కులధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు | - | Sakshi
Sakshi News home page

కులధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు

Jun 21 2025 3:35 AM | Updated on Jun 21 2025 3:35 AM

కులధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు

కులధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు

రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్యవేదిక జేఏసీ వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌

లక్ష్మీపురం: రాష్ట్రంలో బేడ బుడగ జంగం కులస్తులు 20 సంవత్సరాల నుంచి కుల ధ్రువీకరణ పత్రాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్యవేదిక జేఏసీ వ్యవస్థాపకులు కడమంచి శ్రీనివాన్‌ తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే ఎస్సీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని ఆయన కోరారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించి, బిల్లు పాస్‌ చేయించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఎంతటి పోరాటాలకై నా సిద్ధపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement