
ఏపీ బిషప్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా జయప్రకాష్
నరసరావుపేట: ఏపీ బిషప్ కౌన్సిల్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ జి.జయప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడ ఏపీ టూరిజం. పున్నమి ఘాట్లో శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు అధ్యక్షతన ఏపీ బిషప్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జయప్రకాష్ మాట్లాడుతూ.. అనేక కార్యక్రమాలు బిషప్ కౌన్సిల్ ద్వారా నిర్వహిస్తామన్నారు. అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు కూడా ఇన్చార్జిగా తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. ముఖ్య అతిథిగా విజయవాడ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణమూర్తినాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయప్రకాష్ను అభినందించి సన్మానించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బిషప్లు పాల్గొన్నారు.