ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక | Lightning Warning Issued for Several Districts in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

Aug 5 2026 7:43 PM | Updated on Aug 5 2026 7:51 PM

Lightning Warning Issued for Several Districts in Andhra Pradesh

విజయవాడ: ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు(బుధవారం) రాత్రికి పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దాంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. 

ముఖ్యంగా విజయనగరం, ఎస్ కోట, భీమునిపట్నం, కొత్తవలస, భోగాపురం, ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. 

మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.  ఈ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన వెల్లడించింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement