breaking news
Farmers
-
పోషకాల దుర్వినియోగంతో ముప్పు! రైతులకు ఎఫ్ఏఓ హెచ్చరిక!
రైతుల పొలాల్లో పోషకాల అసమతుల్యత లేదా దుర్వినియోగం వల్ల నేల సారం క్రమంగా క్షీణిస్తోంది. అవసరం ఎంతో తెలుసుకోకుండా కొన్ని ఎరువులను ఎక్కువ ఎవయ్యటం, కొన్నిటిని తక్కువ వెయ్యటం సమస్య. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) రూపొందించిన ‘స్టేటస్ ఆఫ్ ది వరల్డ్స్ సాయిల్ రిసోర్సెస్’ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన సమస్యల్లో మొదటిది: ‘నీరు, గాలి వల్ల పైపొర మట్టి కొట్టుకుపోవటం’. రెండోది: ‘నేలలోని సహజ సేంద్రియ పదార్థం, సారం తగ్గిపోవటం’. ‘పోషకాల నిర్వహణ లోపం లేదా దుర్వినియోగం’ (న్యూట్రియంట్ మిస్మేనేజ్మెంట్) మూడో అతిపెద్ద ముప్పుగా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా 63 శాతం ప్రాంతాలు, ఉప్రపాంతాలు పోషకాల దుర్వినియోగాన్ని అరికట్టే స్థానికంగా అవసరమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించటంలో దారుణంగా విఫలమవుతున్నాయని ఎఫ్ఏఓ నివేదిక ఎత్తిచూపింది. 50 శాతం ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడకపోగా క్షీణిస్తున్నాయని పేర్కొంది. ఉత్తర అమెరికాలో మాత్రమే మాత్రమే పోషకాల దుర్వినియోగాన్ని అరికట్టే పద్ధతుల అమలులో మెరుగ్గా ఉందని ఎఫ్ఏఓ తెలిపింది.రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలునేలలో పోషకాల అసమతుల్యతకు సంబంధించి ఎఫ్ఏఓ నివేదికలో మూడు ముఖ్య అంశాలను ప్రస్తావించింది:1. పోషకాల కొరత (న్యూట్రియెంట్ మైనింగ్): పంటల ద్వారా గ్రహించే లేదా నేల నుంచి ఆహారోత్పత్తుల ద్వారా మనం పొందే పోషకాల కంటే నేలకు తక్కువ మోతాదులోనే ఎరువులను అందించటం. దీనివల్ల కాలక్రమేణా నేలలోని సహజ పోషక నిల్వలు, సేంద్రియ పదార్థం పూర్తిగా తగ్గిపోతాయి.2. ఎరువుల అధిక వినియోగం (న్యూట్రియెంట్ ఎక్సెస్): పంటకు అవసరమైన దానికంటే ఎక్కువగా నత్రజని, భాస్వరం ఎరువులు వేయటం. మితిమీరిన ఈ రసాయనాలు కాలువలు, భూగర్భ జలాల్లో చేరి నీటిని కలుషితం చేస్తున్నాయి. నైట్రేట్లు మానవ ఆరోగ్యానికి ముప్పుగా మారుతుండగా, నత్రజని అధిక వాడకం వల్ల ప్రమాదకర వాయువులైన నైట్రస్ ఆక్సైడ్, అమ్మోనియా విడుదలై వాతావరణం దెబ్బతింటోంది.3. నేల ఆమ్లీకరణ (సాయిల్ అసిడిఫికేషన్): ఆమ్ల గుణం కలిగిన రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల నేలలో ఆమ్లతత్వం పెరిగి, నేలలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి నేల సారం నాశనమవుతోంది.భారత్, దక్షిణాసియా దేశాల్లో పరిస్థితిదక్షిణాసియా ప్రాంతంలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో పంటలకు అవసరానికి మించి నత్రజని, భాస్వరం ఎరువులను వేస్తున్నట్లు ఎఫ్ఏఓ నివేదిక వెల్లడించింది. మరోవైపు, పంట కోతల అనంతరం మిగిలిన పంట వ్యర్థాలను (వరి గడ్డి, చొప్ప, పత్తి కట్టె, కంది కట్టె వంటివి ) పొలం మట్టిలో తిరిగి కలిసేలా చెయ్యకుండా పూర్తిగా తొలగించటం వల్ల నేలలో పొటాషియం వంటి పోషకాలు వేగంగా తరిగిపోతున్నాయి.భవిష్యత్తుపై ప్రభావం.. నివారణ మార్గాలుపోషకాల అసమతుల్యత వల్ల వ్యవసాయం అస్తవ్యస్తమవుతుంది. అంతేకాదు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన ‘ఆకలి నిర్మూలన’, ‘మంచి ఆరోగ్యం’, ‘స్వచ్ఛమైన నీరు’, ‘వాతావరణ పరిరక్షణ చర్యలు’, ‘భూమిపై జీవవైవిధ్యం’ దెబ్బతింటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 63 శాతం ప్రాంతాల్లో స్థిరమైన నేల నిర్వహణ పద్ధతుల అమలు చాలా నాసిరకంగా ఉంది.రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వేయటం ఆపాలి. పంట అవసరాన్ని బట్టి కచ్చితమైన మోతాదులో ఎరువులు అందించే ‘సైట్–స్పెసిఫిక్ న్యూట్రియెంట్ మేనేజ్మెంట్’ (ఎస్ఎస్ఎన్ఎం), భూసార పరీక్షలు, సేంద్రియ ఎరువుల వాడకం, పంట వ్యర్థాల పునర్వినియోగం వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చెయ్యటం ద్వారానే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నివేదిక స్పష్టం చేస్తోంది.మన దేశంలోనూ దుర్వినియోగమే!భారత వ్యవసాయ రంగంలో పోషకాల దుర్వినియోగం తీవ్రంగా ఉంది. భారతదేశం సహా దక్షిణాసియా ప్రాంతంలో ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టే సుస్థిర వ్యవసాయ పద్ధతుల అమలు సరిగ్గా లేకపోవటంతో నేల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక హెచ్చరించింది. ప్రధానంగా రెండు విరుద్ధ సమస్యలతో భారతీయ వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.భారతదేశంలో రైతులు పంటల అవసరానికి మించి నత్రజని, భాస్వరం ఎరువులను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల ఎరువులు వృథా అవ్వడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితం కావటం, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు, అమ్మోనియా విడుదల కావటం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతోంది.పంట కోతల అనంతరం మిగిలిన పంట వ్యర్థాలను పొలం నుంచి పూర్తిగా తొలగించటం వల్ల నేలలో సహజంగా ఉండే పొటాషియం నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి.- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ఇవి కూడా చదవండి: అమెరికా ఉద్యోగాన్ని కాదని వ్యవసాయం..! ఏకంగా ఆరుసార్లు దివాళ అంచుకు.. -
కరువు డేంజర్ బెల్స్ మోగుతున్నా స్పందించని బాబు..
-
నార్లు ఎండుతున్నా.. చంద్రబాబు ధ్యాసంతా వాటి మీదే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నార్లు ఎండిపోతున్నా రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా దాన్ని గుర్తించేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదని అన్నారు. జూన్, జులైలోనే 52 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయని వైఎస్ జగన్ వెల్లడించారు.బుధవారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని గుర్తు చేశారు. కూటమి పాలనతో ఇప్పటిదాకా రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. 2025 అక్టోబర్లో మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నా.. ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా కూడా అందలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో పాటు రైతులకు సున్నావడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేసి అండగా నిలిచామని జగన్ గుర్తు చేశారు. అయితే బాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారని, పంటలు దెబ్బతిన్న రైతులకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందించలేదని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉచిత విత్తనాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం డైవర్షన్, రెడ్బుక్ రాజకీయాలపై దృష్టి సారిస్తోందని జగన్ విమర్శించారు. మంత్రులు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని, తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంపైనే చంద్రబాబు దృష్టి ఉందని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో ప్రజలు, రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా తాను ఏం చేస్తున్నానో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు.ఇదీ చదవండి: చంద్రబాబు అలా చేస్తే మనదే విజయం: వైఎస్ జగన్ -
కరువు కాటుకు మూగజీవాల బలి!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కరువు రాయలసీమ రైతు బతుకును ఛిద్రం చేస్తోంది. పొలంలో పంట లేదు.. పశువులకు మేత లేదు.. చేతిలో డబ్బు లేదు. ఏళ్ల తరబడి కుటుంబ సభ్యుల్లా చూసుకున్న ఎద్దులు, ఆవులు, గేదెలను కళ్లముందే ఇతరులకు అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులది. పశువులను అమ్మాలని కాదు.. వాటిని బతికించలేక అమ్ముకుంటున్నాం అంటున్నారు రైతులు. రెండు నెలలుగా చినుకు జాడ లేక, సాధారణ వర్షపాతంలో 30 శాతం కూడా నమోదు కాక, పచ్చిమేత మాట అటుంచితే ఎండుగడ్డి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మార్కాపురం ప్రాంతాల్లోని సంతలకు పశువులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. రైతుల ఆవేదనకు ఈ పశువుల అమ్మకాలు అద్దం పడుతున్నాయి. అమ్ముడైన పశువులు తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తీవ్రకరువు పరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేత లేక అమ్ముకుంటున్నాం పది ఎకరాల్లో పత్తి, మూడెకరాల్లో ఆముదం, ఉల్లి పంటలు వేశాం. సరైన వానల్లేవు. పత్తి పంట మొత్తం ఎండిపోయింది. పశువులకు మేత కూడా లేదు. ట్రాక్టర్ వరిగడ్డి రూ.18వేలు అమ్ముతున్నారు. అది కూడా దొరకడం లేదు. మనుషులం గంజైనా తాగి బతుకుతాం. మేత లేకపోతే పశువులు ఎలా బతుకుతాయి. వాటి బాధ చూడలేక తప్పనిసరి పరిస్థితుల్లో కాడెద్దులు అమ్ముకోవాల్సి వస్తోంది. – గోవిందు, రైతు, పులకుర్తి, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా పంట పోయింది.. పశువుల మేతా పోయిందిఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలు సాగుకునోచుకోలేదు. అరకొర వర్షాలతో కొన్నిచోట్ల మొక్కుబడిగా పంటలు సాగుచేసినా మొత్తానికి పంటలసాగు 40 శాతానికి మించలేదు. మార్కాపురం, కడప లాంటి జిల్లాల్లో 20 శాతం కూడా పంటలు సాగుకాలేదు. అరకొరగా సాగైన వేరుశనగ, కంది, ఆముదం, పత్తి పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. కృష్ణాజలాలు వస్తాయని నమ్ముకొని కొంతమేర సాగుచేసిన వరిపంట ఎండుతోంది. దీంతో పశువులకు గ్రాసం దొరికేపరిస్థితి లేకుండా పోయింది. సీమ వ్యాప్తంగా లక్షలాది ఎద్దులు, ఆవులు, బర్రెలు, కోట్లాది గొర్రెలు, మేకలతోపాటు పలురకాల మూగజీవాలు గ్రాసంకోసం అల్లాడిపోతున్నాయి.ఒక్కొక్క ఎద్దు లేదా బర్రెకు రోజుకు 5 కిలోల ఎండుగడ్డి లేదా 15 కిలోల పచ్చిగడ్డి అవసరమవుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఆ స్థాయిలో గ్రాసం అందుబాటులో లేదు. గ్రాసంలేక కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు పశువులను సంతలకు తెచ్చి తెగనమ్ముకుంటున్నారు. తక్కువ ధరలకే విక్రయించి నష్టపోతున్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, పత్తికొండ, అనంతపురం జిల్లా కదిరి,గోరంట్ల ఇతర ప్రాంతాల్లోని సంతలకు పశువులు వేలాదిగా తరలివస్తున్నాయి. నెలరోజులుగా పశువుల విక్రయాలు పెరిగాయని సంత నిర్వాహకులు చెపుతున్నారు. కొన్న పశువులను వ్యాపారులు కేరళ, కర్ణాటక, తెలంగాణ, కోల్కతా ప్రాంతాల్లోని కబేళాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎటు చూసినా కరువే.. కర్నూలు జిల్లాలో.. కరువు తీవ్రతతో ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, నియోజకవర్గాల నుంచి నిత్యం పశువులు తరలిపోతున్నాయి. నంద్యాల జిల్లాలోనూ వరిసాగులేకపోవడంతో గ్రాసం దొరికే పరిస్థితులు లేక రైతులు పశువులను విక్రయిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ తీవ్ర కరువుపరిస్థితులు నెలకొన్నాయి. వేరుశనగ, కంది పంటలు ఎండిపోయాయి. బోర్లకింద సాగుచేసిన వరిపంట ఎండిపోవడంతో లక్షలాది పశువులకు గ్రాసం దొరక్క సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధానంగా మార్కాపురం జిల్లా పూర్తిగా కరువు బారినపడి పంటలసాగు లేకుండా పోయింది. దీంతో గ్రాసం దొరక్క లక్షలాదిగా ఉన్న ఎద్దులు, బర్రెలు, గొర్రెలు, మేకలను తెగనమ్ముకుంటున్నారు. సీమ జిల్లాల్లో ఎద్దులు, ఆవులు 15 లక్షల పైగా ఉండగా బర్రెలు 18.75 లక్షలు, గొర్రెలు, మేకలు కోట్లలోనే ఉన్నాయి. ఎన్నడూ లేని కరువు గతంలో ఎన్నడూ లేని కరువు ఇది. వానా కాలం వచ్చి మూడు నెలలు అవుతున్నా ఇంత వరకు పదునైన వాన లేదు. ఉన్న ఐదెకరాల్లో కంది పంట వేశా. వానల్లేక పంట చేతికందే పరిస్థితి లేదు. మేత లేక పశువులు అల్లాడి పోతున్నాయి. పశుపోషణ భారమై అమ్ముకుంటున్నాం. గతంలో మహా అంటే 20, 25 రోజులు బెట్ట ఉండేది. పశువులను కాపాడుకునేందుకు బోదగడ్డి, జానాకు వంటివి తెచ్చి వేసేవాళ్లం. వానల్లేక ఇప్పుడు అది కూడా లేదు. – గోకారి, రైతు, పి.కోటకొండ, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లామూడు ఎకరాల్లో పత్తి అంతా పోయిందిమూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట అంతా ఎండిపోయింది. ఎకరాకు రూ.50వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. కోడుమూడు ప్రాంతంలో వర్షం అంతంత మాత్రమే కురిసింది. వేసిన పంట ఎండిపోయి పశువులకు మేత లేకుండా పోయింది. అందుకే అమ్ముకొంటున్నా. – వెంకటేష్, చిల్లబండ, కర్నూలు జిల్లామేత లేక అమ్మేస్తున్నానాకు నాలుగు ఎద్దులున్నాయి. పొలం గుత్తకు తీసుకొని పత్తి సాగు చేశా. వర్షాలు కురవక పంట వాడుముఖం పట్టింది. కరువు కారణంగా ఎద్దులకు గ్రాసం కూడా పెట్టలేని స్థితిలో వున్నా. వాటి పోషణ భారమై రెండు ఎద్దులను అమ్ముకొనేందుకు సంతకు తీసుకొచ్చా. – నర్సప్ప, రైతు, జగ్గాపురం నందవరం మండలం, కర్నూలు జిల్లాఎద్దులను అమ్ముకొని వలసపోతున్నాంఉన్న ఎద్దులకు మేతలేక, మేపలేక అమ్ముకొనేందుకు సంతకు తీసుకొచ్చా. నాకైతే పొలం కూడా లేదు. ఎవరైనా పొలం పనులకు పిలిస్తే ఎద్దులను బాడుగకు తీసుకొనిపోయేవాడిని. వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు. వ్యవసాయ పనులకు పిలిచే రైతుల్లేరు. అందుకే కుటుంబంతో పాటు వలస వెళ్లాలనుకుంటున్నా. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటలు బాగున్నాయంటున్నారు. అక్కడికి పోవాలని ఆలోచిస్తున్నాం. – మాదన్న, గోనెగండ్ల, కర్నూలు జిల్లా -
కరువు కోరల్లో సీమ రైతు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తీవ్ర వర్షాభావం.. దానికి తోడు చంద్రబాబు ప్రభుత్వ దారుణ నిర్లక్ష్యం.. రాయలసీమను మరోమారు కరువు కోరల్లోకి నెట్టాయి. రైతాంగానికి భరోసాగా కరువు సహాయక చర్యలు అనేకం చేపట్టాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో రైతు కుటుంబాలు గుడ్లనీరు కుక్కుకుని బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నాయి. జూన్ నుంచి ఆగస్టు ముగింపు దశకు చేరుకున్నా సీమ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అరకొరగా పడిన వానలకు సాగు చేసిన పత్తి, వేరుశనగ, కంది, ఉల్లి, మొక్కజొన్న వంటి పంటలు తేమ అందక ఎండిపోతున్నాయి. కాలువల కింద వరి సాగుకూ నీటి కొరత వెంటాడుతోంది. దాంతో పొలాలు బీళ్లుగా మారుతుండగా.. పశువులకు గ్రాసం కరువై.. రైతు కుటుంబాలు బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నాయి. రైతులు ఎద్దులతోపాటు పాడి పశువులను, గొర్రెలను, మేకలను తెగనమ్ముకుంటున్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ కేసీ కాలువ, తెలుగుగంగ, తుంగభద్ర దిగువ కాలువలు, హంద్రీ కాలువల పరిధిలో సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయకపోవడంపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల రైతులు కనీసం కొంతమేరైనా నీరివ్వాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. పంటలమీద ఆశవదులుకొని అటు తెలంగాణ, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. సెపె్టంబర్ మొదటివారం నుంచి వలసలు మరింతగా పెరగనున్నాయి. పశువులు తెగనమ్మి వలసబాట..కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన పల్లె ఈరప్ప కుటుంబం ఇది. నాలుగు ఎకరాల పొలంలో పత్తి సాగుచేసింది. ఎకరాకు రూ. 25 వేల చొప్పున రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. మూడు నెలల పైరు.. వర్షాలు లేక నిలువునా ఎండిపోయింది. ఈరప్పకు నలుగురు ఆడబిడ్డలు. కరువుతో గ్రాసం దొరకదన్న భయంతో 1.20 లక్షలకు కొన్న రెండు ఎద్దులను కూడా ఇటీవల నష్టానికి అమ్మేశాడు. బతుకుదెరువుకోసం తెలంగాణాకు వలస వెళ్లేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. కరువు ప్రభావం–5 దశలు 1) చినుకు లేదు.. 2) పంటల సాగు తగ్గింది 3) సాగు చేసిన పంటలు ఎండిపోయాయి 4) పశుగ్రాసం కొరత, పశువుల అమ్మకాలు 5) వ్యవసాయం దెబ్బతిని కుటుంబాలతో రైతుల వలసలు మొదట పొలాలు ఎండాయి.. తర్వాత పశువులు అమ్ముకున్నారు.. ఇప్పుడు కుటుంబాలతో సహా రైతులు వలసబాట పడుతున్నారు.!బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నా మాకు 4 ఎకరాల పొలం ఉంది. పత్తి పంట సాగు చేశా. ఎకరాకు రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.లక్ష ఖర్చు అయ్యింది. పంట ఎండిపోయింది. అప్పులు తీరేపరిస్థితి కనిపించడంలేదు. నా ముగ్గురు సోదరులు నెల క్రితం బెంగళూరుకు వలస వెళ్లారు. రెండు రోజుల క్రితం పత్తి పంట పొలాన్ని గొర్రెలకు మేతగా వదిలేశాను. నేను కూడా కుటుంబంతో బెంగళూరుకు వెలస వెళ్లాలని నిర్ణయించుకున్నా. – గాది లింగప్ప, రైతు, నిట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం కేసీకి నీళ్లివ్వక పొలం బీడుపడింది.. కేసీ కాలువకు శ్రీశైలం నుంచి కృష్ణ నీళ్లు విడుదల చేస్తేనే మా 8 ఎకరాల్లో వరిపంట సాగవుతుంది. ఈ ఏడాది ఇప్పటికీ నీళ్లు విడుదల చేయలేదు. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పొలం మొత్తం బీడుపడింది. వరి పండకపోతే తిండిగింజలు, పశువుల మేత దొరికే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఆదుకోవాలి. పశు గ్రాసమన్నా సరఫరా చేయాలి. – శీలం భాస్కర్రెడ్డి, విశ్వనాథపురం, చాపాడుమండలం. వైఎస్సార్ కడప జిల్లా. పంటలన్నీ దెబ్బతిన్నాయి...కర్నూలు4,34,996 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,44,171 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. ఆదోని, ఆలూరు, మంత్రాలయం ప్రాంతాల్లో పత్తి, వేరుశనగ, కంది, సన్ఫ్లవర్, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. 14 వేల హెక్టార్ల సాధారణ వరి సాగుకు 2 వేల హెక్టార్లలోపే సాగు జరిగింది. పంటలు ఎండిపోవడంతో ఈ ప్రాంత రైతులు వలసలకు సిద్ధమయ్యారు. కొందరు ఎద్దులను, ఇతర పశువులను అమ్ముకొని వలసపోగా మిగిలినవారు బెంగుళూరు, తెలంగాణా ప్రాంతాలకు వలసకు సిద్ధమయ్యారు. అనంతపురం 3,43,394 హెక్టార్ల సాధారణ సాగుకు 1,87,598 హెక్టార్లలోనే పంటలు వేశారు. 1.48 లక్షల హెక్టార్ల వేరుశనగ కేవలం 44 వేల హెక్టార్లలో సాగైంది. 22,868 హెక్టార్ల సాధారణ వరి సాగుకు 4,168 హెక్టార్లలోనే బోరుబావులకింద సాగు జరిగింది. వర్షాభావంతో చీనీ తోటలు ఎండిపోతున్నాయి. పత్తి, మొక్కజొన్న, సజ్జ ఆముదం పంటలదీ ఇదే పరిస్థితి. కంది 90వేల హెక్టార్లలో సాగవుతోందని చెబుతున్నా వర్షాలు లేక పంట నిలువునా ఎండిపోతోంది. నంద్యాల2,20,230 హెక్టార్ల సాధారణ సాగుకు 1,33,039 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. 70,201 హెక్టార్లలో సాగవ్వాల్సిన వరి కేవలం 16 వేల హెక్టార్లలో సాగైంది. మొక్కజొన్న, కంది, మినుము, పత్తి పంటలూ వర్షాభావంతో దెబ్బతిన్నాయి. చిత్తూరు44,267 హెక్టార్ల సాధారణ సాగుకు కేవలం 10,026 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. 21,903 హెక్టార్ల వేరుశనగకు 2,615 హెక్టార్లు, 9,068 హెక్టార్ల వరికి 1,833 హెక్టార్లు, 1,495 హెక్టార్ల కందికి కేవలం 110 హెక్టార్లలో సాగు జరిగింది.మార్కాపురంకరువు తీవ్రతను సాగు గణాంకాలే చెబుతున్నాయి. 27,203 హెక్టార్ల సాధారణ కంది సాగు కేవలం 192 హెక్టార్లలో, 19,711 హెక్టార్ల పత్తి 3,953 హెక్టార్లలో. 6,202 హెక్టార్ల వరి కేవలం 33 హెక్టార్లలో. 3,104 హెక్టార్ల మొక్కజొన్న 331 హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, వేరుశనగ, ఆముదం తదితర పంటలు సాగుకు నోచుకోలేదు. కడప76,469 హెక్టార్ల సాధారణ సాగుకు కేవలం 24,092 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. అంటే సాగు మూడోవంతు కన్నా దిగువకు పడిపోయింది. కేసీ కెనాల్ ఆయకట్టుతోపాటు తెలుగుగంగ, మైలవరం, చిత్రావతి, గండికోట తదితర ప్రాజెక్టుల పరిధిలో 33,078 హెక్టార్లలో వరి సాగుకావాల్సి ఉండగా కేవలం 9,327 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 22,469 హెక్టార్ల పత్తికి 7,742 హెక్టార్లు, 5,992 హెక్టార్ల కందికి కేవలం 352 హెక్టార్లలో సాగు జరిగింది. 1495 హెక్టార్లలో సాగుకావాల్సిన మొక్కజొన్న 1213 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 3745 హెక్టార్లలో సాగు కావాల్సిన మినుము 1488 హెక్టార్లలో సాగైంది. -
కష్టాల కావడి మోస్తున్న కౌలురైతు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని బతికిస్తున్న కౌలురైతుల బతుకులు దుర్భరమవుతున్నాయి. సొంతగా భూమి సాగుచేసే రైతు కన్నా ఇతరుల భూమి కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న రైతు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వ పథకాలు, విత్తన–ఎరువుల సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, నష్టపరిహారాలు, రుణమాఫీలు, మద్దతు ధర, బోనస్.... ఇటువంటివేవీ నేరుగా కౌలురైతులకు అందటం లేదు. ఎన్నికల హామీలతో ఊదరగొట్టి గద్దెనెక్కిన పార్టీలు, కౌలు రైతాంగానికిచ్చిన మాట తప్పిన ఫలితమే ఈ దుఃస్థితి!పెద్ద ఎత్తున ప్రజాధనం వెచ్చించి వ్యవసాయానికి మద్దతుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధి కౌలురైతులకు అందడం లేదు. నిజానికి క్షేత్రంలో ఉండి, పెట్టుబడి పెట్టి, పరి స్థితుల్ని ఎదుర్కొని సాగుచేసేది కౌలు రైతు. కానీ, వారిని గుర్తించి, ఆ మేరకు ప్రయోజనాలు కల్పించడానికి ప్రభుత్వాలు జంకుతున్నాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి! అన్ని బాధలూ వారివే! సర్కారు లెక్కల ప్రకారం తెలంగాణలో కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉంది. చిన్న, మధ్యతరహా, పెద్ద...అంతా కలిపి సుమారు 70 లక్షల మంది రైతులుగా నమోదై పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉన్నారు. వారంతా రైతు భరోసా (ఇదివరకటి రైతుబంధు) లబ్ధిదారులు. అందులోనే కొందరు, తమ భూమికి తోడు ఇతరుల భూమి తీసుకొని కౌలు చేస్తున్నారు. మరికొందరు, సొంత భూమే లేకున్నా ఇతరుల భూమి కౌలుకు చేస్తున్నారు. తెలంగాణలో 36 శాతం మంది కౌలురైతులున్నట్టు 2022లో ‘రైతు స్వరాజ్య వేదిక’ (ఆరెస్వీ) జరిపిన సర్వే లెక్కలు చెబుతున్నాయి. సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, రుణమాఫీ లబ్ధి, రైతు భరోసా, పంట బీమా/పంట నష్ట పరిహారం, మద్దతు ధర, అదనపు బోనస్... ఇటువంటి ప్రయో జనం ఏదీ నేరుగా కౌలురైతుకు అందటం లేదు. ప్రభుత్వం, అనుబంధ విభాగాలు వ్యవసాయ రంగంలో ఆధు నిక సాంకేతికతను వినియోగించడం మొదలెట్టాక ‘యాప్’లతో భూయజమానుల మొబైల్, పాస్పుస్తకాలు లింక్ చేయడం, ‘ఓటీపీ’లు వారికే రావడం, ఎరువుల సమాచారమైనా, ధాన్యం విక్రయ వివరాలైనా నేరుగా వారి మొబైల్కు, బ్యాంకు ఖాతాలకే చేరుతోంది. కౌలు డబ్బు, పెట్టుబడి వ్యయం పెరిగి, మద్దతు ధర కూడా లభించక కౌలురైతు రెండింతలు నష్టపోతున్నాడు. ప్రభుత్వ సహాయమూ అందక మూడు రకాల భారం మోయాల్సివస్తోంది.కష్టాన్ని కళ్లకు కడుతున్న సర్వేలుతెలంగాణ గ్రామీణ జనాభాలో దాదాపు సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ముఖ్యంగా వెనుకబడిన, దళిత, మైనారిటీ, గిరిజన వర్గాలవారిలో అత్యధికులకు భూమి లేదు, ఉన్నా ఒకటీ, అర ఎకరాలు మాత్రమే! ఇటీవల ‘కౌలురైతుల గుర్తింపు సాధన కమిటి’ వారు కూడా తెలంగాణలో సర్వే నిర్వహించారు. 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామాల్లోని 1,836 మంది కౌలు రైతులను ‘ప్రాతినిధ్య నమూనా’లుగా ఎంపిక చేశారు. ప్రధానంగా వ్యక్తి గత ఇంటర్వ్యూ పద్ధతిలో సమాచారం రాబట్టారు. ఏపీలో ‘ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం’తో కలిసి ‘పీపుల్స్ పల్స్’ సర్వే నిర్వహించింది. మొత్తం 26 జిల్లాల్లో జిల్లాకు సగటున 100 నుంచి 125 ‘నమూనా’ల చొప్పున మొత్తం 3000 శాంపిల్స్తో నెల రోజుల పాటు ఈ సర్వే జరిగింది. కౌలురైతులకు ఏపీలో అరకొరగా గుర్తింపుకార్డు లిచ్చారు. 12.3 శాతం మంది తమకు లభించాయని చెబితే, కార్డు లేవీ అందలేదని 87.7 శాతం మంది వెల్లడించారు. 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారే ఏపీలో కౌలురైతులు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీరేట్లు, యంత్రాల అద్దెలు అసాధారణంగా పెరిగాయని 67.2 శాతం రైతులు చెబితే, కౌలు డబ్బు/ధాన్యం పెరగటం వల్ల ఇబ్బందులని 12.5 శాతం మంది, గిట్టుబాటు ధరలు లేక కష్టాలు పెరిగాయిని 10.8 శాతం మంది, అధిక వడ్డీల ప్రయి వేటు అప్పుల భారమనీ, మార్కెట్ సమస్యలనీ మరో పది శాతం మంది చెప్పారు. కొన్ని చోట్ల కౌలు రేట్లు యేటా ఎకరాకు 53 వేల రూపాయల వరకు చేరాయని, సగటున 14,936గా చెల్లిస్తున్నామని తెలంగాణ కౌలురైతులు చెప్పారు. చిన్న కమతాల్లో కౌలు గిట్టుబాటు కాక ఎక్కువ ఎకరాల్లో కౌలు చేయాల్సి వస్తోందని, ఇదివరకు సగటున రైతుకు 5 ఎకరాలున్న కౌలుసాగు ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగిందని వారంటున్నారు. 5కు పైగా ఎకరాలు కౌలుసాగు చేస్తున్న రైతుల సంఖ్య 31 నుంచి 42 శాతానికి పెరిగింది. మాట తప్పిన ‘రాజకీయాలు’కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి, అన్ని సంక్షేమ పథకాలతో పాటు బీమాను వారికే వర్తింపజేస్తామని ఏపీలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ‘ప్రజాగళం’ పేరిట ప్రకటించిన ఎన్నికల మాని ఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపు కౌలు రైతు లకు ప్రత్యేకచట్టం తెస్తామన్న మాట కూడా గాలికిపోయింది. కూటమి భాగస్వామి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (జనసేన) ఎన్నికల ముందు ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ... ఎక్కడి కక్కడ కౌలురైతుల సమావేశాలు పెట్టి, వారికి ఆర్థిక సహాయం అందించి నానా హడావుడి చేశారు. ఇప్పుడు కిమ్మనటం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలురైతుల పట్ల కక్ష కట్టినట్టే వ్యవహరించింది. 2016 వరకు తెలంగాణలోని రెవెన్యూ రికార్డుల్లో ప్రతిసీజన్ భూయజమానితో పాటు వాస్తవ సాగులో ఉన్న (కౌలు రైతు) పేరు విడిగా నమోదు చేసే అవకాశం ఉండేది. అలా నమోదు కోసం ఉన్న సాగు కాలమ్ను 2017లో ఒక చట్ట సవరణ ద్వారా తొలగించింది. కౌలురైతుల్ని గుర్తించడానికి, వారికి గుర్తింపు కార్డుల ద్వారా ఎంతోకొంత ప్రయో జనం కల్పించడానికి వీలు కల్పించే ‘భూ అధీకృత సాగుదారుల చట్టం–2011’ అమలును 2015 నుంచి దాదాపు నిలిపివేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘2023 సెప్టెంబర్’లో కౌలురైతు లకు బహిరంగ లేఖ రాస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు అన్యాయం జరిగిందనీ, తాము అధికారంలోకి రాగానే 2011 చట్టాన్ని అమలు చేయడమే కాకుండా అన్ని ప్రభుత్వ పథ కాలు వారికి వర్తించేలా చర్యలు తీసుకుంటామనీ పేర్కొన్నారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు దాటినా నేటికి అతీగతీ లేదు. ఏ రకంగా చూసినా కౌలురైతు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నష్టపోతున్నాడు. రెండింతల కష్టాల కావడి మోస్తున్నాడు.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
కార్బోసల్ఫాన్పై పూర్తి నిషేధం.. కేంద్రం ప్రతిపాదన
రైతులకు వాతావరణ సవాళ్లు ఒకవైపు చుట్టుముడుతుంటే, పంటలను ఆశించే పురుగుల సంహారానికి వాడే రసాయనాలు మరొకవైపు ప్రాణసంకటంగా మారుతున్నాయి. వ్యవసాయ రంగంలో విరివిగా ఉపయోగిస్తున్న కార్బోసల్ఫాన్ (Carbosulfan) కీటకనాశిని ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, వాడకంపై పూర్తి నిషేధం విధించాలని కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. 1968 కీటకనాశినుల చట్టం ప్రకారం ఈ విషపూరిత రసాయనాన్ని శాశ్వతంగా రద్దు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.నిపుణుల కమిటీ నివేదికనిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్బోసల్ఫాన్ భూమిలోకి లేదా మొక్కల్లోకి చేరిన తర్వాత అత్యంత ప్రమాదకరమైన 'కార్బోఫ్యూరాన్'గా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల మానవులతో పాటు పెంపుడు జంతువులకు తీవ్రమైన విషప్రయోగం జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే.. ఈ రసాయనం ప్రభావానికి గురైతే తక్షణమే కోలుకోవడానికి నిర్దిష్టమైన విరుగుడు కూడా అందుబాటులో లేదు. ముందు జాగ్రత్త కన్నా నివారణే మేలు అన్న చందంగా జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ రసాయనానికి స్వస్తి పలకడమే శ్రేయస్కరమని సర్కారు భావించింది.వరి, పత్తి పంటల్లో..ముఖ్యంగా వరి, పత్తి పంటలలో నివారణకు వాడే ఈ మందును నిషేధిస్తే ప్రత్యామ్నాయంగా రసాయన రహిత పురుగుమందులను (బయో ఫెస్టిసైడ్స్) ప్రోత్సహించాల్సి ఉంటుంది. పర్యావరణానికి వినాశకరంగా మారిన కార్బోసల్ఫాన్పై పడుతున్న ఈ ఎఫెక్ట్ వల్ల యూపీఎల్ వంటి ప్రముఖ అగ్రోకెమికల్ కంపెనీల మార్కెట్పై ప్రభావం పడనుంది. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం మంచిది కాబట్టి విషపూరిత పురుగుమందుల స్థానే పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను త్వరితగతిన రైతులకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
సాగునీరు ఇవ్వలేమని తేల్చిచెప్పిన మంత్రి నిమ్మల..
