్కెట్ వరుస సెలవులు.. సోమవారం ట్రేడింగ్ ఉంటుందా?
దేశీయ స్టాక్మార్కెట్కు వచ్చే వారం వరుసగా వరుస సెలవులు ఉన్నాయి. దీపావళి పండుగ కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రెండు రోజులు మూతపడనున్నాయి. అయితే వచ్చే సోమవారం అంటే అక్టోబర్ 20న మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా.. లేదా? అన్న సందేహం ఇన్వెస్టర్లలో ఉంది. ఏయే రోజుల్లో స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సెలవు ఉంటుందో ఇప్పుడు చూద్దాం..ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన స్టాక్ మార్కెట్ హాలిడే (Stock Market Holidays) క్యాలెండర్ ప్రకారం.. దీపావళి (Diwali 2025) లక్ష్మి పూజ, బలిప్రతిపదా కారణంగా అక్టోబర్ 21, 22 తేదీలలో సెలవు ఉంటుంది. ఆయాల రోజుల్లో సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.అక్టోబర్ 20న అమావాస్య తిథి రావడంతో ఈ రోజున పలు రాష్ట్రాల్లో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. కానీ భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తెరిచే ఉంటాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అక్టోబర్ 21న వ్యాపారులు, ఇన్వెస్టర్ల కోసం 'ముహూర్త్ ట్రేడింగ్' పేరుతో ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:45 గంటల వరకు ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ జరగనుంది.2025లో రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన మార్కెట్ హాలిడే క్యాలెండర్ లో 2025లో మొత్తం 14 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇంకా మిగిలిన సెలవులు కింది విధంగా ఉన్నాయి..అక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజ అక్టోబరు 22 - బలిప్రతిపాద నవంబర్ 5 - ప్రకాష్ గురుపుర్బ్ శ్రీ గురునానక్ దేవ్ డిసెంబర్ 25 - క్రిస్మస్ -
స్టాక్ మార్కెట్.. హాట్రిక్ హిట్!
భారత ఈక్విటీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఈ సెషన్ లో 52 వారాల గరిష్టాన్ని తాకాయి. దీపావళికి ముందు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడు రోజులు లాభాలను అందుకున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 484.53 పాయింట్లు లేదా 0.58 శాతం పెరిగి 83,952.19 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 124.55 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 25,709.85 వద్ద స్థిరపడ్డాయి.బీఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్, హెచ్యూఎల్ టాప్ గెయినర్లలో ఉండగా, ఇన్ఫోసిస్, హెచ్ఎల్టెక్, ఎటర్నల్, టాటా స్టీల్ టాప్ లూజర్లలో ఉన్నాయి.రంగాలవారీగా నిఫ్టీ ఎఫ్ఎంసిజి 1.37 శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ 1.63 శాతం, మీడియా 1.56 శాతం నష్టపోయాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.57 శాతం, 0.05 శాతం నష్టపోయాయి. -
లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే..
పచ్చనోటు మనిషి జీవితంలో ఎంతో ప్రభావం చూపుతుంది. డబ్బుపై ఆశ కడు పెదరికంలో ఉన్న వ్యక్తిని సైతం రాజును చేయగలదు. ఆ ఆశ కొద్దిగా మితిమీరితే అదే డబ్బు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుంది. ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్ శెట్టి జీవితంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఆ ఆశే తన రూ.87,936 కోట్ల(అంచనా) విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.స్టాక్ ఎక్స్ఛేంజీలో..శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్కేర్ ప్రొవైడర్గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.వ్యాపారాల జాబితా..శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.అనధికార నగదు లావాదేవీలు2019లో ఎన్ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.87,936 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.ఇతర కంపెనీలపై ప్రభావంఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.పడిపోయిన ఆస్తుల విలువబ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: అవసరాలకు అనువైన బహుమతులు.. తీరు మార్చుకున్న కంపెనీలు -
నాలుగు నెలల గరిష్టాన్ని చేరిన నిఫ్టీ!
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడు రోజులుగా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ ర్యాలీలో కీలక సూచీ నిఫ్టీ నాలుగు నెలల్లో ఎప్పుడు లేనంతగా పెరిగింది. ఈరోజు (అక్టోబర్ 17, 2025, శుక్రవారం) మధ్యాహ్నం 12:21 గంటల సమయానికి నిఫ్టీ సూచీ 25,770 స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది జూన్లో వెళ్లిన 25,650 మార్కును దాటడం గమనార్హం. ఈ పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణాలను విశ్లేషిస్తే...మార్కెట్ పెరుగుదలకు దోహదపడిన కీలక అంశాలువిదేశీ సంస్థాగత మదుపర్ల (FIIలు) కొనుగోళ్లు: భారత మార్కెట్లపై విదేశీ సంస్థాగత మదుపర్ల విశ్వాసం మరింత పెరిగింది. గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో FIIలు నికర కొనుగోలుదారులుగా ఉండటం మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణమైంది. భారత్ ఆర్థిక వృద్ధి సామర్థ్యం, పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులపై నమ్మకంతో వారు పెట్టుబడులు పెడుతున్నారు.ద్రవ్యోల్బణం అంచనాల ఉపశమనం: ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుతాయనే ఆశాభావం పెరిగింది. ముఖ్యంగా ముడి చమురు ధరల్లో (క్రూడాయిల్) కొంత స్థిరత్వం లేదా తగ్గుదల ధోరణి కనిపించడం భారత్కు సానుకూలంగా మారింది. ముడి చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందనే అంచనాలు మదుపర్లలో కొనుగోలు ఆసక్తిని పెంచాయి.పటిష్టమైన దేశీయ ఆర్థికాంశాలు: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు పటిష్టంగా ఉండటం, కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు మెరుగ్గా ఉండటం మార్కెట్ పెరుగుదలకు దోహదపడుతున్నాయి.మొత్తంమీద బలమైన అంతర్జాతీయ సంకేతాలు, FIIల విశ్వాసం, ద్రవ్యోల్బణంపై ఉపశమనం, పటిష్టమైన కార్పొరేట్ పనితీరు వంటి అంశాలు కలిసి నిఫ్టీని చాలా రోజుల తర్వాత 25,770 మార్కుకు చేర్చాయి. అయితే రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వంటి అంశాలపై మార్కెట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి బుల్లిష్ (లాభాల) ధోరణి కొనసాగుతున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే.. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 32 పాయింట్లు పెరిగి 25,619కు చేరింది. సెన్సెక్స్(Sensex) 124 పాయింట్లు పుంజుకుని 83,580 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లకు వరుస లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఎగిశాయి. కొనసాగుతున్న క్యూ2 ఫలితాల సీజన్ లో స్టాక్-నిర్దిష్ట చర్యల మధ్య వరుసగా రెండవ సెషన్ లోనూ లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 862.23 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగి 83,467.66 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 261.75 పాయింట్లు లేదా 1.03 శాతం పెరిగి 25,585.3 వద్ద ముగిశాయి.బీఎస్ఈలో టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం టాప్ గెయినర్లలో ఉండగా, ఇన్ఫోసిస్, ఎటర్నల్ (జొమాటో) మాత్రమే వెనుకబడి ఉన్నాయి.రంగాలవారీగా అన్ని రంగాలు గ్రీన్లో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసిజి 2.02 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో, బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.46 శాతం, 0.24 శాతం పెరిగాయి. -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 322.86 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో.. 82,928.29 వద్ద, నిఫ్టీ 80.90 పాయింట్లు లేదా 0.32 శాతం లాభంతో 25,404.45 వద్ద సాగుతున్నాయి.గుజరాత్ రఫియా ఇండస్ట్రీస్, మాస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, షేర్ ఇండియా సెక్యూరిటీస్, హుహ్తమాకి ఇండియా, ఉమియా బిల్డ్కాన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. కేఈఐ ఇండస్ట్రీస్, సెమాక్ కన్సల్టెంట్స్ లిమిటెడ్, వీ విన్ లిమిటెడ్, లక్ష్మీ గోల్డోర్నా హౌస్, రీజెన్సీ సెరామిక్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్ లాభాల్లో మార్కెట్లు
రెండు రోజుల వరుస నష్టాల అనంతరం దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ప్రపంచ ఆశావాదం, ముడి చమురు ధరల తగ్గుదల కారణంగా భారతీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పుంజుకుని లాభాలలో స్థిరపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 575.45 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 82,605.43 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 178.05 పాయింట్లు లేదా 0.71 శాతం ఎగిసి 25,323.55 వద్ద ముగిసింది.బీఎస్ఈలో బజాజ్ ట్విన్స్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్ (జొమాటో) టాప్ గెయినర్స్ లో ఉండగా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్గా నిలిచాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 3.04 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 1.67 శాతం, నిఫ్టీ మెటల్ 1 శాతం లాభపడ్డాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 1.11 శాతం, 0.82 శాతం లాభపడ్డాయి. -
340 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు పెరిగి 25,249కు చేరింది. సెన్సెక్స్(Sensex) 345 పాయింట్లు పుంజుకుని 82,378 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రెండో రోజూ మార్కెట్ వెనక్కి..
ముంబై: ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీన ధోరణికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాల బాట పట్టడంతో దేశీ మార్కెట్లు రెండో రోజూ ‘బేర్’మన్నాయి. మెటల్స్తో పాటు కొన్ని వాహన, ఫార్మా షేర్లు సూచీలను వెనక్కిలాగాయి. ముందురోజు అమెరికా మార్కెట్ల బౌన్స్బ్యాక్, చైనాతో టారిఫ్ వార్ విషయంలో ట్రంప్ కాస్త శాంతించేలా చేసిన వ్యాఖ్యలతో మన మార్కెట్లలో ట్రేడింగ్ సానుకూలంగానే మొదలైంది.సెన్సెక్స్ ఒక దశలో 82,573 పాయింట్ల గరిష్టాన్ని తాకినప్పటికీ.. ఆ జోరు ఎంతో సేపు నిలవలేదు. ఇంట్రాడేలో 545 పాయింట్లు కోల్పోయి 81,781 కనిష్టాన్ని కూడా తాకింది. చివర్లో కాస్త కోలుకుని 297 పాయింట్ల నష్టంతో 82,030 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా తీవ్ర ఒడిదుడుకుల మధ్య 82 పాయింట్లు పడి 25,146 వద్ద క్లోజైంది. బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలూ నష్టపోయాయి. మిడ్క్యాప్ ఇండెక్స్ 0.95 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.74 శాతం చొప్పన క్షీణించాయి. జీవితకాల కనిష్టానికి రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసలు బలహీనపడి జీవిత కాల కనిష్టం 88.81 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లోని ప్రతికూలతలు, అమెరికా కరెన్సీ బలపడటం రూపాయి కోతకు కారణమయ్యాయి. -
లాభాలకు బ్రేక్.. మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 297.07 పాయింట్లు లేదా 0.36 శాతం నష్టంతో 82,029.98 వద్ద, నిఫ్టీ 81.85 శాతం లేదా 0.32 శాతం నష్టంతో 25,145.50 శాతం వద్ద నిలిచాయి.ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, వీ విన్ లిమిటెడ్, కోఠారి ప్రొడక్ట్స్, MTAR టెక్నాలజీస్, రెప్రో ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టాటా మోటార్స్, గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ న్యూ లిమిటెడ్, ఏజీఐ ఇన్ఫ్రా, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
180 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 64 పాయింట్లు పెరిగి 25,293కు చేరింది. సెన్సెక్స్(Sensex) 181 పాయింట్లు పుంజుకుని 82,501 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 173.77 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో.. 82,327.05 వద్ద, నిఫ్టీ 58.00 పాయింట్లు లేదా 0.23 శాతం నష్టంతో 25,227.35 వద్ద నిలిచాయి.ఉమియా బిల్డ్కాన్, గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, డ్రీమ్ఫోక్స్ సర్వీసెస్, యూనివర్సస్ ఫోటో ఇమేజింగ్స్ లిమిట్, సంపన్ ఉత్పాదన్ ఇండియా కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. యూనివాస్తు ఇండియా, సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్, ముంజల్ షోవా, తారాపూర్ ట్రాన్స్ఫార్మర్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బేబీ బూమర్లు నష్టపోతారు!: రాబర్ట్ కియోసాకి
ప్రముఖ అమెరికన్ రచయిత, వ్యాపారవేత్త, ఆర్థిక విద్యా మార్గదర్శకుడైన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. ఎక్స్ వేదికగా పెట్టుబడికి సంబంధించిన విషయాలను చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. ఆయన చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ట్రంప్తో కలిసి రాసిన పుస్తకాల గురించి పేర్కొన్నారు.ఐ లవ్ ట్రంప్.. అని మొదలు పెట్టి.. మేము ఇద్దరూ కలిసి రెండు పుస్తకాలు రాశాము. అందులో ఒకటి.. స్టాక్, బాండ్ మార్కెట్లను నియంత్రించే ధనిక పెట్టుబడి బ్యాంకర్లు 401-K(అమెరికాలోని ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్) ద్వారా కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారని చెబుతోంది.బేబీ బూమర్లు (1946 నుంచి 1964 మధ్యకాలంలో జన్మించిన వారు) ఇబ్బందుల్లో పడుతున్నారని.. ద్రవ్యోల్బణం వారి 401-Kల కొనుగోలు శక్తిని తుడిచిపెట్టినప్పుడు, మిలియన్ల మంది బేబీ బూమర్లు నష్టపోయే అవకాశం ఉందని 'వారెన్ బఫెట్' కూడా అంగీకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. అధ్యక్షుడు ట్రంప్ మధ్యప్రాచ్యానికి శాంతిని తీసుకురావడమే కాకుండా.. రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టోలతో సహా ప్రత్యామ్నాయ పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలాంటివే సాధారణ ప్రజలను ధనవంతులను చేస్తాయి.ఇక రెండో పుస్తకం.. ఈఎస్బీఐ (ESBI: ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్) క్యాష్ఫ్లో క్వాడ్రాంట్ ఆర్ధిక సిద్ధాంతాన్ని వివరిస్తుంది. 401-K వైద్యులు, న్యాయవాదుల వంటివారి కోసం రూపొందించబడ్డాయి.ఇదీ చదవండి: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక: ఈ ఏడాదే అతిపెద్ద క్రాష్!నాకు (రాబర్ట్ కియోసాకి), ట్రంప్, మస్క్ పెట్టుబడి పెట్టడానికి మరిన్ని, విభిన్నమైన & మెరుగైన ఆస్తులు ఉన్నాయి. మీరు కూడా ప్రత్యామ్నాయ (గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ మొదలైనవి) పెట్టుబడులు పెట్టండి. భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు.మీ కోసం మీరే ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. తెలివిగా మారడానికి, మీ భవిష్యత్తుకు ఉత్తమమైన ఆస్తులను ఎంచుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఎప్పటికప్పుడు మీ సొంత ఆర్థిక తెలివితేటలను పెంచుకుంటుంటే.. తప్పకుండా ధనవంతులు అవుతారు. జాగ్రత్తపడండి అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.I LOVE TRUMP: We wrote two books together for many reasons. One of those reasons is because the rich investment bankers who control the stock and bond markets are screwing the working class via the workers 401-Ks. Even Warren Buffet has been admitting Baby-boomers are…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 13, 2025 -
నష్టాలున్నా 25,100 మార్కుపైనే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు నష్టపోయి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 332 పాయింట్లు దిగజారి 82,158 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రాబర్ట్ కియోసాకి హెచ్చరిక: ఈ ఏడాదే అతిపెద్ద క్రాష్!
