breaking news
Farmers
-
రైతుల వాహనాలను ట్రాక్టర్తో ఢీ
గుర్రంకొండ: కూటమి ప్రభుత్వంలో రైతులకు రక్షణ లేకుండా పోతోంది. మండీలకు టమాటాలను తీసుకొచ్చిన రైతుల వాహనాలను ఓ మండీ యజమాని ట్రాక్టర్తో తొక్కించిన ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు, ఒకబొలెరో, ఒక ఆటో దెబ్బతిన్నాయి. వాహనాల వద్ద రైతులు లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. జాక్పాట్ వద్దన్నందుకే తమపై మండీ యజమానులు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ రైతులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రైతులు మార్కెట్యార్డు గేట్లు మూసేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మండీ యజమాని విపరీతం ఇదీ.. స్థానిక మార్కెట్యార్డుకు ఆదివారం రైతులు వాహనాల్లో టమాటాలను తీసుకొచ్చారు. ఇక్కడ తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో తమ వాహనాలను మండీల ముందు ఉంచారు. గత కొన్ని రోజులుగా రైతులు జాక్పాట్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి మనసులో పెట్టుకొన్న మండీ యజమానులు రైతులపై కక్ష గట్టారు. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఓ యజమాని తన మండీ ముందు వాహనాలు పెట్టారంటూ మరో రైతుకు చెందిన ట్రాక్టర్ తీసుకొని రైతుల వాహనాలపైకి వేగంగా ఎక్కించాడు. ఈసంఘటనలో పెద్దమండ్యం మండలానికి చెందిన ఇద్దరు రైతుల ద్విచక్రవాహనాలు ట్రాక్టర్ చక్రాల కింద పడి ధ్వంసం అయ్యాయి. కాగా ఒక బొలోరో వాహనం, ఒక ఆటో దెబ్బతిన్నాయి. కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం ఈ ఘటనతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండీల యజమానులపై తిరగబడ్డారు. అక్కడి నుంచి మార్కెట్ యార్డు ముందువైపుకు చేరుకొని యార్డుగేట్లు మూసేసి ఆందోళకు దిగారు. మండీల యజమానులు వచ్చి జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తామని చర్చలు జరిపినా ఫలించలేదు. విషయం తెలుసుకొన్న పోలీసులు, మార్కెట్కమిటీ అధికారులు అక్కడికి చేరుకొన్నారు. మార్కెట్కమిటీ సూపర్వైజర్ నయూబ్ బాషా రైతులతో చర్చించారు. ‘మీరు పట్టించుకోకపోవడంతో మండీల యజమానులు ఇలా రెచ్చిపోతున్నారు’ అంటూ రైతులు ఈ సందర్భంగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాక్పాట్లు వద్దన్నందుకే మండీల యజమానులు తమపై కక్షగట్టి మమ్మల్ని చంపాలను చూస్తున్నారని మండిపడ్డారు. జాక్ పాట్లు అరికట్టాల్సిన అధికారుల చేతగాని తనం వల్లే ఈ ఖర్మ పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడు రైతులు వాహనాల వద్ద ఉండి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసు నమోదుకాకుండా ‘మేనేజ్’ చేయడం కొసమెరుపు! సదరు మండీల యజమానులపై చర్యలు తీసుకొని లైసెన్స్లు రద్దు చేస్తామని మార్కెట్ కమిటీ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. బాధిత రైతులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఏఎస్ఐ గజేంద్ర పేర్కొన్నారు. అయితే రాత్రంతా మార్కెట్ కమిటీ అధికారులు, మండీల యజమానులు బాధిత రైతులను లోబరుచుకొని బెదిరింపులకు గురి చేసి కేసు నమోదు కాకుండా చేయడం ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు. జాక్పాట్ అంటే.. మండీలకు రైతులు 100 టమాటా బుట్టలను తీసుకునివస్తే, అందులో 15 నుంచి 20 బుట్టలను ఉచితంగా వ్యాపారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని బుట్టలు ఉచితంగా ఇవ్వాలనే అంశంపై నిర్ణయాన్ని వ్యాపారులే తీసుకోవడం ఇక్కడ గమనించాల్సిన మరో విషయం. -
అడవి పందిని తింటే పంట సేఫ్!
అలప్పుళ (కేరళ): అడవి పందుల బెడద నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి కేరళ రైతులకు.. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ వినూత్నమైన సలహా ఇచ్చారు. ఆయన శనివారం పాలమేల్ గ్రామ పంచాయతీలో మాట్లాడుతూ... ‘అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి కదా?. మీరంతా వాటి మాంసాన్ని తినండి!. ఈ సమస్య చాలా వేగంగా పరిష్కారమవుతుంది!‘ అని సెలవిచ్చారు. పంట పొలాల్లో హతమైన అడవి పందుల మాంసాన్ని ప్రజలు తినడానికి అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ఆయన దీనికి లాజిక్ కూడా చెప్పారు. ‘ప్రజలకు అడవి పందులను చంపి, వాటి మాంసాన్ని తినేందుకు అనుమతి ఉంటే, ఈ సమస్య చాలా తొందరగా పరిష్కారమవుతుంది. కానీ, ప్రస్తుత చట్టం దీనికి ఒప్పుకోవట్లేదు’.. అని వాపోయారు. ‘అడవి పంది ఏమంత అంతరించిపోతున్న జంతువు కాదు కదా!‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు.. రాష్ట్రంలో మానవ–జంతు సంఘర్షణలను తగ్గించేందుకు ఉద్దేశించిన వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972ను సవరించడానికి కేరళ అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించిన కొద్ది రోజుల తర్వాత రావడం విశేషం. -
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలు
సాక్షి, సిద్దిపేట: పండించిన పంటలను విక్రయించే సమయంలో తేమ శాతం తగ్గించేందుకు రైతులు యుద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో రైతుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ డ్రయర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రతి జిల్లాకు 2 నుంచి 4 డ్రయర్లు పంపించారు. ఇవి ఇప్పటికే ఆయా జిల్లాల్లోని వ్యవసాయ మార్కెట్లకు చేరుకున్నాయి.ప్యాడీ డ్రయర్ మెషీన్ 40 క్వింటాళ్ల ధాన్యాన్ని గంటకు 6 శాతం చొప్పున తేమను తగ్గిస్తుంది. తేమ 30 శాతం ఉన్నా కూడా అందులో పోస్తే ఆరబెడుతుంది. దీంతో ధాన్యం నాణ్యత మెరుగుపడుతుంది. గంటకు 40 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆరబెట్టేందుకు దాదాపు రూ.500 వరకు ఖర్చవుతుంది. దీంతో రైతుల ఇబ్బందులు తప్పనున్నాయి.జిల్లాకు రెండు వచ్చాయి..కొనుగోలు కేంద్రాలకు తొలిసారిగా ప్యాడీ డ్రయర్లను అందుబాటులోకి తెచ్చాం. సిద్దిపేట జిల్లాకు రెండు కేటాయించారు. ఇది గంట సమయంలో దాదాపు 6% తేమను తగ్గిస్తుంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
రైతుల న్యాయ పోరాటానికి కోర్టు అండ.. ఆర్డీవో కార్యాలయం జప్తు
సాక్షి,జగిత్యాల : జగిత్యాల కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రైతులకు సరైన పరిహారం చెల్లించలేదని కారణంతో ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేసినట్లు తెలుస్తోంది.పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వేలైన్ కోసం 2006లో రైతుల నుంచి సుమారు 100 ఎకరాలు భూమిని సేకరించారు. రైతులకు ఒక్క ఎకరాకు కేవలం రూ.లక్షా 30వేలు మాత్రమే అధికారులు చెల్లించారు. అయితే, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రైతులకు అండగా నిలిచింది. ఒక్కో ఎకరాకు రూ.లక్షా 30వేలు కాదని, 15లక్షల97 వేల200 చెల్లించాలని కోర్టు ఉత్తర్వులుజారీ చేసింది.కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఆర్డీఓ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆర్డీఓ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయా సామాగ్రిని జప్తు చేశారు. -
గిట్టుబాటులేక రోడ్డు మీదే.. పూల రైతుకు మిగిలింది కన్నీరే
కోలారు: బెంగళూరులోని కోలారు ప్లవర్ మార్కెట్లో వారం రోజుల క్రితం కిలో రూ.60 నుంచి రూ.70 ధర పలికిన బంతిపూల ధరలు మళ్లీ పాతాళానికి దిగజారాయి. దీంతో గిట్టుబా టుకాక రైతులు తాము పండించిన బంతి పూలను రోడ్డుపై పారబోసి వెళుతున్నారు. శ్రావణ మాసంలో వరుసగా పండుగలు రావడంతో పూల ధరలు ఆశాజనకంగా ఉండే వి. అనంతరం ఆశ్వీయుజ మాసంలో దనరా పండుగ కారణంగా బంతిపూలకు మంచి ధరలే లభించాయి. అయితే దసరా అనంతరం డిమాండ్ బాగా తగ్గింది. కిలో బంతిపూలు రూ.10, చేమంతులు కిలో రూ.40, గులాబీలు కిలో రూ.50 ధర పలుకుతున్నాయి. మంగ ళవారం మార్కెట్కు తీసుకు వచ్చిన పూలకు సరైన ధరలు లభించక రైతులు వాటిని బంగారుపేట-కోలారు రోడ్డు పక్కనే పారబోసి వెళ్లారు. పూలు విడిపించడానికి, మార్కెట్కు తరలించడానికి అయ్యే ఖర్చులు కూడా మిగ లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతులు పూల కోతకోయకుండా పాలంలో అలాగే వదిలేస్తున్నారు. కాగా అక్టోబర్ నెలలో పెద్ద ప్రమాణంలో బంతి పూల కోతకు రావడంతో డిమాండ్ తగ్గి ధరలు భారీగా తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. -
బాబును నమ్మి... రెంటికీ చెడుతున్న అమరావతి రైతులు
అమరావతి రాజధాని రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందమైపోయింది. కూటమి అధికారంలోకి వస్తే భూముల విలువలు ఆకాశాన్నంటి లాభపడవచ్చు అనుకున్న వారి ఆశలు కళ్లముందే కరిగిపోతున్నాయి. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఇప్పుడు కొత్తగా భూ సమీకరణ, బలవంతపు సేకరణ ప్రతిపాదనలు వస్తూండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. రైతుల నుంచి సేకరించింది, ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి కలిపి 53 వేల ఎకరాల వరకూ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని భూములు కావాల్సిందేనని భీష్మించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో స్వచ్చందంగా భూములివ్వని వారిపై 2013 భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇలా సుమారు 3500 ఎకరాలు తీసుకోబోతున్నారట. తద్వారా తొలిదశ అసలు లక్ష్యమైన 38 వేల ఎకరాలు సేకరించినట్లు అవుతుందని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. రెండో దశ భూ సమీకరణపై చర్చ జరగలేదని చెబుతూ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, రోప్ వే, రివర్ ఫ్రంట్, స్పోర్ట్స్ సిటీ వంటి వాటికి ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనర్థం... రెండో దశకు సుమారు 44 వేల ఎకరాలు తీసుకోబోతున్నామని తెలివిగా చెప్పడమే. ఇది రైతులకు అర్థం కాదన్నది వారి ఉద్దేశం. మొత్తమ్మీద ఈ వ్యవహారమంతా అమరావతి రైతులను సంక్షోభంలోకి నెట్టేదే. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని, బలవంతపు సేకరణ అస్సలు ఉండదని చంద్రబాబు ప్రభుత్వం గతంలో నమ్మబలికింది. కొంతమంది స్వచ్ఛందంగా ఇస్తే చాలామందికి ఇష్టం లేకపోయినా ప్రభుత్వ ఒత్తిడితో వదలుకోవడానికి సిద్దపడ్డారు. ఇంకొందరు ప్రభుత్వాన్ని ఎదిరించారు. బెదిరింపులకు లొంగకుండా సేద్యం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని బెదిరించేందుకు పంటలను దగ్దం చేశారన్న ఆరోపణలూ అప్పట్లో వచ్చాయి. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా.. చంద్రబాబు, మరికొందరు నేతలు అమరావతి రైతులను తీవ్రంగా రెచ్చగొట్టారు. వాస్తవానికి జగన్ వాస్తవిక దృక్పథంతో ఆలోచించి అమరావతితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెయాలని సంకల్పించారు. కానీ ఈ విషయంపై అప్పటి ప్రతిపక్షం రకరకాలుగా దుష్ప్రచారం చేయించింది. ఉద్యమం పేరుతో హడావుడి చేయించారు. ఆ తరువాత 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తరువాత తమకు లాభం చేకూరుతుందని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, మంచినీరు తదితర సదుపాయాలతో ప్లాట్లు వచ్చేస్తాయని అమరావతి రైతులు భావించారు. కానీ.. జరిగింది వేరు. చేతిలో ఉన్న భూమిని అభివృద్ధి చేయకపోగా అదనపు భూముల కోసం ఎత్తులేస్తున్నారు. పైగా తొలిదశలో భూములిచ్చిన కొందరు రైతులకు.. పూలింగ్కు ఇవ్వని వారి భూమిలో ప్లాట్లు కేటాయించారట. ఆ భూములను ఇప్పుడు బలవంతంగా సేకరించి ప్లాట్లు ఇస్తారట. ఇది ఏ ధర్మం? ఇంకో సంగతి చెప్పాలి. ఇక్కడ ఎకరా రూ.నాలుగు కోట్ల వరకు అమ్ముడుపోతోందని, చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పలు మార్లు చెప్పారు. ఆ ప్రకారం వీరికి 2013 చట్టం కింద మూడు రెట్లు ఎక్కువ ధర ఇస్తారా? అలా కాకుండా రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే పరిహారంగా ఇచ్చే యత్నం చేస్తే రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మరో వైపు అప్పట్లో పూలింగ్కు భూములు ఇవ్వని 3500 ఎకరాల రైతులకు ఎంత పరిహారం దక్కుతుందో తెలియదు. ప్లాట్ల కేటాయింపు కేవలం పేపర్లపైనే ఉండడం వల్ల భూములు అమ్ముడుపోవడం లేదని రైతులు చెబుతున్నారు.ఇక రెండో దశ భూ పూలింగ్కు భూములివ్వడం చాలామందికి ఇష్టం లేదు. పెదపరిమి వంటి గ్రామాలలో కొందరు టముకు వేసి మరీ పూలింగ్కు భూములు ఇవ్వవద్దని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగానూ తొలిదశ రైతులకు న్యాయం చేయకుండా తమ వద్దకు ఎలా వస్తారని చాలామంది ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనుకాడడం లేదు. కాకపోతే ఒకసారి భూమి తీసుకోవడం లేదని చెబుతారు. ఇంకోసారి ఆ భూములు ఇవ్వకపోతే, ఈ ప్రాంతం ఒక మున్సిపాల్టీగా మిగిలిపోతుందని బెదిరిస్తున్నారు. రైతుల నిరసనలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త వ్యూహం అమలు చేస్తోంది. రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదని ఎల్లోమీడియాలో ప్రచారం చేయించారు. కాని అదే సమావేశంలో ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పాటుకు తీర్మానించారు. ఆ కంపెనీ విమానాశ్రయం, ఎన్టీఆర్ విగ్రహం, స్పోర్ట్స్ సిటీ వంటివి చేపడుతుందని చెబుతున్నారు. పైగా వీటి నిర్మాణ పనులు నేరుగా కాంట్రాక్టర్లకే భూములు కేటాయించి అప్పగిస్తారట. ఆ కాంట్రాక్టర్లు భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకుని వాటిని కడితే యూజర్ ఫీజుల రూపంలో ప్రజలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నష్టమొస్తే వయబిలిటి గ్యాప్ ఫండింగ్ పేరుతో ప్రభుత్వం మళ్లీ ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తుంది. ఈ ప్రత్యేక కంపెనీకి భూములు గతంలో ప్రతిపాదించిన ప్రకారం రెండో దశ గ్రామాల నుంచే రావాలి. ఆ రకంగా 44 వేల ఎకరాల భూమి తీసుకుంటారని నేరుగా కాకుండా ప్రాజెక్టుల మిష పెడుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు చేసి, రైతులకు న్యాయం చేయకపోతే అమరావతిలోనే తీవ్ర నిరసన ఎదుర్కోక తప్పదు. కొందరు రైతులు ప్రభుత్వం తమను ఏ రకంగా వేధిస్తుందో ఇప్పటికే ఏడీబీ, ప్రపంచ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం గమనార్హం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాకి లెక్కలతోనే క్రాప్ బుకింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు సంబంధించి ప్రతి సీజన్లో అనుసరించే క్రాప్ బుకింగ్ (పంటల నమోదు) విధానం లోపభూయిష్టంగా మారిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతిలో, జియో ట్యాగింగ్ ద్వారా పంటలు నమోదు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రకటించినప్పటికీ..ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. క్రాప్ బుకింగ్తో పాటు వివిధ పంటలకు ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు సెక్టార్ల వారీగా నియమించిన వ్యవ సాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ఇచ్చే నివేదికల పైనే ప్రభుత్వం ఆధారపడుతోంది.రైతు పంటలు వేసినప్పుడే ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారనే వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి పంపిస్తే, కచ్చితమైన సాగు విస్తీర్ణం, సాగైన పంటల వివరాలు తెలుస్తాయి. తదనుగుణంగా ఎరువుల పంపిణీ, మద్దతు ధరకు కొనుగోళ్లు, అందుకయ్యే నిధులు సమకూర్చుకోవడం వంటి ప్రక్రియ సజావుగా జరిగే వీలుంటుంది. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. క్రాప్ బుకింగ్ అంతా కాకి లెక్కలతో సరిపెడుతున్నారని, ఎరువుల పంపిణీ మొదలుకొని పంటల సేకరణ వరకు అంతా లోపభూయిష్టంగానే సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ సీజన్లో 60శాతం మించని క్రాప్ బుకింగ్రాష్ట్రంలో ఖరీఫ్ (వానాకాలం) సీజన్ గత నెల 30వ తారీఖుతో పూర్తయింది. ఆనాటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133.25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయినట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. ఇవి కాకుండా ఎర్ర మిర్చి, పసుపు 1.34 లక్షల ఎకరాల్లో సాగయినట్లు చెపుతున్నారు. అయితే అధికారికంగా పంటల నమోదు మాత్రం సెప్టెంబర్ 30 నాటికి 70 లక్షల ఎకరాల (53 శాతం) మేరకే పూర్తయింది. సెప్టెంబర్ 30 నుంచి ఈనెల 7 వరకు వారం రోజుల్లో మరో ఏడు శాతం క్రాప్ బుకింగ్ అయిందనుకున్నా, 60 శాతం మించలేదు. ఒకవైపు వరి కోతలు ప్రారంభం కాగా, మరోవైపు పత్తి ఏరడం కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు వరి క్రాప్ బుకింగ్ 53 శాతం, పత్తి పంట నమోదు 57 శాతం మాత్రమే పూర్తయింది.చేతులు దులుపుకొంటున్నారా?ఒక గ్రామంలో ఒక ఖరీఫ్ సీజన్లో సాగైన పంటల విస్తీ ర్ణం ఆధారంగా మరుసటి సంవత్సరం పంట నమోదును కొంత అటు ఇటుగా నమోదు చేస్తున్నారనే విమర్శలు వ్యవసాయ శాఖలోనే ఉన్నా యి. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూరియా కొరత అత్యంత తీవ్ర రూపం దాల్చడానికి సరైన క్రాప్ బుకింగ్ డేటా లేకపోవడమే కారణమ నే అభి ప్రాయం వ్యక్తమైంది. రైతులు పంటలు సాగు చేసి నప్పుడే ఆయా పంటలను కచ్చితమైన విస్తీర్ణంతో నమోదు చేస్తే, ఏ గ్రామానికి ఏ పంటలకు ఎంత యూరియా, ఇతర ఎరువులు అవ సరమవుతాయనే అంచనాలకు అవకాశం ఉంటుంది. కానీ అది జర గడం లేదు. అలాగే వరి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.పత్తి, జొన్నలు విక్రయించే సమయాల్లో వేసే లెక్కలకు పొంతన ఉండడం లేదు. పంటల నమోదు ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో ఉంటే ఈ పరిణామాలు ఉత్పన్నం కావని వ్యవసాయ, మార్కెటింగ్అధికారులు చెపుతున్నారు. వ్యవ సా య విస్తరణాధికారులకు జిల్లా, మండల స్థాయిలో చేయాల్సిన వ్యవసాయ పనులు అప్పగించడం వల్ల పంట నమోదు కాకుండా ఇతర పనులపైనే ఎక్కు వ సమయం గడిపే పరిస్థితి ఉందంటున్నారు. ఈ కారణంగానే గత ఏడాది అదే సీజన్లో నమోదు చేసిన పంటలకు కొంత ఎక్కువ, తక్కు వగా నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. -
యంత్రం సాగుకు తంత్రం
యంత్రం.. సాగుకు తంత్రం అన్న విషయాన్ని ఉమ్మడి శామీర్పేట రైతులు గుర్తించారు. దీంతో వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మేలైన దిగుబడులను రాబడుతున్నారు. ఎకరాకు గంటల సమయం పట్టే మందుల పిచికారీకి డ్రోన్ల సాయంతో కేవలం పది నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. దుక్కుల నుంచి మొదలు కోతల వరకూ అన్ని రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వరి నాట్లకు రైస్ ట్రాన్స్ ప్లాంటర్, డ్రమ్ సీడర్, మందు పిచికారీకి డ్రోన్లు, స్ప్రేయర్లు వంటివి వినియోగిస్తున్నారు. – శామీర్పేట ఉమ్మడిశామీర్పేట మండలంలో రైతులు వరి, మొక్కజొన్న పంటలతోపాటు కూరగాయల సాగు పెరిగింది. అధిక వర్షాలకు పంట రంగు మారుతుండడంతో మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. అయితే కూలీల కొరత, పెరిగిన పెట్టుబడులతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో కొంత మంది రైతులు డ్రోన్ల సహాయంతో పంటలకు మందులు పిచికారీ చేయిస్తున్నారు. కొంత మంది డ్రోన్లు అద్దెకు నడుపుతున్నారు. డ్రోన్లు ఎకరా పంటకు కేవలం పది నిమిషాల్లో పిచికారీ చేస్తున్నాయి. చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!నేరుగా మొక్కలపై మందులను పిచికారీ చేయడంతో మందులు కూడా వృథా కావడం లేదు. ఇద్దరు, ముగ్గురు కూలీలు చేసే పని ఒక్క డ్రోన్ చేస్తుంది. దీంతో ఇటు సమయం.. ఆటు డబ్బు రెండూ ఆదా అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 10 నిమిషాలు.. డ్రోన్ సహాయంతో ఎకరా పంటకు 10 నిమిషాల్లో మందులు పిచికారి పూర్తవుతుంది. నేను నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నాను. దీనికి యూరియా స్ప్రే చేయించాలంటే ఇద్దరు కూలీలు ఒక రోజంతా కష్టపడాలి. డ్రోన్ సాయంతో నాలుగు ఎకరాలకు గంటలో పూర్తిచేశాం. ఎకరాకు డ్రోన్ అద్దె రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. – సంజీవరెడ్డి, రైతు, అలియాబాద్ వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడింది. పొరుగు జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీలపై అధారపడాల్సి వస్తోంది. డ్రోన్ స్ప్రే ద్వారా ఎకరాకు 10 నిమిషాల్లో పూర్తవుతుంది. సమయం ఆదాతో పాటు కూలీల సమస్య తీరుతుంది. డ్రోన్ అద్దెకు తీసుకోవడంతో ఖర్చులు తగ్గుతాయి. – రమేష్ వ్యవసాయ అధికారి, శామీర్పేట -
ఎరువుల కోసం టీడీపీ నేత ఇంటి వద్ద క్యూ
రైతులు క్యూ కట్టడం చూసి ఇదేదో ఎరువుల దుకాణం అనుకునేరు... కాదు.. సాక్షాత్తూ టీడీపీ నేత ఇల్లు. విషయమేమంటే... శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయాల్సిన ఎరువులను తన వారికి ఇచ్చేందుకు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నాయకుడు ఎం. శ్రీనివాసరావు ఇంట్లో పెట్టుకుని, తనకు అనుకూలంగా ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి మరీ పంపిణీ చేశారు.వాటిపై ఆ శ్రీనివాసరావు సంతకం కూడా ఉంది. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది. పార్టీ పరంగా ఇంటికి పిలిపించుకుని అనుకూలమైన వారికి టోకెన్లు ఇవ్వడమేంటని కొందరు టీడీపీ నేతలను నిలదీశారు. ఈ విషయమై వ్యవసాయాధికారి నవీన్ను సంప్రదించగా కల్లేపల్లికి 333 బస్తాల ఎరువులు పంపామని, తమ సిబ్బంది సమక్షంలోనే అందించామంటూ బుకాయించారు. – శ్రీకాకుళం రూరల్ -
ఆఫ్రికా నత్తల నియంత్రణ అంత సులువు కాదు!
ప్రకృతిలో పుట్టిన ప్రాంతం దాటి ఇతర ప్రాంతాలకు చేరినప్పుడు తామర తంపరగా పెరుగుతూ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించే జాతులను ఇన్వాసివ్ స్పెసీస్ (దురాక్రమణ జాతులు) అంటారు. మొక్కలు, జీవులు ఈ జాబితాలో ఉంటాయి. స్వతహాగా పుట్టి పెరిగే వాతావరణ పరిస్థితుల్లో అవి సమస్యగా ఉండవు. అక్కడి నుంచి ఏదో ఒక విధంగా వేరే వాతావరణ పరిస్థితులున్న దేశాల్లోకి ప్రవేశించినప్పుడు అవి తమ సంతతిని తామర తంపరగా పెంపొందించుకుంటూ సమస్యాత్మకంగా మారతాయి. స్థానికంగా పంటలను ఆరగించేస్తూ.. రైతులను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తుంటాయి. సర్కారు తుమ్మ, వయ్యారిభామ అలాంటివే. ఈ జాబితాలో తాజాగా చేరింది ‘జెయింట్ ఆఫ్రికన్ నత్త’. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని చోట్ల కూరగాయలు, పండ్ల తోటల్లో కుప్పలు తెప్పలుగా ఆఫ్రికా నత్తలు తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ పంటలను విధ్వంసకరంగా తినేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) శాస్త్రవేత్తలు డాక్టర్ పి.శక్తివేల్, డాక్టర్ ఎ. మరియదాస్, డాక్టర్ సి. ఆలిస్ ఆర్ పి సుజీత ఆఫ్రికా నత్తల బెడద నుంచి పంటలను, తోటలను కాపాడుకునే పద్ధతులను సూచిస్తున్నారు. ‘సాక్షి సాగుబడి’ కోసం వారు అందించిన వివరాలతో ప్రత్యేక కథనం.మన దేశంలో దాదాపు 1,500 రకాల నత్తలున్నాయి. వాటిలో తొమ్మిది జాతుల నత్తలు పూలు, కూరగాయలు, పండ్ల తోటలకు హాని కలిగిస్తున్నాయి. హెలిక్స్ అనే సాధారణ నత్త హిమాచల్ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది. అచటినా ఫులికా అనే జెయింట్ ఆఫ్రికన్ నత్త కూడా ఇప్పుడు తోడైంది. ఇది ఇప్పటికే మన దేశంలోని అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ కొన్ని చోట్ల పండ్ల తోటలు, కూరగాయ తోటల్లో తామర తంపరగా విస్తరిస్తూ పెద్ద సమస్యగా మారింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) దీన్ని ‘అత్యంత దురాక్రమణ గుణం కలిగిన వంద జాతు’ల్లో ఒకటిగా గుర్తించింది. నత్తల సమగ్ర నిర్వహణ మార్గాలివి:→ తోటను శుభ్రంగా ఉంచండి. కలుపు మొక్కలను తొలగించండి. నత్తలు లోపలికి రాకుండా తోట చుట్టూ మొక్కల్లేకుండా ఖాళీగా ఉంచండి. → తోటలు/పొలాల్లోకి నత్తలు రాకుండా ఉండాలంటే చుట్టూతా ఉప్పు, సున్నపు పొడి లేదా కాపర్ సల్ఫేట్ చల్లితే చాలు. ఈ పదార్థాలను దాటి నత్తలు వెళ్లలేవు. → ఉప్పు నత్తలను నిర్జలీకరణం చేసి, చంపుతుంది. కాపర్ సల్ఫేట్ విషపూరితమైన రసాయనం కాబట్టి అవరోధంగా పనిచేస్తుంది. వీటిని చల్లిన ప్రాంతాల్లో నత్తల సంఖ్య వేగంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నత్తలు తోటల్లోకి ప్రవేశించకుండా లేదా మొక్కల కాండాలపైకి పాకకుండా నిరోధించడానికి నమ్మదగిన పద్ధతి ఇది. → ప్లాస్టిక్ పాత్రలో కొద్దిగా బీరు, వైన్ లేదా ఈస్ట్లను పోసి.. ఆ పాత్ర అంచు నేలతో సమానంగా ఉండేలా, పాతిపెట్టాలి. నత్తలు పాక్కుంటూ వచ్చి అందులో పడతాయి. అప్పుడు ఉప్పు వేస్తే, చనిపోతాయి. → నత్తలను ఆకర్షించడానికి కుండలు, బాక్సులు లేదా తడి సంచుల కింద నత్తలు లోపలికి వెళ్లే అంత ఖాళీ ఉండేలా రాళ్లు అమర్చి, వాటి లోపల క్యాబేజీ ఆకులు లేదా బొప్పాయి కాండాలను ఎరగా పెట్టి, రాత్రంతా అలా ఉంచాలి. ఉదయానికి నత్తలు వాటి కింద చేరతాయి. వాటిపై ఉప్పు చల్లితే చనిపోతాయి. లేదా వాటిని నలిపివేసి చంపండి. → పండ్ల చెట్లు, కూరగాయ మొక్కల కాండాలకు ఎగబాకకుండా ఉండాలంటే.. వాటి చుట్టూ ఒక వలయంలో కొద్దిగా సూపర్ ఫాస్ఫేట్ ఎరువును చల్లండి. → నత్తలు మొక్కలు, చెట్ల పైకి ఎక్కకుండా ఆపటానికి చెట్ల కాండాలకు సన్నని రాగి లేదా జింక్ రేకు (సుమారు 0.8 మిమీ మందం) చుట్టండి. → నత్తలున్న తోటల్లో 3 శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం (అంటే.. 400 లీటర్ల నీటిలో 12 కిలోల కాపర్ సల్ఫేట్ కలిపి హెక్టారుకు) పిచికారీ చేయండి. → కంచెలు/ప్రహరీలు, నత్తలు గుడ్లు పెట్టిన ప్రాంతాల్లో ఒక లీటరు నీటిలో కాపర్ సల్ఫేట్ (60 గ్రా.), పొగాకు(25 గ్రా.) రసం కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా నత్తల ముప్పును నియంత్రించవచ్చు. → పొగాకు మిశ్రమాన్ని తయారు చేసే పద్ధతి: 50 గ్రాముల పొగాకును 1.5 లీటర్ల నీటిలో వేసి మరిగించండి. ద్రావణం 1 లీటరుకు తగ్గే వరకు మరిగించండి. అందులో, 1 లీటరు నీటిలో 60 గ్రాముల కాపర్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని కలపండి. ఆ ద్రావణాన్ని నత్తలున్న చోట పిచికారీ చేయండి. → ప్రభుత్వం ప్రచారోద్యమం చేపట్టి సమగ్ర చర్యల ద్వారా నత్తల సమస్యను నియంత్రించవచ్చు. మొక్కలు/చెట్లపై ఉండే నత్తలను ప్రజల సహకారంతో చేతులతో తీసివేయించటం, బాతులతో నత్తలను తినిపించటం వంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఆఫ్రికా నత్తల సంతతి వ్యాప్తిని నియంత్రించడానికి అవకాశం ఉంది.నత్తలన్నీ గుడ్లు పెడతాయి!జెయింట్ ఆఫ్రికన్ జాతికి చెందిన నత్తలన్నిటిలో మగ, ఆడ జననాంగాలుంటాయి. కాబట్టి ఆడ, మగ కూడా గుడ్లు పెడతాయి. సాధారణంగా శరద్ రుతువు, శీతాకాలంలో వాతావరణం తేమగా ఉన్నప్పుడు జతకూడి తడి నేలలో గుండ్రని తెల్ల గుడ్లు పెడతాయి. తడి వాతావరణంలో గుడ్లు రెండు నుంచి నాలుగు వారాల్లో పిల్లలు పుడతాయి. పిల్ల నత్తలు ఒక సంవత్సరం తర్వాత గుడ్లు పెట్టటం ప్రారంభిస్తాయి. నత్త మూడు నుంచి ఐదేళ్లు జీవిస్తుంది. జెయింట్ ఆఫ్రికన్ నత్త సంవత్సరానికి ఒకసారి 50–200 గుడ్లు పెడుతుంది. దాని జీవితకాలంలో వెయ్యి వరకు గుడ్లు పెడుతుంది.నత్తల ద్రావణంతో పంటలకు మేలు!నత్తలు పంటలకు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఈ నత్తలతో పంటల పెరుగుదలను వేగవంతం చేసే ద్రావణం(గ్రోత్ పమోటర్) తయారు చేసుకొని పంటలపై పిచికారీ చేయటం ద్వారా రైతులు ప్రయోజనం పొందవచ్చని కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. నత్తల ద్రావణం తయారు చేసే పద్ధతి: అవసరం ఉన్నన్ని నత్తలను ఒక డ్రమ్ములో వేసుకొని, అవి మునిగిన తర్వాత 2 అంగుళాల పై వరకు నిమ్మరసం పొయ్యాలి. 15 రోజులు ఊరబెట్టాలి. అప్పటికి నత్తలు కోడిగుడ్ల మాదిరిగానే పూర్తిగా ద్రావణంలో కరిగిపోతాయి. వడగట్టిన ద్రావణానికి సమాన తూకంలో బెల్లం కలిని 7 రోజులు వూరబెట్టండి. నత్తల ద్రావణం అర లీటరును 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో ఏ పంటల కైనా పిచికారీ చెయ్యొచ్చు. నత్తల సమస్య తీరిపోతుంది. పంట బలంగా పెరిగి రైతుకు డబ్బులు వస్తాయని ఆయన సూచించారు. -
మొండి కోతులకు ముకుతాడు.. డమ్మీ చింపాజీలతో చెక్..
-
బోనస్ బకాయి రూ.1,159.64 కోట్లు
సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ఈ వానాకాలం సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నాం. అందులో 40 నుంచి 45 ఎల్ఎంటీ సన్నరకాలే. వీరందరికీ బోనస్ ఇస్తాం. – మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క సీజన్కే పరిమితమైంది. గత (2024– 25) వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండించిన సుమారు నాలుగున్నర లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల వరకు చెల్లించింది. యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్ ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా ప్రాంత రైతులు ఏకంగా పోరుబాట పట్టారు. బోనస్ చెల్లించకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులంతా మూకుమ్మడగా పోటీ చేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో సైతం రైతులు యాసంగి బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్ కోతల ప్రక్రియ ప్రారంభమైనా గత యాసంగి బోనస్ను విడుదల చేయకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రావలసిన బోనస్ రూ.1,159.64 కోట్లు యాసంగి సీజన్లో 74.22 ఎల్ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో దొడ్డురకం ధాన్యం 51.03 ఎల్ఎంటీ కాగా, సన్న ధాన్యం 23.19 ఎల్ఎంటీ. ఈ మొత్తం ధాన్యానికి రూ.17,198.58 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించింది. సన్నధాన్యం పండించిన 4,09,031 రైతులకు 1,159.64 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి మూడు నెలలు దాటినా బోనస్ విడుదల చేయలేదు. బోనస్ కోసం పోరుబాట పట్టిన మక్తల్ రైతులను మంత్రి వాకిటి శ్రీహరి సముదాయించే ప్రయత్నం చేశారే తప్ప బోనస్పై హామీ ఇవ్వలేదు. ఇటీవల పదవీ విరమణ చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సైతం బోనస్ అంశాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వారం క్రితం మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున రైతులు యాసంగిలో కూడా సన్నాలు సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల ఎల్ఎంటీ ధాన్యాన్ని సేకరిస్తే, అందులో 7.15 లక్షల ఎల్ఎంటీ సన్నాలే ఉన్నాయి. నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. ప్రస్తుత వానకాలం సీజన్లో సాగు చేసిన 67.33 లక్షల ఎకరాల్లో 60 శాతానికి పైగా సన్నధాన్యమే పండించినట్లు లెక్కలు చెపుతున్నాయి. ఈసారి కొనుగోలు కేంద్రాలకు 80 ఎల్ఎంటీ ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇందులో 40 నుంచి 45 ఎల్ఎంటీ సన్నధాన్యం మార్కెట్కు వస్తుందని భావిస్తున్నారు. ఈ మొత్తానికి బోనస్ క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తే రూ.2,200 కోట్లు అవుతుంది. ఇప్పటికే ఉన్న బాకాయి 1,159.64 కోట్లు కలిపితే దాదాపు రూ.3,400 కోట్ల వరకు బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. నాకు రూ.5.60 లక్షల బోనస్ రావాలి నాకు ఉన్న 5 ఎకరాల పొలంతోపాటు కొంత కౌలుకు తీసుకొని రబీలో వరి సాగు చేశాను. 2,800 బస్తాలు పండించాను. మొత్తం 1,120 క్వింటాళ్ల ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. రూ.5.60 లక్షల బోనస్ రావాల్సి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. – వాడ్వాట్ తిమ్మన్న, రైతు, గుడే బల్లూరు గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానన్న బోనస్ డబ్బులు ఇవ్వక పోవడంతో బాధిత రైతులమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఎన్నికల్లో జెడ్పీటీసీకి రైతులందరం రాజకీయాలకు ఆంతీతంగా పోటీ చేయాలని నిర్ణయించాం. – చెవిటోళ్ల వెంకటేష్, రైతు, గుడే బల్లూరు గ్రామం -
Kakani: నీ పాలనలో రైతుల పరిస్థితి ఇది చంద్రబాబు..
-
ఇక పంట విక్రయాల్లో దళారులకు నో చాన్స్
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అక్రమ పద్ధతుల్లో కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించే దళారులకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెడుతోంది. పండించిన రైతు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను విక్రయించుకునేలా చర్యలు చేపట్టింది. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీ ఇచ్చేలా రూపొందించిన ‘పీఎమ్–ఆశా’పథకం కింద ధర మద్దతు పథకం (పీఎస్ఎస్), మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఐఎస్) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని పెట్టుబడి, మద్దతు ధర విభాగం నుంచి ఈనెల 18న ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇవి అమల్లోకి వచ్చేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్రమాలకు చెక్ పెట్టేందుకే...బహిరంగ మార్కెట్లో ధర లేనప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేసే విధానం కొంతకాలంగా దేశంలో అమలవుతోంది. అయితే దీనిని దళారులు దుర్వినియోగం చేస్తున్నారు. » వరి, పత్తి కందులు, మొక్కజొన్న, పెసర, జొన్నలు, మినుములు మొదలైన పలు రకాల పంటలకు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. » ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎఫ్సీఐ సేకరిస్తుండగా, పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేస్తుంది. ఇవి కాకుండా పెసలు, సోయా బీన్, మినుములు వంటి పంటలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ కొనుగోలు చేస్తాయి. » కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ జొన్నలు, మక్కలు మొదలైన పంటలను రైతుల నుంచి సేకరిస్తుంది. అయితే ఇక్కడే అక్రమాలకు తెర లేస్తోంది. పంట నాణ్యత లేదని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారులు, ప్రైవేటు వ్యాపారులు తిరిగి ఆ పంటనే మార్క్ఫెడ్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్, సీసీఐ వంటి సంస్థలతో కుమ్మక్కై రైతుల పేరిట మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. » గత సంవత్సరం పత్తి పంటకు సంబంధించి ఇలాంటి అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ద్వారా ధ్రువీకరించి, కేంద్రానికి పంపించింది. » గతంలో మార్క్ఫెడ్ ద్వారా జరిగిన జొన్నల కొనుగోళ్లలో కూడా దళారులే రైతుల పేరిట విక్రయాలు జరిపినట్టు రుజువైంది.» దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు చెక్ పెడుతూ రైతులే లబ్ధిదారులుగా ఉండేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది. రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ...ధర మద్దతు పథకం (పీఎస్ఎస్) ప్రత్యేక పోర్టల్లో రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కూడా రైతు డేటాను కేంద్రం సేకరిస్తుంది. » రాష్ట్ర పోర్టల్లో రైతులు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి. డీసీఎస్/అగ్రి–స్టాక్ ఇంటిగ్రేషన్ ద్వారా పంట వివరాలు ధ్రువీకరించాలి. లేనిచోట పాత పద్ధతిలోనే వెరిఫికేషన్ చేపడతారు.» రైతు ఆధార్, పట్టాదార్పాస్ పుస్తకంతో పాటు క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా రైతు ఏ పంట వేశారనే అంశాలను వ్యవసాయ శాఖ నుంచి సేకరించి, పంటలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నాఫెడ్, ఎన్సీసీఎఫ్ వంటి కేంద్ర నోడల్ ఏజెన్సీలతో రైతుల డేటాను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. » డిజిటల్ క్రాప్ సర్వే, అగ్రి–స్టాక్ డేటాతో ఆటో వెరిఫికేషన్ తప్పనిసరి. » ఒకవేళ రైతులు తమ పంటలను విక్రయించడానికి నేరుగా రాని పక్షంలో తన ఆధార్ నంబర్తో గరిష్టంగా ముగ్గురికి ఆథరైజేషన్ ఇచ్చి పంటల విక్రయానికి పంపించే అవకాశం ఉంటుంది. రైతు హాజరు కాకపోతే, అతడి అధీకృత ప్రతినిధి ఉత్పత్తిని కొనుగోలు కేంద్రానికి తెచ్చే వీలు ఉంటుంది. చెల్లింపు మాత్రం నేరుగా రైతు (యజమాని) బ్యాంక్ ఖాతాకు మాత్రమే వెళుతుంది. » ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ లేదా మొబైల్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు తప్పనిసరి. ఓటీపీ ద్వారా ధ్రువీకరణకు అనుమతి ఉండదు. తద్వారా రైతుల పేరిట దళారులు పంటలను బల్క్గా విక్రయించే అవకాశం ఉండదు.» రైతులకు చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ఆధార్ వెరిఫైడ్ ఖాతాల్లోనే జరుగుతాయి. ఆధార్ చట్టం 2016 సెక్షన్ 7 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి, ఈనెల 30లోపు రాష్ట్రాలు దీనిని కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. » నిజమైన రైతులకే మద్దతు ధర ప్రయోజనం చేరేలా చూడటం, మధ్యవర్తుల జోక్యం తగ్గించడంతోపాటు కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడం ఈ మార్గదర్శకాల ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఆ వ్యాఖ్యలతో ఏపీ అన్నపూర్ణ బ్రాండ్ ఇమేజ్కు గట్టి దెబ్బ!
రాష్ట్రం పరువు పోవాలని ఏ ముఖ్యమంత్రైనా కోరుకుంటాడా? రైతుల ప్రతిష్ట దెబ్బతినాలని ఆకాంక్షిస్తాడా? మిగిలిన రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఈ రెండు కాంక్షిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు చిత్ర, విచిత్రమైన ప్రకటనలతో ప్రజలను తరచూ గందరగోళంలోకి నెట్టేసే చంద్రబాబు నాయుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రైతులు పండించే ధాన్యం తినేందుకు, ఎగుమతి చేసేందుకూ పనికి రాదని తేల్చేశారు. ఇందుకు ఆధారాలున్నాయా? లేదా? అన్నది వేరు సంగతి కానీ.. ఇలా చెబితే రైతులకు అన్యాయం జరగదా? అన్న ఆలోచన కూడా చేయలేకపోయారు ఘనత వహించిన సీఎంగారు. ఎగుమతులకు పనికి రాదని సీఎం స్వయంగా అంటే.. కొనుగోళ్లకు ఏ దేశం ముందుకొస్తుంది?. ఇలా మాట్లాడటం ద్వారా సీఎం ఇక్కడి ధాన్యాన్ని విస్తృతంగా వాడే రాష్ట్ర ప్రజలందరిలో అనుమానాన్ని సృష్టించినట్లు అవ్వదా!. దీంతో ఈ ఆరోపణ కూడా తిరుమల ప్రసాదంలో కల్తీ చందంగా అనుచితమైపోయిందని తేలుతోంది. కోనసీమలో వరి సాగు సమస్యలపై కొన్నేళ్ల క్రితం క్రాప్ హాలిడే ప్రకటిస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి వరి వేయడం మంచిది కాదని చెబుతున్నారు. పైగా అధిక యూరియాతో పండించిన పంటలు తినడం వల్ల కేన్సర్ వస్తుందని అంటున్నారు. ఎంత బాధ్యతారహిత ప్రకటన ఇది!!.ఎరువుల విచ్చలవిడి వాడకం సరికాదనడం వేరు కేన్సర్ వస్తుందనడం వేరు. ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పేరుంది. దశాబ్దాలుగా వరి సాగు జరుగుతోంది. ఒకపక్క రికార్డు స్థాయి వది దిగుబడులపై పొరుగున ఉన్న తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబరంగా చెప్పుకుంటూంటే... మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేశామని సంబరంగా చెబుతూంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తి నిరుత్సాహకరమైన వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలోనూ యూరియా కొరత(Urea Crisis In Telangana) వచ్చింది కానీ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కేంద్ర స్థాయిలో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారు. అవసరానికి తగినంత రాకపోయి ఉండవచ్చు. అది వేరు సంగతి. అంతమాత్రాన తెలంగాణలో ఎవరూ వరి వేయద్దని అనలేదు. కేన్సర్ బూచిని చూపలేదు. ఏపీలో యూరియా కొరత(AP Urea Crisis) సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన వరదరాజులరెడ్డి స్వయంగా శాసనసభలో యూరియా కొరతపై మాట్లాడారు. ఒకదశలో అసలు యూరియా కొరత లేదని చంద్రబాబు సోషల్ మీడియాపైన, వైసీపీపైనా మండిపడ్డారు. ఆ తర్వాత కలెక్టర్ల సమావేశంలో పంపిణీలో విఫలం అయ్యామని, వచ్చేసారి రైతుల ఇళ్లవద్దకే సరఫరా చేస్తామని, తాజాగా పొలాల వద్దే అందచేస్తామని అంటున్నారు. కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పటికీ, అవసరమైన మేర యూరియాను తెప్పించుకోలేకో, వచ్చిన యూరియాను క్రమబద్దంగా పంపిణీ చేయలేకో, బ్లాక్ మార్కెట్ను, టీడీపీ నేతల దందాను అరికట్టలేకో తెలియదు కాని, మొత్తం నెపాన్ని రైతులపై నెట్టే యత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పిఠాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న యూరియా లారీలను పోలీసులు పట్టుకున్నారు. అదను దాటిపోతున్నా యూరియా అవసరమైన మేర అందడం లేదని రైతులు వాపోతున్న దృశ్యాలు పలు చోట్ల కనిపిస్తున్నాయి. ఈ దశలో ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన ముఖ్యమంత్రి అసలు మన వరి పంటపైనే తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అత్యంత శోచనీయం. మనం పండిస్తున్న వరి మద్యం తయారీకి తప్ప దేనికి పనికి రాదని అన్నారు. ఇప్పుడు జనం అంతా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న బియ్యాన్ని వాడుతున్నారా? రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం ఏపీలో పండిందా? కాదా? నిజంగానే అది తినడానికి యోగ్యమైనది కాకపోతే ఎందుకు పంపిణీ చేస్తున్నారు? ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడే దృష్టి మరల్చే వ్యూహాలు అమలు చేస్తూంటుంది. దానికి కూడా హద్దు ఉంటుంది. మొత్తం రాష్ట్రం పరువు ,ఇమేజీ పోయే విధంగా ఉండరాదు. యూరియా కొరత ఏర్పడినప్పుడే కేన్సర్ సమస్య గుర్తుకు వచ్చిందా? ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పాలి? ఆ ఎరువు వాడకం తగ్గించాలని సీజన్ కు కనీసం ఆరు నెలల ముందు చెప్పాలి కదా? అంతా వరి వేసేసిన తర్వాత అది వద్దని, అది తినడానికి పనికి రాదని అంటే రైతులు ఏమి చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నుందుకు తమకు తగిన శాస్తి జరిగినట్లు రైతులు భావించరా? కొన్ని జిల్లాలలో మాత్రమే తప్పనిసరి పరిస్థితిలో వరిని రెండు పంటలుగా వేస్తారు. మిగిలిన చోట్ల రెండో పంటగా అపరాలు వేస్తారు. వరి వద్దని ఉద్యాన పంటలు వేయాలని చెబితే అది ఇప్పటికిప్పుడు అవుతుందా? పైగా ఇప్పుడు ఉద్యాన పంటల వారు ఎన్ని బాధలు పడుతున్నారో చూడడం లేదా? మామిడి, బొప్పాయి తదితర రైతులు గిట్టుబాటు ధరలు లేక ఎన్ని పాట్లు పడుతున్నారు! పోనీ మెట్ట పంటలు వేద్దామనుకుంటే మిర్చి, పొగాకు వంటి పంటలకు ధర లేక ఎంత ఆందోళన జరిగింది. మాజీ సీఎం జగన్ ఆయా పంటల రైతుల వద్దకు వెళ్లేవరకు ప్రభుత్వంలో చలనం కనిపించిందా?. ఉల్లి, టమోటా రైతులు పడుతున్న పాట్ల మాటేమిటి?. అమరావతికి లక్షల కోట్లు అప్పులు చేసి ఖర్చు చేసే ప్రభుత్వం రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు మూడు, నాలుగువేల కోట్లు వెచ్చించ లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దానికి బదులు ఇవ్వడం లేదు. ఆయా పంటలు ఎంత సాగు అవుతాయన్న దానిపై వ్యవసాయ శాఖకు అంచనాలు, లెక్కలు ఉంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని ,నిజంగానే ఆ పంటల వల్ల రైతులకు లాభం రాదనుకుంటే ప్రత్యామ్నాయాలతో సహా ప్రభుత్వం సాగు సీజన్కు కొన్ని నెలల ముందు సూచనలు చేయాలి కదా!. అవేమీ చేయకుండా, ఇప్పటికిప్పుడు వరికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రైతులకు అన్యాయం చేయడం అవుతుంది.వరి పంట కొనుగోలుకు కూడా సమస్య వస్తుందని ఇప్పుడే చంద్రబాబు చెబుతున్నారంటే, రైతులకు ధాన్యం అమ్మకాలలో మున్ముందు ఎన్ని కష్టాలు వస్తాయో ఊహించుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు వాటిని ఎంతవరకు నెరవేర్చారు. 2014 టరమ్లో రైతుల రుణాలన్నిటిని మాఫీ చేస్తామని ఊదరగొట్టి, తీరా ప్రభుత్వం వచ్చాక ఆరో వంతు రుణాలు కూడా మాఫీ చేయలేదు.ఈసారి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద రైతుకు ఇస్తామని చెప్పి ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది రూ.ఐదువేలు మాత్రం ఇచ్చారు. అయినా రైతులకు ఏదో చాలా చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు.రైతులకు ఇవ్వవలసిన ఇన్ పుట్ సబ్సిడీ. బీమా సదుపాయం తదితర అంశాలలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏమి చేసిందో తెలియదు. జగన్ తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే ఎంతో గొప్ప వ్యవసాయదారులు ఉన్న రాష్ట్రంగా పేరొందిన ఏపీ రైతుల ప్రతిష్ట దెబ్బతినేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడే మాట్లాడడం దారుణం అని చెప్పక తప్పదు. ఇది ఒక రకంగా ఏపీ బ్రాండ్ ఇమేజీని తనకుతానే దెబ్బతీయడం అని, వ్యవసాయాన్ని విధ్వంసం చేయడమేనని నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలతో ఏకీభవించకతప్పదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: బిల్డప్ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు! -
తప్పని యూరియా కష్టాలు
-
చంద్రబాబూ.. మా భూముల జోలికొస్తే ఖబడ్దార్
సాక్షి, అమరావతి: పారిశ్రామికీకరణ పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు చేపట్టిన ఆందోళనతో బుధవారం విజయవాడ దద్దరిల్లింది. ఆందోళన చేపట్టినవారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పలువురు నేతల్ని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలేశారు. చివరికి కొందరు ప్రతినిధులు అసెంబ్లీలో మంత్రిని కలిసేందుకు అనుమతించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మా భూముల జోలికొస్తే ఖబడ్దార్.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు. బలవంతంగా భూసేకరణ జరిపితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏపీ వ్యవసాయ కార్మిక, రైతుసంఘాలు ఇచ్చిన ‘చలో విజయవాడ’ పిలుపుతో అన్ని జిల్లాల నుంచి వచ్చిన రైతులు, వ్యవసాయ కార్మికులు తొలుత విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగారు. తమ గోడు వినేందుకు రెవెన్యూ మంత్రి లేదా ఉన్నతాధికారులు రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అక్కడి నుంచి ఛలో అసెంబ్లీ చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అప్సర హొటల్ జంక్షన్లో ఏలూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకి దిగారు. దాదాపు గంటసేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. అనంతరం రైతులు, వ్యవసాయ కార్మికులు ఛలో రాజ్భవన్ అంటూ గవర్నర్ బంగ్లా వైపు ర్యాలీగా తరలివెళ్లారు. రాజ్భవన్ సమీపంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారికి, పోలీసులకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు ముఖ్యనేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల ఆందోళన మరింత తీవ్రతరం అవుతుండటంతో ఉన్నతాధికారులు స్పందించారు. కొద్దిమంది ప్రతినిధుల్ని అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం మంత్రిని కలిసిన నేతలు మాట్లాడుతూ రైతులతో పాటు రైతుకూలీల అనుమతి లేకుండా భూములు తీసుకోబోమని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రివా.. రాజకీయ బ్రోకర్వా? ధర్నాచౌక్లో వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రం చంద్రబాబు జాగీరా అని ప్రశ్నించారు. కరేడులో 20 వేల ఎకరాలు, కుప్పంలో రెండువేల ఎకరాలు కావాలంటున్నారని చెప్పారు. కరేడులో ఐదువేల ఎకరాలు, కుప్పంలో 1,500 ఎకరాలు, అమరావతిలో 50 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకొన్నారని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా భూమి ఇచ్చేందుకు సిద్ధంగా లేడని చెప్పారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలకు 100 నుంచి 200 ఎకరాలున్నాయని, ఆ భూములు తీసుకుని ఏ ప్రాజెక్టు కావాలంటే ఆ ప్రాజెక్టు కట్టుకోవచ్చని చెప్పారు. చంద్రబాబూ నువ్వు ముఖ్యమంత్రివా.. రాజకీయ బ్రోకర్వా.. అదాని, అంబానీలకు గుమాస్తావా? అంటూ నిలదీశారు. కరేడులో ఎకరం కోటి రూపాయలైతే.. అప్పనంగా కాజేయాలని చూస్తున్నారన్నారు. వంద ఎకరాలు సరిపోయే ఇండోసోల్కు ఎనిమిదివేల ఎకరాలు కావాలనడం.. రియల్ ఎస్టేట్ కోసం కాదా? అని నిలదీశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికే 500 ఎకరాలు చాలని, అలాంటిది కుప్పం ఎయిర్పోర్టుకు రెండువేల ఎకరాలు కావాలా? అని ప్రశ్నించారు. మా పేదల జోలికి వస్తే ఖబడ్దార్ చంద్రబాబూ.. అంటూ హెచ్చరించారు. ఈ ఆందోళనలోఆయా సంఘాల రాష్ట్ర నేతలు వి.కృష్ణయ్య, బలరాం, హరిబాబు, దడాల సుబ్బారావు, కె.ప్రభాకర్రెడ్డి వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.పాల రైతు సంఘ నేతల అరెస్టు హేయం విశాఖ డైరీలో అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభ కమిటీ నివేదిక తక్షణమే ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న రైతులను అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని ఏపీ రైతు సంఘం అధ్యక్ష,ప్ర«దాన కార్యదర్శులు వీ.కృష్ణయ్య, కే.ప్రభాకరరెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు. -
హంద్రీనీవాలో ఉల్లి పారబోత
-
రైతులపై కానిస్టేబుల్ ఓవరాక్షన్
-
ఒక్కటే పంట..ఐదు ఆదాయాల పెట్టు!