-
అమరావతిలో అతిపెద్ద భూ దోపిడీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట దేశంలోనే అతిపెద్ద భూ దోపిడీ జరుగుతోందని ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. రాజధాని పేరుతో మూడు పంటలు పండే పొలాలు లాక్కోవడం సమంజసం కాదన్నారు. అమరావతిలో భూ దోపిడీపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా గళం వినిపిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రొఫెసర్ రామచంద్రయ్య, సామాజికవేత్త డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్లో యోగేంద్ర యాదవ్ను కలిసి రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీని వివరించారు. ఈ సందర్భంగా రైతులు శ్రీధర్రెడ్డి, శ్రీకాంత్, సంజీవరెడ్డి తదితరులు మాట్లాడుతూ భూములు ఇవ్వలేదనే అక్కసుతో ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతోందన్నారు. పొలాల చుట్టూ భారీ గుంతలు తవ్వడంతో పాటు వరద నీటిని విడిచి పెడుతున్నట్లు తెలిపారు. తమ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు..? ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? అని ఆరా తీస్తూ ఒత్తిడి తెస్తోందని వాపోయారు. మూడు పంటలు పండే తమ భూములు తమకు కావాలని స్పష్టం చేశారు. డబ్బు కన్నా... కూడు అవసరమని.. తమ భూములు తమకు వదిలేయాలని కోరుతున్నా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. రాజధాని ప్రకటించిన తర్వాత బ్యాంకులు పంట రుణాలు కూడా ఇవ్వడం లేదని, ఇల్లు కట్టుకోవాలన్నా అవస్థలు పడుతున్నామన్నారు. గతంలో భూములు సేకరించిన రైతులకు 12 ఏళ్లుగా ప్లాట్లు అప్పగించలేదన్నారు. 29 గ్రామాల పరిధిలో చెరువులు, కుంటలు 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ప్రభుత్వం మాత్రం 800 ఎకరాలే అని ప్రకటిస్తోందని చెప్పారు. రైతులకు బఫర్జోన్, వాటర్ బాడీస్లో ఇస్తున్నారని వాపోయారు. భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఉచిత వైద్యం, పిల్లలకు ఉచిత విద్య అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని చెప్పారు. సంఘటితంగా పోరాడండి రైతుల కష్టాలు సావధానంగా విన్న ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ భూ యజమానుల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. హైదరాబాద్ విస్తీర్ణంతో సమానంగా భూములు సేకరించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. పరిశ్రమలు, ఆర్థిక కార్యకలాపాలు లేకుండా, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రైతులంతా సంఘటితంగా పోరాటం చేయాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఎలాంటి న్యాయం సహాయం కావాలన్నా.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలన్నా సహాయం అందిస్తామని యోగేంద్రయాదవ్ ప్రకటించారు. -
స్కూల్ బస్సు బోల్తా
జి.కొండూరు: కొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకుంటామనే ఆనందంలో ఉన్న విద్యార్థులకు బస్సు ప్రమాదం తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేటు స్కూలు బస్సు కాలువలో బోల్తా పడిన ఘటనలో 25 మంది విద్యార్థులు తృటిలో ప్రాణాలను దక్కించుకున్నారు. నలుగురు బాలలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు స్కూలు బస్సు 32 మంది విద్యార్థులతో శనివారం సాయంత్రం పాఠశాల నుంచి బయల్దేరింది. కట్టుబడిపాలెం, శాంతి నగర్ వద్ద ఏడుగురు దిగారు. కట్టుబడిపాలెం – కవులూరు గ్రామాల మధ్య తారకరామా కాలువ వద్దకు రాగానే బూడిద లోడుతో వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన బస్సు ఆదుపుతప్పి కాలువలో పడింది. పక్కనే పొలాల్లో పనిచేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు, వెంటనే అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులను, డ్రైవర్ నారాయణ, ఆయా పద్మను బయటకు తీశారు. ఫోన్ల ద్వారా సమాచారం అందడంతో తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను ఇళ్ళకు తీసుకువెళ్లారు. వీరిలో నలుగురు విద్యార్థులు ఆయేషా సిద్ధిఖి, ఎం.సాయినంద, డి.హర్షవర్థన్, జస్వంతికి స్వల్ప గాయాలు కావడంతో విజయవాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో కాలువలో కొద్దిపాటి నీరుంది. రైతులు వెంటనే స్పందించి అందరినీ బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలే ఇబ్రహీంపట్నంలో ఓ గురుకుల పాఠశాల బస్సు బోల్తా పడింది. ఇప్పుడు మరో ప్రమాదం జరగడంతో బస్సుల నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రహ్వీర్ అవార్డుకు 10 మంది రైతుల పేర్లు సిఫార్సు పాఠశాల బస్సు బోల్తా పడిన వెంటనే పక్కనే వరి పొలాల్లో పని చేస్తున్న రైతులు పరుగెత్తుకుంటూ వచ్చి 25 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, ఆయాతో కలిపి 27 మందిని కాపాడారు. వీరు వెంటనే రంగంలోకి దిగకపోయి ఉంటే బస్సు నీటిలో పూర్తిగా మునిగిపోయి, విద్యార్థుల ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. వెనువెంటనే వచ్చి వారిని కాపాడిన 10 మంది రైతుల పేర్లను పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్రం ప్రభుత్వం అందించే రహ్వీర్ అవార్డు కోసం జి.కొండూరు పోలీసులు పంపారు. విద్యార్థుల ప్రాణాలను కాపాడిన వారిలో సర్నాల నాగరాజు, బొర్రా రామకృష్ణ, చెరుకూరి రమణ, ఎస్కె ఇస్మాయిల్, రాజు, సబ్బరపు సతీష్, ఐ.నరేష్, కలిదిండి వెంకట సుబ్బరాజు, బొల్లిశెట్టి వెంకటరావు, మేరుగ తిరుపతిరావు ఉన్నారు. -
సాగు నీరివ్వని సర్కారుపై రైతుల ఆగ్రహం
కణేకల్లు: సాగు నీరివ్వని చంద్రబాబు ప్రభుత్వంపై అనంతపురం జిల్లాలోని హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు తిరగబడ్డారు. కణేకల్లు, బొమ్మనహళ్, డి.హీరేహళ్ మండలాల్లోని హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగు నీటి కోసం ఆందోళనలు, హెచ్చెల్సీ కార్యాలయాల ముట్టడి చేసినా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేకపోవడంతో కోపోద్రిక్తులైన రైతులు శనివారం గుండ్లపల్లిక్రాస్–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిపై భారీ ఎత్తున ధర్నా చేశారు. టీబీ డ్యామ్లో నీరు భారీగా చేరుతున్నా నీరు వదలకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పొరుగున ఉన్న కర్ణాటకలో ఇదే హెచ్చెల్సీ కింద నీరు విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో మాత్రం సాగు నీరు ఇవ్వబోమని అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటికే వరినారు పోసుకుని నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వందలాది రైతులు గుండ్లపల్లిక్రాస్–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిపై భారీ ధర్నా చేశారు. ఈ నెల 29 లోపు నీరివ్వకపోతే కణేకల్లు హెచ్చెల్సీ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడతామని మెట్టు గోవిందరెడ్డి హెచ్చరించారు. కణేకల్లు క్రాస్లో జరిగే నారా లోకేశ్ సభను అడ్డుకుంటామన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా కొనసాగింది. ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో వారికి, మెట్టు గోవిందరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
మీకంటే వైఎస్ జగన్పాలన వంద రెట్లు బాగుంది
సాక్షి, అమరావతి: నవులూరు రైతుల ఆస్తిని దొబ్బేసి, వాళ్లు దాని కోసం కాళ్లరిగేలా తిరుగుతుంటే పట్టించుకోకుండా పాలాభిషేకం చేయమంటారా అని సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నవులూరు రైతుల సమస్యను స్వయంగా తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో ప్రజల ఆస్తులను లాక్కుంటున్న మీకు పాలాభిషేకం కావాలా అని ప్రశ్నించారు. మీ పాలనకంటే వైఎస్ జగన్ పాలన వంద రెట్లు బాగుందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. నవులూరు గ్రామంలోని సర్వే నంబర్ 774లో ఉన్న 30 ఎకరాల భూమికి వందేళ్లకుపైగా చరిత్ర ఉందని తెలిపారు.1907లో బ్రిటిష్ వాళ్లు రాసిన ఆర్ఎస్ఆర్లో ఈ భూమిని చెరువుగా పేర్కొన్నారని, 1913లో అదే భూమిని ఆరు సర్వే నంబర్లుగా విభజించి వ్యవసాయానికి అనుగుణమైన భూమిగా గుర్తించారని తెలిపారు. 1923–25 ప్రాంతంలో ఎకరన్నర, రెండు ఎకరాల చొప్పున పలువురు వ్యక్తులకు ఆ భూములను అసైన్ చేశారని చెప్పారు. ఆ తర్వాత వందేళ్లలో భూములు పలువురి చేతులు మారాయన్నారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు కలెక్టర్ ఈ 30 ఎకరాల భూమిని సీఆర్డీఏకు అప్పగించేశారని తెలిపారు. బాధితులు కలెక్టర్కు అర్జీలు పెట్టగా తాము ఆ భూమిని సీఆర్డీఏకు దానం చేసేశామని, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పారని వివరించారు. పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టుకుంటే సీఆర్డీఏ నుంచి సమాధానం రావాల్సి ఉందని చెప్పి వాళ్లు మాత్రం అర్జీ పరిష్కారమైందని రాసేసుకున్నారని విమర్శించారు. కోర్టు వ్యాజ్యంలో ఉన్న భూమిని రాజధాని కోసం లాగేసుకుంటారా అని మండిపడ్డారు. అమరావతిని నిర్మించడానికి రైతుల పొట్ట కొడతారా, ఆస్తి హక్కు ఉన్నవారికి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. 200 గజాల స్థలం కోసం బాధితుడు మళ్లీ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇదీ లోకేశ్ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు అని అన్నారు. ఎవరి శవాల మీద మీరు రాజ్యం ఏలుదామని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆస్తుల మీద మీరు రాజ్యం ఏలదామని అనుకుంటున్నారని మండిపడ్డారు. -
ఏపీకి తుంగభద్ర నీరు వద్దా?
హొసపేటె: ఎల్నినో వల్ల ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకుంది. తాగు, సాగు నీటి కోసం ప్రజలు, రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో పొరుగు రాష్ట్రాల నుంచి తమకు రావాల్సిన నీటివాటా కంటే ఎక్కువ అడిగి ప్రజల కష్టాలను తీర్చాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా రాయలసీమకు తుంగభద్ర నుంచి రావాల్సిన నీటి విషయంలో చంద్రబాబు సర్కారు తీరు రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా కర్నూలు జిల్లాకు లో లెవెల్ కెనాల్(ఎల్ఎల్సీ) ద్వారా తుంగభద్ర నీరు వెళ్తుంది. తమకు ఎంత నీరు కావాలి, ఎప్పటి నుంచి ఎప్పటివరకు నీటిని విడుదల చేయాలి... అనే వివరాలతో కర్నూలు జిల్లా అధికారుల నుంచి ఇండెంట్ లేఖలు పంపిస్తారు. కానీ ఇప్పటి వరకు కర్నూలు జిల్లా అధికారుల నుంచి ఇండెంట్ లేఖలు తుంగభద్ర డ్యామ్ ఇంజనీర్లకు చేరలేదు. దీంతో డ్యామ్ అధికారులు కూడా కర్నూలుకు నీటి విడుదల గురించి పట్టించుకోవడం లేదు. ఆగస్టు మూడో వారం వచి్చనా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీటి వాటాపై ఏపీ అధికారుల నుంచి అధికారిక లేఖ (ఇండెంట్) తుంగభద్ర డ్యామ్ కార్యాలయానికి రాకపోవడం కర్ణాటక అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. నిండుకుండలా తుంగభద్ర ఎగువన వర్షాలు కురవడంతో కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ సుమారు 80 టీఎంసీలతో నిండుకుండలా తొణికిసలాడుతుంది. ఆదివారం డ్యామ్కు 18,550 క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం డ్యామ్లో నీటిమట్టం 1,630 అడుగులకు చేరుకుంది. డ్యామ్ పూర్తిగా నిండేందుకు ఇంకా 3 అడుగులు మాత్రం మిగిలి ఉంది. కర్ణాటక ప్రభుత్వం తమ వాటా కింద హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీకి నీటిని విడుదల చేయడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కర్నూలుకు వచ్చే నీటిని అడ్డుకున్న కర్ణాటక రైతులు కర్నూలు జిల్లా నుంచి అధికారిక ఇండెంట్ రాకపోవడంతో ఎల్ఎల్సీ ద్వారా ఏపీకి వస్తున్న కొద్దిపాటి నీటిని కూడా కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం వద్ద ఏపీలోకి ప్రవేశించే చోట ఎల్ఎల్సీ 155వ కిలోమీటరు వద్ద భారీ సంఖ్యలో కర్ణాటక రైతులు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి నీటిని తమ పొలాలకు మళ్లించుకున్నారు. టీబీ డ్యామ్లో నీటిమట్టం సంతృప్తికరంగా లేదని, తమ పొలాలు ఎండిపోతాయనే సాకుతో ఏపీకి రావాల్సిన నీటిని అడ్డుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి తుంగభద్ర డ్యామ్ అధికారులకు అధికారిక ఇండెంట్ పంపించి కర్నూలు జిల్లాకు నీరు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. -
7 లక్షల ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: ఎల్నినో ప్రభావంతో కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాల్లో తగినన్ని నిల్వలు లేనందున తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన నీటిని సాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వానాకాలంలో గోదావరి పరీవాహకంలోని 21 ప్రాజెక్టుల కింద 6,05,955 ఎకరాలు, కృష్ణా పరీవాహకంలోని 7 ప్రాజెక్టుల కింద 95,108 ఎకరాలు కలిపి మొత్తం 7,01,063 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మంగళవారం జలసౌధలో శాఖ అధికారులతో సమావేశమై జలాశయాల్లో నిల్వలను సమీక్షించి సాగునీటి సరఫరాకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల కింద వెంటనే సరఫరాను ప్రారంభించాలని ఆదేశించారు. గతేడాది (2025–26) వానాకాలంలో 37,32,878 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయగా, ఈ ఏడాది కేవలం 7లక్షల ఎకరాలకే సరఫరా చేయగలమని నీటిపారుదల శాఖ అంచనాలు సిద్ధం చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, సాగర్లో సరిపడా నిల్వలు లేకపోవడంతో ప్రస్తుతం ఆయకట్టుకు సాగునీటి సరఫరా సాధ్యం కాదని తేల్చింది. కడెం ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలో 61 వేల ఎకరాలు, నిజాంసాగర్ కింద కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 1,24,254 ఎకరాలు, దేవాదుల కింద వరంగల్, ములుగు, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 2,74,683 ఎకరాలు, సాత్నాలా కింద ఆదిలాబాద్ జిల్లాలో 24 వేల ఎకరాలకు సాగునీటి సరఫరా చేయనున్నారు. ఇక కృష్ణా పరీవాహకంలోని మూసీ కింద సూర్యాపేట జిల్లాలో 30వేల ఎకరాలు, వైరా ప్రాజెక్టు కింద 17,390 ఎకరాలు, డిండి కింద 12,975 ఎకరాలు, పాకాల కింద 18,193 ఎకరాలకు సాగునీటి సరఫరా చేయనున్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు ఎగువ నుంచి మళ్లీ వరదలు ప్రారంభమై జలాశయాలు పూర్తిగా నిండితే మరోసారి నిల్వలను సమీక్షించి మిగిలిన ఆయకట్టుకు నీటి సరఫరాపై నిర్ణయం తీసుకుంటామని అధికారవర్గాలు తెలిపాయి. సెపె్టంబర్ నుంచి ఎల్నినో ప్రభావం మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ హెచ్చరికలున్న నేపథ్యంలో ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నిల్వలను వచ్చే ఏడాది జూలై నాటికి ఉండనున్న తాగునీటి అవసరాలకు పరిరక్షించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. -
శ్రీశైలంలో 878 అడుగుల నీరున్నా కేసీ కెనాల్కు విడుదల చేయరా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలో తగిన స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కేసీ కెనాల్కు సాగు నీరు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలానికి చెందిన కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల బృందం మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించింది.డాక్టర్ వైఎస్సార్, వైఎస్సార్సీపీ ప్రభుత్వాల హయాంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్కు సకాలంలో సాగు నీరు విడుదల చేసి రైతులను ఆదుకున్నారని రైతులు గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో 878 అడుగులకుపైగా నీరు ఉన్నా కక్ష సాధింపు చర్యలతో చుక్క నీరు వదలడం లేదని ధ్వజమెత్తారు. నీరు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్కి రైతులు విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ కుట్రపూరిత చర్యలను వివరించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ 854 అడుగులకే నీళ్లిచ్చారువైఎస్సార్ హయాంలో, అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్కు నీటిని విడుదల చేసి రైతులు పంటలు పండించుకునేలా చేశారు. కానీ నేడు శ్రీశైలంలో 878 అడుగులకు నీళ్లు చేరినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చుక్క నీరివ్వడంలేదు. ఈ అన్యాయంపై మాజీ సీఎం వైఎస్ జగన్ని కలిసి విన్నవించాం. – శేఖర్ రెడ్డి, చిన్నగురువలూరుచంద్రబాబు పాలనలోనే ఈ కరవు కాటకాలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రైతులకు ఇలాంటి కరవు కాటకాలు, కష్టాలు వస్తాయి. చంద్రబాబు ప్రభుత్వ పక్షపాత ధోరణి, కక్ష సాధింపు చర్యల వల్లే ఈ దుస్థితి వచి్చంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొదటి ప్రాధాన్యతగా కేసీ కెనాల్కు నీరిచి్చన తర్వాతే విద్యుత్ ఉత్పత్తికి, ఇతర అవసరాలకు ఇవ్వాలి. కానీ మాకు అన్యాయం చేస్తున్నారు. – శంకర్, చిన్నగురువలూరు -
తమిళుల కాల్చివేతపై భగ్గుమన్న విజయ్ సర్కార్
సాక్షి, చెన్నై: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వేటగాళ్లనే అనుమానంతో అటవీ శాఖ అధికారులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అయితే ఆ ముగ్గురు తమిళులు కావడంతో ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంది. వాళ్లు వేటగాళ్లు కాదని.. రైతులు అని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఘటనను తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కర్ణాటక అటవీ శాఖ వివరణపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఆగస్టు 15 తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఆంటోనీ సామి, జాన్ రోజ్ పీటర్, కుమార్ అనే ముగ్గురు తమిళులు మృతి చెందారు. వీరు చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలోని గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా స్పందించారు. తమిళులపై జరిగిన ఈ ఘటనను ఖండించిన ఆయన.. కర్ణాటక అటవీ శాఖ చెబుతున్న వివరణ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర, ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్, డీకే శివకుమార్ సర్కార్ను కోరారు. బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం అవసరమైన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పూర్తి నిజాలు బయటకు రావాలని.. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పారదర్శక విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.స్టాలిన్ ఆగ్రహంఈ ఘటనపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు తమిళ రైతుల కాల్చివేత ఘటన దిగ్భ్రాంతికరమని పేర్కొన్న ఆయన.. దీనిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరగకూడదు. కాల్పులకు బాధ్యులైన వారిపై హత్య కేసు నమోదు చేసి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి" అని స్టాలిన్ అన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై స్పందించడంలో ఆలస్యం చేయకుండా కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు: కర్ణాటక అధికారులుమరోవైపు కర్ణాటక అటవీ అధికారులు మాత్రం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వన్యప్రాణుల వేట కోసం వచ్చారని తెలిపారు. అటవీ సిబ్బందిని ఎదుర్కొన్న సమయంలో వారు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణలో భాగంగా ఎదురుకాల్పులు జరిపామని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, వేటకు ఉపయోగించిన వస్తువులు, అడవి జంతువుల మాంసంతో ఉన్న సంచులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.‘వేట ఆరోపణల్లో నిజం లేదు’.. ప్రతిపక్షాల ఆగ్రహంఅయితే తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు కర్ణాటక అధికారుల వాదనలను ప్రశ్నిస్తున్నాయి. ముగ్గురు వ్యక్తులు నిజంగానే వేటకు పాల్పడ్డారా? కాల్పులు అనివార్యమా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పీఎంకే నేత అన్బుమణి రామదాస్ ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. సీపీఎం, సీపీఐ నేతలు కూడా కాల్పుల్లో పాల్గొన్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.విచారణకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని చెప్పారు. కాల్పులు ఆత్మరక్షణలో భాగమా? లేదంటే ఉద్దేశపూర్వక చర్యా? అనేది విచారణలో తేలనుంది.కావేరీ జలాలు.. మేకెదాటు విషయంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఇవాళ సుప్రీం కోర్టులో తమిళనాడు వేసిన పిటిషన్(నీటి విడుదల కోసం..) విచారణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ముగ్గురు తమిళుల మృతితో ఇటు రాజకీయంగానూ ఘర్షణలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఢిల్లీ దిశగా రైతుల పాదయాత్ర
ఖనౌరీ/జింద్: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) చేపట్టిన పాదయాత్రను ఆదివారం హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. హరియాణా–పంజాబ్ సరిహద్దుల్లోని దాటా సింగ్వాలా గ్రామం నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వరకు ఈ యాత్రను ఎస్కేఎం తలపెట్టింది. ఆదివారం ఖనౌరీ అంతర్రాష్ట్ర పోస్ట్ వద్దకు 250 మంది రైతుల పాదయాత్ర బృందం రాగానే హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. భారత్–అమెరికా ఒప్పందంతోపాటు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర మంత్రితోనే తాము చర్చలు జరుపుతామని పట్టుబట్టారు. తమ డిమాండ్కు అంగీకరించే వరకు ఖనౌరీలోనే బైటాయిస్తామంటూ ప్రకటించారు. దీంతో, సరిహద్దు పాయింట్ను అధికారులు మూసివేసి, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. కాంక్రీట్ బారికేడ్లను, ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. -
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
సాగునీరు ఇచ్చే సన్నద్ధత లేదా?
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో నీటి నిల్వలు పడి పోయాయనీ, అందువల్ల కృష్ణా డెల్లాకు సాగునీరు ఇవ్వలేమనీ జూలై 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రకటించింది. వరి పంట వేయ వద్దనీ, వరి పంట వేస్తే తర్వాత నీరు లేక నష్టపోయేది రైతులేననీ హెచ్చరిక జారీ చేశారు మంత్రిపుంగవులు. ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాభావంతో పాటు కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఖరీఫ్కు చాలాముందే ప్రకటించారు. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కాని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదు.జూన్– జూలై నెలల మధ్య సాగు నీరు విడుదల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. జూన్ నెలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు నీరు విడుదల తేదీలను కూటమి మంత్రులు ప్రకటించారు. మంత్రుల ప్రకటనతో అప్పులు చేసి సేద్యానికి కావాల్సిన వనరులను రైతులు సమకూర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల ఇప్పుడు సాగు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం వల్ల రైతాంగం తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నారు.జల వనరుల వ్యవస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రకాశం బ్యారేజి నీటి నిల్వ 2.978 టీఎమ్సీలు కాగా, పూర్తి నీటి మట్టం 3.071 టీఎమ్సీలు. 96.97% నీటి నిల్వ ఉన్నందువల్ల సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని నిపుణులు చెబుతున్నారు. పులిచింతలలో ప్రస్తుతం 29.039 టీఎమ్సీల నీరు ఉంది. మరి కూటమి ప్రభుత్వం సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదు?కృష్ణా డెల్టాలో ప్రధాన సేద్యం వరి. అలాంటి వరి సేద్యం చేయవద్దంటే, రైతులు ఖరీఫ్ సేద్యానికి దూరం కావడమే కదా! ప్రకాశం బ్యారేజి కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదల చేయకపోతే ఆ పంటల సేద్యం సాధ్యం కాదు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుని, పూడికలు తీసి నీటితో వాటిని నింపి ఉంటే, వాటి ద్వారా నీరు లభించేది. ఇది పాలకుల వైఫల్యం కాదా?రాష్ట్రంలోని 608 మండలాల్లో 250 మండలాలు తీవ్ర కరువు మండలాలుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో కరవును ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కరవు మండలాల్లో గ్రామీణ ఉపాధి హామీ పనులను 250 రోజులకు పెంచి గ్రామీణ పేద కుటుంబాలకు పనులు కల్పించాలి. ఆ పనుల వేతనం పెంచాలి. రైతాంగానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా ఇవ్వాలి. వారు తీసుకున్న పంట రుణాలు రద్దు చేయాలి. తాగు నీటి సమస్య లేకుండా చూడాలి. ఈ డిమాండ్ల సాధన కోసం రైతాంగం, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి.- బొల్లిముంత సాంబశివరావు, వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
చక్కెర ఫ్యాక్టరీ కోసం పోరాడుతాం.. అమర్నాథ్
సాక్షి, విశాఖ: చెరుకు రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం చేయడం దండగ అన్న విధంగా చంద్రబాబు పాలనను నడిపిస్తున్నారన్నారు. ఈ రోజు (శుక్రవారం) విశాఖలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చెరుకు రైతులను కూటమి సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చెల్లించడం లేదన్నారు.రాష్ట్రంలో ఉన్న ఆరు షుగర్ ఫ్యాక్టరీలు మూసివేసేలా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఏటికొప్పాక, తాండవ, భీమసింగ్ ఫ్యాక్టరీలను మూసివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నాడని తెలిపారు. షుగర్ రైతులను ఆదుకుంటున్నట్లు నలుగురు మంత్రులతో కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే సహకార రంగంలో నడుస్తుందని, గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి రూ. 30 కోట్లు విలువైన చెరుకు తోలారని ఇప్పటికీ రైతులకు బకాయిలు ఇవ్వలేదన్నారు.ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తామని చక్కెర పరిశ్రమల్లో రైతులే వాటాదారులని సెప్టెంబర్ నాటికి రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ప్రతిపాదన వస్తే మేము వ్యతిరేకించామని. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు రైతుల నడ్డి విరుస్తున్నాయన్నారు. చెక్కర కర్మాగారం కోసం పోరాడెందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి ప్రకటించారు. -
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తామని తెలిపింది. రైతులకు అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొంది. భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పక్షానే అత్యున్నత ధర్మాసనం ఉంటుందని స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్ చట్టాలపై అభ్యంతరాలుంటే రైతులు కోర్టులను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. -
మన వ్యవసాయ విధానాలకు పరీక్ష
ఎల్ నినో కేవలం ఏదో ఒక పరిణామం కాదు. అది భూగోళం మొత్తంమీద వాతావరణ మార్పు వైపరీత్యానికి సంకేతం. పరస్పరాధారిత జీవావరణ వ్యవస్థలకు, వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళను గుర్తు చేస్తున్న ప్రమాదఘంటిక. ఈ రకమైన ఉపద్రవం తరచు తలెత్తుతున్నా దాని దీర్ఘకాలిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో భారతదేశ సన్నద్ధత అసమతుల్యంగానే ఉంది. ఎల్ నినో ప్రభావాలను రైతులకు ఎరుక పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కృషి చేస్తున్న మాట వాస్తవమే. అయితే, వ్యవసాయ ఉత్పత్తి చుట్టూ అలముకుంటున్న అస్థిరత, పంటల తీరుతెన్నులపై పెరిగిపోతున్న ఒత్తిడిపై మరింతగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అనిశ్చితిలోనూ స్థిరమైన పనితీరుఈ నేపథ్యంలో, వ్యవసాయ స్థితిస్థాపకత విధానపరంగా ఒక ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకోవాలి. పంట నష్టాలను తగ్గించుకోవడం మాత్రమే స్థితిస్థాపకత అనిపించుకోదు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ, సాపేక్షంగా చూస్తే స్థిరమైన పనితీరు కనబరచగల వ్యవసాయ పద్ధతులను రూపొందించుకోవాలి. దీర్ఘకాలిక స్థితిస్థాపక శక్తిని సమకూర్చుకునేందుకు మౌలిక వసతులు, టెక్నాలజీ, జల నిర్వహణ, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగల వంగడాలను అభివృద్ధి చేయడం, పరిశోధనలపై పెట్టుబడులు అవసరమవుతాయి. వాతావరణ అశనిపాతాల పట్ల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తు న్నాయన్నది ఒక పార్శ్వం మాత్రమే. అటువంటి షాక్లు ఎదురవ డానికి ముందే ప్రభుత్వ సంస్థలు రైతులను ఎంత పకడ్బందీగా సన్నద్ధపరుస్తున్నాయన్నది కీలక ప్రశ్న. పంట మార్పిడిలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల ప్రయత్నాలు ఎంతవరకు సఫల మవుతున్నాయి? ప్రత్యామ్నాయ పంటలు, వాటిని నాటవలసిన కాల పరిధులు, రిస్క్–మేనేజ్మెంట్ వ్యూహాల గురించి రైతులకు సలహాలిచ్చేందుకు తగినంత సామగ్రి దిగువ స్థాయి వ్యవసాయ వ్యవస్థల వద్ద ఉంటోందా? పంటలకు నష్టాలు వాటిల్లినప్పుడు పరిహారం, బీమా, ఇతర సహాయక యంత్రాంగాలు దెబ్బతిన్న రైతుల ముంగిళ్ళకు ఎంత వేగంగా చేరుకోగలుగుతున్నాయి? కేవలం అధిక దిగుబడులను సాధించడంపైనే కాకుండా, వాస్తవిక పరిస్థితులలో స్థిరమైన పనితీరును నిలబెట్టుకోగలగడంపైనే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేశంలో కర్షకులు సుమారుగా 11.88 కోట్ల మంది ఉన్నారని, వ్యవసాయ కూలీలు 14.43 కోట్ల మేరకు ఉంటారని 2011 నాటి జనాభా లెక్కల వివరాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ వైపరీత్యాల ప్రభావం పంట పొలాలకే పరిమితం కాదనీ, అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆహార భద్రత, విస్తృత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనీ గుర్తుంచుకోవాలి. సాంకేతిక సాయంభారత వ్యవసాయ రంగం ప్రధానంగా రుతువుల మార్పులపై ఆధారపడి నడుస్తోంది. వాతావరణానికి సంబంధించి తగినంత సమాచారం లేకుండా నారుపోయడం లేదా ఇతర సేద్య కార్యకలా పాలు చేపట్టడంలో ఇబ్బందులున్నాయి. తీరా అవి చేపట్టాక వర్ష పాత ధోరణుల్లో మార్పులొస్తే, రైతులు ఆర్థికంగా నష్టపోతారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పైకి అంతగా కనిపించని దుర్భ లత్వాలలో ఇది ఒకటి. పంటలు దెబ్బతిన్నప్పుడు వచ్చే నష్టాలే కాకుండా, అనువుకాని సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఈ సమస్య ఒక పూర్తి స్థాయి సంక్షోభంగా పరిణమించకముందే, ఆ ముప్పు ఏర్పడగల అవకాశాన్ని గుర్తించడంలో ప్రవర్ధమాన టెక్నాలజీలు ముఖ్యంగా ఉపగ్రహ ఆధారిత భూ పరిశీలనలు తోడ్పడుతున్నాయి. దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు తరిగిపోతున్న వృక్ష సంపద ఆరోగ్యాన్ని గుర్తించడంలో, విస్తారమైన వ్యావసాయిక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుదల వంటివాటిని గుర్తించడంలో ఉపగ్రహ పరిశీ లనలు సహాయపడతాయి. కనుక, ఎల్ నినో విసురుతున్న సవాల్ను ఎదురు దెబ్బగా చూడనవసరం లేదు. భారతీయ వ్యవసాయ వ్యవస్థలను పటిష్టపరచుకునేందుకు లభించిన ఒక అవకాశంగా దీన్ని పరిగణించవచ్చు. అనిశ్చిత పరిస్థితుల్లో ఏ పంటలు పండించగలుగుతున్నాం, దానికి ఏ విధమైన సేద్యపు విధానాలు అనుసరిస్తున్నాం, సంస్థా పరమైన స్పందనల మెరుగుదల వంటి అంశాలకు సంబంధించి విలువైన పరిజ్ఞానాన్ని ప్రతి క్లిష్టమైన వ్యవసాయ సీజన్ నుంచి గ్రహించవచ్చు. వాతావరణంలో మార్పు గురించిన సాధారణ హెచ్చరికలు చేస్తే రైతులకు సరిపోదు. పరిస్థితిని బట్టి వివిధ పంటలు వేసుకోగల వెసులుబాటు కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉపకరణాలు, వంగడాలను అందుబాటులోకి తేవాలి. సమర్థ పంట బీమా అవసరం. అస్థిర పరిస్థితులను తట్టుకోగలిగిన విధంగా సంస్థాపరమైన మద్దతును కూడా అందించాలి.ప్రపంచమంతటా పెను ప్రభావమే!ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిపైన కూడా వాతావరణ వ్యత్యాస ప్రభావం పెరుగుతూ వస్తోందని 2026 ఆగస్టు 6న ప్రచురించిన గ్లోబల్ క్రాప్ మానిటర్ నివేదిక వెల్లడించింది. అది నాలుగు ప్రధాన (గోదుమ, మొక్కజొన్న, వరి, సోయాబీన్) పంటల స్థితిగతులను మదింపు చేసింది. సాపేక్షంగా చూస్తే గోదుమకు సానుకూల పరిస్థితులున్నాయని ఆ నివేదిక తెలిపింది. బియ్యానికి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. వరి రైతులు వాతావరణ ప్రతికూలత, నీటి సౌలభ్యం తక్కువగా ఉండటం, పంటకు చీడపీడలు సోకడంతో పాటు, దిగుబడులకు సంబంధించి ఇతర ప్రతిబంధకాలను కూడా ఎదుర్కొంటున్నారు. భారత్ విషయంలో దీని ప్రధాన సందేశం ముఖ్యమైంది. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు పెరుగు తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగిన విధంగా పంటలు రూపొందాలి. వ్యవసాయ విధానాలు వేగంగా మారిపోతున్న రిస్కు లకు తగ్గట్లుగా స్పందించగలిగిన సామర్థ్యం ఉన్నవై ఉండాలి. మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు కాదు. అది మెరుగైన సమాచారంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగినదిగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుని, ఎదురుకాగల ముప్పులను ఊహించగలిగినప్పుడే ప్రభుత్వాలు స్థితిస్థాపక శక్తి కలిగిన వ్యవసాయ వ్యవస్థలను నిర్మించగలుగుతాయి. అప్పుడే ఎల్ నినోను అడపాదడపా తలెత్తే వాతావరణ భూతంగా కాక దేశ వ్యవసాయ పాలనకు ఒక పరీక్షగా చూడటం సాధ్యపడుతుంది.– డా‘‘ సుంకరి సత్యం ‘ అసిస్టెంట్ ప్రొఫెసర్;– కంచర్ల శ్రీదేవి ‘ రిసెర్చ్ స్కాలర్; కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, హైదరాబాద్ -
ఎరువు తగ్గినా దిగుబడి పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సాధారణంగా పంటల సాగుకు ఎరువుల వినియోగం ఎక్కువే. ఎంత ఎక్కువ ఎరువు వేస్తే అంత పెద్ద మొత్తంలో దిగుబడి వస్తుందని చాలామంది రైతులు భావిస్తుంటారు. అయితే, దీనికి భిన్నంగా ఎరువులు తగ్గినా దిగుబడిని పెంచవచ్చని తాజా పరి శోధన ఒకటి పేర్కొంది. అందుకు తగిన పద్ధతులు సూచించింది. నేల స్వభావం, పోషకాల లభ్యతను జీపీఎస్ ఆధారిత మ్యాపింగ్తో గుర్తించి.. పొలంలో ఏ ప్రాంతానికి ఎంత ఎరువు అవసరమో నిర్ధారిస్తే ఎరు వుల వినియోగాన్ని భారీగా తగ్గించడంతోపాటు దిగు బడిని పెంచవచ్చని వెల్లడించింది. రాష్ట్రంలోని హనుమ కొండ జిల్లా హసన్పర్తి మండలం గుంటూరుపల్లి గ్రామంలో 1,000 హెక్టార్ల వరి సాగు ప్రాంతంపై ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎస్ఆర్ విశ్వవిద్యాలయం తదితర సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన ఫలితాలు జూలై 13న ఫ్రంటియర్స్ ఇన్ సాయిల్ సైన్స్లో ప్రచురితమయ్యాయి. 200 చోట్ల మట్టి నమూనాలుపరిశోధనలో భాగంగా 2024లో గుంటూరుపల్లి పరిధిలోని వ్యవసాయ భూముల్లో 200 భౌగోళిక స్థానాలను గుర్తించి మట్టి నమూనాలు సేకరించారు. ప్రతి నమూనా స్థానం అక్షాంశ, రేఖాంశాలతో జీపీఎస్లో నమోదు చేశారు. మట్టి పీహెచ్, విద్యుత్ వాహకత, సేంద్రియ కర్బనం, అందుబాటులోని నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి అంశాలను పరీక్షించారు. ఆ వివరాలను భౌగోళిక గణాంక పద్ధతులతో విశ్లేషించి నేల సారాన్ని బట్టి మూడు వేర్వేరు నిర్వహణ మండలాలు గుర్తించారు. అంటే రైతు పొలం మొత్తానికి ఒకే ఎరువుల మోతాదు కాకుండా ఏ ప్రాంతంలో ఎంత పోషకం ఉందో, ఎక్కడ ఎంత లోపం ఉందో గుర్తించి ఆ మేరకే ఎరువు వేయడం అన్నమాట. నత్రజని 38.6%.. భాస్వరం పూర్తిగా ఆదాసాంప్రదాయ రైతు పద్ధతితో పోలిస్తే నేల ఆధారిత సిఫార్సులతో నత్రజని వినియోగం గరిష్ఠంగా 38.6 శాతం, భాస్వరం 100 శాతం, పొటాష్ 50 శాతం వరకు తగ్గింది. అయినప్పటికీ పంట దిగుబడి తగ్గలేదు. దీనికి విరుద్ధంగా దిగుబడి ఎకరానికి సుమారు 21.4 క్వింటాళ్ల నుంచి 26.8 క్వింటాళ్లకు సమానమైన స్థాయికి పెరిగింది. అధ్యయనంలో హెక్టారుకు 53 క్వింటాళ్ల నుంచి 67 క్వింటాళ్ల వరకు దిగుబడి నమోదైంది. ఎరువుల ఖర్చు తగ్గడం, దిగుబడి పెరగడం కలసి రైతు లాభాన్ని కూడా పెంచాయి. సంప్రదాయ ఎరువుల పద్ధతిలో హెక్టారుకు నికర లాభం రూ.50,480గా ఉండగా.. ఉత్తమ నిర్వహణ మండలంలో ఇది రూ.93,415కు చేరింది. అంటే 85 శాతం పెరుగుదల నమోదైంది. ప్రయోజనం–వ్యయ నిష్పత్తి కూడా 1.66 నుంచి 2.40కు పెరిగింది.గుంటూరుపల్లి నుంచి.. రాష్ట్రమంతా సాధ్యమేనా?ఈ పరిశోధన ప్రస్తుతం ఒక నిర్దిష్ట ప్రాంతంలోని 1,000 హెక్టార్ల వరి భూమిపై జరిగిన అధ్యయనం. కాబట్టి ఇదే ఫలితాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ తప్పనిసరిగా వస్తాయని చెప్పలేం. అయితే తెలంగాణలోని వరి ప్రాంతాల్లో నేల సారంలో స్థానికంగా గణనీయమైన తేడాలు ఉన్నాయని, వాటిని శాస్త్రీయంగా మ్యాప్ చేసి ఎరువుల మోతాదును నిర్ణయిస్తే ఖర్చు తగ్గించి దిగుబడి పెంచే అవకాశం ఉందని పరిశోధన సూచిస్తోంది. అలాగే ‘ప్రిసిషన్’వ్యవసాయం అంటే కేవలం జీపీఎస్ పరికరం ఒక్కటే సరిపోదు. మట్టి నమూనాల సేకరణ, జీపీఎస్ స్థాన నిర్ధారణ, భౌగోళిక మ్యాపింగ్, పోషకాల విశ్లేషణ, పంటకు అనుగుణంగా ఎరువుల సిఫార్సులు వంటి మొత్తం వ్యవస్థ అవసరం. ప్రస్తుతం ఈ విధానం పరిశోధన స్థాయిలో మంచి ఫలితాలను చూపుతోందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఎరువు ఎక్కువైతేనే దిగుబడి ఎక్కువ అన్న పాత ఆలోచనకు బదులు.. నేల కోరినంతే ఎరువు అనే విధానం వైపు తెలంగాణ వ్యవసాయం అడుగులు వేయాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన చాటుతోంది. -
రైతు బతుకులో ‘సోలార్’ చీకట్లు
మూడు తరాల నుంచి ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాం. ఈ భూమిపై ఇప్పటికే రూ.7 లక్షల పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడేమో సోలార్ వాళ్లు నయా పైసా ఇవ్వకుండా భూములు కాజేయాలని చూస్తున్నారు. మాకు మా భూమి కావాలి. సోలార్ వద్దే వద్దు. ఉన్న భూమి పోతే మేమెలా బతకాలి? ఊరొదిలి వెళ్లిపోవాలా? – వేడిగింజల అనసూయమ్మసాక్షి, పుట్టపర్తి: రైతుల పొలాల్లో వెలుగులు నింపాల్సిన సోలార్ ప్రాజెక్టు.. అదే అన్నదాతల బతుకుల్లో చీకట్లు నింపుతోంది. పచ్చని పంట పొలాలపై సోలార్ పలకలు పరచేందుకు.. ఏళ్ల తరబడి ఆ భూములనే నమ్ముకుని జీవిస్తున్న రైతులను పక్కకు నెట్టేస్తున్నారు. మొత్తం మీద 16,000 ఎకరాలపై కన్నేయగా ముందుగా 600 ఎకరాలను ప్రైవేటు కంపెనీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. రైతుల ప్రయోజనాల కంటే కంపెనీ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని జౌకుల గ్రామంలో పరిస్థితి ఇది. 16వేల ఎకరాలలో ఈ సోలార్ ప్రాజెక్టు వస్తోందని చెబుతున్నారు. అందులోభాగంగా తొలిదశలో జౌకుల గ్రామంలో పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి ఆ భూముల్లో సాగుచేసుకుంటున్న రైతులకు పైసా పరిహారమివ్వకుండా భూముల నుంచి బలవంతంగా వెళ్లగొడుతున్నారు. అదేమంటే అధికారమదంతో బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దల దన్నుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఓ ప్రైవేటు కంపెనీతో రూ.25 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్సుకూడా తీసేసుకున్నారని వినిపిస్తోంది. కదిరి ఆర్డీఓ, పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్ చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నారు. సోలార్ ప్లాంటు వల్ల రైతులకు ఎదురవుతున్న కష్టనష్టాల గురించి తెలుసుకునేందుకు నంబులపూలకుంట మండలంలోని జౌకుల గ్రామాన్ని ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా.. పలు విషయాలు వెల్లడయ్యాయి.ముందుగా 600 ఎకరాలపై..జౌకుల గ్రామ పరిసరాల్లోని భూములపై ఇప్పుడు సోలార్ ప్రాజెక్టు నీడ పడింది. ఈ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఓ ప్రైవేటు కంపెనీ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సర్వే నంబరు 179 పరిధిలోని సుమారు 600 ఎకరాల్లో తొలి దశ పనులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ భూములను తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను ఒక్కసారిగా భూముల నుంచి దూరం చేస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. భూమిని సాగు చేసింది రైతు.. దానిపైనే కుటుంబాన్ని పోషించుకున్నది రైతు.. చివరకు భూమి పోతున్నప్పుడు పరిహారం మాత్రం శూన్యమా? అని నిలదీస్తున్నారు.శ్రీ సత్యసాయి జిల్లా జౌకులలో జేసీబీ యంత్రాలతో చేస్తున్న పనులు ప్రభుత్వ పెద్దల దన్నుతో..ప్రభుత్వ పెద్దల దన్నుతో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విపరీతంగా వ్యవహరిస్తున్నారని, తనను ఎవరూ అడ్డుకోలేరనే రీతిలో చెలరేగిపోతున్నారని రైతులు చెబుతున్నారు. తాము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నప్పటికీ ‘ప్రాజెక్టు ఆగదు.. భూములు ఇవ్వాల్సిందే’ అన్న తరహాలో ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జౌకులలో ఎకరా రూ.6లక్షల వరకు పలుకుతోంది. 600 ఎకరాలు రూ. 36 కోట్లు. కానీ రైతుల నుంచి భూములు ఇప్పించే విషయంలో సోలార్ కంపెనీకి హామీ ఇచ్చి రూ.25 కోట్ల మేర ఎమ్మెల్యే ఒప్పందం కుదుర్చుకున్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.కోటి వరకు అడ్వాన్స్గా ముట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ‘రైతులు ధర్నాలు చేసినా.. ఆందోళనలు చేపట్టినా.. ప్రాణాలు అర్పించినా.. ఉరి వేసుకుని చచ్చిపోయినా అనుకున్న మేరకు కార్యక్రమాలు కొనసాగుతాయి’ అని ఇటీవల నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు రైతులు చెబుతున్నారు. తమ సమస్యలు వినాల్సిన ప్రజాప్రతినిధి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలకంటే సోలార్ ప్రాజెక్టే ముఖ్యమా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూ.20 లక్షల పెట్టుబడి అయింది సోలార్ పేరుతో బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. పనులు చేసేందుకు యంత్రాలు వస్తున్నాయి. మొత్తం 10 ఎకరాలలో బోరు బావులు తవ్వించి, డ్రిప్ ఏర్పాటు చేసుకుని మామిడి చెట్లు నాటి పదేళ్లయింది. దాదాపు రూ.20 లక్షల పెట్టుబడి అయింది.. సోలార్ వద్దు.. మా భూమి మాకు కావాలి. పంటలు సాగు చేసుకుని బతుక్కుంటాం. – రమణస్క్రూటినీ అయ్యింది.. బుక్ ఇవ్వలేదు మాకు 3.5 ఎకరాల భూమి ఉంది. అందులో 2.5 ఎకరాలకు స్క్రూటినీ కూడా పూర్తయింది. ఈ భూమి లాగేసుకుంటే ఊరొదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి. మండల స్థాయి నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదక్షిణ చేసినా ఫలితం లేకుండా పోయింది. సోలార్ వద్దు. భూమిలో పంట వేసుకుంటాం. – బాబా ఫకృద్దీన్గొర్రెలు ఎలా మేపుకోవాలి? సోలార్ పలకలు ఏర్పాటు చేస్తే గొర్రెలు ఎలా మేపాలి? ఊర్లో చాలా గుంపుల గొర్రెలు ఉన్నాయి. అందరికీ నష్టమే. నా దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. నాకు 9 ఎకరాల భూమి ఉంది. అది కూడా సోలార్కు లాగేయాలని చూస్తున్నారు. సోలార్ వస్తే బయట ప్రాంతాలకు వెళ్లేందుకు దారి కూడా ఉండదు. – మస్తాన్ వలి30 ఏళ్లుగా సాగులో ఉన్నాం మేం 30 ఏళ్ల నుంచి సాగులో ఉన్నాం. ఇప్పటి వరకు పది బోర్లు వేయించగా, మూడు చోట్ల నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికే సుమారు రూ.5 లక్షల పెట్టుబడి అయ్యింది. బలవంతపు భూమి లాక్కోవాలనుకుంటే ఊరుకునేది లేదు. డబ్బులన్నీ భూమిపై పెట్టాం. భూమి పోతే రోడ్డున పడాల్సిన పరిస్థితి. – ఆర్.నగేశ్ఆత్మహత్యలే గతి మా తాతల కాలం నుంచి సాగులో ఉన్నాం. నిమ్మ సాగు చేస్తున్నాం. ఈ భూమి కూడా లాగేసుకుంటే ఆత్మహత్యలే గతి. రైతులకు పరిహారం చెల్లించకుండా సోలార్కు భూములు లాక్కోవాలని చూస్తే ఊరంతా ఖాళీ అవుతుంది. – ఖాదర్ వలిజీవాలకు గ్రాసమూ ఇబ్బందే.. మా గ్రామానికి ఈ భూములే జీవనాధారం. కొందరు పంటలు వేసుకుంటారు. ఇంకొందరు పశువులు, గొర్రెలు మేపుతుంటారు. సోలార్ ఏర్పాటు చేస్తే చిన్న జీవాలకు గ్రాసం ఇబ్బంది అవుతుంది. వేరే ఆధారం లేదు. ఊరొదిలి వలస వెళ్లాల్సిందే. సోలార్ను మా ఊరికి రానివ్వం. – వల్లెపు భారతిమా భూమి ఇచ్చేది లేదు..మా తాతల కాలం నుంచి సాగులో ఉన్నాం. శెనక్కాయ, వంకాయ, టమాట పంటలు వేస్తుంటాం. అప్పు చేసి బోరు బావి తవ్వించా. నీళ్లు పడ్డాయి. సోలార్కు ఇచ్చే పరిస్థితి లేదు. – వేమల రామచంద్ర -
అనుబంధ వ్యవసాయమే జీవధార
ఈ రోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగాపంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇదే భావనతో శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు ‘ద్వితీయ వ్యవసాయం’ (సెకండరీ అగ్రికల్చర్) అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు. ‘పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవ డమే ద్వితీయ వ్యవసాయం’.విలువ జోడించండి–ఎక్కువ ధరను పొందండిచాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్కు తీసు కెళ్లి అమ్మేస్తారు; అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది. వరిని బియ్యంగా మార్చడం, బియ్యంతో అటుకులు, మరమరాలు తయారు చేయడం, వేరుశనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం, మిరపతో మిరప పొడి తయారు చేయడం, పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం, మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం ఈ కోవలోకే వస్తాయి. దీనివల్ల రైతు సాధారణంగాపొందే ధర కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన, స్థిరమైన మార్గం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ–టు–కుక్, రెడీ–టు–ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో గణనీయమైన నష్టం కోత అనంతరం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఒక గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది. అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.అనుబంధ ఆదాయ మార్గాలురైతు ఇంట్లో రెండు ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు నగదు ఆదాయం వస్తుంది. పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్ తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది. పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి. అలాగే తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు. దీని ద్వారా తేనె, బీస్వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి. వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషా లను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు. చిన్న గదిలోనే సాగు చేయవచ్చు. వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు. వరిసాగుతో పాటు చేపల పెంపకం చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయంపొందవచ్చు. వ్యవసాయం, పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి. పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడ తాయి. వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి పశువుల పేడ ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవ శేషాలను కాల్చివేస్తారు. అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్, బయోగ్యాస్, బయోచార్కు వినియోగించ వచ్చు.స్వపరాగ సంపర్క పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, ఉలవలు, వేరుశనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. తక్కువ విస్తీర్ణంలో సాగుచేయగలిగే మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభ వించడానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు, గ్రామీణ ఆహారం, పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు.పోషకాహార లోపం తొలగించేలా...పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బ తింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. సొంత వినియోగానికే కాకుండా... గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా ఆదాయం ఉంటుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలురకం కోడి పిల్లలను పెంచవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే.సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే... గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది.ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం, జాతీయ తేనెటీగలు మరియు తేనె మిషన్, డెయిరీ అభివృద్ధి పథకాలు, నాబార్డ్ గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు. నేటి పరిస్థితుల్లో ‘పంట పండించడం మాత్రమే కాదు... పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం. ‘వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం’ అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాలి.– డా‘‘ కె. తేజస్వర రావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి-ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ సీనియర్ శాస్త్రవేత్తలు -
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
-
వరి సాగుచేయొద్దు.. నీళ్లు ఇవ్వలేం..!
కోడూరు: ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగాల్సిన వేళ సాగునీటి సమస్యపై కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీని కలిసి వినతిపత్రం అందించిన రైతులకు ఊహించని సమాధానం ఎదురైంది. నీళ్లు ఇవ్వలేమని, రైతులు ఎవరూ వరి సాగు చేయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ బాలాజీ బుధవారం కోడూరు మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయం వద్దకు వచ్చిన కలెక్టర్ను మండలానికి చెందిన పలువురు రైతులు, రైతు సంఘ నేతలు కలిసి కాలువలకు సాగునీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. దీనికి స్పందించిన కలెక్టర్ ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీరు పూర్తిగా తాగునీటి అవసరాలకూ సరిపోకపోవచ్చని, పంటలకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని చెప్పారు. సాగునీటి కోసం రైతులు ఆశలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. కుటుంబాలను ఎలా పోషించాలి? కలెక్టర్ వ్యాఖ్యలతో తీవ్ర నిరాశకు గురైన రైతులు ‘వరి వేయుద్దని చెబుతున్నారు. సరే. మరి మా కుటుంబాలను ఏవిధంగా పోషించాలి?’ అని కలెక్టర్ను ప్రశ్నించారు. ఒకవైపు కాలువల వద్ద పూజలు నిర్వహించి నీటి విడుదల కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రచారం చేస్తూ, మరోవైపు సాగునీరు ఇవ్వలేమని చెప్పడం ఏమిటని, ఇప్పటికే సాగు ప్రారంభించిన పంటల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రైతులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం దాటవేశారు. వరికి ప్రత్యామ్నాయంగా పెసర, మినుము వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. సాగునీరు అందించే పరిస్థితి లేకపోతే కనీసం పరిహారమైనా ప్రకటించాలని అన్నదాతలు కలెక్టర్ను కోరారు. అయితే పరిహారంపై కలెక్టర్ నోరు మెదపకుండా, స్పష్టమైన హామీ లేదా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. కలెక్టర్ను కలిసిన వారిలో రైతు సంఘ జిల్లా నేతలు ఆవుల బసవయ్య, రేపల్లె యోగప్రకాష్ ఉన్నారు.కలెక్టర్ రైతులతో మాట్లాడే సమయంలో వీడియోలు తీయవద్దంటూ విలేకరులకు సిబ్బంది హుకుం జారీ చేయడం గమనార్హం. -
బాబు పాలన 'రైతులకు హానికరం'
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. మొత్తం ఉత్పత్తిలో సుమారు 21 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితి ఇది. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా.– వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు నాయుడు పరిపాలన రైతులకు హానికరం.. వ్యవసాయానికి ప్రమాదకరం.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితులే నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గతంలో కిలో పొగాకు ధర సగటున రూ.289 ఉంటే ఇప్పుడు రూ.214 మాత్రమే పలుకుతోందని.. ప్రతి కిలోపై రైతు రూ.75 చొప్పున నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా పొగాకు అత్యధిక ధర కిలో రూ.411 పలికితే.. ఇప్పుడు కేవలం రూ.214 మాత్రమే ఉందని, ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పీఐబీ’ అధికారికంగా విడుదల చేసిన గణాంకాలని తెలిపారు. ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నీ పెరుగుతుంటే.. మరోవైపు రెండేళ్ల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదన్నారు. పొగాకు కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని.. ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం రిజెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దగా సర్కారు తీరుతో నష్టపోతున్న పొగాకు రైతులతో స్వయంగా మాట్లాడేందుకు బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటించారు. దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. పొగాకు సాగు, కొనుగోళ్ల పరిస్థితి, రైతులకు అందుతున్న ధర, ఎదుర్కొంటున్న సమస్యలను వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతుల ఇక్కట్లు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చించారు. అనంతరం పొగాకు వేలం కేంద్రం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...అన్నింటా విధ్వంసం.. ప్రశ్నిస్తే అరెస్టులు చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనలో అన్ని వర్గాలూ నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు.. మహిళా సాధికారత.. సుపరిపాలన.. అన్నింటిలోనూ విధ్వంసమే కనిపిస్తోంది. బాబు పాలనలో పొద్దున లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అంటే.. ఎవరైనా అన్యాయానికి గురైన పరిస్థితుల్లో ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. ఇవి మాత్రమే కనిపిస్తాయి. రోడ్డెక్కుతున్న రైతులు.. చంద్రబాబు నాయుడు పార్టీ అంటే.. వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇంకేమైనా మిగిలిందా..? అని అడుగుతున్నా. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలలుగా ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధరలు వచ్చాయా..? వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీనీ.. చివరకు ఆక్వా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈ రోజు నేను దేవరపల్లికి వచ్చి పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నా. పొగాకు పంటను తీసుకున్నా.. ఇవాళ కనిపిస్తున్నది సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డున పడి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శ లేదు జంగారెడ్డిగూడెం సమీపంలోని బుట్టాయగూడెం మండలానికి చెందిన వెంకటేశ్వరరావు అన్న కుటుంబం నా కళ్ల ఎదుటే నిలబడి ఉంది. ఆ అన్నకు రెండు బ్యారెన్లు ఉన్నాయి. పది ఎకరాల్లో పంట సాగు చేసి.. గిట్టుబాటు ధర రాక, పంటను అమ్ముకునే పరిస్థితి లేక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆ అన్న భార్య ఈ రోజు నా ఎదుట నిలబడి ఉంది. ఆ అమ్మ ఆక్రందన వినేందుకు, పరామర్శించేందుకు ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రి కానీ వెళ్లలేదు. రేట్లు అన్యాయంగా పడిపోతున్నా.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కనీసం పరామర్శ కూడా చేయని ప్రభుత్వం ఇది. నాడు పొగాకుకు అత్యధికంగా రూ.411.. ఇప్పుడు కేవలం రూ.214 మాత్రమే ఒక్కసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పరిస్థితిని గుర్తు చేసుకుందాం. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలు కలిపి పొగాకు సగటు ధర కిలోకు రూ.289 చొప్పున లభించింది. అత్యధిక ధర కిలో రూ.411 చొప్పున కొనుగోలు జరిగింది. ఇవి నేను చెబుతున్న లెక్కలు కాదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) 2025 జనవరి 1న అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విడుదల చేసిన గణాంకాలివీ. ఇవాళ పరిస్థితి చూస్తే.. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలు కలిపి రాష్ట్రంలో కిలో పొగాకు సగటు ధర కేవలం రూ.214 మాత్రమే. ఎక్కడ రూ.289?.. ఎక్కడ రూ.214? అంటే.. ఒకప్పుడు రూ.289 వచ్చిన చోట ఇప్పుడు రూ.214 మాత్రమే వస్తోంది. ప్రతి కిలోపై రైతు సుమారు రూ.75 నష్టపోతున్నాడు. ఇదే ఉత్తరాది ప్రాంతంలో, ఇదే దేవరపల్లి ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో పొగాకు కిలో సగటు ధర రూ.326 పలికింది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఆ సగటు ధర కేవలం రూ.236కి పడిపోయింది. ఖర్చులు పెరిగాయి.. ధరలు పతనం ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నీ పెరుగుతున్నాయి. మరోవైపు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదు. పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఉత్తరాదిలో 12 శాతమే కొనుగోలు.. ఈ ఉత్తరాది ప్రాంతంలో సుమారు 83 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. 105 రోజుల వేలం ముగిసే సమయానికి కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కిలోలు మాత్రమే. అంటే పండించిన పంటలో సుమారు 12 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. టొబాకో బోర్డు రైతులకు గ్యారెంటీ ఇస్తూ లిఖితపూర్వకంగా హామీ కూడా ఇచ్చింది. పంట వేయండి, మేం కచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పింది. 49.70 మిలియన్ కిలోలు టార్గెట్గా నిర్థారించి కొనుగోలు చేస్తామని చెప్పింది. వాళ్లు కొంటామని చెప్పిన తరువాతే రైతులు పంటలు వేశారు. ఆ హామీని నమ్మి సాగు చేశారు. ఇప్పుడు హామీ ఇచ్చిన మేరకు కొనుగోలు జరగడం లేదు. దేవరపల్లి వై జంక్షన్ వద్ద వైఎస్ జగన్కు బ్రహ్మరథం పట్టిన అశేష జనవాహినిలో ఓ భాగం పొగాకు రైతులకు దుర్భర పరిస్థితి.. రాష్ట్రంలో రైతులు నమ్మి పంట వేస్తే.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? టొబాకో బోర్డు లిఖితపూర్వకంగా రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నమ్మి రైతులు పంట వేశారు. కానీ చివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. అంటే హామీ ఇచ్చిన పరిమాణంలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. 105 రోజుల వేలం ప్రక్రియ ముగిసిపోయినా రైతుల వద్ద ఇంకా పెద్ద మొత్తంలో పొగాకు నిల్వలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం రైతులకు ఎంతటి దుర్భర పరిస్థితిని తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. నా పర్యటన ప్రకటనతో రూ.10 పెంపు నేను దేవరపల్లి వస్తున్నానని ప్రకటించిన తర్వాత గత వారం, పది రోజులుగా కిలోకు సుమారు రూ.10 ధర పెరిగింది. లేదంటే ఆ పెంపు కూడా ఉండేది కాదు. సిండికేట్ పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడ అత్యధిక ధర రూ.260 నుంచి రూ.262 వరకు మాత్రమే ఉంది. సగటు ధర రూ.174 వరకు పడిపోయింది. ఈ ధరలతో రైతు ఎలా బతుకుతాడు? ఎలా అప్పులు తీర్చుకుంటాడు? ఎలా మళ్లీ పంట వేస్తాడు? దళారులు సిండికేట్ అయినా నో యాక్షన్.. పొగాకు పంట కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం వరకు పొగాకును రిజెక్ట్ చేస్తున్నారు. ‘నో బిడ్స్‘ పేరుతో వేలంలో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దళారీ వ్యవస్థ పేట్రేగిపోయి అంతా సిండికేట్గా మారినా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కొనుగోలుదారుడిని కూడా బ్లాక్లిస్ట్ చేయలేదు. ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయలేదు. చంద్రబాబు కంటితుడుపు మాటలు.. మరో తమాషా ఏమిటంటే.. పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నారని చంద్రబాబు ఇప్పుడు గమనించారట! రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు మూడేళ్ల పాటు ఇస్తామని చెబుతున్నారు. అయ్యా చంద్రబాబునాయుడూ మా ప్రభుత్వ హయాంలో రూ.లక్ష వరకు సున్నా వడ్డీ పంట రుణాలు పథకం ఉండేది. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే రూ.లక్ష వరకు సున్నా వడ్డీకే అందించాం. 84.66 లక్షల మంది రైతులకు రూ.2,050 కోట్ల మేర సున్నా వడ్డీ కింద ఇచ్చి ఆదుకున్న చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. మరి మీరు ఏం చేశారు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. రైతులకే కాదు, మహిళలకూ సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. అందరినీ రోడ్డు మీద పడేసి.. కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లుగా, రూ.50 వేల వరకు ఇస్తామని, ఇక పండుగ చేసుకోమని డ్రామాలు ఆడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అని చంద్రబాబును నిలదీస్తున్నా. ఆదుకుంటాం.. రెట్టింపు సాయం చేస్తాంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఒత్తిడి తెస్తుంది. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న లాంటి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అండగా ఉంటాం. ఇది ప్రభుత్వ తప్పిదం కాబట్టి.. ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి.. ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా రూ.7 లక్షలు ఇవ్వడం లేదు కాబట్టి.. ఇవ్వని కారణంగా, ఆ రూ.7 లక్షలను డబుల్ చేసి, ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేస్తాం. మన ప్రభుత్వంలో ఏం చేశామంటే..అదే మన ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్క్ఫెడ్ను వెంటనే రంగంలోకి దింపాం. మార్క్ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించగానే ప్రతి గ్రేడ్కు కనీస ప్రారంభ ధర నిర్ణయించాం. దీంతో కంపెనీల మధ్య పోటీ పెరిగింది. రైతులకు మంచి ధర వచ్చింది. రిజెక్ట్లు, ‘నో బిడ్స్‘ పరిస్థితి తగ్గింది. ఇదీ గతంలో జరిగింది! అంతే కాదు.. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఐదేళ్లలో రూ.7,800 కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని ఆదుకుంది.దేవరపల్లిలో హెలిప్యాడ్ సమీపాన వైఎస్ జగన్ను చూడటానికి భారీగా తరలివచ్చిన జనసందోహంలో ఓ భాగం ఇప్పుడు చేతులెత్తేసిన సర్కారు...ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తోంది ఏమిటంటే.. దళారులతో రాజీ పడింది. నాకింత.. నీకింత అని కంపెనీలతో సర్దుబాట్లు చేసుకుంది. చేసుకుంది కాబట్టే.. మార్క్ఫెడ్ను పోటీ కొనుగోలుదారుగా మార్కెట్లోకి తీసుకురాలేదు. రైతును పూర్తిగా దళారుల దయాదాక్షిణ్యాలకే వదిలేసింది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మరో అన్యాయం ఏమిటంటే.. రాష్ట్రంలో 232 మిలియన్ కిలోల పొగాకు పండితే, ప్రభుత్వం కేవలం 94 మిలియన్ కిలోలకు మాత్రమే మద్దతు ఇస్తామని చెబుతోంది. అంటే.. మిగతా పంటను కొనుగోలు చేయబోమని చెప్పకనే చెబుతోంది. కంపెనీలకు కిలోకు రూ.20 సబ్సిడీ ఇస్తామని ప్రకటిస్తోంది. అంటే కంపెనీలు.. ఇప్పుడున్న ధర కంటే రైతులకు మరో రూ.20 తగ్గించి ఇచ్చేందుకు దారులు తెరిచింది. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సింది పోయి.. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం పనిచేయాల్సింది పోయి, కంపెనీల ప్రయోజనాల కోసం విధానాలు రూపొందిస్తోంది. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా. వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపాలి. ప్రతి గ్రేడ్కు కనీస మద్దతు ధర ప్రకటించాలి. మార్కెట్లో పోటీ వాతావరణం తీసుకురావాలి. అప్పుడు మాత్రమే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మా ప్రభుత్వం హయాంలో ఇదే విధానాన్ని అమలు చేసి పొగాకు రైతులను ఆదుకున్నాం. ఇప్పుడు అదే మార్గం మాత్రమే రైతును కాపాడగలదు.రెండేళ్లుగా రైతులకు దగా..రైతులను రెండేళ్లుగా అన్ని విధాలా చంద్రబాబు అన్యాయం చేశారు. ఎన్నికల సమయంలో పీఎం కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికీ ఏడాదికి రూ.20 వేల చొప్పున ‘అన్నదాత సుఖీభవ‘ పేరుతో ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మూడేళ్లకు కలిపి చంద్రబాబు ప్రతి రైతుకు రూ.60 వేలు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రావాల్సిన రూ.41 వేలు ఇవ్వకుండా ఎగరగొట్టారు. పైగా సుమారు 7 లక్షల మంది రైతులను ఈ పథకం జాబితా నుంచే తొలగించారు. కౌలు రైతులను తీసేశారు. అటవీ హక్కుల చట్టం కింద భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులను కూడా పథకం నుంచి తప్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని సైతం చంద్రబాబు రద్దు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో పంట నష్టం జరిగినా, అదే సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవాళ్లం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? మొంథా తుపాను వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు గతంలో అందిన సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వ్యవసాయ పరీక్షా ల్యాబ్లను బలహీనపర్చారు. రైతులకు అవసరమైన ఎరువుల ధరలు రెండేళ్లలో విపరీతంగా పెంచేశారు. మరోవైపు బ్లాక్లో దళారీల వద్ద రైతన్నలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉంది. ఆ ఒక్క పంటకే గిట్టుబాటు ధర.. సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే.. చంద్రబాబు హయాంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా..? అది గంజాయి!బాబు వింత మాటలు.. అంతా ఢమాల్ చంద్రబాబునాయుడు అంటాడు.. బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేసే కార్యక్రమం చేశాడు. మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందట! కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేశాడు. మామిడి తింటే షుగర్ వస్తుందట! అందుకే మామిడి పంటను ఢమాల్ చేశాడు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులను రోడ్డు మీదకి తెచ్చారు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బ తింటుందట! పొగాకుకు మంచి రేటు వస్తే బాగుండదని చెప్పి, పొగాకు రైతులను కూడా ఢమాల్ చేశాడు. కాబట్టి చంద్రబాబు పరిపాలన రైతులకు హానికరం.. వ్యవసాయానికి ప్రమాదకరం అన్నట్లుగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులున్నాయి. -
పొలాల్లో పాములు రైతు మిత్రులా? శత్రువులా?