ఎక్స్ వేదికగా పెట్టుబడికి సంబంధించిన విషయాలను పేర్కొంటూ ఉండే.. రిచ్ రాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో.. ఈ ఏడాది అతిపెద్ద క్రాష్ జరుగుతుందని హెచ్చరించారు.ప్రపంచ చరిత్రలో అతిపెద్ద క్రాష్ జరుగుతుందని.. నేను ముందే ఊహించాను. ఆ క్రాష్ ఈ ఏడాది జరుగుతుంది. బేబీ బూమ్ రిటైర్మెంట్లు తుడిచిపెట్టుకుపోబోతున్నాయి. కియోసాకి ప్రకారం.. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను పొందే అవకాశం ఉందని, ఇదే అతిపెద్ద క్రాష్ అని స్పష్టంగా అర్థమవుతోంది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడానికి టారిఫ్స్ ప్రభావం, ఆర్ధిక మాంద్యం, అంతర్జాతీయ అనిశ్చితి మొదలైనవి ప్రధాన కారణాలు.డబ్బు కూడబెట్టొద్దు, నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టండని హెచ్చరిస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా.. నేను సేవర్స్ ఓడిపోయేవారు అని చెబుతూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా నేను బంగారం, వెండి, బట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించాను. వాటి ధరలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు.ఇప్పుడు ఎథెరియంలను సేవ్ చేయమని చెబుతున్నాను. ఈ రోజు నేను వెండి & ఎథెరియం ఉత్తమమైనవని నమ్ముతున్నాను. ఎందుకంటే వీటి విలువ పెరుగుతూనే ఉంటుంది. వీటిని ముఖ్యంగా పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. దయచేసి వెండి, ఎథెరియం లాభాలు & నష్టాలను మాత్రమే కాకుండా.. ఉపయోగాన్ని కూడా అధ్యయనం చేయండి. మీ సొంత ఆర్థిక జ్ఞానంతో పెట్టుబడి పెట్టండి. ఎప్పటికప్పుడు మీ సొంత ఆర్థిక తెలివితేటలను పెంచుకుంటుంటే.. తప్పకుండా ధనవంతులు అవుతారు. జాగ్రత్తపడండి అంటూ కియోసాకి ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకిపెరుగుతున్న వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రూ. 190000 వద్దకు చేరింది. ఈ సందర్భంగా ''వెండి 50 డాలర్లు దాటేసింది, తరువాత 75 డాలర్లకు?.. సిల్వర్, ఎథిరియం హాట్, హాట్'' (ధరలు భారీగా ఉన్నాయని) అంటూ కియోసాకి ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే.. వెండి కూడా మరింత పెరుగుతుందని తెలుస్తోంది.REMINDER: I predicted the biggest crash in world history was coming in my book Rich Dad’s Prophecy. That crash will happen this year. Baby Boom Retirements are going to be wiped out. Many boomers will be homeless or living in their kids basement. Sad.REMiNDER: I have…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 11, 2025 -
చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు.. కుప్పకూలిన స్టాక్మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కొత్త సుంకాల యుద్ధాన్ని ప్రకటించడంతో ప్రపంచ వాణిజ్య సంబంధాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై నవంబర్ 1 నుంచి 100% కొత్త సుంకం విధించనున్నట్లు, అదే తేదీన చైనా సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే చైనాపై యూఎస్ 30 శాతం సుంకాలు విధించింది. తాజా పరిణామం అమెరికా స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. శుక్రవారం రోజునే నాస్డాక్, డోజోన్స్, ఎస్అండ్పీ సూచీలు భారీగా నష్టపోయి, మదుపర్ల సంపద 1.5 ట్రిలియన్ డాలర్ల మేర ఆవిరైంది.ప్రతీకార చర్యలు, అరుదైన ఖనిజాల అస్త్రంఅమెరికా తీసుకున్న ఈ తాజా చర్యకు ముఖ్య కారణం.. అరుదైన భూ ఖనిజాలపై (Rare Earth Magnets) చైనా విధించిన కొత్త ఎగుమతి నియంత్రణలకు ప్రతీకారం తీర్చుకోవడమే. అరుదైన భూ ఖనిజాల ప్రపంచ సరఫరాలో చైనా దాదాపు 70% ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆటోమొబైల్స్, డిఫెన్స్, సెమీకండక్టర్లతో సహా హైటెక్ పరిశ్రమలకు ఈ ఖనిజాలు అత్యంత కీలకం. ఈ ఖనిజాలు తమ అధునాతన సాంకేతిక, రక్షణ రంగాలకు ఎంత ముఖ్యమో అమెరికాకు తెలుసు. చైనా వీటి సరఫరాను నియంత్రించడం ద్వారా అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో తమకు అనుకూలంగా ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. చైనా ఎగుమతి నియంత్రణలు, అమెరికాపై చైనా ఉపయోగించే ఒక కీలకమైన ఆర్థిక అస్త్రంగా మారింది.మార్కెట్లపై ప్రభావంఈ వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీసింది. అధిక సుంకాలు, ఎగుమతి నియంత్రణలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తాయని, తద్వారా అంతిమంగా అమెరికాలోని వినియోగదారులపై ధరల భారం పెరుగుతుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. చైనాపై 100% సుంకం, చైనా సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలు వంటి చర్యలు కేవలం వాణిజ్య లోటుకు సంబంధించిన అంశాలే కాకుండా, సాంకేతిక, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలుగా మారాయి.భవిష్యత్తుపై..ఈ తాజా ఉద్రిక్తతలు అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాన్ని మరింత తగ్గిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పరం ప్రతీకార చర్యలకు దిగడం వల్ల ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వృద్ధి మందగిస్తాయనే భయాలు పెరుగుతున్నాయి. అరుదైన ఖనిజాల సరఫరాపై చైనాకున్న ఏకచ్ఛత్రాధిపత్యం పరిస్థితులను మరింత జటిలం చేస్తుంది. అమెరికాను చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను, దేశీయ ఉత్పత్తిని పెంచే చర్యలు చేపట్టేలా ఒత్తిడిని పెంచుతోంది.మొత్తంమీద ఈ వాణిజ్య ఉద్రిక్తతలు కేవలం సుంకాల పెరుగుదలకు సంబంధించినవి మాత్రమే కాదు. ఇవి ప్రపంచ ఆర్థిక ఆధిపత్యం, కీలకమైన సాంకేతికతలపై నియంత్రణ, జాతీయ భద్రతా ప్రయోజనాలకు సంబంధించిన వ్యూహాత్మక పోటీగా మారాయి. ఈ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ సమీప భవిష్యత్తులో కూడా మార్కెట్లలో అనిశ్చితిని కొనసాగించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.ఇదీ చదవండి: ‘ప్రపంచానికి 200 మంది ఎలాన్ మస్క్లు అవసరం’ -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్లిన ఎస్బీఐ
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఫార్మా, బ్యాంకింగ్ షేర్లలో లాభాల కారణంగా ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా రెండవ ట్రేడింగ్ సెషన్లోనూ ఎగువన ముగిశాయి.ఐటీ స్టాక్స్ బలహీనత మధ్య 100 పాయింట్ల క్షీణతతో 82,075 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ వెంటనే పుంజుకుంది. ఇంట్రా-డే డీల్స్ లో 579 పాయింట్లు పెరిగి 82,654 వద్ద గరిష్ట స్థాయికి ర్యాలీ చేసింది. ఎట్టకేలకు 329 పాయింట్లు లేదా 0.4 శాతం లాభంతో 82,501 వద్ద ముగిసింది.ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 25,331 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 104 పాయింట్లు లేదా 0.4 శాతం పెరిగి 25,285 వద్ద స్థిరపడింది. ఈ ప్రక్రియలో ఎన్ఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ జూన్ 27 నుండి అతిపెద్ద వారాంతపు లాభాన్ని (1.6 శాతం) నమోదు చేయగలిగింది.సెన్సెక్స్ స్టాక్స్ లో ఎస్బీఐ 2 శాతానికి పైగా లాభపడింది. మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ 1 శాతం లాభపడ్డాయి. మరోవైపు టాటా స్టీల్ 1.5 శాతం పడిపోయింది.క్యూ2 ఫలితాలను నివేదించిన తర్వాత టీసీఎస్ కూడా ఒక రోజు 1 శాతం తగ్గింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.4 శాతం, స్మాల్ క్యాప్ 0.6 శాతం పెరిగాయి.రంగాలవారీగా.. బీఎస్ఈ హెల్త్కేర్, బ్యాంకెక్స్ ఒక్కొక్కటి 1 శాతం వరకు పెరిగాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడ్డాయి. 2030 నాటికి భారత్-బ్రిటన్ వాణిజ్యం రెట్టింపు అవుతుందనే వార్తల మధ్య ఇంట్రాడే డీల్స్ లో టెక్స్ టైల్ కంపెనీల షేర్లు 17 శాతం వరకు పెరిగాయి. -
లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం ఉదయం లాభల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 282.04 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 82,454.14 వద్ద, నిఫ్టీ 86.45 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 25,268.25 వద్ద సాగుతున్నాయి.రిలయన్స్ పవర్ లిమిటెడ్, నాగరీకా క్యాపిటల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సంగం (ఇండియా), 5పైసా క్యాపిటల్, జిందాల్ ఫోటో లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. లక్ష్మీ గోల్డోర్నా హౌస్, క్యాపిటల్ ట్రస్ట్, తమిళనాడు టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, మెక్లియోడ్ రస్సెల్ (ఇండియా), సోలెక్స్ ఎనర్జీ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 398.45 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో 82,172.10 వద్ద, నిఫ్టీ 135.65 పాయింట్లు లేదా 0.54 శాతం లాభంతో 25,181.80 వద్ద నిలిచాయి.జిందాల్ ఫోటో లిమిటెడ్, నాగరీకా క్యాపిటల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎం బ్రూవరీస్, ఆల్కలీ మెటల్స్, వీ విన్ లిమిటెడ్ వంటివి లాభాల జాబితాలో చేరాయి. నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), మోడీ రబ్బర్ లిమిటెడ్, సుమీత్ ఇండస్ట్రీస్, హెడ్స్ అప్ వెంచర్స్ వంటి కంపెనీలు వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
25,000 మార్కుపైనే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు పెరిగి 25,097కు చేరింది. సెన్సెక్స్(Sensex) 107 పాయింట్లు పుంజుకొని 81,871 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) బుధవారం నష్టాల్లో ముగిశాయి. అస్థిర సెషన్ తరువాత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు ప్రారంభ లాభాలు కరెక్షన్కు గురై నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 153.09 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 81,773.66 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62.15 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 25,046.15 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.73 శాతం, 0.52 శాతం నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో, నిఫ్టీ ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.ఇన్ఫోసిస్, టీసీఎస్, కోఫోర్జ్, ఎల్టీఐ మైంట్రీ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.51 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ రియాల్టీ, మీడియా, ఆటో, ఎనర్జీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 1 శాతం వరకు పడిపోయాయి.సెన్సెక్స్ లో 30 షేర్లకు గాను 21 షేర్లు పడిపోయాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, సన్ ఫార్మా టాప్ లూజర్స్ గా నిలిచాయి. టైటాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,179కు చేరింది. సెన్సెక్స్(Sensex) 267 పాయింట్లు పుంజుకొని 82,209 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగో రోజూ లాభాలే
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు 1% రాణించడంతో స్టాక్ మార్కెట్ నాలుగో రోజూ లాభపడింది. సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 81,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31 పాయింట్లు బలపడి 25,108 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశలతో ప్రథమార్ధమంతా స్థిరంగా ముందుకు కదలాయి. ఒక దశలో సెన్సెక్స్ 519 పాయింట్లు బలపడి 82,310 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు ఎగసి 25,221 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి.అయితే ద్వితీయార్ధంలో ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణతో సూచీల లాభాలు తగ్గాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలహీనపడి 88.77 వద్ద స్థిరపడింది. ఆసియాలో జపాన్, సింగపూర్, తైవాన్, ఇండోనేíÙయా, కొరియా మార్కెట్లు లాభపడ్డాయి. సెలవు కారణంగా చైనా, హాంగ్కాంగ్ మార్కెట్లు పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో టెలికం 2.13%, రియల్టీ 1.09%, ఇంధన 0.50%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.28%, ఫైనాన్సియల్ సర్విసెస్ 0.24%, ఐటీ 0.23 శాతం లాభపడ్డాయి. ⇒ లాజిస్టిక్స్ సర్విసు ప్రొవైడర్ గ్లోటిస్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.129)తో పోలిస్తే బీఎస్ఈలో 32% డిస్కౌంటుతో రూ.88 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 37% క్షీణించి రూ.81 కనిష్టాన్ని తాకింది. చివరికి 35% పతనంతో రూ.84 వద్ద నిలిచింది.⇒ ఇష్యూ ధర (రూ.191) వద్దే ఫ్లాటుగా లిస్టయిన ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ షేరూ మెప్పించలేకపోయింది. ఇంట్రాడేలో 5% పతనమై రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి 4.5% నష్టంతో రూ.182 వద్ద స్థిరపడింది. -
కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు
ఎప్పుడు, ఎవరు, ఎలా కోటీశ్వరులవుతారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇది అందరి జీవితంలో జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఒకవేళా జరిగితే మాత్రం.. వారిని మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్స్ గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని కొందరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఊహకందని నష్టాలను కూడా చూడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలు వచసాయి. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడంతా పేపర్ రూపంలోనే లావాదేవీలు జరిగేవి. ఆ నాటి పేపర్స్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టులో.. సుమారు 30ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన షేర్లకు సంబంధించిన పేపర్లు దొరకడంతో ఒక వ్యక్తి.. ఇప్పటి వాటి విలువను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ వ్యక్తి 1995లో జేవీఎస్ఎల్ (JVSL) కంపెనీకి సంబంధించిన షేర్లను ఒక్కక్కరి రూ. 10 చొప్పున.. 100 కొనుగోలు చేసాడు. 1000 రూపాయలు పెట్టి కొన్న షేర్స్.. ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అవి ఇప్పుడు దొరికాయి. వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ. 1.83 కోట్లు అయింది.ఇదీ చదవండి: మిలియనీర్గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!2005లో జేవీఎస్ఎల్ కంపెనీ.. జేఎస్డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. ఆ సమయంలో ఒక జేవీఎస్ఎల్ షేర్ ఉన్న వారికి.. జేఎస్డబ్ల్యూ కంపెనీ 16 షేర్స్ ఇచ్చింది. దీంతో 1995లో కొన్న వ్యక్తి 1000 షేర్స్ 16000 షేర్స్ అయ్యాయి. ఈ విషయాన్ని మార్కెటింగ్ గ్రోమాటిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం JSW ధర ఒక్కో షేరుకు రూ. 1,146 ఉంది. దీంతో ఆ షేర్స్ విలువ రూ. 1.83కోట్లుగా మారింది. ఆ వ్యక్తి ఒకేసారి కోటీశ్వరుడయ్యాడు. View this post on Instagram A post shared by Startup | Marketing (@marketing.growmatics) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 136.63 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 81,926.75 వద్ద, నిఫ్టీ 30.65 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 25,108.30 వద్ద నిలిచాయి.ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్, సెంచరీ ఎక్స్ట్రూషన్స్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, మైండ్టెక్ (ఇండియా) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్లోటిస్ లిమిటెడ్, సిగ్మా సాల్వ్ లిమిటెడ్, ఏఏఏ టెక్నాలజీస్, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, కేఐఓసీఎల్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,122కు చేరింది. సెన్సెక్స్(Sensex) 127 పాయింట్లు పుంజుకొని 81,919 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 582.95 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 81,790.12 వద్ద.. నిఫ్టీ 183.40 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 25,077.65 వద్ద నిలిచాయి.అట్లాంటా, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఏఏఏ టెక్నాలజీస్, ఓరియంట్ టెక్నాలజీస్, తారా చంద్ ఇన్ఫ్రాలాజిస్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సిగ్మా సాల్వ్, హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, మాస్టర్ ట్రస్ట్, ప్రోజోన్ రియాల్టీ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు పెరిగి 24,916కు చేరింది. సెన్సెక్స్(Sensex) 69 పాయింట్లు పుంజుకొని 81,279 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్స్పై అవగాహన ఉంది.. కానీ ఇన్వెస్ట్ చేయం