చాలా రకాల పంటలు రైతుకు ఒకే ఆదాయాన్ని ఇస్తుంటాయి. కానీ, 5 రకాలుగా ఆదాయాన్నిచ్చే పంట ఒకటుంది. మరో విశేషం ఏమిటంటే...దీన్ని సాగు చెయ్యటానికి సారం కోల్పోయిన, కరువు ప్రాంతాల్లో బంజరైనా భేషుగ్గా పనికొస్తుంది. ఆ పంట పేరు ముళ్లు లేని బ్రహ్మజెముడు (స్పైన్లెస్ కాక్టస్). క్షీణించిన భూమిలో ‘5 ఎఫ్ మోడల్’ పంటగా కాక్టస్ను పండించడం అంటే.. ఎడారీకరణను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే రైతు కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించటం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిస్సారమైన కరువు ప్రాంత భూముల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఇంతకీ ‘5ఎఫ్ మోడల్’ పంట అంటే ఏమిటి?.. చదవండి...ముళ్లులేని బ్రహ్మజెముడు ఒకటే పంట.. 5 ప్రయోజనాలు చేకూర్చుతోంది. రైతులకు బహుళ ఉత్పాదనలు, బహుళ ఆదాయ మార్గాలను అందిస్తున్నది. ఆ ఐదు ‘ఎఫ్‘లు ఏవంటే.. ఫుడ్, ఫాడర్, ఫ్యూయల్, ఫర్టిలైజర్, ఫ్యాషన్! ఈ ఐదు ఆంగ్ల పదాలు ఎఫ్తో ప్రారంభం అవుతాయి కాబట్టి ‘5ఎఫ్ మోడల్ పంట’ అని దీనికి పేరొచ్చింది. ఆహారం, పశుల మేత, ఇంధనం, ఎరువులు, ఫ్యాషన్ రంగాల్లో ముళ్లులేని బ్రహ్మజెముడు పంట ఉపయోగపడుతోంది. ఆ విధంగా కరువును ΄పారదోలుతోంది!1. ఆహారం: దీని పండ్లను కాక్టస్ పియర్ (ఓపుంటియా ఫికస్–ఇండికా) అంటారు. ఈ పండ్లు తియ్యగా, జ్యూసీగా ఉంటాయి. తాజాగా తినవచ్చు లేదా జామ్లు, జ్యూస్లు, సిరప్లుగా ్ర΄ాసెస్ చేయవచ్చు. ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులను ముక్కలుగా కత్తిరించి కూర వండుకొని తీసుకుంటారు.2. పశువుల మేత: ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులను క్యాక్టస్ ప్యాడ్లు లేదా క్లాడోడ్లు అంటారు. ఇవి పశువులకు పచ్చి మేతగా ఉపయోగపడతాయి. నమ్మకమైన, తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల పచ్చి మేత. ముఖ్యంగా ఇతర రకాల మేతకు కొరత ఉన్న కరువు పీడిత ప్రాంతాల్లో ఇవి పశువులకు ప్రాణం నిలిపేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇందులో నీరు అధికపాళ్లలో ఉంటుంది.3. ఇంధనం: ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను (కాక్టస్ బయోమాస్ను) బయోగ్యాస్ ఉత్పత్తికి మూల వనరు (ఫీడ్ స్టాక్)గా ఉపయోగిస్తున్నారు. 10% ఆవు పేడతో 90% కాక్టస్ బయోమాస్ను ఉపయోగించడం వల్ల 65% వరకు మీథేన్ కంటెంట్తో బయోగ్యాస్ను ఉత్పత్తి చేయవచ్చని ఒక పైలట్ అధ్యయనం నిరూపించింది. ఈ గ్యాస్తో వంటకు, ఇతర ఉపయోగాలకు స్వచ్ఛమైన శక్తి వనరుగా పనికొస్తుంది.4. ఎరువులు: బయోగ్యాస్ ఉత్పత్తి తర్వాత మిగిలిపోయే పోషకాలతో కూడిన స్లర్రీని సేంద్రియ ఎరువుగా ఉపయోగించి నేలను సారవంతం చేసుకోవచ్చు. పంట ఉత్పాదకతను మెరుగుపరుచుకోవచ్చు. ఇది ఖరీదైన రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. పొలంలో పండే మొక్కల ఆకులతోనే ఎరువుగా వాడటం ద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థను సృష్టించుకోవచ్చు.5. ఫ్యాషన్: బూట్లు, బ్యాగులు, ఇతర ఉపకరణాల కోసం బయో–లెదర్ (మొక్కలకు సంబంధించిన తోలు) ఉత్పత్తి చేయడానికి ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను ఉపయోగించవచ్చని మన దేశంలోని భూ వనరుల శాఖ, ఇతర పరిశోధకులు నిరూపించారు. 3 కిలోల దీని ఆకుల ద్వారా 3 చదరపు అడుగుల కంటే ఎక్కువ బయో–లెదర్ను ఉత్పత్తి చేయగలదని ఒక పైలట్ అధ్యయనంలో తేలింది.ఎడారిగా మారిపోతున్న ప్రదేశాలు, కరువు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాల్లో భూములు నిస్సారమైపోయి ఉంటాయి. అయితే, అటువంటి కఠిన పరిస్థితుల్లో మనుగడ సాగించగలిగే జాతుల పంటలను గుర్తించి, పరిశోధనలు చేయటం.. ఆయా పంటలను సాగు చేయించటంలో తోడ్పాటునందించటం ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమం. ఇటువంటి పని చేస్తున్న ఒకానొక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐసీఏఆర్డీఏ. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ ద డ్రై ఏరియాస్. దీని ప్రధాన కార్యాలయం లెబనాన్లో ఏభయ్యేళ్లుగా పనిచేస్తోంది. దక్షిణాసియా, చైనాలకు కలిపి ప్రాంతీయ కార్యాలయాన్ని 2008లో న్యూఢిల్లీలో నెలకొల్పారు. ఐసీఏఆర్డీఏ మన దేశంలోకి 67 రకాల ముళ్లులేని బ్రహ్మజెముడు రకాలను ప్రవేశపెట్టి, భారతీయ సంస్థల సహకారంతో పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించింది. ఆ కృషి ఫలితంగానే దేశంలో రైతులకు ఇప్పుడు తమ జీవనోపాధిని పెంచుకునే, కరువును ఎదుర్కొనే ఆశాజనకమైన ముళ్లులేని బ్రహ్మజెముడు అనే కొత్త పంట అందుబాటులోకి వచ్చింది. ఐసీఏఆర్డీఏ ఇండియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లోని అమ్లహలో ఫుడ్ లెగ్యూమ్ రీసెర్చ్ ప్లాట్ఫామ్లో డాక్టర్ నేహా తివారీ పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. మన దేశంలో ఎడారీకరణను, కరువును ఎదుర్కొంటున్న ప్రాంతాల అభ్యున్నతికి ‘కాక్టి రాణి’గా ప్రసిద్ధి చెందిన ముళ్లులేని బ్రహ్మజెముడు ఎంత అవసరమో ఆమె ఒక ఇంటర్వ్యూలో చర్చించారు. ముఖ్యాంశాలు..ముళ్లులేని బ్రహ్మజెముడు పంటను సాగు చేయటానికి తగిన వ్యవసాయ పరిస్థితులు ఏమిటి?ముళ్లులేని బ్రహ్మజెముడు పంట తక్కువ తేమతో కూడిన వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఇసుక నేలలు, కంకర నేలలకు ఇది అనువైనది. ముళ్లులేని బ్రహ్మజెముడు నిస్సారమైన నేలల్లో స్థిరంగా పెరిగే పంట అయినప్పటికీ, ముఖ్యంగా దాని పెరుగుదల దశలో, దానికీ కొంత తేమ అవసరం. ముళ్లులేని బ్రహ్మజెముడు బాగా పెరగాలన్నా, పండ్ల కాపు రావాలన్నా ప్రతిరోజూ కనీసం ఆరు గంటల ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం. ఈ మొక్క ఉదజని సూచిక కొద్దిగా ఆమ్ల లేదా తటస్థంగా ఉన్న నేలలను ఇష్టపడుతుంది. సాధారణంగా 6.0 నుండి 7.5 వరకు పీహెచ్ ఉండాలి. మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. మన దేశంలోని మెట్ట ప్రాంతాలలో కఠినమైన వ్యవసాయ–వాతావరణ పరిస్థితులు ముళ్లులేని బ్రహ్మజెముడుకు అద్భుతమైన అనుకూలంగా ఉంటాయి. ఇతర పంటలేవీ పండించలేని ప్రదేశాలలో ఇది పెరుగుతుంది. వాస్తవానికి, ఐసీఏఆర్డీఏ భారతదేశంలో అరవై ఏడు కాక్టస్ రకాలను ప్రవేశపెట్టింది. ఈ రకాలను పెంచే మదర్ నర్సరీలు అమలహాలోని ఐసీఏఆర్, ఐసీఏఆర్డీఏ సంస్థల్లో ఏర్పాటయ్యాయి. ముళ్లులేని బ్రహ్మజెముడు పంట సాగును ప్రోత్సహించడానికి డిసెంబర్ 2023లో ఐసీఏఆర్డీఏ భారత ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.దేశంలో ముళ్లులేని బ్రహ్మజెముడు మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందిందా?చిన్న రైతులు స్థానికంగా ముళ్లులేని బ్రహ్మజెముడు పండ్ల కోసం, పశుగ్రాసం కోసం పండిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువే. మార్కెటింగ్ ప్రయత్నాలను మెరుగుపరచడానికి ఐసీఏఆర్డీఏ కేంద్ర భూ వనరుల శాఖతో కలిసి పనిచేస్తున్నది. ఆహారంగా, ఇంధనంగా, పశుగ్రాసంగా, ఎరువుగా, కార్బన్ క్రెడిట్స్, ఫ్యాషన్ రంగాల్లో రైతులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉదాహరణకు.. ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులతో 61% మీథేన్తో కూడిన బయోగ్యాస్ను ఉత్పత్తి చేశాం. అలాగే చౌకగా, సమృద్ధిగా లభించే బయోఫెర్టిలైజర్ను ఉత్పత్తి చేసే సాంకేతికతలను అభివృద్ధి చేశాం. అదనంగా, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో బయో–లెదర్ను రూపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం. కేరళలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన ప్రాథమిక పరీక్షలు ఆశాజనకమైన ఫలితాలిచ్చాయి. 3 కిలోల ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులతో 3.38 చదరపు అడుగుల బయో లెదర్ను ఉత్పత్తి చేశాం. ఇది 2 జతల చెప్పులు, 3 చిన్న బ్యాగులు లేదా 2 జతల బూట్లను తయారు చేయడానికి సరి΄ోతుంది. బయోలెదర్ ఉత్పత్తులను మరింత అభివృద్ధి చేయడానికి అనేక జాతుల ముళ్లులేని బ్రహ్మజెముడు రకాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. బయో లెదర్ రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో, రైతులకు ప్రయోజనం చేకూరుస్తూనే ప్రైవేట్ రంగాన్ని శక్తివంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. బ్రహ్మజెముడు ఉత్పత్తుల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముళ్లు లేని బ్రహ్మజెముడు పంట నిరూపిత సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఈ పంట సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని పెంపొందించడానికి ఐసీఏఆర్డీఏ ప్రభుత్వ సంస్థలకు సహకరిస్తున్నది. ముఖ్యంగా ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాలు, కరువు ప్రాంతాల్లో ఆహార భద్రత, జీవనోపాధులను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం.ఒక రైతు ముళ్లులేని బ్రహ్మజెముడు పంటను ఎలా పండించవచ్చు?ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగులో గమనించాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. నీరు నిలవని నేలలు, తగినంత సూర్యకాంతి ఉన్న ప్రదేశాల్లో పెంచాలి. దీనికి కూడా ఎండా కాలంలో నీరందించాలి. జంతువుల నుంచి రక్షణకు కంచెను ఏర్పాటు చేసుకోవాలి. దున్నిన తర్వాత నాటుకోవాలి. వాన నీరు బయటకు వెళ్లిపోవటానికి ఏర్పాట్లు చేసుకోకపోతే వేరుకుళ్లు సమస్య వస్తుంది. ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులనే నాటుకోవాలి. వీటిని ఐసీఏఆర్డీఏ, ఇండియన్ గ్రాస్ల్యాండ్ అండ్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ వంటి ప్రసిద్ధ నర్సరీల నుంచి ఆరోగ్యకరమైన, ముదురు ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులను తెచ్చుకొని రైతులు నాటుకోవాలి.వరుసలలో తగినంత దూరంలో నాటుకోవాలి. ముళ్లు లేని బ్రహ్మజెముడు రకాన్ని, దాని పెరుగుదల అలవాటును బట్టి ఎంత దూరం పెట్టాలన్నది ఆధారపడి ఉంటుంది. ఈ ఆకులను తెచ్చిన 10 నుండి 15 రోజులు వాడబెట్టిన తర్వాత నాటుకోవాలి. వరుసల మధ్య 2 మీటరు, మొక్కల మధ్య 1 మీటరు దూరంలో నాటాలి. ఆకు 1/3 వంతు నేలలోకి ఉండేలా నాటాలి. వ్యాధి నివారణ కోసం కార్బెండజిమ్ (2 గ్రాములు/లీటరు) ద్రావణంలో ముంచి నాటుకోవాలి. నాటిన తర్వాత మొదటి 10 రోజులు నీరు పెట్టవద్దు. తరువాత 15 రోజుల వ్యవధిలో మొక్కకు 1–2 లీటర్ల నీరు ఇవ్వండి. అది వేరుపోసుకొని మొలకెత్తిన తర్వాత అంత తరచుగా నీరు పెట్టనవసరం లేదు. నేల పరీక్ష నిర్వహించి తగినంత ఎరువు వేయాలి. నాటేటప్పుడు మొక్కకు బాగా కుళ్ళిన పశువుల ఎరువు 2 కిలోలు వెయ్యండి. పండ్లు, ఆకులు కోసిన ప్రతి సారీ ఎరువులు వేయాలి. పిండినల్లి, శిలీంధ్ర తెగుళ్లు, ఇతర పురుగుల నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలి. ఒక సంవత్సరం తర్వాత, అడుగున రెండు ఆకులు వదిలి, పైన పూర్తిగా ఎదిగిన ఆకులను కోసి ఉపయోగించుకోవాలి. మొదటి సంవత్సరంలో మొక్కకు 8–10 కిలోల ఆకుల దిగుబడి వస్తుంది. మేకలు, గొర్రెలు, పశువులు, గేదెలకు మేతగా వీటిని వేసుకోవచ్చు. ఇతర పచ్చి మేతకు 25% ప్రత్యామ్నాయంగా ఉపయోగించండి. వసంతకాలం చివరిలో లేదా వేసవి ప్రారంభంలో ముళ్లులేని బ్రహ్మజెముడు పండ్లు కోతకు వస్తాయి.ముళ్లులేని బ్రహ్మజెముడు పంట నాటే ఆకులను ఎలా సేకరించుకోవాలి?ఐసీఏఆర్డీఏ, ఐజీఎఫ్ఆర్ఐ, సీఏజడ్ఆర్ఐ, సెంట్రల్ ఇన్సి్టట్యూట్ ఫర్ ఆరిడ్ హార్టికల్చర్, బీఏఐఎఫ్ వంటి పరిశోధనా సంస్థల్లో ముళ్లులేని బ్రహ్మజెముడు నర్సరీలు ఉన్నాయి. వారి నుంచి విత్తన ఆకులను తీసుకొని నాటుకోవచ్చు. ఇప్పటికే ఈ పంట సాగు చేస్తున్న రైతుల పొలాల నుంచి ఆరోగ్యకరమైన ఆకులు లేదా కాండం ముక్కలను తెచ్చి నాటుకోవచ్చు. ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్క 3–4 సంవత్సరాలలో పూర్తి పరిపక్వతకు చేరుకుంటుంది. కొందరు గ్రీనహౌస్లో కూడా పెంచుతున్నారు. చదరపు మీటరుకు రూ. 500 నుండి 600 వరకు ఆదాయాన్ని పొందవచ్చని అంచనా. రూపాయి ఖర్చుకు 3 రూపాయల ఆదాయాన్ని పొందవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇతర వివరాలకు.. www.icarda.orgదీన్ని సాగు చేస్తే భూమికి మేలు... నిస్సారమైన ఇసుక దువ్వలాగా మారిపోయిన భూమికి జవ జీవాలను అందించి పునరుద్ధరించడానికి అనేక విధాలుగా బ్రహ్మజెముడు పెంపకం అనువైనదని నిపుణులు చెబుతున్నారు:కరువు నిరోధకత... వాతావరణం నుంచి నీటిని పీల్చుకొని తనలో నిల్వ చేసుకోవటం బ్రహ్మజెముడు మొక్క లక్షణం. అందువల్లే ఇది కరువును గట్టిగానే తట్టుకోగలుగుతుంది. ఈ మొక్క జీవించడానికి, ఎక్కువ ఆకులను ఉత్పత్తి చేయడానికి చాలా తక్కువ నీరు సరిపోతుంది.నేలకు మేలు... బ్రహ్మజెముడును పెంచడం వల్ల మట్టి వానకు, గాలికి కొట్టుకుపోకుండా ఆపటం ద్వారా నేల సారాన్ని పునరుద్ధరించవచ్చు. ఈ మొక్కలు మట్టికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి.కర్బన స్థిరీకరణ... బ్రహ్మజెముడు మొక్క కర్బనాన్ని వాతావరణం నుంచి సంగ్రహించి తన ఆకులు, కాండంతో పాటు నేలలో నిల్వ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఈ కర్బన స్థిరీకరణ ప్రక్రియ సహాయపడుతుంది.అధిక దిగుబడి సామర్థ్యం... కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ముళ్లు లేని బ్రహ్మజెముడు చక్కగా పెరుగుతుంది. సంవత్సరానికి హెక్టారులో 80–100 టన్నుల బరువైన ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను పండించవచ్చు.అమలుకు అవకాశాలు... ఈ 5 రకాల ప్రయోజనాలను పొందే ముళ్లులేని బ్రహ్మజెముడు పంట నమూనాను స్వీకరించడానికి ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల సహకారం అవసరం. ముళ్లులేని బ్రహ్మజెముడు నాణ్యమైన ఆకులు నాటుకుంటే చాలు. అవి వేరుపోసుకొని ఎత్తయిన మొక్కగా ఎదుగుతాయి. కరువు ప్రాంతాల్లో జీవనోపాధులను మెరుగుపరిచేందుకు రైతులకు నాణ్యమైన ఆకులను అందించటం, సాంకేతిక మార్గదర్శకత్వం అందించడం ముఖ్యమైన విషయం. మార్కెట్ లింకేజీలను ఏర్పాటు చేయడం, ఈ ఆకులను 5 రకాలుగా ఉపయోగించేందుకు వీలుగా ప్రాసెస్ చేయడానికి మౌలిక సదుపాయాలను నిర్మించడం అవసరం.ఈ 5 రకాల ప్రయోజనాలనిచ్చే పంట నమూనాను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజల్లో అవగాహన పెంచడం, సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలి. ఈ పంట నమూనా ముఖ్యంగా కరువు, ఎడారి తాలకు బాగా సరిపోతుంది. భారతదేశం, పాకిస్తాన్, ఇథియోపియా, మొరాకోతో సహా ఎడారీకరణను ఎదుర్కొంటున్న అనేక దేశాల్లో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పంట సాగు చేస్తున్నారు. బహుళ ఆదాయ మార్గాలను అందించడం, పనిలో పనిగా భూమిని తిరిగి సారవంతం చేయటం ద్వారా 5 రకాలుగా ప్రయోజనకరమైన బ్రహ్మజెముడు పంట నమూనా బడుగు రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. మెరుగైన ఆహార భద్రతనిస్తుంది. అదే సమయంలో పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు ఒక మార్గాన్ని అందిస్తుంది. –పంతంగి రాంబా, బుసాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: Sagubadi: మునగ మేలు!) -
యూరియా కోసం తోపులాట
పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని రైతులు యూరియా కోసం మంగళవారం ఉదయం పీఏసీఎస్ వద్దకు అధిక సంఖ్యలో వచ్చి క్యూలో నిల్చున్నారు. ఒకే కౌంటర్ ఉండడంతో ఒకవైపు మహిళలు, మరోవైపు పురుషులు క్యూ కట్టారు. రెండువైపుల నుంచి రైతులు కౌంటర్ వద్దకు ఒకేసారి తోసుకోవడంతో శ్వాస ఆడక ముగ్గురు మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు, వ్యవసాయ సిబ్బంది వారిని పక్కకు తీసుకొచ్చి ముఖంపై నీళ్లు చల్లి సపర్యలు చేయడంతో ఇద్దరు మహిళలు స్పృహలోకి వచ్చి మరలా క్యూలైన్లోకి వెళ్లారు. గేమ్యానాయక్తండాకు చెందిన లక్ష్మి కొంత ఇబ్బంది పడటంతో 108లో పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. మండల వ్యవసాయ అధికారి సందీప్కుమార్ చొరవ తీసుకుని పీఏసీఎస్కు పక్కనే ఉన్న పాత సీడీపీఓ కార్యాలయం వద్ద మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయించారు. రైతుపై చేయిచేసుకున్న హోంగార్డు! యూరియా కోసం క్యూలో నిల్చున్న ఓ రైతుపై హోంగార్డు చేయిచేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్ పెద్దవూరకు వచ్చి బాధిత రైతుతో మాట్లాడారు. తనను హోంగార్డు ఏమీ కొట్టలేదని, తాను వేకువజామునే వచ్చి క్యూలో నిల్చున్నట్లు మూత్రం రావడంతో బయటకు వెళ్లి వచ్చానని, తిరిగి క్యూలో నిల్చుండగా ఈ క్రమంలో తన వెనకాల ఉన్న రైతులు గొడవ చేశారని, దీంతో హోంగార్డు వచ్చి తనను బయటకు లాగే ప్రయత్నం చేశాడని, తాను ఉన్న విషయాన్ని చెప్పడంతో వెళ్లిపోయాడని చెప్పాడు.» సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్లోని మనగ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం పెద్ద సంఖ్యలో బారులు దీరారు. -
రైతులను అవమానించేలా సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
-
అచ్చెన్నాయుడే ఎరువులు తరలిస్తున్నారు
పొందూరు: రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతుంటే... వచి్చన ఎరువుల్లో మంత్రులు చేతివాటం చూపుతున్నారని సాక్షాత్తూ అధికార పక్షం నాయకులే విమర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మలకాం గ్రామానికి రావాల్సిన ఎరువులను మంత్రి అచ్చెన్నాయుడే తరలించారంటూ టీడీపీ సర్పంచ్ జాడ శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం మలకాం గ్రామానికి వచి్చన ఎరువుల లారీని బయటకు వెళ్లనీయకుండా సర్పంచ్తో పాటు రైతులు సచివాలయం వద్ద అడ్డుకున్నారు.తమ గ్రామానికి పూర్తి స్థాయిలో ఎరువులు పంపాలని డిమాండ్ చేశారు. తొలివిడతలో 444 యూరియా బస్తాలు రాగా రెండో విడతలో వచి్చన ఎరువులను వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడే పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. తమ గ్రామానికి అధికారులు 330 బస్తాలు కేటాయించారని సర్పంచ్ చెప్పారు. అయితే సోమవారం 110 బస్తాలు మాత్రమే వచ్చాయని, మిగిలిన 220 బస్తాలు మాటేంటని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రావాల్సిన ఎరువులు సరఫరా అయ్యేంత వరకు లారీలోని 110 బస్తాల లోడును దించబోమని, లారీని ఇక్కడ నుంచి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. -
నివేదన.. నిర్వేదం
‘అధికార కూటమి నాయకులను ఎదిరించలేం. మాకు జీవనాధారమైన ఇంటి స్థలం... పొలం వదిలి బతకలేం. ఇక మాకు చావే శరణ్యం..’ అంటూ పలువురు పేదలు, రైతులు తమ గోడును అధికారులకు వివరించేందుకు సోమవారం కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోనే చచ్చిపోతాంచిత్తూరు కలెక్టరేట్: ‘మా భూమిని అక్రమంగా ఓ వ్యక్తి అమ్మేశాడు. పొలం వదిలి వెళ్లాలని మా టీడీపీ నాయకులే బెదిరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెండుసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. ఇక మాకు చావే శరణ్యం..’ అంటూ చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం పొట్టగానిపల్లికి చెందిన బాధితుడు వెంకటేష్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ సభ్యత్వ కార్డులు మెడలో వేసుకుని సోమవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద పెట్రోల్ క్యాన్తో ఆత్మహత్యాయత్నం చేసింది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తమకున్న 2.15 ఎకరాల భూమిని మునుస్వామి అనే వ్యక్తి అమ్మేశాడని, పొలం వదిలి వెళ్లాలని కూటమి నేతలతో బెదిరింపులకు గురిచేస్తున్నాడని వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు.టీడీపీ నేతల అండతో స్థలం కబ్జా చేస్తున్నారని..వెదురుకుప్పం: టీడీపీ నేతల అండతో తన ఇంటి స్థలాన్ని ఓ మహిళ ఆక్రమించేందుకు యతి్నస్తున్నారని రమణమ్మ అనే మహిళ సోమవారం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం తహశీల్దార్ కార్యాలయం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఇంటి స్థలాన్ని టీడీపీ నేతల అండతో చంద్రమ్మ కబ్జా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తోటి అర్జీదారులు రమణమ్మను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. కాగా, చంద్రమ్మ వర్గీయులూ తహశీల్దార్ కార్యాలయం వద్దకు రావడంతో ఇరువర్గాలవారు ఘర్షణ పడ్డారు. పల్నాడు కలెక్టరేట్లో తాపీమేస్త్రి..నరసరావుపేట: తన 50 గజాల స్థలం వేరే వ్యక్తికి చెందినదని పంచాయతీ సెక్రటరీ సరి్టఫికెట్ ఇచ్చాడని, అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదనే ఆవేదనతో సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో జొన్నగలగడ్డ గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ చుట్టు బ్రహ్మం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యతి్నంచాడు. వెంటనే పోలీసులు అతడ్ని ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ‘నా స్థలాన్ని మరో వ్యక్తికి చెందినదిగా పంచాయతీ కార్యదర్శి సరి్టఫికెట్ ఇచ్చాడు. నేను గతంలో అనేకసార్లు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అధికారులకు అర్జీ అందజేసినా ఫలితం లేదు. అందుకే గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని బ్రహ్మం తెలిపారు. అయితే దీనిని అధికారులు ఖండించారు.పొలం మధ్యలో రోడ్డు వేశారని...నంద్యాల: రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని తమ పొలంలో నుంచి రోడ్డు వేశారని ఓ రైతు కుటుంబం నంద్యాల కలెక్టర్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచింది. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన బాధితులు మధుశేఖర్గౌడ్, మద్దిలేటిస్వామి గౌడ్ మాట్లాడుతూ తమ పొలంలో నుంచి కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా అధికారులు లంచాలు తీసుకుని రోడ్డు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కలెక్టర్ రాజకుమారి బాధితుల వద్దకు వచ్చి విషయం తెలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. -
చంద్రబాబు పాలనలో ఎప్పుడూ రైతులకు కష్టాలే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయానికి తానే ఆధ్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు, తన రైతు వ్యతిరేకతను ఏనాడు దాచుకోలేదని గుర్తు చేశారు.నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే, వాటిని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నాయకుడుగా వైయస్ జగన్ పాలనలో చేసిన మంచిని కూడా వక్రీకరిస్తూ, అసెంబ్లీలో దిగజారుడు మాటలు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యవసాయంపై సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించని సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ 'తన పాలనలో వ్యవసాయం చాలా బాగుంది, రైతులకు ఎటువంటి కష్టాలు లేవు, రైతులు ఎంతో సంతోషంతో ఉన్నారు. రైతులే యూరియాను ఎక్కువ వాడుతూ తప్పు చేస్తున్నారు, దీనివల్ల క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయని' అన్నారు. మొత్తం మీద 62 శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు అని చెబుతూనే, రైతులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొనడం లేదని ముక్తాయింపు నివ్వడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.యూరియాపై చంద్రబాబు కొత్త సిద్దాంతంచంద్రబాబు సిద్దాంతం ప్రకారం రైతులు యూరియా వాడకం తగ్గించేయాలి. నేడు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, కాబట్టి యూరియా వినియోగాన్ని రైతులు తగ్గించుకోవాలి, దానివల్ల నాణ్యమైన పంటలు పండుతాయి, వాటికి మంచి మార్కెటింగ్ ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకానీ రైతులకు కావాల్సిన యూరియాను ఇవ్వలేకపోతున్నాం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదు. అసహ్యాన్ని జయించిన నేత చంద్రబాబు. తన మాటలు చూసి ప్రజలు నవ్వకుంటారని తెలిసి కూడా నిస్సిగ్గుగా మాట్లాడగలరు.డ్రిప్ ఇరిగేషన్ పైనా అబద్దాలేనా బాబూ?ఈ దేశానికి డ్రిప్ ఇరిగేషన్ను తానే పరిచయం చేశానంటూ చంద్రబాబు అసెంబ్లీలో లేని గొప్పలను చెప్పుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ను ఆనాడు పీఎం వాజపేయ్కు చెప్పి, వన్మెన్ కమీషన్ కింద ఇజ్రాయిల్కు వెళ్ళినని, శాస్త్రీయంగా పరిశోదనలు చేసి, దానిని పీఎంకు ఇస్తే, దానిని ఆయన ఈ దేశంలో అమలు చేశారంటూ చంద్రబాబు తన గొప్పతనాన్ని చెప్పుకున్నారు. కానీ డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలో ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే, 1980లోనే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో రైతులే ఇతర దేశాల్లో వాడకాన్ని చూసి దీనిని ప్రారంభించారు.1987లో ఎన్సీపీఏ డ్రిప్ ఇరిగేషన్ను ప్రారంభించింది. 1991లో కేంద్రం దీనిని చేపట్టడం వల్ల ఏపీలో కూడా ఈ విధానం ప్రారంభమైంది. చంద్రబాబు 1995లో ఎన్డీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు. ఆయన సీఎం కాకముందే ఇరవై ఏళ్ళుగా దేశంలో డ్రిప్ ఇరిగేషన్ విధానం అమలులో ఉంది. ఎటువంటి సిగ్గు లేకుండా తాను వచ్చిన తరువాతే ఈ విధానం దేశంలో ప్రారంభమైందని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.గిట్టుబాటు ధరలు ఎవరి హయాంలో ఎంతో తెలుసా?రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలపై చంద్రబాబు మాట్లాడుతూ మిరపకు రికార్డు లేదు అన్నారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి మిర్చిపంటను ఈ-క్రాప్ కింద రికార్డు చేశామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు తన వద్ద ఎటువంటి రికార్డు లేకపోవడం వల్ల వారిని ఆదుకోలేకపోయామంటూ మాట్లాడారు. దీనితో పాటు తాను ఉల్లి, పత్తి, మామిడి, టమాటా పంటలకు మద్దతు ధర కల్పించానంటే ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో, ఇప్పుడు చంద్రబాబు హయాంలో పంటకు కల్పించిన గిట్టుబాటు ధరలను ఒకసారి పరిశీలిస్తే...- వైఎస్ జగన్ హయాంలో ధాన్యం క్వింటాకు రూ.1800 నుంచి రూ.2000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.1150 నుంచి రూ.1400 మాత్రమే ఉంది. - కందులు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 10,200 నుంచి రూ.11,800 ఉంటే చంద్రబాబు హయాంలో 5500 నుంచి 6200లకు పడిపోయాయి. - మినుములు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.9200-9850 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.6000 లకు తగ్గిపోయాయి. - పెసలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 9100-9700 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.5000-5200 లకు తగ్గిపోయాయి. - సజ్జలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.2860-3650 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో హయాంలో రూ.1800-2000 లకు తగ్గిపోయాయి. - మిర్చి.. వైఎస్ జగన్ హయాంలో రూ.21,000 - 27,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ.8000 - 11,000 లకు పడిపోయాయి.- పొగాకు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.15000 -18000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.100 - 300 వరకు పడిపోయింది. - ఉల్లికి వైఎస్ జగన్ హయాంలో రూ.4000 - 12000 లకు అమ్మితే, చంద్రబాబు హయాంలో క్వింటా ఉల్లి కేవలం రూ.300లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు. రైతుల గోడును పట్టించుకోకుండా ఉల్లి రైతును ఆదుకున్నాను అని చెప్పుకుంటున్నారు. - వైఎస్ జగన్ హయాంలో టమాటా కిలో రూ.20-25 ఉంటే, మీ హయాంలో రూ.1.50 కి పడిపోయింది.- వైఎస్ జగన్ హయాంలో కోకో 950-1050 ఉంటే, మీ హయాంలో రూ.240-500 కి పడిపోయింది.- చీనీ టన్ను జగన్ హయాంలో రూ.30,000 - రూ.1 లక్ష వరకు రైతులు అమ్ముకున్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రూ.7000 -14000- మామిడికి జగన్ హయాంలో క్వింటా రూ.2200 - 2900 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.200 లకు పడిపోయింది.మద్దతుధరలను ధైర్యంగా ప్రకటించిన వైఎస్ జగన్దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రానికి సీఎం అయితే, రైతులు పండించిన పంటలకు మా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవీ అని బహిరంగంగా రేట్లను ప్రకటించారు. ఆ పని ఆనాడు సీఎంగా వైఎస్ జగన్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రతులను కూడా మీడియాకు చూపిస్తున్నాం. మా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఈ రేట్లకే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని బహిరంగంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్. దాని ప్రకారం రైతులకు అండగా నిలిచారు. ధరల స్థిరీకరణ నిధి కింద చంద్రబాబు హయాంలో 3,74,680 మంది రైతులకు రూ.3,322.15 కోట్లు ఇచ్చారు. అదే వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 6,16,991 మందికి రూ. 7,746.31 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు.సోమశిల కింద రెండో పంటకు తొలిసారి నీరిచ్చారంటూ అబద్ధాలు'సోమశిల కండలేరు కింద ఎప్పుడూ రెండు పంటలు వేయరూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండో పంటకు తొలిసారి నీరు ఇవ్వడం వల్ల పంటల విస్తీర్ణం పెరిగి యూరియా కొరత ఏర్పడింది' అంటూ చంద్రబాబు కొత్త సూత్రీకరణ చేశారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు మాట్లాడటం చూసి నెల్లూరు రైతులు నవ్వుకుంటున్నారు. 2004 వరకు సోమశిలలో 36 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచేవారు కాదు, దీనివల్ల నీరులేక ఒక్క పంటకే నీరు ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు.స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం అయిన తరువాత సోమశిలలో దాదాపు 74 టీఎంసీలను నిల్వ చేసి, దాదాపు అన్ని సంవత్సరాల పాటు రెండోపంటకు నెల్లూరు జిల్లాకు నీరుఇచ్చారు. అలాగే వైయస్ జగన్ సీఎంగా ఉన్న అయిదేళ్ళపాటు కూడా రెండోపంటకు ఈ రిజర్వాయిర్ నుంచి నీటిని ఇచ్చారు. వాస్తవాలను తెలుసుకోకుండా సీఎంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు. దీనిపై నెల్లూరుకు వచ్చి రైతులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు సీఎం అయిన తరువాత నెల్లూరు ప్రాంతానికి రెండోపంటకు నీరివ్వడం ఇదే తొలిసారి, అదీ అయన గొప్పతనం.అన్నదాత సుభీభవ కింద ఎంత ఎగ్గొట్టారో చెప్పాలివరి అనేది తినడానికి పనికిరాదు, ఆల్కాహాల్ తయారీకి వాడుకోవాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ధాన్యం గిట్టుబాటుధర లేక క్వింటా రూ.12వేలకు రైతులు అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టే దిక్కులేదు. నీళ్ళు ఉంటే వరి తప్ప మరో పంట పండించుకునే అవకాశం లేదని, తాను ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాను అని ఒకవైపు చెబుతూనే, వరి నాణ్యత తగ్గితే ఆల్కహాల్కు ఉపయోగించుకోవాలని చెబుతున్నాడు. అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తిగా అమలు చేశాను అని చెప్పుకుంటున్నాడు.కేంద్రం ఇచ్చే దానితో సంబంధం లేకుండా రూ.20వేలు ప్రతి రైతుకు ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిసి ఇస్తాను అని మాట మార్చేశారు. దీనిలో కూడా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. కనీసం రెండో ఏడాది కూడా అరకొరగా అది కూడా 54 లక్షల మందికి గానూ కేవలం 48 లక్షల మందికే ఇచ్చారు. ఎందకు రైతుల సంఖ్య తగ్గిందీ అని ప్రశ్నిస్తే, రైతులు చనిపోయారంటూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అంటే రైతులు చనిపోతే, ఆ కుటుంబాలకు చెందిన వారు వ్యవసాయం చేయడం మానుకున్నారా? కొందరికి అనవసరంగా ఇస్తున్నామని, వారిని తొలగించామని చెబుతున్నారు. చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. ఇరిగేషన్ కాలువలను ఉపాధి హామీ కింద పనులు చేస్తున్నామని చెబుతూ ఒకవైపు దోచుకుంటున్నారు, అదే కాలువలకు ఇరిగేషన్ శాఖ నుంచి బిల్లులు దండుకుంటున్నారు. ఈ అక్రమాల్లో కాలువ పనుల నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. యూరియాపై రెండు నాలుకల ధోరణియూరియా కొరత లేదని మాట్లాడుతున్న చంద్రబాబు నిత్యం పత్రికల్లో వస్తున్న రైతుల గోడు గురించి ఏమంటారు? పొరుగు రాష్ట్రాల్లో కొరత ఏర్పడిందని, ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశానికే దిశానిర్దేశం చేశాను, వ్యవసాయానికి కొత్త మెలకువలు నేర్పించాను అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో యూరియా కొరతను ఎందుకు పరిష్కరించలేకపోయారు. వివిధ జిల్లాల్లో రైతులు యూరియా కోసం ఎలా బారులు తీరారో, ఎలా ఆందోళనలు చేస్తున్నారో పత్రికల్లో వచ్చిన కథనాలను ఈ సందర్బంగా మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నాం. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. వీరంతా రైతులు కాదా? రైతుల కన్నా చంద్రబాబు వ్యవసాయంలో నిష్ణాతుడా? రైతులు ప్యానిక్ బయ్యింగ్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు.ప్రైవేటు వ్యక్తులకు యాబైశాతం వరకు ఇచ్చాం కాబట్టే ఇబ్బంది ఏర్పడిందని అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియోను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఈనెల 2వ తేదీన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 'కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో యాబైశాతం ప్రైవేటుకు, మిగిలిన యాభైశాతం ప్రభుత్వానికి కేటాయిస్తుంది. ప్రైవేటుకు ఎక్కువ కేటాయించడం వల్ల చాలా మంది రైతులు అటు రైతుభరోసా కేంద్రాల వద్ద తీసుకుంటున్నారు. కొంతమంది బయట తీసుకుంటున్నవారు ఇబ్బంది పడుతున్నారు.' అంటూ మాట్లాడారు. అదే మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు అంటే 22వ తేదీన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఏపీ చరిత్రలో తొలిసారి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన యూరియాను యాబై శాతం నుంచి డెబ్బైశాతంకు పెంచి రైతుసేవా కేంద్రాలకు పంపి, రైతులకు విక్రయిస్తున్నాం' అంటూ మాట్లాడారు.అలాగే తెలంగాణ, కర్ణాటకలో యూరియాకు ఎటువంటి సమస్యలు వచ్చాయో చూస్తున్నాం. ఆ ఫోటోలను తీసుకుని ఒక ఫేక్ పార్టీ యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అంటూ మాట్లాడారు. ఇదే మంత్రి అచ్చెన్నాయుడు యూరియా కొరత యాబైశాతం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్లే వచ్చిందని మీడియా ప్రతినిధుల సమావేశంలో అంగీకరించాడు. దీనిపై చంద్రబాబు ఆయనకు తలంటడం వల్ల మాట మార్చి ఈ రోజు అసెంబ్లీలో డెబ్బైశాతం రైతుసేవా కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నామని పచ్చి అబద్దాలు మాట్లాడారు. గతం కన్నా ఎక్కువ యూరియాను తీసుకువచ్చామని మంత్రి చెప్పారు. తెచ్చిన యూరియాను యాబైశాతం ప్రైవేటుకు ఇవ్వడం వల్ల, వారు దానిని బ్లాక్ చేసి రూ.270 కి అమ్మాల్సిన కట్టను రూ.600 లకు బ్లాక్లో అమ్మే పరిస్థితిని తీసుకువచ్చారు. దీనివల్ల రూ.250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. రైతులకు సేవాకేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన యూరియాను ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు అమ్మించారో చెప్పాలి. పంటల బీమా చెల్లింపులపై చర్చకు సిద్దమా?రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసిన యూరియాను డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నారు. ఎకరాకు ఎంత యూరియా వేయాలో భూసార పరీక్ష చేసి, దాని ప్రకారం యూరియాను ఎంత ఇవ్వాలో నిర్ణయించి, ఆ మేరకు ఆధార్ అనుసంధానం ద్వారా రైతుకు డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నాడు. అంటే యూరియా కష్టాలు అనేవి ఈ ఏడాది మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ ఉంటాయి, వాటిని పరిష్కరించే సామర్థ్యం తనకు లేదని చంద్రబాబే ఒప్పుకుంటున్నారు. 800 మంది అమెరికా నుంచి పోస్ట్లు పెట్టారని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న వారి తల్లిదండ్రులు రాష్ట్రలో వ్యవసాయం చేయడం లేదా?అంతర్జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వ పరువుపోతోందని సిగ్గుపడాలి. భూసార పరీక్షలు వైఎస్ జగన్ హయాంలో జరగలేదని, ల్యాబ్లు పెట్టి, ఎటువంటి పరికరాలను పెట్టలేదని తప్పుడు కూతలు కూస్తున్నారు. వైయస్ జగన్ నిర్మించిన ఆధునిక ల్యాబ్లను వంద జన్మలు ఎత్తినా చంద్రబాబు చెయ్యలేరు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఆర్బీకేలను ఏర్పాటు చేసిన ఘనత వైయస్ జగన్ను దక్కుతుంది. ల్యాబ్లు, రీజనల్ కోడింగ్ సెంటర్లను నిర్మించారు. వీటిపైన పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటు.చంద్రబాబు హయాంలో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోతే, వైయస్ జగన్ గారు దానిని చెల్లించారు. ఏ సీజన్లో రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా ఆ సబ్సిడీనీ అందించిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. 2018-19కి సంబంధించి రూ.596.40 కోట్లు, అలాగే 2019-20కి సంబంధించి రూ.1252 కోట్లు, 2020-21కి సంబంధించి రూ.1739 కోట్లు, 2021-22 రూ.2977.82 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్ హయాంలోనే మొత్తం 54,55,363 మంది రైతులకు మొత్తం 7802 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. దీనిని ఇది నిజం కాదని అచ్చెన్నాయుడు నిరూపించగలరా? అచ్చెననాయుడిని సవాల్ చేస్తున్నాం. నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తారా?కౌలురైతులను ఆదుకున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేకౌలురైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుభరోసా ఇవ్వలేని ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6వేలు ఇవ్వకపోతే, రాష్ట్రమే దానిని భరించి మొత్తం రూ.13,500 రైతుభరోసా కింద వారికి ఇచ్చాం. ప్రభుత్వం వద్ద దానికి సంబంధించి రికార్డులు ఉన్నాయి, ఒకసారి పరిశీలించిన తరువాత దానిపై మాట్లాడాలి. సున్నావడ్డీ పంటరుణాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి 84,66,217 మంది రైతులకు పెట్టిన రూ. 2050 కోట్లు బకాయిలను కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
యూరియా.. యాతన
కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన నువ్వుల శ్రీనివాసరావు పదెకరాలు కౌలుకు చేస్తున్నారు. ఈ సీజన్లో ఎంటీయూ 1318 రకం వరి పంట సాగు చేశారు. తొలి విడతలో అతికష్టమ్మీద మూడు కట్టల యూరియా మాత్రమే దొరికింది. రోజుల తరబడి పడిగాపులు కాసినా రెండో విడతలో నిరాశే మిగిలంది. దీంతో చేసేది లేక అధిక ఖర్చు అయినా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అదే యూరియా దొరికితే ఎకరాకు రెండు కట్టల చొప్పున రూ.533తో సరిపోయేది. కాంప్లెక్స్ ఎరువులు వాడుతుండటంతో రూ.3 వేల దాకా ఖర్చు అవుతోంది. అంటే దాదాపు ఆరు రెట్లు అదనపు భారం పడింది. పైగా ఒక్కో సొసైటీలో ఒక్కో ధర. లోడింగ్, రవాణా ఖర్చులు దీనికి అదనం. గతంలో ఎరువులకు ఎకరాకు రూ.3 వేలు ఖర్చయితే ప్రస్తుతం రూ.8 వేలకు పైగా ధారపోయాల్సి వస్తోందని ‘సాక్షి’ ఎదుట రైతు వాపోయాడు.ఎన్టీఆర్ జిల్లా పురుషోత్తపట్నానికి చెందిన రైతు మైనేని దుర్గాప్రసాద్ 17 ఎకరాలు కౌలుకు తీసుకొని 1318 వరి వేశారు. రెండో విడతగా కట్ట యూరియా కోసం నాలుగుసార్లు పనులు మానుకుని వచ్చినా మీ టోకెన్ నెంబర్ రాలేదంటూ తిప్పి పంపిస్తున్నారు. బయట మార్కెట్లో బస్తా రూ.300 నుంచి రూ.500 దాకా అడుగుతున్నారు. పైగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు పురుగుల మందులు అంటగడుతున్నారు. యూరియా దొరక్కపోవడంతో చేసేది లేక 20ః20 వేశాడు. ఈ ప్రభుత్వం అదునుకు యూరియా కూడా అందించలేకపోతోందని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆక్రోశిస్తున్నాడు. ఈ ప్రభావంతో ఈసారి దిగుబడులు తగ్గిపోతాయని తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.సాక్షి, అమరావతి: ఒకపక్క యూరియా కరువు.. మరోవైపు ఏ పంటకూ మద్దతు ధరలు లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని దయనీయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూరియా కోసం క్యూలైన్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆత్మగౌరవాన్ని దిగమింగుకుని రోజుల తరబడి పడిగాపులు కాసినా అరకట్ట దొరకడం గగనంగా మారింది. ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు.. దిక్కులు చూస్తోంది. అటు పెట్టుబడి సాయం అందక.. ఇటు ఉచిత పంటల బీమాకు దూరమై రైతన్నలు అల్లాడుతున్నారు. పంట నష్టపోతే కనీసం కరువు సాయం కూడా అందని దుస్థితి నెలకొంది. వరి ప్రస్తుతం పొట్ట దశకు చేరుకున్న తరుణంలో రెండో విడతగా ఇవ్వాల్సిన యూరియా కోసం కటకటలాడుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో యూరియా కోసం తమ అగచాట్లను అన్నదాతలు మొర పెట్టుకున్నారు. కూటమి సర్కారు నిర్లక్ష్యం, అసమర్థతపై మండిపడుతూ గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇంతటి దయనీయ పరిస్థితులు లేవని చెబుతున్నారు.పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు..గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా కావాల్సినంత యూరియా అందుబాటులో ఉండేది. కియోస్క్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తమ కళ్లాలకు సరఫరా చేసేవారు. ఫలితంగా లోడింగ్, అన్లోడింగ్తో పాటు రవాణా ఖర్చుల రూపంలో బస్తాకు రూ.20–50 వరకు ఆదా అయ్యేది. ఆ ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ విత్తనాలు, యూరియా కోసం ఎక్కడా క్యూలైన్లు కనిపించిన దాఖలాలు లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎంత కావాలంటే అంత యూరియా దొరికేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాదిగా పరిస్థితి మారిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాకు మంగళం పాడారు. సబ్సిడీ విత్తనాలకూ కోత పెట్టారు. మరోవైపు ఎరువుల సరఫరాను సొసైటీలకు పరిమితం చేశారు. దీంతో ఎరువుల కోసం సీజన్లో పొలం పనులు మానుకుని మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దాదాపు 10 రోజుల పాటు పొలం పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు కాస్తేగానీ అరకట్ట దొరకడం గగనమైపోయింది. టీడీపీ కూటమి నేతల సిఫార్సు మేరకు సరఫరా జరుగుతుండటంతో సన్న, చిన్న కారు రైతులు అల్లాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సీసీ ఆర్సీ కార్డులున్న వారు సైతం యూరియా దొరక్క ప్రైవేటు వ్యాపారుల వద్ద నిలువు దోపిడికి గురవుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో నూటికి 70–80 శాతం మంది కౌలు రైతులే. వీరంతా రెండో విడతలో కూడా యూరియా దొరక్క యాతన అనుభవిస్తున్నారు. బాపట్ల జిల్లా ఆవులవారిపాలెంలో యూరియా కోసం రైతుల పడిగాపులు (ఫైల్) పక్కదారి పట్టిన యూరియా..వ్యవసాయ సీజన్లో 10 శాతానికి మించి పనులు సాగని జూన్, జూలైలోనే దాదాపు 35 శాతం యూరియా అమ్మకాలు జరగడం చూస్తే అదంతా నల్ల బజారుకు చేరిపోయిందని అర్ధమౌతుంది. డిమాండ్ సాకుగా చేసుకుని టీడీపీనేతలు యూరియాను అధికధరలకు అమ్ముకున్నారు. వరి పొలాలకు యూరియా ఇవ్వాల్సిన తరుణంలో సర్కారు చేతులెత్తేసింది. పెద్ద ఎత్తున నిల్వలు పక్కదారి పట్టినా కళ్లప్పగించి చూసింది. దీంతో కట్ట యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా సరఫరాలో అలసత్వాన్ని ఎండగడుతూ రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టే వరకు చంద్రబాబు సర్కారు మేలుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోవడంతో అదునుకు యూరియా దొరక్క రైతులు ఖరీదైన కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. యూరియా కట్ట రూ.266.50 కాగా సొసైటీల్లోనే రూ. 25 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.500 వరకు గుంజుతున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బస్తా రూ.600–700 వరకు పిండుతున్నట్లు రైతులు చెబుతున్నారు. బలవంతంగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు అవసరం లేని పురుగు మందులను అంటగడుతుండడంతో ఎకరాకు రూ.5 వేలకు పైగా అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో సొసైటీలను పరిశీలించగా చాలా చోట్ల యూరియా నిల్వలే లేవు. డిమాండ్కు సరిపడా లేక రైతులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న పరిస్థితులు కనిపించాయి.అదునుకు అందకపోతే..శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాతో పాటు ఉత్తర కోస్తాలో ఎకరాకు 75–80 కేజీలు యూరియా అవసరం. గిరిజన ప్రాంతాల్లో 55–69 కిలోలు వినియోగించాలి. వర్షాధార ప్రాంతాల్లో మూడు విడతల్లో 100–125 కేజీలు, నీటిపారుదల ప్రాంతాల్లో నాలుగు విడతల్లో 80–90 కిలోల చొప్పున పంటలకు యూరియా వేస్తారు. వర్షాధార ప్రాంతాల్లో విత్తే సమయంలో తొలి విడతగా, 30–35 రోజుల మధ్య రెండో విడత, మిగిలింది 50–55 రోజుల మధ్య వేస్తారు. నీటిపారుదల ప్రాంతాల్లో నాట్లు వేసిన 7–10 రోజుల్లో తొలి విడత, 25–30 రోజుల్లో 2వ విడత, 45–50 రోజుల మధ్య మూడో విడత, చివరగా 60–65 రోజుల మధ్య నాలుగో విడత యూరియా అవసరం ఉంటుంది. తొలిదశలో యూరియాతో పాటు డీఏపీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. రెండో విడతలో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువు 20–25 కేజీలు వేస్తారు. చివరి రెండు దశల్లో యూరియా ఎక్కువగా అవసరం ఉంటుంది. మూడో దశకు యూరియా అందకపోతే పంట ఏపుగా ఎదగదు. దుబ్బులో పిలకలు తగ్గిపోతాయి. చివరి దశలో యూరియా అదునుకు ఇవ్వకుంటే కంకి సైజు తగ్గిపోవడం, గింజ బరువు తగ్గిపోవడం జరుగుతుంది. 3, 4వ దశల్లో నత్రజని అందకపోతే దిగుబడి గణనీయంగా 5–10 బస్తాల వరకు తగ్గిపోతుంది.రెండో దశలోనూ కటకట..ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుంది. కృష్ణా డెల్టా పరిధిలో ఎకరాకు దాదాపు రెండు బస్తాల యూరియా వాడతారు. రెండో విడతలోనూ మెజార్టీ రైతులకు యూరియా అందకపోవడంతో చేసేది లేక కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో 46 శాతం నత్రజని ఉంటుంది. అదే కాంప్లెక్స్ ఎరువు (20ః20)లో 20 శాతం మాత్రమే నత్రజని, 20 శాతం ఫాస్పేట్ ఉంటాయి. తీవ్ర కొరత కారణంగా రెండు మూడు విడతల్లో 20 కేజీల చొప్పున వేయాల్సిన యూరియాకు బదులుగా 20ః20 కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో ఉండే నత్రజని కోసం దాదాపు 60 కేజీల కాంప్లెక్స్ ఎరువులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 20 కేజీల యూరియాకు రూ.135 ఖర్చవుతుండగా, 60 కేజీల కాంప్లెక్స్ కోసం దాదాపు రూ.1,600 వరకు వెచ్చించాల్సిన అగత్యం తలెత్తింది. ఈ లెక్కన 2–3 విడతల్లో 45 కేజీల యూరియా బస్తాకు కేవలం రూ.266.50 ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ కాంప్లెక్స్ ఎరువుల వినియోగం వల్ల దాదాపు రూ.3,200 వ్యయం అయింది. అంటే ఐదారు రెట్లు అదనంగా రైతుల నెత్తిన భారం పడింది. అయినప్పటికీ పంట ఎదుగుదల కానరాక ఈసారి దిగుబడులు తగ్గిపోతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. కనీసం ఎకరాకు 5 బస్తాలకు పైగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరియా కోసం తోపులాట..తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి పీఏసీఎస్ పరిధిలో యూరియా పంపిణీ గందరగోళంగా మారింది. యూరియా వచ్చినట్లు తెలియడంతో చౌటపల్లి, గానుగపాడు, జీకొత్తూరు, తదితర గ్రామాల రైతులు ఆదివారం ఉదయం ఆరు గంటలకే సొసైటీ వద్దకు పోటెత్తారు. పోలీసులు తొమ్మిది గంటల సమయంలో అక్కడికి చేరుకోగా మూడు గంటల పాటు రైతులు పడిగాపులు కాశారు. క్యూలైన్లు ఏర్పాటు చేసేలోపే పీఏసీఎస్ సిబ్బంది టోకెన్ల పంపిణీ ప్రారంభించడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు, సహకార సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారికి సిఫారసు చేశారు.శ్రీకాకుళం జిల్లా మజ్జిలిపేటలో యూరియా కోసం బారులు తీరిన రైతులు (ఫైల్) పలుకుబడి ఉన్న వాళ్లకే ఇస్తున్నారునాకు సొంతంగా అరకెరం భూమి ఉంది. కౌలుకు ఏడెకరాలు తీసుకొని ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసా. యూరియా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందిపడ్డాను. యూరియా దొరక్క కాంప్లెక్స్ వాడుతున్నాం. సొసైటీలో ఎకరాకు అరకట్టకు మించి ఇవ్వడం లేదు. ఇది ఏ మూలకు సరిపోతుంది. ఊర్లో పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తున్నారు. మాలాంటి బక్క రైతులను పట్టించుకునేవారు కరువయ్యారు..బహిరంగ మార్కెట్లో యూరియా దొరకడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అదును యూరియా కూడా అందించడం ఈ ప్రభుత్వం చేతకావడం లేదు. – తెన్నేటి శ్రీనివాసనాయక్, తెన్నేరు, కృష్ణా జిల్లాఅరకట్ట ఏ మూలకు సరిపోతుందిఆరుకట్టలు. పురుషోత్తపట్నం నుంచి మంతెన తీసుకెళ్తున్నారు.ఎకరాకు అరకట్ట ఇచ్చారు. చాలడం లేదు. 33 ఎకరాల సొంత భూమి భూమి ఉంది. ఉదయం నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తే..ఆరు కట్టలు ఇచ్చారు. మూడు విడతల్లో కట్ట వెయ్యాలి. కానీ అరకట్టే ఇస్తున్నారు. అమ్మోనియా వేస్తునాం.– కిరణ్..పురుషోత్తçపట్నం, కృష్ణా జిల్లాఅందరికీ సరిపెట్టాలంటున్నారు20 ఎకరాలు..10 కట్టలు ఇచ్చారు. ఒక కోటా వేసాం. అధిక వర్షాలకు పంట మునిగిపోయింది. పంట పోయింది. మళ్లీ నాట్లు వేసాం. రెండో విడతలో యూరియా దొరక్క అగచాట్లు పడుతున్నాం. ఎకరాకు అరకట్ట ఇస్తున్నారు,. చాలా ఇబ్బంది ఉంది. అడిగితే అందరికి సరిపెట్టాలి కదా అంటున్నారు.2వేలకు పైగా అదనంగా ఖర్చు 15 ఎకరాల్లో వరి వేశా. 11 కట్టలిచ్చారు. పైగా సొసైటీలోనే కట్ట రూ.270 తీసుకుంటున్నారు. రెండో విడత యూరియా దొరక్క 20ః20 వేసాం. బస్తాకు రూ.1350 చొప్పున రెండు బస్తాలు వేయాల్సి వచ్చింది. దాదాపు 2వేలకుపైగా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.– పిన్నబోయిన కొండలరావు, కృష్ణా జిల్లారైతులకు బాబు ఎగ్గొట్టిన బకాయిలిలా..⇒ కేంద్రంతో నిమిత్తం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారు. దీన్ని తుంగలో తొక్కి 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.10,716 కోట్లు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.5 వేల చొప్పున రూ.2342.92 కోట్లతో సరిపెట్టారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే దాదాపు 7 లక్షల మందికి కోతపెట్టారు.⇒ ఎన్నడూ లేని విధంగా గడిచిన 15 నెలల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయి 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికీ పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.⇒ ఎన్నికల కోడ్ కారణంగా ఉచిత పంటల బీమా పథకం కింద 2023–24 సీజన్కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం సొమ్ములు కంపెనీలకు చెల్లించలేదు. ఫలితంగా ఆ సీజన్లో కరువు, వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు.⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్–2024–25 ఉచిత పంటల బీమా పథకం కింద రైతుల తరపున చెల్లించాల్సిన రూ.833.92 కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు.⇒ రబీ–2024–25 సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిన అమలు చేసిన ఫసల్ బీమా కోసం ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయలేదు. ఈ కారణంగా దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా బీమా పరిహారం నేటికీ రైతులకు అందని పరిస్థితి నెలకొంది.⇒ 2023–24 సీజన్కు సంబంధించి ఎన్నికల కోడ్తో పాటు వివిధ సాంకేతిక కారణాలతో 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు.⇒ సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి 2024 సీజన్లో 6.31లక్షల మందికి జమ చేయాల్సిన రూ.132 కోట్లు నేటికీ జమ చేయలేదు.⇒ 2024–25 సీజన్లో వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి 4.50 లక్షల మందికి చెల్లించాల్సిన మరో రూ.650 కోట్లు ఇప్పటికీ జమ చేయలేదు. ఈ విధంగా దాదాపు రూ.23,584 కోట్లు కూటమి సర్కారు రైతులకు ఎగ్గొట్టింది.మద్దతు ధర కరువు..సీజన్ ఆరంభంలోనే ధరల పతనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నెల్లూరులో మాసూళ్లకు వచ్చిన సన్నరకాలకే మద్దతు ధర కరువైంది. మద్దతు ధర ప్రకారం పుట్టికి (850 కేజీలు) రూ.19,720 దక్కాల్సి ఉండగా రూ.14వేల నుంచి రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. అదీ కూడా కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏ పంటకూ కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. మార్కెట్లో జోక్యం చేసుకొని ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. ఉల్లి కిలో 50 పైసలకు పడిపోయింది. జీ–9 రకం అరటి టన్ను రూ.4–6 వేలకు పడిపోగా చీని (బత్తాయి) ధర టన్ను రూ.6–12వేలకు పతనమైంది. ఉల్లి రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా క్వింటా రూ.1,200 చొప్పున తమ వద్ద ఉల్లిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే వారిని మభ్యపుచ్చేందుకు హెక్టార్కు రూ.50 వేల సాయం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి రెండో విడతలో 7 లక్షల మందికి కోతపెట్టింది. ఉచిత పంటల బీమాను అటకెక్కించి బీమా ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపింది. ఏడాదిగా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం ఎగ్గొట్టడంతో రైతులకు దక్కాల్సిన రూ.2 వేల కోట్లకుపైగా పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. కరువు బారిన పడి నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. సున్నా వడ్డీ రాయితీకి చాప చుట్టేసింది.గత ప్రభుత్వం ఆదుకుంది ఇలా..వైఎస్సార్సీపీ హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906 కోట్ల విలువైన 3.60 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాదు.. ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి కనీస మద్దతు ధరలు దక్కేలా చర్యలు తీసుకుంది. సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలోనే పంటల ధరలను పర్యవేక్షించింది. టమాటా, ఉల్లి, బత్తాయి, పొగాకు, పత్తి తదితర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఇలా ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి అండగా నిలిచింది. -
కూపన్ల కోసం రైతుల పోటాపోటీ
కారేపల్లి/అడవిదేవులపల్లి: ఒక్క బస్తా యూరియా దక్కించుకునేలా కూపన్ కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 890 బస్తాల యూరియా రాగా, శుక్రవారం కూపన్లు జారీ చేస్తున్నారనే సమాచారంతో మహిళలు సహా పెద్దసంఖ్యలో రైతులు వచ్చారు. కారేపల్లి ఎస్సై బి.గోపి, ఏఓ భట్టు అశోక్కుమార్ ఆధ్వర్యంలో రైతులను నియంత్రించేందుకు శ్రమ పడాల్సి వచి్చంది. రైతుల ఉరుకులు పరుగులు, తోపులాటలో ఒకరిపై ఒకరు పడగా, కొందరు వాహనాలపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి.తొక్కిసలాటలో ఏఓ అశోక్కుమార్ కూడా సొమ్మసిల్లడంతో కారేపల్లి పీహెచ్సీకి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చివరకు కూపన్లను జిన్నింగ్ మిల్లులో ఇస్తామని చెప్పడంతో రైతులు అక్కడికి పరుగులు తీశారు. అక్కడికీ వేలాదిగా చేరడంతో అదే పరిస్థితి ఎదురైంది. కొందరు రైతులు కూపన్ల కోసం ఎగబడటంతో హోంగార్డు శంకర్ ఉక్కిరిబిక్కిరై కారేపల్లి పోలీసుస్టేషన్కు వెళ్లి తలదాచుకున్నాడు. ఈక్రమంలో 2,152 కూపన్లను రైతులకు అందజేయగా, మరో 1,600 మంది ఆందోళనకు దిగడంతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అక్కడికి చేరుకుని నచ్చచెప్పారు. ఆపై అందరి పేర్లు నమోదు చేసుకుని 1,600 మంది రైతులకు ఇళ్ల వద్దే శనివారం నుంచి కూపన్లు ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. 11న తోపులాటలో గాయపడ్డ మహిళ మృతినల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం జరిగిన తోపులాటలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. గోన్యాతండాకు చెందిన పాతులోతు దసి (52) ఈనెల 11న రైతు వేదిక వద్దకు యూరియా కోసం వచ్చి క్యూలో నిలబడింది. ఈ సందర్భంగా రైతుల మధ్య జరిగిన తోపులాటలో క్యూలో ఉన్న దసి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. తోటి రైతులు ఆమెను ఆటోలో మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎరువు కోసం రైతన్న ఏకరువు!
