breaking news
Palnadu
-
రెవెన్యూ శాఖతో ప్రజలకు నిత్యం అనుబంధం
గుంటూరు జేసీ ఎ.భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: పుట్టుక నుంచి మరణం వరకు ప్రజలకు రెవెన్యూ శాఖతో అనుబంధం ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి రెవెన్యూ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అంశంలో మరింత వేగంగా, పారదర్శకంగా రెవెన్యూ సిబ్బంది పని చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత సమాజంలో పని వేగం పెరిగిందని, దీనికి తగ్గట్లు ఉద్యోగులు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు. ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్కుమార్ మాట్లాడుతూ రోజురోజుకూ తమ బాధ్యత మరింత పెరుగుతోందని తెలిపారు. ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. -
ఏపీ బిషప్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా జయప్రకాష్
నరసరావుపేట: ఏపీ బిషప్ కౌన్సిల్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ జి.జయప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడ ఏపీ టూరిజం. పున్నమి ఘాట్లో శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు అధ్యక్షతన ఏపీ బిషప్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జయప్రకాష్ మాట్లాడుతూ.. అనేక కార్యక్రమాలు బిషప్ కౌన్సిల్ ద్వారా నిర్వహిస్తామన్నారు. అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు కూడా ఇన్చార్జిగా తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. ముఖ్య అతిథిగా విజయవాడ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణమూర్తినాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయప్రకాష్ను అభినందించి సన్మానించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బిషప్లు పాల్గొన్నారు. -
నారాయణ కళాశాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ లక్ష్మీపురం: అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాంను వేల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న కొత్తపేటలోని నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాసర్జీ మాట్లాడుతూ కళాశాలకు గుర్తింపు కూడా లేదని ఆరోపించారు. అధిక ఫీజుల దోపిడీలకు పాల్పడుతున్నారని, తక్షణమే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు పర్మిషన్ లేకుండా కళాశాల నిర్వహిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని తెలిపారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ మాట్లాడతూ ముందస్తు అడ్మిషన్ల పేరుతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, కల్లబొల్లి మాటలు చెప్పి అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిని విద్యాశాఖ అధికారులు అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అక్రమాలకు పాల్పడున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్ , ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు డేవిడ్, అమర్నాథ్ , నగర సహాయ కార్యదర్శి వెంకట్, నాయకులు పాల్గొన్నారు. -
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు వెంటనే ఇవ్వాలి
పిడుగురాళ్ళ: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్ కుమార్ సూచించారు. మాచర్ల డివిజన్ పరిధిలోని అధికారులతో కొండమోడు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలన్నారు. సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని కోరారు. బిల్లుల వసూళ్లలో అలసత్వం వహించిన సిబ్బంది చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూర్య ఘర్ పథకంపై వినియోగదారులకు అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని కోరారు. 50 శాతం అదనపు లోడు క్రమబద్ధీకరణ సబ్సిడీ స్కీమును వినియోగదారులు ఈ నెల 30వ తేదీ లోపు వినియోగించుకోవాలని సూచించారు. పిడుగురాళ్ల పట్టణ పరిధిలో సరఫరా సమస్యలకు 62817 02413 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. ఈఈ నూతలపాటి సింగయ్య, డెప్యూటీ ఈఈ బి.నాగసురేష్ బాబు, ఏఈఈ కోట పెద్ద మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు విశాఖలో ‘సిడ్స్’ సదస్సు ప్రారంభం
గుంటూరు మెడికల్: క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ (సిడ్స్) ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్ సదస్సును శనివారం విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్ట్, సిడ్స్ ప్రెసిడెంట్, గుంటూరు హెల్ప్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోనగంటి కల్యాణ చక్రవర్తి తెలిపారు. అరండల్పేటలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన సదస్సు వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిజీషియన్లు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, మైక్రో బయాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు సదస్సుకు హాజరవుతారని పేర్కొన్నారు. విశాఖపట్నం హోటల్ గ్రీన్ పార్క్లో జరిగే సదస్సులో యాంటీబయోటిక్స్లో వచ్చిన ఆధునిక మందులు, చికిత్స పద్ధతుల గురించి వివరిస్తారన్నారు. ‘రైట్ డ్రగ్ – రైట్ టైమ్– రైట్ స్టేజ్’ అనే నినాదంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డాక్టర్ వి.రామసుబ్రహ్మణ్యం, డాక్టర్ మోహన్ మహరాజ్, డాక్టర్ శ్రీధర్ శ్రీనివాసన్లు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీనియర్ సిడ్స్ మెంబర్ డాక్టర్ నర్రెడ్డి సునీత, డాక్టర్ గాయత్రి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రామసుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. దేశంలోనే ఇన్ఫెక్షన్లపై పోరాటంలో అతి పెద్ద సొసైటీగా తమ సంస్థకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. సదస్సులో పలు పరిశోధన, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ కల్యాణ చక్రవర్తి వివరించారు. -
కులధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు
రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్యవేదిక జేఏసీ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ లక్ష్మీపురం: రాష్ట్రంలో బేడ బుడగ జంగం కులస్తులు 20 సంవత్సరాల నుంచి కుల ధ్రువీకరణ పత్రాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్యవేదిక జేఏసీ వ్యవస్థాపకులు కడమంచి శ్రీనివాన్ తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే ఎస్సీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని ఆయన కోరారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించి, బిల్లు పాస్ చేయించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఎంతటి పోరాటాలకై నా సిద్ధపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లా కన్వీనర్ వాణిశ్రీ రేపల్లె: అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వెంటనే వర్తింపజేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లా కన్వీనర్ సింగం వాణిశ్రీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపల్లె ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీడీపీవో సుచిత్రకు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. వాణిశ్రీ మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగి అనే పదం తొలగించాలని కోరుతూ 23 తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చినా దానిలో అంగన్వాడీలకు ఇవ్వకుండా మోసం చేసిందని, ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీనిచ్చి నేడు మొండి చెయ్యి చూపిందన్నారు. గతంలో పిల్లలు చదువుకి సంబంధించిన అమ్మఒడి అమలైందని పేర్కొన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఆదాయ నిబంధనలు పెట్టి సంక్షేమ పథకాలను దూరంచేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి అనే పదం తొలగించాలని కోరుతూ జూన్ 23న జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో వర్కర్లు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏఐటీయూసీ నాయకులు పడమటి బిక్షాలు, షేక్ బాజీ, నాగమల్లి, జ్యోతి, హేమలత, సీహెచ్ పద్మ, పాప, విజయలక్ష్మి, వై.శారద తదితరులు పాల్గొన్నారు. -
నిత్య జీవితంలో యోగా అంతర్భాగం కావాలి
గుంటూరు ఎడ్యుకేషన్: నిత్య జీవితంలో యోగా అంతర్భాగం కావాలని టీజేపీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. పట్టాభిపురంలోని కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భారతదేశం ఇచ్చిన గొప్పవరం యోగా అన్నారు. శ్వాసపై నియంత్రణ కలిగి, ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా జీవితాన్ని పొందగలరని తెలిపారు. కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. అనితాదేవి, వైస్ ప్రిన్సిపాల్ భానుమురళి, గుంటూరు జిల్లా ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి జేవీ సుధీర్కుమార్, ఎన్సీసీ అధికారి మేజర్ పి. కుమార్ రాజా, పీడీలు ఆర్. శివాజీ, వాసుదేవరావు పాల్గొన్నారు. ●అమరావతి రోడ్డులోని శారదా స్కూల్లో విద్యార్థుల యోగా అక్షరమాల ఆకృతిలో కూర్చుని సాధన చేశారు. ఈ సందర్భంగా యోగా మాస్టారు జల్లేపల్లి వెంకటేశ్వరరావు విద్యార్థులకు యోగా ప్రాధాన్యతను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.ఎం. దాస్, డైరెక్టర్ వి.భారతీవాణి పాల్గొన్నారు. -
నడుములు విరుగుతున్నాయ్ !
గుంటూరు ఎడ్యుకేషన్: అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రం పక్క రోడ్డు అధ్వానంగా మారింది. అమరావతి రోడ్డు మీదుగా కొరిటెపాడు సెంటర్కు వెళ్లేందుకు కీలకంగా ఉన్న ప్రధాన రహదారి పొడవునా గోతులు, గుంతలతో నిండి పోయింది. వాహనాల రాకపోకలకు ఏ మాత్రం అనువుగా లేదు. నిత్యం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తులతో వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు నిత్యం ఈ రోడ్డు మీదుగా ప్రయాణం సాగిస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రహదారులను నిర్మిస్తున్న నగరపాలకసంస్థ అధికారులు అమరావతి రోడ్డు, కొరిటెపాడును కలుపుతూ సాగుతున్న ఈ రోడ్డు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా గుంతల్లో ప్రయాణంతో నడుములు విరుగుతున్నాయని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులతో పాటు నూతన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ●లక్ష్మీపురం 3వ లైను రహదారిపై పడిన భారీ అగాధం ప్రమాదకరంగా మారింది. రోడ్డు ముఖ ద్వారంలో పైపులైనుకు ఏర్పడిన లీకేజీ కారణంగా దెబ్బతింది. అక్కడ భారీ గుంత ఉన్న సంగతి తెలియక వాహనదారులకు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించిన గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. -
పంటలకు జీవన ఎరువులు వాడండి
పిడుగురాళ్ల: రైతులు పంటలకు రసాయన ఎరువుల వాడకం తగ్గించి జీవన ఎరువులు ఎక్కువగా వాడాలని పల్నాడు జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం డీడీ శివకుమారి తెలిపారు. మండలంలోని జూలకల్లు గ్రామంలో శుక్రవారం పత్తి పంటను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వేసవిలో వేసిన ముదురు పత్తి పంట ఈ ప్రాంతంలో బాగానే ఉన్నప్పటికీ పోషక విలువలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనలను రైతులు తప్పనిసరిగా పాటిస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుందని సూచించారు. ఈ పత్తి పంటను పెట్టకు రాకుండా సరైన సమయంలో నీళ్లు పెట్టాలని, అలాగే లింగాకార బుట్టలు, సేంద్రియ ఎరువులు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పిడుగురాళ్ల ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకానికి ఈకేవైసీ చేయించుకొని వారు వెంటనే చేయించుకోవాలని తెలిపారు. కౌలు రైతు కార్డుల కోసం అర్హులైన వారు తమ సమీపంలోని సచివాలయాల్లో సంప్రదించాలని కోరారు. పంట రుణాలు అందించేందుకు అప్పుడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని పత్తి పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
సమ్మెలోకి ఇంజినీరింగ్ విభాగ కార్మికులు
నెహ్రూనగర్: రాష్ట్రవ్యాప్తంగా 22వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయపూడి కోటి బాబు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్రకి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా కోటి బాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ నెల 2న కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి ఎటువంటి హామీ ఇవ్వలేదని, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తానని చర్చలను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారని విమర్శించారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి పిలుపు రాకపోవడంతో ఈనెల 9న వడ్డేశ్వరంలో కమిషనర్ సంపత్ కుమార్ను కలిసి, 22వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తున్నామని నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. -
శక్తిమంతమైన అస్త్రం
శకిమంతమైన ఆరోగ్యాన్ని అందించే యోగా శరీరానికి మాత్రమే కాకుండా మనస్సు, మనస్తత్వా లకు కూడా మార్గదర్శకం. నమ్మకం, శ్రద్ధ, ఓర్పు, మానవత్వం వంటి విలువల్ని ప్రతిరోజూ సాధన ద్వారా అలవర్చుకోవచ్చు. అందుకే యోగా చేస్తే యోగం పడుతుందని మన పెద్దలు చెబుతారు. యోగా ప్రక్రియ శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు కూడా ఓ దివ్యౌషధం. యోగా ప్రక్రియలో నియమాలు పాటిస్తేనే అది సాధ్యం. యోగాభ్యాసంలోకి వచ్చిన 20 ఏళ్లలో ఆస్పత్రి గడప తొక్కలేదు. వయస్సు, లింగభేదం, శరీరాకృతి వంటి పరిమితులు లేకుండా ఎవరైనా యోగాసనాలు సాధన చేయవచ్చు. నిత్య సాధన ద్వారా ఫ్లెక్సిబిలిటీ పెరిగి, మానసిక నిశ్చలత, శాంతి సాధ్యమవుతాయి. అంతటి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి భారత దేశం అందించడం మనందరికీ గర్వకారణం. – వై. రాజ్యలక్ష్మి, యోగా గురువు -
పల్నాడు
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన జాజం నాగేశ్వరరావు, మాధవి దంపతులు రూ.1,01,116 విరాళం ఇచ్చారు.చౌడేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు రెంటచింతల: శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ 17వ వార్షికోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ఓరుగంటి మారుతీ శర్మ నేతృత్వంలో పూజలు జరిగాయి. వృద్ధాశ్రమానికి విరాళంతెనాలి అర్బన్: ఐతానగర్కు చెందిన జెట్టి రవీంద్రనాథ్ చౌదరి, సంధ్యారాణిలు శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి శుక్రవారం రూ.2.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. I -
యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
● జిల్లా వ్యాప్తంగా 5 వేల వేదికల వద్ద యోగాంధ్ర కార్యక్రమాలు ● ఏకకాలంలో పాల్గొననున్న రెండు లక్షల మంది ప్రజలు ● జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వెల్లడి నరసరావుపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో యోగాంధ్ర, బ్లాక్బర్లీ పొగాకు కొనుగోలు అంశాలపై పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. మొత్తం ఐదు వేల వేదికల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యోగాంధ్ర యాప్ ద్వారా దాదాపు 10 లక్షల మంది ఔత్సాహికులు నమోదు చేసుకున్నారని, వీరిలో రెండు లక్షల మంది అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, హాస్టళ్లు, గ్రామ–వార్డు సచివాలయాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్లో కనీసం 10వేల మంది హాజరవుతారని తెలిపారు. ఆర్కియాలజికల్ సర్వేశాఖ ఆధ్వర్యంలో అమరావతి బౌద్ధ స్తూపం వద్ద రెండు వేల మందితో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పట్టణంలోని సత్తెనపల్లి బైపాస్ రోడ్డుకు ప్రత్యేకంగా ‘యోగా స్ట్రీట్’గా నామకరణం చేసి వివిధ శాఖల ఆధ్వర్యంలో రోజూ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. బ్లాక్ బర్లీ రైతులను ఆదుకుంటాం బ్లాక్ బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, మద్దతు ధరతో యడ్లపాడు మార్క్ఫెడ్ కేంద్రంలో పంట కొనుగోలు చేస్తామని తెలిపారు. దిగుబడి పెరిగి ధర తగ్గిందన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటికే 1600 మంది రైతుల రిజిస్ట్రేషన్ పూర్తయిందని, రైతులు పొగాకు గ్రేడింగ్ చేసి తీసుకురావాలని సూచించారు. ఈ ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించాలని సూచించారు. దీంతోపాటు మిర్చి, పత్తి వంటి పంటలకు సైతం ప్రత్యామ్నాయాలు వెతకాలన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ సిబ్బందికి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో ఏకా మురళి, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి పాల్గొన్నారు. అధికారులకు దిశా నిర్దేశం నరసరావుపేట: యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి 21న నిర్వహించబోయే వేడుకల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, స్నాక్స్, టాయిలెట్స్ తదితర కనీస సౌకర్యాలను కల్పించాలని సూచించారు. మెడికల్ క్యాంపులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అన్నిస్థాయిల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. జిల్లా స్థాయిలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. -
కుటుంబానికి ఆరోగ్యయోగం
● 20 ఏళ్లుగా ఆస్పత్రి గడపతొక్కని యోగా గురువు ● ఎందరెందరికో ఎస్జీటీ ఉపాధ్యాయిని రాజ్యలక్ష్మి శిక్షణ ● అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం నాదెండ్ల/యడ్లపాడు: నాదెండ్ల మండలం కనపర్రులోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి యోగా సాధన ద్వారా జీవితాన్ని మలుచుకున్నారు. ఫిరంగిపురం మండలంలోని వేమవరం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి బీకాం, బీఈడీ, అలాగే ఎంఏ యోగాతో పాటు ఇంగ్లిష్, తెలుగు, హిస్టరీ వంటి విభాగాల్లో కూడా ఆమెకు విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఎంఏ యోగా చదువుకున్న ఆమె యోగా ప్రక్రియను శాసీ్త్రయంగా అభ్యసిస్తున్నారు. స్కై (కుండలిని) యోగ, హఠయోగ, గర్భిణుల యోగా, ఒబేసిటీ యోగా, ఒళ్లు నొప్పులకు సంబంధించిన యోగా వంటి విభాగాల్లో విశేషంగా పరిశోధన కూడా చేస్తున్నారు. ఆమె తమ పాఠశాల విద్యార్థులకు చదువుతో పాటు యోగాసనాలపై శిక్షణ కూడా ఇస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులకు యోగాలో తర్ఫీదు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. యోగా గురువుగా 18 ఏళ్లు రాజ్యలక్ష్మి టీచర్గా పనిచేసిన ప్రాంతాల్లో సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట నందు 2013 నుంచి యోగా గురువుగా సేవలు అందించారు. మొదటి ఐదేళ్లు పూర్తిగా ఉచిత తరగతులు నిర్వహించారు. 2016లో సత్తెనపల్లిలో నిర్వహించిన యోగ సప్తాహానికి రెండు వందల మంది హాజరై డయాబెటిస్ను నియంత్రించగలిగిన ప్రత్యక్ష ఫలితాలు చూశారు. కేవలం తాను పనిచేసిన స్కూల్స్, ఆయా గ్రామాల్లోనే కాకుండా లండన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, పారీస్, జర్మనీ తదితర దేశాలకు చెందిన వారికి ఆన్లైన్ విధానంలో యోగా శిక్షణ ఇస్తున్నారు. అలాగే పోస్టల్ ఉద్యోగిగా రెండేళ్ల కిందట రిటైర్డ్ అయిన భర్త పేరారెడ్డి కూడా యోగా గురువే కావడం విశేషం. ఆయన సాయీషా యోగ శిక్షణాలయాన్ని స్థాపించి ఎందరినో యోగా ప్రక్రియ వైపు నడిపిస్తున్నారు. వీరి ఇద్దరి సంతానంలో పెద్ద కుమారుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు యోగా శిక్షణ గురువుగా వ్యవహరిస్తుండగా, చిన్నకుమారుడు కూడా యోగా సాధకుడిగా కొనసాగుతున్నారు. రాజ్యలక్ష్మి తల్లి 75 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ యోగాసనాలు వేయడం విశేషం. యోగాలో మంచి నైపుణ్యం కలిగిన రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా గడుపుతున్నారు. -
సొంత మండలంలోనే బదిలీ చేయాలి
నరసరావుపేట: తమను సొంత మండలంలోనే బదిలీ చేయాలని సచివాలయ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు జీవో నంబరు ఐదును సవరించాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంతోపాటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు వినతిపత్రాలు సమర్పించారు. మధ్యలో గాంధీవిగ్రహం, శివుని బొమ్మ ఐలాండ్, మల్లమ్మ సెంటర్లలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ప్రమోషన్ ఫస్ట్–ట్రాన్స్ఫర్ నెక్స్ట్, క్యాడర్ తక్కువ–కొరడాలు ఎక్కువ, వార్డు నుంచి ఇద్దరికే బదిలీకి అవకాశం కల్పించాలి తదితర నినాదాల ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ షేక్ మహమద్ అలీ మాట్లాడుతూ బదిలీలకు సంబంధించిన జీవోను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నామన్నారు. తామంతా గ్రూప్–4 ఉద్యోగులమని, తమకు నెలకు రూ.30 వేల జీతం మాత్రమే వస్తోందన్నారు. ఈ జీతంతో వేరే మండలాలకు పిల్లలు, వృద్ధులతో కుటుంబాలను తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతల నిర్వహణ ఆర్థికభారంతో కూడుకున్న విషయమన్నారు. తమలో 50శాతానిపైగా మహిళలే ఉన్నారన్నారు. తామంతా ఉదయం 5 గంటల నుంచే విధి నిర్వహణలో పాల్గొంటున్నామని, సర్వేలన్నీ తామే పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కేడర్లో ఉన్న తమను సొంత మండలాల్లో ఉద్యోగం చేయకూడదనటం చాలా దారుణమని అన్నారు. బయటి మండలాలకు వెళ్లి మహిళలు ఏవిధంగా సర్వీసు చేస్తారని ప్రశ్నించారు. ఒక వేళ తప్పనిసరిగా తమను మార్చాలని అనుకుంటే జూనియర్ అసిస్టెంట్ కేడర్గా తమను పెంచాలని, సాంకేతిక ఉద్యోగులకు వారికి తగ్గట్లుగా జీతాలు ఇవ్వాలని, సీనియర్ అసిస్టెంట్ కేడర్కు పదోన్నతులు కల్పించాలని కోరారు. ఇప్పటికే రేషనలైజేషన్ పేరుతో రెండు వార్డులను కలిపి బాధ్యతలు అప్పగించటంతో పనిభారంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. మిగులు ఉద్యోగులను ఏం చేస్తున్నారనే దానిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని అన్నారు. జీవో నంబరు ఐదును సవరించి సొంత మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించాలన్నారు. వార్డు నుంచి వార్డుకు బదిలీ చేయాలని సూచించారు. ఉద్యోగులు షేక్ కరిముల్లా, కె.విజయలక్ష్మి, పి.రమేష్, ఎం.రమేష్నాయక్, మహిమజ్యోతి, షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కోరిన సచివాలయ ఉద్యోగులు జీవో నెం.5 సవరించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన -
తాగినోళ్లకు తాగినంత..!
● సమయపాలన లేకుండా మద్యం విక్రయాలు ● ప్రైవేటు వ్యక్తులతో కూటమి ప్రభుత్వం వ్యాపారం ● అధికారుల పర్యవేక్షణ లేమితో నిర్వాహకుల ఇష్టారాజ్యం ● పాలకుల కాసుల కక్కుర్తితో రోడ్డున పడుతున్న నిరుపేదలు కాసుల కక్కుర్తితో వేళాపాళాలేని మద్యం వ్యాపారాలకు నిరుపేద జీవితాలు రోడ్డున పడుతున్నాయి. కూటమి కాసుల కక్కుర్తితో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మద్యం దుకాణాలు వెళ్లాయి. పర్మిట్ రూములతో మూడు బాటిళ్లు.. ఆరు గ్లాసులు అన్నట్లు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఉదయమంతా కష్టపడి పనిచేసిన నిరుపేదల సొమ్మంతా మందు చుక్కల్లో ఆవిరవుతోంది. సాయంకాలానికి ఇంటికి చేరాల్సిన కూలీ డబ్బులు మద్యం దుకాణానికే సరిపోతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన ఎకై ్సజ్ అధికార యంత్రాంగం కాసుల మత్తులో మునిగి తేలుతోంది. నరసరావుపేట టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగించింది. ప్రజా ప్రతినిధుల మద్దతుతో వైన్స్ నిర్వాహకులు మద్యం విక్రయాలను అడ్డగోలుగా సాగిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటతోపాటు చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల పట్టణాలలో అనుమతులు లేకుండానే మద్యం వ్యాపారులు పర్మిట్ రూములను ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. మైనర్ బాలురకు సైతం మద్యం విక్రయిస్తుంటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడంతో వారిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. అది వ్యసన నియంత్రణకు దోహదపడిందని ప్రజల అభిప్రాయం. కూటమి ప్రభుత్వం మాత్రం విక్రయాలకూ టార్గెట్లు విధించింది. ఫిర్యాదు చేసినా స్పందనేది? మద్యం దుకాణ నిర్వాహకుల అక్రమాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు గతంలో ఫిర్యాదు చేశారు. తాము వ్యాపారాలు చేయలేమంటూ తాళాలు వేసి అధికారులకు తాళం చెవులు అప్పగించారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా ఎకై ్సజ్ అధికారులు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగితాల్లోనే నిబంధనలు మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం సమయ పాలన విధించింది. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు కొనసాగించాలి. కానీ రేయింబవళ్లు విక్రయిస్తున్నారు. రాత్రి వేళ క్వార్టర్కు రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు అర్ధరాత్రి వరకు విక్రయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో విచ్చలవిడిగా లభ్యం అవుతున్న మద్యంతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. నడిరోడ్లపై మందు బాబులు మద్యం మత్తులో నిద్రిస్తూ రాకపోకలకు అంతరాయం సృష్టిస్తున్నారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, పల్నాడు బస్టాండ్, కోట సెంటర్లలో రాత్రిళ్లు మందుబాబులు ఆయా ప్రాంతాల్లో స్వైరవిహారం చేస్తున్నారు. ప్రకాష్నగర్లో నడిరోడ్లపై తాగిన బీరు సీసాలను పడేస్తున్నారు. ఇప్పటికే అనేక గొడవలు జరిగాయి.అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బహిరంగ మద్యపానమే.. మద్యం దుకాణాలు ఉన్న పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను మద్యం బాబులు అడ్డాలుగా ఏర్పాటు చేసుకున్నారు. బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. పట్టణ శివారు ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద గుంపులుగా సాయంత్రం చేరి మద్యం తాగుతున్నారు. దీంతో అక్కడ నివాసం ఉండే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. -
పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం
యడ్లపాడు: పొగాకు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ప్రారంభించారు. యడ్లపాడు మండలం మైదవోలు–వంకాయలపాడు పరిధిలోని స్పైసెస్ పార్కు ఏపీ గిడ్డంగుల సంస్థ గోదాములో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఈ కేంద్రం ఏర్పాటైంది. రైతులు తెచ్చిన బేళ్ల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం డీఏవో మురళీ అధ్యక్షత వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 99 వేల క్వింటాళ్ల దిగుబడి రాగా, కొందరు రైతులు మాత్రమే విక్రయించుకోగలిగారన్నారు. జిల్లాలో 2,505 మంది పొగాకు రైతులకు ఇప్పటి వరకు 1,600 మంది ఏపీసీఎం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. నాణ్యమైన నల్లబర్లీ పొగాకుకు క్వింటాకు రూ.12 వేలు, తక్కువ నాణ్యత ఉంటే రూ.6 వేల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళి, ఆర్డీవో మధులత, మార్కెఫెడ్ ఉమ్మడి గుంటూరు జిల్లా మేనేజర్ టి.నర్సింహారెడ్డి, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ బి.మురళీకృష్ణ, డీసీఎంఎస్ (బిజినెస్) డి.హరగోపాల్, ఏపీఎస్డబ్ల్యూసీ మేనేజర్ బి.సురేష్, ప్రభుత్వ పొగాకు బయ్యర్ చెరుకూరి నాగేశ్వరరావు, ఐటీసీ జీఎస్–3 హెచ్ఆర్ మేనేజర్ కందుల బాలాజీ, ఏవో హరిప్రసాద్, తహసీల్దార్ జె.విజయశ్రీ, ఎంపీడీవో వి.హేమలతాదేవి తదితరులు పాల్గొన్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు -
‘యోగా డే‘కు పరేడ్ గ్రౌండ్ సిద్ధం
నరసరావుపేట: కలెక్టరేట్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్లో శనివారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు శుక్రవారం సాయంత్రం నుంచి నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ మొత్తం ఆకుపచ్చ పరదాలతో నింపేశారు. సుమారు 10 వేల మంది యోగాసనాలు సాధన చేసేలా సిద్ధం చేస్తున్నారు. వారికి అవసరమైన తాగునీరుతోపాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంచుతున్నారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు పాల్గొననున్నారు. న్యాయవాదులకు అవగాహన తరగతులుగురజాల: జూనియర్ న్యాయవాదులకు శుక్రవారం చట్టాలపై అవగాహన తరగతులు నిర్వహించారు. స్థానిక కోర్టు భవనాలలో జిల్లా జడ్జి జి. ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ చట్టాలపై ప్రతిఒక్కరూ లోతుగా అవగాహన కలిగి ఉండాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జి సత్యనారాయణ, జూనియర్ సివిల్ జడ్జి అలేఖ్య, పీపీ కందిమళ్ల సూర్యరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట శ్రీనివాసరావు, న్యాయవాదులు రామిరెడ్డి, హనుమంతరావు, వై.వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నగదు రహిత వైద్యం అందించాలి నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవలో పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవపై జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఫిర్యాదుల కమిటీ సభ్యులు విచారణ చేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ జి.చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. లాసెట్లో సూర్యతేజకు మూడవ ర్యాంకు నరసరావుపేట: పట్టణానికి చెందిన బత్తుల నరసింహం, సరస్వతి దంపతుల రెండో కుమారుడు సూర్యతేజ శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ–లాసెట్ ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంక్ సాధించారు. దివ్యాంగుడైన ఆయన పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగానే పూర్తి చేశారు. ఇంటర్లో 80 శాతం మార్కులు సాధించారు. నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలకు హాజరై ఒడిశా యూనివర్సిటీలో సీటు పొందారు. 15 ఏళ్ల వయస్సులో వచ్చిన స్పాండిలైట్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఆ తర్వాత చికిత్స చేయించుకున్నప్పటికీ అంగవైకల్యం వదలలేదు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన తండ్రి, సోదరుడు చిరు వ్యాపారం చేస్తున్నారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనే పట్టుదల, కృషితో సొంతంగా పరీక్షకు సిద్ధమై ఈ విజయం సాధించినట్లు తల్లితండ్రులు, సోదరుడు తెలిపారు. జీవితంలో ఓ గొప్ప న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఎదగాలనే ఆకాంక్షను సూర్యతేజ వ్యక్తం చేశారు. 23 నుంచి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు గుంటూరు వెస్ట్: శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. తన చాంబర్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందుగా ఏసీ కాలేజీ వైపు నుంచి పనులు ప్రారంభించాలని, దీనికి సంబంధించి సోమవారం నుంచి ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు పత్రికలు, మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆమె చెప్పారు. వాహనదారులకు వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
ఇదేంది‘రప్పా’..! అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
సాక్షి, నరసరావుపేట: అధికారపార్టీ అడ్డంగా బుక్కయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై కూటమి నేతలు, వారి అనుకూల మీడియా రెండు రోజులుగా నానాయాగీ చేశారు. ‘‘సైకోలు వీరంగం చేశారు, నరకుడు భాష ఏంటి’’ అటూ పచ్చ పత్రికల్లో వార్తలు రాయడంతోపాటు టీవీ చానళ్లలో డిబేట్లు నిర్వహించారు.వైఎస్సార్సీపీ అభిమానులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. పుష్ప సినిమాలోని రప్పా.. రప్పా.. పోస్టర్ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజపై టీడీపీ మైనార్టీ సెల్ సత్తెనపల్లి టౌన్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులూ తక్షణం కేసు నమోదు చేశారు. తీరా చూస్తే రవితేజ టీడీపీ వాడేనని తేలిపోయింది. దీంతో అధికారపార్టీ అడ్డంగా దొరికిపోయింది. బయటపడిన అసలు నిజాలు పోలీసులు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన బొల్లెద్దు రవితేజను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. రవితేజ కుటుంబ సభ్యులు తాము టీడీపీ అభిమానులమని తమకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరామని ఫొటోలు చూపారు. బొల్లెద్దు రవితేజపై ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డు రవితేజ పేరు మీద ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డునూ వారే బయటపెట్టారు. దీంతో టీడీపీ నేతలు, సోషల్మీడియా కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. టీడీపీ సభ్యత్వం ఉండి వైఎస్సార్సీపీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నాడని, ఏ ఉద్దేశంతో హాజరయ్యాడు? రవితేజ వెనుక ఎవరున్నారంటూ సోషల్మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవితేజ టీడీపీ కోవర్టేనని, వైఎస్ జగన్ పర్యటనలో ఆలజడులు సృష్టించడానికే టీడీపీ నేతలు అతనిని పంపి కుట్రలు పన్నారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కొత్త రాగం వైఎస్సార్సీపీ అభిమానులపై టీడీపీ చేసిన దు్రష్పచారం బూమరాంగ్ కావడంతో ఆ పార్టీ నేతలు కొత్త రాగం మొదలుపెట్టారు. రవితేజ తల్లిదండ్రులు టీడీపీ వారేనని, కానీ రవితేజ మాత్రం వైఎస్సార్సీపీ అభిమాని అంటూ బుకాయిస్తున్నారు. బీమా ఉందని టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంటూ పెదకూరపాడు నేతలతో వీడియోలు విడుదల చేయించారు. దీనికి సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టి సమాధానాలు ఇచ్చారు. కోట్ల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటూ మహానాడులో చేసే ప్రసంగాలన్నీ వట్టివేనా అంటూ ప్రశి్నంచారు. జీవిత బీమా ఉంటుందని ఆశచూపి ఇతర పార్టీల నేతలకూ సభ్యత్వాలు అంటగడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. -
కాకినాడ టౌన్–చర్లపల్లి, లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్–చర్లపల్లి, కాకినాడ టౌన్–లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాట టౌన్–చర్లపల్లి (07447) ప్రత్యేక రైలు జూలై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07448) జూలై 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ● కాకినాడ టౌన్–లింగంపల్లి (07445) ప్రత్యక రైలు జూలై 2 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07446) జూలై 3 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో ఆగుతుంది. -
సికిల్ సెల్ అనీమియా వ్యాధిని రూపుమాపుదాం
నరసరావుపేట రూరల్: అరుదైన జన్యుపరమైన వ్యాధి సికిల్ సెల్ అనీమియాను రూపుమాపేందుకు కృషిచేద్దామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ కొద్ది మందికో వచ్చే సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని గుర్తించి సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చనని తెలిపారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై గురువారం పెదతురకపాలెం గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహం, పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ అరుణ్బాబు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబులు పాల్గొని విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యాధిపై అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జోత్న, ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన తాడికొండ: సుపరిపాలన– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23న వెలగపూడి రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం సీఆర్డీఏ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకొని, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ తేజ, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ నవీన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసరావు, తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణ, డీటీ వసంతరావు పాల్గొన్నారు. మహిళలపై పెరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు లక్ష్మీపురం: రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు పెరిగాయని, వయస్సుతో సంబంధం లేకుండా హత్యలు జరుగుతున్నాయని మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలయంలోని మల్లయ్య లింగం భవన్లో రాజవరపు కోటేశ్వరమ్మ అధ్యక్షతన గురువారం మహిళా సమాఖ్య మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెంటాల కుమారి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు రూపొందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. మహిళలు కూడా ఐక్యంగా పోరాట బాటలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. గొట్టిముక్కల దుర్గ నగర అధ్యక్షురాలిగా, గుండెబోయిన లక్ష్మి ప్రధాన కార్యదర్శిగా, 11 మంది కార్యవర్గం, 21 సమితి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, చల్లా మరియా దాస్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకూ ‘తల్లికి వందనం’ ఇవ్వాలి లక్ష్మీపురం: తల్లికి వందనం పథకాన్ని ఆప్కాస్లో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ వర్తింపజేయాలని సీపీఐ నగర కార్యదర్శి, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. గుంటూరు వసంతరాయపురం మలేరియా డివిజన్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కార్మికులు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మాల్యాద్రి మాట్లాడుతూ పథకాల అమలులో ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను చిన్నచూపు చూడడం సరైనది కాదని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు మున్సిపల్ కార్మికులందరినీ లబ్ధిదారులుగా చేసి ఆదుకోవాలని కోరారు. ఇంజినీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, మున్సిపల్ కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. -
అంతా అగమ్యగోచరం
రాజధాని నిర్మాణం గుంటూరు రూరల్: రాజధాని నిర్మాణం అంతా అగమ్యగోచరంగా ఉందని వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నా రు. రాజధాని ప్రాంతానికి చెందిన వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, ముఖ్య నేతల సమావేశాన్ని గురువారం గుంటూరు రెడ్డిపాలెంలోని తన స్వగృహంలో నిర్వహించారు. మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ రాజధానిలో నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారు? భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం ఎప్పటిలోగా అందజేస్తారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులు ఉన్నాయని, వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన పేదలకు తిరిగి భూములు ఇస్తారా? ఇస్తే ఎక్కడ ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. సీఆర్డీఏ, ఎంఏయూడీ అఖిలపక్షాన్ని పిలిచి, రాజధాని ప్రాంతంలో పరిస్థితులు, జరుగుతున్న పనులను వివరించాలని డిమాడ్ చేశారు. సీఆర్డీఏ తీసుకున్న రుణాలపై శ్వేతపత్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. రైతులకు కౌలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలోని జగనన్న కాలనీలను రద్దు చేశారు కాబట్టి వారికి వేరే ప్రాంతంలో భూములు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డెప్యూటీ మేయర్ బాలవజ్రబాబు, మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, మందపాటి శేషగిరిరావు, దంటు బాలాజీరెడ్డి పాల్గొన్నారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల -
సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండ
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) కుటుంబానికి వైఎస్సార్ సీపీ నేతలు గురువారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని కిరణ్కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి కొలకలూరి కోటేశ్వరరావు తదితరులు సింగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులిర్పించారు. పిల్లల చదువులు, తదితర విషయాలను వాకబు చేశారు. కుటుంబానికి వైఎస్సార్ సీపీ కుటుంబం ప్రతి విషయంలో తోడుంటుందని తెలిపారు. పార్టీ తరఫున ఇప్పటికే రూ. 10 లక్షలను ప్రకటించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రెండు కుటుంబాల అదృశ్యంపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్నగర్లో నివసించే రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. కారు డ్రైవింగ్కు వెళ్లిన బెవర దుర్గారావు ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు. ఆమె గానీ కుటుంబ సభ్యులు గానీ లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా వారు కనిపించలేదు. తన భార్యతో పాటు తోడల్లుడి కుటుంబం కూడా కనిపించడం లేదని పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన వారిలో దుర్గారావు భార్య సుధారాణి, కుమారుడు నవీన్ కుమా ర్, కుమార్తె యశ్వణి, తోటికోడలు, మరో ఇద్దరు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాడేపల్లి ఎస్ఐ ప్రతాప్ కుమార్ కేసు నమోదు చేశారు. -
హైవేపై మూడు వాహనాలు ఢీ
మార్టూరు: జాతీయ రహదారిపై ఒకదాని వెనుక మరొకటిగా వెళుతున్న మూడు వాహనాలు పరస్పరం ఢీకొన్న సంఘటన స్థానిక రాజుపాలెం, డేగరమూడి రెస్ట్ ఏరియా సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నాయక్, శ్రీహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన పద్మనాభయ్య శెట్టి తన వాహనంలో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వెళ్తున్నాడు. రెస్ట్ ఏరియా సమీపంలోకి వెళ్లగానే వాహనాన్ని వెనుక నుంచి గ్రావెల్ తరలించే టిప్పర్ వాహన డ్రైవర్ బలంగా ఢీ కొట్టి రహదారి మధ్యలో తన వాహనాన్ని నిలిపివేశాడు. అదే మార్గంలో విజయవాడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న కంటైనర్ వాహనం హఠాత్తుగా అడ్డుగా వచ్చిన టిప్పర్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు మూడు వాహనాలు ధ్వంసం అయినప్పటికీ వాహనాల్లోని వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్, ట్రాఫిక్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని రహదారికి అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
తల్లులకు గుండెకోత