సాక్షి, అమరావతి: దేశీయ స్టాక్ సూచీలు నూతన గరిష్టస్థాయిల దిశగా దూసుకుపోతున్నా.. భారతీయులు అత్యధికమంది ఈ అంశాలను గమనిస్తున్నారేగానీ, పెట్టుబడి పెట్టడం ద్వారా వాటి ప్రతిఫలాలను పొందడం లేదు. స్టాక్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా నిర్వహించిన ఇన్వెస్టర్ సర్వే–2025 ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అత్యధికమందికి స్టాక్మార్కెట్పై అవగాహన ఉన్నా వాస్తవంగా పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని ఈ సర్వే వెల్లడించింది. స్టాక్మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పథకాల్లో కనీసం ఒకదానిపైనైనా 63 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ 9.5 శాతం మంది మాత్రమే ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది.దేశవ్యాప్తంగా 400 పట్టణాలు, వెయ్యికిపైగా గ్రామాల్లో 90 వేల కుటుంబాలపై సెబీ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. 21.3 కోట్లమందికి స్టాక్మార్కెట్పై అవగాహన ఉన్నా ఇన్వెస్ట్ చేసింది మాత్రం 3.2 కోట్ల మందే. పట్టణ ప్రాంతాల్లో 15 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఆరుశాతం మంది మాత్రమే ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా ఢిల్లీలో 20.7 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత గుజరాత్లో 15.4 శాతం మంది పెట్టుబడి పెడుతున్నారు.పెట్టుబడి రక్షణకే అధిక ప్రాధాన్యతభారతీయులు తక్కువ నష్టభయం ఉండే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. 80 శాతం మంది ఎటువంటి నష్టభయం లేని సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకే ముందుకొస్తున్నారు. పెట్టుబడిదారుల్లో 79.7 శాతం మంది తక్కువ నష్టభయం ఉన్నవాటిని, 14.7 శాతం మంది కొద్దిగా రిస్క్ ఉన్నవాటిని ఎంపిక చేసుకుంటుండగా.. 5.6 శాతం మంది ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈక్విటీల్లో కూడా అత్యధికంగా సగటున 6.7 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తుంటే షేర్లలో 5.3 శాతం మంది పెట్టుబడి పెడుతున్నారు.ఈక్విటీ పెట్టుబడుల్లో ఉండే సంక్లిష్ట పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో వెనుకాడుతున్నట్లు 74 శాతం మంది తెలిపారు. వీటిపై కొద్దిగా అవగాహన కలి్పస్తే పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుకుని పెట్టుబడులు పెట్టడానికి యువతీయువకులు ముందుకొస్తున్నారు. ఏటా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోందని, వచ్చే ఏడాది నుంచి పెట్టుబడులు పెడతామని 22 శాతం మంది చెప్పడం ఒక శుభసంకేతమని సెబీ ఆ నివేదికలో పేర్కొంది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 223.86 పాయింట్లు లేదా 0.28 శాతం లాభంతో 81,207.17 వద్ద, నిఫ్టీ 57.95 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 24,894.25 వద్ద నిలిచాయి.ఓరియంట్ టెక్నాలజీస్, కేఐఓసిఎల్, ఏఏఏ టెక్నాలజీస్, అట్లాంటా, ఒరిస్సా మినరల్స్ డెవలప్మెంట్ కంపెనీ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. సెంటమ్ ఎలక్ట్రానిక్స్, సిగ్మా సాల్వ్ లిమిటెడ్, బజార్ స్టైల్ రిటైల్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
మిశ్రమ ప్రపంచ సంకేతాల ప్రభావంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాల్లో కదులుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 299.17 పాయింట్ల నష్టంతో 80,684.14 వద్ద, అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 76.75 పాయింట్ల క్షీణతతో 24,759.55 వద్ద ప్రారంభమయ్యాయి.బీఎస్ఈలో టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ డ్రాగ్స్గా నిలిచాయి. ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ గా ఉండగా, మాక్స్ హెల్త్, ఐషర్ మోటార్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.మరోవైపు విస్తృత మార్కెట్లు పెరిగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, పీఎస్యూ బ్యాంక్, ఫార్మా వరుసగా 0.95 శాతం, 0.48 శాతం, ఫార్మా 0.34 శాతం లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ కుప్పకూలబోతోందా?: బఫెట్పై.. కియోసాకి ఆగ్రహం
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. వారెన్ బఫెట్ ఇటీవల బంగారం & వెండిని ప్రశంసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్పుడూ స్టాక్ మార్కెట్, ఫండ్స్ వాణి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే వారెన్ బఫెట్.. ఇప్పుడు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. బఫెట్ కొత్త వైఖరి సాంప్రదాయ స్టాక్లు, బాండ్లకు పొంచి ఉన్న సంక్షోభాన్ని సూచిస్తుందని రాబర్ట్ కియోసాకి తీవ్రంగా స్పందించారు.స్టాక్ మార్కెట్ మసకబారుతోందా?కొన్నేళ్లుగా.. వారెన్ బఫెట్ బంగారం & వెండి వంటివి ఉత్పాదకత లేని ఆస్తులుగా పరిగణించారు. 2011లో బెర్క్షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో కూడా అయన బంగారం ఎక్కువగా ఉపయోగపడేది కాదని, అది లాభాలను తీసుకురాదని వ్యాఖ్యానించారు. వ్యాపారాలు, వ్యవసాయ భూములు, ఇండెక్స్ నిధులను నిజమైన రాబడిని చెబుతూ.. నమ్మకమైన పెట్టుబడులుగా పేర్కొన్నారు. కానీ ఆయనే ఇప్పుడు బంగారం & వెండిని ఆమోదించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.బఫెట్ ఒకప్పుడు బంగారాన్ని ఎగతాళి చేసినప్పటికీ, ఇప్పుడు దానిని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ప్రశంసిస్తున్నాడు. ఇది బఫెట్ దృక్పథంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని కియోసాకి అన్నారు. అంతే కాకుండా.. బఫెట్ మాట విని కొంత బంగారం, వెండి, బిట్కాయిన్ కొనాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వారెన్ బఫెట్కు అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్గా పేరుంది. ఆయన ఎక్కువగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంటారు. దీంతో ఆయన్ను, ఆయన ఆలోచనలకు మంది అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పుడు మారిన బఫెట్ వైఖరితో స్టాక్ మార్కెట్ నుంచి వైదొలిగి బంగారం, వెండి వైపు పయనిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు తగ్గి కుప్పకూలలే ప్రమాదముందా అంటూ కియోసాకి సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!డబ్బు దాచుకోవడం వల్ల పేదవాళ్లు అవుతారని, డబ్బును బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మీ పెట్టుబడి పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. వెండిపై పెట్టుబడి.. మీకు ఐదు రేట్లు లాభాలను తీసుకొస్తాయని ఆయన ఇటీవలే అన్నారు.I WANT TO VOMIT: getting nauseus, listening to Buffet tout the virtues of gold and silver…. after he ridiculed gold and silver for years. That means the stock and bond market are about to crash. Depression ahead?Even though Buffet shit on gold and silver investors like me…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 1, 2025 -
స్టాక్ మార్కెట్పై కుటుంబాల ఆసక్తి
న్యూఢిల్లీ: దేశీయంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపట్ల కుటుంబాలలో ఆసక్తి కనిపిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన సర్వే పేర్కొంది. కుటుంబ ఆదాయాలలో 10 శాతం సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. కుటుంబీకులలో 63 శాతం కనీసం ఒక మార్కెట్ ప్రొడక్ట్పై అవగాహన ఉన్నట్లు సెబీ ఇన్వెస్టర్ల సర్వే వెల్లడించింది. సెక్యూరిటీలలో పట్టణ ప్రాంతాల నుంచి 15 శాతం పార్టిసిపేషన్ కనిపించగా.. గ్రామీణ ప్రాంతాలలో 6 శాతమే పెట్టుబడులు నమోదయ్యాయి. రాష్ట్రాలలో 20.7 శాతం వాటాతో ఢిల్లీ ఆధిపత్యంవహించగా.. 15.4 శాతం కుటుంబాల పార్టిసిపేషన్తో గుజరాత్ తదుపరి ర్యాంకులో నిలిచింది. అయితే 36 శాతంమంది ఇన్వెస్టర్లకు మాత్రమే సెక్యూరిటీ మార్కెట్లపట్ల ఓమాదిరి అవగాహన ఉన్నట్లు సర్వే తెలియజేసింది. దీంతో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ విస్తరించవలసిన అవసరం ఉన్నట్లు అభిప్రాయపడింది. పెట్టుబడి రక్షణకే ఓటు సెబీ తాజా సర్వే ప్రకారం 80 శాతం కుటుంబీకులు అధిక రిటర్నులకంటే పెట్టుబడి పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి వివిధ వయసులవారు రిస్క్ తీసుకోవడంలో విముఖత చూపుతున్నట్లు సర్వే తెలియజేసింది. నిజానికి జెన్జెడ్ కుటుంబీకులలోనూ 79 శాతంమంది రిస్్కలకు వెనకాడుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా ఫైనాన్షియల్ ప్రొడక్టులలో క్లిష్టత, అవగాహనాలేమి, విశ్వాసరాహిత్యం, నష్టాల భయం వంటి అంశాలు అధికశాతం మందిలో పెట్టుబడులకు అడ్డుతగులుతున్నట్లు వివరించింది. దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ)తోపాటు.. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ తదితర మార్కెట్ ఇన్ఫ్రా సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల సర్వే చేపట్టింది. సుమారు 400 పట్టణాలలోని 90,000 కుటుంబాలు, 1,000 గ్రామాలలో సర్వే నిర్వహించింది. -
స్టాక్ మార్కెట్లకు లాభాల కళ.. వీడిన వరుస నష్టాలు
దేశీయ స్టాక్మార్కెట్లను వరుస నష్టాలు వీడాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటును 5.5 శాతం వద్ద ఉంచుతూ 'తటస్థ' వైఖరిని కొనసాగించడంతో భారత ఈక్విటీలు ఎనిమిది రోజుల నష్టాల పరంపరను విచ్ఛిన్నం చేశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 715.7 పాయింట్లు లేదా 0.9 శాతం పెరిగి 80,983.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 0.92 శాతం లేదా 225.2 పాయింట్లు పెరిగి 24,836.3 స్థాయిలకు చేరుకుంది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.1 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.89 శాతం పెరిగాయి.నిఫ్టీ బ్యాంక్, ఆటో, రియల్టీ రంగాలు వరుసగా 1.3 శాతం, 0.85 శాతం, 1.1 శాతం పెరిగాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 0.37 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 4 శాతం వరకు పెరిగాయి.సెన్సెక్స్ లో టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్స్ గా ఉండగా, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ అధికంగా నష్టోయిన వాటిలో ఉన్నాయి. -
250 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు పెరిగి 24,691కు చేరింది. సెన్సెక్స్(Sensex) 251 పాయింట్లు పుంజుకొని 80,503 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం స్వల్ప లాభాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 97.32 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో.. 80,267.62 వద్ద, నిఫ్టీ 23.80 పాయింట్లు లేదా 0.097 శాతం నష్టంతో 24,611.10 వద్ద నిలిచాయి.ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, నకోడా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఉమియా బిల్డ్కాన్, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్, భారత్ గేర్స్, వండర్ ఎలక్ట్రికల్స్, మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా), కేపీఐటీ టెక్నాలజీస్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు పెరిగి 24,656కు చేరింది. సెన్సెక్స్(Sensex) 72 పాయింట్లు పుంజుకొని 80,443 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ను వీడని నష్టాలు
ముంబై: బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టంతో ముగిసింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశ ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. సెన్సెక్స్ 62 పాయింట్లు నష్టపోయి 80,365 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20 పాయింట్లు కోల్పోయి 24,635 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా ఏడో రోజూ నష్టాల ముగింపు.ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా లాభ, నష్టాల మధ్య ట్రేడవుతూ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,249 వద్ద కనిష్టాన్ని, 80,851 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 49 పాయింట్లు పతనమై 24,606 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆసియాలో జపాన్ మినహా అన్ని దేశాల మార్కెట్లు 1% వరకు పెరిగాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 0.33%, ఇండ్రస్టియల్స్ 0.32%, ఆటో 0.12%, క్యాపిటల్ గూడ్స్ 0.09 శాతం నష్టపోయాయి. మరోవైపు ఆయిల్అండ్గ్యాస్ 2%, ఇంధన 1.10%, రియల్టీ 1%, విద్యుత్ 0.46%, సర్విసెస్ 0.41%, మెటల్ 0.39% లాభపడ్డాయి. మిడ్ క్యాప్ ఇండెక్సు 0.34% పెరిగింది. స్మాల్ క్యాప్ సూచీ 0.17% నష్టపోయింది. ⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలహీనపడి 88.75 వద్ద స్థిరపడింది.⇒ అట్లాంటా ఎల్రక్టానిక్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర (రూ.754)తో పోలిస్తే బీఎస్ఈలో 14% ప్రీమియంతో రూ.858 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 14.50% పెరిగి రూ.864 గరిష్టాన్ని తాకింది. చివరికి 9% లాభంతో రూ.823 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.6,331 కోట్లుగా నమోదైంది. ⇒ గణేశ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.322)తో పోలిస్తే 8.38% డిస్కౌంటుతో రూ.295 వద్ద లిస్టయ్యింది. చివరికి 9% నష్టంతో రూ.294 వద్ద ముగిసింది. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 61.52 పాయింట్లు లేదా 0.076 శాతం నష్టంతో 80,364.94 వద్ద, నిఫ్టీ 19.80 పాయింట్లు లేదా 0.080 శాతం నష్టంతో.. 24,634.90 వద్ద నిలిచాయి.వాస్కాన్ ఇంజనీర్స్, వోకార్డ్, కొఠారి ప్రొడక్ట్స్, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. కృష్ణ ఫోస్చెమ్, గణేష్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, వండర్లా హాలిడేస్, కెంప్లాస్ట్ సన్మార్, డీసీఎక్స్ సిస్టమ్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
24,700 వద్దకు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 24,709కు చేరింది. సెన్సెక్స్(Sensex) 166 పాయింట్లు పుంజుకొని 80,589 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లో భారీగా పెరిగిన ఇన్వెస్టర్లు..