రైతన్న దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నాడని ఎంత చెప్పుకుంటున్నా వ్యవసాయానికి సంబంధించి తనకు మౌలిక సదుపాయాల భరోసా ఇవ్వకపోతే ఎలా అనే ప్రశ్నలొస్తున్నాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం అన్నదాత పడిగాపులు అంతాఇంతా కావు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకా అని చెప్పుకుంటున్న కుప్పంలోనూ ఎరువు కోసం కర్షకులు ఏకరువు పెడుతున్న దుస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితులు లేవు. అయితే అప్పటి రైతన్న కష్టాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పోకడలు కారణమవుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, క్రిమిసంహారకాల వాడకం పెరుగుతుండడం వల్ల సాగుభూమి క్రమంగా సారం కోల్పోతుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. పంటల దిగుబడి పెంచాలంటే సహజ ఎరువులు వాడాలని అధికారాలు ఎంత ఊదరగొడుతున్నా అందుకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆ లక్ష్యం నీరుగారుతోంది. రైతులు ఏ పంట వేసినా దాదాపు యూరియా వాడకం తప్పనిసరైంది. కానీ సాగుకు సరిపడా యూరియా తయారీలో యాంత్రాంగాలు జాప్యం చేస్తున్నాయనే వాదనలున్నాయి. అందుకు కొన్ని కారణాలను కింద తెలియజేశాం.ఎంత అవసరమో ముందే తెలిసినా..యూరియా పంట దిగుబడి పెంచడంలో, ఆహార భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తరచు దీని తయారీ ప్లాంట్లను స్థాపించడంలో లేదా ఇప్పటికే ఉన్న వాటిలో ఉత్పాదకతను పెంచడంలో గణనీయమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాంతో రైతులకు పంట సమయానికి ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు తప్పడంలేదు. ప్రతి ఏడాది ఎంత మొత్తంలో ఎరువులు అవసరం అవుతాయో ముందే నిర్ధారించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఎరువులు తయారు చేయాలి లేదా దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ గోదాముల్లో ఎరువులు నిల్వ ఉంచి అవసరాలకు తగ్గట్టుగా వెంటనే సరఫరా చేసే వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎరువుల తయారీలో, వాటి సరఫరాలో జాప్యానికి చాలానే కారణాలున్నాయి.అడపాదడపా నిధులుయూరియా తయారీ అనేది మూలధన ఆధారిత ప్రక్రియ. కొత్తగా ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి చాలా ఏళ్లు పట్టవచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే పరిమిత ఆర్థిక వసతులతో పోరాడుతున్నాయి. ఫలితంగా ఇటువంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం కష్టమవుతుంది. బడ్జెట్లో వ్యవసాయానికి అడపాదడపా కేటాయించిన మొత్తం నిధుల నుంచి ఇలాంటి ప్రాజెక్ట్లకు ఖర్చు చేయడం సవాలుగా కూడుకుంటోంది.సబ్సిడీ భారంనిర్మాణ వ్యయంతోపాటు యూరియా తయారీకి భారీగా సబ్సిడీ ఇస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో రైతులు యూరియాను దాని వాస్తవ ఉత్పత్తి వ్యయంలో కొంత ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రాయితీలతో పూడుస్తోంది. దేశీయంగా ఉత్పాదకతను పెంచితే అందుకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలకు అధిక సబ్సిడీ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వాలకు భారం. ఇంకొన్ని కంపెనీలు డీఏపీ, పొటాష్..వంటి ఇతర కృత్రిమ ఎరువుల తయారీకి యూరియాను దారి మళ్లిస్తున్నాయి. ఆయా ఎరువులపై మార్జిన్లు అధికం ఉండడం, వాటికి మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండడంతో ఈమేరకు అక్రమాలకు పాల్పడుతున్నాయి.ప్రాజెక్ట్ల తాత్సారంకొన్నిసార్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యూరోక్రటిక్ నిబంధనల కారణంగా యూరియా ప్రాజెక్టుల అమలుకు చాలా ఆలస్యం అవుతుంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు పొందడం, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రావడం, కఠిన నిబంధనలు పాటించడం వంటి చర్యలతో ఏళ్లకుఏళ్లు ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది. అంతేగాక రసాయనాలు, ఎరువులు, పర్యావరణం, పెట్రోలియం (గ్యాస్ సరఫరా కోసం), ఫైనాన్స్ వంటి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఏదైనా విభాగంలో ఆలస్యం జరిగితే మొత్తం ప్రాజెక్టు పురోగతి ఆగిపోతుంది.అంతర్జాతీయ మార్కెట్లు..స్వల్పకాలిక వ్యవసాయ అవసరాలను తీర్చడానికి అనేక ప్రభుత్వాలు దేశీయ ఉత్పాదకతపై పెట్టుబడులు పెట్టడానికి బదులుగా యూరియాను దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇది మరింత ఖర్చుకు దారితీస్తుంది. అయితే కొత్తగా ప్రాజెక్ట్ స్థాపించి సరఫరా చేయడానికి బదులుగా ఇది సరళమైన విధానంగా కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింత పెరుగుతున్నాయి. అయితే, ఎరువుల దిగుమతిపై ఆధారపడటం దీర్ఘకాలిక బలహీనతలను సృష్టిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆంక్షలు లేదా ధరల అస్థిరత కారణంగా ఏదైనా ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడినప్పుడు అసలు సమస్య గుర్తుకొస్తుంది. ఇది దేశీయ వ్యవసాయ ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.లాభదాయకంగా చేయవచ్చు.. కానీ..యూరియా ఉత్పత్తి సహజ వాయువు లభ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫీడ్స్టాక్గా ఉపయోగిస్తారు. అనేక దేశాల్లో సహజ వాయువు కొరత ఉంది. ఒకవేళ దిగుమతి చేసుకోవాలన్నా ఖరీదుతో కూడుకుంది. సహజవాయువు సమృద్ధిగా ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా యూరియా ఉత్పత్తిని ఆర్థికంగా లాభదాయకం చేయవచ్చు. గ్యాస్ సరఫరాలో అంతరాయాలు లేదా అననుకూల ధరల ఒప్పందాలు ఉత్పత్తిని నిలిపేస్తున్నాయి. కొత్త ప్లాంట్ ఏర్పాటును ఆలస్యం చేస్తున్నాయి.ఇప్పుడేం చేయాలంటే..ప్రభుత్వాలు సంప్రదాయ యూరియా వాడకానికి దూరంగా నేల ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరతపై అవగాహన పెంపొందించే ప్రయత్నాలను మరింత పెంచాలి. నానో యూరియా, బయో ఫెర్టిలైజర్స్, సేంద్రియ ఎరువులు వాడకం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించేలా రైతు సమావేశాలు ఏర్పాటు చేయాలి. యూరియా వాడకంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతూ దిగుబడి స్థిరంగా ఉన్నా రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయాలవైపు చూసే అవకాశం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత సాయంతో సంప్రదాయ యూరియాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గాలేమిటో అధికారులు, పరిశోధకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు? -
యూరియా కోసం రేయింబవళ్లూ పడిగాపులు
సంతకవిటి: ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లు, ప్రైవేటు దుకాణాల వద్ద క్యూ కడుతూనే ఉన్నారు. నిద్రకూడా మానుకుని రాత్రుళ్లూ షాపుల వద్దే పడిగాపులు పడుతున్నారు. వేకువనే అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. యూరియా కోసం ఇన్ని కష్టాలు ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు. విజయనగరం జిల్లా సంతకవిటిలో ఓ ప్రైవేటు దుకాణం వద్ద బుధవారం రాత్రి 9 గంటల వరకు యూరియా కోసం క్యూకట్టిన రైతులు సరుకు అందకపోవడంతో నిరాశచెందారు. గురువారం మళ్లీ పంపిణీ చేస్తామని దుకాణం యజమాని చెప్పడంతో రాత్రంతా రైతులు అక్కడే ఉండిపోయారు. దోమలతో జాగారం చేశారు. గురువారం వేకువనే ఇలా బారులుతీరారు. భారీగా బారులు తీరిన రైతులను చూసి యజమాని దుకాణం తెరిచేందుకు భయపడ్డారు. ఏఓ సి.బి.యశ్వంతరావు, పోలీసుల సమక్షంలో దుకాణం తెరిచి యూరియా పంపిణీ ప్రారంభించారు. ఆధార్కార్డు, వన్–బి తెచ్చిన వారికే యూరియా ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి దోమల్లో కాపలా ఉంటే ఇప్పుడు నిబంధనలు పెట్టడంపై వాగ్వాదానికి దిగారు. టోకెన్లు ఉన్న రైతులకు 444 బస్తాలు పంపిణీ చేయడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. వ్యవసాయం మానేయాలా బాబూ..నేను దివ్యాంగుడిని. క్యూలైన్లో నిల్చోగలనా? నేను వ్యవసాయం మానేయాలా బాబూ.. నేనేమి చేయాలి చెప్పండి. గత ప్రభుత్వంలో రైతుభరోసా కేంద్రాలకే యూరియా వచ్చేది. ఇప్పుడు బస్తా యూరియా కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనీసం ఒక బస్తా యూరియా కూడా అందలేదు. – గడే సీతారాం, దివ్యాంగుడు, రైతు, ముకుందపురం -
కొందరు రైతులనైనా జైలుకు పంపండి
సాక్షి, న్యూఢిల్లీ: పంట వ్యర్థాలను తగలబెడుతూ వాయుకాలుష్యానికి కారణమవుతున్న రైతులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. కొందరు రైతులను కటకటాల వెనక్కి నెడితేనే ఇతర రైతుల్లో భయం ఉంటుందని, వ్యర్థాలను తగలబెట్టే రైతులకు గట్టి సందేశం ఇచ్చిన వాళ్లమవుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్, పంజాబ్లలో రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం పై విధంగా స్పందించింది. ‘రైతులు నిజంగా ప్రత్యేకమైనవాళ్లే. వాళ్ల కారణంగానే మనం ఆహారం తినగల్గుతున్నాం. అంతమాత్రాన మనం పర్యావరణాన్ని కాపాడకుండా మౌనంగా కూర్చోలేం కదా. పంట వ్యర్థాలను తగలబెడుతున్న రైతులను శిక్షించే సెక్షన్లు ఉన్నాయి కదా? వాయుకాలుష్యంతో పర్యావరణానికి హాని తలపెడుతున్న కొందరు రైతులను అరెస్ట్చేస్తేనే మిగతా వాళ్లకు గట్టి సందేశం వెళుతుంది. తప్పు చేసిన రైతులను శిక్షించేందుకు చట్టంలో నిబంధనలు ఉన్నాయని మీకు తెలియదా? పర్యావ రణాన్ని కాపాడాలనే సత్సంకల్పం మీకు ఉంటే రైతులను అరెస్ట్చేయడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని న్యాయస్థానం నిలదీసింది. ‘‘పంట వ్యర్థ్యాలను జీవఇంధనంగా ఉపయోగంచవచ్చన్న వార్తలను మేం కూడా వార్తాపత్రికల్లో చదివాం. ఇలా సద్వినియోగం చేసుకోండి అని మేం పదేపదే చెప్పలేం’’ అని సీజేఐ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ‘సీఏక్యూఎం, సీపీసీబీల్లో పోస్ట్లను మూడు నెలల్లోపు భర్తీచేయండి. పదోన్నతి పోస్ట్లను ఆరు నెలల్లోపు భర్తీచేయండి’ అని కోర్టు ఆదేశించింది. రైతులు కథలు చెబుతున్నారుఈ కేసులో పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా, అమికస్ క్యూరీ(కోర్టు సహాయకురాలు)గా అపరంజిత హాజరయ్యారు. గతేడాదితో పోల్చితే పంట వ్యర్థాల దహనం తగ్గుముఖం పట్టిందని మెహ్రా న్యాయస్థానానికి తెలిపారు. ఈ ఏడాది వ్యర్థాల దహనాలను మరింతగా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ వాదనలతో అమికస్ క్యూరీ అపరంజిత విభేదించారు. రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండటానికి ప్రభుత్వం రైతులకు నగదు ప్రోత్సాహకాలు, ఇతర పరికరాలు అందిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు లేదని ఆమె న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఉపగ్రహాలు తమ పంటపొలాల మీదుగా వెళ్లిన సమయాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని వ్యవసాయశాఖ అధికారులే తమకు ఉప్పందించారని రైతులు అవే కథలు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె కోర్టుకు వివరించారు. పంట వ్యర్థాల దహనంపై 2018లోనే సుప్రీంకోర్టు విస్తృతమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో కోర్టు ముందు నిలిచాయని వ్యాఖ్యానించారు.లేదంటే మేమే నిర్ణయం తీసుకుంటాం‘పర్యావరణానికి నష్టం కలిగించే రైతులపై చర్యలు తీసుకోవాలి. ఒక వేళ కఠిన చర్యలు తీసుకోవడానికి మీకు మనసురాకపోతే ఆ విషయాన్ని అయినా లిఖితపూర్వకంగా మాకు తెలపండి. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేకుంటే మేమే తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ముందుగా అరెస్టులు, చర్యలు తీసుకున్నాం. కానీ వీరిలో హెక్టార్ సాగుభూమి ఉన్న రైతులే ఎక్కువ. వీళ్లను జైల్లో పెడితే, వీళ్లపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటి? గడిచిన సంవత్సరాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన ఘటనలు 77,000 జరిగితే అవి ఏకంగా 10,000 స్థాయికి దిగొచ్చాయి’ అని రాహుల్ మెహ్రా కోర్టుకు నివేదించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ‘ఎప్పట్లాగా రోటీన్గా రైతులకు సూచనలు చేయడం మానేసి ఈసారి అరెస్టులు, జైలుకు పంపడానికి కూడా మేం వెనకాడము అనే గట్టి సందేశాన్ని ఇవ్వండి. వచ్చే పంటకాలంలోపు పొలాల్లో వ్యర్థాలు పర్యావరణహితంగా తొలగించాలి’ అని ఆయా రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. -
ముద్దబంతి తోటలో మూగ రోదన!
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ధర లేక ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంది. అరటి, చినీ, టమాటా ధరలు కర్షకుల ఆశలు విరిచేస్తున్నాయి. తాజాగా బంతి పూల ధరలూ పతనం కావడం రైతులను మరింతగా కుంగదీస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక అప్పుల ఉబిలో కూరుకకుపోయి సీమ రైతులు గగ్గోలు పెడుతున్నారు. పూల ఉత్పత్తి అంతా.. సీమ నుంచే.. రాష్ట్రంలో అన్ని పూలు కలిపి ఉత్పత్తి 10.88 లక్షల టన్నులు కాగా, ఒక్క రాయలసీమలోనే 7 లక్షల టన్నుల (64.39శాతం)కు పైగా ఉత్పత్తి అవుతుంది. బంతిపూల ఉత్పత్తిలోనూ రాయలసీమదే అగ్రస్థానం. ఏటా 1.12 లక్షల టన్నుల బంతిపూలు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుండగా, ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే 77 వేల టన్నులు ఉత్పత్తి అవుతాయి. బంతిపూల సాగు, ఉత్పత్తిలో టాప్–10 జిల్లాల్లో 8 జిల్లాలు రాయలసీమలోనే ఉన్నాయి. సాగులో వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో ఉండగా, ఉత్పత్తి పరంగా చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉంటుంది. ఎకరాకు రూ.లక్షా 25వేలు పెట్టుబడి సాధారణంగా ఎకరాకు రూ.16–18 వేల వరకూ బంతి మొక్కలు నాటతారు.. ఒక్కొక్క మొక్క ధర రూ.2–2.5కు తక్కువ ఉండదు. ఎకరాకు కేవలం మొక్కలకే రూ.40 వేలు ఖర్చు అవుతుంది. ఇక కోయడానికి కిలోకు రూ.6–7 చొప్పున ఖర్చు చేస్తారు. ఇతర ఖర్చులన్నీ కలుపుకుంటే ఎకరాకు పెట్టుబడి రూ.లక్షా 25వేల వరకు అవుతుందని కర్షకులు చెబుతున్నారు. సాధారణంగా దిగుబడి ఎకరాకు ఐదు టన్నుల వరకు వస్తుంది. అయితే ఈ ఏడాది వర్షాల వల్ల దిగుబడి మూడు టన్నులే వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దసరా ఆరంభ సీజన్లోనూ ధర లేక సాధారణంగా పండగ సీజన్లో బంతిపూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దసరా పండగ సీజన్లో అయితే నవరాత్రుల తొమ్మిది రోజులూ ఆలయాల్లో అమ్మవారిని అలంకరించేందుకు బంతిపూలను ఎక్కువగా వాడతారు. దీంతో దసరా సీజన్ ప్రారంభమవుతుందంటే ఏటా బంతిపూలకు ఎక్కడ లేని డిమాండ్ వస్తుంది. రైతులు కూడా ఈ సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు. పండగ సీజన్కు దిగుబడి వచ్చేలా సాగు చేస్తారు. ఈ సీజన్లోనే మంచి ధర పలుకుతుందని, నాలుగు డబ్బులు వెనకేసువచ్చని ఆశతో ఉంటారు. అలాంటిది ఈ ఏడాది దసరా సీజన్ ప్రారంభమయ్యే తరుణంలో బంతి పూల ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. కిలో రూ.10–12కు మించి కొనే పరిస్థితి లేకుండా పోయింది. వినాయకచవితి పండగ రోజుల్లో రెండు రోజులు మాత్రమే కిలో రూ.50–60 ధర లభించగా, ఆ తర్వాత ధరలు పతనమవుతూ వచ్చాయి. కనీసం కిలోకు రూ.35–40 వస్తే కానీ రైతులకు పెట్టుబడులు దక్కవు. ప్రస్తుత ధరలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ధర వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బంతిపూల ధరలు రికార్డుస్థాయిలో పలికాయి. కిలో రూ.80–120 మధ్య ధర లభించింది. 2019–24 మధ్యలో ఒక్క బంతిపూలే కాదు. రాష్ట్రంలో సాగయ్యే అన్ని రకాల పూలకు ఏటా గిట్టుబాటు ధరలు లభించడంతో రైతులు మంచి లాభాలనే ఆర్జించారు. సంక్షోభంలో సీమ రైతులు కూటమి ప్రభుత్వం వచి్చనప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా పండ్లు, కూరగాయలతోపాటు పూల ధరల పతనంతో సీమ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఉల్లి, అరటి, చినీ, టమాటా ధరలు పతనమైపోయాయి. తాజాగా ఈ బాటలో బంతిపూల రైతులు చేరారు.వరుసగా ధరల పతనంతో సీమలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో 19శాతం చిత్తూరు 24శాతం, వైఎస్సార్ కడప 35శాతం, సత్య సాయి జిల్లాలో 42శాతం నామమాత్రపు విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు సాగయ్యాయి. ఇక్కడ ఎక్కువగా సాగయ్యే వేరుశనగ పూర్తిగా తగ్గిపోయింది. సాగు జరిగిన చోట కూడా వేరుశనగ, మినుము పంటలు దెబ్బతిన్నాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
ధరల పతనంలో బాబు ‘రికార్డు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు దక్కని దుస్థితిని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? అని దెప్పిపొడిచారు. కర్నూలులో ఉల్లి రైతులకు కిలో రూ.మూడు మాత్రమే దక్కుతుండగా బిగ్ బాస్కెట్, ఇతర ఆన్లైన్ స్టోర్లలో మాత్రం కిలో రూ.29 నుంచి రూ.32 దాకా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని హితవు పలికారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. పంటల ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు..? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? » క్వింటా ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవరూ కొనడం లేదు.. ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతర స్టోర్లలో ఆన్లైన్లో పరిశీలిస్తే కిలో రూ.29 నుంచి రూ.32 దాకా ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25కి తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబు గారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోడం అన్యాయం. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి. -
పట్టువిడుపులుంటేనే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామా.. తెలంగాణ రైతాంగం పరిష్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భూ సమస్య. దాదాపు 9.84 లక్షల దర ఖాస్తులకు సంబంధించిన 11 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కులు ఇచ్చే ప్రక్రియ. దీని అమలు కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఈ క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న, వ్యవహరించాల్సిన తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చట్టం, నిబంధనల పేరుతో రైతులపై కఠినంగా కాకుండా అందరి ఆమోదం మేరకు ఉదారంగా వెళ్లడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. తొలుత మూడు.. ఆ తర్వాత మరిన్ని గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టం తెచ్చినప్పుడు సాదా బైనామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త అంశాలను చేర్చింది. సమస్య పరిష్కారానికి 2020లో ప్రభుత్వానికి దర ఖాస్తు చేసుకుని ఉండాలని, 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉండాలని, సమస్య పరిష్కారమయ్యేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత చట్టానికి నిబంధనలు తయారు చేసేటప్పుడు అదనంగా మరికొన్ని నిబంధనలు పెట్టారు. సాదా బైనామా పరిష్కరించి 13 బీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని, సాదా బైనామాపై విచారణ సందర్భంగా కొన్న వ్యక్తితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనలు విధించారు. ఈ అఫిడవిట్తోనే తంటా.. రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాలను పరిష్కరించే క్రమంలో చట్టంలోని నిబంధనల మేరకు వెళ్తే సన్న, చిన్నకారు రైతాంగానికి చాలా ఇబ్బందులు వస్తాయని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. గత ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని పరిష్కరించకుండా వెళ్లిపోతే, ఈ ప్రభుత్వం సదరు దరఖాస్తులను పరిష్కరించకపోగా, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని, కోర్టుల పాలు చేసిందనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి 2007 కంటే ముందు సాదా బైనామాలను పరిష్కరించే సమయంలో అమ్మిన వ్యక్తి సమ్మతి తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఆ నిబంధనను తీసేశారు. ఎప్పుడో అమ్మిన వ్యక్తి ఇప్పుడు అంగీకరించేందుకు ఇష్టపడక పోవచ్చు కాబట్టి చుట్టుపక్కల రైతులను విచారణ చేసి, లేదంటే గ్రామ పెద్దల స్టేట్మెంట్ ఆధారంగా కూడా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి తోడు పహాణీలోని సాగుదారు కాలమ్లో ఉన్న కొన్న వ్యక్తి పేరును ఆధారంగా పరిగణనలోకి తీసుకునేవారు. 2009–16 వరకు ఇదే పద్ధతిలో సాదా బైనామాలు క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్న వారితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలంటే సమస్యను సృష్టించడమేనంటూ, ఆ నిబంధనను తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రైతుల నుంచి రాతపూర్వక అభ్యంతరాలు తీసుకోవడంతో పాటు చుట్టు పక్కల రైతులను విచారించాలనేది నిబంధనగా చేర్చాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ దరఖాస్తుల సంగతేంటి? సాదా బైనామాల పరిష్కారానికి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 9.84 లక్షల దరఖాస్తులు రాగా కొన్నింటిని అప్పట్లోనే పరిష్కరించినట్టు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ధరణి చట్టంలో సాదా బైనామాల పరిష్కార అంశం లేనప్పటికీ ఆన్లైన్లో వచ్చిన దాదాపు 4 లక్షల దరఖాస్తులపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారని, అందులో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించారని తెలుస్తోంది. అయితే కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారం కోసం 2020లో దరఖాస్తు చేసి ఉండాలని మాత్రమే ఉంది కానీ, అప్పట్లో తిరస్కారానికి గురైతే మళ్లీ పరిశీలించకూడదని లేదు. ఈ చట్టం నిబంధనల్లోనూ దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం గురించిన ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయం మధ్యలో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించాల్సిందేనని నిపుణులు చెపుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా చట్టం, నిబంధనలపైనే ఆధారపడకుంగా సమ్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. సాదా బైనామాలను ఉదారంగా పరిష్కరించకపోతే మరోమారు పరిష్కారానికి అవకాశం లేదు కాబట్టి రైతులు నష్టపోతారని, మళ్లీ సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. చెక్లిస్టు, ఎంక్వైరీ ఫార్మాట్, ప్రాసెస్ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని అంటున్నారు. ఉదారంగా వెళ్లడమే మేలు సాదా బైనామా అనేది తెలంగాణలో పెద్ద భూసమస్య. 1989 నుంచి నలుగుతున్న సమస్య. అది కూడా చిన్న, సన్నకారు రైతులకు సంబంధించింది. కొన్న మాట వాస్తవమా?.. కాదా?, సాగులో ఉన్నారా?.. లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలింకుని మిగిలిన అంశాల్లో పట్టుదలకు పోకుండా ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అదే సమయంలో అవకతవకలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి. – భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు సాదాబైనామా క్లియరెన్స్ కోసం ఏముండాలంటే...! – భూమి రైతు ఆదీనంలో కొనసాగుతుండాలి – 12 సంవత్సరాలుగా సదరు వ్యక్తి అనుభవంలో ఉండాలి – కొనుగోలు చేసినట్టుగా పత్రం లేదా పహాణీలోని సాగుదారు కాలమ్లో పేరు ఉండాలి. సాదా బైనామా.. కథా కమామిషు తెలంగాణ రైతాంగానికి సుపరిచితమైన ఈ సాదా బైనామాల వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం రాజ్యం నుంచి నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్ర రైతాంగం కేవలం తెల్ల కాగితాలపై రాసుకోవడంతో పాటు నోటి మాటలతో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిపింది. వీటినే సాదా బైనామాలంటున్నారు. నిరక్షరాస్యతతో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలంటే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో కొందరు రైతులు ఈ ప్రక్రియ ద్వారా భూముల యాజమాన్య హక్కును మార్చుకునే వారు. కానీ కొన్ని వ్యక్తికి అధికారికంగా ఎలాంటి హక్కులు వచ్చేవి కావు. తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో తొలిసారిగా 1989లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత 1996, 97.. ఇలా ఇప్పటికి 13 సార్లు ఉచితంగా ఈ తరహా భూములను క్రమబద్ధీకరించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 2017లో కూడా క్రమబద్ధీకరణ జరిగింది. చివరిసారిగా 2020లో ఆన్లైన్లో దరఖాస్తులు. ఇప్పుడు ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియనే జరుగుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. -
గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను దున్నేసిన రైతు
-
కనికరం లేదా చంద్రబాబు..?
-
రైతుల కష్టాలపై జగన్ ఎమోషనల్ ట్వీట్
-
బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్పై తన ఎక్స్ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.... క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్ చేశారాయన. .@ncbn గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ… pic.twitter.com/swvxxr9hse— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2025 -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
ఆత్మకూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.యాలేరు గ్రామానికి చెందిన శీనప్ప కుమారుడు హరిజన కుంటెన్న (37)కు భార్య ముత్యాలమ్మ, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తమకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం శీనప్ప మృతి చెందాడు. అప్పటి నుంచి వ్యవసాయంతోపాటు ఇంటి బాధ్యతలు కుంటెన్నపై పడ్డాయి. ఇటీవల 3.8 ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోగా, వాటిని తొలగించాడు. వ్యవసాయానికి, ఇంటి అవసరాలకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడేవాడు. సోమవారం భార్యాపిల్లలు ఆమె పుట్టింటికి వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న కుంటెన్న మధ్యాహ్నం ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మేం చెప్పిన వారికే ఇవ్వాలి
‘యూరియా మేం చెప్పిన వారికే ఇవ్వాలి. లేదా గతంలో చేసినట్టు మా ఇంటి దగ్గర టోకెన్లు రాసి రైతులకు ఇవ్వాలి. లేదంటే అమ్మకాలు ఆపేయాలి’ అంటూ శ్రీకాకుళం జిల్లా గార మండలం బూరవెల్లిలో ఓ టీడీపీ నాయకుడు అధికారులకు హుకుం జారీ చేశాడు. ఆదివారం బూరవిల్లి రైతు సేవా కేంద్రానికి 313 యూరియా బస్తాలు వచ్చాయి. ఇదే ఆర్ఎస్కే పరిధిలో అంబళ్లవలస గ్రామం ఉంది. ఆ రైతులకు సచివాలయం దగ్గర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు టోకెన్లు మెయిన్రోడ్డులోని పాల కేంద్రం దగ్గర ఇస్తారనే సమాచారంతో రైతులంతా అక్కడకు చేరుకున్నారు.కొందరు రైతులకు టోకెన్లు ఇస్తుండగా, స్థానిక టీడీపీ నాయకుడు మళ్ల అబ్బాయినాయుడు అక్కడకు చేరుకొని ఇక్కడ యూరియా ఇవ్వడానికి వీల్లేదని, టీడీపీ కార్యకర్తలకే యూరియా ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో రైతులు వాగ్వాదానికి దిగా రు. అధికారులు టోకెన్లు పంపిణీ నిలిపేశారు. ఎస్ఐ సీహెచ్ గంగరాజు టోకెన్లు ఇచ్చే పాలకేంద్రం వద్దకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ విషయమై ఏఓ డి.పద్మావతిని వివరణ కోరగా యూరియా పంపిణీ మంగళవారం సచివాలయం వద్ద జరుగుతుందని చెప్పారు. -
యూరియా కోసం యాతన
సాక్షి, నెట్వర్క్: యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుసేవా కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఘర్షణలు, తోపులాటలు చోటుచేసుకోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టంచుకోవడం లేదు. పైగా కూటమి నేతలు, వారి అనుయాయులకు యూరియా బస్తాలను అడ్డదారిలో అందిస్తోంది. ఫలితంగా అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆందోళనకర ఘటనలు ప్రభుత్వ కఠినత్వానికి, తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ⇒ విజయనగరం జిల్లా గజపతినగరం మండలం లోగీశ గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు సోమవారం బారులు తీరారు. క్యూలో ఉన్నవారికి కాకుండా టీడీపీ అనుచరులకు అడ్డదారిలో యూరియా పంపిణీ చేయడంతో రైతులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఓ రైతు కిందపడిపోయాడు. దీంతో కర్షకులు ఆందోళన చేయడంతో అధికారులు యూరియా పంపిణీని నిలిపివేశారు. ⇒ శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం హెచ్ఎన్ పేట, వడ్డితాండ్ర సచివాలయ పరిధిలోని రైతులు యూరియా కోసం సోమవారం బారులు తీరారు. ఎండలోనే గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. సగం మందికే యూరియా బస్తాలు అందాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళిలోనూ రైతులు యూరియా కోసం గ్రోమోర్ సెంటర్ వద్ద పడిగాపులు పడ్డారు. ⇒ చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. బస్తాలు తీసుకునే క్రమంలో గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక, తోటపల్లి రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. చెప్పులు క్యూలైన్లో ఉంచి మండుటెండలో పడిగాపులు పడ్డారు. సాయంత్రం సమయంలో వర్షం పడటంతో తోటపల్లిలో వానలోనే తడిసిముద్దయ్యారు. ⇒ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం నాగాపురం సచివాలయం వద్ద రైతులు యూరి యా కోసం సోమవారం ఆందోళన చేశారు. కేవలం 40 బస్తాలు పంపిణీ చేసి ఆపేయడంతో మిగతా రైతులు సిబ్బందిని నిలదీశారు. ⇒ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గరిశింగిలో సోమవారం అరకొరగా యూరియా అందుబాటులోకి రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. క్యూలైన్లో నిరీక్షించినా యూరియా దొరక్క రైతులు నిరాశతో వెనుదిరిగారు. ⇒ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలోని రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం తహసీల్దార్ కార్యాయలం వద్ద ధర్నా చేపట్టారు. టోకెన్ల జారీలోనూ అధికారులు చేతివాటం చూపుతున్నారని దుయ్యబట్టారు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారిణి గీతాకుమారి, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. -
AP: ‘యూరియా’పై హ్యాండ్సప్!
కొరతలేదు.. న్యూసెన్స్ చేస్తే బొక్కలో పెట్టి పనిష్ చేస్తాఏ రైతుకూ యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడైనా ఎరువులు లేవంటే నేనే అక్కడకు వెళ్తా! కావాలని న్యూసెన్స్ చేస్తే తీసుకెళ్లి బొక్కలో పెట్టి పనిష్ చేస్తా.. మీరు రాజకీయాల్లో భాగస్వాములు కావద్దు.. రైతులు రైతులుగా ప్రవర్తించండి! డ్రామాలు ఆడితే ఈ ప్రభుత్వమంటే ఏమిటో చూపిస్తాం.. – ఇటీవల సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఔను.. యూరియా పంపిణీలో విఫలమయ్యాం.. రైతులకు యూరియా సరఫరాలో వైఫల్యం చెందాం.. ఇది మానవ తప్పిదమే. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూరియా వినియోగాన్ని తగ్గించాలి. భూసార పరీక్షలు నిర్వహించ లేదు.. రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదు.. వ్యవసాయ అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు.. ఇప్పుడు ఉల్లి, టమాటా ధరలు పడిపోయాయి.. ఈ సమయంలో రైతులు రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలి. – కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రైతులకు యూరియా సరఫరా చేయడంలో వైఫల్యం చెందామని, ఇది మానవ తప్పిదమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వ్యవసాయ అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని సీఎం అంగీకరించారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళిలో రైతుల పడిగాపులు ఏ రైతుకూ యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని, ఎక్కడైనా ఎరువులు లేవంటే తానే స్వయంగా అక్కడకు వెళ్తానని గతంలో ప్రకటించిన చంద్రబాబు తాజాగా యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఎట్టకేలకు కలెక్టర్ల సదస్సు సాక్షిగా ఒప్పుకోవడం గమనార్హం. సాగు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని నిలుపుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీసు రంగాల్లో వృద్ధి లక్ష్యాలపై ప్రజెంటేషన్ అనంతరం కలెక్టర్లు వివిధ సమస్యలను ప్రస్తావించిన సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.అల్లూరి సీతారామరాజు జిల్లా తోటపల్లిలో క్యూలైన్లో చెప్పులు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు..యూరియా సరఫరాలో వైఫల్యం మానవ తప్పిదమే అవుతుందని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడేవి కావని, కరెంట్ ఉండేది కాదని, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసుకుని పోయేదన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని, అయితే రైతులకు యూరియా సరఫరా విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు. యూరియా సరఫరా విషయంలో ప్రణాళిక సరిగా అమలు చేయలేదన్నారు. ఈ విషయంలో వైఫల్యం చెందామన్నారు. ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు. భూసార పరీక్షలు.. పోషకాల పంపిణీ లేదు ఈ ఏడాది భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక నుంచి ముందుగా భూసార పరీక్షలు చేసి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఇవ్వాలని సూచించారు. యూరియాను ఎక్కువగా వినియోగిస్తే కేన్సర్ జబ్బుల్లో తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మొదటి స్థానానికి వెళ్తుందని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో పంజాబ్ను కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు. ఆ దిశగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం వినియోగిస్తున్న యూరియాలో ఒక బస్తా తగ్గించే రైతులకు రూ.800 చొప్పున ప్రోత్సాహకం ఇస్తామన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గిస్తే పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ ఇస్తుందని, ఆ మొత్తాన్ని యూరియా వాడకం తగ్గించే రైతులకు ఇస్తామని చెప్పారు. త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ఉల్లి, టమాటా రైతులు రోడ్డెక్కకుండా చూడాలి..రసాయన ఎరువుల కారణంగా మన మిరపను చైనా తిరస్కరించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. యూరప్ దేశాల్లో మన ఉత్పత్తులకు ధర తగ్గిస్తున్నారన్నారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయన్నారు. ప్రజలు తినే వెరైటీలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని, లేదంటే ఉత్పత్తులను కొనేవారు ఉండరన్నారు. డిమాండ్, సరఫరాకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులను చైతన్యపరచడంలో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. పొగాకు కొనుగోలు చేశామని, ఈ ఏడాది పంట హాలిడే ఇచ్చామన్నారు. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా ధరలు పడిపోయాయని, ఈ సమయంలో రైతులు రోడ్డు మీద పడకుండా వారి ఇబ్బందులను తగ్గించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కడప నుంచి రైతులు టమోటా తీసుకురావాలంటే రవాణా ఖర్చు ఎక్కువ అవుతుందని వదిలేస్తున్నారని, అలా కాకుండా రవాణా చార్జీలను ప్రభుత్వం భరిస్తుందన్నారు. పట్టణ నియోజకవర్గాలను మినహాయించి మిగతా 157 చోట్ల పశువుల హాస్టళ్లను చేపట్టాలని సూచించారు. గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటర్న్∙గిఫ్ట్ ఇస్తుందన్నారు. జీఎస్డీపీ వృద్ధిలో పశు సంపద పాత్ర కీలకమన్నారు. దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేయాలని సూచించారు.రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ కట్సాగు వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని నిలిపేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికి 30 శాతం మందే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా వారు కూడా నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదంటే యూనిట్ విద్యుత్ రూ.1.50 సరఫరాను నిలుపుదల చేస్తామన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రైతుల్లో క్రమశిక్షణ అవసరమన్నారు. కాలుష్యం పెరిగి ఆక్వా ఉత్పత్తులు దెబ్బ తింటే కొనేవారు ఉండరని సీఎం పేర్కొన్నారు.కోనసీమ కంటే ‘అనంత’ తలసరి ఆదాయం అధికం..కోనసీమ కంటే అనంతపురం తలసరి ఆదాయం, జీఎస్డీపీ ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. ఇందుకు ఉద్యాన పంటలే కారణమన్నారు. వివిధ వాణిజ్య, ఉద్యాన పంటల కారణంగా ఆయిల్ పామ్ ఉమ్మడి గోదావరి జిల్లాలకు గేమ్ ఛేంజర్గా మారిందన్నారు. ఏజెన్సీలో కాఫీ కంటే మిరియాలు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నాయన్నారు. ఫెయిల్.. పాస్ మంత్రులకూ వర్తిస్తుంది ఈ ఆర్థిక ఏడాది వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఎవరు ఫెయిల్? ఎవరు పాస్? అనేది డేటా ప్రకారం తేలుతుందని, ఇది కలెక్టర్లతోపాటు మంత్రులకూ వర్తిస్తుందని సీఎం స్పష్టంచేశారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఈ ఏడాది 17.11 శాతం వృద్ధి సాధించాలన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారి నుంచి మంత్రులు, కలెక్టర్లు గ్రామ కార్యదర్శి వరకు వృద్ధి సాధనలో పాత్ర పోషించాలన్నారు. విమానాశ్రయాలు, పోర్టులు, పర్యాటక ప్రాజెక్టుల వద్ద ఎకో సిస్టం రూపొందించాలన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. -
sagubadi: గడ్డి సాగుతోనే అధికాదాయం!