కూటమి సూపర్ సిక్స్ పథకాలు.. సాధారణ ఓటర్లను అమితంగా ఆకర్షించిన నినాదాలు. ప్రజలను ఆశల పల్లకీ ఎక్కించాయి. కూటమి పార్టీలకు ఓట్లను కురిపించాయి. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన వరాలను కురిపిస్తుందని ఎదురుతెన్నులు చూశారు. ఊరించి ఊరించి ఎట్టకేలకు ‘తల్లికి వందనం’ పథకం ఆర్థిక సాయాన్ని తల్లుల ఖాతాలకు జమ చేసింది ప్రభుత్వం. రకరకాల ఆంక్షలతో అర్హుల జాబితాలో పేర్లు ఎక్కని వారి సంగతి అటుంచి, ఖాతాలో జమచేసిన డబ్బులకు రెక్కలొస్తున్నాయి. రుణ బకాయిలున్న తల్లుల ఖాతాల్లో పడిన ‘తల్లికి వందనం’ ఆర్థికసాయాన్ని బ్యాంకులు బకాయిలకు జమ చేసుకుంటున్నాయి. దీంతో తల్లులు గొల్లుమంటున్నారు. తెనాలి: గతంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలనే భావనతో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది. వాటి అమలుకు క్యాలెండరును ప్రకటించింది. ఆయా తేదీల్లో లబ్ధిదారులకు ఠంఛన్గా ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. అందులో అమ్మఒడి పథకం ఒకటి. పిల్లలు విద్యకు దూరం కాకుండా చూడాలనే ఉద్దేశంతో దీన్ని రూపొంచింది. బిడ్డలను బడికి పంపే తల్లికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించింది. రూ.13 వేల చొప్పున నాలుగేళ్లు ఆర్థికసాయాన్ని అందజేసింది. మిగిలిన రెండు వేల రూపాయలను పాఠశాలల అభివృద్ధి, టాయ్లెట్ల నిర్వహణకు కేటాయించింది. ఆశలు అడియాసలే.. ‘తల్లికి వందనం’ పథకానికి అర్హులైన పలువురు తల్లుల పేర్లు అనర్హుల జాబితాలోకి ఎక్కాయి. అదేమని ప్రశ్నిస్తే, గ్రీవెన్స్లో పెట్టుకోమని అధికారులు చెబుతున్నారు. ఆ కార్యక్రమం జరుగుతోంది. ఈలోగా పలువురు లబ్ధిదారులకు తెలియకుండా వారి ఖాతాల్లో పడిన తల్లికి వందనం ఆర్థికసాయం ఖాళీ అవుతోంది. ఖాతాల్లోంచి డబ్బు మళ్లించిన మెసేజ్ రావటంతో పరుగు పరుగున బ్యాంకుకు వెళ్లిన లబ్ధిదారుల ఆశలు అడియాస అవుతున్నాయి. బకాయిలకు జమ చేసుకున్నామని బ్యాంకులు చెప్పిన మాటతో ఖిన్నులయ్యారు. టిడ్కో గృహాల రుణాల సహా వివిధ రుణాలకు సంబంధించిన బకాయిలున్న ఖాతాదారుల్లో ఎవరికై నా తల్లికి వందనం ఆర్థికసాయం ఖాతాల్లో జమ కావడం ఆలస్యం, సంబంధిత బ్యాంకులు వాటిని బకాయిల్లో జమ చేసుకుంటున్నాయి. ఒక బ్యాంకు అని కాకుండా దాదాపు అన్ని ఇదే తరహాలో వసూలు చేస్తున్నట్టు తెలిసింది. కనీసం ఖాతాదారుకు సమాచారం లేకుండానే వారి ఖాతాల్లో పడిన డబ్బులను మళ్లించుకుంటున్నాయి. బిడ్డలను చదివించుకోవాలని అనుకుంటున్న తల్లుల ఆశయానికి విఘాతం కలుగుతోంది. ఆ చేత్తో ఇస్తూ...ఈ చేత్తో తీసేసుకుంటున్న ప్రభుత్వం ‘తల్లికి వందనం’ ఆర్థిక సాయాన్ని బకాయిల కింద జమ చేసుకుంటున్న బ్యాంకర్లు లబోదిబోమంటున్న లబ్ధిదారులు ఆర్థిక సాయం ప్రయోజనానికి విఘాతం కూటమి నేతల సన్నాయి నొక్కులు 2024 ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు అమ్మఒడి సాయాన్ని తల్లికి వందనం పేరుతో ఇస్తామని ప్రకటించారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఆ తల్లి ఖాతాలో జమచేస్తామని హామీనిచ్చారు. ఆయా పార్టీల కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లారు. ఇంట్లో చదువుతున్న పిల్లల పేర్లు రాసుకుని, వారికి అంత మొత్తం ఏటా వస్తుందని నమ్మబలికారు. వారిలో ఆశలు రేపారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. గత ఏడాదిగా సూపర్ సిక్స్ పథకాల్లో సామాజిక పింఛన్లు మినహా మిగిలిన వాటిని పక్కన పెట్టేశారు. అదేమంటే గల్లా పెట్టె ఖాళీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిలదీస్తుండటం, ప్రజల్లోనూ హామీలను అమలుచేయడం లేదన్న అసహనం పెరిగిపోతుండటంతో ప్రభుత్వం దిగి వచ్చింది. విద్యాసంవత్సరం ఆరంభంలో తల్లికి వందనం ఆర్థికసాయాన్ని రూ.13 వేల చొప్పున ప్రభుత్వం తల్లుల జాబితాల్లో వేసింది. -
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
సంతమాగులూరు(అద్దంకి): నిలిచి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఐదుగురికి గాయాలైన సంఘటన సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. అందిన సమాచారం మేరకు.. తణుకు నుంచి నంద్యాల వైపు లోడ్తో వెళుతున్న లారీ పాత మాగులూరు వద్ద ఆగి ఉంది. ఈ క్రమంలో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న లారీని గమనించకుండా ఢీ కొట్టడంతో మూడో సీటులో కూర్చున్న అనంతపురం రూరల్ మండలానికి చెందిన హుస్సేన్(55) అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రైలులో బెర్త్ లేక బస్సులో.. దూదేకుల హుస్సేన్ ఈ నెల 17వ తేదీన తన స్నేహితుడు అబ్దుల్ దౌలాతో పనిమీద విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరూ రైలు ఎక్కడానికి మచిలీపట్నం రైల్వేస్టేషన్కు వెళ్లారు. అక్కడ ఒకే బెర్త్ ఉండటంతో, దౌలా రైలు ఎక్కాడు. హుస్సేన్ బస్సులో అనంతరపురం బయలుదేరాడు. ఆ బస్సు సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామ సమీపంలోకి రాగానే ముందు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో సీటులో కూర్చుని ఉన్న హుస్సేన్ తల ముందు సీటుకు తగిలి, తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య ఆశాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభి తెలిపారు. ఒకరు మృతి.. ఐదుగురికి స్వల్ప గాయాలు -
సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన అవసరం
సాంఘిక, గిరిజన సంక్షేమం శాఖ కార్యదర్శి మల్లికార్జున నాయక్ మంగళగిరి: సికిల్ సెల్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ సాంఘిక, గిరిజన సంక్షేమం శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జుననాయక్ తెలిపారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్)లో గురువారం ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, గిరిజన వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జుననాయక్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. వారసత్వంగా వచ్చే రుగ్మతకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ సరస్వతి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న, బ్లడ్ సెల్ కన్సల్టెంట్ డాక్టర్ సోనియా మోహన్, డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ఎయిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ శ్రీమంత్కుమార్ దాస్, ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మోహన్ పాల్గొన్నారు. -
పథకం ప్రకారమే వృద్ధురాళ్ల హత్య
● మృతుల్లో ఒకరైన రాజేశ్వరికి పరిచయమున్న మహిళ కీలకం ● పోలీసుల దర్యాప్తులో వెల్లడి ● రక్షించుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వృద్ధురాళ్లు తెనాలి రూరల్: స్థానికంగా కలకలం రేపిన వియ్యపురాళ్ల హత్యలు పథకం ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరూ వృద్ధ మహిళలు ఒంటరిగా ఉంటున్నారని గమనించిన దుండగులు వారిని హతమార్చి బంగారాన్ని అపహరించారు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారమే హత్య చేసినట్టు ఘటన స్థలంలో తెలుస్తోంది. ఆటోలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో ఓ మహిళ, ఇద్దరు యువకులు వియ్యపురాళ్లైన దాసరి రాజేశ్వరి(65), పిటా అంజమ్మ(70)లు ఒంటరిగా ఉంటున్న నివాసానికి రావడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వచ్చి 10 నిమిషాల అనంతరం వెళ్లపోయారని స్థానికులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన సందర్భంలో కేకలు వినపడ్డాయని, కొందరు పోలీసులకు తెలిపారు. తెనాలి నుంచి బాపట్ల జిల్లా చుండూరు మండలం చినపరిమి గ్రామానికి వెళ్లే రోడ్డులో గతంలో నిర్వహించిన అప్పడాల కంపెనీ పై అంతస్తులో వృద్ధ వితంతు వియ్యపురాళ్లు కలసి ఉంటున్నారు. సాధారణంగా వీరు కింది కంపెనీలోకి వెళ్లరని, సాయంత్రం ఇంటి బయట అరుగు మీద కూర్చుంటూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు. హత్యలు మాత్రం వాడుకలో లేని అప్పడాల కంపెనీలో జరగడం గమనార్హం. రెండు మృతదేహాలు వేర్వేరు గదుల్లో పడి ఉన్నాయి. తెలిసిన వ్యక్తుల పనే? ఈ డబుల్ మర్డర్ తెలిసిన వ్యక్తుల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సీసీ పుటేజీలో రికార్డు అయిన మహిళకు, రాజేశ్వరికి కొన్నేళ్లుగా పరిచయముందని ఇక్కడి వారు చెబుతున్నారు. ఆ పరిచయం ఆధారం చేసుకుని అప్పడాల కంపెనీని అద్దెకు తీసుకునేందుకు వచ్చి, రాజేశ్వరి, అంజమ్మలను కిందకు పిలిపించి కంపెనీలోకి తీసుకెళ్లి హత్య చేసినట్టు భావిస్తున్నారు. హత్య సందర్భంలో తీవ్ర పెనుగులాట? నిందితులు వృద్ధురాళ్లను హత్య చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఇద్దరూ తీవ్రంగానే ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో మృతదేహాలు పడి ఉన్న తీరు ఇందుకు బలం చేకూరుస్తోంది. రాజేశ్వరి చేతిలో కర్ర ఉండగా, అంజమ్మ చేతిలో రెండు కిలోల తూకం రాయి రక్తం మరకలతో ఉంది. దీనిని బట్టి పెనుగులాట జరిగి ఉంటుందని, ఇద్దరూ తమను రక్షించుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు విచక్షణారహింతంగా తలలపై దాడి చేసి హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. తమ వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లు, ఇతర పరికరాలతో దాడి చేసి హత్య చేసి ఉంటారని ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీం భావిస్తున్నారు. అంజమ్మ చేతిలోని తూకం రాయి, రాజేశ్వరి చేతిలోని కర్రను క్లూస్ టీం సీజ్ చేసింది. ఇద్దరి మృతదేహాలు వేర్వేరు గదుల్లో పడి ఉన్నాయి. హత్య చేసి వీరి వద్ద ఉన్న బంగారాన్ని నిందితులు అపహరించుకెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుల ఆచూకీ పోలీసులు గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. -
జాయింట్ ఎల్పీఎన్ సమస్యకు శాశ్వత పరిష్కారం
నరసరావుపేట సర్వేశాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ యడ్లపాడు: రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ ల్యాండ్ పార్శిల్ నంబర్ (ఎల్పీఎన్)తో ఇబ్బందులు పడుతున్న రైతులు సబ్–డివిజన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నరసరావుపేట సర్వేశాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కోరారు. గురువారం యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, తహసీల్దార్ జెట్టి విజయశ్రీతో సమావేశమై జాయింట్ ఎల్పీఎం, సబ్–డివిజన్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒకే జాయింట్ ఎల్పీఎన్తో 10 ఎకరాలకు మించి భూమి కలిగి ఉండటం వల్ల కొందరు అర్హత ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాల నగదును పొందలేకపోతున్నారని శ్రీనివాస్ తెలిపారు. నరసరావుపేట డివిజన్లో పరిధిలో ఈ తరహావి మొత్తం 6,416 జాయింట్ ఎల్పీఎంలు ఉండగా, ఒక్క యడ్లపాడు మండలంలో 1872 జాయింట్ ఎల్పీఎంలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ జాయింట్ ఎల్పీఎంలను సబ్–డివిజన్ చేస్తున్నట్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు. రైతులు కేవలం రూ.50 రుసుముతో గ్రామ సచివాలయాల్లో వెంటనే సబ్–డివిజన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30లోపు సబ్–డివిజన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. మండల సర్వేయర్ సురేంద్రతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
డిగ్రీ పట్టా వెనుక తల్లిదండ్రుల త్యాగం
● ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి ● ఘనంగా వీవీఐటీ స్నాతకోత్సవం పెదకాకాని: ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ పట్టా వెనుక తల్లిదండ్రుల త్యాగాలు ఎన్నో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల స్నాతకోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి, వీవీఐటీ విశ్వవిద్యాలయ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చాన్సలర్ కొడాలి రాంబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.ప్రొఫెసర్ మధుమూర్తి మాట్లాడుతూ డిగ్రీ అంటే కేవలం పట్టా మాత్రమే కాదు జ్ఞానాన్ని సంపాదించడం అన్నారు. స్టార్టప్ కంపెనీలను స్థాపించి ఉద్యోగాలు అందించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. వీవీఐటీ విశ్వవిద్యాలయ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వైస్ చాన్సలర్ కొడాలి రాంబాబు మాట్లాడుతూ 2007లో ప్రారంభమైన వీవీఐటీ కళాశాల అనతి కాలంలోనే అనేక విజయాలను సొంతం చేసుకొని 2025లో విశ్వవిద్యాలయంగా ఎదిగిందని చెప్పారు. వీవీఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి కళాశాల వార్షిక ప్రణాళికను, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. 2021–2025 విద్యా సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబరచి కళాశాల టాపర్గా నిలచిన విద్యార్థిని పరుచూరి బిందు రేణుకకు వాసిరెడ్డి వెంకటాద్రి బంగారు పతకాన్ని ముఖ్య అతిథి ప్రొఫెసర్ కె. మధుమూర్తి అందజేశారు. క్లాస్ ఆఫ్ 2025కు ఉత్తమ ప్రతిభ కనబరచిన 11 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలతోపాటు 1195 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో వీవీఐటీ వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, సెక్రటరీ ఎస్. బదరీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మామాళ్లపల్లి శ్రీకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్ డాక్టర్ కె. గిరిబాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి బర్లీ కొనుగోలు
నరసరావుపేట: జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి యడ్లపాడులోని స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్ గోడౌన్లో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని ఏపీ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా హెచ్డీఎం టాప్ గ్రేడ్ టొబాకో కిలో రూ.120, హెచ్డీఎక్స్ గ్రేట్ టొబాకో కిలో రూ.60లకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులు పొగాకును గ్రేడ్లుగా చేసుకొని బేళ్లుగా కట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. బేళ్ల బరువు 25 కిలోల నుంచి 150 కిలోల లోపు మాత్రమే ఉండాలని, తేమశాతం 20 శాతంకు మించకూడదన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు కొనుగోలు తేదీ, సమయం వారి మొబైల్ నెంబర్కి సమాచారం వస్తుందని, ఆరోజు మాత్రమే కొనుగోలు కేంద్రానికి వారి పొగాకు తీసుకొని రావాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి మాట్లాడుతూ జిల్లాలోని హెచ్డీ బర్లీ పొగాకు పంటసాగుచేసిన రైతులు సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే వారు పండించిన పొగాకును ఏపీ మార్కెఫెడ్ ద్వారా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లాలో 2522 మంది రైతులు ఏపీఏఎంఐఎస్ యాప్లో పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఆర్డీఓ కె.మధులత, ఎం.శివకుమారి, ఏడీఏ పి.మస్తానమ్మ, కొనుగోలు అధికారి మురళి, జీడీసీఎంఎస్ మేనేజర్ హరగోపాల్, సబ్ డివిజన్ తహసీల్దార్లు, ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు హాజరయ్యారు. యడ్లపాడు వేర్హౌసింగ్ గోడౌన్లో కొనుగోలు కేంద్రం సీఏం యాప్లో నమోదుచేసుకున్న రైతులకే... మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి -
వెంకట జయవర్ధన్ రెడ్డి అకాలమృతి బాధాకరం
● వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ● అశ్రునయనాలతో అంతిమయాత్ర సత్తెనపల్లి: యువకుడు పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి అకాల మరణం బాధాకరమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 16వ వార్డు వడ్డవల్లి ఏరియాకు చెందిన పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి బుధవారం సొమ్మసిల్లి పడిపోయి గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం నిర్వహించిన అంతిమ యాత్రలో గజ్జల సుధీర్ భార్గవర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన కుమారుడు అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. వెంకట జయ వర్ధన్రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం వెంకటజయవర్ధన్ రెడ్డి మృతి వార్త తెలియడంతో డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డితో పాటు మాజీమంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్రెడ్డి, యర్రం వెంకటేశ్వరరెడ్డి, నాయకులు చిట్టా విజయభాస్కర్రెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్రెడ్డి, రోళ్ల మాధవిలు పార్ధివదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. అశ్రునయనాల నడుమ అంతిమ యాత్ర జరిగింది. ప్రత్యేక వాహనంపై వెంకట జయవర్ధన్రెడ్డి పార్ధీవ దేహాన్ని ఏర్పాటు చేసి పట్టణంలో ప్రదర్శన చేశారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్య కర్తలు, మృతుడి మిత్ర బృందం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జయవర్ధన్రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం సత్తెనపల్లి: పట్టణంలోని 16వ వార్డు వడవల్లి ఏరియాకు చెందిన యువకుడు పాపసాని వెంకట జయవర్ధన్రెడ్డి (32) బుధవారం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో సొమ్మ సిల్లి పడిపోగా వైద్యశాలకు తరలించగా గుండెపోటుతో మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. పాపసాని వెంకటజయవర్ధన్రెడ్డి మృతదేహానికి రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో గురువారం ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానస్పద మృతిగా పట్టణ ఎస్ఐ ఎం.పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. -
యోగా డే విజయవంతం చేద్దాం
నరసరావుపేట: ఈ నెల 21న జిల్లా అంతటా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం యోగాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. అనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నద్ధత, ఏర్పాట్లు, యోగా ట్రైనర్లకు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల పంపిణీ, ఫేజ్–3 శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసుకోవడం వంటి అంశాలపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి కార్యక్రమం 10వేల మందితో కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్, మరో 10వేల మందితో అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లావ్యాపంగా వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో గుర్తించిన వేదికలలో నిర్వహించే యోగాంధ్రలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, సాధారణ ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలో ఇంతవరకు యోగాంధ్రకు సుమారు 9.81లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్ఓ మురళి, జిల్లా అధికారులు డాక్టర్ రవి, ఎల్.చంద్రకళ పాల్గొన్నారు. 21న పరేడ్ గ్రౌండ్లో 10 వేల మందితో జిల్లాస్థాయి కార్యక్రమం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు -
ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలి
సత్తెనపల్లి: రాజీపడదగిన కేసుల్లో లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా న్యాయవాదుల సహకారం కూడ అవసరమని సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సీనియర్ సివిల్ జడ్జి వి.విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. పట్టణంలోని బార్ అసోసియేషన్ హాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్ కుమార్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 5వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో సత్తెనపల్లి న్యాయస్థాన పరిధిలో ఉన్న రాజీ పడదగిన కేసుల్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా న్యాయవాదులు చూడాలన్నారు. లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు. సమావేశంలో ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) తౌషిద్ హుస్సేన్, మొదటి అదనపు సివిల్జడ్జి (జూనియర్ డివిజన్) పి. ప్రియదర్శిని, రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జె.సుజన్కుమార్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చిన్నం మణిబాబు, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉన్నారు. సీనియర్ సివిల్ జడ్జి వి.విజయ్ కుమార్ రెడ్డి -
టార్గెట్ వైఎస్సార్సీపీ.. అంబటి సహా పలువురిపై కేసులు
సాక్షి, పల్నాడు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెడుతూనే ఉంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా పార్టీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.పల్నాడులో అనుమతులకు విరుద్ధంగా నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేశారని, ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, మాజీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొర్లకుంట వెంకటేశ్వర్లు తోపాటు మరికొంతమందిపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కట్టెంపూడిలో బారికేడ్లు తొలగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వారి పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ అంబటిపై కేసు ఫైల్ చేశారు. -
ఆంక్షలు పెట్టినా.. తగ్గేదేలే!
వినుకొండ: పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో బుధవారం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. అయితే ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా కార్యకర్తలతో కలసి కారులో వెళుతుండగా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఓ సాధారణ కార్యకర్తలా ద్విచక్ర వాహనంపై వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట రెంటపాళ్లకు చేరుకున్నారు. కొన్నిచోట్ల పోలీసులు విసిగించినా తనపై కేసులు నమోదు చేసుకోండి.. కానీ జగన్ పర్యటనకు మాత్రం హాజరై తీరుతానని తేల్చి చెప్పారు. -
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం
ఏఎన్యూ: యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి అన్నారు. యోగాంధ్రలో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన యోగా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యోగా ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించి దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ఏఎన్యూ వీసీ ఆచార్య కె. గంగాధరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ యోగా ఆవశ్యకతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్ అడ్వైజర్ ఆచార్య జి.రోశయ్య, వర్సిటీ పాలకమండలి సభ్యులు ఆచార్య సుమంత్ కుమార్, ఆచార్య జగదీష్ నాయక్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం యోగా ఆవశ్యకతను తెలిపారు. ప్రిన్సిపల్ ఆచార్య వీరయ్య, ఆచార్య సురేష్ కుమార్, ఓఎస్డీ ఆచార్య రవికుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, యోగాంధ్ర నిర్వాహకులు ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్, రూసా డైరెక్టర్ ఆచార్య ఎస్.మురళీమోహన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య దివ్య తేజోమూర్తి, సీడీసీ డీన్ ఆచార్య రవికుమార్, పీజీ, యూజీ పరీక్షల కోఆర్డినేటర్లు ఆచార్య సుబ్బారావు, ఆచార్య ఎన్వీ కృష్ణారావు, వర్సిటీ వసతి గృహాల చీఫ్ వార్డెన్లు ఆచార్య మల్లికార్జున్, డాక్టర్ మాధవి, ఆచార్య త్రిమూర్తి రావు, ఆచార్య బ్రహ్మాజీ, ఆచార్య సుధాకర్, డాక్టర్ చంద్రమౌళి, గుంటూరు జిల్లా పరిధిలోని పలు కళాశాలల నుంచి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సీఆర్డీఏ జాబ్మేళాలో 110 మంది ఎంపిక
తాడికొండ: ఏపీ సీఆర్డీఏ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ సహకారంతో తుళ్ళూరు సీఆర్డీఏ స్కిల్ హబ్ ప్రాంగణంలో బుధవారం జాబ్ మేళా జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమొబైల్, ఫైనాన్స్, స్కిల్ డెవలప్మెంట్ రంగాలకు చెందిన కంపెనీలైన వరుణ్ మోటార్స్, స్కిల్ క్రాఫ్ట్ లిమిటెడ్, ఎంవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్, కేఎంవీ ప్రాజెక్ట్ లిమిటెడ్, శ్రీ రామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలు పాల్గొన్నాయి. మొత్తం 806 మంది దరఖాస్తు చేసుకోగా 264 మంది హాజరయ్యారు. ఇంటర్వ్యూ తర్వాత 110 మందికి ఆఫర్ లెటర్లు అందించారు. 137 మంది అభ్యర్థులను తదుపరి రౌండ్లకు ఎంపిక చేశారు. రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధుల బృందం ఈ జాబ్ మేళాను పరిశీలించింది. అభ్యర్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంది. సమన్వయ అధికారులుగా ఏపీ ఎస్ఎస్డీసీ నైపుణ్య శిక్షణాధికారి సాయి శ్రీనివాస్, ప్లేస్మెంట్ అధికారి అరుణకుమారి పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు కమిషన్ ప్రాధాన్యం
గుంటూరు వెస్ట్: మహిళల రక్షణకే జాతీయ మహిళ కమిషన్ ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తుందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ అన్నారు. బుధవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మజుందార్తోపాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చనా మజుందార్ మాట్లాడుతూ.. మహిళలు తమ హక్కులను కాపాడుకోవడానికి హెల్ప్లైన్, మెయిల్ ద్వారా కమిషన్కు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సామాజికంగా, ఆర్థికంగా మహిళకు రక్షణ కల్పించడానికే కమిషన్ ఉందని పేర్కొన్నారు. మహిళలపై గృహ హింస, లైంగిక హింస, వరకట్నం, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారు తమ హక్కులను కాపాడుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, టీనేజర్లు, మొబైల్ ఫోన్ ద్వారా చాటింగ్, హార్మోన్ ప్రభావం వల్ల ఇతర కారణాలతో ఆకర్షితులై తప్పుదోవ పడుతున్నారని పేర్కొన్నారు. తాను కొన్ని ఆసుపత్రులను సందర్శించినప్పుడు టీనేజర్లు ప్రెగ్నెన్సీ, ట్రాఫికింగ్లో అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి సంఘటనలు నిరోధించడానికి స్వయం సహాయక సంఘాలు బాధ్యత తీసుకుని అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిత్యం పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలన్నారు. సమావేశంలో రాష్ట్ర మహిళ, మిషన్ శక్తి అసిస్టెంట్ డైరెక్టర్ కె.ఎల్.ఆర్.కుమారి, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సాగులో డ్రోన్ల వినియోగం పెంచుదాం
నరసరావుపేట: రైతులు సస్యరక్షణకు డ్రోన్లను ఉపయోగించటం ద్వారా తక్కువ సమయం, ఖర్చుతో సమర్ధవంతంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చని, సాగులో డ్రోన్ల వినియోగం పెంచాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. సాధారణ స్ప్రేయర్తో పిచికారీ చేసేందుకు వీలులేని ప్రదేశాల్లో సైతం డ్రోన్లతో పనిముగించవచ్చని సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రాయితీపై వ్యవసాయ యంత్రపరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. జిల్లాలోని 1267మంది రైతులకు రూ.2.22కోట్ల విలువైన యంత్రపరికాలు అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించటంలో మహిళలు ముందంజలో ఉండాలని కోరుతూ నాదెండ్ల మండలానికి చెందిన సురేఖ అనే మహిళను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సూక్ష్మనీటిపారుదల ప్రాజెక్ట్ అధికారి ఆంజనేయులు, జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి మాట్లాడారు. ఇఫ్కో కంపెనీ రీజినల్ అధికారి లోకేష్ నానో యూరియా, డీఏపీ గురించి వివరించారు. వ్యవసాయ పరికరాలు, రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు, భూసార పరీక్షా విశ్లేషణ పత్రాలు రైతులకు అందజేశారు. సబ్డివిజనల్ వ్యవసాయాధికారి పి.మస్తానమ్మ, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
ఈ రోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తాం. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి, ఒకటే చెబుతున్నా. ఈ అన్యాయాల్లో మీరు భాగస్వాములు కావొద్దు. మీరు వాటిలో భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు మిమ్మల్ని కూడా కచ్చితంగా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని హెచ్చరిస్తున్నా. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా? కమ్మవారు పుట్టింది కేవలం మీకు ఊడిగం చేయడానికేనా? చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే.. వారిని వెంటాడి వెంటాడి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్ చేయడం.. చివరకు వారంతట వారు ప్రాణాలు తీసుకునేలా అవమానించడం. ఇలా చేయడం కేవలం చంద్రబాబుకు మాత్రమే చెల్లు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు? ఏం పాపం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసుకునేలా లక్ష్మీనారాయణను ప్రేరేపించారు? ఏం పాపం చేశారని మా పార్టీలో ఉన్న కమ్మ వారిపై తప్పుడు కేసులు పెట్టారు?సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, సంక్షేమాభివృద్ధి అన్నది పక్కకుపోయి రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా కక్ష సాధింపు మాత్రమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. పోలింగ్ రోజు నుంచే రెడ్బుక్ రూల్ అమలవుతోందని చెప్పడానికి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యే నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీలో కమ్మ కులస్తులు ఉండటం తప్పా? ఏం పాపం చేశారని వైఎస్సార్సీపీలోని కమ్మ నేతలను వేధిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. కమ్మవాళ్లు పుట్టింది మీకు ఊడిగం చేయడానికా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదని, ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తామని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపులునా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న (కొర్లకుంట వెంకటేశ్వరరావు) సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మా పార్టీ నాయకుడు. ఈయన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్కు ముందు టీడీపీ నేతలు వారికి అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. పోలింగ్ సమయంలో ఈ ప్రాంత ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నది ఈ గ్రామంలో కనిపిస్తుంది. 2024 జూన్ 4న అంటే కౌంటింగ్ రోజున.. అల్లర్లు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడంతో నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్కు తీసుకుపోయి సెల్లో వేశారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడం మొదలు కాగానే, నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. అక్కడ పోలీస్ స్టేషన్లో నాగమల్లేశ్వరరావును సీఐ రాజేష్ తీవ్రంగా బెదిరించారు. ఊళ్లోకి పోవద్దని, ఊరు విడిచి పెట్టాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్న్ చేయడమే కాకుండా, కాల్చి చంపుతామని హెచ్చరించాడు. జూన్ 4న కౌంటింగ్ పూర్తయినా, మర్నాడు 5వ తేదీ సాయంత్రం వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్లోనే ఉంచి అవమానించి, బెదిరించారు. చేయని నేరాలన్నీ మోపారు. ఆ రోజు రాత్రి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్చేసి, స్టేషన్లో పోలీసుల బెదిరింపులు, అవమానించిన తీరుతో పాటు, ఏ రకంగా కొట్టి హింసించారనేది చెప్పి, విలపించి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన గుంటూరు వెళ్లిన వెంకటేశ్వర్లు, కొడుకు నాగమల్లేశ్వరరావును ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ జూన్ 9న చనిపోయాడు.దీనికి బాధ్యులెవరు?నాగమల్లేశ్వరరావుకు భార్య, చిన్న పాప ఉన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును అడుగుతున్నా. మీ పార్టీకి అనుకూలంగా లేరన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది గడిచింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. మరి దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారిలో ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు? అని అడుగుతున్నా. ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇక్కడ యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చివరికి వెంకటేశ్వర్లు అన్న కోర్టు ద్వారా ప్రైవేటు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు.చావు బతుకుల్లో గుత్తా లక్ష్మీనారాయణ ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండు నెలల క్రితం ఆయనపై తప్పుడు అభియోగాలు మోపి స్టేషన్కు పిలిచిన సీఐ, ఎస్ఐలు ఇద్దరూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వాటన్నింటికీ ఆయన గట్టిగా సమాధానం ఇవ్వడం, తమ అభియోగాలకు ఏ ఆధారం లేకపోవడంతో లక్ష్మీనారాయణను విడిచి పెట్టారు. మళ్లీ రెండు నెలల తర్వాత డీఎస్పీ హనుమంతరావు ఆయన్ను స్టేషన్కు పిలిపించి బెదిరించారు. ఆ డీఎస్పీ ఒక కుల ఉన్మాది. ‘అసలు మీరు పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం నిలబడి ఉన్నారా? లేక న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం ఉన్నారా?’ అని నేను ఆ డీఎస్పీని అడుగుతున్నా. లక్ష్మీనారాయణను స్టేషన్కు పిలిచిన డీఎస్పీ హనుమంతరావు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ‘కమ్మ కులంలో పుట్టి వైఎస్సార్సీపీలో ఎలా ఉన్నావ్? ఎందుకు ఉన్నావ్?’ అంటూ కించపరుస్తూ మాట్లాడాడు. తప్పుడు సాక్ష్యాలతో జైలుకు పంపుతానని కూడా బెదిరించి, లెంపకాయలు వేసి కొట్టి అవమానించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిస్తూ.. అన్ని వివరాలు చెబుతూ సెల్ఫీ వీడియో తీశారు. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాననేది పూర్తిగా వివరించారు. పోలీసు శాఖలో కొందరు ఏ రకమైన కుల ఉన్మాదంతో పని చేస్తున్నారో.. వారిని చంద్రబాబు, లోకేశ్ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారనేది సూసైడ్ అటెంప్ట్ వీడియోలో స్పష్టంగా చెప్పారు.సత్తెనపల్లిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం అసలు వారంతా ఏం పాపం చేశారు?⇒ మా పార్టీలో ఉన్నారనే ఏకైక కారణంతో కమ్మ వారిని వేధిస్తారా? ఏం పాపం చేశారని ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్ వస్తే.. వెంటనే ఇంకో కేసు పెడతారు.. మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటి పోయింది. వంశీ ఇంకా చంద్రబాబు శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీ మాజీ మంత్రి కొడాలి నానిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు? దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతున్నారు. ఇప్పటికే ఆయనపై తొమ్మిది కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని దేవినేని అవినాష్ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడనా? అవినాష్, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదన్నాడు. ఆ ఒక్క కారణంతో అవినాష్పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తున్నారు. రోజూ కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకుని చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా వెళ్లగొట్టేశారు. తనను కూడా బెదిరించి, తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ⇒ మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద ఎందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు? తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద అక్రమ కేసులు ఎందుకు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.⇒ మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్ పోసాని కృష్ణమురళిని నెల రోజులపాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగ్లో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు?⇒ మంగళగిరికి చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్కు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతో పాటు, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెల రోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్కుమార్ను దారుణంగా కొట్టి, చొక్కా విప్పించి లోకేశ్ ఫొటో ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, దండం పెట్టించి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ మీద 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు?మీ తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం⇒ ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం. మీరంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు.. వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏ మాత్రం వెనుకాడని మీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది.⇒ చంద్రబాబును ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పు పుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. చంద్రబాబును వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా మొత్తం కలిసి చంద్రబాబును వెనకేసుకొస్తూ.. ఆయన్ను వ్యతిరేకించిన వారి మీద బురద జల్లుతూ అప్రతిష్టపాలు చేస్తున్న తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా?⇒ సీఐ రాజేష్ మీద నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కేసు వేస్తే, కోర్టు ఆదేశించినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఇలా ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్బుక్ రాజ్యాంగం, విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయి. అందుకే ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుంది. -
కదం తొక్కిన నేతలు, కార్యకర్తలు
అరచేతిని అడ్డుపెట్టి అఖండ సూర్యుడి తేజస్సు అడ్డుకోలేనట్లు.. సంక్షేమ సూరీడు.. జన హృదయ నేతను చూసేందుకు వచ్చిన జనతరంగాన్ని ఆంక్షల వలయాలు అడ్డుకోలేకపోయాయి.. ఉవ్వెత్తున ఎగిసిన అభిమాన సంద్రం ముందు నిర్బంధ చట్రాలు చిన్నబోయాయి.. బారులు తీరిన అభిమానం ముందు బారికేడ్లు దూదిపింజలయ్యాయి. ఏమా జనం.. ఏమిటా ప్రభంజనం.. ఇసుకేస్తే రాలనట్లు.. నేల ఈనిందా అన్నట్లు వైఎస్ జగన్ కాన్వాయ్ అడుగు పెట్టిన ప్రతి ఊరు జనహోరుతో నిండగా.. ప్రతి సర్కిల్ అభిమాన సంద్రమైంది. తమ అభిమాన నేతను చూసిన ఆనందం.. ఏడాదిగా తాము పడుతున్న కష్టాలు, కన్నీళ్లు గుర్తుకు వచ్చిన భావోద్వేగం.. ఏకమై దిక్కులు పిక్కటిల్లేలా.. కూటమి కుర్చీలు కదిలేలా.. జగన్నినాదమై వినిపించింది. అన్నిదారులూ రెంటపాళ్లకే.. సత్తెనపల్లి: కూటమి నేతల దాడులు.. పోలీసుల వేధింపులు కారణంగా మనస్తాపం చెంది మృతి చెందిన కుటుంబానికి భరోసా కల్పించేందుకు తమ అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ మధ్యకు వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు తండోపతండాలుగా, స్వచ్ఛందంగా రెంటపాళ్లకు కదిలివచ్చారు. రెండు రోజులుగా వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు లేవంటూ పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం, మరోవైపు పర్యటనను అడ్డుకుంటామంటూ అధికార పార్టీ నేతలు బరి తెగించి ప్రకటనలు చేయడం, ఇంకోవైపు పోలీసులు ఎక్కడికక్కడ అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా ప్రజలు సత్తెనపల్లి చేరుకున్నారు. షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చేరుకోవలసిన జగన్మోహన్రెడ్డి అభిమాన హోరు ధాటికి సాయంత్రం 4:40 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్, వైఎస్సార్ సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే పార్టీ జెండాను ఎగురవేశారు. మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అన్నా అధైర్య పడవద్దంటూ ధైర్యం నూరిపోసి అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దాడులు, అక్రమ కేసులు, వైఎస్సార్ సీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని బనాయిస్తున్న కేసులు, దాడులపై నిలదీశారు. అనంతరం సాయంత్రం 5:32 గంటలకు తిరిగి రోడ్డు మార్గాన తాడేపల్లి బయలుదేరారు. సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వ అరాచకాలకు బలైపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సత్తెనపల్లి పట్టణం, సత్తెనపల్లిరూరల్లో పర్యటించగా, తమ అధినేత జగనన్నపై అభిమానంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు భారీ సంఖ్యలో కంటేపూడి, నందిగామ అడ్డరోడ్డు, రామకృష్ణాపురం, సత్తెనపల్లి టౌన్, పాకాల పాడు, రెంటపాళ్లకు తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా పట్టణంలో ద్విచక్ర వాహనాలతో వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గోర ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రులు విడదల రజని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, తలారి వెంకట్రావు, అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, దేవినేని అవినాష్, అంబటి మురళి, నేతలు పూనూరి గౌతమ్రెడ్డి, డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, నాయకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్రెడ్డి, పక్కాల సూరిబాబు, పెండెం బాబురావు, చల్లంచర్ల సాంబశివరావు, షేక్ నాగూర్ మీరాన్, రమావత్ కోటేశ్వరరావు నాయక్, రాయపాటి పురుషోత్తమరావు, కళ్లం విజయ భాస్కర్ రెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, అచ్యుత శివప్రసాద్, షేక్ మౌలాలి, షేక్ జలీల్, చిలుక జైపాల్, పల్లె గాబ్రియల్, ఏకుల మనీషా, ఏకుల పెద్ద ముత్తయ్య, కొమ్మెర శివశంకర్, అబ్బూరి వీరాంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రెంటపాళ్లలో జనం రాకుండా అడ్డుగా పెట్టిన బారికేడ్లు రెంటపాళ్లలో పోలీసులు ఎగురవేసిన డ్రోన్లుపర్యటన సాగిందిలా.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి, నందిగామ అడ్డరోడ్డు, రామకృష్ణాపురం నుంచి పట్టణంలోకి రోడ్డు మార్గాన వైఎస్ జగన్ ప్రయాణించారు. ఆటోనగర్లోని డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ గజ్జల వైద్యశాలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్, తాలూకా సెంటర్, గడియార స్తంభం సెంటర్, ఐదులాంతర్ల సెంటర్ మీదుగా అచ్చంపేట రోడ్ లోని రైల్వే గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వైఎస్ జగన్ కాన్వాయ్ని ముందుకు వెళ్లనిచ్చి వెంట ఉన్న నాయకుల వాహనాలు, ద్విచక్ర వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో పార్టీ నేతలు ‘డౌన్ డౌన్ పోలీసులు’ అంటూ నినదించారు. అక్కడి నుంచి అంబేడ్కర్ నగర్, గండ్లురు అడ్డరోడ్డు, పాకాల పాడు మీదుగా రెంటపాళ్లకు చేరుకున్నారు. అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా భారీ పొక్లెయిన్లతో గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికి వారు జై జగన్ .. జై జై జగన్ అంటూ నినదించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఘనస్వాగతం పలకడంతో వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. -
సింగయ్య కుటుంబానికి పరామర్శ
గుంటూరు రూరల్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంలో ఏటుకూరు బైపాస్ రోడ్డు వద్ద ప్రైవేటు వాహనం ఢీకొని తీవ్రగాయాలపాలై మృతిచెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) మృతదేహాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్లు సందర్శించి ఘన నివాళులర్పించారు. వెంగళాయపాలెం గ్రామంలోని మృతుని నివాసానికి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి, ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ తరఫున బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
నిజం దాచి ఎల్లో మీడియా విష ప్రచారం.. అసలు జరిగింది ఇదే..