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 12 కోట్లను అధిగమించింది. గత 8 నెలల్లోనే కోటిమంది జత కలిసినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. కాగా.. ప్రతీ నలుగురిలో ఒకరు మహిళా ఇన్వెస్టర్ అని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్లను దాటింది.నిజానికి ఎన్ఎస్ఈ కార్యకలాపాలు ప్రారంభమైన 14ఏళ్ల తదుపరి ఇన్వెస్టర్ల సంఖ్య కోటికి చేరింది. తదుపరి కోటిమంది ఏడేళ్లలో జత కలవగా.. ఆపై మూడున్నరేళ్లలోనే ఈ సంఖ్యకు మరో కోటి జమయ్యింది. ఈ బాటలో ఆపై.. ఏడాదికి అటూఇటుగా మరో కోటిమంది జత కలిసినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. వెరసి ఎన్ఎస్ఈ ఆవిర్భవించిన 25ఏళ్లకు అంటే 2021 మార్చికల్లా ఇన్వెస్టర్ల (Stock market investors) సంఖ్య 4 కోట్ల మైలురాయిని తాకింది. ఆపై వేగం పెరిగి 6–7 నెలల్లోనే మరో కోటి మంది ఇన్వెస్టర్లు తోడయ్యారు.ఈ స్పీడుకు ప్రధానంగా డిజిటైజేషన్, ఫిన్టెక్ సేవల అందుబాటు, మధ్యతరగతి పెరగడం, ప్రభుత్వ పాలసీల మద్దతు సహకరించాయి. 2025 సెపె్టంబర్ 23కల్లా ఎన్ఎస్ఈలో రిజిస్టరైన ఇన్వెస్టర్ల సంఖ్య 23.5 కోట్లకు చేరింది. అన్ని రకాల క్లయింట్ రిజిస్ట్రేషన్లతో కలిపి ఈ సంఖ్యకాగా.. క్లయింట్లు ఒక సభ్యునికంటే అధికంగా కూడా రిజిస్టరయ్యేందుకు వీలుంది.రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లలో 12 కోట్లమంది సగటు వయసు 33 ఏళ్లుకాగా.. 1.9 కోట్లమంది ఇన్వెస్టర్లతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలుస్తోంది. 1.4 కోట్లమంది రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లరీత్యా ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకును పొందగా, 1.03 కోట్లతో గుజరాత్ తదుపరి స్థానాన్ని ఆక్రమించింది. -
స్టాక్ మార్కెట్లు క్రాష్.. సూచీల భారీ పతనం
రిటైల్ పెట్టుబడిదారులలో భయాందోళనల అమ్మకం, విదేశీ పెట్టుబడిదారుల విపరీత ఆఫ్ లోడ్లతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అక్టోబర్ 1 నుండి తమ దేశంలోకి ప్రవేశించే "ఏదైనా బ్రాండెడ్ లేదా పేటెంట్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి" పై 100 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో దలాల్ స్ట్రీట్ ‘బేరు’మన్నది.బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఈరోజు 733 పాయింట్లు లేదా 0.9 శాతం క్షీణించి 80,426.5 వద్ద ముగిసింది. ఇది ఇంట్రాడే ట్రేడ్ లో 80,332 కనిష్టాన్ని తాకింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 236 పాయింట్లు లేదా 0.95 శాతం క్షీణించి 24,655 వద్ద ముగిసింది. ఇది 24,629 వద్ద పడిపోయింది. దీంతో, ఈ బెంచ్ మార్క్ ఏడు వారాలలో అత్యంత చెత్త వారపు క్షీణతను నమోదు చేసింది.ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టెక్ ఎం, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 1 శాతం నుంచి 3.6 శాతం వరకు నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్లో ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ మాత్రమే లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.05 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.2 శాతం క్షీణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.3 శాతం, నిఫ్టీ ఫార్మా 2.2 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం నష్టపోయాయి. -
వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 94 పాయింట్లు నష్టపోయి 24,799కు చేరింది. సెన్సెక్స్(Sensex) 331 పాయింట్లు పడిపోయి 80,828 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అయిదో రోజూ అదే పతనం
ముంబై: హెచ్1–బీ ఫీజు పెంపు ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ మార్కెట్ అయిదో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్ 556 పాయింట్లు క్షీణించి 81,160 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 25 వేల స్థాయి దిగువన 24,891 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, డాలర్తో పోలిస్తే రూపాయి జీవితకాల కనిష్టానికి చేరుకోవడం అంశాలు మరింత ఒత్తిడి పెంచాయి. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ గడిచే కొద్దీ మరింత నష్టాలు చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 623 పాయింట్లు కోల్పోయి 81,093 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు నష్టపోయి 24,878 వద్ద కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో జపాన్ మినహా అన్ని దేశాల మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పతనమయ్యాయి. యూఎస్ స్టాక్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీగా ఇండెక్సుల్లో రియల్టీ 2%, విద్యుత్ 1.38%, ఐటీ 1.23%, యుటిలిటీస్ 1.21%, కన్జూమర్ డి్రస్కేషనరీ 1.41% పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.75%, మిడ్క్యాప్ ఇండెక్సు 0,72% నష్టపోయాయి. నష్టాల మార్కెట్లోనూ టెలికమ్యూనికేషన్, మెటల్ షేర్లు రాణించాయి. ⇒ కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్ల పెంపుతో దేశీయ ఐటీ కంపెనీల షేర్లు నాలుగోరోజూ డీలా పడ్డాయి. ఇన్ఫోబీన్స్ 2.64%, టీసీఎస్ 2.50%, హెక్సావేర్ టెక్ 2%, హెచ్సీఎల్ టెక్ 1.31%, విప్రో 1.06%, ఇన్ఫోసిస్ 0.64%, టెక్ మహీంద్రా 0.61% పతనయ్యాయి. ⇒ గడిచిన నాలుగు రోజుల్లో టెక్ మహీంద్రా షేరు 7% నష్టపోవడంతో రూ.10,729 కోట్ల మార్కెట్ క్యాప్ హరించుకుపోయింది. టీసీఎస్ (–6.6%) రూ.75,799 కోట్లు, విప్రో (–5.5%) రూ.14,799 కోట్లు, ఇన్ఫోసిస్(–3.6%) రూ.23,119 కోట్లు, హెచ్సీఎల్(–3%) రూ.11,940 కోట్ల మార్కెట్ విలువ కోల్పోయాయి. వెరసి ఈ 5 కంపెనీలకు 4 సెషన్లలో రూ.1.36 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ⇒ ఐవాల్యూ ఇన్ఫోసొల్యూషన్స్ షేరు లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.299)తో పోలిస్తే 4.68% డిస్కౌంటుతో రూ.285 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 8.34% క్షీణించి రూ.274 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టపోయి రూ.282 వద్ద నిలిచింది. -
స్టాక్ మార్కెట్లు వరుస పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం ఐదో రోజూ భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) ఇండెక్స్ 556 పాయింట్లు నష్టపోయి 81,160 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 24,891 వద్ద ముగిసింది.పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ట్రెంట్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, టైటాన్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్ 3 శాతం వరకు నష్టపోయాయి.నిఫ్టీ50 (Nifty) లో శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ స్టాక్లకూ నష్టాలు తప్పలేదు.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.64 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.57 శాతం క్షీణించాయి. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ వరుసగా రెండో రోజు 1.65 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా 0.9 శాతం క్షీణించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.22 శాతం పెరిగి లాభపడింది. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు పెరిగి 25,072కు చేరింది. సెన్సెక్స్(Sensex) 59 పాయింట్లు పుంజుకొని 81,775 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగో రోజూ పడిపోయిన సెన్సెక్స్
భారతీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా నాల్గవ రోజు అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ( Sensex) 386 పాయింట్లు లేదా 0.47 శాతం తగ్గి 81,716 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (Nifty50) సూచీ 113 పాయింట్లు లేదా 0.45 శాతం పడిపోయి 25,057 వద్ద స్థిరపడ్డాయి.టాటా మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), విప్రో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, టెక్ ఎం షేర్లు 1 శాతం నుంచి 2.6 శాతం వరకు పడిపోయాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.98 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం క్షీణించాయి. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 2.5 శాతం, నిఫ్టీ ఆటో ఇండెక్స్ (1.15 శాతం), నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ (0.8 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.18 శాతం పెరిగింది.ఇదీ చదవండి: క్లాసులకు వెళ్తున్న ఇషా అంబానీ.. టీచర్ ఏమన్నారంటే.. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు తగ్గి 25,065కు చేరింది. సెన్సెక్స్(Sensex) 331 పాయింట్లు నష్టపోయి 81,748 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 57.87 పాయింట్లు లేదా 0.070 శాతం నష్టంతో.. 82,102.10 వద్ద, నిఫ్టీ 32.85 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 25,169.50 వద్ద నిలిచాయి.ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, బనారస్ బీడ్స్, బ్రాండ్ కాన్సెప్ట్స్, రెఫెక్స్ ఇండస్ట్రీస్, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అదానీ టోటల్ గ్యాస్, హరియోమ్ పైప్ ఇండస్ట్రీస్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, షా మెటాకార్ప్, ఎల్టీ ఫుడ్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
25,150 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 37 పాయింట్లు తగ్గి 25,165కు చేరింది. సెన్సెక్స్(Sensex) 105 పాయింట్లు నష్టపోయి 82,051 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.29బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 66.15 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.14 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.44 శాతం పెరిగింది.నాస్డాక్ 0.7 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 466.26 పాయింట్లు లేదా 0.56 శాతం నష్టంతో.. 82,159.97 వద్ద, నిఫ్టీ 125.50 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో.. 25,201.55 వద్ద నిలిచాయి.ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓరెస్, కెరీర్ పాయింట్ ఎడ్యుటెక్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, డీఆర్సీ సిస్టమ్స్ ఇండియా, క్రిజాక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 11 పాయింట్లు తగ్గి 25,315కు చేరింది. సెన్సెక్స్(Sensex) 91 పాయింట్లు నష్టపోయి 82,837 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు వారం చివరి ట్రేడింగ్ సెషన్ను నష్టాలతో ముగించాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అధిక స్థాయిలో లాభాల బుకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకింగ్ వంటి కీలక రంగాలలో బలహీనత ఈ క్షీణతకు కారణం. బీఎస్ఈ సెన్సెక్స్ 387.73 పాయింట్లు లేదా 0.47 శాతం నష్టపోయి 82,626.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 96.55 పాయింట్లు లేదా 0.38 శాతం తగ్గి 25,327.05 వద్ద ముగిసింది.సెన్సెక్స్ కాంపోనెంట్ లలో, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీ ఎయిర్ టెల్, ఎన్టిపిసి, ఏషియన్ పెయింట్స్ 1.13 శాతం లాభాలను నమోదు చేశాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, టైటాన్ కంపెనీ, మహీంద్రా అండ్ మహీంద్రా 1.52 శాతం నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.04 శాతం, 0.15 శాతం స్వల్ప లాభాలతో ముగిశాయి. రంగాలపరంగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.28 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టీ మెటల్, ఫార్మా, రియల్టీ సూచీలు లాభాలు పొందాయి. ఎఫ్ఎంసిజి, ఐటి, ఆటో, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 0.65 శాతం వరకు క్షీణించాయి.మొత్తంగా మార్కెట్ విస్తృతి సానుకూలంగా ఉంది. ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన 3,133 స్టాక్స్ లో 1,601 లాభాలను అందుకోగా 1,427 క్షీణించాయి. 105 మారలేదు. శుక్రవారం సెషన్ ముగిసే సమయానికి, ఎన్ఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.24 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. -
Stock Market Updates: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గత రెండు రోజులుగా లాభాల్లో ఉన్న మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 58 పాయింట్లు తగ్గి 25,364కు చేరింది. సెన్సెక్స్(Sensex) 243 పాయింట్లు నష్టపోయి 82,773 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 320.25 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 83,013.96 వద్ద, నిఫ్టీ 90.75 పాయింట్లు లేదా 0.36 శాతం లాభంతో 25,421.00 వద్ద నిలిచాయి.టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, ఇంటెన్స్ టెక్నాలజీస్, దీపక్ బిల్డర్స్ & ఇంజనీర్స్ ఇండియా, షాలిమార్ పెయింట్స్, జీటీఎల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్, నాగరీకా ఎక్స్పోర్ట్స్, ఎక్స్ప్రో ఇండియా, బ్రాండ్ కాన్సెప్ట్స్, రుషిల్ డెకర్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
25,400 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:23 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు పెరిగి 25,407కు చేరింది. సెన్సెక్స్(Sensex) 288 పాయింట్లు పుంజుకొని 82,981 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 96.98బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.07 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.1 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.33 శాతం పడిపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బ్యాంక్, ఐటీ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరుతుందన్న ఆశాభావంతో భారత ఈక్విటీ సూచీలు సానుకూలంగా కదిలాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 313.02 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 82,693.71 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 91.15 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 25,330.25 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్), కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. దీనికి విరుద్ధంగా, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్ వెనుకబడి ఉన్నాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.08 శాతం, స్మాల్ క్యాప్ 0.68 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.61 శాతం, నిఫ్టీ ఐటీ 0.65 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ 0.5 శాతం నష్టపోయింది. -
25,300 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,307కు చేరింది. సెన్సెక్స్(Sensex) 212 పాయింట్లు పుంజుకొని 82,589 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రెండు నెలల గరిష్టానికి నిఫ్టీ
ముంబై: అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలం కావొచ్చనే ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతానికి పైగా లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి బలోపేతం, అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ సెంటిమెంట్ను మరింత బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 595 పాయింట్లు పెరిగి 82,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 170 పాయింట్లు బలపడి 25,239 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి సూచీలకి రెండు నెలల గరిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలు, పండుగ డిమాండ్ రికవరీపై ఆశలతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలమవ్వొచ్చనే ఆశలతో ఐటీ షేర్లు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 658 పాయింట్లు బలపడి 82,443 వద్ద, నిఫ్టీ 192 పాయింట్లు ఎగసి 25,261 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్కాంగ్ మినహా అన్ని దేశాల మార్కెట్లు 1% పెరిగాయి. యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.⇒ అధిక వెయిటేజీ ఎల్అండ్టీ(2%), కోటక్ మహీంద్రా(2.50%), మహీంద్రా (2.2%), మారుతీ (2%), టీసీఎస్ (1%) రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 352 పాయింట్లు కావడ విశేషం. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 594.95 పాయింట్లు లేదా 0.73 శాతం లాభంతో.. 82,380.69 వద్ద, నిఫ్టీ 169.90 పాయింట్లు లేదా 0.68 శాతం లాభంతో 25,239.10 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో.. కొఠారి ప్రొడక్షన్, రవీందర్ హైట్స్, రెడింగ్టన్, లక్ష్మీ డెంటల్, పావ్నా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు చేరాయి. శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ, మాగ్నమ్ వెంచర్స్, థెమిస్ మెడికేర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
82,000 మార్కు చేరిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు పెరిగి 25,128కు చేరింది. సెన్సెక్స్(Sensex) 216 పాయింట్లు పుంజుకుని 82,002 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఎటువంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు మందగించాయి. అయితే ఈ వారం చివర్లో రానున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై ట్రేడర్లు దృష్టి సారించారు. ముగింపులో బీఎస్ఈ సెన్సెక్స్ 118.96 పాయింట్లు లేదా 0.15 శాతం స్వల్పంగా తగ్గి 81,785.74 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 44.8 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టపోయి 25,069.2 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ ఇండెక్స్ లో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టైటాన్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్స్ లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ (జొమాటో), అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.అయితే, విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.44 శాతం, 0.76 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 2.41 శాతం పెరిగి టాప్ గెయినర్ గా ఉంది. ఫ్లిప్ సైడ్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.58 శాతం, నిఫ్టీ ఫార్మా 0.64 శాతం క్షీణించాయి. -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు తగ్గి 25,092కు చేరింది. సెన్సెక్స్(Sensex) 31 పాయింట్లు నష్టపోయి 81,869 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.63బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.38 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.45 శాతం పెరిగింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్వైపు ఇన్వెస్టర్ల చూపు
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపించగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. దీంతో ఫైనాన్షియల్ మార్కెట్లతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సైతం ఫెడ్ నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నాయి. మరోవైపు దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక టెక్నికల్ అంశాల ప్రకారం మార్కెట్లు ఈ వారం బ్రేకవుట్ సాధించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.దేశీయంగా నేడు(15న) ఆగస్ట్ నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. 2025 జూలైలో డబ్ల్యూపీఐ మైనస్ 0.45 శాతంగా నమోదైంది. అయితే గత నెలలో 0.45 శాతం పెరిగే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా ఆహారం, ఇంధనం, ఇతర కీలక విభాగాలలో ధరల పెరుగుదల కారణంకానున్నట్లు అంచనా వేశారు. కాగా.. గత వారాంతాన విడుదలైన వివరాల ప్రకారం ఆగస్ట్ నెలలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 2.07 శాతానికి చేరింది. జూలైలో 1.61 శాతం కాగా, గత నెలలో కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, నూనెలు, కొవ్వు ఉత్పత్తుల ధరలు పెరగడం ప్రభావం చూపింది. ఇవికాకుండా యూఎస్తో వాణిజ్య వివాదాలకు చెక్ పడటంపై సానుకూల సంకేతాలు వెలువడితే దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహం లభించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. కనీసం పావు శాతం ఫెడరల్ రిజర్వ్ చైర్పర్శన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన ఈ నెల 16 నుంచి ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) రెండు రోజులపాటు పాలసీ సమావేశాలు నిర్వహించనుంది. యూఎస్ ఉపాధి మార్కెట్ నీరసించిన నేపథ్యంలో 17న ఫెడరల్ ఫండ్స్(కీలక వడ్డీ) రేటులో కోత పెట్టనున్నట్లు అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. సీపీఐ జూలైలో 0.2 శాతంకాగా.. ఆగస్ట్లో 0.4 శాతానికి ఎగసింది. దీంతో వార్షిక ద్రవ్యోల్బణం 2.9 శాతంగా నమోదైంది. దీంతో ఈసారి పాలసీ సమావేశంలో ఉద్యోగ కల్పనకు దన్ను, ధరల తగ్గింపును ఫెడ్ కీలక లక్ష్యాలుగా ఎంచుకునే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. కనీసం పావు శాతం కోతకు వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేటు 4.25–4.5% గా ఉంది. ఈ నేపథ్యంలో అటు యూఎస్, ఆసియా మార్కెట్లతోపాటు దేశీయంగానూ ఫెడ్ వడ్డీ రేట్ల కోత బలమివ్వనున్నట్లు ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర అంశాలకూ ప్రాధాన్యం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. అయితే ఫెడ్ వడ్డీ కోత పెడితే దేశీ మార్కెట్లో పెట్టుబడులు పుంజుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత నెల(ఆగస్ట్)లో దేశీ స్టాక్స్ నుంచి ఎఫ్పీఐలు రూ. 34,900 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. జూలైలోనూ రూ. 17,700 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఈ నెలలో సైతం తొలి వారంలో రూ. 12,257 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించడం గమనార్హం! కాగా.. డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టాలకు చేరుతోంది. దీంతో అటు పసిడి, ఇటు ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. రూపాయి బలహీనతతో దిగుమతుల బిల్లు పెరిగి మరింత వాణిజ్య లోటుకు దారితీస్తున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. అయితే ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలతో వినియోగం ఊపందుకోనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. గత వారమిలా.. జీఎస్టీ సంస్కరణలు, భారత్, యూఎస్ మధ్య టరిఫ్ వివాద పరిష్కారంపై ఆశలతో గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,117 పాయింట్లు(1.4%) జంప్చేసి 81,905 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 314 పాయింట్లుపైగా(1.4%) ఎగసి 25,114 వద్ద స్థిరపడింది.బ్రేకవుట్కు చాన్స్యూఎస్, భారత్ మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో కోతపై అంచనాలు, జీఎస్టీ సంస్కరణలతో పలు రంగాలలో ఊపందుకోనున్న వినియోగం వంటి సానుకూల అంశాలు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్నిచ్చాయి. తాజా సానుకూలతల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లలో బ్రేకవుట్కు వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. కొద్దిరోజులుగా బీఎస్ఈ సెన్సెక్స్ 79,750–82,250 పాయింట్ల శ్రేణిలో కదులుతోంది. 82,250ను అధిగమిస్తే.. 83,500–83,650 పాయింట్లకు బలపడే వీలుంది. ఒకవేళ దిగువకు చేరితే.. 81,450–81,200 స్థాయిలో మద్దతు లభించవచ్చు. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ పుంజుకుంటే 25,250ను అధిగమించవలసి ఉంటుంది. ఆపై 25,500 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. బలహీనపడితే 24,900 వద్ద తొలుత, ఆపై 24,700 వద్ద తదుపరి మద్దతు అందుకునే వీలుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 347.80 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 81,896.52 వద్ద, నిఫ్టీ 102.35 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 25,107.85 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, థెమిస్ మెడికేర్, లంబోధర టెక్స్టైల్, నాగరీకా ఎక్స్పోర్ట్స్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం వంటి కంపెనీలు చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, అట్లాంటా, నీలా స్పేసెస్, కాన్పూర్ ప్లాస్టిప్యాక్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రూ. లక్ష.. కోటి రూపాయలైంది..!