రైతు కుటుంబాలకు పంటలపై వచ్చే ఆదాయంతో పోల్చితే, పశుపోషణ ద్వారా సమకూరే నిరంతర ఆదాయం చాలా ఎక్కువ. చిన్న, సన్నకారు రైతులు తమ పశువులకు గడ్డిని, దాణాను సరిపడా అందించలేకపోతు న్నారు. అందువల్లే మన దేశంలో పశువుల ఉత్పాదకత బాగా తక్కువగా ఉంది. పశువుల్ని పెంచే ప్రతి రైతూ కొన్ని సెంట్లు/ కొన్ని కుంటల్లో అయినా గడ్డిని కూడా పెంచుకోవాలి. సైలేజి గడ్డి, దాణాలను తానే తయారు చేసుకొని పశువులను మేపుకుంటే పశుపోషకులకు అధికాదాయంతో పాటు, ప్రతిరోజూ ఆదాయం వస్తుందని గుర్తించాలని సూచిస్తున్నారు పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్టీవీయూ) వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ మంథా జ్ఞాన ప్రకాశ్. వాతావరణ మార్పుల నుంచి జన్యుపరమైన అభివృద్ధి వరకు అనేక కీలకాంశాలపై ఆయన ఇటీవల ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..క్లైమేట్ ఛేంజ్ ప్రతికూల పరిస్థితులు పశుపోషణపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి? ప్రొ. జ్ఞాన ప్రకాశ్: క్లైమేట్ ఛేంజ్ సెగ ఇప్పుడు మనకు విపరీతంగా అనుభవంలోకి వస్తోంది. సాధారణ ప్రజలకు కూడా ఈ సమస్య ఇప్పుడు అర్థమవుతోంది. ఇక్కడ కుండపోత వర్షాలు, టెక్సాస్లో కరువు, మరోచోట అధిక ఉష్ణంతో మంచు కరిగిపోవటం ఇవన్నీ క్లైమేట్ ఛేంజ్ వల్ల జరుగుతున్నవే. పశువుకు గానీ.. మనిషికి గానీ.. ప్రతి ప్రాణికీ అనువైన ఉష్ణోగ్రత రేంజ్ ఒకటి ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్లోనే అది సరిగ్గా పనిచేయగలదు. పాలు, మాంసం వంట ఉత్పత్తుల్ని సరిగ్గా ఇవ్వగలదు. కానీ, ఉష్ణోగ్రత అంతకన్నా పెరిగినప్పుడు దాని జీవక్రియలన్నీ ఇబ్బంది పడతాయి. రావలసినటు వంటి ఉత్పత్తి రాదు. ఇంకొకటేమిటంటే.. పశుగ్రాసం కూడా పొలాల్లో సరిగ్గా పెరగదు. రోగకారక క్రిముల తీవ్రత పెరుగుతుంది. ఎప్పుడో పోయిన క్రిములు కూడా మళ్లీ సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. క్లైమేట్ ఛేంజ్ నుంచి మన జీవరాశిని, గడ్డి జాతులను పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. భూతాపోన్నతి ప్రతికూలతల నుంచి పశు సంపదను ఎలా రక్షించుకోగలం?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవటానికి ఉపయోగపడే కొన్ని రకాల జన్యువులు ప్రతి ప్రాణిలో ఉంటాయి. ఆ జన్యువులపై పరిశోధనలు చేసి గుర్తించి, జన్యుపరంగా అభివృద్ధి చేయటం ద్వారా పెరిగిన ఉష్ణోగ్రతల్లోనూ అవి మంచి ఉత్పాదకతను ఇచ్చేలా మార్చుకోవచ్చు. 37 డిగ్రీల సెల్సియస్ దగ్గర కంఫర్టబుల్గా ఉండే జంతువును 39 డిగ్రీల దగ్గర కూడా కంఫర్టబుల్గా ఉండేలా జన్యుపరంగా అభివృద్ధితో చేసుకోవచ్చు. అసాధారణ ఉష్ణోగ్రతలతో ఏయే పశుజాతులకు ఎక్కువ ఇబ్బంది?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగ్గానే ముందు గేదెలకు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. పునరుత్పత్తి సమస్యలు పెరుగుతాయి. దేశవాళీ ఆవుల కన్నా చల్లటి విదేశాల నుంచి తెచ్చిన జాతుల ఆవులకు పెరిగిన ఉష్ణోగ్రతల్లో మరీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి, పెరుగుతున్న ఉష్ణోగ్రత ల్లోనూ సజావుగా బతకగలిగేలా మన గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెల్లో జన్యుపరమైన సామర్థ్యం పెంపొందించుకోవాలి. భూతాపోన్నతికి పశువులు కూడా కారణం అవుతున్నాయా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: క్లైమేట్ ఛేంజ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకు పశువులు కూడా కారణం అవుతున్నాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు.. వీటి కడుపులో సూక్ష్మజీవుల ద్వారా జరిగే జీర్ణప్రక్రియ (మైక్రోబియల్ ఫర్మంటేషన్) వల్ల మీథేన్ వాయువు వెలువడుతుంది. ఇది వాతావర ణాన్ని అధికంగా వేడెక్కించే వాయువు. ఈ సమస్య ను తగ్గించాలంటే.. పశువులకు పెట్టే దాణాను, గడ్డిని తక్కువ మీథేన్కు కారణమయ్యేలా మార్చాలి. దాణాలో, పశువు కడుపులోని సూక్ష్మ జీవరాశిని కూడా తక్కువ మీథేన్ ఉత్పత్తి చేసేలా మార్పు చేసుకోవాలి. తద్వారా భూతాపం పెరుగుదలను కొంత మేరకు తగ్గించుకోవచ్చు. పేడ నుంచి కూడా ఉద్గారాలు..?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: పశువుల పేడ వల్ల కూడా వాతావరణంలో మీథేన్ పెరుగుతోంది. దీన్ని కూడా అరికట్టాలి. 2–3 పశువులను పెంచుకునే చిన్న, సన్నకారు రైతులు కూడా మీథేన్ను తమ స్థాయిలో నియంత్రించగల పద్ధతులు ఉన్నాయి. పచ్చి పేడను ఆరుబయట వదిలేస్తేనే సమస్య. ఒక చిన్న గుంత తవ్వి అందులో రోజూ వేసి, గుంత నిండిన తర్వాత పైన కొన్ని ఎండు ఆకులు వేసి కప్పిపెట్టాలి. 60 రోజుల్లో మంచి కంపోస్టు ఎరువు తయారవుతుంది. వర్మీకంపోస్టు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీథేన్ చాలా వరకు తగ్గుతుంది. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయా..?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: వాతావరణ మార్పులకు అనుకూలంగా వ్యవసాయం చేయడానికి సంబంధించి ‘నిక్ర’ పేరుతో ఐసీఏఆర్ పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టింది. వ్యవసాయం, అనుబంధ రంగాలన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక సంస్థల్లో చేపట్టిన పరిశోధన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మన పశువుల ఉత్పాదకత తక్కువ ఎందుకని?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: మన దేశంలో పాడి పశువు సగటు పాల దిగుబడి ఒక ఈతలో 1,500–1,700 లీటర్లయితే, ప్రపంచ సగటు 2,700 లీటర్లు. నెదర్లాండ్స్, యూకే, యూఎస్లలో ఇంకా చాలా ఎక్కువ. ముఖ్యంగా మన దగ్గర రైతులు చాలా మంది చిన్న, సన్నకారు రైతులు. వీళ్లు తెలిసీ తెలియక, పశువులను సరిగ్గా మేపలేకపోతున్నారు. వాటికి పోషణ సరిగ్గా అందటం లేదు. ఆ దేశాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే కారణమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ఒక్కటే కారణం కాదు. అంతకన్నా ముఖ్యమైనది జెనెటిక్ ఇంప్రూవ్మెంట్. అక్కడి పశువులను వాళ్లు జన్యుపరంగా బాగా అభివృద్ధి చేసుకోగలిగారు. మనం చేసుకోలేకపోయాం. జన్యుమార్పిడి(జీఎం) కూడా అవసరమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ చాలు. మామూలుగా మన పశువుల్లో ఉన్న మంచి గుణాలున్న జన్యువులనే పెంపొందిస్తాం ఆ జీవిలో. జెనెటిక్ మాడిఫికేషన్ అంటే జంతువుల్లోని జన్యువు లను మార్చేస్తారు. ఒక జన్యువును తీయటం, వేరే దాన్ని పెట్టడం అనేది జెనెటిక్ మాడిఫికేషన్ అంటారు. అది రిస్క్తో కూడిన పని. అవసరం లేదు. జీన్ ఎడిటింగ్ను ఇప్పుడిప్పుడే వాడుతు న్నారు. ఇవి చాలా వివాదాస్పద అంశాలు.ప్రత్యేక బ్రీడ్ల అభివృద్ధికి కృషి జరుగుతోందా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవటంలో దేశీ పశువులు మెరుగ్గా ఉంటాయి. అధిక ఉత్పాదకత కోసం సంకరజాతి పశువులను రూపొందించుకున్నాం. హీట్ టాలరెంట్ జన్యువు లను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. జెనెటిక్ ఇంప్రూవ్మెంట్పై పరిశోధనలు కొనసాగుతు న్నాయి. పంటల్లో కొత్త వంగడాలు తయారు చేసినంత సులభంగా పశువుల్లో జన్యు అభివృద్ధి జరగదు. పంట కాలం ఆర్నెల్లయితే పశువు ఒక తరం 7–8 ఏళ్లు పడుతుంది. సేంద్రియ పశుపోషణకు ప్రత్యేక బ్రీడ్స్ అవసరమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: పశువుల్లో ఆర్గానిక్ బ్రీడ్స్ అంటూ ఏమీ ఉండవు. కొత్త బ్రీడ్ సహజంగా ఎవాల్వ్ కావటానికి కనీసం వందేళ్లు (10–12 తరాలు) పడుతుంది. ఒంగోలు తదితర పశుజాతులన్నీ అనాదిగా ఆర్గానిక్గా ఎవాల్వ్ అయినవే. అయితే, పశువుల పెంపకమే ఈ కాలంలో సూక్ష్మ కుటుంబాలకు భారంగా మారింది. గ్రామాల్లో సేంద్రియ ఎరువుల లభ్యత కూడా అంత తేలిక కాదు. ప్రత్యేకంగా గడ్డి పెంపక క్షేత్రాలు నెలకొల్పినప్పుడే గడ్డి కొరత తీరి, పశుపోషణ సజావుగా కొనసాగుతుంది. అప్పుడే పెరిగే జనాభా అవసరాలకు తగిన పాలు, మాంసం లభిస్తాయి. ఆర్గానిక్ పశు ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ ఉంటుందా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అభివృద్ధి చెందిన దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. యాంటీబయాటిక్ రెసిడ్యూస్, థెరప్యూటిక్ రెసిడ్యూస్ లేని ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతికి కొన్ని పద్ధతులున్నాయి. కొన్ని యాంటీబయాటిక్స్ను 2 నెలల ముందే ఆపెయ్యాలి. కొన్నిటిని ఒక రోజు ముందు వరకు ఇవ్వవచ్చు. ఒక్కో మందుకు ఒక్కొక్క టైమ్ ఉంటుంది. పశువులు పెంచే రైతులకున్న ముఖ్యమైన సమస్య ఏమిటి? ప్రొ. జ్ఞాన ప్రకాశ్: గడ్డి భూములు, అడవులు తగ్గిపోవటమే పెద్ద సమస్య. అందువల్ల పశువులను రోజంతా కట్టేసి పెంచాల్సి వస్తోంది. అందువల్ల దాణా, పచ్చి మేత మన పశువులకు సరిపోను అందటం లేదు. పశువుకు ఇచ్చే ఆహారంలో మూడింట రెండొంతులు పచ్చి గడ్డి, ఒక వంతు దాణా కలిపి ఇస్తే ఆరోగ్యం. అయితే, చిన్న, సన్నకారు రైతులు, భూమి లేని రైతులు దాణా, పచ్చిమేత చాలినంత పెట్టలేకపోతున్నారు. పశువుల ఉత్పాదకత తగ్గిపోతోంది. పరిష్కారం ఏమిటి?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: రైతులు కొన్ని సెంట్లు/గుంటల్లో అయినా గడ్డి పెంచుకోవాలి. పాడిపై రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. ఉన్న కొద్దిపాటి పొలంలో ఈ పశువుల కోసం పచ్చి మేతను పండించుకుంటే వచ్చే ఆదాయం కన్నా.. ఆ పొలంలో ఇతర పంటలు వేస్తే వచ్చే ఆదాయం చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. సైలేజీ గడ్డి, పంట వ్యర్థాలతో దాణాలను సొంతంగా తయారు చేసుకొని వాడుకోవాలి.ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబుఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
శ్రీకాకుళం జిల్లా బూరవెల్లి లో యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన
-
మీ వల్లే యూరియా కొరత..’: చంద్రబాబు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మరోసారి తన మార్క్ కుట్రకు తెరతీశారు. ఈ కుట్రలో కలెక్టర్లను బలిచేసినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎరువుల కొరత అనే మాట వినిపించలేదు. కానీ ప్రస్తుతం అదే వ్యవస్థ, అదే అధికారులు ఉన్నా, రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. బ్లాక్ మార్కెట్ దందా పెరిగిపోవడంతో రైతులు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో యూరియా కొరత ఉందనే విషయాన్ని అంగీకరించారు. అయితే చేతిలో ఉన్న సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. ఇవన్నీ మ్యాన్ మెడ్ సమస్యలే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ఈ క్రమంలో.. యూరియా సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయలేకపోయాం అgటూ యూరియ కొరత అంశాన్ని చంద్రబాబు కలెక్టర్లపై తోసేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సమావేశంలో పాల్గొన్న కలెక్టరు సైతం కంగుతిన్నారు. క్రెడిట్లు కొట్టేయడంలో ఆరితేరిన చంద్రబాబు.. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు మాత్రం అవతలి వాళ్లపై నెట్టేయడంలో సిద్ధహస్తుడనే విషయం మరోసారి రుజువైందని విశ్లేషకులు అంటున్నారు. -
సీమ రైతు..కంట కన్నీరు
-
యూరియా కోసం అవస్థలు.. అధికారులపై తిరగబడ్డ రైతులు
-
గజపతినగరంలో ఉద్రిక్తత.. యూరియా కోసం రైతుల కొట్లాట
విజయనగరం: గజపతినగరం పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతుల ఆందోళనకు దిగారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో రైతుల కొట్లాటకు దిగారు. కుర్చీలు విరిగేలా టీడీపీ నేతలు, రైతులు కొట్టుకున్నారు. రైతులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.. లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపై రైతులు తిరగబడ్డారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు పడనిరాని పాట్లు పడుతున్నారు.అనకాపల్లి: హోం మంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో యూరియా కోసం రైతుల పాట్లు పడుతున్నారు. ఎస్. రాయవరం మండలం కొరుప్రోలు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. యూరియా ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్న యూరియా సక్రమంగా పంపిణీ చేయలేదంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా యూరియా అందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారిని రైతులు డిమాండ్ చేశారు.కాగా, కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత బొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. -
కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి
-
యూరియా కోసం యుద్ధం
సంతబొమ్మాళి/బుచ్చెయ్యపేట/చౌడేపల్లె/సంతకవిటి/సామర్లకోట/ఎచ్చెర్ల/పిఠాపురం: కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. వారం రోజుల కిందట వచ్చిన 110 యూరియా బస్తాలను అధికారులు పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. ఎప్పుడు పంపిణీ చేస్తారని సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను రైతులు అడుగగా సరిపడా యూరియా ఇంకా రాలేదని, పెట్టిన ఇండెంట్ మొత్తం వస్తే పంపిణీ చేస్తామని వాయిదా వేస్తూ వచ్చారు. రోజులు గడుస్తున్నా రావాల్సిన యూరియా రాలేదు. దీంతో ఇదివరకు వచ్చిన 110 బస్తాల యూరియా కోసం శనివారం రైతులు పంచాయతీ కార్యాలయం వద్ద కాపు కాశారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను గ్రామంలో ఉన్న అసిరమ్మ గుడి వద్దకు రహస్యంగా రప్పించి తమ అనుకూలమైన వారితో వేలి ముద్రలు వేయించి స్లిప్పులను తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త కప్ప ఎర్రయ్య రైతులను బూతులు తిట్టడంతో కర్షకులు తిరగబడ్డారు. ఎర్రయ్యను చితకబాదారు. » అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో యూరియా కోసం రైతులు శనివారం తోపులాటకు దిగారు. రాజాం రైతు సేవా కేంద్రానికి 260 బస్తాల యూరియా రావడంతో రాజాం, నీలకంఠాపురం గ్రామాలకు చెందిన 500 మందికి పైగా రైతులు వచ్చారు. ఈ సందర్భంగా రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా తోపులాటకు దారితీసింది. చివరకు కొద్దిమందికే యూరియా అందడంతో మిగిలిన రైతులు నిరాశగా వెనుదిరిగారు.» చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో శనివారం యూరియా కోసం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద, గ్రోమోర్ దుకాణం వద్ద రైతులు క్యూకట్టారు. రెండురోజులుగా ఎరువుల షాపుల వద్ద, వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నా కొందరికే ఎరువులు అందాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. » విజయనగరం జిల్లా సంతకవిటిలోని కోరమాండల్ దుకాణం వద్ద శనివారం గంటల తరబడి రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటలకే దుకాణం వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. పొందూరు–సంతకవిటి ప్రధానరోడ్డు వరకు రైతులు క్యూ కట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. » కాకినాడ జిల్లా నవర గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్లలో నిలబడలేని వారు కూలీలకు రూ.600 ఇచ్చి లైన్లలో నిలబెట్టారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఎండలో నిరీక్షించారు. » యూరియా లేక రైతులు గగ్గోలు పెడుతుంటే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ యూరియా కొరత లేదనడంపై రైతులు మండిపడ్డారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంగొల్లప్రోలు మండలం చేబ్రోలు మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. ‘ఎక్కడున్నావ్ వర్మా.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి యూరియా ఇప్పించు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీకి యూరియా వచ్చిందన్న సమాచారంతో తెల్లవారుజాము నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ఏడీఏ చేతిలోని టోకెన్లను స్థానిక టీడీపీ నేత లాక్కుని కొందరు రైతులకు అందజేయడంతో మిగిలిన రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ నాగలోవరాజు వచ్చి రైతులందరికీ యూరియా ఇవ్వాలని కోరారు. టోకెన్లు అందరికీ ఇచ్చేశామని ఏడీఏ బదులివ్వడంతో జెడ్పీటీసీ రైతులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి స్థానిక మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. జెడ్పీటీసీ, మిగిలినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఠాణాలో టోకెన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా పంపిణీ పోలీసుల చేతుల్లోకి వెళ్తోంది. పంటల అదును దాటిపోతోందన్న బాధతో రైతు వేదికల ముందు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు.. ఎలాగైనా యూరియా దక్కించుకోవాలన్న ఆశతో పరస్పరం దాడులకు దిగుతున్నారు. దీంతో చాలాచోట్ల రైతులను అదుపు చేసేందుకు సాయుధ పోలీసులను మోహరిస్తున్నారు. వ్యవసాయ సహకార సొసైటీలకు వస్తున్న యూరియా తక్కువగా ఉండటం, రైతులు అధిక సంఖ్యలో లైన్లలో వేచిచూస్తుండటంతో అధికారులు టోకెన్ల పంపిణీకి జంకుతున్నారు. ఆ బాధ్యతను కూడా పోలీసులకే అప్పగిస్తున్నారు. తరుముతున్న కాలం.. రాష్ట్రంలో వానాకాలం వరి పంట చాలా జిల్లాల్లో పొట్టదశకు వచ్చింది. గింజ గట్టి పడేందుకు, మొక్కకు బలాన్నిచ్చేందుకు ఇప్పుడు యూరియా వాడకం అత్యవసరం. అదును తప్పితే యూరియా వేసినా ఉపయోగం ఉండదు. దీంతో రైతులు సొసైటీ ఆఫీసులు, యూరియా దుకాణాల ముందు రాత్రి పగలు పడిగాపులు పడుతున్నారు. రాష్ట్రంలోని 500 రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ జరుపుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. దీంతో ఆయా క్లస్టర్ల పరిధిలోని గ్రామాల ప్రజలంతా ఉదయాన్నే రైతు వేదికల వద్దకు వచ్చి లైన్లల్లో నిలబడుతున్న దృశ్యాలు దాదాపు అన్ని జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరినాట్లు ముందుగా పడే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మలిదశ యూరియా వాడకం కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ‘అదును తప్పుతోంది.. ఒక్క బస్తా అయినా ఇప్పించండి’అని కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, జగిత్యాల మొదలైన జిల్లాల రైతులు అధికారులను ప్రాధేయపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూరియా కొరత లేకుండా కేంద్రంతో మాట్లాడి తెప్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రోజూ ప్రకటనలు ఇస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉన్నది 23 వేల మెట్రిక్ టన్నులే.. రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న యూరియా ఏ రోజుకు ఆరోజే అన్నట్లుగా అయిపోతోంది. నిల్వ లేకుండా డిమాండ్కు అనుగుణంగా వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ అధికారులు యూరియాను ఆయా జిల్లాల్లో డిమాండ్ అధికంగా ఉన్న మండలాలకు పంపిస్తున్నారు. రైల్వే వ్యాగన్ల ద్వారా ప్రతిరోజు 5 వేల టన్నులకు తగ్గకుండా యూరియాను కేంద్రం నుంచి తెప్పిస్తున్నా.. అది ఏమూలకు సరిపోవడం లేదు. శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందులో సొసైటీల వద్ద 6 వేల మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 7 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఉదయం దుకాణాలు తెరిచిన వెంటనే టోకెన్ల ప్రకారం ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఈ నిల్వల్లో 70 శాతం వరకు పంపిణీ చేసి, మిగతా నిల్వను మరుసటి రోజు కోసం దాచిపెడుతున్నారు. మార్క్ఫెడ్ గోదాముల్లో ఉన్న 10 వేల మెట్రిక్ టన్నులను ఆచితూచి పంపిస్తున్నారు. వీటికి తోడు ఆ రోజు వచ్చే రైల్వే వ్యాగన్ల లోడ్ మీదనే వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ ఆధారపడుతోంది. సరఫరా చేసింది 7 లక్షల టన్నులు.. రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్లో ఇప్పటివరకు సరఫరా చేసిన యూరియా 7 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఈ సీజన్లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఒక లక్ష ఎకరాలు తక్కువగా అంచనాలో 98 శాతం మేర సాగయ్యాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం ఉన్నది ఈ సీజన్లోనే. ఇందులో యూరియా అత్యధికంగా వినియోగించే వరి ఏకంగా వ్యవసాయ శాఖ అంచనాలకు మించి 104 శాతం సాగైంది. 65.52 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. మొక్కజొన్న కూడా అంచనాకు మించి 122 శాతం.. అంటే 6.36 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి 45.76 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ మూడు పంటలకే కాకుండా ఉద్యాన పంటలకు కూడా యూరియా వినియోగం అధికంగా ఉండడంతో రైతులకు ఈ పరిస్థితి తలెత్తింది. గత సంవత్సరం కన్నా దాదాపు 10 లక్షల ఎకరాలు పంటల విస్తీర్ణం పెరగ్గా, యూరియా కేటాయింపులు మాత్రం తగ్గాయి. ఈ నెలాఖరు వరకు 9.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వచ్చింది 7 లక్షల మెట్రిక్ టన్నులే. కనీసం మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు వెంటనే వస్తే తప్ప రైతులకు బాధలు తప్పవు. అదును తప్పిపోయిన తరువాత యూరియా వచ్చినా ఉపయోగం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచే యూరియా విక్రయంలో రేషన్ పద్ధతి పాటించేలా చేయడంలో విఫలమైన అధికార యంత్రాంగం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తోంది. దీంతో సామాన్య చిన్న, సన్నకారు రైతులు ఒక్కో యూరియా బస్తా కోసం పడిగాపులు పడుతున్నారు. -
యూరియా కోసం సకుటుంబ సపరివారం
సిరిసిల్ల/ఓదెల: అన్నదాతలు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్షాప్ వద్ద శుక్రవారం కుటుంబ సభ్యులు క్యూౖ లెన్లో నిల్చున్నారు. సిరిసిల్ల శివారులోని చిన్నబోనాలకు చెందిన పడిగే ఎల్లయ్య, మణెమ్మ దంపతులు తమ కూతురు రమ్యతో కలిసి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంతో తాము సాగుచేసిన ఐదు ఎకరాలలోని వరిపొలానికి ఎటూ సరిపోవని ముగ్గురు లైన్లో ఉండి మూడు యూరియా బస్తాలకు టోకెన్ పొందారు. ఓదెల తహసీల్ ముట్టడిఓదెలకు చెందిన రైతులు దాదాపు 100 మంది యూరియా కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక ఫర్టిలైజర్షాపు యజ మాని బ్లాక్లో విక్రయిస్తున్నాడంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఏఈవోలు సైతం టోకెన్లు స రిగా ఇవ్వడం లేదన్నారు. గంటల తరబడి క్యూౖ లెన్లో ఎదురుచూస్తుంటే స్టాక్ లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మీరు కొంచెం మసాలా యాడ్ చేశారు’.. కంగనా రనౌత్కు సుప్రీంకోర్టు చీవాట్లు
సాక్షి,న్యూఢిల్లీ: సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. రైతు చట్టాల ఆందోళనపై మీరు రీట్వీట్ మాత్రమే చేయలేదు. కొంచెం మసాలా యాడ్ చేశారని మండిపడింది. 2020-21లో రైతు చట్టాలకు సంబంధించిన ఆందోళన సమయంలో కంగనారౌనత్ ఓ మహిళా రైతును ఉద్దేశిస్తూ రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో మహిళా రైతు కంగనారౌనత్పై పరువు నష్టం దావా వేశారు. తాజాగా, పంజాబ్ రాష్ట్రం బాథిండా కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో కంగనాపై నమోదైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. అంతేకాదు.. మహిళ రైతు గురించి మీరు ట్వీట్లు మాత్రమే కాదు మసాల్ యాడ్ చేశారు’అని వ్యాఖ్యానించింది. దీంతో ఆమె తరఫు న్యాయవాది పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.2020-21 దేశ రాజధాని ఢిల్లీ రైతు చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో మరో ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. అయితే, రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న మహీందర్ కౌర్.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాల్గొన్న బిల్కిస్ బానో ఇద్దరూ ఒకటేనంటూ తాను చేసిన పోస్టును కంగనా రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్పై మహీందర్ కౌర్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసునే కొట్టేయొమని కంగాన న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. కంగనా ఇప్పటికే పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ కూడా ఆమెకు ఊరట లభించలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు సూచన మేరకు ఆమె ట్రయల్ కోర్టులోనే న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. -
జగన్ ప్రభుత్వంలో ఈ కష్టాల్లేవ్: రైతులు
సాక్షి, కృష్ణా: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు ఎరువుల కొరత(Urea Crisis) అనే మాటే వినిపించలేదు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థ.. అదే అధికారులు ఉన్నా.. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందాతో నిస్సహాయంగా మిగిలిపోయారు. దీంతో రైతులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉయ్యూరు మండలం ముదునూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కొందరిని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్పై వాళ్లు దుమ్మెత్తిపోశారు. ‘‘అర్ధరాత్రి నుంచి సొసైటీ గేట్ ఎదురు పడిగాపులు కాస్తున్నాం. మొదటి కోట యూరియా ఇంకా వెయ్యలేదు. రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం చేయటం దుర్భరంగా మారింది.బ్లాక్లో యూరియా రూ.800 పైగా అమ్ముతున్నారు. 10 ఎకరాలకు 2 కట్టలు ఇస్తున్నారు. యూరియా కోసం ఇంతకు ముందెప్పుడూ రోడ్లపైకి ఎప్పుడు రాలేదు. జగన్ ప్రభుత్వంలోనూ ఈ పరిస్థితి లేదు. సకాలంలో ఎరువులు, పంట సాయం అందేవి. ఇప్పుడు యూరియా వాడితే చంద్రబాబు క్యాన్సర్ వచ్చింది అంటున్నాడు. చంద్రబాబుకు రైతులు అంటే అంత చులకన?. ఇకనైనా ప్రభుత్వం రైతును ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న అవస్థలపై తాజాగా ప్రెస్మీట్లో కూటమి సర్కార్కు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Press Meet On Urea Troubles) చురకలంటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ యూరియా కొరత రాలేదు. అధికారులు కూడా రైతుల పక్షాన ఉండేవారు. ఇప్పుడు మాత్రం యూరియాను బ్లాక్ మార్కెట్కు మళ్లించి, రూ. 250 కోట్ల స్కాం చేశారు. రైతులు బారులు తీరుతున్నారు, కానీ అధికార పార్టీ క్యాడర్కు మాత్రం యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. MSP (మద్దతు ధర) కూడా ఇవ్వకుండా, రైతులను ఆత్మహత్యల దిశగా నెట్టుతున్నారు. మేము తిరిగి అధికారంలోకి వస్తే, ఈ దందా అంతా బయటపెడతాం. రైతులకు న్యాయం చేస్తాం అని అన్నారాయన. గత వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాల) ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో అదే అధికారులు ఉండి, అదే వ్యవస్థ ఉండి.. అప్పుడు లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? అని చంద్రబాబును నిలదీశారాయన. ఇదీ చదవండి: ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్ -
బస్తా కోసం భారంగా..
కామారెడ్డి టౌన్ /కామేపల్లి/అర్వపల్లి/దేవరకద్ర /మఠంపల్లి/కేసముద్రం/ఖానాపురం: యూరియా కోసం రైతుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. టోకెన్ల కోసం, యూరియా లారీల కోసం ఎదురుచూపులు నిత్యకృత్యం అయ్యాయి. » కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లోని పంపిణీ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూ లైన్లో నిలుచున్న రైతులు ఒక్కసారిగా సిరిసిల్ల రోడ్లో రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, సీఎంకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. » ఖమ్మం జిల్లా కామేపల్లి రైతు వేదికలో కూపన్లు ఇస్తున్నారని తెలిసి రైతులు వెళ్లారు. వారంరోజులుగా తిరుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నించగా జాస్తిపల్లి ఏఈఓ రవికుమార్, కామేపల్లి ఏఈఓ శ్రీకన్య తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని రైతులు వాపోయారు. అంతేకాక ఇది తమ ఆఫీస్ అని ఎక్కువ మాట్లాడితే కేసు పెడతామని బెదిరించారన్నారు. » సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. చెప్పులు క్యూలైన్లో పెట్టి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు పీఏసీఎస్ ఎదుట హైవేపై రాస్తారోకో నిర్వహించారు. » మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పీఏసీఎస్ కేంద్రం వద్ద టోకెన్లు ఉన్న రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, టోకెన్లు లేని రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. మహిళా రైతుల అరుపులు, కేకలతో తోసుకున్నారు. ఈ తరుణంలో నార్లోనికుంట్ల సత్యమ్మ, డోకూర్ బాలకిష్టమ్మ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సత్యమ్మ చెవికి తీవ్ర గాయమైంది. » సూర్యాపేట జిల్లా మఠంపల్లి పీఏసీఎస్కు చెందిన నలుగురు డైరెక్టర్లు యూరియా కొరతకు నిరసనగా రాజీనామా చేశారు. తమ గ్రామాల్లోని రైతులకు యూరియా అందజేయలేకపోతున్నామన్న మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్లు డైరెక్టర్లు గోలి చంద్రం, పట్టేటి ఆంథోని, వల్లపుదాస్ చినలింగయ్యగౌడ్, పశ్యా రామనరసమ్మ చెప్పారు. » మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి, కల్వల గ్రామాల్లో సొసైటీ పాయింట్ వద్ద రైతులు గురువారం తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకే యూరియా లోడ్ లారీ రావాల్సి ఉండగా 11 గంటలైనా రాలేదు. కేసముద్రం విలేజ్ దర్గా వద్ద ఆ డ్రైవర్ యూరియా లోడ్ లారీ తీసుకొచ్చి నిలిపాడని పోలీసులు తెలుసుకున్నారు. దర్గా నుంచి ఉప్పరపల్లి వరకు లారీని తీసుకెళ్లి 220 బస్తాలను సెంటర్లో దింపించారు. ఆ తర్వాత కల్వల సెంటర్కు లారీని తీసుకెళ్లాల్సి ఉండగా, అప్పటికే లారీడ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఎండీ అలీమ్ ఆ లారీని తానే డ్రైవింగ్ చేసి కల్వలకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 220 బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. » వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన తేజావత్ శ్రీను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. సరిపోను యూరియా లభించకపోవడంతో ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వదిలేశాడు. దీంతో పంటను గురువారం గొర్రెల కాపరులకు అప్పగించడంతో అవి మేశాయి. -
YS జగన్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పు చంద్రబాబు
-
ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్
గిట్టుబాటు ధరలు, ఇంకా మరేదైనా సమస్య అయినా సరే తొలుత అసలు ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా అంటే ఉన్నాయంటాడు. అంతా భేషుగ్గా ఉందని వాదిస్తాడు. రైతులు కేరింతలు కొడుతున్నారని గొప్పలకు పోతాడు. చివరకు సమస్య ఉందని ఒప్పుకోక తప్పదని నిర్ధారించుకున్నాక మోసం చేసేందుకు తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా.. చంద్రబాబు ఇంద్రుడు.. చంద్రుడు.. ఆదేశాలిచ్చేశాడంటూ ఆకాశానికెత్తేస్తాయి. తాటికాయంత అక్షరాలతో రాసేస్తారు. ఇదంతా ఓ బూటకం. ఏ రైతుకూ సమస్యలు తీరవు. మిర్చి, పొగాకు, మామిడి, చివరకు ఉల్లి విషయంలోనూ అదే జరిగింది.రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం.. ఆర్బీకేలు, ఈృక్రాప్, పీఏసీఏఎస్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటుకు ఎక్కువ యూరియా, ఎరువులు కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు ధరల స్థిరీకరణ నిధి లేదు. సీఎం యాప్ మూలన పడిపోయింది. ఈ క్రాప్ను నిర్వీర్యం చేశారు. ఉచిత పంటల బీమాకు పాతరేశారు. ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీకి మంగళం పాడేశారు. సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. ఇదంతా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఖరీఫ్లో ఇప్పటికే రైతులకు 6.65 లక్షల టన్నుల యూరియా సరఫరా చేశామని, గతేడాది కంటే 97 వేల టన్నులు అధికంగా అందించామని మీరు గొప్పగా ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం అవసరమైన మేరకు యూరియా, ఎరువులు అందించి ఉంటే రాష్ట్రంలో ఏ రైతూ రోడ్డెక్కడు కదా?’ అని సీఎం చంద్రబాబు నాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటన చూస్తుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. రైతులకు అందించాల్సిన ఎరువులు, యూరియాను దారి మళ్లించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతూ అధికార పార్టీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు కూడా భాగస్వామి అని దునుమాడారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర దక్కక రైతులు పడుతున్న ఇబ్బందులను ఆధారాలతో ఎత్తిచూపుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం తెచి్చన విప్లవాత్మక పథకాలను గుర్తు చేస్తూ చంద్రబాబు సర్కార్ తీరును కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ఇంకా ఏమన్నారంటే.. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా? రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా? అన్న సందేహాలు సామాన్యుల్లోనూ తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నొక్కేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అభివృద్ధి, సంక్షేమం లేకుండా పోయింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా తిరోగమనం పట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ప్రస్తుతం మన కళ్ల ఎదుటే ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతున్నాయి. అసలు రాష్ట్రంలో పాలన ప్రజల కోసం సాగుతోందా? లేక దోపిడీదారుల కోసం సాగుతోందా? రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలి పోవడంతో కుంభకోణాలు కనిపిస్తున్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీ రైతుల పక్షాన మంగళవారం ‘అన్నదాత పోరు’ చేపడితే కేసులు పెడతామంటూ బెదిరించి నోటీసులు ఇచ్చారు. వారంతా ఏం తప్పు చేశారు? రైతుల పక్షాన నిలబడితే తప్పా? రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యానికి ఇవన్నీ నిదర్శనాలు. చంద్రబాబు బావిలో దూకితే మేలు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రభుత్వం సరిపడా ఎరువులు అందించి ఉంటే అసలీ పరిస్థితే ఉండేది కాదు కదా.. మీరు ఎరువుల విషయంలో కుంభకోణాలు చేయకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా.. ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు. రెండు నెలలుగా కనిపిస్తోంది. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎరువులు దొరక్క కృష్ణా జిల్లా ఘంటశాల మండలం లంకపల్లి పీఏసీఎస్, పార్వతీపురం మన్యం జిల్లాలో, విజయనగరం జిల్లా ఎస్ కోటలో బారులు తీరిన రైతులు, రాజాంలో ఎరువుల కోసం కొట్లాట, అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాట్లు, తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో, ఏలూరు జిల్లా నూజివీడులో, ఎన్టీఆర్ జిల్లా గొళ్లపూడిలో ఎరువుల కోసం పాదరక్షలను క్యూలో పెట్టిన రైతులు.. గుంటూరు జిల్లా రేపల్లె గోడౌన్ వద్ద రైతుల ఆందోళన.. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతుల ఇబ్బందులు కళ్లకు కట్టాయి. ప్రకాశం జిల్లా పామూరు మండలం కురమద్దాలి, సత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఏసీఎస్, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రైతులు బారులు తీరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కూడా ఎరువులు దొరకని పరిస్థితి. సొంత నియోజకవర్గంలోనూ ఎరువులు సక్రమంగా పంపిణీ చేయలేని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులు ఏదైనా బావి చూసుకుని దూకితే మేలు. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి మా ఐదేళ్ల పాలనలో రైతులకు ఈ కష్టాలు లేవు. ఇప్పుడు రైతులకు అందించే ఎరువుల్లో కూడా కుంభకోణాలు చేసి, డబ్బు ఎత్తాలన్న ఆలోచన చేస్తున్నారు కాబట్టే దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారని లెక్క కడతారు కదా? దాని ఆధారంగా ఎంత ఎరువులు కావాలని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అంచనాకు వస్తుంది. ఆ లెక్కలన్నీ మనదగ్గర కూడా ఉంటాయి కదా? మరి అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకొచ్చింది? ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు » రాష్ట్రంలో రైతులు పండించే వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కోకో, పొగాకు, మామిడి, ఉల్లి, టమాటా ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు పట్టించుకోరు. తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తారు. » ఉల్లి విషయంలో ఆగస్టు 29న క్వింటా రూ.1200కు కొనుగోలు చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చినట్టు ఈనాడు రాసింది. మళ్లీ సెప్లెంబర్ 7న అంటే 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే క్వింటా రూ.201, 300, 400, 600 ఇలా రకరకాలుగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు రాస్తుంది. అంటే.. దాని అర్థం రూ.1,200కు కొనుగోలు చేశారంటే ఒట్టిమాటే కదా? అన్నీ తూతూ మంత్రాలే.. అబద్ధాలు, మోసాలు. » ఈ రోజు ఉల్లి.. క్వింటా రూ.200 నుంచి రూ.400. అదే ఉల్లి బహిరంగ మార్కెట్లో (బిగ్ బాస్కెట్) కేజీ రూ.34. అంటే క్వింటా 3,400. రైతులకు క్వింటా రూ.300–400 వస్తున్నట్టు ఈనాడు రాస్తోంది. రేటు పడిపోయినా పట్టించుకునే నాథుడే లేడు. మా పాలనలో కేజీ ఉల్లి రూ.40 నుంచి రూ.125 వరకు పలికింది. ఒకసారి మధ్యలో ఒడిదుడుకులు వస్తే రూ.9 వేల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కోవిడ్ లాంటి సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. చినీ ధర ఈ రోజు టన్ను రూ.7–8 వేలు..బాగా వస్తే రూ.12–14 వేలు. అదే మా హయాంలో కనిష్ట ధర రూ.30 వేలు. గరిష్ట ధర రూ.లక్ష. నాడు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి వైఎస్సార్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీని పెంచాం. రైతులకు తోడుగా నిలబడేందుకు రూ.7,802 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ పెట్టాం. అక్కడే ఈ క్రాప్ జరిగేది. దాంతో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వివరాలను ఆ యాప్లో అప్లోడ్ చేసేవారు. ఇది కంటిన్యూస్ మానిటరింగ్ అగ్రికల్చరల్ ప్రాసెస్ అండ్ ప్రొక్యూర్ మెంట్ (సీఎంయాప్) ద్వారా కచ్చితంగా పని చేసేది. ఆర్బీకేలో కనీస గిట్టుబాటు ధరలు తెలిసేలా బోర్డులో పెట్టేవారు. ఆ ధరల కంటే ఎక్కడన్నా పంట ధర పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఈ రోజు ఆర్బీకేలను గాలికొదిలేశారు. ఈ క్రాప్ను నిర్వీర్యం చేశారు. సీఎం యాప్ మూలన పడిపోయింది. ఉచిత పంటల బీమాకు పాతరేశారు. ఇన్ పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారానికి మంగళం పాడేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. మేము క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చేవాళ్లం. ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందేది.. ఇవన్నీ ఎత్తేశారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది రూ.5 వేలు ఇచ్చారు. అంటే రూ.40 వేలకు గాను రూ.5 వేలు ఇచ్చారు. అది కూడా సుమారు 7 లక్షల రైతు కుటుంబాలకు అర్హత జాబితా నుంచి తీసేశారు. ఇవాళ ప్రతిదీ స్కామే. ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే కనిపిస్తోంది. ఇది రూ.250 కోట్ల కుంభకోణం » అసలు రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం.. ఆర్బీకేలు, ఈ–క్రాప్, పీఏసీఏఎస్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటుకు ఎక్కువ యూరియా, ఎరువులు కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. » ఉదాహరణకు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారి మళ్లిన యూరియా.. పల్నాడు జిల్లా దాచేపల్లిలో 165 బస్తాల ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు.. నంద్యాల జిల్లా డోన్లో 70 టన్నుల యూరియా మాయం.. ఒకవైపు ప్రభుత్వం నుంచి వెళ్లిన యూరియా, ఎరువులను టీడీపీ నేతలు దారి మళ్లించి అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటుకు అధికంగా కేటాయించిన ఎరువులను బ్లాక్ చేసి కొరత సృష్టించడం ద్వారా బస్తా యూరియా ధర రూ.267 ఉంటే దానికంటే రూ.200 నుంచి 250 అధికంగా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. » ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకాలను చంద్రబాబు ప్రొత్సహించడం, నేరుగా భాగస్వామి కావడంతో దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల కుంభకోణం జరిగింది. రైతులను పీడించి కుంభకోణాలు చేసి, కింది నుంచి పైదాక అందరూ పంచుకున్నారు. » మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు, ఎస్పీలతో తరచూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే వాడిని. ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ కనిపిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని ఎస్పీలు, కలెక్టర్లకు బలంగా హెచ్చరికలు ఉండేవి. ఈ రోజు అది లేకుండా పోయింది. ఎవరి మీదా చర్యలు ఉండవు. నికింత– నాకింత అని.. దోచుకో పంచుకో తినుకో విధానంలో సిస్టమేటిక్ పద్ధతుల్లో వెళుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ కుంభకోణాలు చేస్తున్న వాళ్లు అసలు మనుషులేనా? -
కొనసాగుతున్న యూరియా కష్టాలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా దొరికినా మహాభాగ్యం అనుకుంటూ రాత్రి, పగలు క్యూలైన్లలో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల ఓపిక నశించి ఆందోళనలకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతు వేదిక ఎదుట బుధవారం యూరియా టోకెన్ల కోసం రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు రైతు వేదికలోకి చొచ్చుకెళ్లి ఫరి్నచర్ ధ్వంసం చేశారు.హనుమకొండ జిల్లా పరకాలలో టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె)లో రైతులు బుధవారం యూరియా కోసం భిక్షాటన చేస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో బుధవారం సాయంత్రం రైతు సాయిల్ల రాజమల్లు యూరియా బస్తా కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి రైతులు వెంటనే రాజమల్లును ఆసుపత్రికి తరలించారు. కాగా, మంచిర్యాల జిల్లా దండేపల్లి నెల్కి వెంకటాపూర్ పీఏసీఎస్ వద్ద రైతులకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి యూరియా పంపిణీ చేశారు. రెండో విడతలో పంటకు యూరియా ఎంత మోతాదులో వేయాలనే దానిపై అధికారులు అవగాహన కూడా కల్పించారు.యూరియా బారులు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద సుమారు 400 ఫీట్ల వరకు రైతులు పట్టాదారు పాస్పుస్తకాలు, ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులు లైన్లో ఉంచి నిరీక్షించారు. ఈ కేంద్రానికి 666 బస్తాల యూరియా రాగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటో గ్రాఫర్ సూర్యాపేట -
YS జగన్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పు చంద్రబాబు
-
అన్నదాత పోరు @పుట్టపర్తి
-
బాబు సర్కార్ అంతానికి ఆరంభం ఇదే..!
-
సర్కారు దగాకోరు విధానాలపై అన్నదాత కన్నెర్ర
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి.. కృత్రిమ కొరత సృష్టించి.. ఎమ్మార్పీ ధర కంటే బస్తాపై రూ.200 అధికంగా విక్రయిస్తూ తమను దోపిడీ చేస్తున్నా చేష్టలుడిగి చూస్తున్న టీడీపీ కూటమి సర్కార్పై రైతులు తిరగబడ్డారు. టమాటా, మిర్చి, పొగాకు నుంచి బత్తాయి, ఉల్లి వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. ఉచిత పంటల బీమా రద్దు చేసి, ధీమా లేకుండా చేయడంతోపాటు వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిన సర్కార్ తీరును నిరసిస్తూ కదంతొక్కారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి యధావిధిగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి పోలీసులను ప్రయోగించింది. దాంతో.. పోలీసు యాక్ట్–30 అమల్లో ఉందని, నిరసన కార్యక్రమాలు చేపట్టినా.. పాల్గొన్నా కేసులు పెడతామంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మైక్ల ద్వారా ప్రచారం చేశారు. మంగళవారం తెల్లవారుజామునే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి.. గృహ నిర్బంధం చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్దకు వెళ్లే దారులపై భారీ ఎత్తున బారికేడ్లు పెట్టి.. రైతులు వెళ్లకుండా అడ్డుకోవడానికి పోలీసులు యత్నించారు. అన్నదాత పోరులో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరించారు. గృహ నిర్బంధాలను వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు లెక్క చేయలేదు. పోలీసుల బెదిరింపులకు రైతులు అదరలేదు, బెదరలేదు సరికదా తిరగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలకు వేలాదిగా కదలివచ్చి.. టీడీపీ కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ కదంతొక్కారు. ‘రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. రైతు ద్రోహి చంద్రబాబు..’ అంటూ నినాదాలు చేశారు. రాజమహేంద్రవరంలో ఉద్రిక్తతరాజమహేంద్రవరంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నేతలు చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణరెడ్డి రెండు గంటల పాటు ఎర్రటి ఎండలో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల నిర్బంధాల మధ్య నేతలు, రైతులు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. అనంతపురంలో కదం తొక్కుతున్న రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఆంక్షలు విధించినప్పటికీ నేతలు, రైతులు లెక్క చేయలేదు. అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట ఆర్డీవో కార్యాలయాల సమీపంలో పోలీసులు రైతులను నిలువరించడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. ‘అన్నదాత పోరు’ కార్యక్రమం ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో విజయవంతంగా సాగింది. అనకాపల్లి జిల్లాలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. విశాఖ జిల్లాలో ఉద్రిక్తత నడుమ అన్నదాత పోరు విజయవంతమైంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని పలువురు నేతలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను హౌస్ అరెస్ట్ చేశారు. అనకాపల్లిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్కు నోటీసులు ఇచ్చి, పోలీసులు చుట్టుముట్టారు. కార్యకర్తలను భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అన్ని చోట్లా ర్యాలీ నిర్వహించి, ఆర్డీవోలకు వినతిపత్రం అందజేశారు.ఆంక్షలను లెక్క చేయని ‘సీమ’ రైతులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ‘అన్నదాత పోరు’ విజయవంతమైంది. పలుచోట్ల అడుగడుగునా ఆంక్షలు విధించినా కర్షకులు పట్టుదలతో కదం తొక్కారు. కర్నూలు జిల్లాలో యూరియా సంచులు, వరి, ఉల్లి పంటను చేత బట్టి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. పలమనేరులో మీడియాను సైతం అనుమతించ లేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గట్టిగా ప్రశ్నించడంతో ముఖ్య నాయకులు, మీడియాను లోనికి అనుమతినిచ్చారు. కుప్పంలో వైఎస్సార్సీపీ శ్రేణులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో రైతుల భారీ బైక్ ర్యాలీ అయినప్పటికీ పలువురు నేతలు, రైతులు ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. సూళ్లూరుపేటలో పోలీసులు అడ్డుకుని ఫ్లెక్సీలను చించివేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా అన్ని చోట్లా అన్నదాత పోరు విజయవంతమైంది. తిరుపతిలో అన్నమయ్య కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖాళీగా కూర్చుని ఉంటే.. ఎరువులు, విత్తనాల కోసం రైతుల వారి కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నట్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో రైతు పోరు హోరెత్తింది. రాయచోటిలో జాతీయ రహదారి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.రైతుల నినాదాలతో హోరెత్తిన రాష్ట్రంఅవసరమైన మేరకు యూరియా, ఎరువులు అందించలేని ప్రభుత్వం డౌన్ డౌన్.. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిన కూటమి సర్కార్ డౌన్ డౌన్.. గిట్టుబాటు ధర కల్పించలేని కూటమి సర్కార్ డౌన్ డౌన్.. అంటూ రైతులు చేసిన నినాదాలతో రాష్ట్రం మారుమోగిపోయింది. రైతులతో కలిసి ర్యాలీగా ఆర్డీవో, సబ్ కలెక్టర్ల కార్యాలయాలకు చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. అవసరమైన మేరకు ఎరువులు అందించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, వర్షం వల్ల పంటలు దెబ్బ తిన్న ప్రాంతాల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అడుగడుగునా పోలీసులు నిర్బంధించినా.. కేసుల పేరుతో బెదిరించినా రైతులు బెదరకుండా వేలాదిగా కదలివచ్చి కదంతొక్కడంతో వైఎస్సార్సీపీ అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 15 నెలల పాలనలో టీడీపీ కూటమి సర్కార్పై రైతుల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీల్లో ఎక్కడికక్కడ వేలాది మంది కర్షకులు కదం తొక్కడమే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్సీపీ అన్నదాత పోరును అడ్డుకోవడానికి పోలీసుల ద్వారా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడం.. 74 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రైతులు సమరోత్సాహంతో రణభేరి మోగించడం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కలవరపరిచింది. అన్నదాత పోరులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ ర్యాలీగా వెళుతున్న రైతులు గతేడాది డిసెంబర్ 13న అన్నదాతల సమస్యలపై రైతు పోరు.. డిసెంబర్ 27న కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన విద్యుత్ పోరు.. మార్చి 12న యువత సమస్యలపై నిర్వహించిన యువత పోరు తరహాలోనే అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.హౌస్ అరెస్ట్లు.. బెదిరింపులు⇒ వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘అన్నదాత పోరు’ విజయవంతం కాకూడదని సర్కారు పెద్దలు పోలీసులను ఉసిగొల్పారు. దీంతో వారు ఎక్కడికక్కడ నేతలను గృహ నిర్భంధం చేశారు. కేసులు పెడతామంటూ మరికొందరిని బెదిరించారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్లను సోమవారం రాత్రే హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం రాత్రి 11 గంటలకే హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ జిల్లాలో అన్నదాత పోరు విజయవంతమైంది. ⇒ జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లలో వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలపై హోరెత్తించారు. ఒంగోలులో ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులను పోలీసులు పలుమార్లు అడ్డుకున్నారు. అంతకు ముందు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీల్లేదని నోటీసులు ఇచ్చినా ఎవరూ లెక్క చేయలేదు. రాజమహేంద్ర వరంలో రైతులను, వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు ⇒ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అడుగడుగునా నిర్బంధించారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, నరసన్నపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, ఆమదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కవిటిలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావును అడ్డుకున్నారు. వేలాది మందిని ఎక్కడికక్కడ నిర్బంధించారు. అయినప్పటికీ పలువురు నాయకులు పలాస, టెక్కలి ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. గుడివాడలో ఆర్డీవో కార్యాలయం లోపలికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’ అని నినాదాలు చేశారు. నందిగామలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. పార్టీ నేతలు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మొండితోక జగన్మోహనరావు, తన్నీరు నాగేశ్వరరావు, నల్లగట్ల స్వామిదాసు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, అవుతు శ్రీనివాసులురెడ్డిలను గాంధీ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. మార్గం మధ్యలో మాజీ మంత్రి జోగి రమేష్ను ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వద్ద, ఇతర నేతలను తిరువూరు, జగ్గయ్యపేటలో పోలీసులు అడ్డుకున్నారు. ⇒ గుంటూరు, తెనాలి, చీరాల ఆర్డీవో కార్యాలయాల వద్ద భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. బాపట్లలో వంద ట్రాక్టర్లతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. రేపల్లె, వేమూరు, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల ప్రాంతాల్లోనూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ రైతులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీకి తరలి వచ్చారు. ⇒ నెల్లూరు జిల్లాలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ముఖ్య నేతలకు నోటీసులిచ్చి, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. పాల్గొంటే కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ నెల్లూరు, కావలి, ఆత్మకూరు, కందుకూరు రెవెన్యూ డివిజన్లలో వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి అన్నదాతలు కదంతొక్కారు. ఆత్మకూరులో రైతుల కోసం ఏర్పాటు చేసిన షామియానాను సీఐ గంగాధర్ తొలగించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. -
యూరియా కోసం చెప్పులతో కొట్లాట
గజ్వేల్రూరల్/గరిడేపల్లి/దుబ్బాక/బీబీపేట: ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు ఇస్తారో తెలియక యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల ఘర్షణలకు దిగుతున్నారు. » సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మంగళవారం యూరియా టోకెన్ల కోసం బారులు తీరిన మహిళా రైతులు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. » వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలోని జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. రాయపర్తి మండలం పెర్కవేడులో యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారని తెల్లవారుజాము నుంచే రైతువేదిక వద్ద మహిళా రైతులు బారులుతీరారు. » మహబూబాబాద్ జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాల్లో పీఏసీఎస్ కేంద్రాల వద్ద కూడా బారులుతీరారు. నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం స్టేజీ వద్ద వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. » కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి మంగళవారం యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అలసిపోయి, నీరసించిన తర్వాత రైతులు క్యూ లైన్లో రాళ్లు, చెప్పులు, చెట్ల కొమ్మలు పెట్టారు. » సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్కు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి క్యూలైన్లలో నిలబడ్డారు. కేవలం 15 నుంచి 20 మందికి మాత్రమే రెండు బస్తాలు ఇచ్చి స్టాక్ అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. -
అప్పటిదాకా మీకు నడ్డా నెంబర్ గుర్తుకు రాలేదా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదనట్లుగా ఉన్నాయన్న పేర్ని నాని.. రైతుకు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంలో రైతు కంట కన్నీరు ఆగటం లేదు. మోదీ త్వరగా జమిలీ ఎన్నికలు పెడితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేలా లేదు. చంద్రబాబు నాది నలభై ఏళ్ల అనుభవం.. నాకన్నా పోటుగాడు లేడంటాడు. జగన్ నిరసనలకు పిలుపునిచ్చే వరకు చంద్రబాబు స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్నీ బాగానే ఉన్నాయంటారు. రైతులు యూరియా దాచుకున్నారని మొన్న అన్నాడు. రైతులు మూడుసార్లకు కలిపి ఒకేసారి 75 కేజీలు యూరియా తీసుకుని దాచుకున్నారు అని నిన్న అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత ఏమైంది?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘కనీసం రైతులకు ఎంత యూరియా అవసరమో తెలుసుకోండి. మా లెక్క ప్రకారం 100 నుంచి 125 కేజీల యూరియా అవసరం ఉంటుంది. మీ లెక్క ప్రకారమైనా 75 కేజీలు ముందే తెచ్చుకోవటం తెలియదా?. యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నారు. నడ్డాతో మాట్లాడేశారు.. యూరియా పార్సిల్ చేస్తున్నారు.. వచ్చేస్తుంది అన్నారు మోతమోగిస్తున్నారు. రైతు సమస్యలపై వైఎస్ జగన్ నిరసన అనేంత వరకు నడ్డా నెంబర్ మీకు గుర్తుకు రాలేదా?. ఎరువులు తెప్పించుకోవాల్సింది మే, జూన్లో కదా....రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే మీకు కళ్ళు పోయాయా?. రైతులు ఎండలో నిలబడలేక క్యూలైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తుంటే వైఎస్సార్సీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేస్తున్నారంటున్నారు. ఎవరిని మోసం చేయాలని మీరు ఇదంతా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ వాళ్లను రోడ్డెక్కనివ్వరు.. ధర్నాలు చేయనివ్వరు. కానీ రైతులకు యూరియా అందుతుందా?. వైఎస్సార్సీపీ వాళ్లను పోలీసులను పెట్టి కట్టడి చేసే బదులు.. ఏ ఇంట్లో యూరియా దాచుకున్నారో బయటకు తెచ్చేందుకు వాడొచ్చు కదారాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. రైతు కష్టాలు చూపించటానికి ప్రజల దగ్గర ఉన్న ఫోన్లు చాలు. వైఎస్సార్సీపీ వాళ్లను, సోషల్ మీడియా వాళ్లను బొక్కలో వేయాలి అంటున్నారు...రేపు మీరు ఓట్ల కోసం వెళ్తే రైతులు, మిమ్మల్ని ఎందులో వేస్తారు?. ఈ రాష్ట్రంలో.. ఈ ప్రభుత్వం వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు? కనీసం మీ పార్టీ నేతలైన సుఖంగా ఉన్నారా?. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు. మంత్రులు దోచుకుంటున్నారు అని ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులను అడిగితే మాదేముంది బాబు, కొడుకులు దోచుకుంటున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలకు క్లాస్ పీకాడు అని మీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మీకు మూటలు మూటలు డబ్బులు చందాలు ఇచ్చిన వాళ్లు కూడా ఏడుస్తున్నారుఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్న రెండు కులాలు ఏడుస్తున్నారు. కమ్మలు, కాపులు కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకటం లేదంటున్నారు. దేశ విదేశాలు తిరిగి చందాలు పోగేశారు. ఇప్పుడు వాళ్ల పొలాలేమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. ఇవాళ ఇంటి పన్ను మారాలన్నా కూడా టీడీపీ వార్డ్ ఇంచార్జీకి 25 వేలు కప్పం కట్టాలి. బెజవాడలో పరిస్థితి ఎలా ఉందో మీకు చందాలు ఇచ్చినవాళ్లను అడిగితే చెప్తారు’’ అని పేర్ని నాని వ్యాఖ్యాదనించారు. -
మీ ప్రభుత్వంలో ఎంత,మా ప్రభుత్వంలో ఎంత.. బాబుకి సతీష్ రెడ్డి ఛాలంజ్..
-
RK Roja: చంద్రబాబు, అచ్చెన్నాయుడు కొంచమైనా సిగ్గు పడండయ్యా..