సాక్షి, పల్నాడు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విషం కక్కుతోంది. ప్రజాదరణ చూసి ఓర్వలేక పచ్చి అబద్దాలను పచ్చ కూటమి వల్లె వేస్తోంది. సత్తెనపల్లిలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందినట్టు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోంది. ఎల్లో మీడియా విష ప్రచారం చూసి జనం అవాక్కవుతున్నారు.నిజానికి జయవర్ధన్ రెడ్డి అస్వస్థతతో మృతి చెందారు. ర్యాలీ పాల్గొన్న సమయంలో ఆయన అలసటకు గురయ్యారు. అలసటతో ఒక షాపు ఎదుటకు వెళ్లి కూర్చున్న సీసీ కెమెరా విజువల్స్ లభ్యమయ్యాయి. కొద్దిసేపటి తర్వాత వెళ్లేందుకు లేచిన జయవర్ధన్ కుప్పకూలారు. వెంటనే స్థానికులు బైకు మీద ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయవర్ధన్ మృతి చెందారు. దీనిపై కూడా ఎల్లో బ్యాచ్ విష ప్రచారం చేస్తోంది. -
కమ్మవాళ్లు మా పార్టీలో ఉంటే నీకేంటి?: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, పల్నాడు: ఏపీలో కొందరు పోలీసులు కుల ఉన్మాదంతో పనిచేస్తున్నారని.. కమ్మవాళ్లు కేవలం చంద్రబాబుకి ఊడిగం చేయడానికే పుట్టారా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఇక్కడి డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాది. కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావంటూ లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను ఆయన అవమానించారు. అది భరించలేక సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఎం, ఆయన కుమారుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో ఆ వీడియోలో చెప్పాడు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబూ.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?. వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు నాగమల్లేశ్వరరావు, గుత్తా లక్ష్మీనారాయణ.. ఈ ముగ్గురి విషయంలో.. నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. మా పార్టీలో కమ్మ వాళ్లు ఉండొద్దా? మీ పార్టీ కేవలం వారికేనా? అని వైఎస్ జగన్ నిలదీశారు.ఏం పాపం చేశారని.. వైఎస్సార్సీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలను చంద్రబాబు టార్గెట్ చేసి వేధిస్తున్నారు. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటాడి వెంటాడి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. జైలుకు పంపిస్తున్నారు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును పొట్టన పెట్టుకున్నాడు. ఏం పాపం చేశాడని లక్ష్మీనారాయణ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా చేశారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్ను వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు శాడిజానికి వల్లభనేని వంశీ బాధపడుతున్నాడు. కొడాలి నాని ఏం పాపం చేశాడని కేసు పెట్టారు. ఏంపాపం చేశాడని.. మా పార్టీ నేత తలశిల రఘురాంపై 3 కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని అబ్బయ్య చౌదరిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని దగ్గుబాటి సురేష్ వైజాగ్ ల్యాండ్ క్యాన్సిల్ చేశారు. ఏం పాపం చేశాడని నంబూరు శంక్రరావును వేధిస్తున్నారు. నా పక్కనే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయననూ వేధిస్తున్నారు. ఏం పాపం చేసిందని.. మంగళగిరికి చెందిన రాజ్కుమార్-కృష్ణవేణిలను వేధించారు. రాజ్కుమార్ను మోకాళ్ల మీద రోడ్డు మీద కూర్చోబెట్టారు. మహిళ అని చూడకుండా కృష్ణవేణిని వేధించారు. ఏం పాపం చేశాడని.. ఇంటూరి రవిపై 19 కేసులు పెట్టి వేధించారు. ఏం పాపం చేశాడని.. ఏం పాపం చేశాడని.. బ్రహ్మనాయుడిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని.. పోసానిపై 9 కేసులు పెట్టి వేధించారు. చంద్రబాబును ఎవరైనా కమ్మ వారు వ్యతిరేకిస్తే, వీరు ప్రవర్తిస్తున్న తీరు రాక్షసులకన్నా దారుణం.సినిమా చూపిస్తాంవైఎస్సార్సీపీ కమ్మ నేతలను వేధించే కుట్రలో ఎల్లో మీడియా మీడియా భాగమైంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఒక ముఠా. రాష్ట్రాన్ని దోచుకోవడం. అదే మీ పని. గజదొంగలుగా దోచుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారిని అణిచి వేస్తున్నారు. పోలీసులూ.. చంద్రబాబు పాపంలో భాగం కావొద్దు.ఒక విషయం గుర్తుంచుకొండి. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు. ఇప్పటికే ఏడాది గడిచింది. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు మీకు సినిమా చూపిస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న వారందరినీ బోను ఎక్కిస్తాం. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. అందరూ మోసపోయారు. వెన్నుపోటుకు గురయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు. ఇది ఎల్లకాలం సాగదు. ప్రజలు, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారు’’ అని వైఎస్ జగన్ రెంటపాళ్ల వేదికగా వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబూ.. నాగమల్లేశ్వరరావు భార్యా, కూతురికి ఏం చెబుతారు?: వైఎస్ జగన్
సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన ఆయన.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘటనను ప్రస్తావించారు. అంతకు ముందు.. నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేదు. కేవలం రెడ్బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోంది. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఆంక్షలే నిదర్శనం. తమకు అనుకూలమైన పోలీసులను ఎన్నికల ఫలితాల వేళ నియమించుకున్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారు. ఈ విషయం ఈ ప్రాంతం వారందరికీ తెలుసు. నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల ఉపసర్పంచ్. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున టీడీపీ, జనసేన నేతల తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పీఎస్కు తీసుకెళ్లారు. అక్కడ ఘోరంగా అవమానించారు. టీడీపీకి అనుకూల ఫలితలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఊరు విడిచిపోవాలని ఆయన్ని వేధించారు. లేకుంటే రౌడీ షీట్ తెరుస్తామని సీఐ ఏకంగా బెదిరించారు. జూన్ ఐదో తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును విడిచిపెట్టారు. ఆయన సరాసరి గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరావు ఆత్మహత్యయత్నం చేశారు. తనకొడుకును కాపాడుకునేందుకు వెంకటేశ్వర్లు తీవ్రంగా యత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజక వర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తపైనా పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, అది భరించలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని జగన్ ప్రస్తావించారు. -
కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం. -
సినిమా థియేటర్లకు ఆదరణ లేక..
మాచర్ల రూరల్: ఒకప్పుడు సినిమా విడుదల అంటే పల్లె, పట్టణం లేడా లేదు.. ఊరుంతా పండుగ వాతావరణం. టికెట్ దొరకతే ఆ ఆనందం లెక్క వేరు. అర్ధరాత్రి నుంచి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు. అప్పట్లో ఏడాది కాలంగా ఒకే థియేటర్లో సినిమా ప్రదర్శించిన రోజులున్నాయి. ప్రస్తుతం రోజులు మారాయి. వినోద రంగం కొత్త పుంతలు తోక్కుతోంది. ఓటీటీలు రాకతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పట్టణంలో ఇలా.. మాచర్ల పట్టణంలో నీలిమా డీలక్స్, శ్రీ రామాటాకీస్, శ్రీనివాస మహాల్, నాగార్జున కళామందిర్, శ్రీ వెంకటేశ్వర థియేటర్లు ఉండేవి. చంద్రవంక నూతన బ్రిడ్జి నిర్మాణంతో నీలిమా డీలక్స్ «సినిమా హాలు వాగు నీటి ప్రవాహంతో థియేటర్కు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుండటంతో 20 ఏళ్ల క్రితం ఆ థియేటర్ను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం నాలుగు థియేటర్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో శ్రీ రామాటాకీస్, నాగార్జున కళామందిర్ ప్రేక్షకులు రాకపోవటంతో సినిమాలు రిలీజ్లు లేకపోవటంతో నెల రోజుల నుంచి ఆ రెండు థియేటర్లు మూసివేశారు. మల్టీప్లెక్స్ లు రాకతోనూ... మలీ్టఫ్లెక్స్ వచ్చిన తరువాత సింగిల్ స్క్రీన్కు వెళ్లేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపటం లేదు. కరోనా వచ్చిన తరువాత సినిమా థియేటర్లు నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. అద్దె ప్రాతిపదికన నిర్వహించటం, డిస్ట్రిబ్యూటర్లుకు, ఎగ్జిబిటర్లు తమ వల్ల కావడం లేదని చెబుతున్నారు.ప్రస్తుతం సింగిల్ థియేటర్లకు సినిమా విడుదల చేసే సమయంలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మల్టిఫ్లెక్స్కు షేరు విధానం అమలు చేస్తున్నారు. అద్దె ప్రతిపాదన వలన ఆర్థికంగా నష్టపోతున్నట్లు సింగిల్ థియేటర్లు నిర్వాహకులు వాపోతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల విడుదల చేసినా కొన్ని రోజుల వరకు రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. దీని వలన డి్రస్టిబ్యూటర్లు, నిర్మాతకు మాత్రమే ప్రయోజనం జరుగుతుందని, తమకు న్యాయం జరగటం లేదని చెబుతున్నారు. -
నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
రెంటపాళ్లలో వైఎస్ జగన్రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో కూటమి సర్కార్ ముందుంది: వైఎస్ జగన్ఏపీలో అభివృద్ధి, సంక్షేమం లేదు..రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఉందిరాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అనడానికి ప్రభుత్వ ఆంక్షలు నిదర్శనంపోలింగ్ సమయంలో వారి ఇష్టమైన అధికారులకు పోస్టింగ్లు ఇచ్చుకున్నారు2024, జూన్ 4న కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును పీఎస్కు తీసుకెళ్లారుఫలితాలు వచ్చిన రోజునే నాగమల్లేశ్వరరావును పీఎస్లో ఉంచారునాగమల్లేశ్వరరావు ఇంటిపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారునాగమల్లేశ్వరరావును కాల్చి చంపుతామని సీఐ రాజేష్ బెదిరించారుగ్రామం విడిచి వెళ్లిపోవాలని సీఐ రాజేష్ బెదిరించారుగ్రామం విడిచి వెళ్లకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారుపోలీస్స్టేషన్లో నాగమల్లేశ్వరాను అవమానించారునాగమల్లేశ్వరరావు ఇంటికి వైఎస్ జగన్రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్కూటమి అరాచక పాలనలో బలైన తొలి వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావుపోలీసులు, టీడీపీ నేతలతో బలవన్మరణానికి పాల్పడ్డ నాగమల్లేశ్వరరావుబాధిత కుటుంబానికి జగన్ పరామర్శఇసకేస్తే రాలనంత..జగన్ రాక నేపథ్యంలో జనసంద్రమైన రెంటపాళ్లభారీ గజమాలతో స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులురెంటపాళ్లలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్మరికాసేపట్లో నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శరెంటపాళ్ల చేరుకున్న వైఎస్ జగన్సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్న వైఎస్ జగన్పోటెత్తిన అభిమానుల నడుమ ఆరు గంటల ఆలస్యంగా పర్యటనపోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో కిందటి ఏడాది ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావునాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనున్న జగన్నాగమల్లేశ్వరావు కుటుంబానికి జగన్ పరామర్శజగన్ పర్యటన నేపథ్యంలో పచ్చదండు విష ప్రచారంబెట్టింగ్ వల్ల చనిపోయాడంటూ నాగమల్లేశ్వరరావు మీద పోస్టులు, వీడియోలు పూర్తి కథనం కోసం 👉నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..విగ్రహం వద్ద కంటతడి పెట్టిన నాగమల్లేశ్వరరావు తల్లిపరామర్శకు అనుమతి ఉందంటూ.. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రిఆంక్షల నడుమే రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులుసత్తెనపల్లి గడియారం సెంటర్కు చేరుకున్న వైఎస్ జగన్ సత్తెనపల్లి గడియారం సెంటర్కు చేరుకున్న వైఎస్ జగన్ వెల్లువులా వచ్చిన ప్రజలు.. జనసంద్రంలా మారిన సత్తెనపల్లివైఎస్ జగన్కు గజమాలతో స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులుజన ప్రభంజనమైన సత్తెనపల్లికిలోమీటర్ల పొడవునా జనం.. జనంఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన జనంబైకులు, కార్లలో భారీగా వచ్చిన వైఎస్సార్ సీపీ కేడర్జగన్ను చూసేందుకు రోడ్డు పక్కన బిల్డింగులు ఎక్కిన జనంజగన్పై అభిమానాన్ని అడ్డుకోలేక పోయిన ప్రభుత్వ ఆంక్షలుపోలీసుల చెక్ పోస్టులు దాటుకుని రెంటపాళ్ల వైపు కదులుతున్న జనంఇప్పటికే వేలాదిమందితో నిండిపోయిన రెంటపాళ్లసత్తెనపల్లి నుండి రెంటపాళ్ల వరకు జనమే జనం మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం:మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదంపల్నాడు సరిహద్దుల్లో భారీ ఎత్తున బారీకేడ్లు అడ్డుపెట్టిన పోలీసులు వాహనాలు,కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పోలీసులు బారికేడ్లను తొలగించాలని పోలీసుల్ని కోరిన అంబటి రాంబాబు బారికేడ్లు తొలిగించేది లేదని పోలీసుల ఓవరాక్షన్ అంబటి రాంబాబుతో వ్వాగాదానికి దిగిన పోలీసులు పల్నాడు..పల్నాడు జిల్లాలోకి వైఎస్ జగన్ప్రభంజనంగా మారిన పల్నాడు ఎంట్రన్స్కంటెపూడి వద్ద జనసందోహంవైఎస్ జగన్కు స్వాగతం పలికిన పల్నాడు ప్రాంత మాజీ ఎమ్మెల్యేలుగోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, నంబూరు శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి ఇన్ఛార్జి గజ్జల సుధీర్ స్వాగతం..పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడుతున్న కంటెపూడి మేడికొండూరు చేరుకున్న వైఎస్ జగన్భారీగా తరలివచ్చిన తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలుమండుతున్న ఎండలోనూ జగన్ కోసం ఎదురు చూస్తున్న మహిళలు, వృద్దులుభారీ బైకు ర్యాలీతో జగన్ కాన్వాయ్ ని తీసుకెళ్తున్న యూత్పల్నాడు..పల్నాడు జిల్లాలోకి ఎంటరైన వైఎస్ జగన్పేరేచర్ల జంక్షన్కు చేరుకున్న జగన్ కాన్వాయ్భారీ జనసందోహంతో కిటకిటలాడుతున్న పేరేచర్లజై జగన్, జైజై జగన్ నినాదాలతో మార్మోగుతున్న జంక్షన్అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న జగన్జగన్ పర్యటనలో కనపడని పోలీసులు!వైఎస్ జగన్ పల్నాడు రెంటపాళ్ల పర్యటనపోలీసులమయంగా సత్తెనపల్లి నియోజకవర్గంఆంక్షల పేరుతో వైఎస్సార్సీపీ కేడర్ను ఇబ్బంది పెట్టిన పోలీసులుకానీ.. జగన్ పర్యటనలో కనబడని పోలీసులుజగన్ కాన్వాయ్కు రోడ్ క్లియర్ చేయని పోలీసులుమాజీ సీఎం హోదాలో జడ్ ప్లస్ భద్రతలో ఉన్న జగన్జగన్ కాన్వాయ్ కి ముందు కనపడని రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీకాన్వాయ్ తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై కనపడని ఖాకీలుజగన్ కాన్వాయ్కి ముందు పరిగెత్తుతూ రోడ్ క్లియర్ చేస్తున్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నాని గుంటూరు శివారు నల్లపాడు చేరుకున్న వైఎస్ జగన్జైజగన్ నినాదాలతో మార్మోగుతున్న నల్లపాడుమహిళలు, కార్యకర్తలతో కిటకిటలాడుతున్న నల్లపాడు మిర్చి మార్కెట్ యార్డు దగ్గరకు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్పూలు చల్లుతూ అభిమానం చాటుకుంటున్న కేడర్జనసంద్రం నడుమ నెమ్మదిగా..కార్యకర్తలతో కిటకిటలాడుతున్న గుంటూరు రోడ్లుఅడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రంచుట్టుగుంట సెంటర్లో జగన్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా ముందుకు సాగని వైఎస్ జగన్ కాన్వాయ్వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట సెంటర్ కి చేరుకున్న జగన్మహిళలు, పార్టీ కేడర్తో రోడ్లన్నీ ఫుల్రెంటపాళ్లకు భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులుపల్నాడులో పోలీసుల దౌర్జన్యకాండజగన్ పర్యటన నేపథ్యంలో భారీ ఆంక్షలువైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నంఅయినా రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులుపోలీసుల ఆంక్షల వలయాలను దాటుకుని రెంటపాళ్లకు చేరుకున్న అభిమానులు, కార్యకర్తలుజగన్ వెంటే జనం అని మరోసారి రుజువుచంద్రబాబుగారూ.. ఇది కరెక్ట్కాదు: ఆర్కే రోజాజగన్ పర్యటనలో ఆంక్షలపై మాజీ మంత్రి రోజా స్పందనసీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్నగతంలో మీ కార్యకర్తల కుటుంబాలను ప్రశ్నించలేదా?ఆంక్షలు పెట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అడ్డుకోవాలని చూడడం ఏ మాత్రం కరెక్టు కాదు మీ ప్రభుత్వ వేధింపులు భరించలేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైయస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా @ncbn గారూ? మీ పార్టీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామ…— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల ఓవరాక్షన్సత్తెనపల్లిలో భారీగా చెక్ పోస్టుల ఏర్పాటు జగన్ కాన్వాయ్ వెంట భారీగా తరలి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులుబైకులను అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులుపోలీసులతో పార్టీ కేడర్ వాగ్వాదంగుంటూరులో జగన్కు ఘన స్వాగతంగుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘన స్వాగతంభారీగా బైక్ ర్యాలీతో వైఎస్ జగన్కు స్వాగతం పలికిన కార్యకర్తలుజై జగన్ నినాదాలతో జన సందోహంగా మారిన లాల్పురం రోడ్డుఅడుగడుగునా ఆంక్షలు, అయినా..సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పోలీసుల అతిజగన్ పర్యటన నేపథ్యంలో మునుపెన్నడూ లేనిరీతిలో ఆంక్షలునరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపు వాహనాలు వెళ్లనీయకుండా టాటంకాలురెంటపాళ్ల ఊరిలోకి స్థానికేతరులను రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులుఆధార్ కార్డు చూపిస్తేనే అనుమతిస్తున్న వైనంగ్రామస్తులకు సైతం ఆధార్ కార్డు తప్పనిసరి చేసిన పోలీసులుఅయినా రెంటపాళ్ల వైపు అడుగులేస్తున్న అభిమానంజగన్ కోసం పోటెత్తుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులుకాలినడకన అయినా సరే రెంటపాళ్లకు చేరుకోవాలనే ప్రయత్నంప్రజాభిమానం నడుమ ముందుకు సాగుతూ..గుంటూరు శివారు ఏటుకూరు రోడ్డుకు చేరుకున్న వైఎస్ జగన్పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయిన జగన్ఇన్ఛార్జి బలసాని కిరణ్ ఆధ్వర్యంలో జగన్కు భారీ స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ కేడర్సత్తెనపల్లి రెంటపాళ్ల వైపు నెమ్మదిగా సాగుతున్న కాన్వాయ్దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులుమధ్యలో బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న జననేతదారిపొడవునా అభిమానమే.. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనగుంటూరు వై జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్అడుగడుగునా అపూర్వ స్వాగంపార్టీ అధినేతకు స్వాగతం పలికిన పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళీభారీగా తరలివచ్చిన కార్యకర్తలుదారిపొడవునా జై జగన్.. జైజై జగన్ నినాదాలుఏ రోడ్డు చూసినా జగన్కు ఉప్పొంగిన అభిమానందారిపొడవునా.. ఇరువైపులా బారులు తీరిన జనంమార్గమధ్యలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్మరికాసేపట్లో పల్నాడు రెంటపాళ్లకు వైఎస్ జగన్వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనపోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో బలన్మరణానికి పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావునాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైఎస్ జగన్జగన్ పర్యటనపై పచ్చ కుట్రలుపర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో పోలీసు యంత్రాంగ ప్రయోగం వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపోలీసుల వైఖరి సరికాదు: నాగమల్లేశ్వరరావు తండ్రి పోలీసుల వైఖరిని తప్పు బట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి కొర్లకుంట వెంకటేశ్వరరావుమా బంధువులను కూడా అడ్డుకుంటున్నారుపరామర్శకు అనుమతి తీసుకున్నారుమీ కాళ్లు పట్టుకుంటా.. కనీసం మా వాళ్లనైనా అనుమతించండిఆంక్షలను లెక్కచేయకుంలడా.. జగన్ కోసం జనంపల్నాడు రెంటపాళ్ల పర్యటనకు భారీగా కదిలి వస్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులుపోలీస్ ఆంక్షలను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న వైనంపొలాల గుండా రెంటపాళ్లకు బయల్దేరిన కార్యకర్తలు, అభిమానులు బైకుల మీద, నడుచుకుంటూ రెంటపాళ్ల వైపుఆధార్ కార్డులు చూపించాలంటూ రెంటపాళ్ల గ్రామస్తులపైనా పోలీసుల ఒత్తిడిరెంటపాళ్ల చుట్టూ.. 20 చెక్పోస్టులు పెట్టారు. ప్రతీ రెండు కిలోమీటర్కు ఓ చెక్పోస్టుపోలీసుల వైఖరిని గ్రామస్తుల ఆగ్రహం తాడేపల్లి నివాసం నుంచి రెంటపాళ్లకు బయల్దేరిన వైఎస్ జగన్జగన్ వెంట బైకులు, కార్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వెంటే.. భారీ సంఖ్యలో ముందుకు కదిలిన వైనం పోలీస్మయంగా మారిపోయిన పల్నాడుపల్నాడులో ఇవాళ వైఎస్ జగన్ పర్యటనసత్తెనపల్లి రెంటపాళ్లకు వైఎస్సార్సీపీ అధినేత పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్, వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావుబాధిత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శజగన్ పల్నాడు పర్యటనకు పోలీసుల ఆంక్షలుపోలీసు మయంగా మారిన పల్నాడు జిల్లాసత్తెనపల్లిలో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులువైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఆంక్షలుజగన్ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు.. పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలుజగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మా బంధువులనైనా అనుమతించండి.. నాగమల్లేశ్వరరావు తండ్రి ఆవేదన
సాక్షి, పల్నాడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన వేళ పోలీసులు ఆంక్షలు విధించారు. రెంటపాళ్లలో పోలీసుల చెక్పోస్టులు, అడ్డకుంలపై వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఎవరనీ అడ్డుకోవద్దు. మీ కాళ్లు పట్టుకుంటా.. మా బంధువులనైనా అనుమతించండి అని అన్నారు.వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు తండ్రి తాజాగా మాట్లాడుతూ..‘పల్నాడు పోలీసుల వైఖరి సరికాదు. మా బంధువులను కూడా అడ్డుకుంటున్నారు. దయచేసి ఎవరనీ అడ్డుకోవద్దు. పరామర్శకు అనుమతి తీసుకున్నారు. మీ కాళ్లు పట్టుకుంటా.. మా బంధువులనైనా అనుమతించండి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుంకులు సృష్టిస్తున్నారు. గ్రామస్థులను కూడా ఆధార్ కార్డు చూపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వైఎస్సార్సీపీ నేతల వరకు నోటీసులు పంపించారు. బుధవారం ఉదయం నుంచే వాహనాలను వెళ్లకుండా అడ్డంకులు సృష్టంచారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుండి సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయడం లేదు. రెంటపాళ్ల ఊరిలోకి ఇతరులను రానీయకుండా అడ్డుకుంటున్నారు. -
వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు.. పల్నాడులో టెన్షన్!