స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎంత ఉంటుందో లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లను దివాళా తీయిస్తే మరికొన్ని మాత్రం కోటీశ్వరులను చేస్తాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ గత దశాబ్దంలో దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లకు భారీ రాబడిని తెచ్చిపెట్టింది.ఆ కంపెనీ షేర్లు 11,419% పెరిగాయి. 2015లో రూ .14 ఉన్న షేరు ధర 2025 సెప్టెంబర్ 10 నాటికి రూ .1,612.60 కు పెరిగింది. అంటే ఎంతలా పెరిగిందంటే రూ .1 లక్ష పెట్టుబడి పెట్టారనుకుంటే ఇప్పుడది రూ .1 కోటి కంటే ఎక్కువగా పెరిగిందన్న మాట. ఆ స్టాక్ ఏదో కాదు.. ఎంఈఐఎల్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ది. 2025 జూన్ 30 నాటికి ఈ కంపెనీలో ఎంఈఐఎల్ హోల్డింగ్స్ 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని తాజా షేర్ హోల్డింగ్ డేటా తెలిజేస్తోంది.ఒలెక్ట్రా గురించి.. గతంలో గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రాటెక్ అనే పేరుతో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్ తయారుదారు. ఈ సంస్థ 2000లో స్థాపితమైంది. ఇది ఎలక్ట్రిక్ బస్సులు, ఇన్సులేటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు దేశంలోని దాదాపు అన్ని మెట్రో, టైర్2, టైర్3 నగరాల్లో తిరుతున్నాయి. దేశ ఎలక్ట్రిక్ బస్ రంగంలో 25 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే.2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల విక్రయాలు రూ.1801.90 కోట్లుగా నమోదయ్యాయి. పన్నులు పోనూ రూ.139.21 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 161 బస్సులు డెలివరీ చేసింది. ఎలక్ట్రిక్ బస్ ఆర్డర్ బుక్ 10,193 యూనిట్లుగా ఉంది. 5,000 బస్సుల ప్రారంభ సామర్థ్యంతో (10,000 వరకు స్కేలబుల్) రాబోయే తయారీ కేంద్రం 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్తో కూడుకున్నది. ఇన్వెస్టర్లు అన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 25,054కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 పాయింట్లు పుంజుకుని 81,691 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.63బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.83 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.03 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.85 శాతం పెరిగింది.నాస్డాక్ 0.72 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 123.58 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 81,548.73 వద్ద, నిఫ్టీ 32.40 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,005.50 వద్ద నిలిచాయి.స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్, గ్రీన్ప్యానెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, మోహిత్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గుడ్ లక్ ఇండియా, ఆఫర్డబుల్ రోబోటిక్ & ఆటోమేషన్, రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, డైనమిక్ ప్రొడక్ట్స్(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒక్కరోజు 40 శాతంపైగా పెరిగిన స్టాక్.. కారణం..
ఒరాకిల్ స్టాక్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో ఏకంగా 40 శాతంపైగా పెరిగి రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ 10న మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్ క్రమంగా పెరుగుతూ 345.38 డాలర్లు(మునుపటి సెషన్తో పోలిస్తే 40 శాతంపైగా) పెరిగి ముగింపు సమయానికి 328.33(35.95 శాతం) డాలర్ల వద్ద స్థిరపడింది. ఒరాకిల్ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలకు తోడు ఇతర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, సంస్థ అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.స్టాక్ పెరుగుదల ప్రధాన కారణాలుక్లౌడ్ కంప్యూటింగ్లో ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారుతోంది. కంపెనీ ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్డ్యాన్స్.. వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దాంతో ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో 77% పెరిగి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇది 2030 నాటికి 144 బిలియన్ డాలర్ల మార్కునుతాకే అవకాశం ఉందని అంచనా.ఒరాకిల్ క్లౌడ్ సేవలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ఆదాయం 455 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ ఏఐ, ఎంటర్ప్రైజ్ పరిష్కారాలతో ముడిపడి ఉన్న భవిష్యత్తు వ్యాపారాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రాటజిక్ పొజిషనింగ్లో ఒరాకిల్ సొంత సర్వీసులు వాడుతోంది. దాని డేటా సెంటర్లను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కృత్రిమ మేధ కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చేక్రమంలో ఎన్విడియా జీపీయూలకు భద్రతను అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటి క్లౌడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీల సరసన ఒరాకిల్ ప్రత్యర్థిగా ఎదుగుతోంది.ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం! -
25,000 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 25,001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 113 పాయింట్లు పుంజుకుని 81,528 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు బుధవారం సానుకూల నోట్లో ముగిశాయి. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్స్ లో ర్యాలీతో లాభాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 323.83 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 81,425.15 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 104.50 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 24,973.10 వద్ద ముగిసింది.భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 4.50 శాతం లాభపడ్డాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్ షేర్లు 2.46 శాతం వరకు పడిపోయాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.83 శాతం, 0.73 శాతం లాభంతో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, పీఎస్యూ బ్యాంక్ సూచీలు వరుసగా 2.63 శాతం, 2.09 శాతం లాభంతో స్థిరపడ్డాయి. ఎంఆర్ఎఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్ కంపెనీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.28 శాతం నష్టంతో స్థిరపడింది.మార్కెట్ విస్తృతి సానుకూలంగా ఉంది. ఎందుకంటే ఎన్ఎస్ఈలో 3,128 ట్రేడెడ్ స్టాక్స్ లో 1,835 గ్రీన్లో ముగిశాయి. 1,210 రెడ్లో ముగిశాయి. మరోవైపు 83 షేర్లలో మార్పులేదు. ఎన్ఎస్ఈలో లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.14 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. -
320 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:19 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు పెరిగి 24,976కు చేరింది. సెన్సెక్స్(Sensex) 327 పాయింట్లు పుంజుకుని 81,436 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలతో...
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలతో ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు పెరిగి 81,101 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 24,869 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరమైన లాభాలతో ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 81,181 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు 24,892 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీతో పాటు ఫార్మా, టెక్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.22%, 0.20 శాతం చొప్పున పెరిగాయి. ఆయిల్అండ్గ్యాస్, రియల్టి, ఇంధన, కన్జూమర్ డి్రస్కేషనరీ, ఆటో, విద్యుత్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, ఇండోనేసియా స్టాక్ సూచీలు 0.50%–2% నష్టపోయాయి. జపాన్ నికాయ్ తొలిసారి 44,000 స్థాయిని అధిగమించి 44,186 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. తదుపరి లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 0.42% నష్టపోయి 43,459 వద్ద స్థిరపడింది. హాంకాంగ్, కొరియా, థాయ్లాండ్ స్టాక్ సూచీలు 1.50% వరకు పెరిగాయి. యూరప్లో జర్మనీ డాక్స్ ఇండెక్స్ 0.50% నష్టపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 0.25% పెరిగాయి. అమెరికా సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు 5% పెరిగి రూ.1,505 వద్ద స్థిరపడింది. డైరెక్టర్ల బోర్డు ఈ నెల 11న సమావేశమై ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలిస్తుందని తెలపడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 5.18% లాభపడి రూ.1,507 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.29,967 కోట్లు పెరిగి రూ.6.25 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. -
ఇన్ఫోసిస్ షేర్ల దూకుడు.. దూసుకెళ్లిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెప్టెంబర్ 11 న జరగనున్న బోర్డు సమావేశంలో షేర్ బైబ్యాక్ ను పరిశీలిస్తామని ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ ప్రకటించిన తరువాత బెంచ్ మార్క్ సూచీలు స్థిరమైన లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రోజంతా సానుకూల ధోరణిని ప్రదర్శించింది. 314 పాయింట్లు లేదా 0.4 శాతం పెరిగి 81,101 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 24,869 స్థాయికి చేరుకుంది.సెన్సెక్స్ 30 షేర్లలో ఇన్ఫోసిస్ టాప్ గెయినర్ గా ఉంది. ఒక్కో 5 శాతం పెరిగి రూ.1,504 లను తాకింది. ఈ స్టాక్ ఒక్కటే బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ కు 217 పాయింట్ల లాభానికి దోహదపడింది. అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్ 1 నుంచి 3 శాతం వరకు లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్ 1-2 శాతం నష్టపోయాయి.విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం పెరిగాయి. రంగాలవారీగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.7 శాతం ఘన లాభంతో స్థిరపడటంతో కీలకమైన అవుట్ పెర్ఫార్మర్ గా నిలిచింది. మంగళవారం ట్రేడింగ్ లో ఇండియా వోలాటిలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) 1.8 శాతం క్షీణించింది. -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 281.70 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 81,068.99 వద్ద, నిఫ్టీ 76.40 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 24,849.55 వద్ద ముందుకు సాగుతున్నాయి.సెంచరీ ఎక్స్ట్రూషన్స్, SAL స్టీల్, షా అల్లాయ్స్, ప్రెసిషన్ కామ్షాఫ్ట్స్, మహాలక్ష్మి ఫాబ్రిక్ మిల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. MIC ఎలక్ట్రానిక్స్, సురానా టెలికాం అండ్ పవర్, డీపీ వైర్స్, మోస్చిప్ టెక్నాలజీస్, స్పేస్నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్మార్కెట్.. దూసుకెళ్లిన టాటా మోటర్స్ షేర్లు
బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు సెషన్ ముగిసే సమయానికి లాభాలు కొంత తగ్గినప్పటికీ సోమవారం సానుకూలంగానే ముగిశాయి. ఇంట్రాడేలో 81,171.38 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం సెషన్లో 76.54 పాయింట్లు (0.09 శాతం) పెరిగి 80,787.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 32.15 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 24,773.15 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్ లో సూచీ 24,885.50 నుంచి 24,751.55 మధ్య కదలాడింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.50 శాతం, 0.16 శాతం లాభాలతో ముగిశాయి. భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, మదర్సన్ సుమి, టాటా మోటార్స్ నేతృత్వంలో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 3.30 శాతం లాభాలతో స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ ఐటీ 0.94 శాతం నష్టపోయింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్ టిఐ, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్ గా నిలిచాయి.ఎన్ఎస్ఈలో ట్రేడైన 3,144 షేర్లలో 1,749 షేర్లు లాభాల్లో ముగియగా, 1,285 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 110 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మొత్తం 114 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 50 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.07 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 35 పాయింట్లు పెరిగి 24,776కు చేరింది. సెన్సెక్స్(Sensex) 136 పాయింట్లు పుంజుకుని 80,857 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.86 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.09 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.32 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.03 శాతం క్షీణించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒక్కరోజుకే ఆవిరైన జీఎస్టీ జోష్: తలకిందులైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను పొందాయి. సెన్సెక్స్ 7.25 పాయింట్లు లేదా 0.0090 శాతం నష్టంతో.. 80,710.76 వద్ద, నిఫ్టీ 6.70 పాయింట్లు లేదా 0.027 శాతం లాభంతో 24,741.00 వద్ద నిలిచాయి.నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా, జేఐటీఎఫ్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, బరాక్ వల్లీ సిమెంట్స్, పీవీపీ వెంచర్స్, ఎస్ఏఎల్ స్టీల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, ఎఫ్ఐఈఎమ్ ఇండస్ట్రీస్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 95 పాయింట్లు పెరిగి 24,831కు చేరింది. సెన్సెక్స్(Sensex) 304 పాయింట్లు పుంజుకుని 81,023 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్స్లో పెట్టుబడి పేరుతో రూ.5.25 కోట్ల మోసం
విశాఖపట్నం: స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకానగర్కు చెందిన ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.5.25 కోట్లు దోచుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పోగొట్టుకున్న డబ్బులో రూ.27 లక్షలను బాధితుడు రాజస్థాన్లో ఉదయ్పూర్కి చెందిన వ్యక్తి ఐడీఎఫ్సీ బ్యాంక్ ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశారు. ఆ డబ్బు పలు ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. వీటిలో కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన పాసుల వేణు, మామిడిపల్లి విజయ్ ఖాతాలు ఉన్నట్లు తేల్చారు.దీనితో ఒక ప్రత్యేక పోలీసు బృందం కరీంనగర్కు వెళ్లి విచారణ చేపట్టింది. వేణు బ్యాంక్ ఖాతా ద్వారా జగిత్యాలకు చెందిన దుర్గం గోపీకృష్ణ సైబర్ నేరగాళ్లకు డబ్బు పంపుతున్నట్లు తేలింది. అక్రమ లావాదేవీల్లో అమెరికా డాలర్, క్రిప్టో కరెన్సీలను కూడా వినియోగించడం గమనార్హం. ఈ ఘటనలో వేణు, గోపీకృష్ణలతోపాటు నర్మెట్ట జీవ అనే మరో సైబర్ నేరస్తుడు అరెస్ట్ అయ్యాడు. -
జీఎస్టీ జోష్.. మరింత లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల గడువు ముగియడంతో భారత బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ప్రారంభ లాభాలను అందుకున్నాయి. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక రోజు ముందు ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలను ఇన్వెస్టర్లు హర్షించడంతో ఆటో, ఎఫ్ఎంసీజీ వంటి వినియోగ ఆధారిత రంగాల బలం మద్దతుతో మరింత లాభాల్లో ముగిశాయి.పన్ను వ్యవస్థను రెండు శ్లాబులుగా (5 శాతం, 18 శాతం) క్రమబద్ధీకరించాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో నిత్యావసర వస్తువులపై రేట్లు తగ్గుతాయని, అదే సమయంలో విలాస వస్తువులపై అధిక సుంకాలు ఉంటాయని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 888.96 పాయింట్లు లేదా 1.03 శాతం పెరిగి 81,456.67 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది, ఆ తర్వాత 150.30 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 80,718.01 వద్ద స్థిరపడింది.అలాగే నిఫ్టీ 50 1.07 శాతం లేదా 265.7 పాయింట్లు పెరిగి 24,980.75 స్థాయిల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది, తరువాత 19.25 పాయింట్లు లేదా 0.08 శాతం పెరిగి 24,734.30 స్థాయిల వద్ద ముగిసింది.బీఎస్ఈలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్గా నిలవగా, మారుతీ సుజుకీ, బీఈఎల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ టాప్ గెయినర్స్గా నిలవగా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జ్యూమర్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్గా నిలిచాయి.విస్తృత సూచీలు ట్రెండ్ ను తారుమారు చేస్తూ పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.67 శాతం నష్టపోగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.71 శాతం నష్టపోయింది.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో (0.85 శాతం), ఎఫ్ఎంసీజీ (0.24 శాతం) టాప్ గెయినర్స్గా నిలిచాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 1.11 శాతం, ఐటీ 0.94 శాతం, మీడియా 0.78 శాతం నష్టపోయాయి. -
550 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు పెరిగి 24,869కు చేరింది. సెన్సెక్స్(Sensex) 554 పాయింట్లు పుంజుకుని 81,123 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.22బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.21 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.22 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.51 శాతం పెరిగింది.నాస్డాక్ 1.03 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లొ ముగిసిన స్టాక్ మార్కెట్లు
మెటల్, ఫార్మా షేర్ల లాభాల మద్దతుతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. పరోక్ష పన్నుల వ్యవస్థను హేతుబద్ధీకరించడంపై చర్చించే రెండు రోజుల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కూడా పుంజుకుంది.బీఎస్ఈ సెన్సెక్స్ 409.83 పాయింట్లు లేదా 0.51 శాతం లాభపడి 80,567.71 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 134.45 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 24,715.05 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో టాటా స్టీల్, టైటాన్, ఎంఅండ్ఎం షేర్లు లాభపడగా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్గా నిలవగా, ఇన్ఫోసిస్, నెస్లే, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా లాభాలలోనే ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.69 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.89 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మెటల్ 3.11 శాతం లాభపడగా, ఫార్మా 1.10 శాతం, పీఎస్యూ బ్యాంక్ 1.03 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ 0.74 శాతం, మీడియా 0.04 శాతం చొప్పున నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు పెరిగి 24,593కు చేరింది. సెన్సెక్స్(Sensex) 61 పాయింట్లు పుంజుకుని 80,215 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నుంచి లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 206.61 పాయింట్లు లేదా 0.26 శాతం నష్టంతో 80,157.88 వద్ద.. నిఫ్టీ 45.45 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో.. 24,579.60 వద్ద నిలిచాయి.కౌసల్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాజశ్రీ షుగర్స్ అండ్ కెమికల్స్, కొతారి షుగర్స్ & కెమికల్స్ లిమిటెడ్, వన్ మొబిక్విక్ సిస్టమ్స్, విమ్టా ల్యాబ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), జువారీ ఆగ్రో కెమికల్స్, బీఎస్ఎల్, ఎల్జీ రబ్బరు కంపెనీ, లుమాక్స్ ఆటోమొబైల్ కంపెనీ వంటివి నష్టాలను పొందాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 24,678కు చేరింది. సెన్సెక్స్(Sensex) 198 పాయింట్లు పుంజుకుని 80,566 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 68.44 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.64 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.15 శాతం పడిపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 554.84 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 80,364.49 వద్ద, నిఫ్టీ 198.20 పాయింట్లు లేదా 0.81 శాతం పెరిగి 24,625.05 వద్ద నిలిచాయి.శ్యామ్ సెంచరీ ఫెర్రస్, జిందాల్ పాలీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, బీఎస్ఎల్, అట్లాంటా, ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పావ్నా ఇండస్ట్రీస్, రాయల్ ఆర్చిడ్ హోటల్స్, ట్రెఝరా సొల్యూషన్స్ లిమిటెడ్, విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా, స్టెర్లైట్ టెక్నాలజీస్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
395 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 114 పాయింట్లు పెరిగి 24,541కు చేరింది. సెన్సెక్స్(Sensex) 395 పాయింట్లు పుంజుకుని 80,201 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock market: సెప్టెంబర్లో సెలవులున్నాయా? ట్రేడింగ్ ఆగుతుందా?