-
రైతుల కోసం చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రైతులంటే చంద్రబాబుకు చులకన అంటూ వైఎస్సార్సీపీ నేత ఎస్వీ సతీష్రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో రైతులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్జగన్ హయాంలో రైతుల ఇంటి వద్దకే ఎరువులు వచ్చేవి. రైతుల పట్ల చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు.అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించామన్నారు. రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ముందు చూపులేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో ఏనాడు రైతు ఇబ్బంది పడలేదు. ఆర్బికేలు ద్వారా సమయానికి యూరియా విత్తనాలు అందించాము. రైతులకు డోర్ డెలివరీ చేసి యూరియా విత్తనాలు అందించిన చరిత్ర వైఎస్సార్సీపీది.. ఎకరా ఉన్నా.. అర ఎకర ఉన్నా.. 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్న ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. కుటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.ఏలూరు జిల్లా: మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడం దారుణమన్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. పండించిన రైతుకి గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రజలకు ధరలు అందడం లేదుజ రైతులు లాభపడింది లేదు. ప్రజలు కూడా నష్టపోతున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.? రైతులను నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీరు ఉంది.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేది. వెన్నుముక అయినా రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఏడాదిన్నర అయినా కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి. రైతు పక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నిర్బంధించడం దురదృష్టకరం. యూరియా సహా రైతులుకు అవసరమైన ఎరువులను వెంటనే పంపణీ చేయాలి. బ్లాక్ మార్కెట్ను నియత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉచిత పంటల బీమాను పునరుదించి అందరికి వర్తింపజేయాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి.తిరుపతి: అభినయ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతను బఫేలా చూడటం దారుణం. యురియా బ్లాక్లో అమ్ముకొంటున్నారు. యూరియా ద్వారా రూ.300 కోట్లు బ్లాక్ మార్కెట్ దోచుకున్నారు. రైతుల సమస్యలు యురియా కొరతపై ఆర్డీవో వినతి పత్రం సమర్పించాము. కరోనా సమయంలో కూడా రైతులకు అండగా వైఎస్ జగన్ నిలిచారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.చెవిరెడ్డి అక్షిత్రెడ్డి మాట్లాడుతూ.. యురియా కొరతపై రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతులు యురియా కోసం నిలబడితే బఫే కోసం క్యూలో నిలబడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి అనడం చాలా దారుణమన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారుఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. యూరిచాపై మాట్లాడితే కేసులు పెట్టమని చంద్రబాబు చెప్పాడు.. రైతులు ర్యాలీ చేస్తే దాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నా కానీ ముందుకు వచ్చాం.. ఆర్డీవోకి వినతి పత్రం ఇచ్చాం. -
YSRCP Annadata Poru: కదం తొక్కిన రైతన్నలు.. ఖబర్దార్ బాబు
-
నందిగామలో ఉద్రిక్తత.. ‘అన్నదాత పోరు’ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో ‘అన్నదాత పోరు’ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యానికి దిగారు. గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నాఉ. నందిగామలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.వైఎస్సార్సీపీ 'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నిరసనలు ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. రైతులు, పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పోలీసులతో బెదిరింపుకు దిగుతూ.. నోటీసులు ఇస్తూ అరెస్టు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పదిమంది, 15 మందితోనే నిరసనలు చేయాలని ఆంక్షలు విధించింది.ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని.. రైతులు, రైతు నేతలు స్పష్టం చేశారు. యూరియా కొరత, ఇతర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు.. పోలీసులు, కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.వైఎస్సార్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. చంద్రబాబు సర్కార్ విధించిన ఆంక్షలను చేధించుకుని రైతులు ఉద్యమిస్తున్నారు. యూరియా సరఫరాలో సీఎం చంద్రబాబు ఘెరంగా విఫలమయ్యారని... పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా ఆందోళన ఆపేది లేదని రైతులు అంటున్నారు.ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు.. శాంతియుత ఆందోళనలకు తరలివస్తున్నాయి. -
‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్
Annadata Poru Updates: వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ లైవ్ అప్డేట్స్.. -
నేడు 'అన్నదాత పోరు'కు YSRCP శ్రేణులు సన్నద్ధం
-
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం...రోడ్డున పడ్డ రైతాంగం
-
భగ్గుమన్న రైతన్న
సాక్షి నెట్వర్క్: వన్ బీ, ఆధార్, పాసు పుస్తకాలను క్యూలైన్లలో పెట్టి అన్నదాతల పడిగాపులు.. స్లిప్పుల కోసం ఆరాటం.. పొలం పనులు వదిలేసి కార్యాలయాల వద్ద అగచాట్లు.. బస్తాపై అదనంగా బాదుడు.. కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని మెలిక.. పోలీసు పహారా నడుమ అరకొరగా పంపిణీ.. అజమాయిషీ అంతా అధికార పార్టీ నేతల చేతుల్లోనే.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అన్నదాతల ఆగ్రహావేశాలు.. భగ్గుమన్న నిరసనలు.. ! ఇదీ రాష్ట్రవ్యాప్తంగా యూరియా విక్రయ కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితి!! సోమవారం పలుచోట్ల మధ్యాహ్నానికే స్టాక్ అయిపోవడంతో అన్నదాతలు ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టారు.ప్రభుత్వం అవసరం మేరకు సరఫరా చేయకుండా యూరియా ఎక్కువగా వాడరాదంటూ గ్రామ సభలు నిర్వహించడం ఏమిటని మండిపడుతున్నారు. పంటలకు యూరియా ఎంతో అవసరమైన ప్రస్తుత తరుణంలో అందుకు తగినట్లుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పది ఎకరాలు సాగు చేసే రైతుకు సైతం ఒక్కటంటే ఒక్కటే యూరియా బస్తా ఇస్తామనడం ఏం న్యాయమని నిలదీస్తున్నారు. రైతులను నిరక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. అరకులోయ తదితర ప్రాంతాల్లో గిరిజన రైతులైతే ఏకంగా ఒడిశా వెళ్లి మరీ యూరియాను అధిక ధరకు కొనుగోలు చేసి తెచ్చుకోవడం అన్నదాతల దుస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వీరఘట్టం మన గ్రోమోర్ సెంటర్ వద్ద ఉదయం 6 గంటల నుంచే స్లిప్పుల కోసం పురుషులు, మహిళా రైతులు పెద్ద ఎత్తున వన్బీలు, ఆధార్ కార్డులతో బారులు తీరారు. సచివాలయం తలుపులను బలవంతంగా మూసివేయడంతో వీరఘట్టం గ్రామానికి చెందిన కమ్మవలస సన్యాసిరావు చేతి వేళ్లకు గాయాలయ్యాయి. రైతులను నియంత్రించలేక అధికారులు చేతులెత్తేశారు. చివరకు ఒక్క బస్తా కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. మొదటి దఫాకే దిక్కు లేదు.. రెండు ఎకరాలు సాగు చేస్తున్నా. మొదటి విడత యూరియా వేద్దామంటే ఏ సొసైటీలోనూ నిల్వ లేదని చెబుతున్నారు. ఎక్కువ డబ్బులు పెట్టి కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. – గుడాల సురేష్, రైతు, పెనుమర్రు, యలమంచిలి మండలం, ప.గోదావరి జిల్లా రైతుల కష్టాలు పట్టవా..? గతంలో ఎప్పుడూ యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు. బయట కొందామంటే అధిక ధరలు చెబుతున్నారు. ఇక్కడకు వస్తే దొరకడం లేదు. రైతులు ఎక్కడికి పోవాలి? – జల్లు తిరుపతిరావు, జల్లవానిపేట, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా రోజుల తరబడి తిరుగుతున్నా కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎరువుల ధరలు పెరిగిపోయాయి. యూరియా అందుబాటులో లేకుండా పోయింది. మొక్కజొన్న, టమాట సాగు చేశా. రెండు నెలలుగా యూరియా కోసం కళ్యాణదుర్గంలో నేను తిరగని ఎరువుల దుకాణం లేదు. – రవి, దొడగట్ట గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా ఒక్క బస్తాతో ఏం చేసుకోవాలి? పది ఎకరాలు సాగు చేస్తున్నా. నెల రోజులుగా యూరియా రాలేదు. ప్రస్తుతం వరి పంట పిలకలు వేస్తున్నాయి. ఈ తరుణంలో యూరియా వేయాలి. 10 బస్తాల యూరియా అవసరం కాగా ఒక్క బస్తాతో ఏం చేసుకోవాలి? – ఇంటి రమేష్, రైతు, వీకే రాయపురం, కాకినాడ జిల్లాఒడిశా వెళ్లి కొంటున్నాంఅరకులోయ, డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల వ్యాపారుల వద్ద యూరియా దొరకపోవడంతో ఒడిశా వెళ్లి 50 కిలోల బస్తా యూరియాకు రూ.600 చెల్లించి కొంత మంది రైతులతో కలిసి 40 బస్తాలు తెచ్చుకున్నాం. తప్పనిసరి పరిస్థితిలో బస్తాకు ఆటో కిరాయి రూ.100 చెల్లించాం. రైతులను నిర్లక్షం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. –పాంగి తిలక్, గిరిరైతు, గుంటసీమ గ్రామం, అరకు -
Annadata Poru: నేడే రైతన్న రణభేరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు మంగళవారం శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, సరిపడా అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు ఆర్డీవోలకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేయనున్నారు.ఎమ్మార్పీపై బస్తాకు రూ.200 అధికంకూటమి ప్రభుత్వంలో యూరియా కొరత రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోంది. వ్యవసాయ సీజన్లో ఒక్క యూరియా కట్ట కోసం గంటల తరబడి ప్రైవేట్ దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్ల ముందు పడిగాపులు కాస్తున్న దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. నల్ల బజార్లో కనీసం రూ.200 అధికంగా చెల్లిస్తే గానీ బస్తా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగు మందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు.కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన నేతలు నల్లబజార్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క యూరియా రూపంలోనే దాదాపు రూ.200 కోట్ల మేర రైతులపై భారం మోపి కాజేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ విమర్శించింది. పలుచోట్ల అక్రమంగా తరలిపోతున్న యూరియాను రైతులే పట్టుకుని పోలీసులకు అప్పగించినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దీన్ని బలపరుస్తోంది. కృష్ణా జిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాలకు అద్దం పడుతున్నాయి. సర్కారు కళ్లు తెరిపించేలా ’అన్నదాత పోరు’.. రైతాంగం డిమాండ్లపై కూటమి సర్కారు దిగి వచ్చేలా అన్నదాత పోరును వైఎస్సార్సీపీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. యూరియా బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ కోసం శ్రేణులు కదం తొక్కనున్నాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలనే డిమాండ్ను గట్టిగా వినిపించనుంది. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేయనుంది. వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు మార్కెట్లో పోటీ పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గళమెత్తనుంది.ప్రైవేట్ వ్యాపారులతో ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఒప్పించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేయనుంది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అన్నదాత పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో, 7న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ, 8న మండల కేంద్రాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదుకోవాల్సింది పోయి బెదిరిస్తున్న బాబు.. ఒకవైపు యూరియా సమస్యతో అన్నదాతలు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు వారిని బెదిరిస్తూ మాట్లాడటం, అసలు సమస్యే లేదని కొట్టిపారేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు కనిపిస్తున్నా మభ్యపుచ్చేలా, బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. రైతుల ఇక్కట్లను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్పై రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. సీజన్కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, ఎరువుల అవసరంపై ప్రణాళికలు లేకపోవడం, సమీక్షలు నిర్వహించకపోవడం కూటమి సర్కారు బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయి.అన్నదాత కన్నెర్రతో కలవరం..అన్నదాతలకు అండగా నిలవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్సార్ సీపీ ఆందోళనలకు సిద్ధం కావడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే విఫల ప్రభుత్వం, పాలన చేతగాని సర్కారుగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంతో కూటమి సర్కారు పాలనను రైతన్నలు పోల్చి చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే ఆర్బీకేలు, పీఎసీఎస్ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవడం, అప్పుల పాలు కాకుండా అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అన్ని రకాల పంటలను మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం, సీఎం యాప్ ద్వారా నిరంతరం ధరలను పర్యవేక్షించడం లాంటి చర్యల ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో ధరలు పతనమైతే కూటమి సర్కారు రైతుల గోడు పట్టించుకోకుండా వదిలేయడంపై మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు అసమర్థ పాలనపై వైఎస్సార్సీపీతో కలిసి భారీ ఎత్తున కదం తొక్కేందుకు సిద్ధమమయ్యారు. -
కాడి వదిలి రోడ్డెక్కి..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగానే ‘వ్యవసాయాన్ని దండగ’గా మార్చేస్తున్నారు! పొలం పనుల్లో కోలాహలంగా కనిపించాల్సిన రైతన్నలు రోడ్డెక్కి ఆక్రోశిస్తున్నారు! పంట కాపాడుకునేందుకు నోరు విప్పి ఎరువులు అడుగుతుంటే సంఘ విద్రోహ శక్తుల మాదిరిగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు! టీడీపీ కూటమి సర్కారు పాలనలో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి రైతులు పండించిన పంటలకు భద్రత లేకుండా చేశారు. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారు. విత్తు నుంచి విక్రయం వరకు ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపివేశారు. సబ్సిడీ విత్తనాల్లో కోత పెట్టి అందకుండా చేశారు. అదునులో యూరియా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక్క కట్ట కోసం తిండి తిప్పలు మానుకుని క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి కలి్పంచారు. ధాన్యం నుంచి టమాటా వరకు, మిరప నుంచి మామిడి, బత్తాయి వరకు కనీసం మద్దతు ధర దక్కకపోవడంతో అన్నదాతలు హతాశులయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కొనేవారు లేక.. అప్పులు తీర్చే దారి లేక.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే కావాలనే నాటకాలు ఆడుతున్నారంటూ ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో.. యూరియా దొరక్క, మద్దతు ధర కరువై అల్లాడుతున్న అన్నదాతలకు వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తోంది. రైతన్నలతో కలసి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అన్నదాత పోరు’లో పెద్ద ఎత్తున పాల్గొని సత్తా చాటేందుకు సిద్ధమైయింది. ఆంక్షలతో ‘కట్ట’డి.. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు దారి మళ్లించడంతో ప్రస్తుతం యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. అదునులో యూరియా అందక వరి, మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కట్ట.. అరకట్ట అంటూ రేషన్ సరుకుల మాదిరిగా విదిలిస్తుండటంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల చేతిలో దోపిడికీ గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లో రెట్టింపు ధరలకు అమ్ముతుంటే కొరడా ఝళిపించాల్సిన సర్కారు కళ్లుమూసుకుంది.ఏ పంటకూ కనీస మద్దతు ధర లేదు..గడిచిన ఏడాదిగా ధాన్యం మొదలు టమాటా వరకు, మిర్చి నుంచి పొగాకు దాకా ఏ పంట చూసినా మార్కెట్లో గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మద్దతు ధర కూడా దక్కక, పెట్టుబడి ఖర్చులు కూడా రాక అన్నదాతలు అల్లాడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్తో వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మద్దతు ధర దక్కక పోవడంతో గడిచిన ఏడాదిలో రైతులకు రూ.50 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. చేసిన అప్పులు తీర్చే దారిలేక గడిచిన 15 నెలల్లో దాదాపు 250 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకుండా పోయింది. వరి, మిరప, మామిడి రైతులను ముంచినట్లే ఉల్లి రైతులనూ కూటమి ప్రభుత్వం మంచేస్తోంది. ధర లేక మిరప రైతులు గగ్గోలు పెడితే క్వింటా రూ.11,781 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పి చివరికి మొండిచేయి చూపింది. తోతాపురి మామిడిని కిలో రూ.12 చొప్పున తామే కొంటామని చెప్పిన ప్రభుత్వం చివరికి రూ.4 సబ్సిడీ రూపంలో అందిస్తామని నమ్మబలికి మోసం చేసింది. అదే రీతిలో ఉల్లి క్వింటాల్ రూ.1,200 చొప్పున కొంటామని మభ్యపుచ్చి కొనుగోళ్ల ప్రక్రియను మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేసింది. తాజాగా మార్కెట్–మద్దతు ధరలకు మధ్య వ్యత్యాసం మొత్తాన్ని జమ చేస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డులో మూడో వంతు సరుకును నాణ్యత లేదనే సాకుతో తిరస్కరిస్తుండగా మిగిలిన ఉల్లిని క్వింటా రూ.100–600కి మించి వ్యాపారులు కొనడం లేదు. ఏలూరు డీసీఎంఎస్ వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు ఎటుచూసినా రైతుల ఆందోళనలు, ఆక్రందనలే..గిట్టుబాటు ధర లేక బత్తాయి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టన్ను రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు పలికిన బత్తాయి ప్రస్తుతం అధఃపాతాళానికి పడిపోయింది. పులివెందుల మార్కెట్లో గిట్టుబాటు ధర లేక సోమవారం రైతులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వాలిటీ ఉన్న బత్తాయికి వేలం పాట నిర్వహించగా, గరిష్టంగా 5 శాతం కాయలకు టన్ను రూ.14,200 పలుకగా, నాణ్యత లేని కాయను రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్య మాత్రమే కొనుగోలు చేశారు. అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కాస్త క్వాలిటీ బాగున్న 5–10 శాతం కాయలకు టన్ను రూ.16,500 లభించగా నాణ్యత లేదనే సాకుతో మిగిలిన పంటకు సగటున రూ.6 వేల నుంచి రూ.7 వేల మధ్య లభించింది. గతంలో ఎప్పుడూ ఇంత కనిష్ట స్థాయికి ధరలు పడిపోలేదని, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ బత్తాయి రైతులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు టమాటా రైతులు సైతం మద్దతు ధర లేక పంటను చేలల్లోనే పశువులకు మేతగా వదిలేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.కృష్ణా జిల్లా కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు 15 నెలల్లో రూ.23,584 కోట్లు ఎగ్గొట్టారు..! అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. వాస్తవంగా ఏటా రూ.10,716 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.21,432 కోట్లు జమ చేయాల్సి ఉండగా, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. పీఎం కిసాన్తో కలిపి రూ.26 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది తొలివిడతగా రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లతో సరిపెట్టారు. మరొక పక్క 2023–24 సీజన్కు సంబంధించి రూ.930 కోట్ల మేర రైతుల వాటా ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో.. ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు. ఇక 2024–25 ఖరీఫ్లో 833.92 కోట్లు, రబీలో రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయకపోవడంతో రైతులకు రూ.2 వేల కోట్లకుపైగా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో యూరియా కోసం క్యూ కట్టిన రైతులు ఇంకోవైపు కరువు ప్రభావంతో పంటలు దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. పంట నష్ట పరిహారం కింద 4.50 లక్షల మంది రైతులకు మరో రూ.650 కోట్లు ఎగ్టొట్టారు. ఇలా ఏడాదిలో అన్నదాతా సుఖీభవ, పంటలబీమా, పంట నష్టపరిహారం, కరువు సాయం, సున్నా వడ్డీ రాయితీ బకాయిలు వెరసి మొత్తం దాదాపు రూ.23,584 కోట్లకుపైగా చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టింది! అయితే.. మద్దతు ధర లేక రైతులు నష్టపోయిన మొత్తానికి అంతే లేదు. -
Annadata Poru: గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించిందా?
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్ల ముందు వేచి ఉండాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే యరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు చేరుతోంది. నల్లబజార్లో రూ.200 అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్కు తరలిస్తూ, కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క యూరియా ద్వారానే దాదాపు రూ.200 కోట్ల మేరకు అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఇప్పటికే వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి రుజువుగా పలుచోట్ల యూరియా అక్రమంగా తరలిస్తుండటం, రైతులే దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కనీసం కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాజిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగి వచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీ పెంచాలి. ప్రైవేటు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ఒప్పించి రైతులకు అండగా నిలబడాలి. తదితర రైతాంగ డిమాండ్లపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరును ముందకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దీనిపై రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే 7వ తేదీన అన్ని నియోజకర్గ కేంద్రాల్లోనూ, 8న అన్ని మండల కేంద్రాల్లోనూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించిన తీరు, బెదిరిస్తూ మాట్లాడటం, సమస్యే లేదని చెప్పడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు ఉన్నా కూడా రైతుల్ని బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో సమస్యే లేదని దబాయించి మాట్లాడుతున్న వైనంపై సమస్య లేదని, వైఎస్సార్ సీపీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్పై రైతుల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే, ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వంలోనే సరైన సమాధానం లేదు. సీజన్కు సంబంధించి ముందుగా పంటల సాగు, ఎరువుల అవసరంపై ఎందుకు ప్రణాళికలను సిద్దం చేసుకోలేకపోయారు, ముందస్తుగా సమీక్షా సమావేశాలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వంలో కలవరం!అన్నదాత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు సిద్దం కావడంతో కూటమి సర్కార్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రైతుల విషయంలో ఇదొక విఫల ప్రభుత్వం, పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటోంది. కూటమి పాలనకు ముందు.. గత అయిదేళ్ళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో రైతులు పోల్చి చూస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీనీ సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే అవసరమైన మేరకు ఆర్బీకేలు, పీఎసీఎస్ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయానిన్ని అందించడం ద్వారా అప్పుల పాలు కాకుండా రైతులకు అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన అన్ని రకాల పంటలకు మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం ఇలా అనేక అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో రేటు లేని పరిస్థితుల్లో రైతులను పట్టించుకోకుండా వదిలేసిన కూటమి సర్కార్ నిర్వాకాన్ని రైతులు పోల్చి చూస్తున్నారు. వైఎస్సార్సీపీతో కలిసి తమ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి చూపించేందుకు అన్నదాత పోరులో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనేందుకు సిద్దమైంది.రైతులకు అండగా వైఎస్సార్సీపీ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అన్నదాత పోరు కార్యక్రమంతో.. రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తడం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం ద్వారా అడుగడుగునా అండగా నిలబడ్డ జగన్ ప్రభుత్వంగత 15 నెలల పాలనలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కూటమి. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు పడిగాపులు పడ్డా ఉత్త చేతులేరైతులకు పార్టీ ముద్ర వేస్తూ.. యూరియా కొరత లేదని చెబుతున్న చంద్రబాబు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను హేళన చేస్తున్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ హయాంలో ఎక్కడా ఆర్బీకే సెంటర్ల ముందు క్యూలైన్లు కనిపించిన ఫొటో ఒక్కటైనా చూపించగలరా?ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు -
ప్రైవేట్ మార్కెట్ లో లిక్విడ్ కొంటేనే యూరియా రైతులు ఆ లిక్విడ్ తాగే స్థితికి వచ్చారు
-
నేను టీడీపీ వాడినే.. చంద్రబాబును ఏకిపారేసిన రైతులు
-
AP వ్యాప్తంగా తీవ్రస్థాయికి చేరుకున్న యూరియా కష్టాలు
-
కన్నీరుమున్నీ రైతుండే!
చల్లపల్లి/కొయ్యలగూడెం/చెరుకుపల్లి: యూరియా కొరత రైతులను వెన్నాడుతూనే ఉంది. డిమాండ్కు సరిపడా అందడం లేదు. ఫలితంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద అన్నదాతలు క్యూ కడుతున్నారు. అయినా యూరియా దొరక్కపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా టీడీపీ తీరు మారడం లేదు. యూరియాను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. తమ దుకాణాలకు యూరియా నిల్వలను తరలించుకుపోతున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా కోసం వచ్చిన రైతు వేముల నాగేశ్వరరావు ఆదివారం సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ సహకార సంఘానికి ఆదివారం ఉదయం యూరియా లోడు రావడంతో రైతులు భారీగా తరలివచ్చారు. అయితే జిల్లా ట్రైనీ కలెక్టర్ పర్హీన్ జాహిద్ వస్తున్నారని అధికారులు యూరియా పంపిణీ ప్రారంభించలేదు. ఉదయం ఏడుగంటలకే బారులు తీరిన రైతులు దాదాపు రెండుగంటలపాటు వేచిచూశారు. ఈ సమయంలో నాగేశ్వరరావు సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి రైతులు సపర్యలు చేశారు. నాగేశ్వరరావు ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ తీరు వల్ల యూరియా దొరక్క అల్లాడుతున్నారు. ఎట్టకేలకు 10.30 గంటలకు యూరియా పంపిణీ చేపట్టినా ఓటీపీ చెప్పాలని అధికారులు అడగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది ఫోన్లు తెచ్చుకోలేదని, ఓటీపీ అడగడమేమిటని కన్నెర్ర చేశారు. దీంతో అధికారులు ఓటీపీ లేకుండానే యూరియా పంపిణీ చేపట్టారు. – యూరియా కొరతపై ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వరిచేలో నిలబడి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో గవరవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు పలివెల దుర్గారావు, గ్రామ రైతు అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, రైతులు నరాల రామారావు, వేమ నాయుడు, యాకోబు మోషే, శ్రీను, చిన్న తాతారావు, మహేష్, కోనాల దివాకర్ తదితరులు పాల్గొన్నారు.టీడీపీ నేత దుకాణానికి దర్జాగా తరలింపు 07ఆర్పిఎల్77–ట్రాక్టర్లో యూరియా తరలించుకుపోతున్న టీడీపీ నాయకులు ఓవైపు యూరియా అందక పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తుంటే మరోవైపు టీడీపీ నేతలు యూరియా నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం బలుసులపాలెం గ్రామంలో ఆదివారం రైతులు చూస్తుండగానే ఓ టీడీపీ నాయకుడు ట్రాక్టర్లో 50 యూరియా బస్తాలు తన దుకాణానికి తరలించుకున్నాడు. బలుసులపాలెం రైతు సేవా కేంద్రం వద్ద శనివారం యూరియా పంపిణీ జరిగింది. అయితే రైతులకు ఒక్కొక్కరికి ఒక్క కట్ట యూరియా మాత్రమే ఇచ్చిన అధికారులు ఆదివారం రైతులంతా చూస్తుండగానే అదే గ్రామంలోని ఎరువుల దుకాణం నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడికి మాత్రం ఏకంగా 50 బస్తాలు ఇచ్చారు. అతను ట్రాక్టర్లో వాటిని తన దుకాణానికి తరలించాడు. రూ.270 ధర ఉన్న యూరియా బస్తాను ఏకంగా అతను రూ.450కి విక్రయిస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏవో ఫరూక్ను వివరణ కోరగా తనకు ఆరోగ్యం సరిగా లేనందున రాలేదని, యూరియా పంపిణీ విషయం తెలియదని చెప్పారు. -
యూరియా కోసం మండుటెండలో.. అన్నదాతల నరకయాతన
సాక్షి, అమరావతి,మాడుగుల రూరల్, బుచ్చెయ్యపేట/దెందులూరు,రామభద్రపురం/పలాస: బస్తా యూరియా కోసం మండుటెండలో అన్నదాతలు నరకయాతన అనుభవించారు. అనకాపల్లి జిల్లా కేజే పురం శివారు తెలకలదీపం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో శనివారం యూరియా పంపిణీ చేపడుతున్నట్టు తెలుసుకున్న రైతులు తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆధార్, భూమి పాసుపుస్తకం, 1బీ జెరాక్స్ కాపీలను కేంద్రం వద్ద లైన్లో పెట్టారు. ఎండ మండుతున్నా క్యూలైన్లో వేచి ఉన్నారు. యూరియా పంపిణీ ప్రారంభమవుతున్న సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకి వచ్చారు. ఈ క్రమంలో రైతులు తమకు 2 బస్తాలు కావాలని పట్టుబట్టారు. అయితే ప్రతి రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మాకుమ్మడిగా కేంద్రంలోకి చొరబడి ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. యూరియా అందరికీ అందకపోవడంతో రైతులు మండిపడ్డారు. 800 రైతులకు 150 బస్తాలే.. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం లో 800కి పైగా రైతులు ఉండగా 150 యూరియా బస్తాలే వచ్చాయి. దీంతో యూరియా దొరకదేమోననే ఆందోళనతో రైతు సేవా కేంద్రం వద్దకు అన్నదాతలు పరుగులు తీశారు. పేర్లు నమోదు కోసం రైతులంతా ఎగబడటంతో గందరగోళం తలెత్తింది. తహశీల్దార్ లక్ష్మి గ్రామానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. వచి్చన యూరియా కట్టలను కొంతమందికే ఇవ్వగలమని, మిగిలిన వారికి 2,3 రోజుల్లో ఇస్తామని చెప్పగా రైతులు నిరసన తెలిపారు. 112 మందికే ఇస్తే మిగిలినవారి సంగతేంటి? యూరియా నిల్వలకు ఎటువంటి ఇబ్బందీ లేదని, సరిపడా ఉన్నాయని అంటూనే తమకు చుక్కలు చూపిస్తున్నారని ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి రైతులు నిరసన తెలిపారు. శనివారం కొవ్వలి కో–ఆపరేటివ్ సొసైటీకి 12.30 టన్నుల కట్టల యూరియా వచ్చింది. వాటిలో 112 మందికి ఒక కట్ట,2 కట్టలు చొప్పున పంపిణీ చేశారు. 2.5 టన్నుల యూరియా కట్టలు సొసైటీలో నిల్వ ఉంచారు. అప్పటికే 200 మందికి పైగా రైతులు సొసైటీకి వచ్చి యూరియా కావాలని అడిగితే జిల్లా అధికారులు బఫర్ స్టాక్ కింద సొసైటీలో ఉంచాలని ఆదేశాలిచ్చారని, ఇది అలాగే ఉంచాలని, వీటిని ఇవ్వడం కుదరదని చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యూరియా వస్తుందని, అది మిగిలిన రైతులకు అందజేస్తామని అధికారులు చెప్పారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. యూరియా..ఇవ్వండయ్యా! ఒక్క బస్తా యూరియా కోసం విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులు శనివారం రోజంతా క్యూలో నిలుచున్నారు. టోకెన్లు ఉన్నవారికే ఆర్ఎస్కే సిబ్బంది ఒక్కో బస్తా యూరియా ఇచ్చారు. మిగిలినవారంతా ఉసూరుమంటూ వెనుదిరిగారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. టోకెన్లు ఒక చోట, ఎరువులు ఒక చోట పెట్టి కావాల్సిన రైతులకు మాత్రమే యూరియాను ఇస్తున్నారని మిగిలిన రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో రైతు సేవా కేంద్రం ఉన్నా అక్కడ పంపిణీ పెట్టకుండా సచివాలయం వద్దనే టోకెన్లు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. ఎకరా పొలానికి కనీసం 3 బస్తాలు యూరియా కావాలని రైతులు డిమాండ్ చేస్తుండగా ఒక్క బస్తాతోనే సరిపెటే్టస్తుండటంపై అన్నదాతలు మండిపడుతున్నారు.యూరియా దారి మళ్లింపుపై సమగ్ర విచారణ జరపాలి ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి యూరియా దారిమళ్లుతున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్న వార్తలు వస్తున్నాయని విమర్శించారు. జూన్ నాటికి 10 శాతం పంటలు సాగైతే.. 32 శాతం యూరియా అమ్మకాలు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. పంటలు వెయ్యక ముందే ఈ యూరియా ఎవరు కొన్నారో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్నకు మాత్రమే యూరియా అవసరం ఉందని, వీటికీ డిమాండ్కు సరిపడా యూరియా సరఫరా చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.జోన్-1 వర్కింగ్ ప్రెసిడెంట్గా గొంటు రఘురామ్ (శ్రీకాకుళం), జోన్-2 వర్కింగ్ ప్రెసిడెంట్గా బూరుగుపల్లి సుబ్బారావు (తూర్పుగోదావరి), జోన్-3 వర్కింగ్ ప్రెసిడెంట్గా సింహాద్రి రమేష్ బాబు (కృష్ణాజిల్లా), జోన్-4 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎనుముల మారుతి ప్రసాద్రెడ్డి (ప్రకాశం), జోన్-5 వర్కింగ్ ప్రెసిడెంట్గా వంగల భరత్ కుమార్రెడ్డి (కర్నూలు), ఆక్వా కల్చర్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా వడ్డి రఘురామ్ (పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు. -
Big Question: కేసులు పెట్టి లోపలేస్తాడంట! బెదిరిస్తున్నాడు భయ్యా..
-
అటు సిగపట్లు.. ఇటు లూటీకి యత్నం
మహబూబాబాద్ రూరల్ : ఒకచోట యూరియా కోసం కొందరు మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకోగా, మరోచోట కార్యాలయంపై రైతులు రాళ్ల దాడి చేశారు. ఆపై కట్టెలు కాల బెట్టి నిరసన తెలిపారు. దీంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్లోని వివేకానంద సెంటర్ వద్ద ఉన్న ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో గురువారం యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారని తెలిసి వందల సంఖ్యలో రైతులు అక్కడకు చేరుకున్నారు. రైతుల క్యూలైన్ భారీగా ఉండటంతో టౌన్ సీఐ గట్ల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన రైతులు.. యూరియా పంపిణీ ఆలస్యం కావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తోపులాట పెరిగి ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లి బస్తాలు తీసుకునే క్రమంలో ఘర్షణ పడ్డారు. ఇందులో కొందరు మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. దీంతో కొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. మరికొంతమంది మహిళలు నడిరోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రైతు సేవాకేంద్రం నిర్వాహకులు కొంతమంది రైతులకు యూరియా బస్తాల పంపిణీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మన గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా బస్తాలు పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్పై రైతులు రాళ్లతో దాడిచేశారు. గ్రోమోర్ బోర్డును చించివేసి పాత కర్రలు వేసి నిప్పిపెట్టి నిరసన తెలిపారు. అనంతరం గ్రోమోర్ సెంటర్ గోదాంపై దాడిచేసి అందులోకి చొచ్చుకెళ్లారు. గోదాము తలుపులు పగులగొట్టి యూరియా బస్తాలు తీసుకొని పోతుండగా పోలీసులు భారీగా చేరుకొని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అదనపు బలగాలు వజ్ర ట్యాంకర్తో సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గోదాంలో ఉన్న యూరియా బస్తాల వరకు పంపిణీ చేస్తామని రైతులకు నచ్చచెప్పి శాంతింపజేశారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎస్పీ సు«దీర్ ఆర్ కేకన్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకున్నాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. తహసీల్దార్ చంద్రరాజేశ్వర్రావు రైతులను క్యూలైన్లలో నిలబెట్టి ఒక్కో రైతుకు ఒక బస్తా పంపిణీ చేశారు. దొరుకుతుందో.. లేదోఅయినా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో రైతులు సాక్షి, నెట్వర్క్ : కనీసం ఒక బస్తా యూ రియా అయినా దొరు కుతుందో లేదో తెలి యకపోయినా తెల్లవారుజాము నుంచే రైతు లు క్యూలైన్లో నిల్చుంటున్నారు. యూరియా దొరికిన రైతులు ఆనందంతో, దొరకని రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొన్నిచోట్ల అసలు యూరియా లారీలు రావడం లేదంటూ ఆందోళనలకు దిగి రైతులు రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ సింగిల్విండో సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు టోకెన్ల కోసం క్యూలో నిల్చున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వృద్ధులు మణెమ్మ, కుర్మన్న స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే పక్కన ఉన్న రైతులు నీళ్లు తాగించి 108లో ఆస్పత్రికి తరలించారు. టోకెన్లు తీసుకున్న రైతులే మళ్లీమళ్లీ వస్తుండడంతో మరికల్ సీఐ రాజేందర్రెడ్డి, ఎస్ఐ రాము ఎన్నికల పోలింగ్ తరహాలో తీలేర్ సొసైటీకి వచి్చన ప్రతి రైతు చేతి బొటవేలుకు సిరా(ఇంకు) గుర్తు వేసి.. టోకెన్ ఇచ్చారు. వీరికి ఈ నెల 6వ తేదీన యూరియా ఇవ్వనున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సింగిల్ విండో కార్యాలయానికి ఉదయాన్నే చేరుకున్నారు. ఇక్కడకు వచ్చిన యూరియా లారీని అధికారులు అక్కన్నపేటకు పంపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రధాన గేట్ రహదారిపై బైఠాయించారు. కొద్ది సేపటికి పక్కనే ఉన్న మంత్రి కార్యాలయానికి పరుగులు పెట్టారు. పోలీసులు వారించినా రైతులు వినకుండా మంత్రి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. తెల్లవారుజామునే కామారెడ్డి జిల్లా బీబీపేటలోని సింగిల్ విండో సొసైటీ కార్యాలయానికి రైతులు తరలివచ్చి క్యూలో ఉన్నారు. కొందరికే యూరియా పంపిణీ చేయడంతో రైతులు తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు, వ్యవసాయ అధికారులు, సొసైటీ సిబ్బంది సర్దిచెప్పారు. యూరియా అందక తన పొలం ఎర్రబడిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు మానుక లక్ష్మణ్ ఆగ్రహంతో రగలిపోయాడు. ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసిన పాపానికి చెప్పుతో కొట్టుకోవాలంటూ లక్ష్మణ్ తన చెప్పుతో కొట్టుకున్నాడు. యూరియా కోసం అన్నదాతలు బాధ పడుతున్నారంటూ సీఎం రేవంత్రెడ్డిని దూషించాడు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. వరంగల్ గూడ్స్ షెడ్కు వివిధ కంపెనీలకు దాదాపు 2,912 మెట్రిక్ టన్నుల యూరియా వచి్చంది. దీనిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారి రవీందర్ చెప్పారు. -
శృంగవరపుకోటలో యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులపై నోరు పారేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్ళు
-
మహబూబాబాద్లో ఉద్రిక్తత.. యూరియా కేంద్రంపై రాళ్ల దాడి
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. సూర్య థియేటర్ ఎదురుగా ఉన్న యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్లతో దాడి చేశారు. ‘మన గ్రోమోర్’ దుకాణం బోర్డు చించేసిన రైతులు.. దుకాణం ముందు కర్రలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. గోడౌన్ తాళం పగలగొట్టిన రైతులు.. యూరియా బస్తాలను బయటకు తెచ్చారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యూరియా ఇవ్వాలంటూ రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు.సూర్యాపేట జిల్లా: హుజుర్నగర్లో యూరియా కోసం క్యూలైన్లో నిలబడిన మహిళ.. స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం నుంచి లైన్ లో నిలబడటంతో మహిళా రైతు దాసరి రాములమ్మ అస్వస్థతకు గురయ్యారు.రాజన్న సిరిసిల్ల జిల్లా: వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
‘రైతులు వెళ్ళి అడిగితే బెదిరిస్తున్నారు’
తాడేపల్లి : యూరియా గురించి రైతులను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ కైలే అనిల్కుమార్. కృష్ణాజిల్లాలో తీవ్రమైన యూరియా కొరత ఉందిని, పీఏసీఎస్ల దగ్గర రైతులు బారులు తీరుతున్నారన్నారు. యూరియాని కేవలం టీడీపీ వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని, చైతులు వెళ్లి అడిగితే బెదిరిస్తున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు.ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలుగా పేర్లు మార్చారే తప్ప రైతులను పట్టించుకోవడం లేదన్నారు. పామర్రు నియోజకవర్గంలో బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న యూరియాని రైతులు అడ్డుకున్నారన్నారు. పోలీస్ స్టేషన్కు తరలించిన తర్వాత లోపల ఉన్న యూరియా రంగు కూడా మారిపోయిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులు పట్టుకున్న యూరియా లారీ వ్యవహారం తేల్చాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. -
ఏపీ కేబినెట్కు యూరియా సెగ
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్కు యూరియా సెగ తగిలింది. యూరియా కోసం రైతుల కష్టాలపై చర్చ జరిగింది. యూరియా విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందంటూ కేబినెట్లో చర్చ నడిచింది. యూరియా అంశంపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మంత్రులంతా వైఎస్సార్సీపీని తిట్టాలని సీఎం ఆదేశించారు.కాగా, యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది.యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది. -
KSR Live Show: రైతుల కష్టాలపై రాజకీయ రాకాసులు..!
-
Magazine Story: అన్నదాతల కడుపు కొడుతున్న రైతు ద్రోహి
-
యూరియా ‘కట్ట’డిపై ముట్టడి!
సాక్షి, అమరావతి /సాక్షి నెట్వర్క్: యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది. యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది. మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తోంది. సొసైటీల ద్వారా సరఫరా చేయకుండా పక్కదారి పట్టిస్తున్న టీడీపీ నేతల ఆగడాలకు రైతన్నలే చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ రైతన్నలే విజిలెన్స్ అధికారుల అవతారమెత్తి అడ్డుకుంటున్నారు. చరిత్రలోఎన్నడూ లేనివిధంగా డిమాండ్ మేరకు యూరియా సరఫరా కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు నిరసన బాట పట్టారు. కృష్ణా జిల్లాలో యూరియా కోసం నిరసనలు భగ్గుమంటున్నాయి. దారి మళ్లుతున్న యూరియా.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఈ సీజన్లో 6.22 లక్షల టన్నుల యూరియా అవసరం. ఈ ఏడాది 5.70 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయని చెబుతోంది. అదే నిజమైతే మరి రైతన్నలు ఎందుకు రోడ్డెక్కాల్సి వస్తోందన్న ప్రశ్నకు సర్కారు వద్ద సమాధానం కరువైంది. రైతులకు అందాల్సిన యూరియా పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నట్లు స్పష్టమవుతోంది. పలు జిల్లాల్లో టీడీపీ నేతలే యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నా వారిని కాపాడే యత్నం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఏలూరు జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీ వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు గుడివాడలో గంటల కొద్దీ పడిగాపులు.. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో యూరియా సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించడంతో పీఏసీఎస్ల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. విన్నకోట, నందివాడ, రామనపూడి పీఎసీఎస్ వద్ద గంటల తరబడి క్యూలైన్లో నిలబడితే అరకొరగా మాత్రమే యూరియా అందజేశారని రైతులు మండిపడ్డారు. అధికార పార్టీ నేతల సిఫార్సులు ఉన్న వారికి మాత్రమే ఎరువులు దక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో భారీ క్యూలైన్లో బారులు తీరిన అన్నదాతలు ఘంటశాలలో గందరగోళం కృష్ణా జిల్లా ఘంటశాల మండలంలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మండలంలోని లంకపల్లి పీఏసీఏస్కు 445 యూరియా కట్టలు రాగా ఘంటశాల గ్రోమోర్కు 555 యూరియా కట్టలు వచ్చాయి. లంకపల్లి పీఏసీఏస్ వద్దకు రైతులు భారీగా చేరుకోగా అధికారులు గేట్లు మూసి వేయడంతో ఎండలో బారులు తీరారు. రైతులను అదుపు చేయలేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకు అరకట్టకు మించి ఇవ్వలేదు. రైతుల ఆధార్, పాస్ బుక్ జిరాక్సులు తీసుకుని స్లిప్లు పంపిణీ చేశారు. పలుకుబడి ఉన్న వారికే యూరియా ఇస్తున్నారని క్యూలో నిలబడ్డ వారు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు, అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. గ్రోమోర్, లంకపల్లి పీఏసీఏస్ల వద్ద రైతులు కనీసం సేదతీరడానికి కూడా అవకాశం లేకపోవడంతో అవస్థలు పడ్డారు. ఘంటశాలలో అరుగులపై తమ వంతు వచ్చే వరకు కూలబడిపోయారు. యూరియా దొరకని రైతులు ప్రభుత్వ అసమర్థతను తిట్టుకుంటూ వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా గజ్జరంలో యూరియా కోసం రైతుల పాట్లు చిత్తూరులో రైతుల నిరసన టోకెన్లు ఉన్నా యూరియా పంపిణీ చేయడం లేదని చిత్తూరు జిల్లా సదుం మండలంలో రైతులు నిరసన తెలిపారు. మూడు రోజులుగా దుకాణం వద్దకు టోకెన్లతో వచ్చినా యూరియా ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్టాకు లేదంటూ దుకాణం మూసి వేశారని, నాయకులు ఫోన్ చేస్తే పదుల సంఖ్యలో బస్తాలను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లె యార్డులో ఆందోళన యూరియా కోసం రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా మార్కెట్ యార్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా యూరియా అందించే నాథుడు లేడని వాపోయారు. స్టాక్ ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని, గంటల కొద్దీ గోడౌన్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరిలో తిరుగుముఖం.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని గజ్జరం, అన్నదేవరపేట సొసైటీల వద్ద బుధవారం యూరియా విక్రయాల వద్ద గందరగోళం నెలకొంది. ఈ సొసైటీలకు 1,600 బస్తాల యూరియా వచ్చింది. 500 మంది రైతులకు యూరియా అందజేశారు. మరో 50 మంది రైతులకు అందకపోవడంతో వెనుదిరిగారు. తాళ్లపూడి, వీరభద్రపురం, కుకునూరు, పైడిమెట్ట గ్రామాల రైతులకు యూరియా అందకపోవడంతో తామెక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లా సదుంలో నిరసన తెలుపుతున్న కర్షకులు అనకాపల్లిలో కిక్కిరిసిన కేంద్రం.. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో యూరియా కోసం మండుటెండలో అన్నదాతలు నరకయాతన అనుభవించారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో యూరియా పంపిణీ గురించి తెలియడంతో ఉదయం 8 గంటలకే అధిక సంఖ్యలో చేరుకున్నారు. యూరియా నిల్వల కంటే రెట్టింపు సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షించి రైతులు నానా అవస్థలు పడ్డారు. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని, ఆధార్, 1 బీ తప్పనిసరిగా ఉండాలని వ్యవసాయశాఖ సిబ్బంది చెప్పడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లాలో పడిగాపులు.. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. బుధవారం సొసైటీ కార్యాలయం వద్దకు స్టాక్ రావడంతో రైతులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఒక బస్తా మాత్రమే సరఫరా చేస్తుండటంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికే యూరియా ఖాళీ కావడంతో రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా..! ఏలూరు డీసీఎంఎస్ డిపోకు యూరియా వచ్చిందని తెలిసి రైతులు అధిక సంఖ్యలో రావడంతో చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. డీసీఎంఎస్ డిపోకు 18 టన్నుల యూరియా వచ్చినా పంపిణీ చేయకుండా అధికారులు మోకాలడ్డారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని డిపో నిర్వాహకులు మెలిక పెట్టారు. కాంప్లెక్స్ ఎరువులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని, అంత డబ్బు తమ వద్ద లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారపార్టీ నాయకుల సిఫార్సు ఉన్న వారికి ఎన్ని కట్టలైనా ఇస్తున్నారంటూ వాపోయారు. గుంటూరు జిల్లా రేపల్లె మార్కెట్యార్డు వద్ద రైతుల ఆందోళన అధికంగా వాడేస్తున్నారంటూ రైతులపై నెపంఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు లక్ష్యం 86 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 55.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 30 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం వరి చిరు పొట్ట దశకు చేరుకుంది. ఈ సమయంలో నత్రజని (యూరియా) చాలా అవసరం. యూరియాకు ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇలాంటి తరుణంలో సెప్టెంబర్లో అంచనా డిమాండ్ 1.55 లక్షల టన్నులైతే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా కేవలం 94 వేల టన్నులు మాత్రమే. యూరియా ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోంది.. అంటూ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఊరిస్తున్నా రాష్ట్రానికి వారు చెబుతున్నట్లుగా నిల్వలు రావడం లేదు. దీంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రైతులకు సరఫరా చేయాల్సిన యూరియా పక్కదారి పడుతుంటే గుడ్లప్పగించి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధికంగా వాడేస్తున్నారంటూ రైతులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోంది. అసలు తమకు కట్ట కూడా దొరకడం లేదంటూ ఓవైపు రైతులు గగ్గోలు పెడుతుంటే మితిమీరి వాడేస్తున్నారంటూ వారిని నిందిస్తోంది. అర్ధరాత్రి రోడ్డెక్కి లారీని అడ్డుకున్న రైతులు..కొరత తీవ్రంగా ఉండడంతో కృష్ణా జిల్లా చినముత్తేవి గ్రామ రైతులు మంగళవారం అర్ధరాత్రి రోడ్డెక్కి యూరియా లారీని అడ్డుకున్నారు. అందులో ఉన్న సరుకు తమకు పంపిణీ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఎరువులతో వచ్చిన లారీ (ఏపీ 29 టీబీ 3974) డోకిపర్రులో కొన్ని బస్తాలు, చినముత్తేవిలోని ఓ ఎరువుల దుకాణంలో మరికొన్ని బస్తాలను దింపింది. చినముత్తేవి రైతులు దీన్ని గమనించి లారీని అడ్డుకున్నారు. ఏలూరు డీసీఎంఎస్ ఎరువుల కౌంటర్ వద్ద తోపులాట లారీ డ్రైవర్ వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవటంతో ఆగ్రహించిన రైతన్నలు యూరియా కోసం అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించారు. అక్కడకు చేరుకున్న కూచిపూడి ఎస్సై రైతులతో మాట్లాడి లారీని పోలీస్స్టేషన్కు తరలించారు. కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి బుధవారం కూచిపూడి పోలీస్స్టేషన్కు వచ్చి లారీలోని ఎరువులకు బిల్లులు ఉన్నాయని చెప్పారు. ఆ లోడ్ను నిడుమోలులోని గంగా ఫెర్టిలైజర్స్కు పంపించి ఎకరాకు అరకట్ట వంతున ఏవో ఆధ్వర్యంలో పంపిణీ చేయించారు. గుడివాడలోని వ్యాగన్ నుంచి యూరియా 325 బస్తాలు, ఎంవోపీ (పొటాష్) 200 బస్తాలు, 16–16–16 రకం 80 బస్తాలు పంపామని, నిడుమోలు వెళుతుండగా రైతులు లారీని అడ్డుకుని ఆందోళన చేపట్టారని జేడీఏ పేర్కొన్నారు. -
బస్తా కోసం.. బారులేబారులు
సాక్షి, నెట్వర్క్: గంటల తరబడి బారులు తీరినా...రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం గగనమైంది. రోజురోజుకూ యూరియా కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు. » ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూస్తే...యూరియా కోసం జడ్చర్లలో 167 జాతీయ రహదారిపై సిగ్నల్గడ్డ వద్ద రైతులు ధర్నా చేశారు. మహమ్మదాబాద్ మండలం నంచర్లగేట్ వద్ద రైతులు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాజాపూర్, బాలానగర్, చిన్నచింతకుంట, మిడ్జిల్ మండలాల్లోని పలు కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. నవాబ్పేటలో వేలాది మంది రైతులు రావడంతో పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు. » నాగర్కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల పీఏసీఎస్ వద్ద జప్తీ సదగోడుకు చెందిన మొగిలి అనిత క్యూలో నిల్చొని స్పృహతప్పి పడిపోయింది. వనపర్తి జిల్లా గోపాల్పేటలో రైతులు ధర్నా చేశారు. » భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పీఏసీఎస్కు రైతులు భారీగా పోటెత్తారు. » మెదక్ జిల్లా శివ్వంపేట పీఏసీఎస్కు తెల్లవారు జా ము నుంచే రైతులు పెద్దఎత్తున బారులు తీరారు. » నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆగ్రో ఏజెన్సీ వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు కూడా క్యూ లైన్లో నిల్చున్నారు. » కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని సొసైటీకి యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో ఉదయం 4 గంటల నుంచే రైతులు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి ఉండడం ఇబ్బందిగా మారడంతో వరుసలో రాళ్లు, చెప్పులు, చెట్ల కొమ్మలు ఉంచారు. రాత్రి 7 గంటల వరకు నిరీక్షించినా లారీ రాకపోవడంతో నిరాశతో తిరుగుముఖం పట్టారు. » ఉమ్మడి వరంగల్జిల్లాలో యూరియా కష్టాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సొసైటీ వద్ద రైతులు తెల్లవారుజామునుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. చివరకు యూరియా లారీ రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. నర్సింహులపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఎదుట కూపన్ల కోసం ఉదయం నుంచే రైతులు చెప్పులను క్యూలో పెట్టారు. డోర్నకల్ మండలం గొల్లచర్ల సమీపంలోని పీఏసీఎస్ ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. దంతాలపల్లి రైతు వేదిక వద్ద కూపన్ల కోసం కిలోమీటర్ మేర లైన్ కట్టి గంటల కొద్ది వేచి చూశారు. మరిపెడ పీఏసీఎస్లో మహిళా రైతులు యూరియా టోకెన్ల కోసం గేటు దూకి మరి కార్యాలయంలోకి వెళ్లారు. » వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రామలింగాయపల్లి పీఏసీఎస్కు రాత్రి యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు అక్కడే పడుకునేందుకు బుధవారం రాత్రి చద్దర్లు, గొడుగులతో వచ్చారు. జనగామ జిల్లా కేంద్రంతోపాటు తరిగొప్పుల, స్టేషన్ఘన్పూర్లో యూరియా కోసం బారులుతీరారు. » జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల ఆగ్రోస్–1, చిట్యాల ఓడీఎంఎస్ దుకాణం వద్ద పోలీస్ పహారాలో యూరియా పంపిణీ చేశారు. » ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాజారాంపేట సొసైటీ వద్ద ఒకే బస్తా ఇవ్వడంపై రైతులు మండిపడ్డారు. కేంద్రం ఇన్చార్జ్, ఎంపీఓ శివ రైతులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారి దీసింది. కోర్టుకు వెళ్లాలంటూ రైతులను ఆయన బయటకు తోసేసే ప్రయత్నం చేయగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యూరియా రైతుల కష్టాలు
-
ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారని మండిపడ్డారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు పంటలకు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజూ ఆదుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం కలగడం లేదెందుకు? ⇒ ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. అందుకు అనుగుణంగా ఏమేరకు ఎరువులు పంపిణీ చేయాలి.. ఈ విషయాలపై ప్రతి ఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే కదా అర్థం? ⇒ ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. బస్తా యూరియా రేటు రూ.267 అయితే, దీనికి మరో రూ.200 అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు)లకు, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు గారూ.. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పీఏసీఎస్ల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50 తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారూ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా? ⇒ మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400–500కు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35తో అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేలతో అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు. ⇒ ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు పెట్టి.. ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు పట్టించుకోవడం లేదెందుకు చంద్రబాబు గారూ? నిద్ర నటించే వాళ్లని ఎవరైనా లేపగలరా?.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025⇒ మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్ టైం డేటా సీఎంఏపీపీ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ను మూలన పడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు. ఏ సీజన్లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. అది కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. -
కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునేవారే లేకుండాపోయారు: బొత్స
-
Warangal : అన్నదాతను రోడ్డెక్కేలా చేసిన యూరియా సమస్య
-
రైతులపై అచ్చెన్నాయుడు కామెంట్స్... కాకాణి కౌంటర్
-
రైతుల కష్టాలను చులకనగా మాట్లాడిన అచ్చెన్నాయుడు
-
ఏ పంటకూ ‘మద్దతు’ లేదు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మంగళవారం పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం తాళ్లపల్లె వద్ద ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో పంటలకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నదాతలు ఆవేదన వెలిబుచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం తమను ఆదుకుందని, ఇప్పుడు పంటలకు రేటు లభించక అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. వైఎస్ జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణం కళ్లు తెరిచి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... హెరిటేజ్లో కిలో రూ.35.. రైతులకు ఇస్తున్నది రూ.6 ‘ఈ రోజు చీనీ రేటు క్వింటాలు రూ.12వేల నుంచి రూ.6వేలకు పతనమైనా కొనుగోలు చేసే నాథుడు లేడు. ఇందులో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. అదే వైఎస్సార్సీపీ హయాంలో క్వింటాల్ కనీసం రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉల్లి క్వింటాల్ కనీసం రూ.4 వేలనుంచి రూ.12 వేలు చొప్పున అమ్ముడుపోయింది. ప్రస్తుతం రైతుల నుంచి క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి రూ.800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. లేదంటే క్వింటాలు రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటాలుకు నాలుగైదు వందలు కూడా రేటు రావడం లేదు. ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2,500 చొప్పున ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలి. ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు గానీ రైతుబజార్ల ద్వారా గానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరిటేజ్లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. కానీ ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. రైతులకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్లో లాభాలు తగ్గకూడదు.. చంద్రబాబు వ్యాపారాలు జరగాలి.. ఇదీ పరిస్థితి! అరటి దుస్థితి కూడా ఇలాగే ఉంది. రూ.3వేలకు కూడా కొనేవారు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30 వేలకు రైతులు అమ్ముకున్నారు. యూరియా కూడా అందించలేకపోతున్నారు వైఎస్సార్సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్లో విక్రయాలు జరిగిన పరిస్థితి లేదు. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నాం. కమీషన్లు, బ్లాక్లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశాం. ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు? మా హయాంలో రూ.265కి యూరియా బస్తా లభించేది. తమ గ్రామంలోనే రైతన్నలు యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు వారికి అందుబాటులో ఉంటూ పనిచేశాయి. నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వాటి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు రావని బ్లాక్ మార్కెట్ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము.. ఇలా ఏ పంట చూసినా రేటు లేని పరిస్థితిలో ఇవాళ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం చూస్తే.. అన్నదాతా సుఖీభవ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్లకుగానూ చంద్రబాబు ఒక్కో రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉన్నా, ఇంతవరకు ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. మా హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, నరేన్ రామాంజులరెడ్డి, సంబటూరు ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన రైతన్నలు
సాక్షి, అమరావతి/ఉదయగిరి రూరల్/గంగవరం/సదుం/మదనపల్లె రూరల్: రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని బండగానపల్లె పంచాయతీ బిజ్జంపల్లిలో యూరియా కోసం రైతులు మంగళవారం రోడ్డుపై నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా గంగవరం, సదుం మండలాల్లో యూరియా కోసం రైతులు భారీగా క్యూ కట్టారు. గంగవరంలోని పీఏసీఎస్ కార్యాలయానికి చేరిన 450 బస్తాలు యూరియా కోసం 2వేలమందికిపైగా రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు గాశారు. దీంతో ఉన్న 450 బస్తాలను ఇంతమందికి ఎలా పంచాలా అని అధికారులు తలలు పట్టుకున్నారు. పీఏసీఎస్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకూ రైతులు ఎండలో క్యూకట్టారు. వీరిలో వృద్దులు, మహిళలూ ఉన్నారు. అలాగే, సదుంలోని ఓ ప్రైవేటు దుకాణానికి 14 క్వింటాళ్ల యూరియా రావడంతో అక్కడ కూడా రైతులు బారులు తీరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మండల వ్యవసాయశాఖాధికారి(ఏవో) కార్యాలయంలో యూరియా కూపన్ల పంపిణీలో గందరగోళం ఏర్పడింది. కూపన్లు ఇస్తున్న క్రమంలో అక్కడ తోపులాటలు, అరుపులు, కేకలతో పరిస్థితి గందరగోళంగా మారింది. గంటలసేపు నిల్చుని, తోపులాటకు గురై ఇబ్బందులు పడుతూ లోనికి వెళితే ఒకరికి ఒక బస్తా యూరియానే ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల గోడు పట్టని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల డిమాండ్కు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఖరీఫ్లో ఇప్పటివరకు 22.12 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వగా, దాంట్లో సగానికి పైగా వరి సాగైందని చెప్పారు. అదునుకు పంటకు యూరియా అందించకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెపె్టంబర్లో వరి చిరుపొట్టదశలో తప్పనిసరిగా యూరియా వేయాలని, దీనికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. సీజన్ ప్రారంభంలోనే వరి సాగు ఏరియాలో యూరియా కొరత వచ్చిందని, ఆగస్ట్ 8 నుంచి కురిసిన అధిక వర్షాలతో ముంపునకు గురైన వరితోపాటు మొక్కజొన్న, పత్తి ఇతర పంటలకూ యూరియా అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ సరిపడా యూరియాను ప్రభుత్వం అందించలేకపోతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడి కెళ్లినా యూరియా కోసం రైతులు బారులు తీరి కన్పిస్తున్నారన్నారు.రెండో పంటకు యూరియా కొనవద్దని ప్రకటనలు ఇవ్వడం తగదన్నారు. రూ.266.5 ఉన్న యూరియా కట్టను కొనాలంటే ప్రైవేటు వ్యాపారులు రూ.1,400పైగా ఉన్న కాంప్లెక్స్ కట్ట లేదా రూ.800– 900 పలికే పురుగు మందును బలవంతంగా అంటకడుతున్నారని నాగిరెడ్డి చెప్పారు. -
హెరిటేజ్లో ఉల్లిరేటు.. రైతుల్ని దగా చేసిన బాబుపై జగన్ ఆగ్రహం (ఫోటోలు)
-
బాబు వ్యాపారాల కోసం రైతులతో ఆడుకుంటారా?: వైఎస్ జగన్
కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.సాక్షి, వైఎస్సార్: కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం ఉదయం వేముల మండలం దుగ్గన్నగారి పల్లి వద్ద ఉల్లి, చీనీ బత్తాయి రైతులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు.గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమను సర్కార్ ఆదుకున్నదని, నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పంటలకు రేటు లభించక, అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. పొలంలోకి వెళ్లి ఉల్లి పంటను పరిశీలించిన అనంతరం రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. ‘‘రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటోంది. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. అరటి రైతులు కూడా నష్టపోతున్నారు. ప్రభుత్వమే ఎరువుల బ్లాక్ మార్కెట్ను ప్రొత్సహిస్తోంది. కానీ, మా హయాంలో ఏనాడూ ఎరువులు బ్లాక్లో అమ్మలేదు. ఇప్పుడు రైతులకు కూలీ ఖర్చు కూడా రావడం లేదు. ప్రభుత్వమే రైతుల వద్ద ఉల్లి కొనుగోలు చేయాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులను పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ రోజు చీనీ రేటు క్వింటా రూ.6 వేల నుంచి రూ.12 వేలకు అమ్ముడుపోతోంది. ఈ రేటుకు కూడా కొనుగోలు చేసే నాధుడు లేడు. దీనిలో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. ఇదే గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మినిమమ్ క్వింటా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. ఉల్లికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మినిమమ్ రూ.4 నుంచి రూ.12 వేలు క్వింటాల్ అమ్ముడుపోయింది. నేడు రైతుకు క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి కనీసం రూ.800 లకు కొనుగోలు చేస్తున్నారు. గ్రేడ్ బాగలేకపోతే క్వింటా రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటా నాలుగైదు వందలకు కూడా రేటు రావడం లేదు. ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2500 చొప్పున ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు కానీ, రైతుబజార్ల ద్వారా కానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరటేజ్లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. ఇదే రైతుకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి, చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35 కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్లో లాభాలు తగ్గకూడదు, చంద్రబాబు వ్యాపారాలు జరగాలి, ఇదీ ప్రభుత్వ పరిస్థితి. అరటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కనీసం రూ.3వేలకు కూడా కోసే వారు కనిపించడం లేదు. గత వైయస్ఆర్సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30వేలకు రైతులు అమ్ముకున్నారు.యూరియా కూడా అందించలేకపోతున్నారువైయస్ఆర్సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి లేదని.. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నామని.. తద్వారా కమీషన్లు, బ్లాక్ లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ‘ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రెండు వందల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మా హయాంలో రూ.265 రూపాయలకు యూరియా బ్యాగ్ లభించేది. తమ గ్రామంలోనే యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు రైతుకలు అందుబాటులో ఉండి పనిచేశాయి. నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వీరి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వంలోని పెద్దలకు కమీషన్లు రావని, బ్లాక్ మార్కెట్ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము ఇలా ఏ పంటచూసినా రేటు లేని స్థితిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. రైతుకు పెట్టుబడి సాయం చూస్తే, చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్ళకు ఇరవై వేల చొప్పున రూ.40 వేలు ఇవ్వాల్సి వున్నా ఇంత వరకు ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే. గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు’’ అని జగన్ మండిపడ్డారు. -
కుప్పంలోనూ యూరియా కష్టాలు.. రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న అన్నదాతలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రైతులు సోమవారం ఆందోళన చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలంలోని వంగలపూడి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అలాగే కర్నూలులో ఉల్లి రైతులు తమకు మద్దతు ధర ఇవ్వాలని మంత్రి భరత్ను నిలదీశారు. విజయవాడలో కౌలు రైతులు తమకు రుణాలు మంజూరు చేయాలని ఎస్ఎల్బీసీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. – సాక్షి నెట్వర్క్ యూరియా కోసం తిప్పలు... తప్పని పడిగాపులుపుంగనూరు/సీతానగరం/గుడుపల్లె: ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం సరైన సమయంలో అందించకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని జిల్లాల్లో రైతులు ఉదయమే ఎరువుల పంపిణీ కేంద్రాలవద్ద క్యూలో చెప్పులు ఉంచి, ఆనక వచ్చి యూరియా తీసుకెళుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో యూరియా వచి్చందని తెలియడంతో రైతులు మార్కెట్ యార్డు, శుభారాం డిగ్రీ కళాశాల వద్ద గల ప్రైవేటు షాపుల వద్దకు సోమవారం ఉదయం 6 గంటలకు చేరుకున్నారు.10 గంటలు గడిచినా నిర్వాహకులు యూరియా ఇవ్వలేదు. 10గంటల అనంతరం తమకు ఇష్టమైన వారికే పంపిణీ చేయడంతో రైతులు ఒక్కసారిగా గుమిగూడారు. ఆ సమయంలో పలువురు కిందపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు వచ్చి వారిని నియంత్రించారు. 10వేల మందికి 720 బస్తాలా? పుంగనూరు మండలంలోని 23 పంచాయతీల్లో సుమారు పదివేల మంది రైతులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం కేవలం 720 బస్తాల యూరియా మాత్రమే సరఫరా చేయడంతో మిగతా రైతుల పరిస్థితేంటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఎస్కేల్లో కాకుండా, రైతులను పట్టణానికి పిలిపించడం, ప్రైవేటు వ్యక్తుల ద్వారా పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై ఏడీ శివకుమార్ స్పందించారు. అందరికీ యూరియా పంపిణీ చేస్తామని చెప్పారు. క్యూలో చెప్పులు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వంగలపూడి సొసైటీ వద్ద మునుపెన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు చెప్పులను క్యూలో ఉంచారు. సొసైటీకి ఆదివారం 10 టన్నుల యూరియా వచి్చందని సమాచారం తెలుసుకున్న రైతులు సోమవారం ఉదయం 5 గంటలకు పీఏసీఎస్కు చేరుకుని తమ చెప్పులను క్యూలో ఉంచి, తిరిగి ఇళ్లకు వెళ్లారు. అనంతరం ఉదయం 10 గంటలకు సొసైటీ సిబ్బంది రాగానే క్యూలో నిలబడ్డారు. పీఏసీఎస్ సీఈవో పంతం సూర్యనారాయణ రైతుకు ఒక యూరియా బస్తా చొప్పున అందించారు. 200మంది రైతులు యూరియా లేకుండానే ఇంటిముఖం పట్టారు. చిత్తూరులో రైతుల ఆందోళన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, గుడుపల్లె మండలం కేంద్రంలో సోమవారం యూరియా కోసం రైతు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈక్రమంలో సోమవారం గుడుపల్లెకు ఒక లోడు యూరియా రావడంతో వందలాది రైతులు ఓ ప్రైవేట్ దుకాణం వద్ద బారులు తీరారు. ఒక రైతుకు ఒక కట్టమాత్రమే ఇస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్యూలో తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఇది గొడవలకు దారితీయడంతో పోలీసులు వచ్చి సర్దుబాటు చేశారు. చాలా మంది రైతులకు సాయంత్రమైనా యూరియా అందకపోవడంతో తిరుముఖం పట్టారు.మంత్రి ఎదుట ఉల్లి రైతుల కన్నీరుమున్నీరురూ.1200 ఏ మాత్రం గిట్టుబాటు కాదంటున్న రైతులుకర్నూలు(అగ్రికల్చర్): ‘ఉల్లి సాగు కోసం రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టా. తీరా పంటను మార్కెట్కు తీసుకొస్తే అధికారులు క్వింటా రూ.1,200కి కొంటున్నారుక్రిభుత్వమే ఇంత తక్కువ ధర ఇస్తే ఎలా బతికేది. ఈ ధర మాకు గిట్టుబాటు కాదు. భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది’ అంటూ ఓ ఉల్లి రైతు మంత్రి ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు.కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లికి ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 ధరతో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన పలువురు ఉల్లి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 39 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వచ్చాయి. అన్ని లాట్లకు వ్యాపారులు టెండర్ వేశారు. మార్క్ఫెడ్ ఒక్కలాట్ మినహా 38 లాట్లకు రూ.1,200 ధర కోట్ చేసింది. ఇందులో ఒక లాట్కు రూ.1,329 ధర లభించింది. మరో లాట్కు రూ.517 ధర లభించింది. మిగిలిన లాట్లు మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. రూ.517 ధర లభించిన లాట్కు రీ టెండరు వేసి మార్క్ఫెడ్ ద్వారా రూ.1,200కు కొనిపించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూ.80వేలు నష్టపోయా ఎకరాలో ఉల్లి సాగు చేశా. దిగుబడులు పెంచాలనే లక్ష్యంతో రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. ఆగస్టులో కురిసిన అధిక వర్షాలు నిలువునా ముంచాయి. 100 ప్యాకెట్ల ఉల్లి పొలంలోనే కుళ్లిపోయింది. కేవలం 34 ప్యాకెట్లు (18 క్వింటాళ్లు) మాత్రమే మిగిలింది. ఈ పంటను సోమవారం మార్కెట్ యార్డుకు తీసుకెళితే, మార్క్ఫెడ్ అధికారులు క్వింటా రూ.1200కి కొన్నారు. ఈ ధరతో రూ.80 వేల వరకు నష్టం వచ్చింది. – ఎ.పెద్దయ్య, ఉల్లి రైతు, పి.కోటకొండ గ్రామం, కర్నూలు జిల్లా తూర్పుగోదావరి జిల్లా వంగలపూడి పీఏసీఎస్ వద్ద రైతులు క్యూలో ఉంచిన చెప్పులు కౌలు రైతులకు హామీ లేని రుణాలివ్వాలిరైతు సంఘాల డిమాండ్సాక్షి, అమరావతి: కౌలు రైతులకు ఎలాంటి హామీ లేకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.2 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలివ్వాలని ఏపీ రైతు, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడలోని రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) కార్యాలయం ఎదుట రుణాల కోసం కౌలు రైతుల రాయబారం పేరిట సోమవారం ఆందోళన జరిగింది. రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని సాగు భూమిలో 70 శాతం కౌలు రైతులే సాగు చేస్తున్నారని.. పెట్టుబడి దొరక్క వారంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.కనీసం అన్నదాత సుఖీభవ సాయం కూడా కౌలు రైతులకు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వడ్డీ రాయితీలు కౌలు రైతులకు అందడం లేదన్నారు. ఆందోళన అనంతరం ఎస్ఎల్బీసీ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇస్తామని, సీసీఆర్సీ కార్డుల్లేని ఈ క్రాప్ నమోదు ప్రాతిపదికన జేఎల్జీ గ్రూపుల ద్వారా రూ.2 లక్షలకు తక్కువ లేకుండా పంట రుణాలిచ్చేందుకు కృషి చేస్తామని ఎస్ఎల్బీసీ మేనేజర్ హామీ ఇచ్చారు. ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పాల్గొన్నారు. -
చిరస్మరణీయ ప్రజాబాంధవుడు!
