
భారత టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయం ఘనంగా మొదలైంది. అంచనాలకు మించిన ఆటతో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది.

లీడ్స్: ఇంగ్లండ్తో మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు భారత్ భారీ స్కోరుతో చెలరేగింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది.

కెప్టెన్ శుబ్మన్ గిల్ (175 బంతుల్లో 127 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 101; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగగా, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (102 బంతుల్లో 65 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు.

టెస్టుల్లో జైస్వాల్కు ఇది ఐదో సెంచరీ కాగా, గిల్కు ఆరో శతకం. జైస్వాల్, గిల్ మూడో వికెట్కు 129 పరుగులు జోడించారు.