సాక్షి, పల్నాడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెర లేపింది. ఆయన పర్యటనలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు కొత్త ప్లాన్తో ముందుకు సాగుతోంది. వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా.. ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు సాయంతో కూటమి సర్కార్ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది.వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లా రెంటళ్లపాడు పర్యటన సందర్బంగా పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనకు కేవలం వంద మంది మాత్రమే రావాలంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, నిరసన, ధర్నా కాకపోయినా ఇలా.. పోలీసుల ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే స్వేచ్చ కూడా లేదా అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనను కూటమి సర్కార్ నియంత్రించే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇక, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు అనుమతి కోసం ఇప్పటికే ఏడు సార్లు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు ఇలా ఆంక్షలు విధించడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఆదేశాల మేరకే వైఎస్ పర్యటనలను నియంత్రించేందుకు పోలీసులు ఇలా ఆదేశాలు జారీ చేశారని అటు ప్రజలు సైతం మండిపడుతున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన వద్దంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు నోటీసులు పంపించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పల్నాడు జిల్లా నేతలందరికీ నోటీసులు అందించారు. బుధవారం ఉదయం నుంచే వాహనాలను వెళ్లకుండా అడ్డంకులు సృష్టంచారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుండి సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయడం లేదు. రెంటపాళ్ల ఊరిలోకి ఇతరులను రానీయకుండా అడ్డుకుంటున్నారు. గ్రామస్థులను కూడా ఆధార్ కార్డు చూపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇక, ఇప్పటికే రెంటపాళ్లకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు. -
ఆంక్షలతో జనం ఆకాంక్షలు అడ్డుకోలేరు
ఎన్నికల ఫలితాలు వచ్చీ రాకముందే.. పచ్చమూకలు పేట్రేగిపోయారు.. ఇక మాకెవరు అడ్డంటూ ఇళ్లపైకి దొమ్మీలకు దిగారు. అడ్డొచ్చిన వారినందరినీ ఆడ,మగ తేడా చూడకుండా దుర్భాషలాడుతూ, ఇళ్లపైకి రాళ్లు రువ్వుతూ వికటాట్టహాసం చేశారు. అప్పటికే బైండోవరై స్టేషన్లో ఉన్న బాధితుడిపై అధికార దర్పం చూపుతూ.. బెదిరింపులకు పాల్పడ్డారు. పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ రానున్న నేపథ్యంలో పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి పెద్దలు కుట్రలకు దిగారు. చిత్రవిచిత్ర ఆంక్షలతో పర్యటనను అడ్డుకునేందుకు శతధా యత్నించారు. నరసరావుపేట రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణను చూసి భయంతో కూటమి సర్కారు వణికిపోతోందని మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి ఇన్చార్జి గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డిలు మండిపడ్డారు. పోలీసులు, కూటమి నేతల వేధింపులు తాళలేక గత ఏడాది జూన్ 6న ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించి పోలీస్ భద్రత కల్పించాలని నాయకులు మంగళవారం జిల్లా ఎస్పీని కలిశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకోవాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం అనుమతుల పేరుతో పోలీసుల ద్వారా ఆంక్షలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి, బాధతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెడుతుండటాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం దారుణమన్నారు.ఆంక్షలతో జనం ఆకాంక్షలు అడ్డుకోలేరుమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పర్యటన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఆందోళన మొదలైందని నేతలు పేర్కొన్నారు. ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం బయటకొస్తే ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందనే భయం కనిపిస్తోందన్నారు. ఆ భయంతోనే పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. దేశంలోనే మాస్ లీడర్లలో ఒకరైన వైఎస్ జగన్ వస్తుంటే, కేవలం 100 మందినే అనుమతిస్తామని పోలీసులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. భద్రతా కారణాలను సాకుగా చూపించి ఆయన పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పార్టీగా ఇప్పటికే మూడుసార్లు అనుమతుల కోసం పోలీసులను కలవడం జరిగిందని, మళ్లీ ఈరోజు మరోసారి జిల్లా ఎస్పీని కలవడం జరిగిందన్నారు.పోలీసులు బెదిరిస్తున్నారుమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు కార్లు, ఆటోలు పంపవద్దని ట్రావెల్స్ నిర్వాహకులకు ఫోన్లు చేసి పోలీసులు బెదిరిస్తున్నారు. సామన్య ప్రజలను, వైఎస్సార్ సీపీ క్యాడర్ను భయబ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణం.– విడదల రజిని, మాజీ మంత్రిపరామర్శించి తీరుతాంమాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అనుమతుల కోసం పలుమార్లు పోలీసులను కలిశాం. ఆంక్షలతో అనుమతులు ఇచ్చేవిధంగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వంద మందికే పోలీసులు అనుమతి ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది.– కాసు మహేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గురజాలపల్నాడుకు రానివ్వకుండా అడ్డుకునే కుట్రజగనన్నను జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు పోలీసులతో చంద్రబాబు, లోకేష్లు కుట్రలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకే కుట్రలు పన్నుతున్నారు.– డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నరసరావుపేటఆరునూరైనా పర్యటన ఆగదువైఎస్ జగన్ పర్యటనకు ప్రత్యేక వాహనాలు కేటాయించి కార్యకర్తలను తరలించబోమని, తాడేపల్లిలో బయల్దేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ ఎక్కడా ఆగకుండా నేరుగా నాగమల్లేశ్వరరావు ఇంటికే చేరుకుంటుందని ఎస్పీకి స్పష్టంగా చెప్పామని, అయినా అనుమతిచ్చేది లేనిదీ ఆలోచించి చెబుతామని ఎస్పీ తెలిపారన్నారు. పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా, ఆరునూరైనా వైఎస్ జగన్ పల్నాడు పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్ని ఆంక్షలు విధించినా సరే.. వైఎస్ జగన్ రెంటపాళ్ల చేరుకుని నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని వారు స్పష్టం చేశారు.అనుమతులు ఇవ్వకపోవడం దుర్మార్గంరెడ్బుక్ పాలనకు బలైన మొదటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. ఎన్నికల ఫలితాల అనంతరం నాగమల్లేశ్వరరావును పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. గ్రామం విడిచి వెళ్లొద్దంటూ పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు. మనస్థాపానికి గురైన నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గం.– డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి, వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి ఇన్చార్జి -
భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చిన ఘనత మోదీదే
అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ను ప్రధాని నరేంద్రమోదీ తన 11 ఏళ్ల పాలనతో అభివృద్ధి చెందిన దేశంగా మార్చారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, కోస్తాంధ్ర ఇన్చార్జి సన్నారెడ్డి దయాకరరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఏవీఆర్ కల్యాణ మండపంలో నిర్వహిహించిన పెదకూరపాడు నియోజకవర్గ బీజేపీ వికసిత్భారత్ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పల్నాడు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆలోకం సుధాకరబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దయాకరరెడ్డి మాట్లాడుతూ 11 ఏళ్ల బీజేపీ పాలనలో పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేయటం జరిగిందన్నారు. అలాగే రైతులు, పేదల కోసం ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం స్వనిధి యోజన, అలాగే మహిళల కోసం పీఎం మాతృవందన, ఆరోగ్యానికి ఆయుష్మాన్ భారత్ వంటి అనేక పథకాలు అమలు చేశారన్నారు. దేశ భద్రతకు పటిష్టమైన విదేశాంగ విధానంతో పాటు రక్షణ రంగంలో ఆయుధ సంపత్తిని సమకూర్చారన్నారు. ఇలా 11 సంవత్సరాలలో మోదీ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగు స్థానానికి చేర్చారన్నారు. అన్ని రంగాలలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ విధానాలను, బీజేపీ ఆశయాలను ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. పల్నాడు జిల్లా బీజేపీ అధక్షుడు శశికుమార్, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మేకల హనుమంతరావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఇంటింటికీ అందించాల్సిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
భూసార పరీక్షలు చేయించుకోవాలి
అచ్చంపేట: ఖరీఫ్కు ముందే వేసవి దుక్కులు దున్ని భూములను సిద్ధంగా ఉంచుకోవాలని, భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఏవో పి.వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని కోనూరు, కస్తలలో మంగళవారం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసార పరీక్షల ఫలితాలను బట్టి ఎరువులు వాడాలని చెప్పారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనము, పిల్లిపెసర విత్తనాలు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని, విక్రయ కేంద్రాల నుంచి తప్పనిసరిగా బిల్లులు తీసుకుని పంట కాలం పూర్తయ్యేవరకు వాటిని భద్రపరచుకోవాలన్నారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం లంకెలకూరపాడు(ముప్పాళ్ళ): మండలంలోని లంకెలకూరపాడు, చాగంటివారిపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి బీవీ నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం వరి, మిరప, పత్తి పంటలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట పైరులు సాగు చేసుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రంలో భూ యజమానుల అంగీకారంతో పంట సాగు హక్కు పత్రం పొందవచ్చన్నారు. అన్నదాత సుఖీభవ పథకంకు అర్హత కలిగిన రైతుల వివరాలు ప్రభుత్వం ఈ కేవైసీ ఆటో అప్డేట్ చేయటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది శైలజ, సుభాని, రైతులు పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో నలుగురు నిందితులు అరెస్టు
గన్నవరం: వేర్వేరు చోరీ కేసుల్లో నలుగురు నిందితులను ఆత్కూరు పోలీసులు మంగళవారం అదుపు లోకి తీసుకుని ఐదు బైక్లు, విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుల వివరాలను డీఎస్పీ సీహెచ్. శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఉంగుటూరు మండలం పొట్టిపాడులో మే నెల మూడో తేదీ తెల్లవారుజామున ఇంటిలో నిద్రిస్తున్న బాణాల సుభాషిణి మెడలోని ఐదు కాసుల బంగారు గొలుసును దొంగలు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీఐ కె.వి.ఎన్.ఎన్. సత్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక టీమ్ దర్యాప్తు చేపట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చోరీకి పాల్పడింది జంగారెడ్డిగూడెం శివారు వేగవరం గ్రామానికి చెందిన పారేపల్లి శేషు, పోలవరపు నాగదుర్గాప్రసాద్, దుగ్గిరాల శివరామకృష్ణగా గుర్తించారు. ప్రధాన నిందితుడు శేషును మంగళ వారం అరెస్టుచేసి, అతని వద్ద బంగారు గొలుసు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు కొవ్వూరులో జరిగిన ఓ చోరీ కేసులో పట్టుబడి జైలులో రిమాండ్లో ఉన్నారు. మరో ముగ్గురి అరెస్టు ఇటీవల ఆత్కూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా జరుగుతున్న బైక్ చోరీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దొంగల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఆత్కూరు పోలీసులు పొట్టిపాడు టోల్గేట్ వద్ద బైక్పై వెళ్తున్న ఏలూరుకు చెందిన దత్తి నవీన్, భీమవరానికి చెందిన గుత్తుల రవికుమార్, సాయిశ్రీరామ్ను అనుమానితులుగా గుర్తించి అదుపులో తీసుకున్నారు. పోలీసుల విచార ణలో వారు బైక్ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. పెదపాడు, కై కలూరు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చొరబడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించినట్లుగా ఒప్పుకున్నారు. పోలీసులు వారి వద్ద నాలుగు బైక్లు, బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు ఇప్పటికే పలు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చారు. ఈ కేసులను ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సురేస్ చావా, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించండి
క్రోసూరు: మహిళా సంఘం ఆధ్వర్యంలో క్రోసూరులోని గ్రామ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల అభివృద్ధి అధికారి, పంచాయితీ సిబ్బందికి మంగళవారం స్థానిక పలు కాలనీల మహిళలు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని ఎనిమిదో వార్డుకు చెందిన కొత్తూరు బజారు నివాసితులు పంచాయతీ అధికారి ఆదినారాయణతో మాట్లాడుతూ తమ ప్రాంతంలోని బోరు బావులన్నీ ఎండిపోయాయని తెలిపారు. రోజు వారి నీటి అవసరాలకు చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది ఆదినారాయణ ప్రతి రోజు నీటిని అందించే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మహిళా సంఘం క్రోసూరు మండల బాధ్యులు వి.అనూష మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం ప్రకటించి ఆరు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అమల్లోకి రాకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో తిమ్మిసెట్టి హనుమంతరావు, షేక్ జాన్ బీ, షేక్ బుజ్జి, నిమ్మకాయల గాంధీ, షేక్ ఖాసింబి, షేక్ హుస్సేన్బీ, షేక్ సైదాబీ, ముజార్ అల్లాబీ, మొజార్ ధరియాబీ పాల్గొన్నారు. -
సముద్రాన్ని మింగేసిన పచ్చనేత
సాక్షి ప్రతినిధి,బాపట్ల: బాపట్ల మండలం దానవాయిపేట వద్ద సముద్రంలో కలుస్తున్న ఈపూరుపాలెం స్ట్రయిట్ కట్ను సీ మౌత్ వద్ద పచ్చనేత, రియల్టర్ బుర్ల వెంకటరావు, (ఈయన టీడీపీ రైతువిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పమిడి భాస్కరరావుకు స్వయాన వియ్యంకుడు) గుంటూరుకు చెందిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ కలిసి ఆక్రమించారు. ఏకంగా సముద్రంలోకి కర్వు(వంపుగా) తిరిగే ఈ ప్రధాన కాలువ మొత్తాన్ని పూడ్చివేశారు. కాలువ తిరిగి అటువైపునకు రాకుండా పెద్ద పెద్ద కొండరాళ్లను తెచ్చి అడ్డుగా కట్టకట్టారు. కిలోమీటరు పొడవున ప్రవహించే కాలువను చిన్నపిల్ల కాలువగా సముద్రంలోకి వెళ్లేలా స్ట్రయిట్గా తరలించారు. పాతకాలువను కిలోమీటరు మేర మొత్తం పూడ్చివేసి దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం మొత్తాన్ని ఆక్రమించి చదును చేశారు. ఇక్కడ వెంచర్ వేసి అమ్మకం పెట్టడంతోపాటు రిసార్ట్లు నిర్మించేందుకు పనులు వేగవంతం చేశారు. రియల్టర్ బుర్ల వెంకటరావు ఆ స్థలంలో ఏకంగా గెస్ట్హౌస్ నిర్మించుకున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం విలువ సగటున రూ.5 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన ఆక్రమణ భూమి విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. కబ్జా చేసిన మొత్తం 10 ఎకరాలలో ఇప్పటికే 3.42 ఎకరాలు, 1.50 ఎకరాలు చొప్పున రెండు భాగాలుగా డీకేటీ పట్టాలు కూడా పొందినట్లు సమాచారం. మిగిలిన ఆక్రమణ భూమికి కూడా డీకేటీలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం బాపట్ల రెవెన్యూ అధికారులకు రూ. కోట్లలోనే ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు సైతం పెద్ద ఎత్తున ముట్టజెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బోట్లకు తీవ్ర నష్టం ఈపూరుపాలెం స్ట్రయిట్కట్(ప్రధాన కాలువ) సీ మౌత్ సముద్రానికి దాదాపు కిలోమీటరు దూరం నుంచి ఎడమ వైపుకు వంపుగా తిరిగి సముద్రంలో కలుస్తుంది. దీనివల్ల సముద్రం నుంచి వచ్చే పోటు వల్ల కాలువలో నిలుపుకునే సుమారు 2 వేల బోట్లకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అదే స్ట్రయిట్గా సముద్రంలోకి కాలువ వెళితే పోటు సమయంలో అలల ఉధృతికి బోట్లు ఒకదానికొకటి కొట్టుకొని పగిలి పోతాయి. దీనివల్ల తీవ్రం నష్టం కలుగుతుందని మత్స్యకారులు వాపోయారు. తమ జీవనభృతినే దెబ్బతీసే ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని కరాఖండిగా చెపుతున్నారు. ఆక్రమణదారులతో అధికారులు చేతులు కలిపి తమకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తే ఎంతవరకై నా వెళతామని మత్స్యకారులు హెచ్చరించారు. ఈపూరుపాలెం స్ట్రయిట్కట్ సీ మౌత్ కాలువను పూడ్చిన పచ్చనేత తద్వారా 10 ఎకరాల తీరం భూమి ఆక్రమణ ఎకరం రూ.5 కోట్లు చొప్పున మొత్తం భూమి విలువ రూ.50 కోట్లు ముడుపులు పుచ్చుకొని కొంత భూమికి పట్టాలిచ్చిన అధికారులు మిగిలిన ఆక్రమణకు డీకేటీలు సిద్ధం స్ట్రయిట్ కట్ పూడ్చడంతో కాలువలోనే 2 వేల పడవలు నిషేధం ముగిసి రెండు రోజులు దాటినా వేటకు వెళ్లలేని మత్స్యకారులు పనులను అడ్డుకున్న 9 గ్రామాల మత్స్యకారులు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్న మత్స్యకారులు రియల్టర్తో ఎమ్మెల్యే మంతనాలు ఈపూరుపాలెం స్ట్రయిట్కట్ ఆక్రమణ గొడవ విషయం తెలుసుకున్న బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ హుటావుటిన వెళ్లి రియల్టర్ వెంకటరావును కలిసి ఆయన అతిథి గృహంలో మంతనాలు సాగించారు. ఎమ్మెల్యే తీరుపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుర్ల వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలి బాపట్లటౌన్: సముద్రపు అంచున బండరాళ్లతో అడ్డుకట్ట వేస్తున్న బుర్ల వెంకట్రావుపై చట్టప్రకా రం చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన మంతెన కరుణరాజు మంగళవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితుడి కథనం మేరకు.. బాపట్ల మండలం పాండురంగాపురం పంచాయతీ పరిధిలోని అడవిపల్లిపాలెం సమీపంలో తనకు 13 ఎకరాల నాన్ అగ్రికల్చరల్ భూమి ఉందని, నా భూమికి పడమర వైపున చీరాల మండలం పిట్టువారిపాలెం గ్రామానికి చెందిన బుర్ల వెంకట్రావుకు పొలం ఉంది. అయితే నిబంధనలకు విరుద్దంగా వెంకట్రావు పెద్దపెద్ద కొండరాళ్లతో సముద్రపు నీరు బయటకు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని, ఇదేమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నారని అన్నారు. విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. -
ఏటీఎం మోడల్ సాగుతో నిరంతర ఆదాయం
రాజుపాలెం: ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏటీఎం మోడల్లో సాగు చేస్తే రైతులు 365 రోజులు నిరంతర ఆదాయం పొందవచ్చని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం ఎన్ఎఫ్ఏ అప్పలరాజు తెలిపారు. మండలంలోని బలిజేపల్లి, కొత్తపాలెం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం రైతు గాలం జయసింహారావు పొలంలో ఏటీఎం మోడల్ విధానాన్ని మంగళవారం వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధానంలో ముందుగా భూమిని చదును చేసి నాలుగు అడుగుల వెడల్పు బెడ్లుగా ఒక అడుగు నీటి కాలువులుగా ఏర్పాటు చేసి ఆ బెడ్లపై 18 రకాల దుంప, తీగ ఆకుకూరలు, కూరగాయలు, బోర్డర్ క్రాఫ్గా మొక్కజొన్న వేయడం జరిగిందని తెలిపారు. ఏటీఎం మోడల్లో ఎటువంటి రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బలిజేపల్లి యూనిట్ ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి, ఐసీఆర్పీలు అంకమ్మరావు, యలమందమ్మ, తిరుపతమ్మ, నరసింహారావు, జ్యోతి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి మెడి‘కిల్’
పిడుగురాళ్ల: పల్నాడు ప్రాంతానికి మణిహారం లాంటి ప్రభుత్వ వైద్యశాల, వైద్య కళాశాల నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.540 కోట్ల వ్యయంతో శరవేగంగా సాగిన మెడికల్ కాలేజీ పనులు 80శాతం వరకు పూర్తయ్యా యి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం భవన నిర్మాణాలను అటకెక్కించింది. దీనిపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై సెల్ఫీ వీడియోలు తీస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 80 శాతం వరకు పూర్తిచేసిన గత ప్రభుత్వం వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పేద ప్రజలకు ఉచిత, కార్పొరేట్ తరహా వైద్యం అందాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని కామేపల్లి వద్ద 2019లో 50 ఎకరాల్లో మెడికల్ కళాశాల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. సుమారు 80 శాతం వరకు ప్రభుత్వ వైద్యశాల, కళాశాలతో పాటు నర్సింగ్ కాలేజీ భవనాలు, హాస్టల్ భవనాలు నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. వైద్యశాల మొదటి బ్లాకు నిర్మాణం పూర్తయింది. మిగిలిన ఐదు బ్లాకులు కూడా నిర్మాణ పనులలో ఉన్నాయి. ఈ ఐదు బ్లాకులు పూర్తయితే వెంటనే వైద్యసేవలు ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాల, వైద్యశాల నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ఆగిపోయాయి. దీంతో ఈ ప్రాంతవాసులు మెరుగైన వైద్యసేవలకు గుంటూరు, విజయవాడ లాంటి దూరప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. సెల్ఫీ వీడియోల హల్చల్ కూటమి ప్రభుత్వ నిర్వాకాలను ఎండగట్టేందుకు ఇటీవల వైఎస్సార్ సీపీ గురజాల సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మెడికల్ కళాశాల వద్దకు వచ్చి, కూటమి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిర్మాణం మొదలుపెట్టకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలతో పాటు ఈ ప్రాంత యువత కూడా మెడికల్ కళాశాల వద్దకు వచ్చి సెల్ఫీ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తమ ప్రాంతంలో పేద ప్రజలకు ఆణిముత్యం లాంటి మెడికల్ కళాశాలను వెంటనే ప్రభుత్వం పునఃప్రారంభించాలని పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని నినదిస్తున్నారు. నత్తనడకన పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు గత నాలుగు నెలలుగా పూర్తిగా నిలిచిన పనులు పనులు చేపట్టాలంటూ సెల్ఫీ వీడియోల ద్వారా స్థానికుల డిమాండ్ -
ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే ..
● మాజీ మంత్రి విడదల రజిని ● ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చిలకలూరిపేట: పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక, పంటలు అమ్ముకోలేని దుస్థితిలో ఇరువురు రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి విడదల రజిని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలేక, అప్పుల బాధ తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలానికి చెందిన రైతులు నాశ్యం ఆదినారాయణ(45), శిరిబోయిన గోపాలరావు(43)ల మృతదేహాలు చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకురాగా మాజీ మంత్రి మృతదేహాలకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు రైతుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
అభ్యుదయ రైతు శేషారావును ఆదర్శంగా తీసుకోవాలి
ప్రకృతి వ్యవసాయ డీపీఎం అమల కుమారి పెదకూరపాడు: అభ్యుదయ రైతు అవార్డు గ్రహీత దర్శి శేషారావును ఆదర్శంగా తీసుకోవాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం అమలకుమారి కోరారు. మంగళవారం శేషారావు పొలంలో పీఎండీఎస్ వేసిన పైరును ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 30 రకాల విత్తనాలు చల్లి 45 రోజుల తర్వాత భూమిలో కలయదున్నడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. అంతేకాకుండా కార్బన్ శాతం పెరిగి, నేల ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. పొడి వాతావరణంలో అయినా పైరు పచ్చగా ఉంటుందన్నారు. మిరప పంట వేసేవారు ఇప్పుడైనా పీఎండీఎస్ చల్లుకోవచ్చన్నారు. పత్తి, ఇతర అపరాల పంటలు వేసేవారు ప్రధాన పంటతోపాటు సమాంతరంగా ఐదు ప్రధానమైన పంటలు విత్తుకోవాలన్నారు. తీగజాతి పైరు, గింజ జాతి పైరు, చెట్టు జాతి పైర్లను వేసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అమూల్య, ఉదయలక్ష్మి, మహబూబీ, జ్యోత్స్న పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేద్దాం
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట: సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ళ గ్రామంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు నియోజవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కాలంలోని వైఫల్యాలపై పార్టీ ముద్రించిన ‘జగనన్న అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ పుస్తకం ఆవిష్కరించారు. ఈసందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలో జరిగిన ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఈయం స్వామి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెంపున్నారెడ్డి, సామాజిక విశ్లేషకులు ఈదర గోపీచంద్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు బొబ్బిలి శ్రీలక్ష్మి, నాయకులు షేక్ ఖాజావలి మాష్టారు, జి.అచ్యుతరావు, షేక్ కరిముల్లా, మాగులూరి రమణారెడ్డి, అచ్చి శివకోటి, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన బాబు
వినుకొండ: కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో ఐదుకోట్లమంది ఆంధ్రులను వెన్నుపోటు పొడవటం తప్ప చేసిందేమీలేదని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. వినుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం బొల్లా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఎన్నికలముందు ఇచ్చిన హామీలు మరచి పోయారని ఒక్క రెడ్బుక్ అమలు తప్ప, ఎన్నికల వాగ్దానాల అమలు లేదన్నారు. ఎన్నికలముందు ఇచ్చిన హామీలల్లో ఏఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఉన్న పింఛన్లు తీసివేయడం, అమ్మఒడి పథకంలో ఉన్న పేర్లను తొలగించడం వంటి పనులు తప్ప చంద్రబాబు సర్కారు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇసుక, మట్టి, రేషన్ బియ్యాన్ని ఏరియాలవారీగా పంచుకుని ప్రతి పనికి ఒక రేటు ఖరారు చేసి వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరిట టీడీపీ నేతలు చెలరేగుతున్నారని, వినుకొండలో రషీద్తో పాటు, టీడీపీ నాయకుల చేతిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు రైతుభరోసా ఇవ్వకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, పంటలకు గిట్టుబాటు ధర లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రెంటపాళ్లలో జరిగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ -
క్వారీ గుంతలో పడి యువకుడు మృతి
గుంటూరు రూరల్: క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామానికి చెందిన కట్టెపోగు నాగరాజు (30) ఆటోడ్రైవర్. అతనికి భార్య రూపకోటేశ్వరి, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. మరో రెండు రోజుల్లో కోటేశ్వరి ప్రసవించనుందని వైద్యులు తెలిపారు. దీంతో నాగరాజు ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బయటకు వెళుతున్నానని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోవటంతో స్థానికులు అంతటా వెతికారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లక్వారీ గుంత వద్ద నాగరాజు చెప్పులు, పక్కనే అతని ద్విచక్ర వాహనం కనిపించాయి. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత మేడికొండూరు, నల్లపాడు పోలీసుల మధ్య సరిహద్దు వివాదం నడిచిన అనంతరం నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల కోసం సోమవారం వేచి చూశారు. రాత్రి కావటంతో మంగళవారం ఉదయం నుంచి వెతుకులాట ప్రారంభించగా, నాగరాజు మృతదేహం లభ్యమైంది. పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నాగరాజు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారి పడ్డాడా? ఇక్కడ ఎక్కువగా ఉన్న కోతులు దాడి చేస్తే తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మృత్యుపాశాలుగా క్వారీ గుంతలు అనుమతులు లేకున్నా అక్రమంగా మైనింగ్ క్వారీలను నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యవహరిస్తున్నారు. ఎక్కువ లోతులో క్వారీలను తవ్వి వదిలేస్తున్నారు. ఈ గుంతల్లో నీరు నిలిచిపోతోంది. విషయం తెలియని కొందరు వ్యక్తులు ఇటువంటి ప్రమాదాలతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మైనింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
క్రూరంగా హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలి
దాచేపల్లి: వైఎస్సార్ సీపీ నేత ఉప్పుతల యల్లయ్య కుమారుడు హరికృష్ణని తీవ్రంగా కొట్టి గాయపరచిన దాచేపల్లి సీఐ భాస్కర్, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని హైకోర్టు న్యాయవాది, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల బేబిరాణి డిమాండ్ చేశారు. ఇటీవల హరికృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి అక్రమంగా నిర్భందించి చిత్రహింసలకు గురి చేసిన విషయం పాఠక విధితమే. తీవ్ర అనారోగ్యం బారిన పడి ఇటీవల కాలికి శస్త్ర చికిత్స జరిగిన హరికృష్ణను మండలంలోని తంగెడలో మంగళవారం వేముల బేబిరాణి పరామర్శించారు. పోలీసుల పెట్టిన చిత్రహింసల గురించి హరికృష్ణ ఆమెకు వివరించారు. పోలీసులపై న్యాయపోరాటం చేసి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, వైఎస్సార్ సీపీ పూర్తి అండగా ఉంటుందని బేబిరాణి భరోసా ఇచ్చారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి తీవ్రంగా స్పందించి బాధితుడికి అండగా నిలిచారని, జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా ఫిర్యాదు చేశారని ఆమె గుర్తు చేశారు. దాచేపల్లి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదస్పదంగా ఉందని, రెడ్బుక్ పాలన అమలు చేసేందుకే పోలీసులు ఇక్కడ పని చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఆమెవెంట పార్టీ దాచేపల్లి మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, మాజీ సర్పంచ్ మందపాటి రమేష్రెడ్డి, ఎంపీపీ కందుల జాను, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జాకీర్హుస్సేన్, నాయకులు దేవళ్ల వీరాస్వామి, గొగిరెడ్డి వెంకటరెడ్డి, వట్టె రామచంద్రారెడ్డి, ఉప్పుతల యల్లయ్య, ఆరికట్ల మల్లారెడ్డి, కాసర్ల నరసింహారెడ్డి, దేవళ్ల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేబిరాణి తంగెడలో హరికృష్ణకు పరామర్శ -
విద్యార్థులను అప్రెంటిస్షిప్ దిశగా ప్రోత్సహించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వృత్తి విద్యాకోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులను వివిధ పరిశ్రమలు, ఆస్పత్రుల్లో అప్రెంటిస్షిప్ చేసేలా ప్రోత్సహించాలని జిల్లా వృత్తి విద్యాధికారి జె.పద్మ పేర్కొన్నారు. ప్రవేశాల పెంపుపై ప్రభుత్వ, ప్రైవేటు వృత్తి విద్యా జూనియర్ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్తో మంగళవారం సాంబశివపేటలోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలోసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ విద్యార్థులు అప్రెంటిస్ షిప్ చేసే సమయంలో నెలకు రూ.7,500 అందజేస్తారని తెలిపారు. జిల్లాలోని పరిశ్రమలు, ఆస్పత్రుల్లో సర్వే నిర్వహించి, అప్రెంటిస్ షిప్ మేళాకు సంబంధించిన వివరాలు అందజేయాలని కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్కు సూచించారు. వృత్తి విద్యాకోర్సులను మరింత నాణ్యమైన విధంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. పారిశ్రామిక సర్వేను విజయవంతం చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల సమన్వయంతో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయి కమిటీకి డీవీఈవో చైర్మన్గా, డాక్టర్ ఉదయ శంకర్ సలహాదారుగా వ్యవహరించనున్నారు. సమావేశంలో ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. ఆనందబాబు పాల్గొన్నారు. -
వాహనాలు సీజ్ చేస్తామనడం తగదు
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిడుగురాళ్ల: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వాహనాలు పంపితే, వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని, వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించడం తగదని, ఇది కొత్త సంప్రదాయానికి దారి తీస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పిడుగురాళ్లలో ఆయన మాట్లాడుతూ రాజుపాలెం మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావును పోలీసులు అక్రమ కేసులు బనాయించి, బాగా హింసించి, దూషించి ఆత్మహత్యకు పురిగొల్పారన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎవరెన్ని ఆంక్షలు విధించినా.. వైఎస్ జగన్ పర్యటన ఆగదన్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు, యువకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నలుగురు ఎస్ఐలకు స్థాన చలనం నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లాలో నలుగురు ఎస్ఐలను వివిధ స్టేషన్లకు తాత్కాలికంగా ఎటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీసీబీలో పనిచేస్తున్న టి.తిరుపతిరావును మాచవరం పీఎస్కు, మాచవరం పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఎం.రోశయ్యను సీసీఎస్కు, నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో పనిచేసే డి.అశోక్ను నాగార్జునసాగర్ పోలీసుస్టేషన్కు గురజాల పోలీసుస్టేషన్లో పనిచేసే వై.వినోద్కుమార్ను మాచర్ల రూరల్ పోలీసుస్టేషన్కు ఎటాచ్ చేశారు. వీఆర్కు మాచర్ల రూరల్ ఎస్ఐ నరసింహులు మాచర్ల రూరల్: మాచర్ల రూరల్ ఎస్ఐ వి.నరసింహులును వీఆర్కు బదిలీ చేశారు. 45 రోజుల క్రితం మాచర్ల రూరల్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే రేంజ్ వీఆర్కు బదిలీ కావడం విశేషం. నరసింహులు ఇటీవల యాక్సిడెంట్ కేసులో ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే విషయంలో మాజీ మంత్రి, కుటుంబ సభ్యులను లంచం అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు నరసింహులును వీఆర్కు బదిలీ చేశారు. ఏఎస్ఐగా పనిచేస్తున్న షేక్ రఫీకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. బైక్పై విన్యాసాలు చేసిన వ్యక్తిపై కేసు కృష్ణలంక(విజయవాడ తూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంతో ఓ యువకుడు ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన మోహన్ప్రసాద్, ఉయ్యాల సురేష్ స్నేహితులు. మోహన్ప్రసాద్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ఓ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని బైక్ను కొన్ని రోజుల క్రితం సురేష్ తీసుకెళ్లి వెనుక మరో యువకుడిని ఎక్కించుకుని అర్ధరాత్రి కృష్ణలంక జాతీయ రహదారిపై విన్యాసాలు చేశాడు. వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. వాటిని ఎవరో ప్రయాణికులు వీడియో తీసి ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. ఆ విన్యాసాలను ఇన్స్ట్రాగామ్లో ఈ నెల 15న మోహన్ప్రసాద్ చూశాడు. తన బైక్తోనే విన్యాసాలు చేశాడని గుర్తించాడు. గంటలో తీసుకొస్తానని చెప్పి తన బైక్ను తీసుకెళ్లి అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మోహన్ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. -
రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభం
మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి అర్బన్: తెనాలి – గుంటూరు రహదారి పునర్నిర్మాణ పనులను మంగళవారం చెంచుపేటలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెనాలి నియోజకవర్గంలో రూ.4.30 కోట్లతో 9 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చామన్నారు. తెనాలి – గుంటూరు రహదారి పునర్నిర్మాణం కోసం రూ.3.50 కోట్లు, గుంటూరు – హనుమాన్పాలెం రోడ్డు నిర్మాణం కోసం రూ.7 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఖాజీపేట వరకు పూర్తయిందని, మిగిలిన పనులు జూలై నెలాఖరులోపు పూర్తి చేసేలా చూడాలని ఆదేశించామన్నారు. రూ.800 కోట్లతో తెనాలి నుంచి మంగళగిరి, తెనాలి నుంచి గుంటూరుకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి అనుమతులు వచ్చాయని చెప్పారు. ఈ ఏడాదిలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తెనాలిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ సి.విశ్వనాథ్రెడ్డి, డీఈ డి.రాజేంద్రనాయుడు, ఏఈ బి.శివ నరసింహారావు, కౌన్సిలర్లు గోగిరెడ్డి మాసనరెడ్డి, కొమరబత్తుని జయపాల్, అధికారులు, పలువురు జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
అభిమానంపై ఆంక్షలు
అక్కడ ఎలాంటి బహిరంగ సభ నిర్వహించడానికో వెళ్లడం లేదు... కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం ఉలిక్కిపడుతోంది...! అక్కడ ఏ బల ప్రదర్శన కోసమో వెళ్లడం లేదు... కానీ, పోలీసు యంత్రాంగం చేత కొర్రీలు పెట్టిస్తోంది...! అమిత జనాదరణ ఉన్న ప్రతిపక్ష నేతనుఆంక్షలతోఅడ్డుకోవాలని చూస్తోంది...! ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న సర్కారు.. లేనిపోని నిబంధనలతో అడ్డంకులు సృష్టిస్తోంది..! పోలీసులు, కూటమి నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను భగ్నం చేయాలని ప్రయత్నాలు సాగిస్తోంది..! సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం తలపెట్టిన పర్యటనతో కూటమి సర్కారు కలవరం చెందుతోంది. ప్రతిపక్ష నేత తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్తుండడాన్ని కూడా ప్రభుత్వం సహించలేకపోతోంది. రెంటపాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత కొర్లకుంట వెంకటేశ్వరరావు కుమారుడు నాగమల్లేశ్వరరావు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటూ గ్రామ ఉప సర్పంచ్ అయ్యారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4 నుంచి ఆయనను పోలీసులు, కూటమి నేతలు వేధించడం మొదలుపెట్టారు. దీంతో జూన్ 6న పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి జూన్ 9న మృతి చెందారు. రెడ్బుక్ పాలనలో భాగంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైన వైఎస్సార్సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు. ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రెంటపాళ్ల గ్రామాన్ని సందర్శించనున్నారు. అభిమానాన్ని కొలవగలరా..? వైఎస్ జగన్ పర్యటనకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తారనే అంచనాకు వచి్చన కూటమి ప్రభుత్వం, పోలీసులు అనుమతుల పేరుతో అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నవారు. ఆయన వస్తున్నారంటే ప్రజలు స్వచ్ఛందంగా కదిలివస్తారు. అయినా సరే కూటమి నేతల ప్రోద్బలంతో పోలీసులు ఆయన పర్యటనకు వీలైనన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ సత్తెనపల్లి ఇన్చార్జి డాక్టర్ సుదీర్ భార్గవ్రెడ్డి కోరిన అనుమతిని తిరస్కరిస్తున్నారు. పేర్లు కావాలి... అన్ని కార్లు వద్దు.. వైఎస్ జగన్ పర్యటన సమన్వయకర్తల పేర్లు అడగడం, వాహనాల సంఖ్యపై పరిమితి విధించడం వంటి చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారు. ఆయన కాన్వాయ్ కాకుండా మరో మూడు వాహనాలు, వందమందితోనే వెళ్లాలని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దు అని ఎన్నో నిబంధనలు పెడుతున్నారు. వాస్తవానికి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత పర్యటనకు అన్ని విధాలా ఏర్పాట్లు చేయడం పోలీసుల బాధ్యత. కానీ, దీనికి పూర్తి విరుద్ధంగా కొర్రీలు పెడుతున్నారు. కాగా, వైఎస్ జగన్ పర్యటనపై కార్యకర్తల్లో గందరగోళం సృష్టించి సత్తెనపల్లి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారని, ఏం చేసినా పర్యటన జరిగి తీరుతుందని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. జననేతకు జనాదరణ.. వ్యతిరేకత ప్రవాహంలో కూటమి ఇటీవల వైఎస్ జగన్ చేస్తున్న పర్యటనలకు ప్రజాదరణ పోటెత్తుతోంది. దీనిని చూసి తట్టుకోలేక ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది. మరోవైపు కూటమి సర్కారు రోజురోజుకు వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. హామీలను గాలికొదిలేసి రెడ్బుక్ పాలన సాగిస్తోంది. ఈ ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుతుండడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు విధిస్తూ పన్నాగాలు పన్నుతోంది. ట్రావెల్స్ యజమానులకు బెదిరింపులు అభిమాన నేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు వస్తుండడంతో జిల్లాలోని వైఎస్సార్సీపీ అభిమానులు సత్తెనపల్లి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వచ్ఛందంగా ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. అయితే, వీరిని నిలువరించే ప్రయత్నంలో ఉన్న పోలీసులు.. ట్రావెల్స్ యజమానులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టు సమాచారం. బుధవారం సత్తెనపల్లి వైపు వస్తే కేసులు రాసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరని వైఎస్సార్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు పోలీసులకు సహకరించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. తన కుమారుడు నాగమల్లేశ్వరరావు జ్ఞాపకార్థం 30 వేలమందికి భోజనాలు పెట్టాలని వెంకటేశ్వరరావు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ పోలీసుల సూచనల నేపథ్యంలో విరమించుకున్నారు. పోలీసులు చెప్పిన విధంగా నాగమల్లేశ్వరరావు ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సత్తెనపల్లి: రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి డాక్టర్ గజ్జల సు«దీర్భార్గవ్రెడ్డి అనుమతి కోరారని, దానికి సంబంధించి పూర్తి సమాచారం కోరగా ఇవ్వలేదని, దీంతో తిరస్కరించామని ఎస్పీ పేర్కొన్నారు. అనవసరంగా భారీఎత్తున జన సమీకరణ చేయొద్దని చెప్పారు.వైఎస్ జగన్ పర్యటన సాగుతుందిలాబుధవారం ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని స్వగృహం నుంచి రోడ్డు మార్గంలో రెంటపాళ్లకు బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు రెంటపాళ్ల చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12 గంటలకు రెంటపాళ్ల నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 1.30కు తాడేపల్లి చేరుకుంటారు. -
వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం
సాక్షి, పల్నాడు: పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి కచ్చితంగా వస్తారని వైఎస్సార్సీపీ నేతలు కుండబద్ధలు కొట్టారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం.. జనం అంటేనే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ, జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అయినా వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించడం ఖాయం’’ అని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.కుట్ర ప్రకారమే జగన్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా అడ్డుకున్నామా?. మరి వైఎస్ జగన్ పర్యటన అంటే కూటమి ఎందుకు భయపడుతోంది?. నాగమల్లేశ్వరావును టీడీపీ నేతలు, పోలీసులు వేధించారు. అది భరించలేకే ఆయన సూసైడ్ చేసుకున్నారు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయి. ఈ అరాచక పాలన తట్టుకోలేకనే జనం రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జగన్ పర్యటించడం ఖాయం అని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. -
చిలకలూరిపేటలో ఇద్దరు రైతుల ఆత్మహత్య
సాక్షి పల్నాడు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతో బలవన్మరణం చెందారు. నాదెండ్లకు చెందిన ఆదినారాయణ, తూబాడుకు చెందిన చిరుబోయిన గోపాలరావు పొలంలోనే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కూటమి ఏడాది పాలనపై చర్చకు సిద్ధం
● వైఎస్సార్ సీపీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పూనూరి గౌతమ్రెడ్డి సవాల్ ● నరసరావుపేటలో వారం, పదిరోజుల్లో టీడీపీ నేతలు చర్చకు రావాలి ● కూటమి ఏడాది పాలనపై వెన్నుపోటు పుస్తకం ఆవిష్కరణ ● మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, కాసు మహేష్, నాయకులు ● వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటన జయప్రదం చేయాలని పిలుపు నరసరావుపేట: కూటమి ప్రభుత్వ ఏడాది మోసపు పాలన, వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వ నిజాయతీ పాలనపై నరసరావుపేటలో టీడీపీ నేతలు, మంత్రులు ఒకవారం లేదా పదిరోజుల్లో చర్చకు రావాలని వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పూనూరి గౌతమ్రెడ్డి సవాల్ విసిరారు. ఈ చర్చకు తనతోపాటు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని ఏడాది పాలన ఫెయిల్యూర్ తెలియచేస్తామని, దమ్ముంటే టీడీపీ నేతలు ఎవరైనా రావొచ్చని అన్నారు. కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్, జగన్మోహన్రెడ్డి పాలనను బేరీజు వేస్తూ వెన్నుపోటు అనే పేరుతో ముద్రించిన జగన్ నమ్మకం, చంద్రబాబు మోసం పుస్తకాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. దీనిలో మాజీమంత్రి విడదల రజిని, నరసరావుపేట, గురజాల మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డిలతోపాటు పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో గౌతమ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాదిగా అరాచకం, అప్రజాస్వామిక పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తల్లికి వందనం పథకం లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అందలేదని తాము నిరూపించగలమని అన్నారు. విద్యుత్ చార్జీలు వీరబాధుడుగా ఉన్నాయన్నారు. జగన్మోహన్రెడ్డి కేవలం యూనిట్ రూ.2లకే కొంటే గగ్గోలు పెట్టిన చంద్రబాబు అదే కరెంటును రూ.4.50కి కొన్నాడన్నారు. 159 పేజీల ఈ బుక్లో జగన్మోహనరెడ్డి నిజాయతీ, చంద్రబాబు ఫెయిల్యూర్ తెలియచేశామన్నారు. సత్తెనపల్లిలో అశువులు బాసిన వైఎస్సార్సీపీ నాయకుడి విగ్రహావిష్కరణకు జగన్మోహన్రెడ్డి చేసే పర్యటన శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ అసమర్ధ, అరాచకాలను ఎండగట్టాలని గౌతంరెడ్డి కోరారు. రాష్ట్రంలో అసలు హోం మంత్రి ఉన్నారా..? మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ ఏడాది పాలనలో 769 మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై హత్యలు, దాడులు, కేసులు పెట్టి వేధించారన్నారు. 260 మంది చనిపోయారని అన్నారు. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట మూడేళ్ల బాలిక దగ్గర నుంచి 35 ఏళ్ల మహిళల వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఇప్పటివరకు 188 మందిపై చోటుచేసుకున్నాయని చెప్పారు. దీనిని బట్టి హోం మంత్రి పనిచేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా ఉందన్నారు. 139మంది సోషల్మీడియా యాక్టివిస్టులపై 729 కేసులు పెట్టారని చెప్పారు. చంద్రబాబు తన ఆస్తులు పంచి చూపించాలి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఆరోగ్యశ్రీ చెల్లింపులు కేవలం ఒక నెలకే ఇచ్చారన్నారు. ప్రతి మహిళకు రూ.15వేలు ఇస్తామని చెప్పి పీ4కు అప్పచెప్పామని చెబుతున్నామన్నారు. చంద్రబాబుకు రూ.50వేల కోట్లు ఆస్తులు ఉన్నాయని, వాటిని 50వేల కుటుంబాలకు పంచితే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులవుతారని అన్నారు. ఇది ఆయన అమలుచేసి మిగతా వారికి మార్గదర్శం కావాలని కోరారు. జగన్మోహన్రెడ్డి చేసిన అప్పులకు ఒక లెక్క ఉందని, చంద్రబాబు చేసే అప్పులకు లేక్కేలేదని అన్నారు. యొనుముల మురళీధర్రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. జగన్ పాలనలో ప్రతి సామాన్యుడికి మంచి జరిగింది మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలు, విద్యార్థులకు, రైతులు, ప్రతి సామాన్యుడికి మంచి జరిగిందన్నారు. నేటి కూటమి ప్రభుత్వంలో సామాన్యుడికి భద్రత లేకుండా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం దారుణాలను ప్రశ్నించటానికే జగన్మోహన్రెడ్డి అన్ని ప్రాంతాలకు వస్తున్నారని, సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు జగన్ వస్తున్నాడని, ప్రజలు అందరూ పాల్గొనాలని కోరారు. -
రేపు రెంటపాళ్లకు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రానున్నారని, ఆ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. సుధీర్భార్గవ్రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సమయంలో సత్తెనపల్లి రూరల్ పోలీసుల వేధింపులు, కూటమి నేతల దాడుల నేపథ్యంలో మనస్తాపం చెందిన రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమలేశ్వరరావు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడన్నారు.రెంటపాళ్ల గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యాన్నివ్వడంతోపాటు భరోసా కల్పించి ఆయన కాంస్య విగ్రహావిష్కరణను జగన్మోహన్రెడ్డి చేస్తారన్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు మీదుగా సత్తెనపల్లి చేరుకుంటారని, అనంతరం సత్తెనపల్లి, పాకాలపాడు మీదుగా రెంటపాళ్లకు చేరుకుంటారన్నారు.సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి టౌన్, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల నుంచి పెద్దఎత్తున వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
జూలై 5న జాతీయ లోక్అదాలత్
గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో జూలై 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించటం జరుగు తోందని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి సోమవారం తెలిపా రు. జాతీయ లోక్ అదాలత్లో గుంటూరు జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ బెంచెస్ ద్వారా సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇచ్చిన సర్కులర్ ప్రకారం కొన్ని రాజీ పడదగ్గ ఎక్సైజ్ కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎల్ఏఓపీ కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరించటం జరుగుతుందన్నారు. కక్షిదారులు, పోలీస్శాఖ, స్టేక్ హోల్డర్స్ ఈ జాతీయ లోక్ అదాలత్ ఎక్కువ కేసులు పరిష్కరించేలా సహకరించాలని సూచించారు. సివిల్ కేసుల్లో అప్పీల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు ఎక్కువగా రాజీ చేసే దిశగా కక్షిదారులకు, న్యాయవాదులకు సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.ఆర్టీసీ ఆర్ఎంగా విమలపట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : ఏపీఎస్ ఆర్టీసీ గుంటూరు జిల్లా రీజియన్ మేనేజర్గా సీహెచ్.విమల సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా విజయవాడ హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న ఆమెను ఇక్కడ నియమించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఆర్ఎంగా పనిచేసిన ఎం.రవికాంత్ డెప్యూటీ సీటీఎంగా బదిలీపై నెల్లూరు వెళ్లారు. విమలను ఆర్టీసీ సిబ్బంది, అధికారులు అభినందించారు.ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో డాక్టర్ సత్యవేణికి 12వ ర్యాంకులబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల ప్రకటించిన ఆల్ ఇండియా ఎయిమ్స్ సర్జికల్ అంకాలజీ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన డాక్టర్ సత్యవేణి జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. డాక్టర్ సత్యవేణి విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం నిమ్రా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త డాక్టర్ మాచర్ల సృష్టి కూడా జాతీయ స్థాయిలో జరిగిన నీట్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి బెంగళూరులోని శ్రీ జయదేవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్స్ అండ్ రీసెర్చ్లో వాస్కులర్ సర్జరీ(ఎంసీహెచ్)లో ప్రవేశం పొందారు.21న యోగాసనాల్లో అందరూ పాల్గొనాలిగుంటూరు వెస్ట్: ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న యోగాసనాల్లో వీలైనంత మంది పాల్గొనేలా చేయాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో మాట్లాడుతూ యోగాసనాలు వేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో గుర్తించిన 4879 ప్రాంతాలను అధికారులు పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. యోగాంధ్ర–2025లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారందరినీ 21న జరగనున్న కార్యక్రమంలో హాజరయ్యేలా అధికా రు లు సమన్వయం చేసుకోవాలన్నారు. యోగాసనాల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.31వరకు అతిసారం నియంత్రణపై ప్రచారంనరసరావుపేట: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు అతిసార వ్యాధి నియంత్రణపై ప్రచారం నిర్వహించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. తన కార్యాలయంలో సోమవారం ప్రచారానికి సంబంధించిన వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఐదేళ్లలోపు పిల్లలు అతిసారతో మృత్యువాత పడ కుండా ఉండటమే దీని ప్రధాన ఉద్దేశమన్నా రు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ బి.గీతాంజలి పాల్గొన్నారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్కు రెడీ!
● 21 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ● 25 నుంచి కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాలుగు హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు గుంటూరుఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికిగానూ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 21న ప్రారంభం కానుంది. పాలిసెట్–2025లో అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 28 వరకు జరగనున్న కౌన్సెలింగ్లో ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది. ఇందు కోసం సాంకేతిక విద్యాశాఖ ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాలుగు హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాగోరు విద్యార్థులు ఈనెల 20 నుంచి 27 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో రుసుం చెల్లించాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాగోరు విద్యార్థులు వెంట ఫీజు రసీదు, హాల్ టికెట్, ర్యాంకు కార్డు, టెన్త్ పాస్ సర్టిఫికెట్, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఓసీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంది. స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థులు విజయవా డ బెంజి సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్లో హాజరు కావాల్సి ఉంది. ● 21న ఒకటో ర్యాంకు నుంచి 15వేలు, 22న 15,001 నుంచి 32వేలు, 23న 32,001 నుంచి 50వేలు, 24న 50,001 నుంచి68వేలు, 25న 68,001 నుంచి 86వేలు, 26న 86,001 నుంచి 1,04,000, 27న 1,04,001 నుంచి 1,20,000, 28న 1,20,001 నుంచి చివరి ర్యాంకు వరకు హాజరుకావాలి. ● సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 25నుంచి 30వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. హెల్ప్లైన్ కేంద్రాలు గుంటూరు నగర శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్, నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సమీపంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ పాత క్యాంపస్, రేపల్లె లోని ప్రభుత్వ పాలిటెక్నిక్, బాపట్లలోని బాపట్ల పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ కేంద్రాల్లో ఆయా తేదీల్లో ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. -
తల్లికి వందనం అమలులో అంగన్వాడీలకు అన్యాయం
నరసరావుపేట: అంగన్వాడీలకు తల్లికి వందనం అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందనీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.మెటిల్డాదేవి, గుంటూరు మల్లీశ్వరి పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయలునాయక్ నాయకత్వంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తమకు తల్లికి వందనంతోపాటు ఇతర సంక్షేమ పథకాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పి.అరుణ్బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మెటిల్డాదేవి, మల్లీశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడీలకు అమ్మ ఒడి అందజేసిందన్నారు. అయితే ఈ ప్రభుత్వం అంగన్వాడీలకు అన్నీ సంక్షేమ పథకాలు అమలుచేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిందన్నారు. తీరా తల్లికి వందనం అంగన్వాడీలకు అమలుచేయకపోవటంతో చాలా మంది టీచర్లు, ఆయాలు రోధిస్తున్నారన్నారు. నెలకు రూ.11వేల జీతం ఇచ్చి సంక్షేమ పథకాలకు ఎగనామం పెడితే ఏవిధంగా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక వేళ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా భావిస్తే తమకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలు అందజేయాలని కోరారు. ఇప్పటికై నా ప్రభుత్వం తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని జిల్లా కార్యదర్శి ఆంజనేయులు నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీలు యంపరాల సరోజ, కట్టా నాగలక్ష్మి, కోట కోటేశ్వరమ్మ, పేరేచర్ల సాంబ్రాజ్యం, ఉప్పుతోళ్ల వెంకాయమ్మ, కటకం కృష్ణవేణి, మల్లెల శశికళ, వనజాక్షి పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా వెంటనే సంక్షేమ పథకాలు అమలుచేయాలి లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు ముట్టడిస్తాం కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీలు -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
● జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ● పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 191 అర్జీలు స్వీకరణ నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఏస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లాకలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద 191 అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అన్నారు. ప్రతి అర్జీకి అర్ధవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, అధికారులు పాల్గొన్నారు. భూమి హద్దులు చూపించకుండా వేధిస్తున్నారు.. ప్రభుత్వం ఇచ్చిన డీకే పట్టాలో సాగుచేసుకుంటున్న రైతులను ఫారెస్టు అధికారులు, రెవెన్యూ అధికారులు కమ్మకై ్క డబ్బుల కోసం వేధిస్తున్నారు. పొలంలోకి రైతులను రానీయట్లేదు. డీటీగా పనిచేస్తున్న జానీబాషకు, అటవీశాఖ అధికారులకు కొంత డబ్బు కూడా ఇచ్చాం. మరికొంత డబ్బుల కోసం భూమి హద్దులు మాకు చూపించకుండా తొమ్మిది నెలల నుంచి వేధిస్తున్నారు. ఇప్పటికే నాలుగు నెలల క్రితం కలెక్టర్కు విన్నవించాం. ఫలితంలేదు. మళ్లీ ఇప్పుడు అర్జీ పెట్టుకుంటే ఆర్డీఓను కలవాలని సూచించారు. –టి.హనుమంతరావు, కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు, తాళ్లచెరువు, అచ్చంపేట మండలం విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి మండలంలోని ఇనిమెళ్ల గ్రామంలో విద్యుత్ సరఫరా కోసం తిరుగుతున్న రైతులను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఏఈ, లైన్మెన్ల్పై చర్యలు తీసుకోవాలి. –చింతిరాల మీరయ్యమాదిగ, ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోండి వినుకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమి ఆక్రమణలో అవినీతికి పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించండి. కళాశాల భూమిపై పూర్తిగా విచారించి నిగ్గుతేల్చి నివేదిక బయటపెట్టండి. రెవెన్యూ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్, సిబ్బంది అక్రమాలతో కళాశాల భూమికి రెక్కలు వచ్చాయి. వారిపై చర్యలు తీసుకోండి. – ప్రభుత్వ కళాశాల పరిరక్షణ కమిటీ, వినుకొండ -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి
చిలకలూరిపేట సమీపంలో విషాద ఘటన చిలకలూరిపేటటౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...వైఎస్సార్ కాలనీకి చెందిన గాలేటి రాంబాబు, కావేరి దంపతులు, వారి మేనకోడళ్లైన పాముసాని బాలసాహితి, వెంకట శృతితో కలిసి బైక్పై కనపర్రు చర్చికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. రూరల్ మండలంలోని లింగంగుంట్ల వంతెన దాటిన తరువాత అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ట్యాంక్పై కూర్చున్న వెంకట శృతి(9) బస్సు చక్రాల కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. రాంబాబు, ఆయన భార్య కావేరికి స్వల్ప గాయాలు కాగా, మరో బాలిక బాల సాహితికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే పాపను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలు కావేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఏపీ టాక్స్ బార్ అధ్యక్షుడిగా రామరాజు శ్రీనివాసరావు
గుంటూరు వెస్ట్: ఏపీ టాక్స్ బార్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన ప్రముఖ ఆడిటర్ రామరాజు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రస్తుత అధ్యక్షుడు ఎం.వి.జె.కె. కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 15న జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. జూలై 1 నుంచి పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఈ పదవిలో రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతారన్నారు. 2000 పైగా ప్రాక్టీషనర్స్, చార్డెర్డ్ అక్కౌంటెంట్స్, న్యాయవాదులు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు గతంలో ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్, కన్సల్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ ( సదరన్ ) చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారన్నారు. పలు సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం సంస్థకు ఎంతో ప్రయోజనమని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు కోట సునీల్, ఏ.వి.ఎస్. కృష్ణ మోహన్, చక్ర రమణ, ఫణి కుమార్, సురేష్లతోపాటు పలువురు ఆడిటర్లు, చార్టెర్డ్ అక్కౌంటెంట్లు అభినందనలు తెలిపారు. -
సారా రహిత జిల్లాగా పల్నాడు
నరసరావుపేట: సారా రహిత జిల్లాగా పల్నాడు జిల్లా ఏర్పాటైందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లాలో ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు నాటుసారా నిర్మూలనకు చేపట్టిన చర్యలను ఎకై ్సజ్ అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవోదయం 2.0లో భాగంగా జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రోహిబిషన్ అండ్ ఎకై ్స జ్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టినట్టు చెప్పారు. నాటుసారా నిర్మూలనలో భాగంగా మొదటి దశలో 116 అవగాహన సదస్సులు నిర్వహించి దానివలన కలిగే దుష్ప్రభావాలపై ప్రచారరథంతో ఊరురా తిరుగుతూ ప్రచారం నిర్వహించారన్నారు. రెండవ దశలో విస్తృతంగా దాడులు నిర్వహించి తయారీ విక్రయాల్లో ఉన్న వారిపై 32 కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్టు చేయగా 138 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని 11,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారన్నారు. బెల్లం విక్రయించకుండా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో సారా వృత్తిగా బతుకుతున్నా వారికి చైతన్యం కల్పించి ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించేందుకు కలెక్టర్ సూచనల ప్రకారం 57 మందిని గుర్తించి అందులో అర్హులుగా గుర్తించిన 23 మందికి ప్రత్యామ్నయంగా వారి కుటుంబాలకు రూ.29.40 లక్షలు మొత్తాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధి, లోన్ రూపంలో అందజేశారు. గుంటూరు ప్రొహిబిషన్ ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్లు ఎం.సుధాకర్రెడ్డి, ఎం.రవికుమార్రెడ్డి, పల్నాడు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి.సూర్యనారాయణ, కె.రవీంద్ర పాల్గొన్నారు. నవోదయం 2.0తో పటిష్ట చర్యలు ఎకై ్సజ్ అధికారులతో సమీక్షలో కలెక్టర్ రూ.29.40 లక్షల ఆర్థిక సహాయం అందజేత -
వైఎస్సార్ మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలి
పిడుగురాళ్ల: డాక్టర్ వైఎస్సార్ మెడికల్ కాలేజ్, వైద్యశాలను తక్షణమే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఆగిపోయిన వైద్య కళాశాల, వైద్యశాలను సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నాలుగేళ్ల కిందట రూ.540 కోట్లతో నిర్మాణం చేపట్టి 90 శాతం ఆస్పత్రి, 70 శాతం కాలేజీ నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించి, ఆరు నెలల్లో ఈ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. గురజాల పల్నాడు ప్రజలందరికీ సెల్ఫీ వీడియో ద్వారా ఫొటోలు, వీడియోలు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు సూచించారు. ఈ సంవత్సర కాలంలో ఆస్పత్రి అందుబాటులోకి తీసుకోచ్చి ఉంటే ప్రజలందరికీ ఇక్కడే వైద్య సాయం ఉండేదన్నారు. ఈ మెడికల్, నర్సింగ్ కాలేజ్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఈ ప్రాంత విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లి లక్షలకు లక్షలకు హాస్టల్ ఫీజులు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు. పనులు పూర్తి చేసే వరకు పోరాడతామని చెప్పారు. దాచేపల్లి పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్కి యారపతినేని శ్రీనివాసరావు తండ్రి లక్ష్మయ్య పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన దాచేపల్లి: రాష్ట్రంలో సంక్షేమం.. అభివృద్ధి లేకుండా చంద్రబాబు రెడ్బుక్ పరిపాలన చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ధ్వజమెత్తారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కూటమి నేతల ఒత్తిడి తట్టుకొలేకనే ఆత్మహత్య చేసుకున్నాడని, కానీ ఇది ముమ్మటికి ప్రభుత్వ హత్య అని మహేష్రెడ్డి ఆరోపించారు. అధికార పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 18న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని చెప్పారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, మాజీ చైర్మన్ మునగా పున్నారావు, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు షేక్ సుభానీ, కోట కృష్ణ, ఎంపీపీ కందుల జాను, వైస్ ఎంపీపీ తండా అబ్దుల్సత్తార్, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జాకీర్హుస్సేన్, మాజీ సర్పంచి మందపాటి రమేష్రెడ్డి, వైస్ చైర్మన్లు కొమెరబత్తిన విజయ్కుమార్, షేక్ ఖాదర్బాషా పాల్గొన్నారు. కూటమి హయాంలో నత్తనడకన పనులు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి -
రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి
యువతికి తీవ్ర గాయాలుతెనాలి రూరల్: రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి చెందగా, యువతి తీవ్ర గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన వైద్యుడు బూదాటి వెంకటేష్(35) తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని డయాలసిస్ విభాగంలో పని చేస్తున్నాడు. విజయవాడకు చెందిన స్నేహితురాలు యామినీని తెనాలి నుంచి విజయవాడకు తీసుకెళ్లేందుకు బుల్లెట్పై బయలుదేరారు. వీఎస్సార్ కళాశాల దాటగానే తెనాలి–విజయవాడ రహదారిపై ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ట్రెయిలర్ ఢీకొని ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు.తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు ఇద్దరిని తరలించగా, వెంకటేష్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అపస్మారస్థితిలో ఉన్న యామినికి చికిత్స అందిస్తున్నారు. రూరల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెలకు రెండుసార్లు రుణమేళా నిర్వహిస్తాం
కలెక్టర్ అరుణ్ బాబు నరసరావుపేట: జిల్లాలో నెలకు రెండు సార్లు మెగా రుణమేళా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, రుణ దరఖాస్తుదార్లతో మెగా రుణమేళా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ఒకసారి, నియోజకవర్గస్థాయిలో ఒకసారి రుణమేళా నిర్వహించి బ్యాంకు రుణాలు సులభంగా పొందడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. బ్యాంకులకు అందిన రుణ దరఖాస్తులను అక్కడికక్కడే పరిశీలించి రుణవితరణ చేపడతామన్నారు. మొత్తం 338 దరఖాస్తులను పరిశీలించి 50 మంది చిరువ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.50 లక్షలు స్వయం సిద్ధ రుణాలు మంజూరు చేశారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద మరో రూ.32 లక్షలు మంజూరు చేశారు. ఎంపీ లావుశ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రుణాలకోసం బ్యాంకులను మాత్రమే ఆశ్రయించటం శ్రేయస్కకరమని అన్నారు. రుణాలు అందించేందుకే బ్యాంకులు ఉన్నాయని, ప్రభుత్వ పథకాల ద్వారా అందజేసే రుణాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎల్డీఎం రాంప్రసాద్, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, యూనియన్ బ్యాంకు అధిపతి మాధురి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ అధికారి సుభాష్ పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడిన లారీ
చినగంజాం: టమోటో లోడుతో వెళుతున్న బొలేరో వాహనం డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టిన సంఘటన సోమవారం చినగంజాం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి బాపట్లకు టమోటా లోడుతో వస్తున్న బొలేరో వాహనం చినగంజాం సమీపంలోని జాతీయ రహదారి వద్ద టీ జంక్షన్ చేరుకోగానే సిమెంట్ డివైడర్ను ఢీ కొట్టి బోల్తా కొట్టింది. సంఘటనలో ఆర్.శ్రీనివాసరావు సురక్షితంగా బయట పడ్డాడు. హైవే మొబైల్ సిబ్బంది, పోలీస్ మొబైల్ ట్రాఫిక్ మళ్లించి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. పొక్లెయిన్ సాయంతో వాహనాన్ని తొలగించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.నీట్లో విశేష ప్రతిభ కనబరిచిన రెంటాల విద్యార్థినిరెంటచింతల: మండలంలోని రెంటాల గ్రామానికి చెందిన విద్యార్థిని బత్తుల మౌనిక నీట్ 2025 ఆల్ఇండియా స్థాయిలో విశేష ప్రతిభను చాటి 632 ర్యాంక్ సాధించింది. మౌనిక తండ్రిది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. బత్తుల నాగిరెడ్డి, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె మౌనిక మొదటి ప్రయత్నంలోనే అద్భుతవిజయం సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తు హర్షం వ్యక్తం చేశారు. వైద్యవృత్తి ద్వారా నిరుపేదలైన ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడమే తన లక్ష్యమని విద్యార్థిని మౌనిక చెబుతున్నారు.సూపర్ సిక్స్లోని ప్రతి పథకాన్ని అమలు చేస్తాంనరసరావుపేట: ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్లోని ప్రతి పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిందని, కుటుంబంలో అర్హులైన ప్రతి పిల్లవానికి రూ.13వేలు చొప్పున అందించామని అన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి సయ్యద్ జిలాని పాల్గొన్నారు.పోలీసుశాఖకు 33 అధునాతన మోటారు సైకిళ్లు కేటాయింపునగరంపాలెం: సురక్షితమైన డ్రైవింగ్ ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడుతుందని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన మూడు బుల్లెట్లు, 30 అపాచీ ద్విచక్ర వాహనాలను సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఓ బైక్ను కొద్ది దూరం నడిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాల నిర్వహణ కోసం సరికొత్త బైక్లతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఆధునికమైన సాంకేతికతతో కూడిన సిగ్నలింగ్ వ్యవస్థ ఉందన్నారు. ఈ వాహనాలపై సుశిక్షితులైన పోలీస్ సిబ్బందితో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించామన్నారు. గుంటూరు నగరం, తుళ్లూరు, తాడేపల్లి, తెనాలి, మంగళగిరి, పొన్నూరు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. రహదారులపై వచ్చే, పోయే ఇతరుల వాహనాలకు ఇబ్బందులు కలిగించేలా అడ్డదిడ్డమైన డ్రైవింగ్, రేసులను అరికట్టేందుకు పెట్రోలింగ్ చేపడతామని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా ట్రాఫిక్ సమస్య తలెత్తిన సత్వరమే పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్, ఎస్పీ సీసీ ఆదిశేషు, పశ్చిమ ట్రాఫిక్ పీఎస్ సీఐ సింగయ్య, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ పాల్గొన్నారు. -
అసంతృప్తిలో టీడీపీ క్యాడర్..