వైఎస్సార్ మన నుంచి దూరమై నేటికి 16 సంవత్సరాలు. సంక్షేమం, అభివృద్ధి, దూరదృష్టి, విలువలు, విశ్వసనీయత, ఆదర్శ రాజకీయాలు వంటి మాటలు విన్నప్పుడల్లా ఆయనే గుర్తొస్తారు. ఆయన దూరదృష్టితో తీసుకున్న అనేక నిర్ణయాలు అద్భుత ఫలితాలనిచ్చాయి. జలయజ్ఞం అందుకు ఒక మంచి ఉదాహరణ. పోల వరం ప్రాజెక్టుకు నేడు జాతీయ హోదా రావడానికి నాడు అన్ని అనుమతులూ సాధించడం, కుడి– ఎడమ కాల్వల నిర్మాణం ప్రారంభించడం వల్లనే సాధ్యమయ్యింది. నేటి ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే పట్టిసీమ కూడా వైఎస్ కుడి కాలువను సింహభాగం పూర్తి చేసినందు వల్లే సాధ్యం అయ్యింది. దక్షిణ తెలంగాణ కోసం పాలమూరు– రంగారెడ్డి, దిండి; రాయల సీమ కోసం శంకుస్థాపనకి మాత్రమే పరిమితం అయిన గాలేరు– నగరి, హంద్రీ–నీవా, పోతిరెడ్డి పాడు వెడల్పు; ప్రకాశం జిల్లా కోసం వెలుగొండ; కృష్ణా డెల్టా కోసం పులిచింతల; హైదరాబాద్ శాశ్వత నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి నీటి సరఫరా; ఉత్తరాంధ్ర కోసం ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టులు రూపకల్పన చేశారు కాబట్టే నేడు ప్రభుత్వాలు వాటి కోసం నిధులు ఖర్చు చేయడం, ప్రజలు అడగడం సాధ్యమవుతోంది.సంక్షేమం – అభివృద్ధివైఎస్సార్ అనగానే గుర్తుకు వచ్చేది సంక్షేమ పథకాలు. వాటిని రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల తాయిలాలని విమర్శించారు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికీ ఒక శాస్త్రీయ పరిశీలన, హేతుబద్ధమైన కారణం కనిపిస్తుంది. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల ఆత్మహత్యలకు కారణాలు, నివా రణ చర్యలు సిఫార్సు చెయ్యమని ‘ఆచార్య జయతీ ఘోష్ కమిషన్’ను నియమించారు. రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయ సమస్యలే కారణం కాదనీ, విద్య, వైద్యం వంటివి కార్పొరేట్ల చేతుల లోకి వెళ్లడం వల్ల రైతులు మరిన్ని అప్పులు చేయవలసివచ్చి ఆత్మ హత్యలకు పాల్పడ్డారనీ కమిషన్ పేర్కొంది. దీంతో వైఎస్సార్ ‘ఫీజు రీయింబర్స్మెంట్’, ‘ఆరోగ్య శ్రీ’ పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్సార్ తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ‘రైతు భరోసా’, ‘అమ్మ ఒడి’, ‘నాడు–నేడు’ వంటి పథకాలు అమలు చేశారు. ఇవి చూడటానికి సంక్షేమ పథకాలు అనిపిస్తున్నా, ఈ పథ కాల వల్ల రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి.వైఎస్సార్ ఐదు సంవత్సరాల (స్వల్ప కాలపు) పాలనలోనే అనేక దీర్ఘకాలిక ఆలోచనలు మనకు ప్రతి అంశంలోనూ కనిపి స్తాయి. భవిష్యత్తు మొత్తం నగరాల చుట్టూ ఉంటుందని నాడే ఆయన గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విశాఖ, గుంటూరు – విజయవాడ, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ తిరుపతి ఏర్పాటు ఆలోచన వైఎస్సార్దే! ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పారిశ్రామిక మార్పులను గమనంలో ఉంచుకుని ‘సెజ్’లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విదేశాలకు మనం వెళ్ళడం కాదు, మనం తగిన వాతావరణం సృష్టిస్తే విదేశీ కంపెనీలు మన దగ్గరకు వస్తాయని భావించి పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు. ‘శ్రీ సిటీ’ ఆయన కలకు ప్రతిరూపమే!భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి కూడా తన పాలనలో ప్రజలకు అత్యంత కీలకమైన విద్య, వైద్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యారంగంలో ‘నాడు–నేడు’ పేరుతో వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ విద్యకు నాణ్యతా ప్రమాణాలు కల్పించారు. ఆంగ్ల మాధ్యమాల్లో చదువులు ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ అవకాశాలను మన యువత అందుకుంటారని జగన్ భావించారు. వైద్యం పేదలకు అందుబాటులోకి రావాలంటే వైద్యశాలలను మెరుగు పరచడంతో పాటు, డాక్టర్ల నియామకం అత్యంత కీలకం అని గుర్తించారు. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కళాశాల, దానికి అనుబంధంగా హాస్పిటల్ ఏర్పాటు జరిగితే డాక్టర్ల కొరత తీరి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించవచ్చని భావించారు. ఆ దిశగానే నాడు వైఎస్సార్, నేడు జగన్ అడుగులు వేశారు. ప్రజలకు ఎనలేని సేవ చేశారు.మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరంసమన్వయ కర్త -
రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్సీపీ రెడీ
తాడేపల్లి: ఏపీ రాష్ట్ర రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. యూరియా కొరతపై ఈనెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారి సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు అన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితులు ఉంటే, ఇప్పుడు యూరియా కొరతతో పాటు పలు సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా విత్తనాలు, ఎరువులతో సహా అన్నీ సమస్యల మాదిరిగానే ఉన్నాయి. యూరియాను రైతులకు అందించకుండా టీడీపీ నేతలు పక్కదారి పట్టిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఈనెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో పాటు వినతి పత్రాలు స్వీకరించి ఆర్డీవోలకు అందజేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ప్రధానంగా యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేయనుంది వైఎస్సార్సీపీ. -
మంత్రి టీజీ భరత్కు నిరసన సెగ
సాక్షి,కర్నూలు: వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు నిరసన సెగ తగిలింది. ఉల్లికి గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు నిలదీశారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఖర్చులకు కూడా రావడం లేదని రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉల్లికి కనీసం రూ.2వేలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం ఖర్చులకు కూడా గిట్టుబాటు కాదని వాపోయారు. అంతా అయిపోయిన తరువాత ధర పెంచితే ప్రయోజనం ఏముంటుందని రైతులు ప్రశ్నించారు. అయితే, టీజీ భరత్ మాత్రం రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా తిరిగి వెళ్లిపోయారు. -
కొందరికే యూరియా
చిన్నశంకరంపేట/మిరుదొడ్డి/దోమకొండ/కేసముద్రం: యూరియా కష్టాలు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సహకార సంఘం వద్ద యూరియా కోసం ఆదివారం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలైన్లో చెప్పులు పెట్టి పడిగాపులు కాశారు. యూరియా పంపిణీ సందర్భంగా ఒక బస్తా నాదంటే నాదని ఇద్దరు రైతులు కొట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరికొందరు రైతులు వారిని సముదాయించారు. చివరకు కొట్టుకున్న ఇద్దరు రైతులకు యూరియా దొరకలేదు. ⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతువేదిక వద్దకు చుట్టు పక్క గ్రామాలకు చెందిన రైతులు శనివారం అర్ధరాత్రి నుంచే క్యూ కట్టి ఆదివారం తెల్లవారుజాము వరకు జాగారం చేశారు. అయితే యూరియా లారీ రాలేదని అధికారులు చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. ⇒ కామారెడ్డి జిల్లా దోమకొండలోని సింగిల్విండో కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం ఆందోళన చేశారు. కొందరికి యూరియా దొరకపోవడంతోవ్యవసాయాధికారులు, సింగిల్విండో కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ⇒ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైతు వేదిక వద్ద ఆదివారం అర్ధరాత్రి యూరియా టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. సోమవారం యూరియా బస్తాలు పంపిణీ చేయనుండగా, అధికారులు ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనితో మాకు ప్రాణ హాని
సాక్షి, టాస్క్ఫోర్స్: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఏలూరు జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామ సర్పంచ్ సునీత భర్త పలగాని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాము కాలువ పోరంబోకు ఐదెకరాలను ఐదేళ్లుగా సాగు చేసుకుంటున్నామని, తహసీల్దార్ పొజిషన్ సర్టీఫికెట్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే చింతమనేని, ఆయన గన్మేన్, మరో వ్యక్తి.. పొలంలోకి వచ్చి బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టినట్టు చెప్పారు.ఈ దాడిలో తన భార్య, సర్పంచ్ సునీత స్పృహ కోల్పోయిందన్నారు. తాను సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకునే కుట్ర పన్నుతున్నారని చెప్పారు. సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్ఐ, వీఆర్వోలను తనపై కేసు పెట్టాలంటూ ఒత్తిడి చేస్తూ వారినీ బూతులు తిట్టినట్టు తెలిపారు. తమ పొలంలోకి వచ్చి తమను కొట్టి తమపైనే కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రాణహాని ఉందని, తమకు ఏం జరిగినా ఎమ్మెల్యే చింతమనేనిదే బాధ్యతని స్పష్టం చేశారు. -
ఏపీలో అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు
-
రైతులతో నేరుగా మాట్లాడిన గణపయ్య..!
(వరంగల్ డెస్క్): చవితి రోజు ఘనంగా పూజలందుకున్నాడు వినాయకుడు. రైతులు ప్రేమగా తెచ్చిన పత్రి, పూలు ఒంటినిండా ధరించాడు. పండ్లు, ఉండ్రాళ్లు బొజ్జ నిండా తిన్నాడు. కుటుంబ సమేతంగా వచ్చిన రైతు దంపతులను చూసి మురిసిపోయాడు. తెల్లవారి సైతం అదే రీతిన ప్రసాదాలు, పండ్లు అందాయి. కానీ.. మనసులో ఏదో వెలితి. అప్పుడు వినాయకుడు మూషిక రాజు చెవిని మెలిపెడుతూ..‘మూషికా.. నిన్న భక్తజన సందోహంతో నిండిన మండపాల్ని చూసి మురిసిపోయా.. ఇలా తెల్లారిందో లేదో పల్లెల్లోని మండపాలన్నీ వెలవెలబోతున్నాయి. రైతులు, అమ్మలు, అక్కలంతా ఎటుపోయారు? ఒక్కరూ కనిపించరేం..? రైతన్నలెందుకు పూజకు రాలేదో చూసి రాపో’ అన్నాడు. (గంట తరువాత) ‘స్వామీ.. రైతులు కుటుంబంతో సహా యూరియా కోసం సొసైటీ కార్యాలయాల వద్ద ఉంటున్నారు.. అయినా దొరకట్లేదట.. ఆందోళనలు చేస్తున్నారు.. అని బాధపడుతూ సమాధానమిచ్చాడు. ‘నా రైతులు ఇంతగనం కష్టాలు పడుతున్నారా.. వారి కష్టాలు తెలుసుకుందాం పద’ అన్నాడు. ‘నా భుజంపై ఎక్కండి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల దగ్గరికి తీసుకెళ్తా’ అంటూ సమాధానమిచ్చాడు మూషిక రాజు. సరే పదా.. అంటూ జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నుంచి వారి ప్రయాణం మొదలైంది.రైతుల పంటలను చూసుకుంటూ వెళ్తున్నారు. జిట్టెగూడెం గ్రామంలో ఓ రైతు కనిపించాడు. అక్కడే ఆగిన వినాయకుడు.. ఆ రైతును పలకరించాడు. ఏమయ్యా.. నీ పేరేమిటీ?స్వామి.. నాపేరు లకావత్ సురేందర్వినాయకుడు: పొలం ఎట్లుంది? యూరియా దొరకట్లే..సురేందర్: స్వామి నాకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఐదెకరాలు వరి, ఒక ఎకరం పత్తి సాగు చేస్తున్నా. యూరియా బస్తాల కోసం పదిరోజుల నుంచి పనులు వదులుకుని రోజూ ఘన్పూర్కు వస్తున్నా. ఘన్పూర్ ఆగ్రోస్ సెంటర్లో శుక్రవారం స్టాక్ వచ్చిందని తెలుసుకుని ఉదయం వెళ్లా. మధ్యాహ్నం వరకు ఎండలో లైన్లో ఉన్నా యూరియా దొరకలేదు. లాభం లేదని ఇంటికి వచ్చా. ‘అయ్యో.. సురేందర్.. ఇన్ని కష్టాలా’.. అని అనుకుంటూ వినాయకుడు తన మూషికాన్ని కదిలిస్తూ మరో ఊరికి బయల్దేరాడు.చల్వాయినుంచి పోదాం అంటూ బయలుదేరిన వినాయకుడికి మార్గమధ్యలో హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లిలో ఓ రైతును పలకరించాడు. వినాయక : రైతన్నా నీపేరేంది?..రైతు : ఓదెల కొమురయ్య స్వామి..వినాయక : దిగులుగా ఉన్నావు ఏమైంది.. పొలానికి వెళ్లలే..కొమురయ్య : యూరియా దొరకడం లేదయ్యా.. వారం రోజుల క్రితం పరకాల పీఎసీఎస్లో ఇచ్చారు. ఇప్పుడు అడిగితే మాదారం సొసైటీ వారు సంబంధిత గ్రామాల రైతులకు ఇస్తున్నారు. పరకాల సొసైటీకి ఎప్పుడు వస్తదని అడిగితే ఆర్డర్ పెట్టినం అంటున్నారే తప్ప రావడం లేదు. బజార్లో వ్యాపారస్తులు అమ్ముకోవడానికి యూరియా ఉంటుంది కానీ వారు లింక్లు పెట్టి అమ్ముతున్నారు. వినాయక :అవునా.. ఏమిటీ మూషికా.. ఏ రైతన్నను పలకరించినా ఒకటే సమస్య.. వీరి కష్టాలు త్వరగా తీరాలి.. ముఖంలో నవ్వు రావాలి అంటూ తన మండపానికి వెళ్లారు.మహబూబాద్ జిల్లా కురవి మండలం ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం వద్ద చేతిలో చిట్టీ పట్టుకుని తిరుగుతున్న మోద్గులగూడేనికి చెందిన రైతు కొత్త వెంకన్నగౌడ్ను ఆపి ‘ఎందుకలా తిరుగుతున్నావ్. ఏంటి సమస్య’ అని ప్రశ్నించాడు వినాయకుడువెంకన్నగౌడ్: స్వామీ.. నేను మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. పంట కోసం ఆరు బస్తాల యూరియా కావాలి. ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా దొరకలేదు. వారం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా. కష్టపడి కూపన్ సంపాదించా. కూపన్ చేతికొచ్చినా యూరియా అందలేదు. మరో రెండు రోజుల్లో లారీ వస్తుందని చెబుతున్నారు. అప్పుడైనా దొరుకుతుందో లేదో’ అని నిట్టూరుస్తూ సమాధానమిచ్చాడు. ‘దేశానికి అన్నంపెట్టే రైతుకే ఇన్ని కష్టాలా?’ అనుకుంటూ ముందుకు సాగారు మూషికరాజు, వినాయకుడు. నేరుగా.. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామానికి చేరుకున్నారు.అరుగుపై దిగాలుగా కూర్చున్న కృష్ణారెడ్డిని పలకరిస్తూ..వినాయకుడు : ఎందుకిలా దిగాలుగా కూర్చున్నావు? కృష్ణారెడ్డి: 16 ఎకరాల్లో వరి సాగు చేశా. 20 రోజుల క్రితమే పంటకు యూరియా వేయాలి. కొరత కారణంగా ఇప్పటి వరకు వేయలేదు. అదిగో, ఇదిగో బస్తాలు వస్తున్నాయంటూ అధికారులు రైతులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికీ నాలుగు సార్లు క్యూలైన్లో నిల్చుంటే ప్రతీసారి ఒకటి లేదా రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పంటలకు సరిపడా యూరియా ఇవ్వట్లేదు. అధికారులు సరిపడా యూరియా పంపిణీ చేస్తారనే ఆశ కూడా రైతుల్లో లేదు. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. అని చెప్పగానే. ఇంతదారుణమా అంటూ అక్కడినుంచి వినాయక స్వామి పరకాల మీదుగా వెళ్దామని బయలుదేరారు.భళా.. ఏమిటీ ఇక్కడి రైతులంతా ఆనందంగా ఉన్నట్టున్నారే.. అన్ని చోట్లా కనిపించినట్లు. ఇక్కడ క్యూలైన్ లేదు. తోపులాట లేదు. పోలీసుల హడావిడి లేదు అంటూ.. నల్లబెల్లి మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట నుంచి వెళ్లిపోబోయాడు వినాయకుడు. అప్పుడే ఒక రైతు కాళ్లీడుస్తూ.. పీఏసీఎస్ వైపు రావడం గమనించారు.‘ఏంటయ్యా.. ఇక్కడ యూరియా కొరత లేనట్టుంది. నువ్వెటు వెళ్తున్నావ్’ అని నల్లబెల్లి మండలం గోవిందాపూర్ శివారు ఎర్రచెరువు తండాకు చెందిన పాడ్యా బాలును అడిగాడు వినాయకుడు.బాలు: ఈ సీజన్లో మూడెకరాల్లో వరి, మరో మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. యూరియా కోసం 12 రోజులుగా తిరుగుతున్నా. మండలంలో ఏషాపునకు వెళ్లినా యూరియా లేదు. అయిపోయిందని చెబుతున్నారు. స్టాక్ లేదని చెబుతున్నా.. ఒక్క బస్తా అయినా దొరుకుతుందేమోనని రోజూ పీఏసీఎస్కు వచ్చి పోతున్నా.’ అని సమాధానమిచ్చాడు. .. రైతులకు యూరియా కష్టాలు తీరేదెన్నడో అంటూ ముందుకు కదిలాడు వినాయకుడు.సూర్యుడు నడినెత్తిమీదికొచ్చేసరికి వినాయకుడు గూడూరు మండల కేంద్రానికి చేరుకున్నాడు. పీఏసీఎస్ గోదాం వద్ద లైన్లో నిల్చున్న మర్రిమిట్టలోని బందాలగడ్డ తండాకు చెందిన భూక్య హేమ్లానాయక్ను పలకరించాడు.వినాయకుడు: ఏమిటీ హుషారుగా ఉండేవాడివి.. నిస్సత్తువగా కనిపిస్తున్నావ్. హేమ్లానాయక్: ఏం చెప్పాలి స్వామి. ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 20 రోజులవుతోంది. ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా యూరియా దొరకలేదు. 10 రోజులుగా నిత్యం నా భార్య, నేనూ యూరియా కోసం వస్తున్నాం. తీసుకున్న వాళ్లే మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారు. మా లాంటి వాళ్లను పట్టించుకునేటోళ్లు లేరు. కనీసం ఎకరానికి ఒక బస్తా చొప్పున 6 బస్తాలు కావాలి. ఏం చేయాలో తోచట్లేదు. లైన్లో నిలబడి, రాత్రి, పగలు తిరుగుతూ ఉంటే జ్వరం వచ్చింది. ‘అయ్యో.. హేమ్లా. ఒంట్లో జ్వరమున్నా.. పంటను కాపాడుకోవాలన్న నీ తాపత్రయం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. అంటూ వినాయకుడు అక్కడి నుంచి బయల్దేరాడు.అయ్యో.. ఇన్ని కష్టాలా.. మానుకోట,వరంగల్ జిల్లాల్లో రైతుల బారులు, ఆందోళనలు చూసి చలించిపోయాడు వినాయకుడు. నర్సంపేట, చెన్నారావుపేట, కేసముద్రం మండలం కల్వల రైతు వేదిక వద్ద రైతుల తోపులాట, నర్సింహులపేట పీఏసీఎస్ వద్ద రైతులు చేస్తున్న రాస్తారోకో, గూడూరు మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ సెంటర్ జాతీయ రహదారి 365పై ఆందోళన, కురవి, కొత్తగూడలో యూరియా కోసం వచ్చిన మహిళలు çస్పృహతప్పి కిందపడిపోవడం చూసి నా రైతన్నలకు ఇన్ని కష్టాలా.. పాలకులేమి చేస్తున్నరు అంటూ లోలోన మదన పడుతూ ముందుకు సాగాడు. -
మితిమీరిన చింతమనేని అరాచకాలు.. తన పక్క పొలం రైతుపై బూతు పురాణం..
-
యూరియా కావాలంటే పురుగుమందు కొనాల్సిందే.!
నిమ్మనపల్లె: యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్జనకు తెరలేపాడో ఎరువుల దుకాణ యజమాని. యూరియా కావాలంటే ఎరువులు, లేదా పురుగుమందు కొనుగోలు చేయాలని కండిషన్ పెట్టాడు. పైపెచ్చు ఒక్కో యూరియా కట్టకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అదనంగా రూ.80 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తూ రైతులను మోసగించిన ఘటన శనివారం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లెలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న బాలాజీ ఫెర్టిలైజర్స్ దుకాణంలో యూరియా కొనుగోలుకు పెద్దసంఖ్యలో రైతులు బారులు దీరారు.ఇతర దుకాణాల్లో యూరియా లేకపోవడం, డిమాండ్ అధికంగా ఉండటంతో దుకాణ యజమాని అధిక ధరలకు విక్రయించసాగాడు. దీంతో ఆగ్రహించిన రైతులు సమస్యను స్థానిక మీడియా దృష్టికి తీసుకురాగా, దుకాణ యజమానిని ప్రశ్నిస్తే...నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో వారు మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏవో మంజుల, బాలాజీ ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని తనిఖీ చేశారు. చల్లావారిపల్లెకు చెందిన రైతు ఆదినారాయణ యూరియా కోసం రూ.850 విలువైన గడ్డిమందును అవసరం లేకున్నా కొనుగోలు చేయాల్సి వచ్చిందని చెప్పారు.మరో రైతు ఈశ్వరయ్య రెండు బస్తాల యూరియా కోసం రూ.1,600 విలువచేసే సీఎన్ఎస్ కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేశానన్నారు. ఏవో తనిఖీల్లో యూరియా అధిక ధరలకు విక్రయించడం, పురుగుమందు కొంటేనే ఇస్తానని చెప్పడం రైతుల విచారణలో నిర్ధారణ అయ్యింది. అలాగే అమ్మిన యూరియాకు సంబంధించి బిల్లు ఇవ్వలేదని రైతులు ఫిర్యాదుచేశారు.దీంతో ఏవో మంజుల బాలాజీ ఫెర్టిలైజర్స్ దుకాణంలో ఉన్న 250 బస్తాల యూరియాను దగ్గరుండి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పంపిణీ చేయించారు. దుకాణంలో నిల్వ ఉన్న 8.4 మెట్రిక్ టన్నుల ఐదురకాల ఎరువులను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడిన దుకాణ యజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
యూరియా ‘బస్తా’మే సవాల్!
ఆళ్లగడ్డ/కోరుకొండ: రాష్ట్రంలో యూరియా అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా పంపిణీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడి (వీఏఏ)పై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన శనివారం నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురంలో చోటు చేసుకుంది. గ్రామ సచివాలయం వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరికి (ఒక్కో పాసు పుస్తకానికి) రెండు బస్తాల చొప్పున వీఏఏ ప్రవీణ్కుమార్రెడ్డి రసీదు రాసిస్తున్నారు.ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ వారు సచివాలయం వద్దకు చేరుకుని ‘ఒక్కో రైతుకు రెండు బస్తాల ఇస్తున్నామన్నారు కదా. ఇందులో ఓ రైతుకు 10 బస్తాలు ఎలా రాసిచ్చావ్’ అంటూ వాగ్వాదానికి దిగారు. అతను ఐదు పాసు పుస్తకాలు తెచ్చుకుని ఒకే రసీదు రాయించుకున్నారని, పైగా అతను కూడా టీడీపీకి చెందిన వారేనని వీఏఏ తెలిపారు. దీంతో వారు గట్టిగా కేకలు వేస్తూ వీఏఏపై దాడి చేసి బయటకు ఈడ్చుకొచ్చి పిడిగుద్దులు కురిపించారు. విషయం తెలుసుకున్న మండల వీఏఏలు అక్కడకు చేరుకుని ఇలా అయితే యూరియా పంపిణీ చేసేది లేదని నిరసన వ్యక్తం చేశారు.అంతలో వీఏఏ బంధువులు కూడా అక్కడకు చేరుకోవడంతో సమస్య మరింత జటిలమైంది. ఎస్ఐ రామిరెడ్డి, తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీవో సావిత్రి, ఏవో ప్రమీల అక్కడకు చేరుకుని రెండు వర్గాలకు సర్దిచెప్పడంతో సమస్య సర్దుమణిగింది. కాగా దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని వీఏఏల సంఘం డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. కోరుకొండలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద శనివారం జరిగిన యూరియా బస్తాల పంపిణీ రైతుల మధ్య ఘర్షణకు దారితీసింది. కోరుకొండ సొసైటీకి యూరియా ఎరువులు వచ్చాయని తెలుసుకున్న ఆ సొసైటీ పరిధిలోని 10 గ్రామాల రైతులు భారీ సంఖ్యలో తరలి రావడంతో తోపులాట జరిగింది. రైతులు ఘర్షణ పడ్డారు. నలుగురు రైతులకు స్వల్పంగా గాయాలవగా, సొసైటీ తలుపులు, కిటికీలు, అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ విషయమై సీఈఓ వర్మను వివరణ కోరగా.. వాస్తవానికి 180 టన్నుల యూరియా అవసరం కాగా, 80 టన్నులే వచి్చందని పేర్కొన్నారు. -
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతు కష్టాలు
-
వానలోనూ క్యూ కట్టిన రైతులు
మిరుదొడ్డి/నంగునూరు/చెన్నూర్రూరల్, మహబూబ్నగర్నెట్వర్క్: జోరువానలోనూ యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి యూరియా లారీ వస్తుందని తెలియడంతో వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడిసి ముద్దవుతూనే గొడుగులు పట్టుకొని టోకెన్ల కోసం క్యూ కట్టారు. » నంగునూరు ఆగ్రోసేవా కేంద్రానికి యూరియా వస్తుందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు తెల్లవారు జామునే వచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రాత్రి వరకు నిరీక్షించారు. » మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నేపల్లి గ్రామంలో రైతు బొంబురపు రాజిరెడ్డి యూరియా కోసం వరుసలో నిలబడి ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి రైతులు 108లో చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. » ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా యూరియా కష్టాలు తీరడం లేదు. జడ్చర్లలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. దేవరకద్ర, మూసాపేట, చిన్నచింతకుంట మండలాల్లోనూ ఇదే పరిస్థితి. నారాయణపేట జిల్లా మద్దూరు పీఏసీఎస్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేపట్టారు. » నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ, కల్వకుర్తిలో పీఏసీఎస్, తిమ్మాజిపేటలోని ఆగ్రో కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి ఎదురుచూశారు. లింగాల మండల కేంద్రంలోని పీఏసీఎస్కు రెండు లారీల యూరియా రావడంతో రైతుల సంఖ్య పెరిగి తోపులాటకు దారి తీసింది. » జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో తోపులాట, ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గట్టులోనూ రైతులు భారీగా తరలిరావడంతో పోలీసుల సమ క్షంలో యూరియా పంపిణీ చేశారు. వడ్డేపల్లిలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు కడుపు మాడ్చుకొని క్యూలైన్లలో నిల్చున్నారు. -
దేశంలో ‘పెరుగుతున్న ఇథనాల్ బ్లెండింగ్’
సాక్షి, న్యూఢిల్లీ: ఇథనాల్తో కలిసిన పెట్రోల్ను ఇంధనంగా వాడటం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. 2014–15 నుంచి 2025 జూలై వరకు రైతులకు రూ.1.25 లక్షల కోట్లు నేరుగా చెల్లించగా, దేశానికి రూ.1.44 లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేసినట్లు ఆయన వివరించారు. అలాగే 736 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గి, 244 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు అవసరం తక్కువైందని ఇటీవల పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. ఇథనాల్ మిశ్రమం పెరుగుదల పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 2022 జూన్లోనే 10% లక్ష్యాన్ని చేరింది. తర్వాత ఇది 2022–23లో 12.06%, 2023–24లో 14.60%, 2024–25లో జూలై 31 నాటికి 19.05%గా నమోదైంది. కేవలం జూలై నెలలోనే 19.93% సాధించడం విశేషమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం ముడి సరుకుల విస్తరణ, పన్ను రాయితీలు, వడ్డీ సబ్సిడీ పథకాలు, సహకార చక్కెర కర్మాగారాలకు మల్టిఫీడ్ స్టాక్ ప్లాంట్లకు ఆర్థిక సాయం వంటి చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరించారు. -
ఉల్లి పంట చిది‘మేత’
ఈయన పేరు హకీన్ బాషా. ఉల్లి రైతు. ఊరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి. ఉన్న రెండున్నర ఎకరాల్లో ఆరుగాలం అష్టకష్టాలు పడి అప్పులు చేసి ఉల్లి సాగు చేశాడు. నూటికి రూ.2, 3 వడ్డీకి రూ.2.50లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. సీజన్ ప్రారంభంలో వర్షాభావానికి ఎదరొడ్డాడు. తీరా పంట చేతికొచ్చే సమయానికి అధిక వర్షాలు దిగుబడిని తీవ్రంగా దెబ్బతీశాయి. గడ్డకుళ్లు తెగులు ప్రభావంతో 60 నుంచి 70 క్వింటాళ్లకు మించి దిగుబడి రాని దుస్థితి. వచ్చిన పంటనైనా అమ్ముదామనుకుంటే కొనే నాథుడు కనిపించడం లేదు. నాణ్యమైన ఉల్లినే క్వింటా రూ.400 నుంచి 500కు మించి వ్యాపారులు కొనడం లేదు. దీంతో గత్యంతరం లేని స్థితిలో ఉల్లి పంటను కోయకుండానే ఇలా గొర్రెలకు మేతగా పెట్టి కన్నీటిపర్యంతమయ్యాడు. సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం/ఎమ్మిగనూరు టౌన్/కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వ పాలనలో ఉల్లి రైతులకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక వర్షాలు తీవ్రంగా దెబ్బతీయడంతోపాటు ధర లేక కర్షకులు విలవిల్లాడుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. క్వింటా కనీసం రూ.400–500కు మించి పలకకపోవడంతో ఏం చేయాలో పాలుపోక పంటను కోయకుండానే గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. ఉల్లి విస్తీర్ణం లక్ష ఎకరాలు రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు. అత్యధికంగా కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, విజయ నగరం జిల్లాల్లో సాగవుతుండగా, కర్నూలు జిల్లా ఉల్లికి జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు తర్వాత మైదుకూరులో సాగయ్యే కేపీ ఉల్లికి గిరాకీ ఎక్కువ. మూడు నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. ఖరీఫ్లో 8 నుంచి 10 టన్నులు, రబీలో 10 నుంచి 20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి.కనీసం 3 నుంచి 6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ నిల్వ చేసుకునే సదుపాయాల్లేక పంట చేతికిరాగానే రైతులు అయినకాడకి అమ్ముకోవల్సి వస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మే నెలలో వేసిన పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. గడ్డకుళ్లు తెగులు సోకడంతో దిగుబడులు పడిపోయాయి. దీంతో ఎకరాకు 50 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి రావడం గగనంగా మారింది. దీనికితోడు పంట నాణ్యత కూడా దెబ్బతింది. తేమ సాకుతో కొనని వ్యాపారులు కోతకొచి్చన పంట కర్నూలులోని ప్రధాన ఉల్లి మార్కెట్కు రావడం మొదలైంది. మార్కెట్కు వస్తున్న ఉల్లిని తేమ ఎక్కువగా ఉందని, నాణ్యత లేదనే సాకులతో కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కర్నూలు మార్కెట్కు సోమవారం 12,,903 క్వింటాళ్ల పంట రాగా, మంగళవారం 8,391 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. సోమవారం 5 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా, మంగళవారం కేవలం 1,500 క్వింటాళ్లు మాత్రమే వ్యాపారులు కొన్నారు. కొనుగోలు చేసిన ఉల్లిలో సైతం 90 శాతానికిపైగా క్వింటా రూ.400–500కు మించి ధర లభించలేదు.సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే పంట పూర్తిగా మార్కెట్కు వచ్చే సెపె్టంబర్లో పరిస్థితి మరింత దిగజారిపోతుందేమోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అధిక వర్షాలతో నాణ్యత దెబ్బతినడంతో పాటు మహారాష్ట్రలో పండిన పంట పెద్దఎత్తున ఉల్లి మార్కెట్కు రావడంతోపాటు కోల్కతాతో పాటు బంగ్లాదేశ్కు ఎగుమతులు లేక పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్థానికంగా పండిన పంట దండిగా ఉండగా మహారాష్ట్ర ఉల్లి దిగుమతికి అధికారులు అనుమతివ్వడం వల్ల ఇక్కడి రైతులు దెబ్బతింటున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రతికూల పరిస్థితులను చక్కదిద్ది ఉల్లికి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అసలే పట్టించుకోవడం లేదు. తాడేపల్లిగూడెం మార్కెట్లోనూ అదే దుస్థితి తాడేపల్లి గూడెం మార్కెట్లోనూ కర్నూలు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. మంగళవారం కర్నూలు నుంచి కేవలం 15 లారీల సరుకు మాత్రమే మార్కెట్కు వచ్చింది. మహారాష్ట్ర నుంచి దిగుమతైన ఉల్లి ముందు కర్నూలులో పండించిన పంట నిలబడలేకపోతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ అధిక వర్షాలకు గడ్డ కుళ్లు తెగులు వల్ల పంట నాణ్యత లేదని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఉల్లి రైతుకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వంవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉల్లి రైతులకు ఐదేళ్లూ అండగా నిలిచారు. 2019–24 మధ్య గరిష్టంగా క్వింటా రూ.3500 నుంచి రూ.4వేల మధ్య ధర లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా క్వింటాకు రూ.770 కనీస మద్దతు ధరను గత ప్రభుత్వం ప్రకటించింది. ధర తగ్గిన సందర్భాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేసింది.ఈ విధంగా ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు విక్రయించింది. మరొక వైపు ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లి కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50లకే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా చూసింది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలిఖరీఫ్లో మార్కెట్కు వచ్చే తొలి పంట ఉల్లి. అత్యధికంగా సాగయ్యే కర్నూలు జిల్లాలో ఉల్లికి ధర లేకపోవడం ఆందోళనకరం. ఉల్లిసాగు చేసేది చిన్న, సన్నకారు రైతులే. సాధారణంగా ఉల్లి మార్కెట్కు వచ్చే తొలినాళ్లలో మంచి ధర లభిస్తుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి కని్పంచడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎక్కువగా ఉల్లి మార్కెట్కు వచ్చేసెపె్టంబర్లో పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుంది. మార్కెటింగ్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలి – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ రూ.3.60 లక్షల నష్టం నేను 6 ఎకరాల్లో ఎకరాకు రూ.90వేల పెట్టుబడితో ఉల్లి సాగు చేశాను. కోతకొచ్చే సమయంలో కురిసిన అధిక వర్షాలతో పంట భారీగా దెబ్బతింది. ఎకరాకు 50 క్వింటాళ్లకు మించి రాలేదు. నాణ్యత లేదనే సాకుతో ట్రేడర్స్ కొనేందుకు ముందుకు రావడం లేదు. కొద్దిగా నాణ్యత బాగున్న ఉల్లిగడ్డలను క్వింటా రూ.600కు అమ్ముకున్న. ఎకరాకు రూ.30వేల చొప్పున 6 ఎకరాలకు రూ.1.80 లక్షలు ఆదాయం వచ్చింది. కనీసం పెట్టుబడి కూడా దక్కకపోగా, రూ.3.60 లక్షల వరకు నష్టం వచ్చింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – ముల్లా మొహిద్దీన్ , పేలకుర్తి, కర్నూలు జిల్లా కొనేవారు లేరు రెండున్నర ఎకరాలు.. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి అయ్యింది. ఎకరాకు 50 క్వింటాళ్ల అయ్యింది. క్వింటా రూ.500కు ఇద్దామన్నా ట్రేడర్స్ కొనేందుకు ముందుకు రావడం లేదు. 2023–24 సీజన్లో ఎకరాకు 70–100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా 3వేలకు పైగా ధర లభించింది. ఎకరాకు రూ.50వేలు మిగిలింది. కానీ ఈసారి 1.50 లక్షల వరకు నష్టపోతున్నాం. కోత కోసిన పంటను ఏం చేయాలో అర్ధం కావడం లేదు. మేకలు, గొర్రెలకు మేతకు వదిలేయడం తప్ప మరొక మార్గం కన్పించడం లేదు. – నారప్పగారి కృష్ణ, వల్లూకూరు, కర్నూలు జిల్లా -
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతులు ఆందోళన
కర్నూలు: కర్నూలు వ్యవసాయం మార్కెట్లో ఉల్లి రైతులు ఆందోళన చేపట్టారు. తమక కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఉల్లికి సరైన గిట్టుబాట ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు తెచ్చిన ఉల్లిని క్వింటాకు రూ. 200 నుండి రూ. 400 వరకూ మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆందోళనకు దిగారు. తమ ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి మద్దతు ధర లేక అప్పులు పాలు అవుతున్నామని రైతులు వాపోతున్నారు. కనీస మద్దతు ధర రూ. 2 వేలు కల్పించాలని అంటున్నారు. దాంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు ప్రారంభం కాలేదు. తక్షణమే ఉల్లి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లికి మద్దతు ధర లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. -
మట్టి చేతుల క్యూ!