వినాయక చవితితో ఆగస్టు నెలాఖరులో ప్రారంభమైన పండుగ సీజన్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు తదుపరి స్టాక్ మార్కెట్ సెలవుల గురించి ఆలోచిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఏమైనా సెలవులు ఉన్నాయా.. ఎన్ని రోజులు ట్రేడింగ్ అందుబాటులో ఉంటుంది? అన్న సందేహాలుంటే ఈ కథనంలో తెలుసుకోండి.గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్టు 27 బుధవారం స్టాక్ మార్కెట్కు సెలవు వచ్చింది. తదుపరి మార్కెట్ సెలవు సెప్టెంబర్ లో కాకుండా అక్టోబర్ లో వస్తుందని ఇన్వెస్టర్లు గమనించాలి. అయితే, రెగ్యులర్ వారాంతపు సెలవులను పరిగణనలోకి తీసుకుంటే, సెప్టెంబర్ నెలలో ఎనిమిది రోజులు భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అందుబాటులో ఉండదు. వారాంతాలు మినహా అక్టోబర్ లో మూడు రోజుల పాటు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రెండు స్టాక్ ఎక్స్ఛేంజ్లు ట్రేడింగ్ కు మూతపడతాయని ఇన్వెస్టర్లు గమనించాలి. దసరా, దీపావళి, బలిప్రతిపాద వంటి పండుగ రోజులతో పాటు గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతీయ సెలవు దినాలను ఈ సెలవుల్లో చూడవచ్చు.రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు2025లో మిగిలిన ఏడాది స్టాక్ మార్కెట్ సెలవులు ఎప్పుడున్నాయి.. ఏ రోజుల్లో ట్రేడింగ్ ఉండదో ఇక్కడ చూడండి..అక్టోబర్ 2 గురువారం గాంధీ జయంతిఅక్టోబర్ 21 మంగళవారం దీపావళిఅక్టోబర్ 22 బుధవారం బలిప్రతిపాదనవంబర్ 5 బుధవారం ప్రకాశ్ గురుపురబ్ గురునానక్ దేవ్డిసెంబర్ 25 గురువారం క్రిస్మస్ఇదీ చదవండి: హైదరాబాద్లో సెబీ ప్రత్యేక కార్యక్రమం -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 270.92 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 79,809.65 వద్ద, నిఫ్టీ 74.05 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో 24,426.85 వద్ద నిలిచాయి.జిందాల్ ఫోటో, జిందాల్ పాలీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, కృతికా వైర్స్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, ఎల్జీ రబ్బరు వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. స్టీల్కాస్ట్, జీఎస్ఎస్ ఇన్ఫోటెక్, పనామా పెట్రోకెమ్, బాలకృష్ణ పేపర్ మిల్స్, విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు పెరిగి 24,539కు చేరింది. సెన్సెక్స్(Sensex) 136 ప్లాయింట్లు పుంజుకుని 80,202 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొనసాగిన టారిఫ్ టెన్షన్
ముంబై: అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి రావడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ దాదాపు ఒకశాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండడం సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. సెన్సెక్స్ 706 పాయింట్లు నష్టపోయి 80,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 211 పాయింట్లు కోల్పోయి 24,501 వద్ద ముగిశాయి. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. బలహీనంగా మొదలైన సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. వినిమయ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.ఒక దశలో సెన్సెక్స్ 774 పాయింట్లు క్షీణించి 80,013 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 24,482 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలహీనపడి 87.58 వద్ద స్థిరపడింది. టారిఫ్ సంబంధిత అనిశ్చితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.⇒ సూచీల పతనంతో రెండు రోజుల్లో రూ.9.69 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.445.17 లక్షల కోట్లకు దిగివచి్చంది. గురువారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది. ⇒ ట్రాన్స్ఫార్మర్ ఉపకరణాల తయారీ సంస్థ మంగళ్ ఎల్రక్టానిక్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.561)తో పోలిస్తే బీఎస్ఈలో అరశాతం డిస్కౌంట్ రూ.558 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 6% క్షీణించింది, చివరికి 4.50% నష్టంతో రూ. 534 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,475.31 కోట్లుగా నమోదైంది. -
సుంకాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ల పతనం
బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా ఎగుమతులపై 50 శాతం సుంకాల ప్రభావంతో భారత స్టాక్స్ నష్టాల్లో గురువారం ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 705.97 పాయింట్లు (0.87 శాతం) క్షీణించి 80,080.57 వద్ద, నిఫ్టీ 50 211.15 పాయింట్లు లేదా 0.85 శాతం క్షీణించి 24,500.9 వద్ద స్థిరపడ్డాయి.బీఎస్ఈలో హెచ్సీఎల్టెక్, టీసీఎస్, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలవగా, టైటాన్, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 1.27 శాతం, 1.45 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్ సూచీలు 1 శాతానికి పైగా క్షీణించాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
సోమవారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మంగళవారం నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 335.84 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 81,300.06 వద్ద, నిఫ్టీ 108.75 పాయింట్లు లేదా 0.44 శాతం నష్టంతో.. 24,859.00 వద్ద ముందుకు సాగుతున్నాయి.రెలియబుల్ డేటా సర్వీస్, ప్రోటీన్ ఈగోవ్ టెక్నాలజీస్, శ్రీ రామ మల్టీ టెక్, అక్షర్ స్పింటెక్స్ లిమిటెడ్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీ దిగ్విజయ్ సిమెంట్, ఇండోవిండ్ ఎనర్జీ, హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్, సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, శ్రీయోస్వాల్ సీడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 329.05 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 81,635.91 వద్ద, నిఫ్టీ 97.65 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,967.75 వద్ద నిలిచాయి.రెలియబుల్ డేటా సర్వీసెస్, ఇమామి పేపర్ మిల్స్, శ్రీ రామ మల్టీ టెక్, జేకే పేపర్, వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలువగా.. ఆరోన్ ఇండస్ట్రీస్, ఆఫర్డబుల్ రోబోటిక్ & ఆటోమేషన్, వండర్ ఎలక్ట్రికల్, డీపీ వైర్స్, ఆస్ట్రాన్ పేపర్ బోర్డ్ మిల్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
250 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు పెరిగి 24,946కు చేరింది. సెన్సెక్స్(Sensex) 254 పాయింట్లు ఎగబాకి 81,563 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 693.86 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 81,306.85 వద్ద, నిఫ్టీ 213.65 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 24,870.10 వద్ద నిలిచాయి.కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం, చెంబాండ్ కెమికల్స్ లిమిటెడ్, ఏజెడ్ఎమ్ఓ లిమిటెడ్, ఫోసెకో ఇండియా, అపోలో మైక్రో సిస్టమ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, వండర్ ఎలక్ట్రికల్స్, ఫోర్స్ మోటార్స్, వింటా ల్యాబ్స్, డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
250 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు తగ్గి 25,003కు చేరింది. సెన్సెక్స్(Sensex) 255 ప్లాయింట్లు దిగజారి 81,747 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 142.87 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో.. 82,000.71 వద్ద, నిఫ్టీ 33.20 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,083.75 వద్ద నిలిచాయి.ఇజ్మో లిమిటెడ్, డీపీ వైర్స్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, NAVA, బీఎఫ్ యుటిలిటీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. యూవై ఫిన్కార్ప్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హింద్ రెక్టిఫైయర్స్, బీఎస్ఈ లిమిటెడ్, మాస్టర్ ట్రస్ట్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుసగా ఐదు సెషన్ల నుంచి మార్కెట్లో లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గడిచిన ఐదు సెషన్ల నుంచి మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,079కు చేరింది. సెన్సెక్స్(Sensex) 129 ప్లాయింట్లు పుంజుకుని 81,991 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐదో రోజూ అదే జోరు
ముంబై: ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించడంతో స్టాక్ సూచీలు ఐదో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 213 పాయింట్లు పెరిగి 81,858 వద్ద నిలిచింది. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 25,051 వద్ద స్థిరపడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 341 పాయింట్లు పెరిగి 81,985 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 25,089 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో ఐటీ 3%, టెక్ 2.22%, ఎఫ్ఎంసీజీ 1.36%, రియల్టి, టెలికమ్యూనికేషన్ 0.68% రాణించాయి. మిడ్, స్మా ల్ క్యాప్ సూచీలు 0.39%, 0.30% పెరిగాయి. బ్యాంకులు, చమురు, ఫైనాన్స్ సర్విసెస్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ⇒ ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. రియల్ మనీ గేమింగ్ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధం లేదంటూ కంపెనీ వివరణ ఇచ్చినప్పట్టకీ.., నజరా టెక్నాలజీస్ షేరు 13% పతనమై రూ.1,222 వద్ద స్థిరపడింది. ఆన్మొబైల్ గ్లోబల్స్ షేరు 3.53% నష్టపోయి రూ.53.27 వద్ద నిలిచింది. ⇒ రీగల్ రిసోర్సెస్ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.102)తో పోలిస్తే 39% ప్రీమియంతో రూ.142 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 43% ఎగసి రూ.146 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29% లాభంతో రూ.132 వద్ద ముగిసింది. కంపెనీ మార్కె ట్ విలువ రూ.1,352 కోట్లుగా నమోదైంది. -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. నిఫ్టీ మళ్లీ 25000 మార్క్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు నెల రోజుల విరామం తర్వాత 25,000 మార్కును తిరిగి పొందగలిగింది. ఈ సూచీ చివరిసారిగా జూలై 24న 25,000 మార్క్ పైన ముగిసింది. నేడు ఐటీ షేర్లలో బలమైన లాభాలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి 25,089కు ఎగబాకి, చివరకు 70 పాయింట్లు లేదా 0.3 శాతం లాభంతో 25,050 స్థాయిల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలోనే నిఫ్టీ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో 563 పాయింట్లు లాభపడింది.బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్లు (0.3 శాతం) లాభపడి 81,858 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ దాదాపు 4 శాతం లాభపడి రూ.1,495 స్థాయికి చేరుకోగా, ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే 165 పాయింట్లు లాభపడింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కూడా 1-3 శాతం మధ్య లాభాల్లో ముగిశాయి. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటివరకు దీర్ఘకాలంగా పనితీరు కనబరచకపోవడంతో విలువ కొనుగోళ్లు లాభపడటానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.బీఎస్ఈ సెన్సెక్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) 2 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ కూడా 1 శాతానికి పైగా క్షీణించాయి. విస్తృత సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్క్యాప్ 0.3 శాతం పెరిగాయి.రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2.6 శాతం, రియల్టీ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 1,718 షేర్లు క్షీణించగా, 2,347 షేర్లు లాభపడ్డాయి. అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ)ను నిషేధించే ముసాయిదా బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించడంతో వ్యక్తిగత షేర్లలో నజారా టెక్నాలజీస్ 13 శాతం నష్టపోయింది. -
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గత రెండు రోజులుగా పుంజుకున్న మార్కెట్లు ఈ రోజు నష్టపోయాయి. ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 24,933కు చేరింది. సెన్సెక్స్(Sensex) 130 ప్లాయింట్లు నష్టపోయి 81,510 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగోరోజూ రయ్..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో జీఎస్టీ సంస్కరణల ఆశావహ దృక్పథం కొనసాగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా బెంచ్మార్క్ సూచీలు నాలుగోరోజూ లాభాలు గడించాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ (3%), టాటా మోటార్స్ (3.5%), ఎయిర్టెల్ (2.75%) షేర్లు రాణించి సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 371 పాయింట్లు పెరిగి 81,644 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు బలపడి 24,980 వద్ద నిలిచింది. ⇒ బ్లూస్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్స్టైల్ షేరు లిస్టింగ్లో గట్టెక్కింది. ఇష్యూ ధర (రూ.517)తో పోలిస్తే బీఎస్ఈలో 1.58% డిస్కౌంట్తో రూ.509 వద్ద లిస్టయ్యింది. అయితే ఇంట్రాడేలో 9% ఎగసి రూ.564 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 6% లాభంతో రూ.546 వద్ద ముగిసింది.⇒ ట్రంప్ టారిఫ్ విధింపుతో టెక్స్టైల్ రంగంలో వచ్చే నష్టాలు భర్తీ చేసేందుకు కేంద్రం పత్తి దిగుమతులపై ఉన్న 11% కస్టమ్స్ డ్యూటీని తాత్కలింగా తొలగించింది. దీంతో టెక్స్టైల్ షేర్లు వర్ధమాన్ టెక్స్టైల్స్ 9%, రేమాండ్ లైఫ్స్టైల్ 8%, వెల్స్పన్ లివింగ్ 6%, అరవింద్ లిమిటెడ్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ 3% లాభపడ్డాయి.⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 87.13 వద్ద ముగిసింది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 370.64 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 81,644.39 వద్ద, నిఫ్టీ 103.70 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 24,980.65 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్ఎల్ఈ గ్లాస్కోట్, కేఐఓసీఎల్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, వర్ధమాన్ పాలిటెక్స్, భారత్ గేర్స్ వంటి కంపెనీలు చేరాయి. నిట్కో, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్డిజి టెక్, రెలియబుల్ డేటా సర్వీసెస్, SP అప్పారల్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 24,905కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 ప్లాయింట్లు పుంజుకుని 81,417 వద్ద ట్రేడవుతోంది.రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 676.09 పాయింట్లు లేదా 0.84 శాతం లాభంతో 81,273.75 వద్ద, నిఫ్టీ 245.65 పాయింట్లు లేదా 1.00 శాతం లాభంతో 24,876.95 వద్ద నిలిచాయి.పెన్నార్ ఇండస్ట్రీస్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, IFB ఇండస్ట్రీస్, సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, రవీందర్ హైట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీతి ఇంటర్నేషనల్, అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్, NDL వెంచర్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
-
1,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 339 పాయింట్లు పెరిగి 24,941కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1037 ప్లాయింట్లు పుంజుకుని 81,635 వద్ద ట్రేడవుతోంది.రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జీఎస్టీ సంస్కరణలే దిక్సూచి
