
శక్తిమంతమైన అస్త్రం
శకిమంతమైన ఆరోగ్యాన్ని అందించే యోగా శరీరానికి మాత్రమే కాకుండా మనస్సు, మనస్తత్వా లకు కూడా మార్గదర్శకం. నమ్మకం, శ్రద్ధ, ఓర్పు, మానవత్వం వంటి విలువల్ని ప్రతిరోజూ సాధన ద్వారా అలవర్చుకోవచ్చు. అందుకే యోగా చేస్తే యోగం పడుతుందని మన పెద్దలు చెబుతారు. యోగా ప్రక్రియ శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు కూడా ఓ దివ్యౌషధం. యోగా ప్రక్రియలో నియమాలు పాటిస్తేనే అది సాధ్యం. యోగాభ్యాసంలోకి వచ్చిన 20 ఏళ్లలో ఆస్పత్రి గడప తొక్కలేదు. వయస్సు, లింగభేదం, శరీరాకృతి వంటి పరిమితులు లేకుండా ఎవరైనా యోగాసనాలు సాధన చేయవచ్చు. నిత్య సాధన ద్వారా ఫ్లెక్సిబిలిటీ పెరిగి, మానసిక నిశ్చలత, శాంతి సాధ్యమవుతాయి. అంతటి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి భారత దేశం అందించడం మనందరికీ గర్వకారణం.
– వై. రాజ్యలక్ష్మి, యోగా గురువు