అతను అదనపు భూమినోఅర్ధ సామ్రాజ్యాన్నో అడగడం లేదు పొలం తరఫున పంట కోసం ఎరువును అడుగుతున్నాడు అరువుకు కాదు ఖరీదుకే!ఇంట్లోనో పొలం దగ్గరో ఉండిఅతను హుకుం జారీ చేయడం లేదు క్యూలో నిల్చుని మట్టి చేతులు మోడ్చిమరీ అడుగుతున్నాడుపోలింగ్ బూత్ క్యూలనైతే మీరు ప్రేమతో పట్టించుకుంటారు కదా! పొలం వచ్చి క్యూలో నిల్చుంటే అసలు పట్టనట్లుంటే ఎట్లా? ఇది అన్న మూలమన్న సంగతి మరిస్తే ఎట్లా?తెలుసుకోండి: అతను ఎరువు కోసం క్యూలో నిల్చున్నాడంటేదేశం అన్నం కోసం క్యూలో నిల్చున్నట్లే!– దర్భశయనం శ్రీనివాసాచార్య94404 19039 -
యూరియా కోసం అన్నదాత అగచాట్లు
సాక్షి, నెట్వర్క్ : యూరియా కోసం అన్నదాతల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. సోమవారం పీఏసీఎస్లు, రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. అయినా అందరికీ అందని దుస్థితి. మరికొన్ని చోట్ల రైతులు ఆందోళనలు నిర్వహించారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గంలో రైతులు ఎండనక, వాననక వేచి చూస్తున్నా బస్తా యూరియా దొరకడం లేదు.టెక్కలిలో ఉదయం 7 గంటల నుంచి రైతులంతా ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద నిరీక్షిస్తూ కనిపించారు. వానలో తడుస్తూ, కాళ్లు నొప్పులు పుట్టేలా నిలబడాల్సి వచ్చింది. నరసన్నపేటలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. బూర్జ మండలంలో రైతులకు టోకెన్లు పంపిణీ చేయడంతో రైతు సేవా కేంద్రాల వద్ద చాంతాడంత క్యూ కనిపించింది.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న గొల్లప్రోలు మండల రైతులు సోమవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత తమను వేధిస్తోందని అయినప్పటికీ ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మెయిన్ రోడ్డుపై రైతులు రకేంద్రం అదనపు యూరియా కేటాయించాలి: ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్సాక్షి,అమరావతి: రాష్ట్రంలో తీవ్ర యూరియా కొరతను పరిష్కరించేందుకు తక్షణం కేంద్ర ప్రభుత్వం అదనపు కేటాయింపులు జరపాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ స్టేట్ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు.ఈ వీడియోలో ఆయన ఏమన్నారంటే.. ‘‘యూరియా కొరత అవాస్తవమనీ, ఎవరైనా ఇలాంటి ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రంలో ఏ పీఏసీఎస్, ఆర్బీకేల వద్దకు వెళ్ళి చూసినా, యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో వేచి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.ప్రైవేటు వ్యాపారులు తమ వద్ద ఉన్న నానో యూరియా, పురుగుమందులు కొంటేనే యూరియా అమ్ముతామంటూ రైతులను వేధిస్తున్నారు. కొరతను ముందుగానే గమనించి కేంద్రం నుంచి అదనపు కేటాయింపులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.’’ అని నాగిరెడ్డి విమర్శించారు. -
సర్కారు డ్రామా.. ఎరువులు భ్రమ
యూరియా విషయంలో ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే, గ్రామాల్లో కళ్లకు కనిపిస్తున్నది మరొకటి. మొన్నటి దాకా తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రైతుల ఆందోళనలు చూసి మాట మార్చారు. అక్రమంగా ఎలా తరలి వెళుతోందని.. అలా తరలి పోయిన యూరియా నిల్వలను తిరిగి స్వాధీనం చేసుకోండంటూ హూంకరిస్తున్నారు. దౌర్జన్యంగా, లోపాయికారిగా, అక్రమంగా యూరియా నిల్వలను తమ గోదాములకు తరలించుకు పోయింది కూటమి పార్టీల నేతలే. మరి వారి వద్ద నుంచి నిజంగా ఒక్కటంటే ఒక్క బస్తా అయినా అధికారులు స్వా«దీనం చేసుకోగలిగారా? ‘ముఖ్యమంత్రి సీరియస్..’ అని ఎల్లో మీడియాలో డ్రామా వార్తలు మినహా ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు. సర్కారు నిర్వాకంతో ఊరూరా చిన్న, సన్నకారు రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు సరిపడా నిల్వలున్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ చేస్తున్న ప్రకటనలకు.. వాస్తల పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఇప్పటికే ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వ.. ఇప్పుడు ఆర్బీకేలను ఇంకా పతనావస్థకు తీసుకెళ్తూ.. ఇక్కడికి రావాల్సిన యూరియా స్టాకును అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్కు మళ్లించేందుకు అధికార పార్టీల నేతలకు స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వారు వ్యాపారులతో కమీషన్లు తీసుకుని అధిక ధరలతో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందుకోసం మార్కెట్లో యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. యూరియా దొరకడం గగనంగా మారడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చిన స్టాక్ను వచ్చినట్లు టీడీపీ నేతలు దారి మళ్లించిన విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినా.. చర్యలు తప్పవంటూ ఎల్లో మీడియా వేదికగా సీరియస్ అయినట్లు డ్రామాలతో రైతులను మభ్యపెడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)తో పాటు రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా సరఫరాను పెంచాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోందని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు మార్క్ఫెడ్–ప్రైవేటు వ్యాపారులకు ఇప్పటివరకు ఉన్న 50ః50 నిష్పత్తిలో జరుపుతున్న ఎరువుల కేటాయింపులను ఇక నుంచి 70ః30 నిష్పత్తిలో కేటాయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా ఆచరణకు నోచుకోలేదు. స్టాకు లేక మూతపడిన సొసైటీలు అధిక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీరు దిగిన మెట్ట పంటలతో పాటు ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియా అత్యవసరం. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు అదును దాటకముందే యూరియా బూస్టర్ డోస్ వెయ్యాలి. కానీ.. ఒక్క బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మార్క్ఫెడ్ వద్ద చాలినంత స్థాయిలో యూరియా నిల్వల్లేని కారణంగా ఆర్ఎస్కేలతో పాటు మెజార్టీ సొసైటీలు శనివారం మూసివేశారు. నో స్టాక్ బోర్డులు పెట్టకపోయినప్పటికీ యూరియా నిల్వల్లేని కారణంగా రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సొసైటీలను మూయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కొద్దిపాటి నిల్వలున్న సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అన్ని జిల్లాల్లోనూ కన్పిస్తున్నాయి. 80 శాతం ప్రైవేట్ డీలర్ల వద్దే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 11.84 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా, దాంట్లో అత్యధికంగా యూరియా 4.89 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 4.08 లక్షల టన్నులు, డీఏపీ 1.53 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 76 వేల టన్నులు, ఎంవోపీ 57 వేల టన్నులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 6.23 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా కేవలం 1.50 లక్షల టన్నులు, డీఏపీ 84 వేల టన్నులు మాత్రమే ఉంది. 17 జిల్లాల్లో యూరియా, 11 జిల్లాల్లో డీఏపీ డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న నిల్వల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు డీలర్ల వద్దే ఉన్నాయి. సొసైటీలు, ఆర్ఎస్కేల్లో అరకొరగా ఉండడంతో పంపిణీలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.400 చొప్పున, డీఏపీ రూ.1,400 నుంచి రూ.1550 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఈ సీజన్లో యూరియాతో పాటు ఎరువులు అధికంగా వాడేస్తున్నారంటూ ప్రభుత్వం తమను తప్పుపడుతుండడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. బస్తా కూడా పట్టుకోలేని టాస్క్ఫోర్స్ బృందాలు రైతుల ముసుగులో సొసైటీలు, రైతుసేవా కేంద్రాలకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను టీడీపీ నేతలు పక్కదారి పట్టించి, బ్లాక్లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వ్యవసాయేతర అవసరాలతో పాటు సరిహద్దు జిల్లాలు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న యూరియాను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్్కఫోర్సు బృందాలు మొక్కుబడి తనిఖీలకే పరిమితమయ్యాయి. టీడీపీ నేతల గోదాముల జోలికి మాత్రం పోవడం లేదని స్పష్టమవుతోంది. అధికార టీడీపీ నేతల గోదాములను తనిఖీ చేసి, పెద్ద ఎత్తున నిల్వ చేసిన యూరియా నిల్వలను ఒక్క చోట అయినా వెలికి తీశారా అని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని ఊళ్లలో అదే దుస్థితి ⇒ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి వచ్చిన 266 బస్తాల యూరియాను గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలే పప్పుబెల్లాల్లా పంచుకున్నారు. మిగిలిన స్టాక్ను స్థానిక టీడీపీ నాయకుడు రూ.430 చొప్పున అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రస్తుతం ఒక్కో రైతుకు కేవలం ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీఏసీఎస్లు, ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ దుకాణాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. పెడన మండలం నందమూరు విశాల సహకార పరపతి సంఘం వద్దకు అన్నదాతలు భారీగా తరలి రావడంతో పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. గన్నవరంలో ఓ ఫెర్టిలైజర్ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. వ్యవసాయ శాఖ కొత్తగా పెట్టిన నిబంధనల మేరకు అన్నదాతలు ఆధార్కార్డు, పట్టాదారు పాస్బుక్, కౌలుకార్డు వెంట తీసుకుని వచ్చారు. ⇒ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ప్రైవేటు ఎరువుల దుకాణం వద్ద శనివారం రైతులు పడిగాపులు కాశారు. ఇక్కడ కేవలం 120 బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వైవీ పద్మావతి, వ్యవసాయ శాఖ ఏఓను నిలదీసి ఎరువుల షాప్ షట్టర్ దించేశారు. దీంతో పంపిణీ వాయిదా పడింది. ⇒ అనకాపల్లి జిల్లా మునగపాకలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో రైతులు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎరువుల నిల్వలు ఏమయ్యాయో చెప్పాలని రైతులు నిలదీశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు ఒడిశాకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు. స్థానికంగా యూరియా కొనాలంటే అదనంగా జింకు, ఇతర మందులు కొనుగోలు చేయాలంటూ డీలర్లు తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ రైతులు వాపోయారు. ⇒ కాకినాడ జిల్లా సామర్లకోటలోని నీలమ్మ చెరువు వద్ద ఉన్న ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా పంపిణీకి టోకెన్లు పంపిణీ చేస్తుండగా తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది టోకెన్లు పంపిణీ నిలిపి వేశారు. ⇒ ఏలూరు జిల్లాలో యూరియా కొరతే లేదని కలెక్టర్ ప్రకటించారు. అయితే కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న శనివారపుపేట కోఆపరేటివ్ సొసైటీకి శనివారం సిబ్బంది తాళాలు వేశారు. టీడీపీ అనుచరులకే యూరియా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలోని టీడీపీ నాయకులు వీఏఏ (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) లేకుండానే దౌర్జన్యంగా ఆర్ఎస్కే తలుపులు తీసి తమ అనుచర వర్గానికి యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఆర్ఎస్కేకు వచ్చిన 450 యూరియా బస్తాల పంపిణీని శనివారం చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ బత్తుల జ్యోతీశ్వరరావు ఆర్ఎస్కేకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. అప్పటికే 70 శాతం మేర యూరియా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేశారు. ఎరువుల అడ్డగోలు పంపిణీపై ఏం చర్యలు తీసుకుంటారని వీఏఏ ఎం.కుసుమను సర్పంచ్ ప్రశ్నించారు.గోదాం వద్దకు వెళ్తుంటే తమ్మినేని అరెస్ట్ శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస రైల్వే గూడ్స్ గోదాం వద్ద నుంచి ఎరువులు పక్కదారి పడుతున్నాయనే సమాచారంతో శనివారం కుమారుడు చిరంజీవి నాగ్తో కలిసి అక్కడికి బయలుదేరిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వాహనాన్ని అడ్డుకుని వెనుదిరగాలని కోరారు. తమ్మినేని వెనుదిరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు ముందుకు కదలనీయలేదు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ఆయన్ను బలవంతంగా జీపు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్ వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావుతో మాట్లాడుతూ జిల్లాకు ఎన్ని బస్తాల ఎరువులు వచ్చాయి, ఎన్ని ఇచ్చారని ప్రశ్నించగా ఆయన కాకి లెక్కలు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలైనా ఎరువులు ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. బహిరంగ మార్కెట్లోనూ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో ప్రజా పోరాటం చేస్తామని ప్రకటించారు.వ్యవసాయం చేయలేం ప్రస్తుతం వరి పంటకు పొటాష్, యూరియా చాలా అవసరం. పొటాష్ను పెద్దాపురంలో బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి కొనుగోలు చేశాను. కానీ యూరియా లభించడం లేదు. సొసైటీ వద్ద రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారు. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఇలాగైతే ఎలా? – గుణ్ణం వీర్రాజు, రైతు, సామర్లకోట -
తెల్లవారకముందే లైన్లోకి..
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో యూరియా కష్టాలు కొనసాగుతు న్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్కు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు శనివారం కార్యాలయం తీయకముందే ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి ఉన్నారు. డోర్నకల్ మండలం కస్నాతండా సమీపంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు క్యూ కట్టారు. రైతులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. గూ డూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం ఎదుట తెల్లవారు జామున 4 గంటలకే క్యూ లో నిలబడ్డారు. మహబూబాబాద్లో రైతులు మధ్యా హ్నం సమయంలో తమకు బస్తాలు వస్తాయో రావో అనే దిగులుతో ఏఓ తిరుపతి రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కరీంనగర్ జిల్లాలో...కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కెపల్లి సహకార సంఘం గోదాంకు శనివారం మధ్యాహ్నం లారీలో 230 బస్తాలు వచ్చాయి. 500 మందికి పైగా గోదాం వద్దకు చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు క్యూలో నీరసించారు. సహకార సిబ్బంది ఒక్కరికి ఒక బస్తా చొప్పున టోకెన్లు ఇచ్చారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గోదాంకు లారీ యూరియా వచ్చింది. 15 రోజుల క్రితం ఆధార్ కార్డు ఇచ్చిన వారికే టోకెన్లు ఇవ్వడంతో ఓ రైతు యూరియా ఇవ్వకుంటే షట్టర్ మూసివేస్తానని సిబ్బందితో వాదనకు దిగాడు.పోలీసు బందోబస్తుతో 450 బస్తాలను రైతులకు అందించారు. చిగురుమామిడి మండలం ఇందుర్తికి శనివారం యూరియా లోడ్ వచ్చింది. ఆదివారం పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో రైతులు తమ చెప్పులను క్యూలో విడిచి వెళ్లారు.300 బస్తాలు వచ్చాయి.. 102 మందికి పంపిణీశనివారం ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3:30 గంటలకు 300 బస్తాలతో లోడ్ కావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసుల భద్రత మధ్య సాయంత్రం వరకు 102 మందికి పంపిణీ చేశారు.యూరియా కోసం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద రైతులు శనివారం తెల్లవారుజాము నుంచే వరుసలో నిల్చున్నారు. శుక్రవారం రాత్రి యూరియా లారీ లోడ్ వచి్చందన్న సమాచారంతో భారీగా తరలివచ్చారు. గోదాము తెరవకముందే వచ్చి వరుసలో నిలబడి నిరీక్షించారు. పోలీసుల బందోబస్తు నడుమ ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియాను పంపిణీ చేశారు. -
ఇష్టానుసారం ఇచ్చేసి... ఇక్కట్ల పాల్జేసి..
సాక్షి, హైదరాబాద్: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథలు తప్పడం లేదు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కనిపించని దృశ్యాలు ఇప్పుడు పల్లెల్లో గోచరిస్తున్నాయి. యూరియా కోసం సూర్యోదయానికి ముందు నుంచే రైతులు వ్యవసాయ సహకార సొసైటీల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూలు కడుతున్నారు. నిలబడలేని రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు క్యూల్లో పెట్టి సొసైటీలు తెరిచి యూరియా ఇచ్చేంత వరకు ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తుంటే, కొన్ని జిల్లాల్లో ఎకరానికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు. రాష్ట్రంలో జూన్ నుంచే ఖరీఫ్ సాగు మొదలు కాగా, జూలై నెలాఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈనెలలో అవి తీవ్రమై, ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా మొదట్లో ఇష్టానుసారం విక్రయించినందునే ఇప్పుడు కొరత ఏర్పడిందని కేంద్రం కూడా భావిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి అధికంగానే విక్రయించినప్పటికీ, కొరత రావడానికి ప్రధాన కారణం అధికారులు యూరియా అమ్మకాలపై దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది. 7.28 ఎల్ఎంటీలు సరఫరా: కేంద్రం ఈ ఖరీఫ్ సీజన్లో కేంద్రం కేటాయించిన యూరియాలో ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 5.38 ఎల్ఎంటీ మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ శాఖ చెపుతోంది. అయితే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ మాత్రం గత రబీలో మిగిలిన 1.92 ఎల్ఎంటీని కూడా కలుపుకొని ఇప్పటివరకు 7.28 ఎల్ఎంటీ సరఫరా చేశామని చెబుతోంది. ఇందులో ప్రస్తుతం మార్క్ఫెడ్, సొసైటీలు, ప్రైవేటు డీలర్లు, గోదాములన్నింటా కలుపుకొని అందుబాటులో ఉన్న యూరియా కేవలం 41వేల మెట్రిక్ టన్నులు. అంటే ఈ సీజన్లో ఇప్పటివరకు 6.87 ఎల్ఎంటీల విక్రయాలు జరిగాయి. ఇదే గత ఏడాది ఇదే సమయంలో 6.10 ఎల్ఎంటీ అమ్మకాలే జరిగినట్లు కేంద్రం చెబుతోంది. దీన్ని బట్టి గత సంవత్సరం కన్నా 77వేల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా విక్రయించారు. అంటే గత సీజన్తో పోలిస్తే యూరియా విక్రయాలు ఎక్కువ జరిగినప్పటికీ, కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. గత సంవత్సరం ఖరీఫ్తో పోలి్చనా, ఈసారి యూరియా విక్రయాలు అధికంగానే జరిగినట్లు చెబుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, బ్లాక్ మార్కెటింగ్ వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు చెబుతోంది. పెద్ద రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం, వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్కు తరలించడం కూడా యూరియా రాద్ధాంతానికి కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరెవరికి ఎంత విక్రయించారు? రాష్ట్రంలో ఖరీఫ్ కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా కేంద్రం యూరియా కోటా పంపిస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా (50:50 ప్రాతిపదికన) జరిగే విక్రయాలను పర్యవేక్షించకుండా వ్యవసాయ శాఖ గాలికి వదిలేసింది. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను రాష్ట్రంలోని 14 వేల మంది డీలర్లు మే నెలాఖరు నుంచే విక్రయిస్తారు. ఇక సొసైటీలు, ఇతర వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా జూన్ నుంచి విక్రయిస్తారు. అయితే ఈ విక్రయాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఏ సొసైటీలో ఏ రైతుకు ఎంత యూరియా విక్రయించారనే లెక్కలు కేవలం 10 రోజుల వరకే ఉంటాయి. తరువాత మళ్లీ రైతులు వెళ్లి యూరియా తీసుకోవచ్చు. ఇక ప్రైవేటు డీలర్లు జరిపే యూరియా విక్రయాలపై ఎలాంటి నిఘా లేదు. లెక్కలూ లేవు. రూ. 270 చొప్పున విక్రయించాల్సిన యూరియాను రూ.400 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సమయంలో వ్యవసాయేతర అవసరాలకూ యూరియాను డీలర్లు పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రంగుల కంపెనీలు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమలతోపాటు గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల వారు కూడా రాష్ట్రంలోని ప్రైవేటు డీలర్ల నుంచి అధిక ధరలకు యూరియాను పెద్దఎత్తున కొనుగోలు చేసి తీసుకెళ్తారని మార్క్ఫెడ్కు చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఒక్కో రైతుకు రేషన్ విధానంలో ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇస్తున్నట్లుగా ఖరీఫ్ ఆరంభం నుంచే అమలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని నిపుణులు అంటున్నారు. సాగు విస్తీర్ణం పెరగడం కూడా... రాష్ట్రంలో యూరియా అధిక వినియోగానికి చెపుతున్న కారణాల్లో ఒకటి ఈసారి ఖరీఫ్ సీజన్ సాధారణం కన్నా ముందే రావడమైతే, రెండోది పంట సాగు విస్తీర్ణం గతం కన్నా గణనీయంగా పెరగడం. గత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు మూడో వారానికి 91.21 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 118 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో వరి విస్తీర్ణమే గత ఖరీఫ్ కన్నా 23 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి 31.60 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 54.79 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక పత్తి 42 లక్షల ఎకరాల నుంచి 45 లక్షలకు పెరిగింది. మొక్కజొన్న గత ఖరీఫ్లో 4.55 లక్షల ఎకరాలు సాగైతే ఈసారి 6.48 లక్షల ఎకరాలు సాగైంది. యూరియా అధికంగా వినియోగించే ఈ మూడు పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా కొరత ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలకు అనుగుణంగా సరఫరా... ఖరీఫ్, రబీ మొదలు కావడానికి ముందే... వ్యవసాయ శాఖ ఆయా సీజన్లకు అవసరమైన ఎరువుల ప్రణాళిక రూపొందిస్తుంది. ఆ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిస్తే, రాష్ట్రాల వారీగా కోటాను విడుదల చేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్కు 9.80 ఎల్ఎంటీల కోటాకు కేంద్రం ఆమోదం తెలిపింది. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తోంది. దాని ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా 1.60 ఎల్ఎంటీకి తగ్గకుండా పంపించాలి. ఈ మేరకు దేశంలోని ఎరువుల కంపెనీలకు కోటా విడుదల చేస్తే ఆయా కంపెనీల ద్వారా 50 శాతం కోటాను రైల్వే రేక్ పాయింట్ల ద్వారా మార్క్ఫెడ్కు, మరో 50 శాతం కోటా ప్రైవేటు డీలర్లకు పంపిస్తారు. ఈ లెక్కన ఇప్పటివరకు కేంద్రం పంపిన 5.18 ఎల్ఎంటీ యూరియాలో సగం అంటే 2.59 ఎల్ఎంటీ ప్రైవేటు డీలర్లకు వెళ్లింది. గత రబీకి సంబంధించిన ఓపెనింగ్ స్టాక్తో కలిపితే మొత్తం 3.61 ఎల్ఎంటీలు రాష్ట్రంలోని 14వేల ప్రైవేటు డీలర్లకు చేరింది. అయితే ప్రస్తుతం 18వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వారి వద్ద ఉంది. అంటే 3.43 ఎల్ఎంటీలు విక్రయించారు. కానీ ఎవరికి ఎంత మేర విక్రయించారనే లెక్కలు వ్యవసాయ శాఖ దగ్గర లేకపోవడం గమనార్హం. భారీగా పెరిగిన వాడకం రాష్ట్రంలో యూరియా వినియోగం శాస్త్రవేత్తలు సూచిస్తున్న మోతాదుకన్నా రెండింతలు అధికంగా వినియోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరికి ఎకరాకు పంట కాలంలో 120 కిలోలు వినియోగిస్తే సరిపోతుంది. కానీ ఎకరాకు ఒకటిన్నర బస్తాల చొప్పున (బస్తా 45 కిలోలు) మూడు సార్లు వినియోగిస్తున్నారు. అలాగే మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వరికోసం నాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకు బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను కాంప్లెక్స్ ఎరువుతో కలిపి వినియోగిస్తుంటారు. ఆ తరువాత పొట్ట దశలో 45 రోజులకు, మరోసారి రెండు బస్తాల చొప్పున, మూడోదఫా 90 రోజుల్లో మరోసారి బస్తా చొప్పున వినియోగిస్తున్నారు. మొక్కజొన్నకు పంట కాలంలో కొన్ని జిల్లాల్లో మూడుసార్లు యూరియాను వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు ఒక్కోసారి రెండు బస్తాల చొప్పున వినియోగిస్తారు. పత్తి పంట కోసం కూడా ఎకరాకు ఒకటిన్నర బస్తాలకు తగ్గకుండా వినియోగించడంతో ఖరీఫ్లో యూరియా డిమాండ్ పెరుగుతోంది. అదే యాసంగి (రబీ) సీజన్లో పత్తి లేకపోవడంతో డిమాండ్ అంతగా లేదని అధికారులు అంటున్నారు. -
టోకెన్ల వారీగా యూరియా
సాక్షి, హైదరాబాద్: రైతులకు టోకెన్లు జారీచేసి యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. యూరియా డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాలకు నిల్వలున్న జిల్లాల నుంచి తక్షణమే తరలించి రైతులకు అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు. జిల్లాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల కీలక సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ, రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.పట్టాదార్ పాస్ పుస్తకాలను అనుసంధానం చేసి యూరియాను పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేంద్రం 50 వేల మెట్రిక్ టన్నులు ఈ నెలలో సరఫరా చేస్తామని చెప్పినా, 28,600 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించి, అందులో 13,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందన్నారు. ఎర్ర సముద్రం నౌకాయానంలో ఇబ్బందులతో మన దేశానికి దిగుమతి కావాల్సిన యూరియా సకాలంలో అందుబాటులోకి రాకపోవడానికితోడు, రామగుండం ఎరువుల కార్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు.రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు, సరఫరా పూర్తిగా కేంద్రానిదని, కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రైతుల ప్రయోజనాలకంటే రాజకీయ స్వార్థంతో విమర్శలు చేయడం, క్యూలైన్లో చెప్పులు పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుండటంపై తుమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ లైన్లు లేకుండా చూడాలని, టోకెన్ పద్ధతిలో స్టాక్ను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని అధికారులకు సూచించారు.ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి ఆగిపోయి..రాష్ట్రానికి కేటాయించిన స్వదేశి యూరియాలో ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి ఆగిపోయి, దాదాపు 63 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయలేదని తుమ్మల చెప్పారు. ఈ 63 వేల మెట్రిక్ టన్నుల యూరి యా వెంటనే సరఫరా చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఫోన్లో తుమ్మల కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫ రాపై కేంద్రమంత్రి కిషన్రెడ్డితోనూ ఫోన్లో మాట్లాడారు.దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఆర్ఎఫ్సీఎల్ లో తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల ని పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ను తుమ్మల ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ సురేంద్రమోహన్, మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
కష్టాలు వరుస కట్టాయి..
సాక్షి, మహబూబాబాద్ / మిరుదొడ్డి / ఆత్మకూర్: యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిపడా స్టాక్ ఉందని అధికారులు చెబుతుండగా, టోకెన్లు ఇచ్చి వారం దాటినా యూరియా ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కారు. పలుచోట్ల రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలీస్ పహారా మధ్య యూరియా బస్తాలు, టోకెన్లు ఇచ్చారు. ⇒ మహబూబాబాద్లోని సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్లో శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వందలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ సత్య వతి రాథోడ్ పాల్గొన్నారు. చివరకు టోకెన్లు ఇచ్చి త్వరలో యూరియా అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆపై బందోబస్తు మధ్య టోకెన్లు పంపిణీ చేశారు.⇒ కురవి, సీరోలు మండల కేంద్రాల్లో యూరియా పంపిణీ కేంద్రం వద్దకు పెద్దఎత్తున రైతులు రావడంతో పోలీస్ పహారా మధ్య పంపిణీ చేశారు. ⇒ సకాలంలో యూరియా ఇవ్వడం లేదని కేసముద్రం మండలం బేరువాడ, దనసరి, ఇనుగుర్తి, డోర్నకల్ మండలం మన్నెగూడెం ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పీఏసీఎస్కు శుక్రవారం యూరి యా లారీ వస్తుందని సమాచారం అందుకున్న పలు గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ లైన్ కట్టారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రైతులు చెప్పుల ను క్యూలో పెట్టి బయటకు వెళ్లారు. ఒకేసారి 3 వేల మంది రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇవ్వడంతో అధి కారులకు సైతం తిప్పలు తప్పలేదు. మొత్తానికి యూరి యా లారీ రావడంతో టోకెన్లు అందుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. ⇒ వనపర్తి జిల్లా ఆత్మకూర్లోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతుల కుటుంబసభ్యులందరూ పడిగాపులు కాస్తు న్నారు. శుక్రవారం సొసైటీకి 700 బస్తాల యూరియా రాగా.. గురువారం టోకెన్లు తీసుకున్న 72 మంది అందజేశారు. శుక్రవారం మరో 70 మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే తమ వంతు ఎప్పుడు వస్తుందేమోనని తెల్లవారుజాము నుంచే రైతులు పీఏసీఎస్ కార్యాలయం వద్ద చెప్పులను క్యూలైన్లో పెట్టి ఎదురు చూస్తున్నారు. ఇంటివద్ద నుంచి భోజనం తెచ్చుకొని అక్కడే తింటున్నారు. అలసిపోయి చెట్టు నీడన నిద్రపోతున్నారు.టోకెన్ ఇచ్చి ఐదురోజులు..నాకున్న ఎకరంతోపాటు మూడు ఎకరాల పొలం మునాబాకు తీసుకు న్నా. పొలం నాటేసిన వెంటనే యూ రియా వేయాలి. నాటేసి నెలరోజు లైనా యూరియా వేయలేదు. యూరియా కోసం వస్తే వారం క్రితం టోకెన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు బస్తా కూడా ఇవ్వలేదు. – అజ్మీర చక్రు, రోటిబండ తండా, మహబూబాబాద్అదును దాటితే ఇబ్బందే.. వరి, మొక్కజొన్న సాగు చేశా. వర్షా లు పడుతున్నాయి. ఇప్పుడు యూ రియా వేస్తేనే దిగుబడి వస్తుంది. ఐదురోజుల నుంచి ఇద్దరం తిరుగు తున్నా ఒక్క బస్తా దొరకలేదు. అదును దాటిన తర్వాత యూరియా వేసినా లాభం లేదు. పంట దిగుబడి తక్కువ వస్తుంది. – భూక్య హుస్సేన్, సికింద్రాబాద్ తండా, మహబూబాబాద్ -
దారి మళ్లిన యూరియా..
సొసైటీలకు సరఫరా కావాల్సిన యూరియా రాష్ట్రంలో దారి మళ్లింది. ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తూ టీడీపీ నేతలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరికొంత మంది వ్యవసాయ అవసరాలకు ఉపయోగించాల్సిన యూరియాను బీర్ల తయారీతో పాటు పెయింట్, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం, పశువుల దాణా.. కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీ కోసం దర్జాగా దారిమళ్లించారు. ఇదంతా అధికార కూటమి పార్టీల ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది.ఈయనో రైతు.. పేరు సిరపురపు రామునాయుడు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేశాడు. ఇప్పుడు యూరియా అవసరం కావడంతో ఐదు రోజులుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకలేదు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని వాపోతున్నాడు. ప్రభుత్వం చూస్తుంటే స్టాక్ ఉందని చెబుతోందని, ఇక్కడ చూస్తే నో స్టాక్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలంలోని బెణికల్లులో టీడీపీ మండల నేత రమేష్కు చెందిన గోదాములో పెద్ద ఎత్తున యూరియాను అన్లోడ్ చేశారు. వాస్తవానికి ఈ నిల్వలను డీసీఎంఎస్, సొసైటీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఓ పక్క సొసైటీ కేంద్రాల వద్ద యూరియా నో స్టాక్ అని బోర్డులు పెట్టి, మండలానికి కేటాయించే యూరియా నిల్వలను తన గోదాముల్లోకి తరలించుకుపోయాడు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై సదరు టీడీపీ నేత తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటా‹Ù, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాలు కాదు కదా.. కనీసం సహకార సంఘాల్లో సైతం యూరియా కట్ట దొరకని పరిస్థితి. మిగిలిన ఎరువుల పరిస్థితి కూడా ఇంతే. అధికారులు మాత్రం రాష్ట్రంలో నిల్వలకు ఢోకా లేదని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సర్కారు వద్ద ఉన్నది 10 శాతమే 2025– ఖరీఫ్ సీజన్ సాగు లక్ష్యం 85.26 లక్షలు కాగా ఆగస్టు 21వ తేదీ నాటికి 50.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 27 లక్షల ఎకరాల్లో వరి, 9.2 లక్షల ఎకరాల్లో పత్తి, 3.2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.50 లక్షల ఎకరాల్లో కందులు, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. దాదాపు రెండు నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న రైతులు ప్రస్తుతం అధిక వర్షాలతో నష్టపోతున్నారు. ఈ పరిస్థితిలో యూరియా కట్ట దొరక్క రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 6.45 లక్షల టన్నుల నిల్వలున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందులో సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద 65 వేల టన్నులు, మార్క్ఫెడ్ గోడౌన్లో 55 వేల టన్నులుండగా, మిగిలిన ఎరువులన్నీ ప్రైవేటు హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్దే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో వీరు లాబీయింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కామరాజుపేట సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు బహిరంగ మార్కెట్లో యూరియా కట్ట (ప్రభుత్వ ధర 50 కేజీల బస్తా రూ.266.50) రూ.350 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. యూరియా ఒక్కటే కాదు.. డీఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. డీఏపీ నిల్వలు కూడా 70 వేల టన్నులకు మించి లేవు. దీంతో ఓపెన్ మార్కెట్లో డీఏపీ బస్తా (ప్రభుత్వ ధర రూ.1350) రూ.1,550 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియాతో పాటు ఇతర ఎరువుల కోసం రైతుల ఆందోళనలు ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. చెప్పేదొకటి.. వాస్తవం మరొకటి అనంతపురం జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. చాలా ప్రాంతాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్తో పాటు ప్రైవేట్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఒకట్రెండు బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. చాలా చోట్ల టోకెన్లు ఇచ్చి పంపుతున్నా, మరుసటి రోజు కూడా ఇవ్వడం లేదు. ‘ఈ ఖరీఫ్కు సంబంధించి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు ఉండగా.. ఇప్పటికే 29 వేల మెట్రిక్ టన్నులకు పైగా సరఫరా అయ్యింది. ఇందులో 28 వేల మెట్రిక్ టన్నులకు పైగా పంపిణీ జరిగింది. ఇంకా వేర్హౌస్లో బఫర్ స్టాక్ కింద 1,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది’ అని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి తెలిపారు. ఈ లెక్కన రైతులెందుకు యూరియా కోసం రోడ్డెక్కుతున్నట్లు?ఎరువులను అధికార పార్టీ కార్యకర్తలు దారి మళ్లించడంతో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కనితూరులో రైతుల పాట్లు అన్ని జిల్లాల్లోనూ అవే కష్టాలు ⇒ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో మాత్రం పుష్కలంగా అందుబాటులో ఉంది. అయితే యూరియాతో పాటు ఇతర మందులు కూడా కొనుగోలు చేయాలని వారు షరతు పెడుతున్నారు. సొసైటీల్లో అధికార పక్ష నేతలు సిఫారసు చేసిన వారికే యూరియా అందుతోంది. పలమనేరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఓ వైపు యూరియా కొరత తీవ్రంగా ఉంది. మరో వైపు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, యూరియాకు సంబంధించిన సమస్యలుంటే 8331057300, 9491940106 నంబర్లలో సంప్రదించాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. ⇒ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 2,429 టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా.. ప్రయివేటు డీలర్లు, ఆర్బీకేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల్లో బస్తా కూడా యూరియా లభించడం లేదు. ఆదోని, కౌతాళం, హొళగుంద, పెద్దకడుబూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు యూరియా కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు చెబుతున్న విధంగా యూరియా క్షేత్ర స్థాయిలో ఎక్కడా దొరకడం లేదు. ప్రైవేటు షాపు నిర్వాహకులు మాత్రం యూరియాను అధిక రేట్లకు అమ్మేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పలమనేరులోని ఓ రైతు సమాఖ్య కేంద్రానికి గురువారం ఒక లోడు యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు షాపు తెరవక ముందే భారీగా క్యూ కట్టారు. గంట వ్యవధిలో ఖాళీ అయింది. వందలాది మంది రైతులకు దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ⇒ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. పెదకాకాని మండలంలోని గోళ్ళమూడి గ్రామంలో యూరియా ఉందని తెలియడంతో రైతులు క్యూకట్టారు. సొసైటీ వద్ద, ఆర్బీకే వద్ద కాకుండా లారీని రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. గురువారం ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున కొంత మందికి మాత్రమే ఇచ్చారు. ఒక్క బస్తా ఇచ్చుంటే ఒట్టు మాకు ఎనిమిది ఎకరాలు సొంతభూమి ఉంది. మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. వరి, మిర్చి, పత్తి, కంది వంటి పంటలు సాగు చేస్తున్నాం. వరి నాట్లు వేస్తున్నాం. యూరియా అత్యవసరం అయింది. అన్ని పనులు వదులు కొని ఆర్బీకేలు, ప్రయివేటు డీలర్ల చుట్టూ 25 రోజులుగా తిరుగుతున్నాం. ఒక బస్తా ఇచ్చుంటే ఒట్టు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. – మర్రిస్వామి, రైతు, హొళగుంద, కర్నూలు జిల్లాఅధిక ధరకు అమ్ముతున్నారు పంటలకు అవసరమైన యూరియా దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. 45 కేజీల బస్తా రూ.266కు అమ్మాల్సిన యూరియా దొరక్కపోవడంతో సుమారు రూ.500 కు పైగా ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూ ఈ ధరలు చూడలేదు. ఈ విధంగా అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసి వ్యవసాయం చేయలేం. – పీ సుధాకర్, రైతు, సోమేపల్లి, త్రిపురాంతకం మండలం, ప్రకాశం జిల్లాగత ప్రభుత్వంలో ఎన్ని బస్తాలైనా ఇచ్చేవారునేను ఐదెకరాల్లో వరి, ఐదెకరాల్లో దుంపతోట సాగు చేస్తున్నాను. నాకు 50 బస్తాల యూరియా అవసరం. గతంలో ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుకు ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎక్కడ చల్లాలో, ఏం చేయాలో తెలియడం లేదు. మాకు అవసరమైన మేరకు యూరియాను వెంటనే అందించాలి. – రాజమంద్రపు శ్రీను, రైతు, జగ్గంపేట నియోజకవర్గం, కాకినాడ జిల్లా 266 బస్తాల యూరియా లారీ పక్కదారి మంత్రి ఫరూక్ అనుచరుడి ప్రోద్బలంతో వ్యాపారికి విక్రయం సాక్షి, నంద్యాల: యూరియా దొరక్క ఓ వైపు రైతులు రోడ్డెక్కుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ అవి వచ్చీరాగానే వాటిని గద్దల్లా తన్నుకుపోతున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని పసురపాడు గ్రామానికి మార్క్ఫెడ్ ద్వారా 266 బస్తాల యూరియాను అధికారులు గత మంగళవారం రైతు సేవా కేంద్రానికి మంజూరు చేశారు. యూరియా ఈనెల 19న రావాల్సి ఉంది. అయితే, ఆ స్టాకు మొత్తం సంబంధిత రైతుసేవా కేంద్రానికి రాకుండానే మాయమైంది. టీడీపీ నాయకులు ఈ స్టాకు మొత్తాన్ని అమ్ముకున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి రావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు మార్క్ఫెడ్ కార్యాలయాన్ని సంప్రదించగా 266 బస్తాలు పంపామని తెలిపారు. దీంతో గ్రామ రైతులు విలేజ్ హార్టీకల్చరల్ అసిస్టెంట్ (వీహెచ్ఏ) శ్రీకాంత్రెడ్డిని అడగ్గా.. ఇంకా రాలేదని ఆయన నిర్లక్ష్యంగా బదులిచ్చారు. అనుమానం వచ్చిన రైతులు గోస్పాడు ఏఓకు ఫిర్యాదుచేశారు. ఇది తెలుసుకున్న శ్రీకాంత్రెడ్డి పత్తాలేకుండాపోయారు. దీంతో.. గ్రామస్తులకు యూరియా అందిందా లేదా అని ఏఓ విచారించి రైతులకు అందలేదని తెలుసుకున్నారు. అనంతరం.. వారి సంతకాలు తీసుకుని జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నాయకులే వీహెచ్ఏ శ్రీకాంత్రెడ్డితో కుమ్మక్కై 266 బస్తాల యూరియా లారీని నంద్యాలలోనే ఓ బడా వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. మంత్రి ఫరూక్ ముఖ్య అనుచరుడి ప్రోద్బలంతోనే ఎరువు లారీని అమ్మే సాహసం టీడీపీ నాయకులు చేశారని తెలుస్తోంది. -
మనసుంటే భూపంపిణీ చేయొచ్చు!
భారతదేశంలో నూటికి 65 శాతం పైగా ప్రజలు గ్రామీణప్రాంతంలో నివసిస్తున్నారు. భూమిని కలిగి ఉండటం రైతు కుటుంబానికి సామాజిక హోదాను కల్పిస్తుంది. కానీ 78 సంవత్సరాల ‘స్వాతంత్య్రం’ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్నారు. గ్రామాల్లోని సుమారు 10 కోట్ల కుటుంబాలకు, అంటే గ్రామాల్లోని దాదాపు 56 శాతం కుటుంబాలకు సాగు భూమి అనేది లేదు. 1970 దశకంలో ప్రజల, ముఖ్యంగా గిరిజన ప్రజల పోరాటం ఫలితంగా భూమి సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చింది. రాష్ట్రాల వారీగా భూసంస్కరణల చట్టాలు వచ్చాయి. 1972లో జరి గిన ముఖ్యమంత్రుల సమావేశంలో జాతీయ స్థాయిలో ఒకే సీలింగ్ విధానాన్ని రూపొందించారు. ఈ సీలింగ్ ద్వారా 67 లక్షల ఎకరాల మిగులు తేలింది. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 1972లో భూ సంస్కరణల చట్టం చేయబడి 1973లో అమల్లోకి వచ్చింది. భూ సంస్కరణల చట్ట ప్రకారం మొదట 18 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. సవరణలతో కుదిస్తూ చివరికి 7.9 లక్షల ఎకరాల మిగులు భూమి ప్రకటించి, అందులో 6.47 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని, 5.82 లక్షల ఎకరాలను లక్షా 79 వేల మందికి పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చట్టంలో ఉన్న లొసుగు లను ఉపయోగించుకొని భూస్వాములు, ధనిక రైతులు సీలింగ్లోకి రాకుండా తమ భూములను కాపాడుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు 51 లక్షల ఎకరాలను మాత్రమే 57.8 లక్షల పేద రైతులకు పంపిణీ చేయడం జరిగింది. భూ సంస్కరణల చట్టాల వల్ల భూ సంబంధాల్లో మౌలికమైన మార్పులు జరగలేదు. కొద్ది మంది వద్దే భూమి ఇంకా కేంద్రీకరించ బడి ఉంది. 2020 జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం, 84%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులు హెక్టార్ కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారు. కేవలం 4.9% ఉన్న భూస్వాముల వద్ద 32% సాగు భూమి ఉంది. రాష్ట్రాల వారిగా కూడా భూకేంద్రీకరణలో వ్యత్యాసాలు ఉన్నాయి. పంజాబ్, బిహార్ రాష్ట్రాల్లో 10%గా ఉన్న భూస్వాముల వద్ద 80 శాతం భూమి ఉంది. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో 55% భూమి 10%గా ఉన్న భూస్వాముల వద్ద ఉంది. భారతదేశంలో ఒక పెద్ద భూ కామందు ఒక సన్నకారు రైతు కన్నా 45 రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. దేశంలో భూ సంస్కరణలు అమలు జరిపారనీ, భూస్వామ్య విధానం లేదనీ, దాని అవశేషాలు మాత్రమే ఉన్నాయనీ, పంచ టానికి ఇంకా భూములు లేవనీ కొందరు చేస్తున్న వాదనలు వాస్తవ విరుద్ధం. భూ కామందుల వద్దే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద, మత సంస్థల వద్ద లక్షలాది ఎకరాల భూమి ఉంది. ఆ భూము లను ప్రభుత్వం పంపిణీ చేయగలిగినప్పుడే పేదలందరికీ భూమి లభిస్తుంది. 10 నుండి 12 ఎకరాల సీలింగ్ విధించి భూ సంస్కర ణలు అమలు జరిపితే లక్షల కొద్ది భూములను పేదలకు పంపిణీ చేయవచ్చు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలు భూమి కోసం సంఘటితం కావాలి. – బొల్లిముంత సాంబశివరావురైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
బర్త్డే గిఫ్ట్గా యూరియా బస్తాలు.. ఎక్కడో తెలుసా?
యూరియా కష్టాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్రచర్చ నడుస్తున్న వేళ.. జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశమైంది. పుట్టినరోజు జరుపుకున్న ఓ రైతుకు తోటి స్నేహితులు యూరియా బస్తా కానుకగా ఇచ్చారు. పైగా ఇప్పుడు ఇదే ట్రెండ్గా మారిందనే చర్చా నడుస్తోంది.కథలాపూర్ మండలం తాండ్రియాలలో ముక్కెర మధు అనే రైతు పుట్టినరోజు నాడు.. అతని స్నేహితులు యూరియా బస్తాను బహుకరించారు. రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను చూసి ఇచ్చామంటున్నారు. ఈ తరుణంలో.. ప్రభుత్వంపై సెటైర్ గా సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.మొన్నీమధ్యే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కిషన్ రెడ్డి అనే రైతు పుట్టినరోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చారు ఆయన మిత్రులు.పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో పడిగాపులు పడలేక చెప్పులను ఉంచుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడం చూశాం. అందుకే యూరియా కోసం ప్రభుత్వాన్ని బతిమాలడం చూస్తున్నాం. పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు వాపోతున్నారు.అయితే విమర్శల వేళ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ స్పందించారు. రైతులకు ఎరువులు అందించడంలో కేంద్రం విఫలమైంది. సరిపడా యూరియాను అందించలేకపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు యూరియా కోసం పోరాడుతున్నారు. ఈ నెలాఖరుకల్లా యూరియా బస్తాలు వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారాయన. -
యూరియా... ఏదయా..!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో..వానాకాలం సీజన్ నాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల కింద నాట్లువేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వరినాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు రైతులు ప్రతి ఎకరాకు ఒక బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను వినియోగిస్తారు. ఆ తర్వాత 45 రోజులకు మరోసారి యూరియాను వాడతారు. మరోవైపు పత్తి, మొక్కజొన్న పంటలకు కూడా యూరియా వినియోగం పెరుగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన యూరియా కోసం డిమాండ్ ఎక్కువవుతోంది. సరిపడా యూరియా, మిగతా ఎరువులు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ల వద్ద రైతులు బారులు దీరుతున్నారు. యూరియా దొరక్కపోవడంతో రోడ్లపై బైఠాయించి నిరసనలు చేస్తున్నారు. ఆలస్యంగా వరి సాగయ్యే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండగా, ఇప్పటికే మెజారిటీ ప్రాంతాల్లో ఒక విడత యూరియాను వినియోగించిన నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల రైతులు రెండోదఫా యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. అయితే గత జూలై నెల నుంచే రైతులకు పొదుపుగా యూరియాను పంపిణీ చేస్తూ వస్తున్న వ్యవసాయ శాఖ దగ్గర ప్రస్తుతం 50 వేల మెట్రిక్ టన్నులు కూడా నిల్వ లేదు. ప్రస్తుతం వచి్చన యూరియాను వచ్చినట్లే రేషన్ విధానంలో రైతులకు టోకెన్లు ఇచ్చి ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా తగ్గడం, మార్క్ఫెడ్ వద్ద తగినంత నిల్వలు లేకపోవడం, ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడం వంటివి కారణాలనే చర్చ జరుగుతోంది. అవసరం 10.48 ఎల్ఎంటీ.. కేటాయింపు 9.80 ఎల్ఎంటీ రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పంటల విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా యూరియా అధికంగా వినియోగించే ప్రధానమైన వరి, పత్తి, మొక్కజొన్న పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. వీటికి తోడు కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వానాకాలం సీజన్లో 10.48 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే, గత సీజన్లో ఇచ్చిన విధంగానే 9.80 ఎల్ఎంటీ మాత్రమే కేటాయింపులు జరిపింది. గత యాసంగిలో పంపిణీ చేయగా మిగిలిన 1.92 ఎల్ఎంటీల యూరియాను వినియోగించుకోవాలని సూచించింది. కేటాయించిన యూరియాను ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టి ప్రతినెలా రైల్వే రేక్ల ద్వారా రాష్ట్రాలకు కేంద్రం పంపిస్తుంది. కానీ తెలంగాణకు ఏప్రిల్ నుంచి ఈ ఆగస్టు వరకు ప్రతినెలా పంపే యూరియాలో కోత విధించింది. రాష్ట్రానికి ఇప్పటివరకు 8.30 ఎల్ఎంటీల యూరియా రావలసి ఉండగా, కేవలం 5.32 ఎల్ఎంటీ యూరియా (2.98 ఎల్ఎంటీల లోటు) మాత్రమే పంపింది. ఈ యూరియాకు ఓపెనింగ్ స్టాక్గా ఉన్న మిగులు యూరియా 1.92 ఎల్ఎంటీలు కలిపి సుమారు 7.20 ఎల్ఎంటీలు రాష్ట్రంలోని సొసైటీలు, మార్క్ఫెడ్, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేసింది. సెపె్టంబర్లో మరో లక్షన్నర మెట్రిక్ టన్నుల యూరియా రావలసి ఉండగా, ప్రస్తుతం లోటుగా ఉన్న 2.98 ఎల్ఎంటీలను పంపిస్తే తప్ప ఈ నెలలో రైతులకు యూరియా ఇవ్వడం సాధ్యం కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. ప్రైవేట్ డీలర్ల ద్వారా పారిశ్రామిక అవసరాలకు! 45 కిలోల యూరియా బస్తాపై కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1,900 సబ్సిడీ భరిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ భారాన్ని భరిస్తూ రైతులకు సరఫరా అవుతున్న యూరియా పక్కదారి పడుతోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 25 శాతం యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నట్లుగా కేంద్రమంత్రి జేపీ నడ్డా చెప్పినట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రానికి సరఫరా అయ్యే సబ్సిడీ యూరియాను 50:50 ప్రాతిపదికన ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు డీలర్లు కూడా విక్రయిస్తారు. ఉదాహరణకు లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం పంపిస్తే అందులో 50 వేల మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు సరఫరా చేస్తారు. అయితే ప్రైవేటు వ్యాపారుల వద్ద నుంచి యూరియా పక్కదారి పడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగుల కంపెనీలు, వార్నీష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమల్లో యూరియాను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. బీరు, గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం. 50 వేల మెట్రిక్ టన్నుల సరఫరాకు కేంద్రం హామీ రాష్ట్రంలో యూరియా కొరతపై ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు రెండు రోజులుగా ఆందోళన నిర్వహించారు. మంగళవారం నాటి ఆందోళనకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సంఘీభావం తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం.. కర్ణాటక నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు పంపించనున్నట్లు తెలిపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. అయితే ఈ యూరియా రావడానికి మరో 10 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే 50 వేల మెట్రిక్ టన్నులతో రైతుల యూరియా బాధలు ఏమాత్రం తీరవని చెబుతున్నారు. -
తెలంగాణ రైతాంగానికి ఊరట
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రైతాంగానికి ఊరట లభించింది. 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయించింది. గుజరాత్, కర్ణాటక నుంచి యూరియా తరలింపునకు కేంద్రం ఆదేశించింది. వారం రోజుల్లో తెలంగాణకు యూరియా రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. మంగళవారం కలిశారు.కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపీలు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వారంలో 50 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని కేంద్రం హామీ ఇచ్చిందని ఎంపీ చామల కిరణ్రెడ్డి వెల్లడించారు. 14 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి పంపినట్లు కేంద్రం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి 14 వేలు మెట్రిక్ టన్నులు యూరియా వస్తుంది...వారం రోజుల్లో 48 వేల మెట్రిక్ టన్నులు యూరియా ఇస్తామన్నారు. వారం రోజులుగా యూరియా కోసం ఎంపీలంతా పోరాడుతున్నాం. పార్లమెంట్లో వాయిదా తీర్మానం కూడా ప్రతిపాదించాం. యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నేరుగా కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. ఎంపీలం కూడా పలుమార్లు నడ్డాను కలిశాం. మేము పలుమార్లు మంత్రిని కలవడం వల్లనే యూరియా ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది’’ అని చామల కిరణ్రెడ్డి తెలిపారు. -
‘కట్ట’ కట!
పోలీసు పహారాలో..కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని పెనుమల్లి సొసైటీ పరిధిలో 10 గ్రామాలున్నాయి. ఇక్కడ 4 వేల ఎకరాలకు పైగా ఆయుకట్టు ఉంది. ఖరీఫ్లో వరి సాగు చేయగా ప్రస్తుతం మొలక దశలో ఉంది. ఇప్పుడు మొదటి డోసు కింద 120 టన్నుల యూరియా అవసరం. కానీ ఇప్పటివరకు 3 విడతల్లో వచ్చింది 70 టన్నులు మాత్రమే. సోమవారం ఎరువుల కోసం రైతులు పెద్ద సంఖ్యలో సొసైటీ వద్దకు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు.సాక్షి, అమరావతి: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతన్నలను ప్రభుత్వ నిర్వాకం వల్ల తలెత్తిన ఎరువుల కొరత పట్టి పీడిస్తోంది. యూరియా కొరత మరీ దారుణంగా ఉంది. అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితికి ఏమాత్రం పొంతన లేదు. రైతు సేవా కేంద్రా లు (పూర్వపు ఆర్బీకేలు) కాదు కదా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) వద్దా నిల్వలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. పొలాలకు చేరాల్సిన యూరియా, డీఏపీ పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో నిలువు దోపిడీ.. ఖరీఫ్ 2025 సీజన్ సాగు లక్ష్యం 85.26 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు 20 లక్షల ఎకరాలు దాటింది. ప్రస్తుతం మొలక దశలో ఉన్న పంటకు ఎకరాకు కట్ట యూరియా, కట్ట డీఏపీ తప్పనిసరి. పైరు ఎదుగుదలకు ఎంతగానో దోహదపడే యూరియా ప్రస్తుతం అసలు కానరావడం లేదు.యూరియా ఎమ్మార్పీ రూ.266.50 కాగా బహిరంగ మార్కెట్లో రూ.310 – రూ.440 వరకు విక్రయిస్తున్నారు. డీఏపీ, ఇతర ఎరువులతో పాటు జింకు గుళికలను అంటగడుతున్నారు. అవి కొంటేనే డీఏపీ అంటూ అందినకాడికి దోచేస్తున్నారు. సొసైటీల్లో ఏ ఒక్క రైతుకూ బస్తాకు మించి ఇవ్వ డం లేదు. ఇదే అదునుగా కృత్రిమ కొరత సృష్టిస్తున్న ప్రైవేటు వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. యూరియా కొరత వల్ల డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉండగా, మార్కెట్లో మాత్రం రూ.1,450 నుంచి రూ.1,550 వరకు పెంచి అమ్ముతున్నారు. పక్కదారి పడుతున్నా పట్టని ప్రభుత్వం.. ఖరీఫ్ సీజన్లో 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా 9.74 లక్షల టన్నుల విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. అత్యధికంగా 4.10 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ఓపక్క చూస్తే 50 శాతం సాగు కూడా పూర్తి కాలేదు. వర్షాధార ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల పంట భూములు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఈ నెలలో కేంద్రం నుంచి రావాల్సిన 1.65 లక్షల టన్నుల యూరియా ఇప్పటివరకు అందలేదు. యూరియా సహా ఎరువుల్లో సింహభాగం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లను కాదని ప్రైవేటు వ్యాపారులకే కేటాయిస్తున్నారు.సొసైటీలకు చేరిన కొద్దిపాటి ఎరువులను అధికార పార్టీ సానుభూతిపరులకు పంపిణీ చేసి మిగిలిన నిల్వలను దొడ్డి దారిన ప్రైవేటు డీలర్లుకు తరలిస్తున్నారు. యూరియా దారి మళ్లుతున్నట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వ్యాఖ్యానించడం గమనార్హం. సారా, బీర్ తయారీతోపాటు పెయింట్లు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్ – బ్లూ ద్రావణం, పశువుల దాణా, కోళ్లు, ఆక్వా మేత, కల్తీ పాల తయారీలో యూరియాను విచ్చలవిడిగా వాడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీకి కేటాయించిన నిల్వలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్న ఆరోపణలున్నాయి. 2019కి ముందు దుస్థితి పునరావృతం..!గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను కూటమి సర్కారు నిర్విర్యం చేయడంతోపాటు ఎరువుల సరఫరాలో ముందుచూపు లేకపోవడంతో 2019కి ముందు పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీజన్లో కనీసం నాలుగైదు సార్లు తిరిగితే కానీ రైతన్నలకు ఎరువు కట్ట దొరికేది కాదు.మండల స్థాయిలో పంపిణీ వల్ల రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యేవి. వ్యయ ప్రయాసలతోపాటు లోడింగ్, అన్లోడింగ్ భారాన్ని భరించాల్సి వచ్చేది. అదనంగా చెల్లిస్తేగానీ కోరిన ఎరువులను డీలర్లు ఇచ్చేవారు కాదు. పైగా అవసరం లేని పురుగు మందులను బలవంతంగా అంటగట్టేవారు. ఎక్కడకెళ్లినా ఎరువుల కోసం చెప్పుల క్యూ లైన్లు కనిపించేవి. ఎండలో నిలబడలేక స్పృహ తప్పి పడిపోవడం, వడగాడ్పుల బారినపడి మత్యువాత పడిన ఘటనలూ చోటు చేసుకున్నాయి. ఐదేళ్లూ గ్రామంలోనే కోరినన్ని..వైఎస్సార్ సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఎరువుల సరఫరా చేపట్టడంతో అన్నదాతలు నిశ్చింతగా సాగు పనుల్లో నిమగ్నమయ్యేవారు. ఏనాడూ ఎరువు కట్టల కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు. విత్తనం నుంచి విక్రయం దాకా ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఐదేళ్లలో రవాణా, లోడింగ్, అన్లోడింగ్ రూపంలో రూ.100 కోట్లకు పైగా రైతులకు ఆదా అయ్యింది. అలాంటిది గడిచిన ఏడాదిగా రైతులు ఎరువుల కోసం నరక యాతన పడుతున్నారు.కట్ట కూడా ఇవ్వలేదు.. రెండెకరాలు కౌలుకు తీసుకొని ఖరీఫ్లో వరి సాగు చేశా. ప్రస్తుతం మొల క దశలో ఉంది. ఎన్నిసార్లు తిరిగినా కట్ట యూరియా కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. –యార్లగడ్డ భార్గవ సాయి, ఎస్వీపల్లి, కృష్ణా జిల్లా సాగు ఎలా చేయాలి? సొంత భూమితో కలిపి 20 ఎకరాల వరకు కౌలుకు చేస్తున్నా. ప్రస్తుతం నాకు పది కట్టలు కావాలి. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఐదు కట్టలు ఇచ్చారు. ఇలా అయితే సాగు ఎలా? –కట్టా వాకలయ్య, లంకల కలవ గుంట, కృష్ణా జిల్లా రోడ్కెక్కిన రైతన్నలు..యూరియా కోసం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కవుతరం పీఏసీఎస్ వద్ద యూరియా కోసం నిరసనకు దిగారు. పెడన మండలం పెనుమల్లి, మచిలీపట్నం మండలం బుద్దాలపాలెం సొసైటీల పరిధిలో కూడా ఇదే రీతిలో ఆందోళన నిర్వహించారు. ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్లతో పాటు పలు జిల్లాల్లో సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీస్ పహారాతో ఎరువులు పంపిణీ చేయాల్సి రావడం కూటమి సర్కారు అసమర్థతకు నిదర్శనం. -
యూరియా ఎడాపెడా!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా యూరి యా వినియోగం పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో ఎరువులు, అందునా యూరియా వాడకం ఎక్కువగా ఉంటోంది. తెలంగాణలో సైతం అధిక యూరియా వినియో గం నమోదవుతుండగా..దక్షిణాది రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ రెండోస్థానంలో ఉండడం గమనార్హం. ఖరీ ఫ్ సీజన్లో యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్ఎస్పీ వంటి ఎరువులను అత్యధికంగా కర్ణాటక 26.75 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) వినియోగిస్తుండగా, అందులో ఒక్క యూరియా వినియోగమే 11.17 లక్షల మెట్రిక్ టన్ను లుగా ఉంది.ఇక కర్ణాటక తరువాత తెలంగాణలో ఒక సీజన్లో మొత్తం 23.75 ఎల్ఎంటీల మేర ఎరువులు వినియోగిస్తుండగా..అందులో యూరియా 9.80 ఎల్ఎంటీలు ఉండటం గమనార్హం. ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ రాష్ట్రంలో మాత్రమే ఎరువుల వాడకం అతి తక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలో ఖరీఫ్లో వినియోగించే యూరియా కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే కావడం కావడం విశేషం. డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్, ఎస్ఎస్పీ ఎరువుల వినియోగం కూడా ఈ రాష్ట్రంలో అతితక్కువగా ఉంది. ఏపీలో 6.22 ఎల్ఎంటీ, తమిళనాడులో 4.37 ఎల్ఎంటీ యూరియాను వినియోగిస్తుండగా, పాండిచ్చేరీలో 6 వేల టన్నులను మాత్రమే వాడుతున్నారు.ఉత్తరప్రదేశ్ టాప్కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి యూరియా కోసం రూ.1.19 లక్షల కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే రూ.30,940 కోట్లు సబ్సిడీ విడుదల చేసింది. దేశంలో యూరియాతో పాటు ఎరువుల వినియోగం ఏయేటికాయేడు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం.. యూరియాపై ఒకవైపు రూ.లక్షల కోట్లు భరిస్తూనే సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.సేంద్రీయ ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ పరిశోధన సంస్థలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రైతులు అధిక దిగుబడి లక్ష్యంగా ఎరువులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్ ఎరువుల వినియోగంలో అగ్రభాగాన ఉంది. ఈ రాష్ట్రంలో కేవలం ఒక సీజన్కు 40 ఎల్ఎంటీల చొప్పున యూరియా వినియోగిస్తున్నారు. ఇక దేశ పశి్చమ ప్రాంతంలోని గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవాల్లో 61.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగిస్తున్నారు. గోవాలో అతి తక్కువగా కేవలం వెయ్యి మెట్రిక్ టన్నులే వినియోగిస్తుండడం గమనార్హం. తూర్పు ప్రాంత రాష్ట్రాల్లో బిహార్లో అత్యధికంగా 10.32 ఎల్ఎంటీ యూరియాను వినియోగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సిక్కిం, నాగాలాండ్లలో అసలు ఎరువులే వినియోగించడం లేదు. -
వాన... వాన.. వెనక్కు!