సాక్షి, టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం కష్టపడిన కార్యకర్తలు ఇప్పుడు ప్రభుత్వం, పార్టీపై ఎంతో అసంతృప్తిగా ఉన్నారని, టీడీపీలో కార్యకర్తలను పట్టించుకోవటం లేదని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన టీడీపీ యువ నాయకుడు బొమ్మిరెడ్డి రామకోటయ్య అన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై రామకోటయ్య మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో రామకోటయ్య ఏమి మాట్లాడారంటే.... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం వైఎస్సార్ సీపీతో గొడవలు పడి ఎన్నో ఇబ్బందులు పడ్డామని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సూపర్సిక్స్ కమిటీ ఏ కార్యకర్తని పార్టీ కార్యక్రమాలకు పిలిచి మాట్లాడలేదని, అడుగడున కార్యకర్తలను అవమానిస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఎటువంటి వ్యాపారంలో భాగస్వాములను చేయకుండా పెద్ద నాయకులే అన్నింట్లో ఉన్నారని రామకోటయ్య ఆరోపించారు. మా లాంటి కార్యకర్తలకు పార్టీ ఏమి చేయలేకపోతుందని, మనకి ఓటు వేసినవారికి కూడా ఏమి చేయలేకపోతున్నామని చెప్పారు. బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారని, పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని ఏవరు పట్టించుకోవటం లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి టీడీపీ నాయకులు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అమలు కమిటీ మాకు అంతా అనుకూలంగా లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, స్పందించి టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆ వీడియోలో విన్నవించారు. కార్యకర్తలను పట్టించుకోవటంలేదు.. నాయకులు సిండ్కేట్ టీడీపీ నాయకుడు బొమ్మిరెడ్డి రామకోటయ్య -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం
నరసరావుపేట రూరల్: సాప్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నకిలీ కాల్ లెటర్స్తో యడ్లపాడు మండలం ఉన్నవకు చెందిన మెట్టల రమేష్, మోసం చేసినట్టు అనంతపురానికి చెందిన యువతీ, యువకుడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 81 అర్జీలు స్వీకరించారు. ● రెండు సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉన్నవ గ్రామానికి చెందిన షేక్ సన, గుంతకల్లుకు చెందిన ఆసీఫ్లకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కల్పిస్తానని రమేష్ నమ్మబలికాడు. వీరి నుంచి రూ.5.2 లక్షల తీసుకొని నకిలీ కాల్ లెటర్స్ ఇచ్చి మోసం చేశాడు. నగదు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా రమేష్ స్పందించకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ● నరసరావుపేటకు చెందిన అమరా వెంకటేశ్వరరావు తమ వద్ద రూ.8 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆయన మృతిచెందిన తరువాత భార్య సుధారాణి అప్పును తాను చెల్లిస్తానని హామీ ఇచ్చింది. నెల రోజులుగా ఆమె కనిపించకుండా వెళ్లిపోయిందని తమకు న్యాయంచేయాలని బాధితులు ఎస్పీని కోరారు. ● రొంపిచర్ల మండలం అలవాలలో బావిలో పడి దాసరి సురేష్ మృతి చెందిన ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని, రీపోస్ట్ మార్టం నిర్వహించి నిజాలు వెలికితీయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఎస్పీని కోరారు. ● రష్యాలో పని కల్పిస్తామని ముంబైకి చెందిన రాజీబ్ తమను మోసం చేసినట్టు నకరికల్లుకు చెందిన చిలుకా రాజు ఫిర్యాదు చేశాడు. వీసా కోసం రూ.2లక్షలు చెల్లించామని తెలిపాడు. వీసా వచ్చిందంటే నమ్మి ముంబై వెళ్లగా నకిలీ విమాన టికెట్లతో మోసానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. ఇద్దరు నుంచి రూ.5.2 లక్షలు వసూలు ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక -
బడుల్లో నీటికీ కటకటే
పల్నాడుసోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025ఘనంగా తిరునాళ్ల మహోత్సవం నగరం: మండలంలోని ఈదుపల్లి గ్రామదేవత ఈదులమ్మ వారి తిరునాళ్ల మహోత్సవం ఆదివారం నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం అమ్మ వారిని ఆలయంలో పునఃప్రవేశపెట్టారు. బగళాముఖికి విశేష పూజలు చందోలు(కర్లపాలెం): చందోలులోని బగళాముఖి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ చేసి పసుపు, కుంకుమలు సమర్పించారు. ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన నాదెండ్ల: గణపవరం కోదండ రామాలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి జరిగిన కోలాటం ఆకట్టు కుంది. మాస్టర్ వెంకటరెడ్డిని సత్కరించారు. రాజుపాలెం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్కార్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. విద్యార్థులకు కావల్సిన మౌలిక వసతులను కల్పించారు. రంగురంగులతో కూడిన ఇనుప బెంచీలను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను బడికి పంపాలంటే జంకుతుంటారు. సరైన మరుగుదొడ్లు లేవని, ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుందని తల్లిదండ్రులు అంటుంటారు. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ గత ప్రభుత్వం హయాంలో మరుగుదొడ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. వెస్ట్రన్ టాయిలెట్స్, వాష్ బేషన్లు, అదేవిధంగా ట్యాప్లు విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాలల్లో ఆడపిల్లల సంఖ్య భారీగా పెరిగింది. మౌలిక సదుపాయాలతోపాటు మినరల్ వాటర్ అందించేందుకు ప్రతి పాఠశాలలో ఆర్వో ప్లాంట్ (వాటర్)ను ఏర్పాటు చేశారు. గత ఏడాది నుంచి ఈ ప్లాంట్లు పనిచేయడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తాగు నీటి కోసం విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంటి వద్ద నుంచి బాటిల్స్తో నీళ్లు తీసుకెళ్లే దుస్థితి ఏర్పడింది. పట్టించుకునే దిక్కే లేదు.. గత ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో రూ.కోట్లు ఖర్చు చేసి ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అవి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు మూలనపడ్డాయి. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మండలంలో 46 మండల పరిషత్ ప్రాథమిక , రెండు యూపీ , ఆరు జిల్లా పరిషత్ , ఒక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. మండల పరిషత్, యూపీ పాఠశాలలు కలుపుకొని మొత్తం 2,677 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్, కేజీబీవీలలో కలిపి 1,776 మంది చదువుతున్నారు. తొలి దశలో నాడు–నేడు కింద 40 పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థుల సంఖ్యను బట్టి ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. మండల పరిషత్ పాఠశాలల్లో రూ.70 వేల నుంచి రూ. 2 లక్షల వరకు, హైస్కూల్లలో సుమారు రూ.5 లక్షలతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కూటమి సర్కారు వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏ ఒక్క బడిలోనూ ప్లాంట్లు పనిచేయడం లేదు. ప్రధానోపాధ్యాయులు బాగు చేయిద్దామంటే ఎంత ఖర్చు అవుతుందోనని చేతులెత్తేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆర్వో ప్లాంట్ల్లకు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రాజుపాలెం పులిచింతల నిర్వాసిత కేంద్రంలోని బడిలో ఆర్వో ప్లాంట్కు తాళం వేసిన దృశ్యం7న్యూస్రీల్అనుమతి వచ్చాక మరమ్మతులు కొన్ని పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని మా దృష్టికి వచ్చింది. వాటికి మరమ్మతులు చేపట్టాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసిన కంపెనీ ప్రతినిధుల దృష్టికి మరమ్మతుల విషయం తీసుకెళ్లినా స్పందన రాలేదు. విద్యాశాఖలోని ఉన్నతాధికారులకు విషయం చెబుతాం. అవసరమైన మరమ్మతులు చేపడతాం. విద్యార్థులకు మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటాం. అప్పటివరకు సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తాం. – కె.నరసింహారావు, ఎంఈవో–2 , రాజుపాలెం తాగునీటి కోసం అల్లాడుతున్న విద్యార్థులు ఏడాదిగా పనిచేయని ప్లాంట్లు పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు కనీసం పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు -
కూటమి ఏడాది పాలనంతా మోసం
నగరంపాలెం: ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో ఆదివారం సాయంత్రం ‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాల్లేవని, అభివృద్ధి జాడలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషలిస్ట్లపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతోనే సరిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పీడీఎఫ్ బియ్యాన్ని విపరీతంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. మట్టి, ఇసుక, గనులను ఇష్టానుసారంగా కూటమి నేతలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ఇంటింటికీ మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బెల్ట్ షాప్లు లెక్కలేనన్ని ఉన్నాయని, స్వయానా టీడీపీ నాయకులే బెల్ట్షాప్లను ప్రకటించుకుంటున్నారని తెలిపారు. బెల్ట్ షాప్లు నిర్వహిస్తే బెల్టు తీస్తామని చంద్రబాబు అంటున్నారని, ఆయన బెల్ట్ తీయరని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించామని గుర్తు చేశారు. ఏడాది చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 16న ‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా (గుంటూరు తూర్పు), దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి), వనమా బాలవజ్రబాబు (తాడికొండ), పార్టీ నాయకులు నందేటి రాజేష్, వెంకటప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ -
వైభవంగా పునీత ఆంథోని పుణ్యక్షేత్ర వార్షికోత్సవం
నెహ్రూనగర్: నగరంపాలెంలోని పునీత ఆంథోని పుణ్యక్షేత్ర 35వ వార్షికోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా గుంటూరు మేత్రాసన పీఠాధిపతి బిషప్ డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యయ్య, నెల్లూరు పీఠాధిపతి బిషప్ రెవరెండ్ పిల్లి ఆంథోని దాస్, గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతి బిషప్ రెవరెండ్ డాక్టర్ గాలి బాలి హాజరయ్యారు. ముందుగా పుణ్యక్షేత్ర ఆవరణ నుంచి గుర్రపు బగ్గీపై ఇద్దరు పీఠాధిపతులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆనంతరం దివ్యబలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యయ్య మాట్లాడుతూ పునీత ఆంథోని పుణ్యక్షేత్ర వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి కథోలిక విశ్వాసులు తరలివచ్చి పునీత ఆంథోని అద్భుతాలు పొందుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుణ్యక్షేత్ర విచారణ గురువు కొచ్చెర్ల జ్యోతిరాజు, సహాయ గురువు ఎన్. రాజేష్, ఫాదర్లు దాసరి కిరణ్, పి. బాలస్వామి, రేపూడి రాయప్ప, రాజారెడ్డి, సుందరరావు, బాలస్వామి, కమిటీ సభ్యులు ఎన్.జె. ప్రకాశరావు, జొన్నలగడ్డ సుధీర్బాబు, వై. సుదర్శన్, దేవస్వామి, శాంతయ్య పాల్గొన్నారు. -
బీసీల హక్కుల సాధనకు అలుపెరగని పోరు
తెనాలి: బలహీనవర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు, కులగణన కోసం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రజాక్షేత్రంలో చేస్తున్న పోరాటాలు అభినందనీయమని, ఆయనకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచారశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కులగణనకు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ అందుకోసం సుదీర్ఘకాలంగా రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఉద్యమించిన కేసన శంకరరావు అభినందన సభను ఆదివారం తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఆహ్వాన కమిటీ తరపున జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ బలహీన వర్గాల నుంచి వచ్చిన ఐఏఎస్ఎ, ఐపీఎస్, రాజకీయనేతలు తమ మూలాలను మరిచిపోతున్నారనీ, వారు కూడా వ్యవస్థలోనే కలిసిపోతున్నారని అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు రిజర్వేషన్లతో ఎలా ఎదుగుతారనేది సందేహమేనన్నారు. సంక్షేమం, రిజర్వేషన్లు కొంతమేరకు తోడ్పడతాయని చెబుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు పూర్తిగా తొలగిపోతాయని భావించలేమని తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బీసీ నాయకత్వానికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. బీసీలకు సంక్షేమం, పదవుల విషయంలో చిత్తశుద్ధితో కృషిచేస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార, ప్రజాసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జనాభాలో 75 శాతంగా ఉన్న దళితులు, బీసీలు పారిశ్రామిక, వ్యాపార, ఉన్నతస్థాయిలోకి రాలేకపోవడంపై చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీలను సంఘటితపరుస్తూ వారి సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు జీవితాన్ని అంకితం చేసిన కేసన శంకరరావుకు తగిన గుర్తింపు లభించాల్సి ఉందని, అందుకు తామంతా తోడ్పడతామని హామీనిచ్చారు. వేదాంతం ఫణీంద్ర స్వాగతం పలికిన సభలో తొలుత శంకరరావుపై తీసుకొచ్చిన అభినంద సంచికను మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం శంకరరావును ఘనంగా సత్కరించారు. అఖిల భారత ఓబీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి, చిల్లపల్లి శ్రీనివాసరావు, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, విన్నకోట వెంకటేశ్వర్లు, గోనుగుంట్ల బ్రహ్మానందశర్మతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్నుంచి హాజరైన బీసీ సంక్షేమ ంఘం, బీసీ సంఘాల నేతలు, అనుమోలు ఏడుకొండలు, శివరాం బాలాజీ, కోలా అశోక్, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమాన్ని ఆహ్వాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అభినందన సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రులు మనోహర్, పార్థసారథి, సత్యకుమార్యాదవ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు కృషికి సహకారం అందిస్తాం -
వైద్య శాఖలో బదిలీలకు జూమ్ కౌన్సెలింగ్
గుంటూరు మెడికల్: హెల్త్ డిపార్ట్మెంట్కు చెందిన వైద్యులు, వైద్య సిబ్బందికి జూన్లో జరగబోయే సాధారణ బదిలీలలో పేపర్ కౌన్సెలింగ్కు బదులు జూమ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. తమ అభ్యర్థన మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ ఆదివారం రాష్ట్ర ,వైద్య ,ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుతో చర్చలు జరిపారని చెప్పారు. పేపర్ కౌన్సెలింగ్కు బదులుగా జూమ్ కౌన్సెలింగ్ నిర్వహణకు ఆయన ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇందులో స్టేషన్ సీనియారిటీ ప్రకారం అన్నీ ఖాళీలను ప్రకటించిన తరువాతే కౌన్సెలింగ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. జనరల్ ట్రాన్స్ఫర్స్లో అభ్యర్థులు కోరుకున్న ఐదు ఖాళీలే కాకుండా ప్రదర్శించబడిన ఖాళీల్లో దేన్నైనా కోరుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వానికి తమ సమస్యను వివరించి, పరిష్కరించిన జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావుకు జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, ఏపీఎన్జీఓ జిల్లా నేతలు ధన్యవాదాలు తెలిపారు. -
వృద్ధులకు న్యాయ సహాయం అందిస్తాం
న్యాయమూర్తి లావణ్య నరసరావుపేట ఈస్ట్: వేధింపులకు గురవుతున్న వయో వృద్ధుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని సీనియర్ సివిల్ జడ్జి ఎన్.లావణ్య తెలిపారు. ప్రపంచ వయో వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని ఆదివారం పెన్షనర్స్ భవన్లో నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ వయో వృద్ధులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వృద్ధుల రక్షణకు చట్టం కల్పిస్తున్న సౌలభ్యాలను వివరించారు. సమావేశంలో పాల్గొన్న న్యాయసేవాధికారులు మాట్లాడుతూ వృద్ధుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే తగిన న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నలుగురు వృద్ధులు తమ సమస్యలను న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు జి.చంద్రపాల్, కార్యదర్శి ఆర్.రామసుబ్బారావు పాల్గొన్నారు.దళారుల మాటలు నమ్మవద్దు ఆర్డీ డాక్టర్ సుచిత్ర గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి జూన్లో జరగనున్న సాధారణ బదిలీలను అత్యంత పారదర్శంగా, అవకతవలకు తావు లేకుండా నిర్వహిస్తామని గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్ కె.సుచిత్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పుకార్లు, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. అవకతవకలకు పాల్పడే వారిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అభ్యంతరాలు, ఫిర్యాదులను గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలో స్వయంగా తెలియజేస్తే, విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దుర్గమ్మకు నృత్య నీరాజనం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో అనకాపల్లికి చెందిన శ్రీవెంకట సాయి డ్యాన్స్ అకాడమీకి చెందిన చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై శిరీష పర్యవేక్షణలో 24 మంది చిన్నారులు పలు కీర్తనలకు నృత్యం ప్రదర్శించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన నృత్య ప్రదర్శన ఆద్యంతం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం నృత్య బృందానికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలను అందచేశారు. కౌన్సెలింగ్పై ఫిర్యాదులను కమిటీ దృష్టికి తేవాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్పై ఫిర్యాదులను ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ 22 ప్రకారం ముందుగా జిల్లా స్థాయి కమిటీ అయిన జిల్లా విద్యాశాఖాధికారికి అప్పీల్ చేయాలని ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయాల్సిన పక్షంలో రీజినల్ స్థాయిలో ఆర్జేడీ, అక్కడా సంతృప్తి చెందని పక్షంలో రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు అప్పీల్ చేయాలని ఆయన సూచించారు. ఇతర చట్టపరమైన పరిష్కారాల కోసం వెళ్లే ముందుగా, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలలోని అప్పీల్ నిబంధనలను విధిగా పాటించాలని ఆయన తెలిపారు. లేని పక్షంలో ఉపాధ్యాయులపై ఏపీ సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని లింగేశ్వరరెడ్డి హెచ్చరించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.40 అడుగుల వద్ద ఉంది. ఇది 137.5158 టీఎంసీలకు సమానం. -
మోదీ ప్రభుత్వానికి ‘ప్రైవేటు’ పిచ్చి పట్టింది
లక్ష్మీపురం: మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రైవేటీకరణ పిచ్చి పట్టిందని, అందుకు రాష్ట్రంలో చంద్రబాబు వంతపాడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నర్సింగరావు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో రెండు రోజుల పాటు జరిగిన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ముగింపు సభలో నర్సింగరావు మాట్లాడుతూ దేశంలో విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రైవేటీకరణ అన్నారు. రూ.80 లక్షల కోట్ల విలువైన విద్యుత్ రంగం ఆస్తులను అంబానీ, అదానీకి అప్పగించటానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. కేంద్రం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థల ద్వారా అధిక ధరలకు విద్యుత్ కొంటూ, ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. విమానయానం ప్రైవేటీకరణ వల్లే ఇటీవల ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల నిర్వీర్యం తదితర విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కోశాధికారి ఎస్.రాజేంద్రన్ మాట్లాడుతూ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ప్రమాదంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా అడ్డుకోవాలని నేతలకు సూచించారు. దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని, జేఎల్ఎం గ్రేడ్–2లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 22న నెల్లూరులో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న మూడు డీఏలు విడుదల చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ ఎరియర్లు ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని, ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ ఆప్షన్లు తిరస్కరించిన ఉద్యోగులందరికీ పెన్సన్ రికవరీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని మహాసభ తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. క్యూబా సంఘీభావ నిధికి మహాసభ ప్రతినిధులు రూ.12,610 అందించారు. నూతన కమిటీ ఎన్నిక యూనియన్ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డి.సూరిబాబు, పి.సుదర్శన్రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. ట్రెజరర్గా ఎల్.రాజు, ఉపాధ్యక్షులుగా సీహెచ్. నాగబ్రహ్మచారి, వి.సత్యనారాయణ, జి.వి.శివప్రసాద్, పి.ప్రసాద్, ఆర్.సత్యారావు, జాయింట్ సెక్రెటరీలుగా జాకీర్ హుస్సేన్, డి.వెంకటేశ్వరరావు, జె.శ్రీనివాసరావు, సీహెచ్. వీరాంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా కె.కిరణ్కుమార్, నాయబ్ రసూలు,పి.శివప్రసాద్రెడ్డి, కె.హజరత్తయ్య, మహిళా ప్రతినిధిగా వి.క్రాంతి సహా మొత్తం 39 మందితో కమిటీ ఎన్నికై ంది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు -
వివాహితను రక్షించిన పోలీసులు
యడ్లపాడు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహితను యడ్లపాడు పోలీసులు సకాలంలో స్పందించి కాపాడిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన సురేష్ ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేశారు. తన సోదరి వైవాహిక సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసుకోబోతున్నట్లు పేర్కొంటూ, రక్షించాలని కోరారు. సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు యువతితో వీడియో కాల్లో మాట్లాడి నచ్చజెప్పారు. తాను జీవితంపై విరక్తి చెందానని, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎస్ఐ ఆమె మొబైల్ సిగ్నల్స్ను ట్రాక్ చేసి యువతి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తక్కెళ్ళపాడు గ్రామ శివారులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కారులో అక్కడికి వెళ్లి ఆమెను బుజ్జగించి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడారు. తర్వాత పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించి, జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ డయల్ 100, అలాగే శక్తి మొబైల్ యాప్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు. క్షణికావేశంలో జరిగే అనర్థాలను, ప్రమాదాలను వీటి ద్వారా అడ్డుకోవచ్చన్నారు. -
డయేరియా నివారణపై అవగాహన కల్పించండి
తెనాలి టౌన్: ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు వచ్చే డయేరియాపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, నివారణ పద్ధతులు తెలియజేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఆదివారం ఆయన తెనాలి కార్యాలయంలో డయేరియా నివారణ అవగాహన పోస్టర్ విడుదల చేశారు. జూన్ 16 నుంచి జులై 31వ తేదీ వరకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సమర్థంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ అమర్తలూరు శ్రావణ్బాబు, తెనాలి డెప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ వేముల ప్రియాంక, అందె బాలచంద్రమౌళి, వి.సీతారామశాస్త్రి, 104 జిల్లా మేనేజర్ ఎం.రాఘవకుమార్ పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
చేబ్రోలు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన సంఘటన ఆదివారం జరిగింది. చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెంలోని ముట్లూరు రోడ్డులో రేషన్ బియ్యం నిల్వ చేసి, రవాణా చేయడానికి సిద్ధమవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ డి. వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఆటోలో ఉన్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ధీనం చేసుకొని మస్తాన్వలిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గత కొంతకాలంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫీజుల నియంత్రణపై చర్యలు ఏవీ?
చిలకలూరిపేట(యడ్లపాడు): ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై కూటమి ప్రభుత్వం తక్షణమే కఠిన నియంత్రణలు విధించాలంటూ ఏపీ గిరిజనసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఫీజులపై కొంత నియంత్రణ ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నేడు పాఠశాలల యజమాన్యాలు విద్యను పూర్తి వ్యాపారంగా మార్చివేశాయని ఆరోపించారు. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమా దం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకు పోతు న్నారని తెలిపారు. అలాగే విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు తప్పవంటూ హెచ్చరించారు.ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీను నాయక్ -
‘తల్లికి వందనం’లో కోతలు వద్దు
చీరాల అర్బన్: నిబంధనల పేరుతో తల్లికి వందనానికి కోతలు వద్దని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి కోరారు. సీపీఎం జిల్లా నాయకుల శిక్షణ తరగతులు రెండో రోజు ఆదివారం కొనసాగాయి. ఆమె మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా తల్లికి వందనం నగదును అర్హులైన విద్యార్ధులందరికీ నిబంధనలు సడలించి తల్లుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారందరికీ ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్ పొందిన వారందరికీ నగదు చెల్లించాలని కోరారు. స్కీం వర్కర్లు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలన్నారు. గత ప్రభుత్వం విధించిన షరతులను విమర్శించిన టీడీపీ ప్రస్తుతం అంతకుమించిన షరతులను విధించిందన్నారు. రూ.15 వేలలో రూ.2వేలు మినహాయించారని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఏడాది పాలన సుపరిపాలన అని కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజలని భాష, ప్రాంతం పేరుతో విడుగొడుతోందని.. రాష్ట్రాలు హక్కులను హరిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే ఏడాది పాలనలో కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న చంద్రబాబు, పవన్కళ్యాణ్లు నోరు మెదపకుండా మోదీ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నూతన మెడికల్ కాలేజీలు ప్రయివేటు పరం చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు కంపెనీలకు రెడ్ కార్పెట్ పరచడమే అని విమర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, ఎన్.బాబూరావు, సీహెచ్ మణిలాల్, జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య, టి.వెంకటేశ్వర్లు, ఎం.ఆంజనేయులు, తిరుమల, వసంతరావు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి -
19న అన్ని ఆర్టీసీ డిపోలలో కార్మికుల ధర్నాలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో 10 గంటల పని దినం, మహిళలు రాత్రి షిఫ్ట్లలో పనిచేయాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 19న అన్ని డిపోలలో ధర్నాలు, గేట్ మీటింగ్ లు నిర్వహించాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. పాతగుంటూరులోని ఆదివారం ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశం గౌరవ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా, అధ్యక్షులు సీహెచ్ సుందరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.అయ్యప్పరెడ్డి తీర్మానాలను ప్రవేశపెట్టారు. లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లను అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. దీనికి నిరసనగా రాష్ట్రంలో ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు జూన్ 19వ తేదీన అన్ని డిపోలలో గేట్ మీటింగ్లు, ధర్నాలు జరిపి నిరసన తెలియజేయాలని చెప్పారు. కండక్టర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించి 1/2019 సర్కులర్ను యథాతథంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 70లోని కార్మిక వ్యతిరేక అంశాలను రద్దు చేయాలని జూన్ 27న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని వేయాలని, ఉద్యోగులు, కార్మికులకు రావలసిన అన్ని రకాల బకాయిలను చెల్లించాలని, పెండింగ్లో ఉన్న కరువు భత్యం, బకాయిలను ఇవ్వాలని, పీఆర్సీ ఒప్పందం జరిగే లోపు 30 శాతం ఇంటీరియర్ రిలీఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులు వెయ్యాలని, డ్రైవర్, కండక్టర్, మెకానికల్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం అన్ని సంఘాలతో చర్చించి, పరిష్కరించాలని కోరారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 9,10 తేదీలలో తిరుపతిలో జరుగుతాయని తెలిపారు. ఆర్టీసీలోని ఎంపిక చేసిన కార్యకర్తలకు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి కేంద్రాలుగా మూడు సెంటర్లలో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జూలై నెలలో నిర్వహిస్తామని తెలియజేశారు. ఎస్డబ్ల్యూఎఫ్ పిలుపు 27 విజయవాడలో రాష్ట్ర సదస్సు అక్టోబర్ 9, 10 తేదీల్లో తిరుపతిలో రాష్ట్ర మహాసభలు -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున ఆరు గంటల నుంచే అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉండటంతో ఉదయం 10గంటల నుంచే అంతరాలయ దర్శనం నిలిపివేయాలని ఆలయ ఈవో శీనానాయక్ సిబ్బందిని ఆదేశించారు. అంతరాలయ దర్శనం నిలిపివేయడంతో భక్తులు రూ.300 టికెట్లు కొనుగోలు చేసి బంగారు వాకిలి దర్శనం చేసుకున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో రూ.300తోపాటు రూ.100 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు మూడు క్యూలైన్ల ద్వారా త్వరతిగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈవో తనిఖీలు భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్, ఈఈ కోటేశ్వరరావు ఘాట్రోడ్డులోని చెప్పుల స్టాండ్, క్లోక్రూమ్, దేవస్థాన బస్సులను తనిఖీ చేశారు. చెప్పుల స్టాండ్, సెల్ఫోన్ కౌంటర్ వద్ద భక్తులు గుంపులు గుంపులుగా నిల్చోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని నియమించి క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. ఘాట్రోడ్డులో దేవస్థానం ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్స్కు తాళాలు వేసి ఉండటంతో ఈవో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ టోల్గేట్ వద్దకు చేరుకుని కొండపైకి వచ్చే వాహనాలను పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ ఉచిత ప్రసాదాలతోపాటు అన్న ప్రసాదం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం రద్దీ కొనసాగింది. రాత్రి 9గంటల వరకు భక్తులు పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయ దర్శనం రద్దు -
‘104’ ఉద్యోగులకు సత్వరం జీతాలు చెల్లించాలి
నరసరావుపేట: జిల్లాలో 104 సర్వీసుల్లో ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ వెంటనే జీతాలు, బకాయిలు చెల్లించాలని ఏపీ 104 ఎం.ఎం.యు ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు కోరారు. ఈ మేరకు కోటప్పకొండ రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం సీఐటీయూ జిల్లా నాయకుడు గుంటూరు విజయకుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అధ్యక్ష, కార్యదర్శులు డి.కోటిరెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ సుభాని మాట్లాడుతూ గత నెల 15వరకు సర్వీసులను అరబిందో యాజమాన్యం నిర్వహించగా, నూతనంగా భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నిర్వహణ చేపట్టిందన్నారు. అయితే గత రెండుమూడు నెలలుగా ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు ప్రతీ నెల వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానాల్లో సీనియారిటీ ప్రకారం బదిలీలు చేసి మిగతా స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టాలని కోరారు. గత ఐదేళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోని వాహనాలను వెంటనే మరమ్మతులు చేయించాలని, ప్రస్తుత యాజమాన్యంగా వున్నా భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ప్రతీ నెల అన్నీ జిల్లాల్లో గ్రీవెన్స్ మీటింగ్ నిర్వహించి సమస్యలు పరిస్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. కోశాధికారి జిలానీ, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నీట్ ఫలితాల్లో పమిడిపాడు విద్యార్థిని ప్రతిభ
బొల్లాపల్లి: జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన పమిడిపాడు గ్రామానికి చెందిన విద్యార్థిని కొత్త భవిష్యరెడ్డి ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయి లో 1649, రాష్ట్రస్థాయిలో 940 ర్యాంకు సాధించి ప్రతిభ చాటింది. విద్యార్థిని భవిష్యరెడ్డిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఉన్నత చదువులు చదివి పుట్టిన ప్రాంతానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రయాణికుడిని దోచుకున్న కేసులో ఇద్దరు అరెస్టు నరసరావుపేట రూరల్: ఓ ప్రయాణికుడిని ఆటోలో ఎక్కించుకొని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అతడిని బెదిరించి అతని వద్దనున్న బంగారం ఉంగరం, రెండు సెల్ఫోన్లు, నగదు దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్ఐ డి.అశోక్ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ఈనెల 9వ తేదీ రాత్రి 11గంటల సమయంలో పుల్లబొట్ల శివప్రసాద్ పిడుగురాళ్ల వెళ్లేందుకు పల్నాడు బస్టాండ్లో ఎదురుచూస్తుండగా తాము వదిలిపెడతామంటూ బొమ్మిశెట్టి వెంకయ్య, వేముల వెంకటశివ అనే ఇద్దరు వ్యక్తులు కిరాయి మాట్లాడుకొని ఆటో ఎక్కించుకున్నారు. మార్గంలోని రావిపాడు గ్రామం దాటిన తర్వాత పాలపాడు–నల్లగార్లపాడు గ్రామాల మధ్యకు తీసుకెళ్లి అతడిని కొట్టి బెదిరించి అతని వద్దనున్న సొమ్ము కాజేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్కేటీ జంక్షన్లో ఇద్దరు నిందితులను అరెస్టుచేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా ‘కోడూరి’ చీరాల అర్బన్: వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా కోడూ రి ప్రసాద్రెడ్డి నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంక టేష్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. -
క్రికెట్ పోటీల విజేత కావూరు ప్రిన్స్ యూత్ జట్టు
చిలకలూరిపేట టౌన్: కావూరు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. కావూరు–అప్పాపురం మార్గంలో ఈ నెల 3న ప్రారంభమైన ఈ టోర్నీలో జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 35 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. సెమీ ఫైనల్స్లో విజేతలైన జట్లు ఫైనల్స్లో హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో కావూరు జట్టు విజేతగా నిలవగా, ఇర్లపాడు జట్టు రన్నర్గా సత్తా చాటింది. బసికాపురం జట్టు మూడో స్థానంలోనూ, డేంజర్బోయ్స్ లోకల్ కావూరు జట్టు కన్సోలేషన్ బహుమతిని సాధించింది. విజేత కావూరు ప్రిన్స్ యూత్ జట్టుకు రూ. 20,116 నగదు బహుమతిని జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యుడు జెర్రిపోతుల బుల్లిబాబు అందజేయగా, ద్వితీయ స్థానం సాధించిన ఇర్లపాడు జట్టుకు రూ. 15,116 నగదు బహుమతిని విఘ్నేశ్వర పాలకేంద్రం వాసు ప్రదానం చేశారు. మూడో స్థానంలో నిలిచిన విజేతలకు రూ.10,116, కన్సోలేషన్కు రూ.7,116 నగదు అందించారు. మాజీ ఏపీజీ దాసరి చిట్టిబాబు మాట్లాడుతూ క్రీడా పోటీల నిర్వహణతో యువతకు శారీరక, మానసిక వికాసంతో పాటు పల్లె ప్రజల మధ్య సత్సంబంధాలు, సామాజిక ఐక్యత మరింత బలపడతాయని తెలిపారు. క్రీడా నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. -
22న పూర్వ విప్లవ విద్యార్థి వేదిక సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఈనెల 22న గుంటూరు మెడికల్ కళాశాల ఎదుట ఉన్న ఎన్జీవో కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించనున్నట్లు వేదిక నాయకులు నవజ్యోతి, భరద్వాజ తెలిపారు. ఆదివారం బ్రాడీపేటలో కార్యక్రమ పోస్టర్లు విడుదల చేశారు. భరద్వాజ మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో జాతి పోరాటాలు చేస్తున్న విప్లవకారులతో చర్చలు జరిపిన చరిత్ర ఉన్నప్పటికీ, ప్రస్తుతం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. కార్పొరేట్ శక్తులు విప్లవకారులను చంపేయాలనే అనే కండిషన్ పెట్టడంతోనే ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి ఈ హత్యాకాండ జరుపుతోందని ఆరోపించారు. ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరగాలని పౌర సమాజం నుంచి ఆకాంక్ష బలంగా వ్యక్తమతోందన్నారు. అయితే, దీన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని చంపేయడమే తమ లక్ష్యమని స్పష్టంగా మాట్లాడుతోందని విమర్శించారు. ఆదివాసీ, గిరిజన ప్రజలపై జరుపుతున్న యుద్ధం గురించి, మావోయిస్టు పార్టీ నాయకులను హత్య చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండ కట్టేందుకు సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎన్జీవో కల్యాణ మండపంలో జరిగే సదస్సులో విద్యార్థి ఉద్యమం నుంచి విప్లవోద్యమంలోకి వెళ్లిన మావోయిస్టు పార్టీ నాయకులు నంబాల కేశవరావు, లక్ష్మీ వెంకట నరసింహారావు, చలం తదితర విప్లవ నాయకుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీల ప్రాథమిక హక్కులైన జీవించే హక్కు, తామున్న ప్రాంతంలోని భూమిపై హక్కులను కాలరాసేందుకు వేలాదిమంది పోలీసు, కేంద్ర ప్రభుత్వ దళాలతో భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. ఆలోచన పరులు, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. -
పల్నాడుకు వైఎస్ జగన్.. రూట్ మ్యాప్ పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఈనెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా రూట్ మ్యాప్ను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ కన్వీనర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రాగానే అరాచకం మొదలైందని.. అందుకు నిలువెత్తు నిదర్శనం నాగమల్లేశ్వర రావు ఆత్మహత్యేనన్నారు. రాష్ట్రంలో ఏడాదిగా అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోంది. కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిన వారిని ఎవరిని వదలమన్నారు.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరుకుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు.సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లును పరిశీలిస్తున్నాం. -
సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డికి అవార్డు ప్రదానం
లక్ష్మీపురం: తలాసీమియా రోగుల కోసం 2023, 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోని 50కి పైగా కేంద్రాల్లో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించిన సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డికి భారత రెడ్ క్రాస్ సొసైటీ ప్రతిష్టాత్మకమైన ‘కార్ల్ లాండ్స్టీనర్ ’అవార్డు అందజేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంపాలెం లోని భారతీయ విద్యాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నరసింహారెడ్డి నాయకత్వ నైపుణ్యం, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. రక్తదాన కార్యక్రమాల్లో ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఆయన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అవార్డు గ్రహీత నరసింహారెడ్డి మాట్లాడుతూ తమ సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా నెలకొల్పిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో 2023లో 1,440 యూనిట్లు, 2024లో 4100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ కృషికి గానూ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తనకు గుర్తింపు కల్పించాయని తెలిపారు. ఇప్పుడు ఈ అవార్డు అందుకోవడం ద్వారా రక్తదాన సేకరణలో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎ.కె.పరీద మాట్లాడుతూ రక్తదాన శిబిరాల ఏర్పాటు, సామాజిక సేవల్లో నరసింహారెడ్డి అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు, జీఎస్టీ అధికారులు నాగరాజు, రవికుమార్, ఈశ్వరరావు, గాదె శ్రీనివాసరెడ్డి, పూర్ణ సాయి, శాఖమూరి శ్రీనివాస్, బిల్లా ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. -
మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరికి గాయాలు
నాదెండ్ల: మద్యం తాగిన ఇరువురు యువకులు ఘర్షణకు దిగటంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గణపవరం గ్రామంలో నివాసం ఉండే ఇరువురు ఒడిశా యువకులు స్థానిక స్పిన్నింగ్ మిల్లులో రోజువారీ కూలీ పనులకు వెళ్తుంటారు. శనివారం ఉదయం వారు షాపులో మద్యం తాగారు. మాటామాటా పెరగటంతో ఘర్షణకు దిగారు. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఉరి వేసుకుని మహిళ మృతి వేటపాలెం: ఇంట్లో ఉరి వేసుకొని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. రామన్నపేట పంచాయతీ బాపయ్యనగర్లో డొక్కా శ్రావణి (40) అనే మహిళ ఆరు నెలలుగా అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఓనర్ అద్దె అడగడానికి శనివారం వెళ్లి చూడగా.. ఉరి వేసుకొని కనిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ జనార్దన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
వైభవంగా మల్లాది వెంకన్న శాంతి కల్యాణం
అమరావతి: మల్లాది గ్రామంలోని వట వృక్షాంతర్గత వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేక పూజల అనంతరం శాంతి కల్యాణం నిర్వహించారు. స్వామివారిని పలు రకాల పుష్పమాలలు, తులసీ మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు తొమ్మిది మంది దంపతులచే శాంతి కళ్యాణ ప్రక్రియను ఆలయ యాజ్ఞీకస్వామి పరుచూరు శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. మధ్యా హ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పునఃప్రారంభమైన శ్రీవారి ఊయల సేవ తెనాలి టౌన్: శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి ఊయల సేవ శనివారం నుంచి పునఃప్రారంభమైనది. ఆలయ కార్యనిర్వహణాధికారులు వి.అనుపమ మాట్లాడుతూ దేవస్థానంలో ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటల కు శ్రీస్వామి అమ్మవార్లకు ఊయల సేవ జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని సూచించారు. ఊయల సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించారు. కొండేపి వసుంధర బృందం ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.రామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మల్లారెడ్డినగర్ విఘ్నేశ్వరస్వామి సహిత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. రామలింగేశ్వర స్వామికి ఆలయ అర్చకులు పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం రుద్రహోమం, నవగ్రహ, మండప దేవత హోమాలను చేపట్టారు. భక్తులకు తీర్ధ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఫౌండేషన్ చైర్మన్ మెట్టు కృష్ణారెడ్డి దంపతులు, అన్నదాన కమిటీ చైర్మన్ గుంటూరు వేమారెడ్డి, కొండారెడ్డి, కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి స్థలాల పరిశీలన బాపట్ల: జిల్లా కోర్టు భవన సముదాయం బాపట్ల పట్టణంలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. జిల్లా కోర్టు భవన సముదాయానికి అవసరమైన స్థలాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. తూర్పు బాపట్లలో ఖాళీగా ఉన్న 7.5 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ఇందిరానగర్లో ఖాళీగా ఉన్న 2.80 ఎకరాల భూమిని పరిశీలించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న భూమి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత దస్త్రాలను పంపాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట బాపట్ల తహసీల్దార్ సలీమా, సర్వేయర్లు వీఆర్వోలు తదితరులు ఉన్నారు. -
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
బాపట్లటౌన్: రెప్పపాటులోనే ద్విచక్రవాహనాలను మాయం చేసే ఘరానా దొంగలను బాపట్ల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం పట్టణ పోలీస్స్టేషన్లో వివరాలను అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. బాపట్ల పట్టణం ఉప్పరపాలేనికి చెందిన రాజు నాగార్జునరెడ్డి, శారదాపురి కాలనీకి చెందిన ఉన్నాం వంశీ, మల్లావుల ధర్మతేజ, షేక్ చందు, జాలాది జాన్, మరో మైనర్ బాలుడు కలసి బాపట్ల పట్టణంతోపాటు, చీరాల రూరల్, చీరాల టూ టౌన్, వెదుళ్లపల్లి, బాపట్ల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆరు ద్విచక్ర వాహనాలను, మోటర్, రెండు సవర్ల బంగారం గొలుసును దొంగతనం చేశారు. బాపట్ల పట్టణంలోని జగనన్న కాలనీకి చెందిన పాలతోటి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పట్టణంలోని గుంటూరు ఫ్లైఓవర్ వద్ద గల చిల్లర గొల్లపాలెం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా తమ సిబ్బంది ఆరుగురులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగతనాలన్నీ తామే చేశామని అంగీకరించారు. ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రెండు సవర్ల బంగారపు గొలుసు, మోటర్ను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరిచి జైలుకు పంపిస్తామని తెలిపారు. కేసు ఛేదనలో ఎంతో కీలకంగా వ్యవహరించిన బాపట్ల పట్టణ సీఐ రాంబాబు, ఎస్ఐ విజయ్కుమార్, ఎస్సై చంద్రావతి, సిబ్బంది ప్రభాకరరావు, మనోజ్, శ్రీనివాసరావు, పోతురాజు, కృష్ణకిషోర్లను జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు. ఆరు వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు -
డేటా సమీకరణలో ఆన్టాలజీల పాత్ర కీలకం
మద్రాస్ ఐఐటీ సీఎస్ఈ ప్రొఫెసర్ శ్రీనివాసకుమార్ చేబ్రోలు: వివిధ వనరుల నుంచి వచ్చిన డేటాను ఒకే ఫార్మాట్లో సమీకరించడానికి ఆన్టాలజీలు ఉపయోగపడతాయని మద్రాస్ ఐఐటీ సీఎస్ఈ ప్రొఫెసర్ పి.శ్రీనివాసకుమార్ అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నెట్వర్క్స్ అండ్ సాఫ్ట్ కంప్యూటింగ్’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను శనివారం ముగిసింది. ప్రొఫెసర్ శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ ఏఐ సిస్టమ్లు ఒక నిర్దిష్ట పరిసరాన్ని అర్థం చేసుకోవడం, నిర్ణయం తీసుకోవడం లేదా సహాయపడే విధంగా రూపొందించడంలో ఆన్టాలజీలు కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. భాషను అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా తర్జుమా, ప్రశ్నల సమాధానాలు, చాట్బాట్ల అభివృద్ధిలో ఉపయోగపడతాయని తెలిపారు. వాతావరణం, ట్రాఫిక్, విద్యుత్ వినియోగం వంటి డేటాను తెలివిగా ప్రాసెస్ చేయడంలో కూడా వినియోగిస్తారని చెప్పారు. జైపూర్లోని ఎంఎన్ఐటీ– సీఎస్ఈ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ రమేష్బాబు బత్తుల మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవస్థలు బ్యాంకింగ్లో వినియోగదారుల ప్రవర్తనలను విశ్లేషించి అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించగలవని తెలిపారు. పౌరుల భద్రతను పెంచేలా సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మానిటరింగ్, ఎమర్జెన్సీ సేవలను మరింత సమర్థంగా నడిపించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎన్ఐటీ– సిల్చార్ అసోసియేట్ ప్రొఫెసర్ కె.సుగన్య దేవి, ఎన్ఐటీ వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ యూ.ఎస్.ఎన్. రాజు పాల్గొన్నారు. -
నీట్ ర్యాంకర్ వసీమా అందరికీ స్ఫూర్తిదాయకం
నరసరావుపేట: నీట్ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా 80వ ర్యాంకు సాధించిన షేక్ వసీమా అభినందనీయురాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆ పాప సాధించిన విజయం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మండలంలోని చినతురకపాలెం గ్రామంలో షేక్ సాపమహబూబ్ సుభాని, సకిన దంపతుల కుమార్తె వసీమా శనివారం విడుదల చేసిన నీట్ ఎగ్జామ్ ఫలితాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆల్ ఇండియాలో 80వ ర్యాంకు సాధించింది. శనివారం సాయంత్రం వసీమా గ్రామానికి చెందిన తన బంధువు షేక్ సుభానితో కలిసి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిని పార్టీ కార్యాలయంలో కలిశారు. గోపిరెడ్డి ఆ విద్యార్థినిని సత్కరించి అభినందించారు. గోపిరెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియాలో 80వ ర్యాంకు రావటం సామాన్యమైన విషయం కాదని అన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ అమలుచేసిన నాలుగు శాతం రిజర్వేషన్ వల్ల ఎంతోమంది మైనార్టీ అమ్మాయిలు, అబ్బాయిలు మంచి ర్యాంకులతో డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారన్నారు. వసీమాను అందరూ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వసీమాను మునుముందు పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యను చదివించాలని సూచించారు. వారి కుటుంబంలో ఎనిమిది మంది డాక్టర్లు అంటే సామాన్య విషయం కాదని, ఓకే కుటుంబం ఎనిమిది మంది డాక్టర్లు కావటం చాలా గొప్ప విషయమని అన్నారు. ఆ గ్రామంలో ఇప్పటికీ 30 మంది డాక్టర్లుగా డిగ్రీలు పొందారని, ఇంకా రెండు మూడు రోజుల్లో నీట్ విశ్లేషణ పూర్తయితే మరో ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు రావడానికి అవకాశం ఉందని అన్నారు. వారందరూ ఎన్నో విజయాలు సాధించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. షేక్ కరిముల్లా, అచ్చి శివకోటి, వై.రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు.అభినందించి సత్కరించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
అలరించిన వైద్యురాలి కూచిపూడి నృత్యం
నగరంపాలెం: స్థానిక జిల్లా కోర్టు రోడ్డులోని గుంటూరు వైద్యకళాశాల (జీఎంసీ) ఆవరణలోని జింఖానా ఆడిటోరియంలో శనివారం వైద్యురాలు కంభంపాటి అపర్ణ కూచిపూడి నాట్య ఆరంగేట్రం చేశారు. వేదాంతం కళాక్షేత్రం (యూఎస్ఏ) వ్యవస్థాపకులు వేదాంతం రాఘవ, బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథశర్మ, బ్రహ్మశ్రీ ముప్పవరపు సింహాచలశాస్త్రి, వైద్యులు హనుమంతురావు, కంభంపాటి మహాదేవ, వరలక్ష్మి దంపతుల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేదాంతం రాఘవ శిష్యురాలైన డాక్టర్ అపర్ణ కూచిపూడి రంగప్రవేశం చేశారు. సంప్రదాయ ప్రార్థనతో మొదలై, పలు కూచిపూడి నృత్యాలకు ఆమె నాట్యం చేశారు. అమెరికాలో ఉంటున్న అపర్ణ దేశ సంస్కృతిని పరిరక్షిస్తూ, తొమ్మిదో ఏటనే నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిందని వక్తలు పేర్కొన్నారు. ఒకవైపు వైద్య వృత్తిని అభ్యసిస్తూ, నాట్యంపై అభిలాష పెంపొందించుకోవడం అభినందనీయమని తెలిపారు. విద్యలో రాణిస్తూ, కూచిపూడిలో ప్రతిభ చూపడం గొప్ప విషయమని కొనియాడారు. -
నీట్ ర్యాంకర్ల ‘ఎయిమ్స్’
గుంటూరు ఎడ్యుకేషన్ : వైద్య విద్యా కోర్సుల జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్–2025)లో గుంటూరుకు చెందిన పలువురు విద్యార్థుల వివిధ కేటగిరీల్లో అఖిల భారతస్థాయిలో ర్యాంకులు కై వసం చేసుకున్నారు. నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు జాతీయస్థాయి వైద్య విద్యా సంస్థల్లో (ఎయిమ్స్)తో పాటు దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలల్లో సీట్లు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.ఎయిమ్స్లో చేరడమే లక్ష్యం స్వస్థలం యర్రగొండపాలెం. నాన్న యేసానాయక్ జెడ్పీ హైస్కూల్ గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. టెన్త్ వరకూ నవోదయలో, ఇంటర్మీడియెట్ గుంటూరు వచ్చి చదివాను. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 981మార్కులు సాధించాను. తాజా ర్యాంకుతో ఎయిమ్స్లో చేరాలని భావిస్తున్నాను. – రమావత్ తరుణ్ కుమార్ నాయక్, 51వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ తల్లిదండ్రులే స్ఫూర్తి స్వస్థలం గుంటూరు. నాన్న భానుప్రకాష్ గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జువాలజీ అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అమ్మ విజయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకురాలు. నీట్ ఓపెన్ కేటగిరీలో 262 ర్యాంకు వచ్చింది. తాజాగా ర్యాంకుతో ఎయిమ్స్లో సీటు సాధిస్తా. – కారుమంచి విక్రాంత్, 6వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీ అమ్మానాన్నలు ప్రభుత్వ వైద్యులే స్వస్థలం గుంటూరు. నాన్న డాక్టర్ గోవిందనాయక్, అమ్మ డాక్టర్ కరుణ జీజీహెచ్లో వైద్యులు. ఓపెన్ కేటగిరీలో 2,135వ ర్యాంకు సాధించా. కళాశాలలో అధ్యాపకులు అందించిన సహకారం, సందేహాల నివృత్తి, వీక్లీ టెస్టుల ద్వారా సబ్జెక్టు పరంగా పట్టు సాధించా. ఇది మెరుగైన ర్యాంకు సాధనకు దోహదపడింది. మంగళగిరి ఎయిమ్స్లో చేరతా. – ఎం. అరవింద్, 13వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీవైద్యురాలిగా రాణించాలనే లక్ష్యం స్వస్థలం నరసరావుపేట. నాన్న షేక్ మహబూబ్ సుభానీ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఓపెన్ కేటగిరీలో 1,184వ ర్యాంకు సాధించా. ఎయిమ్స్లో చేరే లక్ష్యంతో ఉన్నాను. – షేక్ వసీమా, 80వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ అన్నయ్య స్ఫూర్తి స్వస్థలం గుంటూరు. నాన్న రత్నాకర్ ఆర్కిటెక్చర్. అమ్మ రెబెకా విద్య సివిల్ ఇంజినీర్. గతేడాది నీట్లో క్వాలిఫై అయ్యి పుదుచ్చేరిలోని జిప్మర్లో సీటు సాధించిన అన్నయ్య ప్రణయ్ విక్టర్ బాటలో వైద్య విద్య అభ్యసించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ఎయిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత కార్డియాలజిస్ట్గా ఎదిగి, సమాజానికి సేవ చేస్తా. – సోలే ప్రేమ్ జడ్సన్ ప్రసన్న, 108వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీ గైనకాలజిస్ట్గా సేవలు స్వస్థలం నెల్లూరు. నాన్న కృష్ణారెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. వైద్య విద్యపై మక్కువతో రోజుకు 15 గంటల పాటు చదివాను. ప్రణాళికాబద్ధమైన కృషితోనే ర్యాంకు సాధ్యమైంది. ఎయిమ్స్లో వైద్యవిద్య అభ్యశించిన తరువాత గైనకాలజిస్ట్గా రాణించాలనే లక్ష్యంతో ఉన్నా. – నాగిరెడ్డి మనస్విని, 49వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ జాతీయస్థాయి వైద్య విద్యాసంస్థల్లో సీటు సాధనే లక్ష్యం వివిధ కేటగిరీల్లో ప్రతిభ చాటిన విద్యార్థుల భావి ప్రణాళికలు -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
యడ్లపాడు: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. హైవే పరిరక్షణ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల జిల్లా వలపర్ల గ్రామస్తులు మొహమ్మద్, హసీరా దంపతులు, వారి ఇద్దరు పిల్లలు నహీరా, నసీర్లతో బైక్పై శనివారం గుంటూరు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, యడ్లపాడు సమీపంలోని నక్కవాగు వద్ద గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొంది. వాహనం అదుపు తప్పి కిందపడగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. గాయపడిన వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డివైడర్ను ఢీకొన్న బైక్... నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ బాషా బైక్పై గుంటూరు వైపు ప్రయాణమయ్యాడు. మద్యం సేవించి ఆపై వేగంలో ఉన్నందున వాహనం అదుపుతప్పి యడ్లపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ సమీపంలో డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో వాహనంతోపాటు బాషా రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హైవే అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
చీరాల అర్బన్: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. శనివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో సీపీఎం బాపట్ల జిల్లా నాయకులకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొదటి రోజు వర్తమాన రాజకీయ పరిణామాలుపై మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సుపరిపాలన అందించినట్లు చెప్పుకుంటుందని, ప్రజలు అటువంటి సంతృప్తి వ్యక్తం చేయడం లేదన్నారు. తల్లికి వందనానికి అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టారన్నారు. పిల్లల చదువులకు ఇచ్చే డబ్బుల్లో కోత వేయడం సరికాదన్నారు. అర్హులైన అందరికీ తల్లికి వందనం ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. రాష్ట్రానికి వనరులు రాబట్టుకోవడం, విభజన హామీలు అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలు భావించారన్నారు. ఆచరణలో మాత్రం ఆ ప్రయత్నం జరగలేదన్నారు. సూపర్ సిక్స్ వంటి పథకాలు ఇంటింటికీ అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తోందని తెలిపారు. జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజల సమస్యలపై జిల్లాలో సీపీఎం పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, ఎన్.బాబూరావు, మణిలాల్, జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య, వి.వెంకటరామయ్య, ఎం.ఆంజనేయులు, తిరుమల, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య -
చైన్ స్నాచింగ్ కేసుల్లో పాత నేరస్తుడి అరెస్టు
నగరంపాలెం: ఒంటరిగా వెళ్లే వృద్ధ మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లే పాత నేరస్తుడ్ని గుంటూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. అతని నుంచి రూ.30 లక్షలు ఖరీదైన 300 గ్రాముల నగలు, బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలుల్లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి గత నెల 28 వరకు జిల్లాలో వరుస బంగారు గొలుసు చోరీలు జరిగాయని తెలిపారు. దీంతో సీసీఎస్ సీఐలు అనురాధ, అల్తాఫ్ హుస్సేన్, బి.శ్రీనివాస్తో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. గత ఆరు నెలలుగా సుమారు 700 నిఘా కెమెరాలను నిశితంగా పరిశీలించామని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో ఆనందపేట ఒకటో వీధిలో ఉంటున్న నలభై ఏళ్ల షేక్ అమీర్బేగ్ అలియాస్ జోహారీని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పేర్కొ న్నారు. గతంలో జరిగిన ఎనిమిది బంగారు గొలుసు దొంగతనాలకు ఇతడే పాల్పడినట్లు విచారణలో గుర్తించామని వివరించారు. అమీర్ బేగ్ను అరెస్ట్ చేసి బంగారు నగలు, మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మరో రెండు బైక్లను గుర్తించాలని చెప్పా రు. కేసులను త్వరితగతిన ఛేదించిన ఏఎస్పీ క్రైం సుప్రజ, డీఎస్పీ శివాజీరాజు, సీఐలు, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, రివార్డులు అందించారు. 15 రోజులకు ఒక చోరీ పెయింటర్గా పనిచేసే అమీర్ బేగ్ ఒంటరి మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో మంచి నేర్పరి. 2006లో మూడు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నుంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నాడు. 2014లో పాత గుంటూరు పీఎస్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చాడు. అతనిపై 2016లో పాత గుంటూరు పీఎస్లో సస్పెక్ట్ షీట్ ఉంది. అప్పటికే సుమారు 22 కేసులు నమోదవ్వగా, ఇటీవల చేసిన ఎనిమిది కేసులతో 30 వరకు నమోదయ్యాయి. పదిహేను రోజులకు ఒకసారి రెక్కీ చేసేవాడని, అది కూడా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చేసేవాడని పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు. బాపట్ల జిల్లా వెళ్లి అక్కడ తాళం అరిగిపోయిన బైక్లను దొంగలించి, ఇక్కడికి వచ్చేవాడని చెప్పారు. చోరీలు చేసిన తర్వాత ఎక్కడపడితే అక్కడే వాటిని వదిలేసి వెళ్లేవాడని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజు, సీఐలు జె.అనురాధ, ఎండీ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్, బి.శ్రీనివాసరావు, పట్టాభిపురం పీఎస్ సీఐ జి.వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. రూ.30 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం -
పల్నాడు
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025Iనేడు వేంకటేశ్వర స్వామి శాంతి కల్యాణం దుగ్గిరాల: పసుపు యార్డు సమీపంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి శాంతి కళ్యాణ మహోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.ముప్పాళ్ల: ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ముందస్తు రుతుపవనాల రాకతో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. రైతులు ముందస్తు సాగుకు సిద్ధమవుతున్నా పాలకులు నిర్లక్ష్యం వారికి శాపంగా మారింది. సీజన్ ప్రారంభానికి ముందే రైతుకు కష్టాలు మొదలయ్యాయి. భూసారం పెరగాలంటే పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలంటూ పెద్దఎత్తున వ్యవసాయశాఖ అధికారులు ప్రచారం చేస్తుంటారు. అయితే ఆ దిశగా రైతుకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువులు పంపిణీలో మాత్రం చిత్తశుద్ధి కనపడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు సబ్సిడీపై అందించే ప్రోత్సాహకాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి. చివరకు వ్యవసాయ సీజన్కు ఆరంభంలో సాగు చేసే పచ్చిరొట్ట విత్తనాలు కూడా అందకుండా పోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే విత్తనాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సొంత గ్రామంలోనే అందించేవారు. సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలైన పిల్లి పెసర, మినుము, జీలుగ, జనుము గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయశాఖ సిబ్బంది ద్వారా నేరుగా రైతుకు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక పచ్చి రొట్ట విత్తనాల ఊసే కరువైంది. వరి, పత్తి, మిరప విత్తనాల జాడే లేదు. గత వైఎస్సార్ సీపీ హయాంలో మండలానికి సుమారు 400 క్వింటాళ్ల వరకు విత్తనాలు సరఫరా కావటంతో రైతుకు కావాల్సినంత, కావాల్సిన రకం సొంత గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలోనే తీసుకొని సాగు చేసుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది 120 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. ఎన్నికల సమయం కావటంతో రైతులు కూడా విత్తనాల పంపిణీపై ఆసక్తి కనపరచలేదు. ఇదే అదనుగా ఈ ఏడాది మరలా కోత విధిస్తూ 100 క్వింటాళ్లు మాత్రమే పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా అయినట్లు వ్యవసాయశాఖ సిబ్బంది చెబుతున్నారు. మండలానికి కేటాయించే సరఫరాలో కోత విధిస్తుండటంతో రైతులకు విత్తనాలు అందటం లేదు. అధికార పార్టీ సిఫార్సులు ఉన్న వారికే విత్తనాలు దక్కే దుస్థితికి చేరింది. గప్ చుప్గా పంపిణీ ప్రభుత్వం సరఫరా చేసే అరకొర కేటాయింపులతో వ్యవసాయశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. కేవలం కూటమి నాయకులు సిఫార్సు చేసిన వారికి మాత్రమే గప్చుప్గా వ్యవసాయ అధికారులు విత్తనాలు అందిస్తున్నారు. ఎవరైనా విత్తనాల కోసం వెళితే స్టాక్ లేదంటూ సమాధానం ఇచ్చి వెనక్కి పంపుతున్నారు. పచ్చిరొట్ట సాగు చేపట్టాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టే అధికారులు ఆ దిశగా విత్తనాలు సరఫరా చేయాలనే కనీసం పరిజ్ఞానం లేకపోవటం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. న్యూస్రీల్ ఆరంభమైన ఖరీఫ్ సీజన్ నేటికీ అందని పచ్చిరొట్ట ఎరువులు సరఫరాలోనూ కోత ఆందోళనలో అన్నదాతలుమళ్లీ వస్తాయంటూ కుంటి సాకులు విత్తనాలు అరకొరగా రావడంతో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అడిగిన వారికి సమాధానం చెప్పుకోలేక తికమకపడుతున్నారు. రైతులు అడిగే ప్రశ్నలకు నోరు మెదపలేకపోతున్నారు. కొందరు కూటమి నేతలు సైతం విత్తనాల కోసం సిబ్బందిని వేధిస్తున్నారు. ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఈ తరుణంలో వారి కోపం నుంచి తప్పించుకునేందుకు మాయమాటలు చెప్పి తప్పించుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం కేటాయించిన వరకు రైతులకు అందిస్తామంటూ వ్యవసాయాధికారులు చేతులెత్తేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు అందించాలి. లేకుంటే రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పచ్చిరొట్ట సాగు పంటకు ఎంతో లాభదాయకం. రైతులు సబ్సిడీ ద్వారా అందించే విత్తనాలతోనే పచ్చిరొట్ట సాగు చేస్తుంటారు. విత్తనాలు అందివ్వకుంటే సాగు అదనపు భారమే అవుతుంది. – గుంటుపల్లి బాలకృష్ణ, రైతుసంఘం నాయకులు -
అదుపు తప్పిన లారీ
దాచేపల్లి: నగర పంచాయతీ పరిధిలోని కారంపూడి రోడ్డు సెంటర్లో శనివారం లారీ బీభత్సం సృష్టించింది. పిడుగురాళ్ల వైపు నుంచి అతి వేగంతో వస్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ ఇనుప గ్రిల్స్ని ఢీకొని దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మీటర్ల పొడవునా ఇనుప గ్రిల్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్లో లారీ బీభత్సం సృష్టించడంతో ప్రజలు పరుగులు తీశారు. గ్రిల్స్ను ఢీకొని లారీ నిలిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్రేన్ సాయంతో లారీని పక్కకు తీశారు. హైవే అధికారులు కొత్త గ్రిల్స్ నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మహిళపై కత్తితో దాడి నరసరావుపేట టౌన్: మంచినీటి పంపు వద్ద చోటు చేసుకున్న వివాదం మహిళపై కత్తితో దాడికి దారి తీసింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దచెరువు రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ వద్ద కుళాయిలో తాగునీరు పట్టుకునే విషయంలో చల్లా సుధారాణికి, గుంజి తిరుమలకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సుధారాణిపై తిరుమల, అతని తండ్రి వెంకటేశ్వర్లు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యోగాతో ఆరోగ్యం, ఆనందం
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): యోగాసనాల వల్ల మానసిక ప్రశాంత కలుగుతుందని, ఆరోగ్యంగా ఉండొచ్చని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలలో భాగంగా శనివారం పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన యోగాసనాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు. కేర్ న్యాచురోపతి వైద్య కళాశాల విద్యార్థులు నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పిట్టలవానిపాలెంలో అవగాహన ర్యాలీ నిర్వహించి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చెప్పారు. వికసిత్ భారత్ దిశగా కేంద్రం, స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముదుకు వెళుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నదని వాటి ఫలాలను ప్రజలు అందుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం యోగాతోనే సాధ్యమవుతుందని యోగాసనాల వలన కలిగే ప్రయోజనాలను ప్రజలు గుర్తించాలని కలెక్టర్ చెప్పారు. సూర్యలంకలో 10వేల మందితో యోగాంధ్ర ఈనెల 21న విశాఖపట్నంలో చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్ధాయిలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రధానమంత్రి హాజరవనున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలో సూర్యలంక తీరంలో 10వేల మందితో జరిగే యోగాలో ప్రజలంతా పాల్గొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డ్వామా పీడీ జయలక్ష్మి, మాతా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, పశు సంవర్థ శాఖ అధికారి వేణుగోపాల్రావు, ఎకై ్సజ్శాఖ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వవెంకటేశ్వరరావు, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఎలీషాబాబు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి పిట్టలవానిపాలెంలో జిల్లా స్థాయి యోగాసనాల కార్యక్రమం -
అన్నదాతకు గుండెకోత
‘కోత’ల చంద్రబాబు మరోమారు అన్నదాతలకు గుండెకోత మిగిల్చారు. వ్యవసాయం దండగనే ఆయన తీరును మళ్లీ చాటుకున్నారు. రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ నేటికీ పథకం అమలు కాలేదు. ఏడాది గడిచింది. లబ్ధిదారుల ఈకేవైసీ అంటూ మెలిక పెట్టారు. దాదాపు నలభై వేల మంది రైతుల పేర్లు అసలు ప్రభుత్వం రూపొందించిన జాబితాలోనే లేవని తేలింది. 40 వేల పేర్లు గల్లంతు వ్యవసాయ సిబ్బందికి అందిన జాబితా ప్రకారం జిల్లాలో ఈ పథకానికి 2,39,565 మంది రైతులు అర్హులుగా తేల్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023–24 సంవత్సరంలో 2,80,181 మంది రైతులకు రైతు భరోసా అందించింది. ఈ విధంగా జిల్లాలో దాదాపు 40 వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో కూటమి ప్రభుత్వం కోత పెట్టినట్టయింది. గత ప్రభుత్వ హయాంలో మే నెలలో వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడతలో రూ.7,500, అక్టోబర్ నెలలో పంట కోతతోపాటు రబీ సాగు అవసరాలకు రెండో విడతలో రూ.4 వేలు, జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి సమయంలో మరో రూ.2 వేలు.. ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటికే అన్నదాత సుభీభవ పథకాన్ని ఒక సంవత్సరం ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు లబ్ధిదారుల్లో భారీగా కోత విధించడంపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. నరసరావుపేట రూరల్: అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపనుంది. జిల్లాలో దాదాపు 40 వేల మంది రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో కనిపించడం లేదు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఊదరగొట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు పథకాన్ని మాత్రం ప్రారంభించలేదు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న దృష్ట్యా ఈ నెల 20వ తేదీన పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్హులైన రైతుల జాబితాలు వ్యవసాయ సిబ్బందికి చేరాయి. గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు జాబితాలోని రైతుల ఈకేవైసీ పూర్తి చేస్తున్నారు. అర్హుల్లో ఆందోళన గత ప్రభుత్వంలో 2023–24 సంవత్సరంలో రైతు భరోసా పథకాన్ని జిల్లాలో 2,80,181 మందికి అమలు చేశారు. ఇందుకుగాను రూ.378.24 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కూటమి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. ఈ పథకంలో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. వెబ్ల్యాండ్ సమాచారాన్ని అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో ఉంచి వ్యవసాయ సహాయకులతో పరిశీలన జరిపారు. వీరి నుంచి జాబితాను ఆర్టీజీఎస్కు పంపారు. ఇక్కడ మరోమారు పరిశీలన జరిపి, అర్హులైన వారి జాబితాను అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో ఉంచారు. వ్యవసాయ సహాయకుల జాబితాలోని రైతుల ఆధార్ ఆధారంగా ఈకేవైసీ చేస్తున్నారు. గ్రామాల్లో ఈకేవైసీ చేపట్టిన సిబ్బందికి కొంతమంది రైతుల పేర్లు జాబితాలో లేవని తెలిసింది. ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది రైతుల పేర్లు జాబితాలో గల్లంతయినట్టు సమాచారం. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో వ్యవసాయ సిబ్బందిపై ఇప్పటికే రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు పలు చోట్ల నిత్యం చోటుచేసుకుంటున్నాయి. అన్నదాత సుఖీభవ పథకంలో భారీగా లబ్ధిదారుల కుదింపు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2,80,181 మందికి ‘భరోసా’ జాబితాలో 40 వేల మంది పేర్లు తొలగించిన కూటమి సర్కార్ ఈకేవైసీ పూర్తి చేస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది కూటమి పాలకుల తీరుతో తీవ్ర ఆందోళనలో రైతులు పథకం అమలు కాకుండానే లబ్ధిదారుల ఎంపికలో కొర్రీలు -
లారీని ఢీకొట్టిన బస్సు..నలుగురికి గాయాలు
అద్దంకి: ముందు వెళ్తున్న లారీని బస్సు ఢీకొని బస్సులోని నలుగురికి గాయాలైన సంఘటన మండలంలోని చిన్నకొత్తపల్లి డొంక వద్ద అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత జరిగింది. అందిన సమాచారం మేరకు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు కందుకూరు నుంచి హైదరాబాద్ బయలుదేరింది. ఆ బస్సు మండలంలోని చిన్నకొత్తపల్లి డొంక వద్దకు రాగానే, అదే మార్గంలో చిన్నకొత్తపల్లి మిల్లు వద్దకు వెళ్లే క్రమంలో మలుపు తిరుగుతున్న లారీని వెనుకగా ఢీ కొట్టింది. దాంతో బస్సులో కుదుపు రావడంతో అందులో ప్రయాణిస్తున్న షేక్ యాకోబ్బాషాతోపాటు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, 108 సిబ్బంది అక్కిడికి చేరుకున్నారు. సంఘటన వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. క్షతగాత్రుడు షేక్ యాకోబ్ బాషాను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు. ఈ ఘటనలో బస్సు మందు భాగం నుజ్జు నుజ్జయింది. తరచూ ప్రమాదాలు ఈ స్థలంలో గ్రామానికి వెళ్లే రోడ్ క్రాసింగ్ ఉండటంతో పలుమార్లు కార్లు బోల్తా కొట్టడం, ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలసి పోయిన సంఘటనలు కోకోల్లలు. ఇక్కడ ప్రమాద నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
నిత్య జీవితంలో యోగా భాగం కావాలి
యడ్లపాడు: యోగా పట్ల మరింత అవగాహనను పెంచి, ప్రజలను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రోత్సహించే లక్ష్యంతోనే యోగాంధ్ర –2025 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా జేసీ సూరజ్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘యోగాంధ్ర – 2025’ ప్రచార కార్యక్రమం చారిత్రక పర్యాటక కేంద్రం కొండవీడుకోట ఘాట్రోడ్డులో శుక్రవారం ఉదయం నిర్వహించారు. అటవీ శాఖ పరిధిలో ఏపీ టూరిజం నిర్వహణలో పలు శాఖలు పాలుపంచుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రెండు గంటల పాటు సాగిన ఈ యోగా శిబిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించారు. ప్రతిరోజూ అభ్యాసం చేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ మాట్లాడుతూ.. ప్రతిరోజు కనీసం అరగంట యోగా చేయడం ఆరోగ్యానికి, మనస్సుకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. అధికారులు నిత్యం యోగా చేస్తే పనుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడంతోపాటు ఎక్కువ శక్తితో, ఉత్సాహంతో తమ విధులు నిర్వహించగలరని వివరించారు. వీటితోపాటు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారికి యోగా ప్రాముఖ్యతను వివరించాలని పిలుపునిచ్చారు. డీఎంహెచ్వో బి.రవి మాట్లాడుతూ రుగ్మతలు రూపుమాపేందుకు నిత్యం యోగా చేయాలన్నారు. డీఎఫ్వో మధులత మాట్లాడుతూ.. శారీరక, మానసిక సమస్యలకు యోగా ఒక అద్భుతమైన పరిష్కారం చూపుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం అధికారి గంగినేని నాయుడమ్మ, డీఎంహెచ్వో బి.రవి, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణప్రియ, డీఆర్వో మురళి, పీడీ డ్వామా సిద్ధ లింగమూర్తి, డ్వామా ఏపీడీ హీరాలాల్, ఆర్డీవో మధులత, ఈఈ హౌసింగ్ బండారు శివలింగం, తహసీల్దార్ జెట్టి విజయశ్రీ, ఎంపీడీవో వి.హేమలతాదేవి, కొండవీడుకోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె.శివారెడ్డి, ఐసీడీఎస్ నాదెండ్ల సీడీపీవో జి.శాంతకుమారి, చిలకలూరిపేట డీఈ హౌసింగ్ సాంబయ్య, ఫారెస్టు కొండవీడు రేంజ్ అధికారి హరిణి పాల్గొన్నారు. పల్నాడు జిల్లా జేసీ సూరజ్ కొండవీడుకోటలో యోగా మహోత్సవం -
సత్తా చాటిన జిల్లా బీచ్ కబడ్డీ క్రీడాకారులు
సత్తెనపల్లి: మచిలీపట్నంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జరిగిన 12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ పోటీలలో పల్నాడు జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. దేశంలోని 29 రాష్ట్రాల క్రీడాకారులు హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఇండియా జట్టుకు పల్నాడు జిల్లా క్రీడాకారులు కృష్ణారెడ్డి, గోపి, హరీష్లు ఎంపికయ్యారు. వీరిని పల్నాడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మాబుహుస్సేన్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు అచ్చిరెడ్డి, రియాజు, శేషయ్య, అనిల్, సభ్యులు సందీప్, సురేష్, ఆనంద్లు శుక్రవారం సత్కరించారు. మాబుహుస్సేన్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన క్రీడాకారులను మరింతగా తీర్చిదిద్దుతానన్నారు. సర్పంచుల పిల్లలకూ ‘తల్లికి వందనం’ అమలు చేయాలి అమరావతి: గ్రామానికి ప్రథమ పౌరులైన సర్పంచుల పిల్లలకు తల్లికి వందనం కింద ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాలో జమ కాలేదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు శుక్రవారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. సర్పంచ్ ప్రభుత్వ ఉద్యోగికి ఉన్నట్లుగా సిఎఫ్ఎంఎస్ఐడీ ఉండటం వలన పిల్లలు అనర్హులయ్యారని తెలిపారు. ప్రభుత్వం గౌరవ వేతనంగా రూ.3 వేలు చొప్పున సంవత్సరానికి రూ.36 వేలు మాత్రమ్చే సర్పంచులకు చెల్లిస్తోందన్నారు. దీనిపై ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. రాష్ట్రంలో యాభై శాతం ఎస్సీ ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సర్పంచులు ఉన్నారన్నారని గుర్తుచేశారు. వీరిలో అత్యధికంగా నిరుపేదలు ఉన్నారని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ సరెండర్ నెహ్రూనగర్: నగరంలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్య వైఖరి కారణంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్ఓ) డాక్టర్ ఎం.రవిబాబుని మాతృశాఖకు సరెండర్ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్ర స్థాయి పర్యటనల్లో పలుమార్లు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సూచించిన పనుల్లో పర్యవేక్షణ లోపం కనపరచడంతో ఆయన్ను సరెండర్ చేశామని పేర్కొన్నారు. పరిపాలన అవసరాల రీత్యా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రామారావు, పశ్చిమ నియోజకవర్గానికి సోమశేఖర్లను ఇన్చార్జి ఎంహెచ్ఓలుగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు. -
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ గుంటూరు లీగల్: క్యాలెండరు యక్టివిటీస్లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు శుక్రవారం రామన్నపేటలోని మానవత స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవంపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వృద్ధులు మనకు జ్ఞానాన్ని, అనుభవాన్ని అందించే వారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో వృద్ధులు ఆర్థికంగా, మానసికంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు జన్మనిచ్చి మన అభివృద్ధి కోసం కృషి చేస్తారని, కొంతమంది వారిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారని చెప్పారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే బహుమతిగా ఇచ్చిన ఆస్తులను రద్దు చేసి తిరిగి వారి సంక్రమిస్తాయనే చట్టం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆస్తులను ఇచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. నల్సా న్యాయ సేవల పథకం– 2016 ప్రకారం వృద్ధులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. సదస్సులో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, డాక్టర్ ప్రత్యూష , సుబ్బారావు, పెద్దలు పాల్గొన్నారు. -
‘ఫ్రైట్’ డిపో కార్యాలయం ప్రారంభం
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నల్లపాడులో ఫ్రైట్ డిపో (వ్యాగన్లను మరమ్మతు చేసే కార్యాలయం)ను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, డివిజన్ డీఆర్ఎం సుధేష్ఠ సేన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాగన్లను మరమ్మతులు చేసే సమయంలో సిబ్బందికి వెయిటింగ్ చేసేందుకు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అనంతరం ఫ్రైట్ డిపో కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అక్కడ నుంచి పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ప్రమాద ఘంటికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశంలో రైల్వే జీఎం మాట్లాడుతూ ౖస్టేషన్లలో ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆర్ఓబీల నిర్మాణానికి రూ.572.47 కోట్లు గుంటూరులోని శామలానగర్, సంజీవయ్యనగర్లలో ఆర్ఓబీలకుగాను రైల్వే శాఖ రూ.159.59 కోట్లు మంజూరు చేయడంపై రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు నసీర్ అహ్మద్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. శంకర్ విలాస్ ఆర్ఓబీతో పాటు గడ్డిపాడు, పెద పలకలూరు, నందివెలుగు, మంగళగిరిల్లో ఆర్ఓబీల నిర్మాణాలకు గానూ రూ 572.47 కోట్లను మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. -
