
సాక్షి పల్నాడు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతో బలవన్మరణం చెందారు. నాదెండ్లకు చెందిన ఆదినారాయణ, తూబాడుకు చెందిన చిరుబోయిన గోపాలరావు పొలంలోనే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.