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీపావళికల్లా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో భారీ సంస్కరణలకు తెరతీయనున్నట్లు ప్రకటించడం దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోపక్క గత వారం ఎస్అండ్పీ రెండు దశాబ్దాల తదుపరి దేశ సావరిన్ రేటింగ్ను అప్గ్రేడ్ చేయడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే ఉక్రెయిన్, తదితర అంశాలపై ట్రంప్, పుతిన్ సమావేశం ఎటూ తేల్చకపోవడంతో అంతర్లీనంగా అనిశ్చితి సైతం కనిపించనున్నట్లు విశ్లేషించారు. వివరాలు చూద్దాం... రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ పేర్కొనడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు. దీంతో స్టాక్ మార్కెట్లో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. సరైన సమయంలో జీఎస్టీ 2.0కు తెరతీయనుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభించనున్నట్లు ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచవ్యాప్త వాణిజ్య ఆందోళనల మధ్య ఇవి కేవలం విధానపరమైన మార్పులు కాదని, అత్యంత ఆవశ్యకమైన నిర్మాణాత్మక సంస్కరణలని పేర్కొన్నారు. జీఎస్టీలో సంస్కరణల కారణంగా వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు పరిష్కారంకావడంతోపాటు.. పోటీ ప్రపంచంలో ఎగుమతులకు దన్ను లభించనున్నట్లు వివరించారు. జెలెన్స్కీతో ట్రంప్ భేటీ కీలకం..కొన్ని నెలలుగా రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో గత వారాంతాన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ సమావేశమైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. అయితే సమావేశ వివరాలు వెల్లడికానప్పటికీ.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ట్రంప్ భేటీపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై 25 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. అయితే ముందు ప్రకటించినట్లు ఈ నెల 27నుంచి కొత్త టారిఫ్లు అమలుకాకపోవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లలో సానుకూలతకు దోహదపడే వీలున్నట్లు అంచనా వేశారు. ఫెడ్ మినిట్స్ ఈ వారం యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెల్లడికానున్నాయి. ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకే ఫెడ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోపక్క చైనా కేంద్ర బ్యాంకు 1–5 ఏళ్ల కాలావధి రుణాలపై వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఇవికాకుండా యూఎస్ హౌసింగ్ గణాంకాలు తదితరాలు వెలువడనున్నాయి. దేశీయంగా హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసుల పీఎంఐ ఇండెక్స్లను ప్రకటించనున్నారు. వీటితోపాటు.. దేశీ స్టాక్స్లో విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరు మారకం, ముడిచమురు ధరలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. వెరసి కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న మార్కెట్లు ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.రేటింగ్ ఎఫెక్ట్ గత వారం రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ సుమారు 18 ఏళ్ల తరువాత దేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను అప్గ్రేడ్ చేసింది. స్థిరత్వంతోకూడిన ఔట్లుక్తో బీబీబీ రేటింగ్ను ప్రకటించింది. పటిష్ట ఆర్థిక పురోభివృద్ధి, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వ కట్టుబాటు, ద్రవ్యోల్బణ అదుపునకు ఆర్బీఐ అనుసరిస్తున్న సానుకూల పరపతి విధానాలు ఇందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు ఎస్అండ్పీ వివరించింది. వెరసి ఇన్వెస్టర్లకు జోష్ లభించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు.గత వారమిలా.. నాలుగు రోజులకే పరిమితమైన గత వారం(11–14) ట్రేడింగ్లో ఎట్టకేలకు 6 వారాల వరుస నష్టాలకు చెక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740 పాయింట్లు(0.9 శాతం) పుంజుకుని 80,598 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 268 పాయింట్లు(1.1 శాతం) ఎగసి 24,631 వద్ద ముగిసింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ 0.6 శాతం చొప్పున క్షీణించాయి.సాంకేతికంగా చూస్తే.. ఆరు వారాల తదుపరి మార్కెట్లు గత వారం సానుకూలంగా ముగిసినప్పటికీ నష్టాల నుంచి బయటపడిన సంకేతాలు పూర్తిగా వెలువడనట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా మరో రెండు వారాలు కన్సాలిడేషన్ కొనసాగవచ్చని అంచనా వేశారు. వీరి విశ్లేషణ ప్రకారం ఈ వారం మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి సాంకేతికంగా తొలుత 24,450 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభించవచ్చు. ఇలాకాకుండా 24,700ను దాటి బలపడితే.. 24,800 వద్ద, 25,000 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. అమ్మకాలు అధికమై 24,450 దిగువకు చేరితే 24,000 సమీపానికి చేరే అవకాశముంది.ఎఫ్పీఐల అమ్మకాల స్పీడ్ఈ నెలలో రూ. 21,000 కోట్లు వెనక్కి ఇటీవల దేశీ స్టాక్స్లో నిరవధిక విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–14) రూ. 21,000 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. యూఎస్ వాణిజ్య సుంకాల భారం, తొలి త్రైమాసిక ఫలితాల నిరుత్సాహం, రూపాయి బలహీనత ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీల నుంచి రూ. 1.16 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జూలైలోనూ ఎఫ్పీఐలు నికరంగా రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. మార్చి– జూన్మధ్య కాలంలో రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్టాక్ మార్కెట్లో కొత్త ఇండెక్స్
బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ విభాగం తాజాగా డిఫెన్స్ ఇండెక్స్ను ప్రారంభించింది. బీఎస్ఈ 1000 ఇండెక్స్లోని డిఫెన్స్ థీమ్ స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి. ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్లో) ఇండెక్స్లో మార్పులు, చేర్పులు చేస్తారు. విధాన సంస్కరణలు, పెరుగుతున్న బడ్జెట్ కేటాయింపులు, దేశీయంగా తయారీపై మరింతగా దృష్టి పెరుగుతుండటం తదితర సానుకూల అంశాలతో డిఫెన్స్ రంగం గణనీయంగా వృద్ధి చెందనుందని బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ వివరించింది.ఈ నేపథ్యంలో ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్ మొదలైన ప్యాసివ్ ఫండ్స్కి ఇండెక్స్ ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. అలాగే, పీఎంఎస్ వ్యూహాలు, మ్యుచువల్ ఫండ్ స్కీములు, ఫండ్ పోర్ట్ఫోలియోల పనితీరు మదింపునకు దీన్ని ప్రామాణికంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. -
స్టాక్ మార్కెట్ ఈరోజుకి ఫ్లాట్.. రేపటి నుంచి సెలవులు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం ఫ్లాట్ గా ముగిశాయి. వీక్లీ నిఫ్టీ 50 ఆప్షన్ల గడువు ముగియడంతో బెంచ్ మార్క్ సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11.95 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 24,631.30 వద్ద ముగిసింది.మరోవైపు సెన్సెక్స్ 261 పాయింట్ల స్వల్ప రేంజ్లో కదలాడింది. బీఎస్ఈ బెంచ్మార్క్ 80,751.18 వద్ద గరిష్టాన్ని, 80,489.86 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 0.07 శాతం లేదా 57.75 పాయింట్లు పెరిగి 80,597.66 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలవగా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో విప్రో, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలవగా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.31 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.38 శాతం నష్టపోయింది. రంగాలవారీగా పనితీరు మిశ్రమంగా ఉంది. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (0.75 శాతం), నిఫ్టీ ఐటీ (0.4 శాతం) టాప్ గెయినర్స్గా నిలిచాయి. మెటల్, రియల్టీ వరుసగా 1.39 శాతం, 0.76 శాతం నష్టపోయాయి.కాగా ఈవారం ట్రేడింగ్ సెషన్ ఈరోజుతో ముగసింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న శుక్రవారం భారత మార్కెట్లకు సెలవు ఉంటుంది. తదుపరి మార్కెట్ సెషన్ ఆగస్టు 18న ప్రారంభం కానుంది. -
స్టాక్ మార్కెట్లో నిండా మునిగాడు.. ఇప్పుడు రూ.2.4 కోట్ల వేతనం!
జీవితమంటేనే కష్టాలు, కన్నీళ్లు. వీటికి భయపడకుండా పట్టుదలతో కృషి చేస్తేనే.. సక్సెస్ సాధ్యమవుతుంది. దీనిని నిరూపించినవాళ్ల గురించి గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఇదేకోవకు చెందిన మరో వ్యక్తి గురించి.. అతని సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.2008లో ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి స్టాక్ మార్కెట్లో సర్వసం కోల్పోయాడు. కానీ కొడుకు దశాబ్దానిపైగా కృషి చేసి.. కెరీర్ను అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఏడాదికి రూ. 2.4 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఢిల్లీలో మధ్య తరగతిలో పుట్టి పెరిగిన ఆ వ్యక్తి (కొడుకు).. ప్రారంభ జీవితం చాలా సాఫీగా సాగింది. అయితే 2008లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చదువుకునే రోజుల్లోనే.. పాఠశాలలో నాటకాలు, డ్యాన్స్ ఇతర కార్యకలాపాలలో పాల్గొనేవాడు. ఇంటర్మీడియట్లో సైన్స్ ఎంచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో తన బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.చదువు పూర్తయిన తరువాత 2014లో నెలకు రూ. 35,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. 2016లో తన స్నేహితురాలికి దగ్గరగా ఉండాలని ఉద్యోగం మారాడు. అప్పుడు అతని జీతం రూ. 60,000లకు పెరిగింది. 2017లో మరొక ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతని జీతం రూ. 90,000లకు చేరింది. ఐదేళ్లు అదే కంపెనీలు ఉంటూ.. 2021 నాటికి నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఇదీ చదవండి: వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!2022లో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఆఫర్ వచ్చింది. అక్కడ అతని వార్షిక వేతనం 202000 డాలర్లు (రూ.1.7 కోట్ల కంటే ఎక్కువ). 2025 నాటికి అతని వేతనం రూ. 2.4 కోట్ల కంటే ఎక్కువ అయింది. కేవలం రూ. 35000 జీతంతో మొదలైన వ్యక్తి.. రూ.2.4 కోట్ల వేతనం వరకు ఎదిగాడంటే.. దాని వెనుక అతని శ్రమ ఎంత ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఉద్యోగం చేసే సమయంలో.. జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించారు. మొత్తం నాలుగు ఖండాల్లో 17 దేశాలు ప్రయాణించాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణించిన ఇతడు.. లగ్జరీ విమానాలలో ప్రయాణించే వరకు ఎదిగాడు. డబ్బు ఒక నిర్దిష్ట స్థాయి వరకు ముఖ్యమైనదని, కానీ దానికి మించి, ఆరోగ్యం, సంబంధాలు, అనుభవాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వ్యక్తి చెబుతాడు. జీవితంలో ఏ దశలోనైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి పొందలేమని పేర్కొన్నారు. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు పెరిగి 24,641కు చేరింది. సెన్సెక్స్(Sensex) 68 ప్లాయింట్లు పుంజుకుని 80,611 వద్ద ట్రేడవుతోంది.> రేపు ఆగస్టు 15 రోజున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలు పని చేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 304.32 పాయింట్లు లేదా 00.38 శాతం పెరిగి 80,539.91 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 131.95 పాయింట్లు లేదా 0.54 శాతం పెరిగి 24,619.35 వద్ద ముగిసింది.బీఎస్ఈలో బీఈఎల్, ఎటర్నల్, ఎంఅండ్ఎం టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు గ్రీన్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.63 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.66 శాతం లాభపడింది. రంగాలవారీగా పనితీరు మిశ్రమంగా ఉంది. నిఫ్టీ హెల్త్కేర్ 2.13 శాతం, ఫార్మా 1.73 శాతం, మెటల్ 1.26 శాతం, ఆటో 1.12 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 0.04 శాతం, 0.14 శాతం, 0.05 శాతం నష్టపోయాయి. -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 57 పాయింట్లు పెరిగి 24,546కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 ప్లాయింట్లు పుంజుకుని 80,392 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాలు
ముంబై: అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాలతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం మేర నష్టపోయాయి. భారత్, అమెరికాల జూలై రిటైల్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 368 పాయింట్లు నష్టపోయి 80,235 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పతనమై 24,487 వద్ద నిలిచింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 833 పాయింట్ల పరిధిలో 80,164 వద్ద కనిష్టాన్ని, 80,998 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 24,465 – 24,702 శ్రేణిలో ట్రేడైంది. చైనాతో వాణిజ్య ఒప్పందానికి అమెరికా మరో 90 రోజుల విరామం, యూఎస్ జూలై ద్రవ్యోల్బణ ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. ఇష్యూ ధర (రూ.70)తో పోలిస్తే బీఎస్ఈలో 67% ప్రీమియంతో రూ.117 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 75% ఎగసి రూ.123 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి., అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.881 కోట్లుగా నమోదైంది. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 368.48 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో.. 80,235.59 వద్ద, నిఫ్టీ 97.65 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో.. 24,487.40 వద్ద నిలిచింది.టాప్ గెయినర్స్ జాబితాలో.. యాత్ర ఆన్లైన్, డబ్ల్యుఎస్ ఇండస్ట్రీస్, NDL వెంచర్స్, రికో ఆటో, సోనాటా సాఫ్ట్వేర్ కంపెనీలు చేరాయి. మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా), మార్క్సాన్స్ ఫార్మా, బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా), పిక్స్ ట్రాన్స్మిషన్స్, ఆస్ట్రల్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 61 పాయింట్లు పెరిగి 24,645కు చేరింది. సెన్సెక్స్(Sensex) 203 ప్లాయింట్లు పుంజుకుని 80,802 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 746.29 పాయింట్లు లేదా 0.93 శాతం లాభంతో 80,604.08 వద్ద, నిఫ్టీ 198.85 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,562.15 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో సీఎల్ ఎడ్యుకేట్, యాత్ర ఆన్లైన్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎన్డీఎల్ వెంచర్స్, ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ వంటి కంపెనీలు చేరాగా.. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఫేజ్ త్రీ, ఆరోన్ ఇండస్ట్రీస్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, బెస్ట్ ఆగ్రోలైఫ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 45 పాయింట్లు పెరిగి 24,414కు చేరింది. సెన్సెక్స్(Sensex) 145 ప్లాయింట్లు పుంజుకుని 80,005 వద్ద ట్రేడవుతోంది.భారత్ దిగుమతులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో ఎగుమతి సంబంధ రంగాలపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫార్మాపైనా వడ్డింపులు తప్పవన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఔషధ రంగంతోపాటు.. లెదర్, కెమికల్స్, ఫుట్వేర్, ఆక్వా, ఐటీ, టెక్స్టైల్స్ ప్రభావితంకానున్నట్లు పేర్కొన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..