కూటమి ‘పన్ను పోటు’
ప్రజలపై భారం మోపబోమంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు చంద్రబాబు తదితరులు అడ్డగోలుగా హామీలిచ్చారు. తీరా ఇప్పుడు గద్దెనెక్కాక ప్రజల నుంచి దొరికినకాడికి ఏ విధంగా వసూలు చేద్దామా.. అని ఆలోచిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా పథకాల అమలు ఊసే ఎత్తని చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆస్తిపన్నును ఏకంగా ఇరవై శాతం వరకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. నరసరావుపేట: ఆస్తిపన్ను సవరణ పేరుతో జిల్లాలోని పురపాలక ప్రజలపై రూ.10.71 కోట్ల భారాన్ని మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీలోగా జిల్లాలోని ప్రతి పురపాలక సంఘంలో ఇంటింటి సర్వే చేసి అదనపు కట్టడాలు, నిర్మాణాలు, వాణిజ్య సముదాయాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా అధికారులు, సిబ్బందితో సచివాలయాలవారీగా బృందాలను ఏర్పాటు చేశారు. 33 బృందాలు ఏర్పాట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం గత నెల 14వ తేదీన పురపాలక సంఘాలను ఆదేశిస్తూ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు ఇప్పటి వరకు ఆస్తిపన్ను వేయని, తక్కువగా పన్ను వేసిన ఆస్తులను గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను వసూలులో 20 శాతం వరకు పెంచుకోవాలని ఆయా మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ మేరకు నరసరావుపేట పురపాలక సంఘంలో సచివాలయాల సంఖ్యను బట్టి 33 బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి మున్సిపాలిటీలో ఉన్న వార్డు సచివాలయాలవారీగా రెవెన్యూ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన బృందాలు సర్వేలో నిమగ్నమయ్యాయి. రూ.కోట్లలో తప్పని భారం నరసరావుపేట పురపాలక సంఘాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ నిర్మాణాలు కాకుండా సుమారుగా 28 వేల ప్రైవేటు అసెస్మెంట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి రూ.13.52 కోట్ల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. దీనిలో ప్రతి ఏడాది 90 శాతం వరకు వసూలు చేస్తున్నారు. ఈ మే నెలలో ఐదు శాతం రాయితీ కల్పించటంతో రూ.5.2 కోట్ల పన్ను పుర ప్రజలు చెల్లించారు. జిల్లాలో ఎనిమిది పురపాలక సంఘాలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను డిమాండ్లో 20 శాతం పెంపుదల ఉండనుంది. ఇలా జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల ప్రజలపై రూ.10.71 కోట్ల భారాన్ని మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పురపాలక సంఘం అదనపు వసూలు లక్ష్యం (రూ.కోట్లలో) నరసరావుపేట 2.85 చిలకలూరిపేట 2.39 సత్తెనపల్లి 1.36 వినుకొండ 1.23 పిడుగురాళ్ల 1.19 మాచర్ల 0.97 దాచేపల్లి 0.45 గురజాల 0.27 మొత్తం 10.71 సర్వే చేస్తున్న అధికారుల బృందాలు ఈ నెల 15తో ముగియనున్న సర్వే ప్రస్తుత పన్నుకు 20 శాతం అదనం సర్వే బృందాలను ఏర్పాటు చేశాం దీనిపై పురపాలక ఆర్వో శ్రీనివాసరావును వివరణ కోరగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆదేశాల మేరకు 33 బృందాలను ఏర్పాటు చేశాం. సర్వే చేస్తున్నాం. పన్ను వేయని అదనపు కట్టడాలు, నివాస గృహాల్లో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు వంటి వాటిని గుర్తించి అదనంగా పన్ను విధించటం జరుగుతుంది. దీని ద్వారా 20 శాతం వరకు పన్ను మొత్తం పెంచుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు కృషి చేస్తున్నాం. – శ్రీనివాసరావు, ఆర్ఓ, పురపాలక సంఘం ఆస్తి పన్ను సవరణ పేరుతో ప్రజలపై రూ.కోట్లలో అదనపు భారం -
సూర్య ఘర్ రిజిస్ట్రేషన్లు లక్షకు చేరాలి
నరసరావుపేట: ఈ నెల 25వ తేదీ నాటికి జిల్లాలో లక్ష ప్రధానమంత్రి సూర్యఘర్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి కలెక్టరేట్లో శుక్రవారం విద్యుత్ అధికారులతో సమీక్ష చేశారు. ప్రజలు తమ ఇళ్లలో ఉచితంగా 25 ఏళ్లపాటు నిరంతరాయంగా విద్యుత్ పొందుతూ అదనపు విద్యుత్ ప్రభుత్వానికి విక్రయించి సొమ్ము చేసుకునే వీలు ఈ పథకంలో ఉందన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ, బీసీలకు రూ.98 వేలు, ఇతరులకు రూ.78 వేల వరకు సబ్సిడీతో ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ అందించే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో 10 వేల సాధారణ కనెక్షన్లు పీఎం సూర్యఘర్ పథకంలో భాగమయ్యే లక్ష్యంతో విద్యుత్ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు జరిగిన అప్లికేషన్ నమోదు, సోలార్ పానెల్ బిగించుట, గ్రిడ్ అనుసంధానం గురించి తెలుసుకున్నారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ వరకు ప్రతిరోజు కనీసం పది అప్లికేషన్స్ నమోదు చేయాలని అన్నారు. ఈ ప్రక్రియను ప్రతిరోజు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సమీక్షించాలని సూచించారు. పానెళ్లు బిగించే వారితోనూ మాట్లాడి వినియోగదారులకు త్వరగా పానెల్స్ ఏర్పాటు, బ్యాంక్ నుంచి రుణసదుపాయం తదితరాలను త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఇచ్చిన లక్ష్యాలు సాధించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ డాక్టర్ పి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ రాంబొట్లు, నరసరావుపేట మాచర్ల డెప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు సింగయ్య, ఏడుకొండలు, చిలకలూరిపేట సీనియర్ అకౌంట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. సమీక్షలో విద్యుత్ అధికారులకు కలెక్టర్ లక్ష్య నిర్దేశం -
తిమ్మాపురం స్పిన్నింగ్ మిల్లులో హత్య
యడ్లపాడు: ఈ నెల 10వ తేదీన వలస కార్మికుడిపై హత్యాప్రయత్నం జరగడంతో తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని శ్రీ మంజునాథ నూలు మిల్లులో ఒడిశా రాష్ట్రానికి చెందిన జగన్నాథ్ కుల్దీప్ పనిచేస్తున్నాడు. తన భార్య రుని కుల్దీప్, ముగ్గురు పిల్లలతో కలిసి మిల్లు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. నెల రోజుల క్రితం జగన్నాథ్ భార్య, పిల్లలు స్వగ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో, జగన్నాథ్ భార్య గురించి అదే మిల్లులో పనిచేస్తున్న మంగూలు లేంక అనే వ్యక్తి ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో మంగూలు తన గదిలోంచి కత్తి తీసుకొచ్చి జగన్నాథ్ను పొత్తికడుపులో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన జగన్నాథ్ను 108 అంబులెన్స్లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేశారు. చికిత్స పొందుతున్న జగన్నాథ్ (38) శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య పోలీస్ స్టేషననుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ శివరామకృష్ణ కేసు నమోదు చేయగా, సీఐ సుబ్బానాయుడు దర్యాప్తు చేస్తున్నారు. వలస కార్మికుల్లో భయాందోళనలు ఉపాధి కోసం రాష్ట్రాన్నే వదిలి వచ్చిన వ్యక్తిపై మూడు రోజుల కిందట హత్యాప్రయత్నం జరిగినా, బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. పోలీసులకు కూడా నూలుమిల్లు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటన తాలూకు విషయాలను గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పోలీసులకు తెలిస్తే ఎందుకు బహిర్గతం చేయలేదని పేర్కొంటున్నారు. కార్మికశాఖ అధికారులు కూడా ఇలాంటి ఘటనల సమయంలో కన్నెత్తి చూడక పోవడం, కుటుంబాలతో రాష్ట్రాలు విడిచి వచ్చిన తమ జీవితాలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని వలస కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నూలుమిల్లు పనులు చేసుకుంటున్న వలస కార్మికులు ఈ ఘటనతో తమ కుటుంబాలతో తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి దారుణం గోప్యతపై వలస కార్మికుల అనుమానాలు -
కుప్పడం పట్టు చీర జాతీయ అవార్డుకు ఎంపిక
బాపట్ల: చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఓడీఓపీ)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14వ తేదీన న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరుగునుందని పేర్కొంది. ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి న్యూ ఢిల్లీలో అందుకోనున్నారు. సంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మార్కెట్ లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందనుంది. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుంది. జాతీయ మార్కెట్ లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చీరాల కుప్పడంకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. చేనేత వృత్తినే నమ్ముకుని వందలాది చేనేత కుటుంబాలు బాపట్ల జిల్లా చీరాల పేరాలలో కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాయి. సంప్రదాయ మగ్గాలపై చేనేత కార్మికులు కష్టపడి నేసిన కుప్పడం చీరలకు ఒకప్పుడు ఎంతో డిమాండ్ ఉండేది. యంత్రాల చొరబాటుతో కుప్పడం చీరల ఉత్పత్తి సన్నగిల్లిందని కార్మికులు ఆందోళన చెందుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చేనేతల ఆశలు పునర్జీవం పోసుకున్నాయి. నేత వస్త్రాల ఉత్పత్తులకు చీరాల క్షీరపురిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం చీరాల కుప్పడం చీరలకు జాతీయస్థాయి అవార్డును ప్రకటించింది. జిల్లా కలెక్టర్ జూలై 14వ తేదీన అవార్డు అందుకోనున్నారు. -
రేపు జాతీయ బీసీ సంక్షేమ సంఘ సమీక్షా సమావేశం
గురజాల: ఈ నెల 15వ తేదీన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ యాదవ్ శుక్రవారం ఓ పత్రికా ప్రకటలో తెలిపారు. సమావేశం బస్టాండ్ ఎదురు గల పల్నాడు కన్వెన్షన్ హాల్లో 15న ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ హాజరవుతారని తెలిపారు. మాచర్ల, గురజాల నియోజకవర్గ పరిధిలోని బీసీ, మైనార్టీ నాయకులు పార్టీలకతీతంగా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. బుద్ధవనం ప్రాంగణంలో 18న యోగాంధ్రఅమరావతి: స్థానిక ధ్యానబుద్ధ విగ్రహం ఎదురుగా ఉన్న బుద్ధవనం ప్రాంగణంలో ఈ నెల 18వ తేదీన జిల్లా స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించటానికి ఏర్పాట్ల గురించి అధికారులతో సత్తెనపల్లి ఆర్డీవో రమణకాంతరెడ్డి సమావేశమయ్యారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు చేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పార్వతి, తహసీల్దార్ డానియల్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి అయ్యప్ప ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవాలు పిడుగురాళ్ల: పట్టణ సమీపంలోని అయ్యప్ప నగర్ ఎదురుగా ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రతిష్ట వార్షికోత్సవాలను శనివారం ప్రారంభించనున్నట్లు శుక్రవారం దేవస్థాన శాశ్వత ధర్మకర్త గుండా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై రెండు రోజులు జరిగే కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన కోరారు. ‘తల్లికి వందనం’ కోసం ఎన్పీసీఐలో నమోదవ్వాలి నరసరావుపేట: తల్లికి వందనం పథకంలో ఆర్థిక సాయం పొందేందుకు ఎస్సీలైన 9, 10, ఇంటర్మీడియెట్ విద్యార్థులు బ్యాంకు, పోస్టల్ ఖాతాలకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారిత అధికారి ఈ.ఈశ్వరమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దగ్గరలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, బ్యాంకు, పోస్టాఫీసులను సంప్రదించి తమ వివరాలను ఎన్పీసీఐలో అనుసంధానం చేసుకోవాలన్నారు. దీనికోసం శనివారం పోస్టల్, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా బ్రోచర్ ఆవిష్కరణ గుంటూరు ఎడ్యుకేషన్: చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతరిక్ష విజ్ఞానంపై నిర్వహిస్తున్న కార్యక్రమాల బ్రోచర్ను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లోఆవిష్కరించారు. స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కలిగిస్తూ, ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2200, గరిష్ట ధర రూ.3200, మోడల్ ధర రూ.2600 వరకు పలికింది -
అంతర్ జిల్లా దొంగను పట్టుకున్న పోలీసులు
జె.పంగులూరు: అంతర్ జిల్లా దొంగ పబ్బరాజు వెంకట యుగంధర్ను పట్టుకున్నట్లు శుక్రవారం ఎస్సై వినోద్బాబు తెలిపారు. బూదవాడ గ్రామానికి చెందిన వజ్రాల కృష్ణారెడ్డిని వెంకటయుగంధర్ గత నెలలో ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. మంచి వ్యక్తి అని నమ్మి బూదవాడ గ్రామానికి చెందిన హనుమారెడ్డి ఇల్లును అద్దెకు ఇప్పించాడు. ఎంతో నమ్మకంగా ఉంటూ గత నెల 18న రాత్రి 7 గంటల సమయంలో నిందితుడు అన్నవరం ప్రసాదం అని మత్తు మందు కలిపి హనుమారెడ్డి, అతని భార్యకు ఇచ్చాడు. కొద్ది సేపటికే సృహ కోల్పోగా హనుమారెడ్డి భార్య మెడలోని బంగారు గొలుసును దొంగిలించి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాధితులు రేణింగవరం పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఎస్సై వినోద్బాబు తన సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని మంగళగిరి బస్టాండ్ వద్ద పట్టుకున్నట్లు, అతని వద్ద బంగారు రికవరీ చేసినట్లు ఎస్సై వినోద్బాబు తెలిపారు. నిందితుడు గుంటూరు జిల్లా తాడేపల్లి లోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
సత్తెనపల్లి: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముప్పవరపు రమణయ్య (44) గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సత్తెనపల్లి వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. రమణయ్యకు భార్య అంజలి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహమైంది. 2.70 ఎకరాలు గ్రామంలో పొలం కౌలుకు తీసుకొని పత్తి, పొగాకు సాగు చేస్తుండగా నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు పెరిగి రమణయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు సత్తెనపల్లి రూరల్ పోలీసులకు తెలిపారు. కారు డ్రైవర్గా కూడా పనిచేస్తుంటాడని సమాచారం. తహసీల్దార్ కేఎస్ చక్రవర్తిని దీనిపై సంప్రదించగా.. త్రిమెన్ కమిటీ నిర్ధారించాల్సి ఉందని, కౌలు రైతు అయితే పూర్తి స్థాయిలో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు వివరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. -
నాటుసారా తయారీదారులపై చర్యలు
మాచర్ల రూరల్: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పోలీసు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని హసనాబాద్ తండాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలో ప్రతి ఇంటిని తనిఖీ చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మందిని అనుమానిత వ్యక్తులుగా గుర్తించారు. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ నసీబ్ బాషా, ఎకై ్సజ్ సీఐ ఎన్. వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నిందితులను మెజిస్ట్రేట్, మండల తహసీల్దార్ బి. కిరణ్ కుమార్ సమక్షంలో హాజరుపరిచారు. -
చెరువులో పడిన కారు
మేదరమెట్ల: విజయవాడ నుంచి శింగరాయకొండకు వెళుతున్న కారు గురువారం ఉదయం కొరిశపాడు జాతీయ రహదారి రొయ్యల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న రహదారి వద్దకు కారు రాగానే డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పిన కారు డివైడర్ కోసం ఉంచిన సిమెంట్ దిమ్మెను ఢీ కొని పక్కనే ఉన్న చెరువులోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణికులు లేకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి చెరువులో పడిన కారును బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు. -
లక్ష్మీనారాయణకు ఉత్తమ రైతు పురస్కారం
పర్చూరు(చినగంజాం): మండలంలోని తిమిర్తిపాడు గ్రామానికి చెందిన బోడావుల లక్ష్మీనారాయణ 2025 ఏడాదికి గాను డాక్టర్ ఎంవీ రెడ్డి ఉత్తమ రైతు పురస్కారం అవార్డు అందుకున్నారు. గురువారం ఆచార్య ఎన్జీ రంగా 62వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా గుంటూరు లాంఫాంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెం నాయుడు అవార్డు అందజేశారు. స్పెషల్ సీఎస్ బి.రాజశేఖర్, కమిషనర్ ఢిల్లీరావు, వీసీ శారదా జయలక్ష్మి, డీఆర్ పీవీ సత్యనారాయణ, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ అదృష్టం, ప్రసాద్, సైంటిస్టులు, రైతు సోదరులు పాల్గొన్నారు. -
కళానిలయం పీఆర్ మోహన్ మృతి
నాలుగు దశాబ్దాలుగా కళారంగానికి విశేష సేవలు చిలకలూరిపేట: కళారంగంలో చిలకలూరిపేట కీర్తిని దేశనలుమూలలా వ్యాపింపచేసిన కళానిలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రగడ రాజమోహనరావు (84) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. పీఆర్ మోహన్గా గుర్తింపు పొందిన ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 1941లో జన్మించిన ఆయన చిరువ్యాపారాలు చేసుకుంటునే కళారంగ ప్రముఖులు ఎస్ఎం బాషా ప్రోత్సాహంతో నాటక రంగ ప్రవేశం చేసి చైర్మన్, చిల్లరకొట్టు చిట్టెమ్మ, శిక్షార్హులు, రాణి సంయుక్త, జై జవాన్ వంటి నాటికల్లో నటించటంతో పాటు 25కి పైగా పురస్కారాలు అందుకున్నారు. 1984లో కళానిలయం సంస్థను ప్రారంభించి గత నాలుగు దశాబ్దాలుగా జాతీయ స్థాయిలో కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్య, సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే నెల 24 నుంచి 26వరకు శ్రీవెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కళ్యాణమండపంలో 40వ జాతీయ స్థాయి సంగీత, నాట్య కళారూపాల పోటీలు నిర్వహించారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా ముఖ్యంగా గత రెండేళ్లుగా ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో సైతం మంచానికే పరిమితమై కూడా పోటీలు నిర్వహింపచేసిన కళాతపస్వి రాజమోహనరావు. ప్రతి ఏటా నిర్వహించే కళానిలయం పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది వరకు కళాకారులు పాల్గొంటూ ఉంటారు. కళారంగ ప్రముఖులకు సన్మానాలు ప్రముఖ సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీ దర్శకులు, కళాతపస్వి కె.విశ్వనాఽథ్, నటులు మిక్కిలినేని రాధాకష్ణమూర్తి, నాటితరం నటీమణులు అంజలీదేవి, షావుకారు జానకి, బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్, నాట్యాచార్యులు పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ, సినీనృత్య దర్శకుడు పీవీ శేషు, ఆంధ్రాజాలరి బిరుదాంకితుడు ఆనం లక్ష్మణరావు, ప్రముఖ కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, సినీనటి రోజారమణి, ప్రఖ్యాత నర్తకి స్వాతి సోమనాథ్ గేయరచయిత్రి శశిబాల చేబ్రోలు వంటి ఎందరో ప్రముఖులు ఈ వేదికపై ఘన సత్కారాలు అందుకున్నారు. మృతి చెందిన రాజమోహనరావుకు భార్య శివ సత్యనారాయణమ్మ, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే సుబ్బయ్యతోటలోని ఆయన నివాసానికి పలువురు కళారంగ ప్రముఖులు వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. -
71 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
పొన్నూరు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ముఠా గుట్టురట్టయింది. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఓ ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యంను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం పొన్నూరు 29వ వార్డులోని ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు స్థానికుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 71 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ వీరానాయక్ బియ్యం నిల్వలను పరిశీలించారు. వినియోగదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నిల్వ చేసిన 29వ వార్డుకు చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు స్వాధీన పరిచినట్లు ఎస్ఐ తెలిపారు. తెనాలిలో 35 బస్తాలు స్వాధీనం తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి నుంచి బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు గురువారం తెల్లవారుజామున అంగలకుదురు వద్ద తనిఖీ చేయగా పట్టణానికి చెందిన రమావత్ లోకేష్ అలియాస్ సూర్యనాయక్ టాటా దోస్త్ వాహనంలో 50 కిలోల చొప్పున ఉన్న 35 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పెదరావూరుకు చెందిన అశోక్, బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన కార్తీక్ రేషన్ బియ్యాన్ని వట్టిచెరుకూరులోని రౌస్ మిల్లుకు తరలిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రైస్ మిల్లు ఓనరు లోకేష్, అశోక్, కార్తీక్లపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. -
నేడు న్యాయవాదుల సమావేశం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదుల ముఖ్య సమావేశం జరగనుంది. నగరంలోని జేకేసీ కళాశాల రోడ్డులోని వికాస్ ఇన్ హోటల్లో న్యాయవాదుల సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సి.డి.భగవాన్ తెలిపారు. పలు కీలక అంశాలపై చర్చించడంతోపాటు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికపై చర్చిస్తామన్నారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర రీజనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి, మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, పార్టీ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, విజయవాడ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డితోపాటు, ముఖ్య నేతలు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నారు. కార్యక్రమానిక పెద్ద ఎత్తున న్యాయవాదులు హాజరు కావాలని సి.డి.భగవాన్ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం తెనాలిరూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందారు. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోపల్లెకె చెందిన కారుమంచి దేవదానం(70) గురువారం పట్టణంలో జరిగిన ఓ దుకాణ ప్రారంభోత్సవానికి తన మోపెడ్పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సుల్తానాబాద్కు రాగా వెనుక నుంచి వచ్చిన సిమెంటు లోడు లారీ ఢీ కొట్టడంతో లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోపల్లె వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ కారుమంచి కిషోర్బాబుకు దేవదానం స్వయానా సోదరుడు. రూ.1.15 కోట్లు నష్టపరిహారం అందజేత చీరాల: వాడరేవు–పిడుగురాళ్ల నేషనల్ హైవే పనుల్లో భాగంగా ఈపూరుపాలెం స్ట్రయిట్కట్ వద్ద గృహాలు కోల్పోయిన 52 కుటుంబాలకు నష్టపరిహారాన్ని గురువారం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తన క్యాంపు కార్యాలయంలో అందించారు. మొత్తం 52 కుటుంబాలకు రూ.1.15 కోట్లు పరిహారం అందజేశారు. ఆర్డీఓ టి.చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
డాక్టర్ వెలగా సేవలు శ్లాఘనీయం
కాంస్య విగ్రహావిష్కరణలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి: గ్రంథాలయ రంగ ఉన్నతికి, సాహితీవ్యాప్తికి గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య చేసిన కృషి నేటితరానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలికి చెందిన సాహితీ ప్రముఖుడు, గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి రోజైన గురువారం ఇక్కడి తెనాలి బండ్పై ఏర్పాటుచేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. డాక్టర్ వెలగాతో తనకు గల అనుబంధాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. తెనాలి మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాల్లో సావనీరు రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ వెలగాను ‘నడిచే గ్రంథాలయ విజ్ఞాన సర్వస్యం’గా అభివర్ణించారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తన ప్రసంగంలో డాక్టర్ వెలగా కాంస్య విగ్రహం ఏర్పాటు, భావితరాలకు స్ఫూర్తి కాగలదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక డాక్టర్ వెలగా సేవలను కొనియాడారు. డాక్టర్ వెలగా వెంకటప్పయ్య కాంస్య విగ్రహాన్ని రూపొందించిన కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా సత్కరించారు. డాక్టర్ వెలగా కుమారులు సర్వోత్తమరావు, నాగార్జున, వెంకట్రావు, మానవేంద్ర, సోదరుడు వెలగా వీరయ్యతోపాటు గ్రంథాలయ రంగ ప్రముఖుడు లంకా సూర్యనారాయణ, ఈదర పూర్ణచంద్, మాదిరాజు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ●అనంతరం హోటల్ గౌతమ్ గ్రాండ్లో డాక్టర్ వెలగా విగ్రహావిష్కరణ సభను నిర్వహించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, ప్రముఖ రచయిత, పరిశోధకుడు ముత్తేవి రవీంద్రనాధ్, డాక్టర్ నన్నపనేని ప్రతాప్, పార్వతీపురంకు చెందిన పారినాయుడు, ప్రొఫెసర్లు లక్ష్మి, అయినాల మల్లేశ్వరరావు, షేక్ అబ్దుల్ హకీంజాని పాల్గొన్నారు. పావులూరి శ్రీనివాసరావు రచన ‘ఆరు దశాబ్దాల అలుపెరగని డాక్టర్ వెలగా కృషి’ అనే పుస్తకం, విశ్రాంత ప్రొఫెసర్ జి.రామేశ్వర్ రచన ‘ప్రకృతి వైద్యం గ్రంథ సూచి’ ప్రతిని ఆవిష్కరించారు. -
ములకలూరులో మట్టి అక్రమ తవ్వకాలు
నరసరావుపేట రూరల్: ములకలూరులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డీకే పట్టా భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నారు. అధికారపార్టీ నాయకులే మట్టిమాఫియా నిర్వహిస్తుండటంతో అధికారులు అటువైపు కన్నైత్తి చూడటం లేదు. పగులు, రాత్రి తేడా లేకుండా భారీ మిషన్లతో గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. లారీలతో గ్రావెల్ను నరసరావుపేటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ గ్రావెల్ వ్యాపారంలో ప్రజాప్రతినిధికి వాటాలు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దాదాపు 20 అడుగుల మేర తవ్వకాలు జరుపుతుండటంతో సమీపంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామానికి చెందిన రైతులు అక్రమ తవ్వకాలపై నూనె కోటేశ్వరమ్మ అనే మహిళ జిల్లా కలెక్టర్కు పిర్యాదు చేశారు. ఎస్సీలకు 2008లో డీకే పట్టాలను ప్రభుత్వం పంపిణీచేసిందని, ఇందులో భాగంగా మాకు ఎకరం భూమిపై పట్టా అందజేసినట్టు తెలిపారు. ఈ భూమికి ఇరువైపులా ఉన్న డీకే పట్టాలను మట్టి మాఫియా కొనుగోలు చేసి పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. దీని వలన మా పంట భూమిలోకి నీరు వచ్చే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో వీఆర్వో రామకృష్ణ గురువారం అక్రమ తవ్వకాలను పరిశీలించారు. అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు పరిశీలించిన వీఆర్ఓ -
నాణ్యత, మన్నికకు భారతి సిమెంట్
తెనాలిరూరల్: భవన నిర్మాణాలు శాశ్వతమైనవని, నిర్మాణం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారైన నాణ్యమైన సిమెంటును వినియోగదారులు ఎంచుకోవాలని భారతి సిమెంట్స్ అసిస్టెంట్ మేనేజర్(మార్కెటింగ్) పూల సురేష్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్.భవానీశంకర్ సూచించారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామంలోని శ్రీ సాంబశివ ట్రేడర్స్ సహకారంతో భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ మేస్త్రిలు, కార్మికులకు అవగాహన సదస్సును గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ అధునాతన పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారవుతుందని తెలిపారు. కట్టడాలు పూర్తి నాణ్యతతో దీర్ఘకాలం మన్నేందుకు దోహదపడుతుందన్నారు. సిమెంటు తయారీకి నాణ్యమైన ముడి పదార్థాలనే తమ కంపెనీ ఎంచుకుంటుందని తెలిపారు. భవానీశంకర్ మాట్లాడుతూ భారతి సిమెంట్ వినియోగించిన కాంక్రీట్తో వేసిన శ్లాబులను ఏడు రోజుల అనంతరం తమ కంపెనీ ప్రతినిధులు వచ్చి నాణ్యతా పరీక్షలను చేసి, సిమెంట్ నాణ్యతను భవన నిర్మాణ మేస్త్రిలు, యజమానులకు వివరిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధిత డీలరు ద్వారా వివరాలు తెలుసుకుని తమకు సమాచారం అందిస్తే సరిపోతుందన్నారు. మేసీ్త్రల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సుకు హాజరైన మేసీ్త్రలు, కార్మికులకు రూ.లక్ష చొప్పున ఉచిత బీమా సదుపాయం కల్పించి బాండ్లను అందజేశారు. శ్రీ సాంబశివ ట్రేడర్స్ యజమాని విష్ణుమొలకల పరమేశ్వరరావు, ఇతర డీలర్లు, భవన నిర్మాణ మేసీ్త్రలు, కార్మికులు పాల్గొన్నారు. -
మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు
మాజీ సైనికుల కార్పొరేషన్ నెలకొల్పాలి నగరంపాలెం: మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు అన్నారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణను రూపొందించాలని అన్నారు. దేశ రక్షణలో విధులు నిర్వర్తించి, మిలటరీ నుంచి బయటకు వచ్చిన కొందరు సైనికులు అనారోగ్యాలతో మరణించారన్నారు. తద్వారా మాజీ సైనికుల కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐనంపూడి రత్నప్రసాద్ మాట్లాడుతూ కొందరి సైనికుల కుటుంబ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. మాజీ సైనికుడు వాకా ఆదినారాయణ, పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలను తొలగించాలి
నగరంపాలెం: సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్సీ)ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంత్రించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్శర్మ అన్నారు. గురువారం నగరంలో పర్యటించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్, భాజపా రాష్ట్ర నాయకులకు బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, హిందూ దేవాలయాల ధర్మ పరిరక్షణ సమితి సంయుక్తంగా వినతిపత్రం అందించారు. నటుడు మంచు మోహన్బాబు నిర్మించిన కన్నప్ప చిత్రంలో సనాతన ధర్మాన్ని కించపరిచారని శ్రీధర్శర్మ మంత్రి, నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. బ్రాహ్మణ ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైన శిఖను అవమానపరిచేలా పిలక, గిలక అనే పాత్రలు స్పష్టించారని విమర్శించారు. బ్రాహ్మణ సమాజాన్ని అవమానించడం మంచు మోహన్ బాబు కుటుంబానికి అలవాటైందని మండిపడ్డారు. గతంలో ‘దేనికై నా రెడీ’ చిత్రంలో బ్రాహ్మణ జాతిని కించపరిచేలా, మనోభావాలకు భంగం కలిగించేలా ప్రవర్తించారని ఆయన గుర్తుచేశారు. ఏపీ అర్చక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వరశాస్త్రి మాట్లాడుతూ కన్నప్ప చిత్రంలో బ్రాహ్మణ జాతి మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు చిత్రీకరించారని వాపోయారు. కన్నప్ప చిత్రంలో సన్నివేశాలు తొలగించేలా అధికారులకు ఆదేశించాలని వారు కోరారు. దర్శనపు శ్రీనివాస్, ఐలూరు శ్రీనివాస్, యనమదల ఆంజనేయులు, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వేదాంతం లక్ష్మణ్, అర్చక, పురోహిత బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
తెనాలి కోర్టులో జిల్లా జడ్జి పరిశీలన
తెనాలిరూరల్: తెనాలి కొత్త్తపేటలోని కోర్టుల ప్రాంగణాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి గురువారం పరిశీలించారు. దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. కక్షిదారులకు సౌకర్యాలపై ఆరా తీశారు. న్యాయవాదులకు భవనం లేదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ వినతిపత్రం అందజేశారు. అనంతరం జడ్జీల క్వార్టర్లను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. సౌకర్యాల కల్పనకు నివేదిక ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. జిల్లా జడ్జి వెంట 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.వివేక్ వర్ధన్, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.రాజశేఖర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీ శంకర్, జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, సీనియర్ న్యాయవాదులు, గుమస్తాలు ఉన్నారు. -
ఆటో నేర్పే విషయంలో గొడవతోనే హత్య
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని క్రోసూరు మండలం బయ్యవరం గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో సత్తెనపల్లి డీఎస్పీ మెదరమెట్ల హనుమంతరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... బయ్యవరం గ్రామానికి చెందిన షేక్ శ్రీనివాసరావు ఈ నెల 3న అమరావతి మండలం తురకవారిపాలెం ఇటుక బట్టీల్లో పనిచేస్తుండగా అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెందిన సాధనాల గోపి పిల్లలకి ఆటో నేర్పే విషయంలో చిన్న గొడవ జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న సాధనాల గోపి, సాధనాల విజయ్బాబు, కడియం శ్రీకాంత్లు అదే రోజు సాయంత్రం బయ్యవరం గ్రామానికి వెళ్ళి షేక్ శ్రీనివాసరావు ఇంటికెళ్లి కర్రలతో అతడి తలపై విచక్షణరహితంగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. అతడిచ్చిన వాంగ్మూలం ఆధారంగా క్రోసూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇతర నేరాల్లో ఇప్పటికే జైలుశిక్ష సాధనాల గోపి, సాధనాల విజయబాబు కారులో వచ్చి ఆగి ఉన్న లారీల్లో నిమిషంలో 300 లీటర్ల ఆయిల్ను అపహరించి కారులో పెట్టుకుని పారిపోయి దానిని తక్కువ ధరకు విక్రయించేవారు. జల్సాలు చేయడం అలవాటుగా మారింది. ఈ క్రమంలో సులువుగా వచ్చిన డబ్బుతో న్యాయవాదులను సైతం నియమించుకొని పోలీసులకు కూడా సవాలుగా మారారు. ఇటీవల సత్తెనపల్లి, అమరావతిలో కూడా రెండు నేరాలు చేశారు. తీవ్ర ప్రయత్నం చేసి వారిని పట్టుకొని జైలుకు పంపారు. ఈ క్రమంలో బయ్యవరం గ్రామంలో హత్య చేశారన్నారు. పెదకూరపాడు సీఐ పి.సురేష్, క్రోసూరు ఎస్ఐ పి.రవిబాబు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ముగ్గురు నిందితులను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బయ్యవరం గ్రామ శివారులో అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు సరివి కర్రలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కేసును ఛేదించిన రెండు బృందాలను డీఎస్పీ అభినందించారు. బయ్యవరంలో వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులు అరెస్ట్ -
రైతులకు నష్టపరిహారం అందజేస్తాం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో 2024 జనవరి 19న జరిగిన అగ్నిప్రమాదం వల్ల వేలాది మంది రైతులు తమ పసుపు పంటలను కోల్పోయారని, వారికి నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు చుట్టుగుంటలోని రాష్ట్ర మార్కెటింగ్శాఖ కమిషనరేట్ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి గురువారం ఆయన బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రమాదంపై కలెక్టర్ స్థాయి అధికారులతో విచారణ చేపట్టామని, రైతులకు ఎంత నష్టం వాటిల్లింది అనే అంశంపై నివేదిక తీసుకున్నామన్నారు. పసుపు క్వింటాకు రూ.7 వేలు రైతులకు అందజేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి నగదు అందగానే రైతులకు డబ్బులు అందజేస్తామని పేర్కొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు హామీ -
కొనసాగుతున్న బదిలీల కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీ (తెలుగు)లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం సీనియార్టీ జాబితాలోని వరుస క్రమంలో 751 నుంచి 1750 వరకూ పేర్లు ఉన్న ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ కె.సుబ్బారెడ్డి పరిశీలించారు. కాగా శుక్రవారం ఉదయం 8 గంటలకు జెడ్పీ యాజమాన్యంలోని ఎస్జీటీలు(తెలుగు) 1751 నుంచి 2400 నంబరు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని డీఈఓ సీవీ రేణుక తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి మున్సి పాల్టీల్లో పని చేస్తున్న ఎస్జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో జిల్లా పరిశీలకురాలు పి.శైలజ, పల్నాడు డీఈఓ చంద్రకళ, డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్లు రమణ, శైలజ, ఏపీఎస్డీఎంఏ డీపీఎం ఎ.లక్ష్మీకుమారి పాల్గొన్నారు.నేడు జెడ్పీ, మున్సిపల్ ఎస్జీటీలకు నిర్వహణ -
సమస్యల చదువులు
వేసవి సెలవుల అనంతరం గురువారం బడుల తలుపులు తెరుచుకున్నాయి. సుమారు 50 రోజుల సెలవుల అనంతరం బడి గంటలు మోగాయి. 2025–26 విద్యాసంవత్సరం తొలి రోజే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులను వసతుల లేమి వేధించింది. ముఖ్యంగా అదనపు తరగతుల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో గదుల కొరత ఏర్పడింది. దీంతో ఈ ఏడాది కూడా విద్యార్థులు చెట్ల కింద, రేకుల షెడ్లు, వరండాలలో పాఠాలు వినాల్సి వస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి కాకపోవడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. సాక్షి, నరసరావుపేట : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అదనపు తరగతుల గదుల నిర్మాణం చేపట్టారు. ఎన్నికల రావడంతో పనులు ఆగాయి. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ నిర్మాణాలు అటకెక్కాయి. దాదాపు 80 నుంచి 90 శాతం పూర్తయిన భవనాలను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసింది. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేయలేదు. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో 1,617 ఉన్నట్టు సమాచారం. అదనపు తరగతుల నిర్మాణం పూర్తికాకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా భవనాలు పూర్తి చేసి విద్యార్థులకు వాటిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. బదిలీల హడావుడిలో ఉపాధ్యాయులు... వేసవి సెలవుల అనంతరం బడులు ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది. దీంతో ఉపాధ్యాయులు ఆ హడావుడిలో ఉండిపోతున్నారు. జిల్లాలో మొత్తం 6,582 మంది ఉపాధ్యాయులు బదిలీల జాబితాలో ఉన్నారు. ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్ల ప్రక్రియ మాత్రమ పూర్తయింది. మరోవైపు సుమారు 2,900 మంది ఎస్జీటీలకు బదిలీల జరగాల్సి ఉండగా... గురువారం నాటికి 1,750 మందికి పూర్తయినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజులపాటు ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ కొనసాగనుంది. మున్సిపల్ టీచర్ల బదిలీలు కూడా జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయినా ఉపాధ్యాయులందరూ వారి నూతన స్థానాలకు వెళ్లడానికి ఆలస్యమయ్యే అవకాశముంది. ముఖ్యంగా మాచర్ల, వెల్దుర్తి, బొల్లాపల్లి లాంటి మారుమూల ప్రాంతాల నుంచి బదిలీ అయిన ఉపాధ్యాయులను సగం మందినే ఇప్పుడు రిలీవ్ చేస్తారు. మిగిలిన వారి స్థానంలో నూతన డీఎస్సీ ప్రక్రియ ముగిసిన తరువాత కొత్త ఉపాధ్యాయులు చేరిన తరువాతే రిలీవ్ చేయనున్నారు. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అవస్థలు అదనపు తరగతుల నిర్మాణాలు పూర్తికాక చాలాచోట్ల ఇబ్బందులు అరకొరగా బడులకు వచ్చిన కిట్లు.. ప్రస్తుతానికి పుస్తకాలతోనే సరి యూనిఫాం, షూలు త్వరలో వస్తాయంటున్న అధికారులు ఇప్పటికీ పూర్తి కాని ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గతంలో బడులు తెరిచే నాటికే జగనన్న విద్యాకానుక కిట్లు సిద్ధం పూర్తి స్థాయిలో రాని కిట్లు... బడులు తెరుచుకున్న తొలిరోజే విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పినా ఆచరణలో ఘోరంగా విఫలమైంది. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, డిక్షనరీలు మాత్రమే అందాయి. బ్యాగ్లు 18 మండలాలకు చేరగా, మరో 10 మండలాలకు రాలేదు. యూనిఫాం, షూస్ తదితర సామగ్రి సంగతి సరేసరి. ఈ నెల 20 లేదా 27న మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాంలో వాటిని ప్రచారం కోసం ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వముంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బడులు తెరిచిన మొదటి రోజే అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు సరఫరా చేశారు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా అందజేశారు. కూటమి ప్రభుత్వం కిట్ల సరఫరాలో విఫలమైందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.