సాక్షి, అమరావతి: ఖరీఫ్ను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతూ రైతాంగం అల్లాడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. వరుణుడు ముఖం చాటేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం రోజురోజుకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలతో ప్రాజెక్టుల కింద తప్ప వర్షాధారిత ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో పంటల సాగు లేదు. వేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఈ సీజన్లో ప్రధాన పంట వేరుశనగ కనీసం 24 శాతానికి మించి సాగవ లేదంటేనే ఎంతటి దైన్యం నెలకొందో తెలుస్తోంది. మరొక వైపు వేసవిని తలపించే స్థాయిలో నమోదుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో వేసిన పంటలు సైతం ఎండిపోతున్నా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించడంలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో విత్తుకోసం పెట్టిన పెట్టుబడులు నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. మరొక వైపు ప్రాజెక్టుల కింద సాగవుతున్నా శివారు ప్రాంతాలకు సాగునీరందక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 12 జిల్లాలో లోటు వర్షపాతం.. జూన్ 1 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ సాధారణానికి మించి వర్షాలు పడలేదు. ఈ సీజన్లో 57.47 సెంటీమీటర్ల వర్షపాతం పడాలి. ఆగష్టు 7వ తేదీ నాటికి 28.70 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 20.98 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దాదాపు 70 రోజుల్లో 26.89 శాతం లోటు వర్షపాతం నమోదైంది.14 జిల్లాల్లో సాధారణ, 12 జిల్లాల్లో 20–59 శాతం వరకు లోటు నెలకొంది. డాక్టర్ వైఎస్సార్ కడప, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతిజిల్లాలలో లోటు నుంచి తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. దాదాపు 360 మండలాల్లో లోటు వర్షపాతం కొనసాతోంది. 145 మండలాల్లో ఒకటి కంటే ఎక్కువ డ్రై స్పెల్స్ నమోదైనట్లు చెబుతున్నారు. 52 శాతం విస్తీర్ణంలో పంటలు ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. దీంతో ప్రధాన ప్రాజెక్టుల కింద సాధారణ సాగు నమోదైంది. అయితే ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కాలువ శివారు భూములకు నీరందించలేని దుస్థితి నెలకొంది. వర్షాభావంతో చిన్న సాగునీటి ప్రాజెక్టుల కింద నీరందక రైతులు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యం 86.47 లక్షల ఎకరాలు కాగా, 40.45 లక్షల ఎకరాల్లో పంటలు (52 శాతం) సాగయ్యాయి. పొరుగనున్న తెలంగాణాలో కూడా ఇదే రీతిలో వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిర్ధేశించిన లక్ష్యంలో 69.11 శాతం తొలిపంట సాగైంది. ప్రాజెక్టుల కింద వరి, పత్తి సాగు కాస్త సాధారణ స్థాయిలో సాగవుతోంది. ఖరీఫ్లో వరి, వేరుశనగ, పత్తి పంటలే 80 శాతం విస్తీర్ణంలో సాగవుతాయి. ఆ తర్వాత చెప్పుకో తగ్గ స్థాయిలో కందులు, మొక్కజొన్న పంటలు సాగవుతాయి. అలాంటిది ఈ ఏడాది వరి సాగు లక్ష్యం 38.87 లక్షల ఎకరాలు కాగా, 20 లక్షల ఎకరాల్లో వేశారు. పత్తి సాగు లక్ష్యం 14.10 లక్షల ఎకరాలు కాగా, 8 లక్షల ఎకరాల్లో సాగైంది. తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో కందులు 3.42 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 2.92 లక్షల ఎకరాల్లో వేశారు. ఆశలు సన్నగిల్లిన వేరుశనగ –24 శాతం మించి సాగవని పంట ఖరీఫ్లో వరి తర్వాత వర్షాధారం కింద ఎక్కువగా సాగయ్యే పంట వేరుశనగ. రాయలసీమ జిల్లాల్లో ప్రధాన పంట. కానీ, ఈ ఏడాది పావు వంతు కూడా సాగవలేదు. ఇదొక్క ఉదాహరణ చాలు.. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవడానికి. రాయలసీమలో 70–80 శాతం విస్తీర్ణంలో పండించే పంట వేరుశనగనే. ఈ ఏడాది లక్ష్యం 14.30 లక్షల ఎకరాలు కాగా, 3.30 లక్షల ఎకరాల్లో (24 శాతం) మాత్రమే సాగైంది. నిరుటి కంటే (6.87 లక్షల ఎకరాలు) కూడా ఇది దాదాపు సగమే కావడం గమనార్హం. సాధారణంగా జూలై నెల దాటితే వేరుశనగ వేసేందుకు రైతులు ముందుకురారు. ప్రధానంగా అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ పంట ఈ సారి జాడ లేకుండా పోయింది. దాదాపు ఏడు జిల్లాల్లో సెంటు భూమిలో కూడా వేరుశనగ విత్తలేదు. నంద్యాలలో మాత్రమే 57 శాతం విస్తీర్ణంలో సాగైంది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో 8, వైఎస్సార్ కడపలో 15, శ్రీ సత్యసాయిలో, అనంతపురంలో 27, తిరుపతిలో 31, పల్నాడులో 17, ప్రకాశంలో 21 శాతం మేర పంట వేశారు. నంద్యాలలో వర్షాభావ పరిస్థితులతో పంట ఎండిపోయింది. వేరుశనగ సాధారణ విస్తీర్ణంలో కూడా సాగకపోతే తీవ్రమైన పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. పాడి మీద ఆధారపడే చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. నిరుడు గిట్టుబాటు దూరం.. ఈసారి మిరపకు దూరం నిరుడు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలను చవిచూసిన మిరప రైతులు ఆ పంట వేసేందుకు ముందుకురాని పరిస్థితి. సాధారణంగా ఖరీఫ్లో 5–6 లక్షల ఎకరాల మధ్య మిరప సాగవు తుంది. ఈసారి లక్షన్నర ఎకరాలు దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఓవర్ ఆల్గా చూస్తే ఏ ఒక్క జిల్లాలోనూ 40 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవని పరిస్థితి నెలకొంది. ప్రదానంగా అనకాపల్లిలో ఏడు శాతం, అన్నమయ్యలో 10 శాతం, చిత్తూరులో 12 శాతం, ప్రకాశంలో 14 శాతం, వైఎస్సార్ కడపలో 19 శాతం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 21 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 29 శాతం, విజయనగరం జిల్లాలో 38 శాతం, అల్లూరి సీతారామరాజులో 41, గుంటూరులో 42 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏదీ? సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా రాయలసీమ జిల్లాల్లో సగటున 20 శాతానికి మించి పంటలు సాగవలేదు. ఆగస్టులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాధార జిల్లాల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఈపాటికే ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను ప్రకటించాలి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయలేదు. సీఎం చంద్రబాబు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కానీ సమీక్ష చేసిన పాపాన పోలేదు. 90 శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలు ఇవ్వాలి కనీస వర్షాల్లేక ఖరీఫ్లో రైతులు తీవ్రమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 12 జిల్లాల్లో మైనస్ 20 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదవగా, 7 జిల్లాల్లో 10 శాతం లోటు వర్షపాతం నమోదైంది. తెలంగాణలో 69.11 శాతం పంటలు సాగైతే.. ఏపీలో 52 శాతం విస్తీర్ణంలోనే వేశారు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నప్పటికీ శివారు భూములకు అందని పరిస్థితి నెలకొంది. వర్షాభావంతో వరి, పత్తి పంటలు దెబ్బతింటున్నాయి. తీవ్ర వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికపై దష్టిపెట్టాలి. 90 శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించాలి. యూరియా కొరత ఎక్కువగా ఉంది. వాస్తవ నిల్వలతో కూడిన బోర్డులను మండల స్థాయిలో ప్రదర్శించాలి. –ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ శివారు ప్రాంతాలకు సాగనీరందక రైతుల పాట్లు గోదావరి, కృష్ణ, సాగర్ ప్రాజెక్టుల్లో పుష్కలంగా సాగునీరు ఉంది. కానీ శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సాగునీరందని పరిస్థితి నెలకొంది. సాగునీటి సరఫరా నిర్వహణలో ప్రభుత్వానికి ముందు చూపు కొరవడడంతో శివారు ప్రాంత రైతులు విత్తుకున్న పంటలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. -ఎం.హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం -
కోటి ఎకరాల్లో సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ సీజన్లో కోటి ఎకరాలకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. మున్ముందు వరుణుడు కరుణిస్తాడన్న నమ్మకంతో వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగానే రైతాంగం వివిధ పంటలను సాగు చేస్తోంది. వానాకాలం సీజన్లో నీరు తక్కువ అవసరమైన పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది పంటలను ఇప్పటికే భారీగా సాగు చేసిన రైతులు.. వరిని ఆచితూచి సాగు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే నాట్లు పడాల్సిన పల్లెల్లో కొంత ఆలస్యమైంది. ఆరు జిల్లాల్లోని 170 మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నెలకొని ఉండటం గమనార్హం. అయితే ఆగస్టు మూడో వారం దాటితే వరిసాగుకు గడువు ముగుస్తుందనే కారణంతోపాటు సెపె్టంబర్ దాకా వర్షాలు కురిసి గోదావరి నిండుతుందన్న నమ్మకంతో రైతులు పొలాల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 25 శాతం వరకు లోటు వర్షపాతం ఉన్నప్పటికీ వానాకాలం సీజన్ పంటల సాగు కోటి ఎకరాలు దాటింది. వ్యవసాయ శాఖ ఈ సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా ఇప్పటికే 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి సాగు విస్తీర్ణం సుమారు 32 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ నెలాఖరు వరకు మరో 30 లక్షల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో ఆశాజనకం గోదావరి పరీవాహిక ప్రాంతంలో సాగునీరు లేక వరిసాగు అంతంత మాత్రంగా ఉండగా కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో మాత్రం ఇప్పుడిప్పుడే రైతులు నాట్లు వేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు కూడా దక్షిణ తెలంగాణ రైతులకు ఆశాజనకంగా మారాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే సగటున 40 శాతం వరిసాగు కాగా పత్తి 70–80 శాతం సాగైంది. ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే పత్తి 80 శాతానికిపైగా సాగవగా వరి 30–40 శాతం వరకు సాగులో ఉంది. రంగారెడ్డి పరిధిలోని మూడు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసినప్పటికీ వరిసాగు విస్తీర్ణం అంతంత మాత్రంగానే ఉంది. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతోపాటు దక్షిణ తెలంగాణలో వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో కృష్ణా నది పరిధిలోని 30 జలాశయాల్లో 619 టీఎంసీల నీటికిగాను 577 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు మూడో వారం వరకు దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్నగర్ ఉమ్మడి జల్లాలతోపాటు ఉత్తర తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కూడా వరిసాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఎస్సారెస్పీ నీటి విడుదలతో.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు గోదావరి జలాలే ప్రధాన నీటివనరు. మొత్తంగా గోదావరి పరిధిలో 419 టీఎంసీల సామర్థ్యంగల 57 జలాశయాలు ఉండగా వాటిలో ఇప్పుడున్న నీటి నిల్వలు కేవలం 146 టీఎంసీలే. అయితే నిజామాబాద్తోపాటు పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, హనుమకొండతోపాటు నిర్మల్, మంచిర్యాలకు నీరందించే ఎస్సారెస్పీ కుడి, ఎడమ కాల్వలకు ఇటీవల నీటిని విడుదల చేయడంతో ఆయా జిల్లాల పరిధిలో రైతులు కాల్వల కింద ఉన్న పొలాల్లో నాట్లు వేసుకుంటున్నారు. నిజామాబాద్, జిల్లాలో లోటు వర్షపాతం ఉన్నప్పటికీ సెపె్టంబర్లో వానలు కురిసి ప్రాజెక్టులు నిండుతాయనే ఆశతోపాటు ఎస్సారెస్పీ నీటి విడుదలతో సాధారణ సాగు విస్తీర్ణంలో 90 శాతానికిపైగా నాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్లలో ఇటీవల కురిసిన వర్షాలకు తోడు జలాశయాల నుంచి వచ్చిన నీటితో రైతులు సాగు పనుల్లో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్లోని నాలుగు జిల్లాల్లోనూ 60–70 శాతం పంటలను సాగు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణంకన్నా సుమారు 60 శాతం తక్కువగా సాగు నమోదైంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు 43 వేల ఎకరాల్లో పంటలు సాగు కావల్సి ఉండగా 4,500 ఎకరాలకే పరిమితమయ్యాయి. ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోనూ మూడో వంతు విస్తీర్ణంలో కూడా నాట్లు వేయలేదు. ఉమ్మడి ఆదిలాబాద్లోని నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వరిసాగు విస్తీర్ణం ఈసారి ఆశాజనకంగా ఉంది. పూర్తిస్థాయిలో పత్తి, మొక్కజొన్న రాష్ట్రంలో వర్షాకాల పంటల్లో కీలకమైన పత్తి, మొక్కజొన్న వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగా సాగయ్యాయి. ఈ సంవత్సరం పత్తి 48.93 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ లెక్కలు వేయగా ఇప్పటివరకు 45 లక్షల ఎకరాల్లో సాగైంది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 5.55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవ్వగా, ఆ తర్వాతి స్థానంలో 4.3 లక్షల ఎకరాలతో ఆదిలాబాద్ ఉంది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగైంది. మొక్కజొన్న 5.21 లక్షల ఎకరాల సాధారణ సాగును దాటి 5.55 లక్షల ఎకరాల్లో సాగయింది. కంది 4.44 లక్షల ఎకరాల్లో సాగవగా సోయాబీన్ను 3.57 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. -
దుక్కి దున్ని.. నాట్లు వేసి
నర్సాపూర్ రూరల్: ట్రాక్టర్తో దుక్కి దున్ని నాట్లు వేశారు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థినులు. మండలంలోని అవంచలో బుధవారం రైతులతో కలిసి పొలం బాట పట్టారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతుల దిగుబడిని పెంచే విధంగా తమ సేవలను అందించడానికే వ్యవసాయ విద్యను ఎంచుకున్నట్లు తెలిపారు. అనంతరం రైతులకు నూతన వ్యవసాయ సాగు పద్ధతులను వివరించారు.ఎప్పుడు దారి కొచ్చేనో..?మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్కు వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. అక్కడికి వెళ్లడానికి నర్సాపూర్ నుంచి రెండు మార్గాలున్నాయి. ఒకటి నర్సాపూర్–తూప్రాన్ రహదారి నుంచి ఉండగా, మరోటి నర్సాపూర్లోని జగన్నాథరావు కాలనీ నుంచి ఉంది. రెండు రోడ్లు గుంతలమయంగా మారగా, కనీస మరమ్మతులు కరువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలుస్తుందన్నారు. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
AP Farmers: పెట్టుబడి సాయంలో మోసం.. ఎరువుల కొరత..మద్దతు ధరలో దగా
-
టీడీపీ నేత దౌర్జన్యం నుంచి రక్షించండి
చిత్తూరు కలెక్టరేట్ : టీడీపీ నేత నుంచి రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా వి.కోట మండలం నడమంత్రం గ్రామానికి చెందిన రైతు చౌడప్ప సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి అధికారులు, సిబ్బంది హతాశులయ్యారు. వెంటనే అక్కడే ఉన్న వైద్య సిబ్బంది రైతుకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనతో బాధితుడి భార్య శ్యామలమ్మ కన్నీరుమున్నీరయ్యారు. తమ గోడును విలేకరుల ఎదుట వెళ్లబోసుకున్నారు.ఆమె కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం నడమంత్రం గ్రామానికి చెందిన చౌడప్ప పేరుతో ఉన్న భూమిని రాసివ్వాలంటూ టీడీపీ నేత కృష్ణమూర్తిగౌడ్ అధికారబలంతో దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. ఇప్పటికే రైతును ఏమార్చి రెండెకరాలు రాయించుకున్నాడు. చౌడప్పకు రెండెకరాల డీకేటీ భూమి ఉండగా అందులో కొంత పక్కవాళ్లకు చెందుతుంది. దీనిని సర్వే చేసి తమకు ఇవ్వాలని ఆన్లైన్లో చౌడప్ప నగదు చెల్లించారు. అయితే టీడీపీ నేత అధికారబలంతో సర్వే సిబ్బందిని రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు.న్యాయం చేయాలని తహసీల్దార్, కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు పదిసార్లు వచి్చనా అధికారులు పట్టించుకోలేదు. చివరిసారిగా సోమవారం మరోమారు అర్జీ ఇద్దామని భార్యతో కలిసి చౌడప్ప వచ్చాడు. అయినా అధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చౌడప్ప కలెక్టర్ ఎదుటే బ్యాగులో తెచ్చుకున్న పురుగుమందు డబ్బా తీసుకుని తాగేశాడు. ప్రస్తుతం చౌడప్ప చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
రైతు పక్షాన 'వైఎస్సార్సీపీ' రణగర్జన
సాక్షి, అమరావతి: యూరియా తీవ్ర కొరత... ఎరువులు రాయితీపై దొరకక వెత.. క్యూలైన్లో నిల్చోలేక వ్యథ.. పంట దెబ్బతింటోందనే బాధ... సాగుకు యాతన పడుతుంటే ఆదుకోకుండా చేతులెత్తేసిన ప్రభుత్వం... దీంతో రైతన్న కదంతొక్కాడు... వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపందుకుని ఉద్యమించాడు... సర్కారు నిర్లక్ష్యంపై ఆక్రోశం వ్యక్తం చేశాడు... రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందాల ఆధ్వర్యంలో జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం సమర్పణ కార్యక్రమం విజయవంతమైంది. ప్రతిచోట పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. నాడు రైతే రాజు.. నేడు కష్టాల సాగు కలెక్టరేట్లలో వినతిపత్రాల సమర్పణ అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ... చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు అన్నదాతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతును రాజుగా చూడాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, విత్తనం మొదలు పంట ఉత్పత్తుల అమ్మకం వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపించిందని పేర్కొన్నారు. కానీ, చంద్రబాబు పాలనలో రైతులు ఎరువులు, పురుగు మందుల కోసం క్యూ లైన్లలో వేచి చూడాల్సి వస్తోందని విమర్శించారు. రాజకీయాల్లో 40 ఏళ్లపైగా అనుభవం ఉందని, సంపద సృష్టించడం తెలుసని మాయమాటలు చెప్పి, ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన చంద్రబాబు, చివరకు రైతులకు సరిపడా యూరియా కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 14 నెలల కాలంలో రాష్ట్రంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటేనే వ్యవసాయ రంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేశారో తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీకి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో అర్జీ అందజేశారు. తక్షణం రైతులకు ఎరువుల సమస్యలు లేకుండా చూడాలని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కోరారు. తిరుపతి కలెక్టరేట్లో భూమన, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు డీఆర్వో నరసింహులుకు వినతిపత్రం ఇచ్చారు. చిత్తూరులో పార్టీ నేతలు కేఆర్జే భరత్ సునీల్కుమార్, విజయాందరెడ్డి కలెక్టర్ సుమిత్ కుమార్ గాం«దీకి వినతిపత్రం అందజేశారు. ⇒ వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలతో కలిసి విజయవాడలో కలెక్టర్ జి.లక్ష్మీశను కలిసి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా మొవ్వలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి, నియోజకవర్గాల ఇన్చార్జ్లు చుండూరు రవిబాబు, దద్దాల నారాయణ కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నాయకులు భీమవరంలోని కలెక్టరేట్కు తరలివెళ్లి ఇన్చార్జి కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఏలూరులో కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్చార్జిలు మేకా ప్రతాప్, కంభం విజయరాజు పాల్గొన్నారు. సాగు అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందించాలని, రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని, లేకుంటే పోరుబాట తప్పదని తూర్పుగోదావరి వైఎస్సార్ సీపీ నాయకులు స్పష్టం చేశారు. కలెక్టర్ పి.ప్రశాంతికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నేతలు జక్కంపూడి రాజా తదితరులు వినతిపత్రం ఇచ్చారు. ⇒ ఎరువులు సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. ఆయన ఆధ్వర్యాన పార్టీ నేతలు వంగా గీత, తోట నరసింహం, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి వినతిపత్రం అందజేశారు. ⇒ రైతు సమస్యలు పరిష్కరించాలని అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. పార్లమెంటరీ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ పాల్గొన్నారు. ⇒ ఖరీఫ్లో వస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు తీసుకుంటున్నారని శ్రీకాకుళం వైఎస్సార్సీపీ నాయకులు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు ఫిర్యాదు చేశారు. విజయనగరంలో కలెక్టర్ అంబేడ్కర్కు జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు కలెక్టరేట్లో వినతిపత్రాలు అందజేశారు. వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు కలెక్టర్ హరేందిరప్రసాద్కు, అనకాపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్కు వినతిపత్రం సమర్పించారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి.తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు కలెక్టరేట్ రెవెన్యూభవన్లో ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు కలెక్టరేట్లో గూడూరు, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జిలు మేరిగ మురళీధర్, ఆనం విజయకుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె పూజితలతో కలిసి జాయింట్ కలెక్టర్ కార్తీక్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అందించినది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ పథకమని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు వై.ఆరంరెడ్డి దుయ్యబట్టారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జేసీకి వినతిపత్రం సమర్పించారు. -
యూరియా కోత.. రైతన్న వెత
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరినాట్లు ఊపందుకున్నాయి. దీంతో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా అవసరమైన మొత్తంలో యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే తీవ్రమైన కొరత నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ విధానంలో ఒక్కొక్కరికి రెండు బస్తాలే ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ ఆగస్టు నెలలో రైతుల అవసరాలు తీరాలంటే కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆ మేరకు యూరియా వస్తేనే గండం గట్టెక్కే అవకాశం ఉంటుందని, లేకపోతే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం వానాకాలం సీజన్కు గాను నెలల వారీగా కేటాయించిన 9.80 ఎల్ఎంటీల యూరియాలో కోత పెట్టడంతోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా..రాష్ట్రానికి కోటాకు మించి ఎరువులు సరఫరా చేశామంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఇది రైతులకు తప్పుడు సంకేతాలను ఇస్తుందని, గ్రామాల్లో యూరియా కోసం ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. చర్చనీయాంశమైన కేంద్రమంత్రి ప్రకటన రాష్ట్రంలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, లోక్సభలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. తెలంగాణకు ఈ ఖరీఫ్ (వానాకాలం) సీజన్లో అవసరమైన 20.30 ఎల్ఎంటీల కన్నా అధికంగా 22.15 ఎల్ఎంటీలు సరఫరా చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. దీంతో బిత్తరపోవడం రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల వంతయ్యింది. వాస్తవానికి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి.. యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్ఎస్పీ ఎరువులు కలిపి 22.15 ఎల్ఎంటీ ఇచ్చినట్లు చెప్పాల్సిన కేంద్ర మంత్రి.. కేవలం యూరియానే 22.15 ఎల్ఎంటీ సరఫరా చేసినట్లుగా చెప్పారని ఓ అధికారి వివరించారు. నిజానికి ఇప్పటివరకు ఇచ్చిన యూరియా 4.50 ఎల్ఎంటీలు మాత్రమేనని చెప్పారు. అసలు లెక్కలేంటి? రాష్ట్రంలో పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ వానాకాలంలో ఏకంగా 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 10.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం ఈ సీజన్కు గాను నెలవారీగా 9.80 ఎల్ఎంటీలు మాత్రమే కేటాయించింది. అదేమంటే యాసంగి సీజన్లో మిగిలిన యూరియా 1.92 ఎల్ఎంటీ గోదాముల్లో ఉందని, దాన్ని వినియోగించుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సమాచారం మేరకు.. ఏప్రిల్ నుంచి జూలై వరకు కేంద్రం 6.60 ఎల్ఎంటీల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 4.50 ఎల్ఎంటీలే వచ్చింది. అంటే 2.10 ఎల్ఎంటీ (32 శాతం) తక్కువగా వచ్చిందన్న మాట. దీనికి రాష్ట్రం వద్ద ప్రారంభ నిల్వ కింద ఉన్న యూరియా 1.92 ఎల్ఎంటీలు కలిపితే మొత్తం 6.42 ఎల్ఎంటీలు అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. ఇందులో సుమారు 5.20 ఎల్ఎంటీలు ఇప్పటికే రైతులకు విక్రయించగా.. 1.20 ఎల్ఎంటీల పైచిలుకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. 2 ఎల్ఎంటీలైనా వస్తేనే.. ఈ సీజన్లో రాష్ట్రానికి కేటాయించిన 9.80 ఎల్ఎంటీలకు గాను జూలై వరకు 4.50 ఎల్ఎంటీలు సరఫరా చేసిన నేపథ్యంలో ఇంకా 5.30 ఎల్ఎంటీల యూరియా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల్లో కోత విధించిన 2.10 ఎల్ఎంటీలతో పాటు ఆగస్టు కోటా 1.70 ఎల్ఎంటీలు కలిపి ఈ నెలలో సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. కాగా ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో అధికారులు సమావేశమై యూరియా కొరత పరిస్థితిని సమీక్షించారు. ఆగస్టులో కనీసం 2 ఎల్ఎంటీల యూరియా అయినా వస్తేనే ప్రస్తుతానికి గట్టెక్కే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తాజాగా కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్కు లేఖ రాశారు. రాష్ట్రానికి యూరియా కేటాయింపులు, ఇప్పటివరకు కేంద్రం నుంచి వాస్తవంగా వచ్చిన యూరియా వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలో కొరతను దృష్టిలో పెట్టుకుని తక్షణమే అవసరమైన యూరియాను పంపించాలని విజ్ఞప్తి చేశారు. -
Big Question: సుఖీభవకు కొత.. అన్నదాతకు వాత..
-
చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు.. ఉండబోదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/దర్శి : ‘చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు.. ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్..’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయట పెట్టారు. రైతులంటే తనకు ఎంత చిన్నచూపో మరోమారు స్పష్టం చేశారు. గతంలో ఉచిత విద్యుత్ ఇస్తానన్న వైఎస్ రాజశేఖరరెడ్డి మాటలను తప్పుపట్టి.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు, వ్యవసాయం దండగ.. రైతులు మరో పని చూసుకోవాలని కూడా చెప్పిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో శనివారం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. అన్నదాతల పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. ఈ పథకం కింద రూ.5 వేలు వేస్తూ రూ.7 వేలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాను చూసుకోండి తమ్ముళ్లూ.. అనటంతో రైతులు అవాక్కయ్యారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.85 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.3,174 కోట్ల నగదు జమ చేశానని చెప్పారు.కరోనా సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే చంద్రబాబు మాత్రం తన ప్రసంగంలో ‘తుపాను వచ్చినా, నష్టపోయినా, ఏ రైతూ వ్యవసాయం మానలేదు. భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు లాక్డౌన్ ఇచ్చాం. కానీ రైతులకు మాత్రం లాక్ డౌన్ లేకుండా చేశాను’ అని చెప్పడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. గత ఏడాది పంటలకు ఉచిత పంటల బీమాను ఇవ్వకపోయినా, ఇచ్చామని మరో అబద్ధం చెప్పారు. దేశంలో డ్రిప్ ఇరిగేషన్ను తానే ప్రవేశ పెట్టానని చెప్పుకొచ్చారు.సీఎం ప్రసంగంలో ఎక్కువ భాగం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కార్యకర్తలను సైతం రెచ్చగొట్టారు. ఇచ్చిన హామీల గురించి మాట్లాడే ప్రయత్నమే చేయలేదు. తనను ఆశీర్వదించాలని పదే పదే అడిగారు. సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాశారని మండిపడ్డారు. మీరు సాక్షి పేపర్ చూస్తారా? అని ప్రశి్నంచారు. ముఖం చాటేసిన రైతులు రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి వీరాయపాలెం గ్రామంలోని రైతులు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. సభా ప్రాంగణంలో ఎటువంటి టెంట్లు వేయలేదు. నులక, నవారు మంచాలు వేయించి వచ్చిన కొద్దిమంది రైతులను పొలంలో ఎర్రటి ఎండలో వాటిపైనే కూర్చోబెట్టారు. ప్రాంగణంలోకి రైతులు మాత్రమే వెళ్లాలని నిబంధనలు పెట్టారు. సామాన్య రైతులు రాక పోవడంతో ప్రాంగణం వెలవెలబోయింది. దీంతో కార్యకర్తలు పసుపు కండువాలు తీసేసి ఆకు పచ్చ కండువాలు వేసుకుని మంచాలపై కూర్చున్నారు.ఉదయం 10 గంటల నుంచి చంద్రబాబు సభ అయిపోయే వరకు ఎండ వేడిమి భరించలేక వచ్చిన వారిలో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయారు. చంద్రబాబు మాట్లాడుతుండగా కొందరు కార్యకర్తలు మంచాల పైకెక్కి వాటిని విరగ్గొట్టారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఎల్ఈడీ ద్వారా చాలా సేపు చూపించారు. ఎండ వేడిమికి తాళలేక చాలా మంది సొమ్మసిల్లి పోయే పరిస్థితిలో చంద్రబాబు మాట్లాడటం మొదలు పెట్టారు. సభను రక్తి కట్టించేందుకు ఆ ప్రాంగణం అంతా అధికారులు, టీడీపీ నాయకులు హంగామా చేశారు. చంద్రబాబు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. సీఎం ప్రసంగం పూర్తి కాకముందే వెనుక భాగంలోని మంచాలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఇంతటి అట్టర్ ఫ్లాప్ షో ఎప్పుడూ చూడలేదని టీడీపీ కార్యకర్తలే మాట్లాడుకోవడం కనిపించింది. అసంతృప్తితో బాబు తిరుగు ప్రయాణం చంద్రబాబు తన సభను రక్తి కట్టించాలని ఎంత ప్రయత్నించినా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో అసంతృప్తితో వెనుతిరిగారు. సభ పూర్తయిన తర్వాత ఏసీ బస్లోకి ఎక్కిన బాబు.. అరగంటకు పైగా లోపలే కూర్చుండిపోయారు. ‘సీఎం బస్సు దిగి కిందకు వస్తారు.. వరి నాట్లు వేస్తారు’ అని అధికారులు సభా ప్రాంగణం ముందు నాట్లు వేయించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే డ్రోన్ కెమెరాలు ప్రారంభించే కార్యక్రమంలోనూ సీఎం పాల్గొనలేదు. ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం కూడా రద్దు చేసుకుని వెళ్లిపోయారు.కాగా, తూర్పు వీరాయపాలెం గ్రామంలోని ఇళ్లల్లో ఉన్న మంచాలన్నీ చంద్రబాబు కార్యక్రమానికి తరలించారు. ఈ కార్యక్రమానికి అరకొరగా హాజరైన వారిలో అధికారులు, ఉద్యోగులు 80 శాతం, రైతులు.. ప్రజలు 20 శాతం ఉన్నారు. వీరిలో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయారు. ‘నేను మీ కోసం ఇంతటి ఎండలో ఉన్నాను.. మరి మీరు ఉండరా..’ అని చంద్రబాబు అడిగినా ఎవరూ వినిపించుకోలేదు. కార్యక్రమం ముగిశాక విరిగిపోయిన మంచాలను చూసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగున్న వాటిని ఎవరివి వాళ్లు తీసుకెళ్లారు. -
చంద్రబాబు ఉన్నంతవరకు రైతులకు భరోసా లేదు: చంద్రబాబు
-
చంద్రబాబు ప్రభుత్వం సుఖీభవకు కోత.. అన్నదాతకు వాత
-
సుఖీభవకు కోత.. అన్నదాతకు వాత
సాక్షి, అమరావతి: హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా ఎగ్గొట్టడం.. ఒకటీ అరా అరకొరగా అమలు చేసి అంతా చేసేశామని చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రమే సాధ్యమని రాష్ట్రంలో విస్తృత చర్చ నడుస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇటీవల తల్లికి వందనం పథకమైనా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకమైనా కోతల మయమేనని స్పష్టమవుతోంది. అధికారంలోకి రాగానే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏటా ప్రతీ రైతుకు తామే రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు, లోకేశ్ సహా కూటమి నేతలంతా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సొమ్ము రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే సాయం అంటూ నాలుక మడతేశారు. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది అమలుకు సవాలక్ష ఆంక్షలతో లబ్ధిదారుల్లో కోతలు విధిస్తూ ఆపసోపాలు పడుతోంది. అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం రూ.5 వేలు పీఎం కిసాన్ 20వ విడత సాయం రూ.2 వేలతో కలిపి శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హామీకి తూట్లుఎన్నికల హామీ మేరకు పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు ఏటా రూ.26 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఆ లెక్కన 2023–24లో అర్హత పొందిన 53.58 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,716 కోట్లు అవసరం. కానీ 2024–25లో ఇదిగో.. అదిగో అంటూ తొలి ఏడాది ఇవ్వాల్సిన రూ.10,716 కోట్ల పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది. గతేడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది రూ.21,432 కోట్లు జమ చేస్తుందని రైతులు భావించారు. ఆ మేరకు బడ్జెట్ కేటాయిస్తుందని భావించారు. కనీసం ఈ ఏడాది రూ.20 వేలు చొప్పున ఇవ్వాలన్నా రూ.10,716 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. కానీ 2025–26 బడ్జెట్లో ఈ పథకానికి కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టింది. దీంతో వడపోత అనంతరం 46.86 లక్షల మందిని అర్హులుగా తేల్చింది. అంటే వైఎస్సార్సీపీ హయాంతో పోల్చుకుంటే 6.72 లక్షల మందికి కోత పెట్టారు. కాగా, అర్హత పొందిన వారికి పీఎం కిసాన్ కింద రూ.2 వేల చొప్పున రూ.831.51 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లు కలిపి రూ.3,174.43 కోట్లు తొలి విడత సాయం జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. పైగా ఎన్నికల హామీకి విరుద్ధంగా మూడు విడతల్లో జమ చేస్తామని చెప్పింది. తొలి విడత సాయం ఏప్రిల్లో, మే లో అంటూ తుదకు ఆగస్టులో అరకొరగా అదీ పీఎం కిసాన్తో ముడిపెట్టి నేడు జమ చేసేందుకు సన్నద్ధమైంది. కాగా, స్థానిక ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రాంతాల్లో కేవలం పీఎం కిసాన్ సొమ్ము మాత్రమే జమ అవుతుంది. అన్నదాత సుఖీభవ సొమ్మును ఎన్నికల కోడ్ ముగిశాక ఇస్తారు.కౌలు రైతులకు ఇస్తారో.. ఇవ్వరో..భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనర్టీ కౌలుదారులకు 2019–23 మధ్య ఏటా వైఎస్ జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించేది. ఏటా సగటున 1.64 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. సామాజిక వర్గాలకు అతీతంగా వాస్తవ సాగు దారులైన కౌలు రైతులందరికీ భూ యజమానులతో పాటు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి పెద్దలు ఎన్నికల్లో గొప్పగా ప్రకటించారు. ఆచరణకు వచ్చేసరికి సీసీఆర్సీ కార్డులతో పాటు ఈ పంట నమోదు తప్పనిసరి అని మెలిక పెట్టారు. ఏటా ఏప్రిల్–మే నెలల్లోనే ప్రత్యేక మేళాల ద్వారా సీసీఆర్సీ కార్డులు జారీ చేసేవారు. కానీ ఈ ఏడాది జూన్ మూడో వారంలో కానీ ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది 10 లక్షల కార్డుల జారీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3 లక్షల మందికి మించి కార్డులివ్వలేదు. సీసీఆర్సీ కార్డుల జారీ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో? ఎప్పుడు సాయం అందిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదేళ్లూ క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం తాము అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తామని 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి రాగానే అన్నదాతలను మరింత ఉదారంగా ఆదుకోవాలన్న సంకల్పంతో హామీ కంటే మిన్నగా రూ,12,500కు బదులు రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని ప్రకటించారు. ఆ మేరకు తొలి ఏడాది నుంచి రూ,13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో ఏటా సగటున 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు సాయం చేశారు. భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సొంతంగా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులందరికీ పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచారు. ఏటా 1.64 లక్షల మంది కౌలుదారులతో పాటు 94 వేల మంది అటవీ సాగుదారులకు కూడా పెట్టుబడి సాయం అందించి తన పెద్దమనసును చాటుకున్నారు. నాడు వెబ్ల్యాండ్ పరిధిలో లేని వారితో పాటు వివిధ కారణాలతో ఈకేవైసీ చేయించుకోలేని వారు, ఈ కేవైసీ రిజక్ట్ అయిన వారు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ వారు, తప్పుడు ఆధార్ సీడింగ్ అయిన వారు, కుటుంబంలో పన్ను చెల్లింపుదారులున్న సాగుదారులు, చనిపోయిన వారి కుటుంబాలలో నామినీలకు.. ఇలా అర్హత ఉన్న ప్రతి రైతుకూ వైఎస్సార్ రైతు భరోసా లబ్ధి చేకూర్చారు. -
చెప్పినట్టు వినకపోతే... ట్రాక్టర్లతో తొక్కి చంపేస్తాం
పొదిలి రూరల్: అధికార మదంతో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. పట్టా భూముల్లో సాగు చేసిన కంది పంటను దౌర్జన్యంగా ట్రాక్టర్తో ధ్వంసం చేసి దున్నేశారు. ఇది తమ ప్రభుత్వమని, చెప్పినట్టు వినకపోతే ట్రాక్టర్లుతో తొక్కి చంపేస్తాం అని బెదిరించారు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని అన్నవరం గ్రామ పరిధి సర్వే నంబరు 75లో 40 ఎకరాల బీడు భూమి ఉంది. గ్రామ పెద్దలు ఆ భూమిని రెండు భాగాలుగా విడగొట్టి 20 ఎకరాలు వైఎస్సార్సీపీ వారికి, మరో 20 ఎకరాలు టీడీపీ వాళ్లకు సమానంగా పంచి ఇద్దరికి ఒప్పందం చేసి సాగు చేసుకోమన్నారు. 2018లో ఆ భూమికి వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన 16 మంది రైతులకు అధికారులు పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చారు. సర్వేనంబరు 75లో కొత్తపులి రమణమ్మ, కొత్తపులి రమణయ్య, కొత్తపులి నాగిరెడ్డి, కొత్తపులి వెంకటేశ్వర్లు, కొత్తపులి కోటిరెడ్డి, లక్కు వెంకట లక్షి్మ, కొత్తపులి పరమేశ్వరమ్మ, కొత్తపులి సులోచన, కొత్తపులి ఓబులురెడ్డి(ఓబులేసు), కొత్తపులి నాగిరెడ్డి, కొత్తపులి ఓబులురెడ్డి (అచ్చిరెడ్డి), కొత్తపులి పెదవెంకటేశ్వర్లు, కొత్తపులి రమణమ్మ (మాలకొండయ్య), పులిబాల కోటిరెడ్డి, కొత్తపులి ఓబులురెడ్డి (ఓబులురెడ్డి), ఇతరులు ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత కొందరు టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై తమకూ ఈ భూముల్లో వాటా ఉందంటూ దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం టీడీపీకి చెందిన పులి చిన నాగిరెడ్డి, వెన్నపూస చిన సుబ్బారెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి, యర్రంరెడ్డి రమణయ్య, యర్రంరెడ్డి నాగిరెడ్డి, దమ్మిడి చెన్నయ్య ట్రాక్టర్లుతో వచ్చి సర్వేనంబరు 75లో మాకు ఇంకా 10 ఎకరాల భూమి ఉందంటూ వాదనకు దిగారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వారి పట్టా భూముల్లో కొత్తపులి వెంకటరెడ్డి సాగు చేసుకున్న 4 ఎకరాల కంది పంటను నాశనం చేశారు. విషయం తెలుసుకున్న ఈసర్వే నంబరులోని మిగిలిన రైతులు అక్కడికి వచ్చారు. తమ భూమిని ఆక్రమించుకొని టీడీపీ వర్గీయులు భయభ్రాంతులకు గురి చేశారని, అడ్డం వచి్చన వాళ్లను చంపేస్తామని బెదిరించి అసభ్యంగా దూషించినట్టు బాధిత రైతులు వాపోయారు. తమకు పట్టాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
పొగాకు రైతుకు దగా
నల్లబర్లీ పొగాకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం నయవంచనకు గురిచేస్తోంది. మిర్చి రైతుల మాదిరిగానే వీరిని కూడా ముంచేస్తోంది. రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు టన్ను రూ.12 వేల చొప్పున కొనుగోలు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించిన టీడీపీ కూటమి సర్కారు.. కొనుగోలు దగ్గరకొచ్చేసరికి సవాలక్ష ఆంక్షలతో వారిని దగా చేస్తోంది. ఓ వైపు కొనుగోలు చేయకుండా కంపెనీలు ముఖం చాటేస్తుంటే.. మరోవైపు ఆంక్షల పేరిట ప్రభుత్వం మోసం చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారి నుంచి మాత్రమే కొనుగోళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. మిగిలిన సామాన్య రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. పైగా.. కొనుగోలు చేసిన పొగాకు సేకరించి 45 రోజులు అవుతున్నా ఎవరికీ ఒక్క పైసా కూడా చెల్లించలేదని వారు గగ్గోలు పెడుతున్నారు. – సాక్షి, అమరావతిజగన్ పర్యటనతో కదిలిన ప్రభుత్వం..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంచి ధరలు లభించడంతో పాటు కంపెనీలు ఇచ్చిన భరోసాతో రైతులు గత రబీ సీజన్లో పెద్దఎత్తున నల్లబర్లీ పొగాకు (హెచ్డీ బర్లీ) సాగుచేశారు. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. వరుస వైపరీత్యాల ఫలితంగా ఎకరాకు 10–12 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. మొత్తం మీద గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో 20 వేల మంది రైతులు 91వేల ఎకరాల్లో నల్లబర్లి సాగుచేయగా, ఎకరాకు 879 కేజీల చొప్పున 80 వేల టన్నుల దిగుబడులొచ్చాయి.అయితే, ఐడీ నంబర్లు ఇచ్చి దగ్గరుండి సాగుచేయించిన కంపెనీలు పంట చేతికొచ్చే సమయానికి డిమాండ్ లేదంటూ ముఖం చాటేశాయి. ఆదుకోవాలి్సన ప్రభుత్వం పత్తాలేకుండా పోవడంతో అప్పుల పాలైన రైతులు పెద్దఎత్తున బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలిలో పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు వెళ్లిన తర్వాత ప్రభుత్వంలో కదిలిక వచ్చింది. కంపెనీలు 27 వేల టన్నులు సేకరించాయి. మిగిలిన నిల్వల్లో 33 వేల టన్నులను కంపెనీల ద్వారా.. 20 వేల టన్నులను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.ఆంక్షలతో చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం..మరోవైపు.. రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 20 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయబోమని ప్లేటు ఫిరాయించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తారు. గరిష్టంగా ఐదెకరాలు లేదా 10 ఎకరాల పరిధిలోని రైతుల వద్ద పంట నిల్వలు కొనుగోలు చేయాలి.ఈ లెక్కన.. ఐదెకరాల్లోపు చిన్న రైతు దగ్గర సైతం దాదాపు 60 టన్నులకు తక్కువ కాకుండా పొగాకు నిల్వలుంటాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం పెట్టిన నిబంధనల పుణ్యమాని 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగిలిన 40 క్వింటాళ్లను అమ్ముకునేందుకు ఆ రైతు ఎక్కడకు వెళ్లాలి? అలాగని ఆ మిగిలిన నిల్వలను కంపెనీలతో కొనుగోలు చేయిస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో.. కళ్లాల్లోనూ, రైతుల ఇళ్ల వద్ద పొగాకు నిల్వలు పేరుకుపోయాయి. దీనికితోడు.. ఇటీవల కురుస్తున్న వర్షాలవల్ల వాటిని భద్రపర్చుకునేందుకు రైతులకు అదనంగా ఎకరాకు రూ.4వేలకు పైగా ఖర్చవుతోంది.పైసా విదల్చని ప్రభుత్వం..ఇక నాణ్యతతో సంబంధంలేకుండా టన్ను రూ.12వేలకు కొంటామని ముందుగా చెప్పిన ప్రభుత్వం.. చివరికి హై క్వాలిటీ (హెచ్డీఆర్) పొగాకును క్వింటా రూ.10 వేలు–12 వేలు ఇస్తామని, మీడియం క్వాలిటీ (హెడ్డీఎం) పొగాకును రూ.7 వేలు–9 వేలు, లో క్వాలిటీ (హెచ్డీఎక్స్) పొగాకు రూ.4 వేలు–6 వేలకు మించి కొనుగోలు చేయలేమని మెలికపెట్టింది. అయితే, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 6,455 టన్నులు మాత్రమే సేకరించగా, కంపెనీలు మరో 5,550 టన్నులు సేకరించాయి. ఇంకా రైతుల వద్ద 41వేల టన్నుల పొగాకు నిల్వలున్నాయి.కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన పొగాకులో 832.80 టన్నులు హై క్వాలిటీ (12.9 శాతం), 2,944.24 టన్నులు మీడియం క్వాలిటీ (45.6 శాతం), 2,678.53 టన్నుల లో క్వాలిటీ (41.5 శాతం) చొప్పున గ్రేడింగ్ నమోదుచేశారు. పైగా.. దాదాపు 20 వేల మంది రైతులుండగా, ఇప్పటివరకు కేవలం 2,767 మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేశారు. వీరిలో ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా జమచేసిన పాపాన పోలేదు. పొగాకు కొనుగోలుకు జాతీయ çసహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ.209 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి (పీఎస్ఎఫ్) నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని మార్క్ఫెడ్ అభ్యర్థనను సైతం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం మాయమాటలకు మోసపోయామని రైతులు వాపోతున్నారు.రూ.4 లక్షలు నష్టపోయాను..సొంతంగా మూడెకరాలు, మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని రెండేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. గతేడాది మంచిధర లభించడంతో ఈ ఏడాది పొగాకు సాగుచేశా. మా గ్రామంలో 80 మంది రైతులు నమోదుచేసుకున్నారు. 20 మంది దగ్గర కూడా కొనలేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి నుంచే కొనుగోలు చేస్తున్నారు. నా దగ్గర 40 క్వింటాళ్ల పొగాకు ఉంది. పేరుకు 20 క్వింటాళ్లంటున్నారు. అదీ కూడా కొనుగోలు చేయలేదు. కొన్న వాళ్లకు పైసా కూడా జమచేయలేదు. ఈ ఏడాది రూ.4 లక్షల నష్టపోయాను. –అవినాష్, వంకాయలపాడు, బాపట్ల జిల్లాఅనుకూలురైన వారి నుంచే కొనుగోళ్లు..ఈ ఏడాది కౌలుకు 18 ఎకరాలు తీసుకుని నల్లబర్లి పొగాకు వేశా. ఇప్పటివరకు ఎకరాకు లక్షన్నర ఖర్చయ్యింది. పేరుకు 20 చెక్లు (20 క్వింటాళ్లు) మించి తీసుకోమంటున్నారు. నా దగ్గర ఇంకా 100 క్వింటాళ్లకు పైగా ఉంది. నమోదు చేశారే తప్ప కొనుగోలు చేయడంలేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి నుంచి మాత్రమే కొనుగోలు చేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. కనీసం ఒక్కో రైతు నుంచి 40 చెక్లకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి. –గెద్దల రవి,ఇంకొల్లు, బాపట్ల జిల్లా -
కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే..
-
Karedu Farmers: ప్రాణాలైనా ఇస్తాం కానీ సెంటు భూమిని కూడా వదులుకొం
-
రైతుకు 2 బస్తాలే..
సాక్షి, హైదరాబాద్: ఎంతో విరామం తర్వాత కురుస్తున్న వర్షాలను చూసి వ్యవసాయ పనులను వేగవంతం చేయాలని ఆశపడిన రైతులను యూరియా కొరత తీవ్ర నిరాశలోకి నెడుతోంది. యూరియాను రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్)లలో అందుబాటులో ఉంచినప్పటికీ, రైతులకు రేషన్ విధానంలో సరఫరా చేస్తున్నారు. ఆధార్ కార్డు, భూమి పట్టా పాస్ పుస్తకాలను బట్టి ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సొంత జిల్లా ఖమ్మంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్తో లింకై ఉన్న ఫోన్ నంబర్కు ఓటీపీ పంపి నిర్ధారణ చేసుకొని మరీ యూరియా అందజేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చింది వచ్చినట్లు సరఫరా.. కేంద్ర ప్రభుత్వం వానాకాలం కోసం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది. ఇందులో ఏప్రిల్ నుంచి జూలై వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావలసి ఉండగా, ఇప్పటివరకు 4.23 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. అంటే 36 శాతం లోటు ఉంది. ఈ నేపథ్యంలో గోదాములకు వచ్చిన స్టాక్ ఎప్పటికప్పుడు ఊడ్చినట్లు అయిపోతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ స్టాక్ ప్రస్తుత నెల వరకు కష్టంగా సరిపోయే అవకాశం ఉంది. ఆగస్టులో అత్యధికంగా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ చెబుతోంది. జూలై కోటాలో లోటుగా ఉన్న 44 వేల మెట్రిక్ టన్నులతోపాటు ఆగస్టులో రావలసిన 1.20 లక్షల మెట్రిక్ టన్నులను వెంటనే విడుదల చేస్తే ఇప్పుడున్న స్టాక్తో బొటాబొటిగా సరిపుచ్చుకునే అవకాశం ఉంది. లేదంటే తీవ్ర సమస్యలు ఎదురవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కోసం శనివారం మరోసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఎంత పొలం ఉన్నా రెండు బస్తాలే ఖమ్మం జిల్లాకు 7,500 మెట్రిక్ టన్నుల యూరియా ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉండగా 4,500 మెట్రిక్ టన్నులే అందించారు. ఒక రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నా రెండు బస్తాలే ఇస్తున్నారు. ఒక ఎకరం ఉంటే ఒక బస్తానే ఇస్తున్నారు. అది కూడా రైతు ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ చెపితేనే ఇస్తున్నారు. దీనికోసం రైతులు పొలాలు వదిలి క్యూ లైన్లో నిలబెడుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. – బొంతు రాంబాబు, రైతు సంఘం నాయకుడు యూరియా లభ్యతను బట్టి రైతులకు పంపిణీ సొసైటీకి వచ్చే యూరియా లోడ్ను బట్టి రైతులకు సరఫరా చేస్తున్నాం. ఆధార్ కార్డు ఆధారంగా ఒక రైతుకు రెండు బస్తాల చొప్పున పంట కాలంలో మూడు సార్లు ఇస్తాం. రైతుకు రెండు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే ఉన్న స్టాక్ ఆధారంగా పంపిణీ చేస్తున్నాం. రైతులు అర్థం చేసుకుంటున్నారు. – జూపల్లి సందీప్రావు, పీఏసీఎస్ చైర్మన్, గర్రెపల్లి, పెద్దపల్లి జిల్లా -
చంద్రబాబుకు అమరావతి రైతులు షాక్.. సెంటు భూమి కూడా ఇవ్వం
-
ఎరువుల్లేక ఎదురుచూపులు..
సాక్షి, వీరఘట్టం, సరుబుజ్జిలి, నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఆర్బీకేల ద్వారా ఎరువులు సకాలంలో అందేవి. నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వంలో రైతులను ఎరువుల కష్టాలు వీడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఉన్న కొద్దిపాటి నిల్వలను సైతం పక్కదారి పట్టించేందుకు అధికారం అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రైతులకు పంపిణీ చేసే యూరియా కూడా తమకే కావాలంటూ దౌర్జన్యం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలంలోని కిమ్మి రైతు సేవా కేంద్రానికి బుధవారం 440 బస్తాల యూరియా వచ్చింది. ఇదే ఆర్ఎస్కే పరిధిలో ఉన్న కొట్టుగమ్మడకి చెందిన ఉదయ్ అనే టీడీపీ నాయకుడు తన అనుచరులతో ఆర్ఎస్కేకు వచ్చి 200 బస్తాల యూరియాను దౌర్జన్యంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. గోదాంలో ఉన్న యూరియాను రెండు ట్రాక్టర్లలో లోడ్ చేసి తరలించేందుకు పన్నాగం పన్నాడు. విషయాన్ని గమనించిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యూరియా తరలింపును అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం లారీతో వచ్చిన యూరియాను ఆర్ఎస్కే గోదాంలో అన్లోడ్ చేసి, స్టాక్ వివరాలను రికార్డుల్లో నమోదు చేసి, ఆ తర్వాత రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నిబంధనలను పక్కన పెట్టి, వచ్చిన యూరియాలో సగం యూరియాను తీసుకువెళ్లిపోతామంటే కుదరదని మండల వ్యవసాయ శాఖ అధికారిణి జె.సౌజన్య తేల్చి చెప్పారు. దీంతో కిమ్మి ఆర్ఎస్కే వద్ద టీడీపీ నేత అనుచరులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పి, ఆందోళనను విరమింపజేశారు. సహకార సొసైటీ ముట్టడి..ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న, కంది పంటలకు యూరియా వేసేందుకు నంద్యాల జిల్లా నందికొట్కూరులోని రైతు సేవా కేంద్రాల వద్దకు, సహకార సొసైటీ కార్యాలయాల వద్దకు వెళ్లిన రైతన్నలకు నిరాశ ఎదురు కావడంతో బుధవారం ఆందోళనకు దిగారు. పట్టణంతో పాటు బిజినవేముల, మల్యాల రైతులు యూరియా కోసం తరలివచ్చారు. స్టాక్ లేకపోవడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఇవాళ, రేపు అంటూ ఎందుకు తిప్పుకుంటున్నారని రైతులు ఉపేంద్రారెడ్డి, మహబూబ్బాషా, స్వాములు అధికారులను నిలదీశారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా కూటమి ప్రభుత్వం యూరియా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై దాడి..శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయంలో 245 బస్తాల యూరియాను పంపిణీ చేస్తామని ముందస్తుగా చెప్పడంతో రైతులు బుధవారం సచివాలయం వద్దకు చేరుకున్నారు. గంటలపాటు వేచి చూసినా పంపిణీ జరగకపోవడంతో ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ మండల బూత్ కమిటీ కన్వీనర్ ఎం.రమణ అధికారులను ప్రశ్నించగా.. కొందరు అనధికార వ్యక్తులు స్పందిస్తూ తమకు ఇష్టం వచ్చిన సమయంలో పంపిణీ చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో రైతులు వారితో వాగ్వాదానికి దిగి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు.పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను చెదరగొట్టారు. ఈ సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ బూత్ కమిటీ కన్వీనర్ రమణ పట్ల దురుసుగా వ్యవహరించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో యూరియా పంపిణీ నిలిచిపోయింది.