కోర్టు సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే '1929 నాటి మహా మాంద్యం' వస్తుందని అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం హెచ్చరించారు. ఇంతకీ ఈ మహా మాంద్యం ఏమిటి?, దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనే.. విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.1929 నాటి మహా మాంద్యం1929 నాటి మహా మాంద్యం.. 20వ శతాబ్దంలోని అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యంగా చరిత్రలో నిలిచింది. ఇది 1929లో ప్రారంభమై సుమారు 1939 వరకు ప్రభావం చూపింది. ఈ మాంద్యం మొదట అమెరికాలో 1929 అక్టోబర్ 24 నాటి స్టాక్ మార్కెట్ పతనంతో ప్రారంభమైంది. ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపింది.1929 ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలుస్టాక్ మార్కెట్ పతనంస్టాక్ ధరలు పెరుగుతుండటం, వాటిపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న ప్రజలు స్టాక్లను కొనుగోలు చేశారు. చాలామంది అప్పు తెచ్చుకున్న డబ్బుతో కూడా స్టాక్ కొనేశారు. ఇలా పెద్దఎత్తున స్టాక్లు అమ్ముడవడం వల్ల మార్కెట్ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది.బ్యాంకులు మూతపడటంప్రజలు తమ డబ్బును బ్యాంకుల నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది బ్యాంకులు మూతపడటానికి కారణమైంది. వేలాది బ్యాంకులు క్లోజ్ అవ్వడంతో.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ప్రభుత్వ జోక్యం కూడా తగ్గిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడటం ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణమైంది.అధిక ఉత్పత్తి, తక్కువ డిమాండ్రైతులు మార్కెట్ అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేశారు. పారిశ్రామిక రంగం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకుండా పోయింది. ఇది ధరలు తగ్గడానికి మాత్రమే కాకుండా.. అప్పులు పెరగడానికి కూడా కారణమైంది. ఇది ఆర్ధిక వ్యవస్థను మరింత దిగజారేలా చేసింది.ప్రపంచ వాణిజ్య పతనంస్మూట్ హాలీ టారిఫ్ చట్టం (1930) వల్ల అమెరికా దిగుమతులపై అధిక పన్నులు విధించడం జరిగింది. ఇది ఇతర దేశాల నుంచి ప్రతీకార సుంకాలను సైతం పెంచింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం క్షిణించింది. ప్రపంచ మాంద్యం తీవ్రతరం అయింది.ప్రజలపై ప్రభావం1929 నాటి మహా మాంద్యం కారణంగా అమెరికాలో నిరుద్యోగం రేటు 25% దాటింది. లక్షలాది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎంతోమంది ఇళ్లను కూడా వదిలి బయటకు వలసలు వెళ్లి, నిరాశ్రయులయ్యారు. -
దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం
టారిఫ్ ప్రతిష్టంభన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ తో వాణిజ్య చర్చలను తోసిపుచ్చడంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 765.47 పాయింట్లు (0.95 శాతం) క్షీణించి 79,857.79 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 232.85 పాయింట్లు లేదా 0.95 శాతం తగ్గి 24,363.30 వద్ద ముగిసింది.ఈ క్రమంలో ఈ వారం సెన్సెక్స్ 742 పాయింట్లు, నిఫ్టీ 202 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, ట్రెంట్ టాప్ గెయినర్స్గా నిలవగా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.64 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 1.49 శాతం నష్టపోయింది. అన్ని రంగాలు నెగిటివ్ జోన్లో ముగిశాయి. నిఫ్టీ రియల్టీ 2.11 శాతం, నిఫ్టీ మెటల్ 1.76 శాతం, ఆటో 1.40 శాతం, ఫార్మా 1.30 శాతం నష్టపోయాయి. -
250 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 65 పాయింట్లు తగ్గి 24,529కు చేరింది. సెన్సెక్స్(Sensex) 256 ప్లాయింట్లు నష్టపోయి 80,367 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
ఐటీ, ఫార్మా స్టాక్స్ నేతృత్వంలో భారత్ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీ రికవరీని సాధించాయి. సెన్సెక్స్ 811.97 పాయింట్లు పుంజుకుని రోజు కనిష్ట స్థాయి (79,811.29) నుంచి 80,623.26 వద్ద (0.10 శాతం లేదా 79.27 పాయింట్లు) ముగిసింది. నిఫ్టీ కూడా 252 పాయింట్లు పుంజుకుని 24,344.15 పాయింట్ల వద్ద (21.95 పాయింట్లు లేదా 0.09 శాతం) 24,596.15 వద్ద ముగిసింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. గత వారం భారత దిగుమతులపై సంతకం చేసిన 25 శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా ప్రకటించిన టారిఫ్ లు 21 రోజుల నోటీసు పీరియడ్ తర్వాత ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.బీఎస్ఈలో టెక్ మహీంద్రా, ఎటర్నల్ (జొమాటో), హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా కోలుకుని పాజిటివ్ గా ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.17 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా 0.75 శాతం, ఐటీ 0.87 శాతం, మీడియా 0.99 శాతం, ఆటో 0.25 శాతం, పీఎస్ యూ బ్యాంక్ 0.29 శాతం, మెటల్ 0.13 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 0.13 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.19 శాతం చొప్పున నష్టపోయాయి. -
ట్రంప్ టారిఫ్లు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు తగ్గి 24,501కు చేరింది. సెన్సెక్స్(Sensex) 253 ప్లాయింట్లు నష్టపోయి 80,288 వద్ద ట్రేడవుతోంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై మరోసారి 25 శాతం సుంకాలను ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిలకడగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 24,656కు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 ప్లాయింట్లు పుంజుకొని 80,783 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వెంటాడిన టారిఫ్ భయాలు
ముంబై: రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పాలసీ ప్రకటన(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకులు, చమురు షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించకలేపోతున్నాయి.ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 308 పాయింట్లు నష్టపోయి 80,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లు పతనమై 24,650 వద్ద నిలిచింది.⇒ తొలి త్రైమాసిక నికర లాభం 56% వృద్ధి నమోదుతో గాడ్ఫ్రై ఫిలిప్స్ షేరుకు డిమాండ్ లభించింది. బీఎస్ఈలో 10% పెరిగి రూ.9887 వద్ద లోయర్ సర్క్యూట్ తాకి అక్కడే ముగిసింది.జీవితకాల కనిష్టాన్ని తాకిన రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు నష్టపోయి 87.88 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2025 ఫిబ్రవరి 10 నాటి జీవితకాల కనిష్టం 87.95 స్థాయిని తాకింది. రష్యన్ చమురు కొనుగోలు కారణంగా భారత్పై సుంకాలను మరింత పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మన కరెన్సీ కోతకు ప్రధాన కారణంగా నిలిచాయి. దేశీ స్టాక్ మార్కెట్ పతనం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచింది.ఆదిత్య ఇన్ఫోటెక్ అరంగేట్రం అదుర్స్ సీపీ ప్లస్ బ్రాండ్ కింద నిఘా పరికరాలను విక్రయించే ఆదిత్య ఇన్ఫోటెక్ షేరు ఎక్సే్చంజీల్లోకి అదిరిపోయే అరంగేట్రం చేసింది. ఇష్యూ ధర(రూ.675)తో పోలిస్తే బీఎస్ఈలో 51% ప్రీమియంతో రూ.1,018 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 64% ఎగసి రూ.1,104 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 61% లాభంతో రూ.1,084 వద్ద ముగిసింది. లక్ష్మి ఇండియా ఫైనాన్స్ నిరాశఎన్బీఎఫ్సీ లక్ష్మి ఇండియా ఫైనాన్స్ లిస్టింగ్లో నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.158)తో పోలిస్తే బీఎస్ఈలో 14 శాతం డిస్కౌంటుతో రూ.136 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 16 శాతం క్షీణించి రూ.133 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 15% నష్టంతో రూ.134 వద్ద నిలిచింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 308.47 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో.. 80,710.25 వద్ద, నిఫ్టీ 73.20 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో 24,649.55 వద్ద నిలిచాయి.ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ప్రకాష్ ఇండస్ట్రీస్, ఎక్స్టిగ్లోబల్ ఇన్ఫోటెక్, తాన్లా ప్లాట్ఫారమ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్, త్రివేణి టర్బైన్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, శీతల్ కూల్ ప్రొడక్ట్స్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
300 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 77 పాయింట్లు నష్టపోయి 24,643కు చేరింది. సెన్సెక్స్(Sensex) 302 ప్లాయింట్లు దిగజారి 80,707 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 199.77 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో.. 80,799.68 వద్ద, నిఫ్టీ 71.85 పాయింట్లు లేదా 0.29 శాతం లాభంతో.. 24,637.20 వద్ద ముందుకు సాగుతున్నాయి.సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్, మీర్జా ఇంటర్నేషనల్, సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్, ఆర్ఫిన్ ఇండియా, కాప్స్టన్ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ZIM లాబొరేటరీస్, PSP ప్రాజెక్ట్స్, కాబ్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్, AMJ ల్యాండ్, అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
Stock market: భారీ నష్టాలు.. నెత్తురు కక్కిన ఫార్మా షేర్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. వివిధ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల నేపథ్యంలో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ ను ప్రతికూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 585.67 పాయింట్లు (0.72 శాతం) క్షీణించి 80,599.91 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 81,317.51 -80,495.57 శ్రేణిలో ట్రేడ్ అయింది.ఇక 24,784.15 -24,535.05 రేంజ్లో కదలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 203 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 24,565.35 వద్ద స్థిరపడింది. ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్ 4.43 నుంచి 2.41 శాతం మధ్య నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.33 శాతం, 1.66 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లో టాప్లో ఉండి 3.33 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లో అరబిందో ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా వరుసగా 5.17 శాతం, 4.89 శాతం నష్టపోయాయి. అస్థిరత సూచీ, ఇండియా (విఐఎక్స్) 3.74 శాతం పెరిగి 11.98 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
స్టాక్ మార్కెట్ సూచీలు నేలచూపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు నష్టపోయి 24,713కు చేరింది. సెన్సెక్స్(Sensex) 169 ప్లాయింట్లు దిగజారి 81,001 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
భారత ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు గురువారం అస్థిర సెషన్ లో ప్రతికూలంగా ముగిశాయి. సెన్సెక్స్ 296.28 పాయింట్లు (0.36 శాతం) క్షీణించి 81,185.58 వద్ద స్థిరపడింది. గురువారం ఈ సూచీ 81,803.27 నుంచి 80,695.15 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 86.70 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 24,768.35 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.70-1.34 శాతం రేంజ్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ షేర్లు 3.61 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.05 శాతం, 0.93 శాతం నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మార్కెట్ ధోరణులను అధిగమించి ఇమామీ, హిందుస్థాన్ యూనిలీవర్ నేతృత్వంలో 1.44 శాతం లాభాలతో స్థిరపడింది. నిఫ్టీ ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ సూచీలు 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,153 షేర్లలో 2,418 రెడ్లో, 1,598 గ్రీన్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. -
200 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 11:39 సమయానికి నిఫ్టీ(Nifty) 61 పాయింట్లు నష్టపోయి 24,792కు చేరింది. సెన్సెక్స్(Sensex) 219 ప్లాయింట్లు దిగజారి 81,261 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈలో ఇన్వెస్టర్ ఖాతాలు 23 కోట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ ఖాతాల సంఖ్య జూలైలో 23 కోట్ల స్థాయిని దాటింది. అకౌంట్ల సంఖ్య ఏప్రిల్లో 22 కోట్ల మార్కును దాటగా కేవలం మూడు నెలల్లోనే మరో 1 కోటి అకౌంట్లు జతయ్యాయి. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 4 కోట్ల ఖాతాలు (మొత్తం అకౌంట్లలో 17 శాతం) ఉండగా, తర్వాత స్థానాల్లో ఉత్తర్ప్రదేశ్ (2.5 కోట్లు, 11 శాతం వాటా), గుజరాత్ (2 కోట్లకు పైగా, 9 శాతం వాటా), పశ్చిమ బెంగాల్..రాజస్థాన్ (చెరి 1.3 కోట్లు, 6 శాతం వాటా) ఉన్నాయి. మొత్తం ఇన్వెస్టర్ అకౌంట్లలో దాదాపు సగ భాగం వాటా ఈ అయిదు రాష్ట్రాలదే ఉంది. టాప్ 10 రాష్ట్రాల వాటా నాలుగింట మూడొంతులు ఉందని ఎన్ఎస్ఈ వెల్లడించింది. విశిష్ట ఖాతాదారుల సంఖ్య 11.8 కోట్లుగా ఉంది. సాధారణంగా ఒకే ఇన్వెస్టరు పలు బ్రోకరేజీ సంస్థల్లో అకౌంట్లు తీసుకోవచ్చు. ఇన్వెస్టర్లలో యువత, మొదటిసారిగా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎన్ఎస్ఈ వివరించింది. డిజిటలీకరణ వేగవంతం కావడం, మొబైల్ ఆధారిత ట్రేడింగ్ సొల్యూషన్స్ విస్తృతంగా వినియోగంలోకి రావడం తదితర అంశాలు ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడానికి కారణమని సంస్థ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. -
స్టాక్ మార్కెట్లో 10 రోజులు నో ట్రేడింగ్!
దేశంలో స్టాక్ మార్కెట్పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవారు నిరంతరం మార్కెట్ను గమనిస్తుంటారు. ఆగస్టు నెలలో వారాంతాలు మినహా రెండు రోజులు భారత స్టాక్ మార్కెట్ మూసి ఉంటుంది. శని, ఆదివారాలతో సహా మొత్తం పది రోజుల పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లకు సెలవు ఉంటుంది. అంటే ఆయా రోజుల్లో ట్రేడింగ్ జరగదు.ఎన్ఎస్ఈ ట్రేడింగ్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025లో రాబోయే మార్కెట్ సెలవు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తదుపరిది ఆగస్టు 27న వినాయక చవితి రోజున ఉంటుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్), కరెన్సీ డెరివేటివ్స్ కూడా ఆగస్టు 15, 27 తేదీల్లో మూసి ఉంటాయి.ఈ ఏడాది ఇక రానున్న స్టాక్ మార్కెట్ సెలవులుఆగష్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవంఆగష్టు 27 - వినాయక చవితిఅక్టోబర్ 2 - మహాత్మాగాంధీ జయంతి/ దసరాఅక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజఅక్టోబర్ 22 - బలిప్రతిపాదనవంబర్ 5 - ప్రకాశ్ గురుపూర్ శ్రీ గురునానక్ దేవ్డిసెంబర్ 25 - క్రిస్మస్ -
మార్కెట్ ముగిసిందిలా.. టాప్ గెయినర్స్ ఇవే..
భారత ఈక్విటీలు ఈ రోజు క్యూ1 ఫలితాలతో నడిచాయి. 2025 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన తర్వాత సెన్సెక్స్లో ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. దీనికి తోడు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధాన నిర్ణయం ఇన్వెస్టర్లను పక్కకు నెట్టి స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులకు లోనయ్యాయి.సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 143.9 పాయింట్లు (0.18 శాతం) పెరిగి 81,481.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34 పాయింట్లు లాభపడి 24,855.05 వద్ద ముగిసింది. అదేసమయంలో ఎల్అండ్టీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 0.31 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ (0.96 శాతం), నిఫ్టీ ఆటో (0.6 శాతం) అత్యధికంగా నష్టపోయాయి. మార్కెట్ ఒడిదుడుకుల అంచనాలను కొలిచే ఇండియా వీఐఎక్స్ 2.77 శాతం నష్టంతో 11.21 వద్ద ముగిసింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 24,866కు చేరింది. సెన్సెక్స్(Sensex) 138 ప్లాయింట్లు పుంజుకుని 81,479 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.75బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.62 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.32 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.3 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.38 శాతం నష్టపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,694కు చేరింది. సెన్సెక్స్(Sensex) 19 ప్లాయింట్లు పుంజుకుని 80,906 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమ్మకాల ఒత్తిడి.. బేర్మన్న మార్కెట్లు
బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 572.07 పాయింట్లు (0.70 శాతం) క్షీణించి 80,891 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.10 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 24,680.90 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ అనుబంధ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ మాత్రమే 1.23 శాతం వరకు లాభపడగా, మిగతావి నష్టాల్లో స్థిరపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు 1.14 శాతం నుంచి 7.31 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.26 శాతం, 0.84 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్లన్నీ రెడ్లో స్థిరపడగా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4.26 శాతం నష్టంతో ముగిసింది. -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 24,832కు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 ప్లాయింట్లు దిగజారి 81,397 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కుప్పకూలిన బజాజ్ షేర్లు
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇతర హెవీవెయిట్ షేర్ల బలహీనత మధ్య భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయంగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు (0.88 శాతం) నష్టపోయి 81,463.09 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్లు (0.9 శాతం) క్షీణించి 24,837 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో బజాజ్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ట్రెంట్ షేర్లు టాప్ లూజర్స్గా నిలవగా సన్ ఫార్మా మాత్రమే లాభపడింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.61 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా (0.54 శాతం) మినహా అన్ని కౌంటర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ ఆటో 1.27 శాతం, నిఫ్టీ ఐటీ 1.42 శాతం, నిఫ్టీ మెటల్ 1.64 శాతం, నిఫ్టీ రియల్టీ 0.99 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.91 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.9 శాతం నష్టపోయాయి.దేశీయ మార్కెట్లో మార్కెట్ అస్థిరతకు కొలమానమైన ఇండియా వీఐఎక్స్ 5.15 శాతం లాభంతో 11.28 వద్ద ముగిసింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 134 పాయింట్లు నష్టపోయి 24,932కు చేరింది. సెన్సెక్స్(Sensex) 395 ప్లాయింట్లు దిగజారి 81,794 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడేసిన ఐటీ, రియల్టీ షేర్లు
ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఈఎక్స్, కోఫోర్జ్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ జూన్ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు స్పందించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 542.47 పాయింట్లు (0.66 శాతం) క్షీణించి 82,184.17 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 157.8 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 25,062.1 వద్ద ముగిశాయి.ఎటర్నల్ (జొమాటో), టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టైటాన్ షేర్లు టాప్ గెయినర్స్గా లాభపడగా, ట్రెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ వరుసగా 0.58 శాతం, 1.09 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 2.21 శాతం, నిఫ్టీ రియల్టీ 1.04 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 1.24 శాతం, నిఫ్టీ ఫార్మా 0.55 శాతం లాభపడ్డాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 36 పాయింట్లు నష్టపోయి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 172 ప్లాయింట్లు దిగజారి 82,382 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లు ర్యాలీ.. రయ్మన్న ఆటో షేర్లు
ప్రపంచ మార్కెట్ల బలాన్ని ట్రాక్ చేస్తూ భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్ను లాభాలతో ముగించాయి. దీనికి తోడు జూన్ త్రైమాసికం (క్యూ1 ఎఫ్వై26) ఫలితాలకు సంబంధించి కొనసాగుతున్న త్రైమాసిక రాబడుల సీజన్ మధ్య స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా సెంటిమెంట్కు దిశానిర్దేశం చేసింది.బీఎస్ఈ సెన్సెక్స్ 539.83 పాయింట్లు (0.66 శాతం) లాభంతో 82,726.64 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 159 పాయింట్లు లేదా 0.63 శాతం లాభంతో 25,219.9 వద్ద సెషన్ను ముగించాయి. టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ టాప్ గెయినర్స్గా నిలవగా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.34 శాతం లాభంతో, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఫ్లాట్ గా ముగిశాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.76 శాతం, నిఫ్టీ మెటల్ 0.48 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 2.6 శాతం నష్టపోయింది. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు పెరిగి 25,121కు చేరింది. సెన్సెక్స్(Sensex) 196 ప్లాయింట్లు పుంజుకుని 82,382 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రిలయన్స్, ఐటీ షేర్లు పడేశాయ్..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి 82,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 25,061 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆరంభంలోనే ఓ మోస్తారు లాభాలు గడించాయి. ఒక దశలో సెన్సెక్స్ 338 పాయింట్లు పెరిగి 82,538 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు బలపడి 25,182 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి.అయితే భారత్ – యూఎస్వాణిజ్య ఒప్పందానికి తుది గడువు ఆగస్టు 1 సమీపిస్తున్నా.. డీల్పై ఎలాంటి స్పష్టత రాకపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఇండెక్సుల వారీగా బీఎస్ఈలో రియల్టీ 1%, టెలీకమ్యూనికేషన్, ఆటో, ఐటీ, టెక్ షేర్లు అరశాతం నష్టపోయాయి.⇒ అంచనాలకు మించి క్యూ1 ఆర్థిక ఫలితాలు ప్రకటనతో డెలివరీ దిగ్గజం ఎటర్నల్ షేరు రెండో రోజూ రాణించింది. బీఎస్ఈలో 11% పెరిగి రూ.300 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.312 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లో కంపెనీ మార్కెట్ విలువ రూ.41,013 కోట్లు పెరిగి రూ.2.89 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. శాంతి గోల్డ్ @ రూ. 189–199న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల తయారీ సంస్థ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూకి రూ. 189–199 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. దీనిలో భాగంగా 1.81 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 360 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా విభిన్న బంగారు ఆభరణాల డిజైన్, తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. ప్రస్తుతం వార్షికంగా 2,700 కేజీల బంగారు ఆభరణాల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.