పంట పొలాల్లో కనిపించే పాములు మనకు ప్రాణాంతక శత్రువుల్లాగే కనిపిస్తాయి. కానీ, అవగాహనతో చూస్తే.. నిజానికి అవి ఉచితంగా పంటలను కాపాడేందుకు ప్రకృతి ప్రసాదించిన రైతు మిత్రులేనని అర్థమవుతుంది. దేశంలో ఏటా 15–20 శాతం ధాన్యం ఉత్పత్తి ఎలుకలు, పందికొక్కుల వల్ల నాశనమవుతోందని అంచనా. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతులకు ఏటా రూ.2 వేల కోట్లకుపైగా ప్రత్యక్ష ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఒక జత ఎలుకలు ఒక ఏడాది వ్యవధిలో 800 నుంచి 1,000 వరకు సంతతిని పెంచగలవు. వీటిని అరికట్టటానికి విష రసాయనాలను రైతులు వాడుతుంటారు. అవి నేల సారాన్ని పాడుచేయటమే కాకుండా, ఇతర జీవులకు ప్రాణసంకటంగా మారుతున్నా యని నిపుణులు చెబుతున్నారు. 80% పాములతో ప్రమాదం లేదుమన దేశంలోని పొలాల్లో కనిపించే పాముల్లో 80 శాతానికి పైగా (జెర్రిపోతు వంటివి) అసలు విషం లేనివే. ఒక నాగు పాము లేదా జెర్రిపోతు తన జీవితకాలంలో వేలాది ఎలుకలను వేటాడి తింటుంది. అయితే, ఈ విషయంపై అవగాహన లోపి స్తోంది. 20% విషపూ రిత పాముల భయంతో.. కనిపించిన పామునల్లా చంపటం వల్ల పొలాల్లో ఎలుకల జనాభా విపరీతంగా పెరిగి రైతులకు రెట్టింపు నష్టం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.పాముల నుంచి రక్షణ ఎలా?పాము కాట్ల వల్ల గత పాతికేళ్లలో మన దేశంలో లక్షా ఇరవై వేల మంది చనిపోయారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతమంది ఈ కారణంతో చనిపోవటం లేదు. పొలాల్లో రాత్రివేళల్లో టార్చ్లైట్ ఉపయోగించటం, లాంగ్ గమ్ బూట్లు ధరించటం వంటి చర్యల ద్వారా 90% వరకు పాము కాటు ప్రమాదా లను అడ్డుకోవచ్చని అధ్యయనాలు చెబుతు న్నాయి. ఏఐ వంటి ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన పాములను పారదోలే ఎలక్ట్రానిక్ చేతి కర్రలు వంటి ఆధునిక పరికరాలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని రైతులకు అందుబాటు లోకి తేవటానికి ప్రభుత్వం చర్యలు తీసుకో వాలి. అంతేకాదు, పాము కాటు బాధితుల ప్రాణరక్షణ కోసం గ్రామీణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీవెనమ్ను అందుబాటులో ఉంచాలి. పాముల సమస్యపై గ్రామీణులు, రైతులకు అవగాహన కల్పించటంపైనా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
మద్దతు ధర కోసం పొగాకు రైతుల ఆందోళన
పర్చూరు (చినగంజాం)/కందుకూరు: పొగాకుకు మద్దతు ధర కోరుతూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తుండగా.., బాపట్ల జిల్లా పర్చూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేసి, రాస్తారోకో చేశారు. పొగాకుకు మద్దతు ధర ఇవ్వాలని, చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా పర్చూరులో పొగాకు రైతులు సోమవారం భారీ ర్యాలీ, ధర్నా చేశారు. పొగాకు కాడల దండలు చేత పట్టుకొని పర్చూరు బస్టాండ్ సెంటర్ నుంచి బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ చేశారు.అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం బొమ్మల సెంటర్లో ధర్నా చేశారు. వైఎస్సార్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, మహిళా రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. బొమ్మల సెంటర్ వద్ద పొగాకు రైతులు శాంతియుతంగా చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.రైతులు, మహిళలను వారిని ప్రతిఘటించడంతో పోలీసులు అక్కడి నుంచి తప్పుకొన్నారు. రైతులు అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్ బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ రైతుల నుంచి పొగాకు చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని అన్నారు.కందుకూరులో కొనసాగుతున్న ఆందోళన ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో పొగాకు రైతుల ఆందోళన కొనసాగుతోంది. కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రం వద్ద రైతులు ధర్మ దీక్ష పేరుతో నిరసన దీక్షను కొనసాగించారు. పామూరు రోడ్డులోని రెండో కేంద్రంలో వేలాన్ని అడ్డుకున్న రైతులు రాస్తారోకో చేశారు. రైతులకు ఏపీ రైతు సంఘం సంఘీభావం ప్రకటించి, ఆందోళనలో పాల్గొంది. పొగాకు బోర్డు ఆర్ఎం వేలం కేంద్రం వద్దకు వచ్చి రైతులతో చర్చించారు. పొగాకు క్వింటా రూ.30 వేలకు కొనాలని రైతులు డిమాండ్ చేశారు. -
రెండెకరాల్లో దేశీ ఆవులతో... నెలకు రూ. 1.4 లక్షల ఆదాయం!
మాగాణి భూముల్లో పాడి పరిశ్రమ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, దేశవాళీ పాడి ఆవుల సంతతిని పెంచడంతో పాటు రైతులకు స్థిరమైన, నిరంతర ఆదాయం అందించేందుకు సేవ్ స్వచ్ఛంద సంస్థ ఒక ప్రణాళికను అందుబాటులోకి తెచ్చింది.కేవలం రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా సరైన ప్రణాళికతో సమగ్ర పాడి పరిశ్రమను చేపడితే నెలకు కనీసం రూ. 1,40,000 ఆదాయం పొందవచ్చని సేవ్ వ్యవస్థాపకులు మేకపోతుల విజయరామ్ వెల్లడించారు. తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు కూడా సమగ్ర పద్ధతిలో దేశవాళీ గోవులను పోషిస్తూ లాభదాయక పాడి వ్యాపారవేత్తలుగా మారటానికి ఈ నమూనా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఎకరంలో హీరామణి గడ్డి సాగుఈ మోడల్లో 2 ఎకరాల భూమిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక రూపొందించారు. ఒక ఎకరంలో పశుగ్రాసం సాగుకు కేటాయించాలి. ఆవులకు అవసరమైన పోషక విలువలు కలిగిన ‘హీరామణి గడ్డి’తో పాటు అధిక ్రపోటీన్ ఉండే అవిశ మొక్కలను కూడా కలిపి సాగు చేయాలి. చాప్ కట్టర్ ద్వారా గడ్డిని ముక్కలుగా కట్ చేసి పశువులకు ఆహారంగా అందించాలి.ఆవులు స్వేచ్ఛగా తిరగాలిపావెకరంలో ఆవుల రక్షణ, పోషణ కోసం షెడ్డు నిర్మించుకోవాలి. ఎండా కాలమైనా వర్షాకాలమైనా కూడా ఆవులను నిరంతరం కట్టేసి ఉంచకూడదు. అవి ఉల్లాసంగా తిరగటానికి అనువుగా భూమిని ఎత్తు లేపి ఒక పావెకరం మెరక స్థలం ఏర్పాటు చేయాలి. ఎండుగడ్డి/ వరిగడ్డి వాము వేసుకోవటానికి మరో పావెకరం కేటాయించాలి. మిగతా పావెకరం భూమిని కేటాయించి ΄÷లం చుట్టూ వెడల్పాటి గట్లు ఏర్పాటు చేసుకోవాలి. అరటి, మామిడి, కొబ్బరి వంటి పండ్ల చెట్లను పెంచాలి. తద్వారా అదనపు ఫలసాయం పొందే వీలుంది.పాలు లేదా నెయ్యి...ఈ విధానంలో 10 దేశవాళీ ఆవులతో పాటు ఒక దేశీ గోజాతి నంది (ఆబోతు)తో పాడి ఫారమ్ను ్రపారంభించాలి. ఒక్కో ఆవు రోజుకు సగటున 8 లీటర్ల పాలు (పూటకి 4 లీటర్లు) ఇస్తుంది. ఏడాది ΄÷డవునా 8 ఆవుల ద్వారా రోజుకు కనీసం 60 నుంచి 64 లీటర్ల పాల దిగుబడి వస్తుంది. దేశీ ఆవు పాలలో ఔషధ గుణాలున్నందున లీటరు రూ. 80కి తగ్గకుండా అమ్ముకునే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఒక వేళ పాలు అమ్మలేకపోతే సంప్రదాయ పద్ధతిలో నెయ్యి తయారు చేసి అమ్ముకున్నా అందుకు తగినంత ఆదాయం వస్తుంది.ఈ లెక్కన రోజుకు 60 లీటర్ల పాల అమ్మకం ద్వారా రోజుకు రూ. 4,800 సంపాదించవచ్చు. తద్వారా నెలకు ఎంత లేదన్నా రూ. 1.4 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. తమ దగ్గర శిక్షణ పొంది ఆవు పేడ, మూత్రంతో అనేక ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి విక్రయించుకోవటం ద్వారా మరింత ఆదాయం పొందవచ్చని విజయరామ్ వివరించారు. ‘మచిలీపట్నం సమీపంలోని తరకటూరు, వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నాగసముందర్ దగ్గర గల తమ గోశాలల్లో 15 అడుగుల ఎత్తు హీరామణి గడ్డి సాగులో ఉంది. ఆసక్తిగల రైతులు సందర్శించవచ్చు’ అని విజయరామ్ (63091 11427) తెలిపారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: ఏఐతో తెగుళ్లకు చెక్!
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత నూతన దారులు చూపుతోంది. పంటలకు సోకే తెగుళ్లను ఆరంభ దశలోనే గుర్తించి, సరైన నివారణో΄ాయాలు సూచించేలా హైదరాబాద్లోని ‘విఎన్ ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ పరిశోధకులు ఒక అత్యాధునిక ఏఐ వ్యవస్థకు రూపకల్పన చేశారు.కన్వొల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ను ఉపయోగించి ఆకుల తెగుళ్లను గుర్తించే విధా రూపొందించారు. ఈ ఆవిష్కరణను సీఎస్ఈ విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ ్ర΄÷ఫెసర్ డాక్టర్ ఆర్ విజయ సరస్వతి మరో 9 మంది పరిశోధకులతో కలసి రూపొందించిన ఈ సాంకేతికతకు భారత ప్రభుత్వ పేటెంట్ లభించింది. పంటలకు వచ్చే రకరకాల తెగుళ్లను సకాలంలో గుర్తించకపోవటం వల్ల రైతులు ప్రతి సంవత్సరం తీవ్ర దిగుబడి నష్టాన్ని చవిచూస్తున్నారు.టొమాటో, బంగాళాదుంప, క్యాప్సికమ్ పంటలకు చెందిన 20 వేల ఆకుల చిత్రాల డేటాసెట్ను ఉపయోగించి వీఎన్ ఆర్ వీజీఐఈటీ నిపుణులు పరిశోధన చేశారు. పంటల్లో సాధారణంగా కనిపించే ప్రధాన తెగుళ్లను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఏఐ వ్యవస్థ పంట ఆకుల చిత్రాలను విశ్లేషించి 97.7% కచ్చితత్వంతో ఆరంభ దశలోనే తెగుళ్లను పసిగడుతుంది. అంతేకాకుండా, ఆ తెగులు నివారణకు వాడాల్సిన తగిన క్రిమిసంహారక మందులను కూడా సూచిస్తుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ, పరాగసంపర్కం, మొక్క పెరుగుదల దెబ్బతినక ముందే జాగ్రత్తపడొచ్చని డా. విజయ సరస్వతి తెలి΄ారు.రైతులకు త్వరలోనే అందుబాటులోకి..!నేను రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను. పంటలను ఆశించే తెగుళ్లను ఆలస్యంగా గుర్తించటం వల్ల ఎకరాలకు ఎకరాలు పంట నాశనమై రైతులు పడే ఆవేదనను దగ్గర్నుంచి చూశాను. ఆ అనుభవమే ఈ పరిశోధనకు పునాది వేసింది. ప్రస్తుతం వెబ్ ఇంటర్ఫేస్లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. మొబైల్ అప్లికేషన్ను రూపొందిస్తున్నాం. ఇది త్వరలోనే రైతులకు అందుబాటులోకి వచ్చి పంట నష్టాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నాను.– డాక్టర్ విజయ సరస్వతి, వీఎన్ ఆర్ వీజీఐఈటీ, ప్రధాన పరిశోధకురాలునిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఇక్రిశాట్కు క్రిస్పర్ కాస్9 సాంకేతికత!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చిన్న, సన్నకారు రైతుల ఆహార భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త జన్యు సవరణ వంగడాల రూపకల్పన దిశగా హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) ఒక చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్) పరిజ్ఞానమైన ‘క్రిస్పర్ కాస్9’ను సుదీర్ఘకాలం పాటు ఉపయోగించుకునేందుకు అమెరికా కంపెనీల నుంచి ఇక్రిశాట్ తాజాగా హక్కులు పొందింది. క్రిస్పర్ కాస్9 సాంకేతికతపై ప్రధాన పేటెంట్లు అమెరికా సంస్థలకు ఉన్నాయి.మన దేశంలో శాస్త్రవేత్తలు పరిశోధనల స్థాయిలో ప్రయోగశాలల్లో దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, దాని ఆధారంగా రూపొందించిన జన్యుమార్పిడి విత్తనాలను వాణిజ్యపరంగా రైతుల వద్దకు తీసుకెళ్లటానికి అత్యధిక లైసెన్సింగ్ రుసుం చెల్లించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో క్రిస్పర్ కాస్9 జన్యుసవరణ సాంకేతికత సొంతదారులైన అమెరికా సంస్థలు కోర్టేవా అగ్రిసై¯Œన్స్, బ్రాడ్ ఇ¯న్స్టిట్యూట్లు మానవతా దృక్పథంతో ఇక్రిశాట్కు ఉచితంగా దీర్ఘకాలిక లైసెన్స్ ఇవ్వటం విశేషం. తద్వారా ఎలాంటి పేటెంట్ వివాదాలు లేకుండా, అతి తక్కువ ఖర్చుతో ఇక్రిశాట్ పరిశోధనలు పూర్తి చేసేందుకు, లైసెన్సింగ్ రుసుము నుంచి మినహాయింపు పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఇదో మైలురాయి: ఇక్రిశాట్ డీజీ: ఈ ఒప్పందం ద్వారా అభివృద్ధి చేసే పంటల విత్తనాలపై పేటెంట్ భారం ఉండదు కా బట్టి, ఆసియా, ఆఫ్రికాలోని పేద రైతులకు వాతావరణ మార్పు ల వల్ల సంభవించే అనావృష్టి, తీవ్రమైన కరువు, కొత్త రకం తెగుళ్లను తట్టుకునే కంది, శనగ, వేరుశనగ, జొన్న, సజ్జ, ఇతర చిరుధాన్యాలకు సంబంధించి సరికొత్త జన్యుసవరణ విత్తనాలు అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయి.‘ఈ ఒప్పందం ఇక్రిశాట్కు, మెట్ట వ్యవసాయంపై ఆధారపడిన లక్షలాది మంది చిన్న రైతులకు, వారి కుటుంబాలకు ఒక పరివర్తనాత్మక మానవతా మైలురాయి’ అని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్ సోమవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. కాగా సాధారణ సాంప్రదాయ పద్ధతిలో వాతావరణ మార్పుల ను తట్టుకునే కొత్త పంట రకాన్ని తయారు చేయటానికి 10–15 ఏళ్లు పడుతుందని, ఈ ఒప్పందం ద్వారా క్రిస్పర్ కాస్9ను నేరుగా వాడటం వల్ల 3–5 సంవత్సరాల్లోనే కొత్త వంగడాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
భూములిచ్చిన రైతులకు వెనుక సీట్లు
పూసపాటిరేగ: అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెనుక సీట్లు కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రొటోకాల్ లేని నేతలను వీవీఐపీ గ్యాలరీలలో కూర్చోబెట్టారు. ఎయిర్పోర్టు సభలో ముందు వరుసలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ఆ తరువాత వరుసలో వీవీఐపీ పాసులు సంపాదించిన కూటమి నేతలు, జీఎంఆర్ ప్రతినిధులు, ఉద్యోగులు, ఆ తరువాత వరుసలో మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చివరి వరుసలో సాధారణ ప్రజలకు సమీపంలో ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతులను కూర్చోబెట్టారు. ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతులను ముందు వరుసలో కూర్చోబెట్టి గౌరవిస్తారని ఆశించినా నిరాశే ఎదురైందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. -
పత్తికి జై.. ఆరుతడికి సై!
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణలో వానాకాలం–2026 సాగు జోరందుకుంది. పత్తి సాగు దాదాపు లక్ష్యాన్ని చేరుకోగా.. వరిసాగు మాత్రం ఇంకా నాట్ల దశలోనే ఉంది. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 82,65,736 ఎకరాల్లో సాగు పూర్త యింది. రాష్ట్ర వానాకాలం సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు అందులో 62 శాతం సాగు పూర్తయింది. ప్రధానంగా పత్తి, పెసర సాగు సాధారణ విస్తీర్ణంలో 98 శాతానికి చేరడం గమనార్హం. లక్ష్యం దిశగా పత్తి.. చురుగ్గా వరినాట్లు పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 47,41,541 ఎకరాలు. ఇప్పటికే 46,33,634 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. దీంతో సాధారణ విస్తీర్ణంలో ఏకంగా 98 శాతం సాగు పూర్తయింది. అంటే పత్తి సాగు దాదాపు లక్ష్యాన్ని చేరినట్లే. రాష్ట్రంలో ఇప్పటివరకు సాగైన మొత్తం 82.65 లక్షల ఎకరాల్లో పత్తి విస్తీర్ణమే 46.33 లక్షల ఎకరాలు కావడం విశేషం. దీంతో వానాకాలం సాగులో ‘తెల్ల బంగారం’ఆధిపత్యం స్పష్టమవుతోంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 65,95,645 ఎకరాలు కాగా 20,46,184 ఎకరాల్లో వరి సాగైంది. అంటే సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఇప్పటివరకు 31 శాతం మాత్రమే సాగు పూర్తయింది. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు మళ్లీ వరినాట్లపై దృష్టి సారించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరి నారుమడులు పోయగా, నాట్లు వేసే పనులు చురుగ్గా సాగనున్నాయి. ఆరుతడి సాగు... పప్పు దినుసుల జోరు... పత్తి తర్వాత ఇతర ఆరుతడి పంటల్లోనూ సాగు పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా కంది, మొక్కజొన్న, పెసర సాగు గణనీయంగా జరిగింది. ఆరుతడి పంటల్లో పెసర సాగు 98 శాతంతో దాదాపు సాధారణ విస్తీర్ణాన్ని చేరింది. కంది సాగు 81 శాతం, మొక్కజొన్న 76 శాతానికి చేరాయి. జొన్న సాగు 57 శాతంగా ఉండగా.. మినుము సాగు మాత్రం 47 శాతానికే పరిమితమైంది. కంది, పెసర వంటి పప్పుధాన్యాల సాగు కూడా ఆశించిన స్థాయిలో కొనసాగుతోంది. తక్కువ వ్యవధిలో చేతికి వచ్చే పంటలు కావడం, వర్షాధార ప్రాంతాలకు అనుకూలంగా ఉండటంతో రైతులు వీటి సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఊరటనిచ్చిన వర్షాలు.. వానాకాలం సాగుకు కీలకమైన వర్షపాతం ఈసారి లోటులోనే కొనసాగుతోంది. జూన్ 1 నుంచి సాధారణంగా 353.5 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. గురువారం ఉదయం 8.30 గంటల వరకు 340.2 మి.మీ. వర్షం కురిసింది. దీంతో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 11 శాతం లోటుగా నమోదైంది. అయితే తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ రిపోర్టు ప్రకారం ఈ లోటు పరిధి ‘సాధారణ’ కేటగిరీలోనే ఉంది. పెరుగుతున్న నీటిమట్టం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న సమయంలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు మాత్రం గతేడాదితో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉన్నాయి. ప్రధాన రిజర్వాయర్లన్నింటినీ కలిపి 322.61 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో 701.21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తాజాగా వ్యవసాయశాఖ నివేదిక స్పష్టం చేసింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి 378.60 టీఎంసీల మేర నీటి నిల్వ తక్కువగా ఉంది. కాగా రిజర్వాయర్లలో నీటి నిల్వ తగ్గినప్పటికీ.. భూగర్భజలాల పరిస్థితి ప్రస్తుతానికి కొంత మెరుగ్గానే ఉంది.సగటు భూగర్భజల మట్టం 9.46 మీటర్ల లోతులో ఉండగా, జిల్లాల వారీగా చూస్తే ఖమ్మంలో అత్యల్పంగా 5.46 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయి. అంటే అక్కడ భూగర్భజల మట్టం రాష్ట్ర సగటుతో పోలిస్తే పైకి ఉంది. మరోవైపు మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 13.30 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు మరింత లోతులో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లలో గణనీయంగా నీటి మట్టం పెరుగుతుందని, భూగర్భజలాలు కూడా పైకి వచ్చే అవకాశం ఉందని అధికారులు గురువారం ప్రకటించారు. -
సోలార్ ప్రాజెక్ట్.. రైతులకు షాక్!
సాక్షి, అమరావతి: సోలార్ వెలుగుల మాటున రైతుల భూములు లాక్కొని వారి జీవితాలను చీకటిలోకి నెట్టేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న టాటా సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్పై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా వారికి ఎలాంటి భరోసా ఇవ్వకుండానే గురువారం శంకుస్థాపన చేసేశారు. దీర్ఘకాలిక ఒప్పందం వల్ల తాము నష్టపోతున్నామని, పైగా రైతులందరికీ ఒకేలా కౌలు అడ్వాన్సులు ఇవ్వకుండా పక్షపాతం చూపించారని రైతులు వాపోతున్నారు. బీడు భూముల్లో కాకుండా పంట చేలల్లో ప్రాజెక్టులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భూములు ఇవ్వని రైతులను వేధిస్తున్నారని, పొలాల్లోని వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా రాకుండా చేస్తున్నారని, కరెంటు స్తంభాలు సైతం పగలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒప్పందంలో తీవ్ర అభ్యంతరాలు..హోసూరులో సుమారు 1,800 ఎకరాల్లో 400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు పత్తికొండ మండలంలోని హోసూరు, పెద్దహుల్తి, ఆస్పరి మండలంలోని జొహరాపురానికి చెందిన సుమారు 600 మంది రైతుల నుంచి భూములను లీజు పద్ధతిలో తీసుకున్నారు. అయితే కంపెనీకే అనుకూలంగా లీజు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో రైతులు, సోలార్ కంపెనీ మధ్య కుదిరిన దీర్ఘకాలిక లీజు ఒప్పందాల్లోని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 30 ఏళ్ల పాటు లీజు కొనసాగనున్న నేపథ్యంలో భవిష్యత్లో రైతుల హక్కులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒప్పందంలోని కొన్ని నిబంధనలు పూర్తిగా కంపెనీ ప్రయోజనాలకు అనుకూలంగా, రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయి. ఒప్పంద కాలంలో రైతులు చనిపోతే వారి పొలం వారసులకు దక్కదు. కంపెనీకే సొంతమవుతుంది. ఇటువంటి నిబంధనలు అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పంద కాలాన్ని ఐదేళ్లకు కుదించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.లీజు భూములపై రుణాలు వద్దు..లీజుకు తీసుకున్న భూములను, వాటికి సంబంధించిన ఒప్పందాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద తనఖా పెట్టి రుణాలు పొందేందుకు కంపెనీకి అధికారం కల్పించారు. ఈ నిబంధనలతో భవిష్యత్లో భూములపై తమ హక్కులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని రైతులు మొత్తుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కౌలుకు తీసుకున్న వారికి పొలం ఒరిజినల్ పత్రాలను ఇచ్చేయాలనే నియమం సరైంది కాదని రైతులు వాదిస్తున్నారు. కంపెనీ తమ భూములపై రుణాలు తీసుకుని తిరిగి బ్యాంకులకు చెల్లించకపోతే ఆ భారం తమపైనా, తమ తరువాతి తరాలపైనా పడుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సోలార్ ప్రాజెక్టులను వ్యవసాయానికి పనికిరాని బంజరు భూముల్లో ఏర్పాటు చేస్తే వ్యవసాయానికి, తమ జీవనోపాధికి ఇబ్బంది ఉండదని రైతులు అంటున్నారు. రైతులకు పూర్తి అవగాహన కల్పించకుండా, మధ్యవర్తుల ద్వారా ఒత్తిడి తెచ్చి తమ భూములను లీజుకు తీసుకున్నారని, దీనిపై అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.ఎకరాకు రూ.50 వేల కౌలు ఇవ్వాలిభూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.50 వేలు కౌలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమందికి ఏడాది కౌలు కింద రూ.31 వేలు, మరికొందరికి రెండేళ్లకు రూ.62 వేలు చొప్పున అడ్వాన్స్ కౌలు చెల్లించినట్లు చెబుతున్నారు. కూటమి నేతలు, వారి అనుచరులైన ఇంకొందరికి ఐదేళ్లు, మరికొందరికి పదేళ్ల కౌలు ముందుగానే చెల్లించినట్లు సమాచారం. ఇలా రైతులను బట్టి, వారికున్న రాజకీయ పలుకుబడిని బట్టి కౌలు చెల్లింపుల్లో తేడాలు ఉండటంతో రైతులు నిలదీస్తున్నారు. ముందస్తు కౌలును రైతులందరికీ సమంగా ఇవ్వాలని కోరుతున్నారు.రైతుల ప్రయోజనాలు కాపాడండి..సోలార్ ప్రాజెక్టుకు రైతులు వ్యతిరేకం కాదు. కానీ రైతుల భూములు, హక్కులు, భవిష్యత్ ప్రయోజనాలకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లీజు ఒప్పందంలోని నిబంధనలను బహిరంగపరచడంతోపాటు, కౌలు చెల్లింపుల్లో స్పష్టమైన విధానం అమలు చేయాలి. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసిన తర్వాతే పనులు చేపట్టాలి. – కె.ప్రభాకర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం -
వ్యవసాయ భవిష్యత్తుకు కొత్త ఊపిరి
భారత వ్యవసాయం వందల ఏళ్లుగా కరవులను, వరదలను, ధరల పతనా లను, విధాన మార్పులను తట్టుకుని నిల బడింది. అభిరుచులు, మార్కెట్లు, సాంకే తికతలు మారుతున్న కొద్దీ పంటలు వచ్చాయి, పోయాయి. కొన్ని పంటలు రైతులకు తాత్కాలిక ఊరటనిస్తే, కొన్ని వారిని అప్పుల్లో పడేశాయి. చరిత్ర చెప్పే నిజం ఏమిటంటే– సరైన విధానం, ముందుచూపు తోడైతే ఒక్క పంట కూడా ఊరు, దేశం ఆర్థిక పరిస్థితినే మార్చగలదు. ప్రపంచంలో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో, ఆ మార్పు తెచ్చే పంట ఆయిల్ పామ్. తెలంగాణకు ఆయిల్ పామ్ కేవలం ఒక కొత్త పంట కాదు– ఇది దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం. ఒక గేమ్ ఛేంజర్ కాగల పంట.ప్రధాన ఆర్థిక వనరుతెలంగాణ ఏర్పడిన మొదటి పదేళ్లలో మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా సాగునీటిని వసతులని పునరుద్ధరించడం సబబే. కానీ కేవలం వరి, పత్తి పంటల పైనే ఆధారపడిన వ్యవసాయం వాంఛనీయం కాదు. రాష్ట్రం రెండో పదేళ్లలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, మన వ్యవసాయ భవిష్యత్తుకు ఒక కొత్త ఆధారం కని పిస్తోంది. ఆయిల్ పామ్ను ఒక చిన్న పంటగా చూడటం మానేసి, నర్సరీ నుంచి రిఫైనరీ దాకా పూర్తి వ్యవస్థను నిర్మించే కొత్త గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీన్ని పునాదిగా చూడాల్సిన సమయం వచ్చింది.ఆయిల్ పామ్ ఎందుకింత ముఖ్యమో అర్థం కావాలంటే మనం మన దేశ సరిహద్దులు దాటి చూడాలి. జనాభాలో మన కంటే చాలా తక్కువగా ఉన్న ఇండోనేషియా, మలేషియా దేశాలు ఈ ఒక్క పంటతో తమ గ్రామాల రూపురేఖలనే మార్చేశాయి. సుమారు 28.3 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియా, దాదాపు 4.2 కోట్ల ఎక రాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 4.6 కోట్ల టన్నుల పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తోంది. ఆ దేశ జీడీపీలో ఆయిల్ పామ్ వాటా సుమారు 4.5 శాతం, ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షలకు పైగా కుటుంబాలకు ఇది జీవనోపాధి.మలేషియా కథ కూడా ఇలాంటిదే. కేవలం 3.56 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం దాదాపు 1.4 కోట్ల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 2 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తోంది. 1970లు, 1980లలో రబ్బరు ధరలు పెరగకుండా, గ్రామాల్లో ఆదాయం తగ్గి నప్పుడు, మలేషియా వ్యూహాత్మకంగా ఆయిల్ పామ్ వైపు మళ్లింది. భద్రత–స్థిరత్వం 147 కోట్ల జనాభా ఉన్న మన భారత ప్రజానీక ఆశలు, తినే అలవాట్లు వేగంగా మారుతున్నాయి. మన దేశంలో పండించే వంట నూనె మన అవసరంలో సగం మాత్రమే తీరుస్తోంది. ప్రతి ఏటా సుమారు 130 లక్షల టన్నుల వంట నూనెలను బయటి నుంచి తెచ్చుకుంటున్నాం. కేవలం పామ్ ఆయిల్ కోసమే ఏటా సుమారు రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాం. సూటిగా చెప్పాలంటే, మనం మన విలువైన విదేశీ మారకాన్ని బయటికి పంపి, దానికి బదులు అనిశ్చితిని తెచ్చుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా సరఫరాలో ఏ చిన్న ఆటంకమైనా, ఏ దేశాల మధ్య ఉద్రిక్తతైనా, అంతర్జాతీయ ధరలు పెరిగినా, దాని ప్రభావం నేరుగా మన వంట గదులపైనా, మన రైతులపైనా పడుతుంది.ఇలా బయటి నుంచి తెచ్చుకోవాల్సి రావడానికి కారణం మన రైతులకు సామర్థ్యం లేకపోవడం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును బాగా పెంచగల వాతావరణం, నేలలు ఉన్నాయి. అయినా, దేశం మొత్తం మీద కేవలం 10 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ పామ్ సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తక్కువ మొత్తంతో మొద లైనా తెలంగాణ ఇప్పటికే రెండో స్థానానికి చేరుకుంది. భద్రత, స్థిరత్వం ఇచ్చే ఈ పంటను చేపట్టడానికి తెలంగాణ రైతుల్లో ఉన్న ఆసక్తిని, సంసిద్ధతను ఇది చూపిస్తుంది.ఈ రోజు తెలంగాణలో సుమారు 2.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది, అందులో అవిభక్త ఖమ్మం జిల్లా ఒక్కటే దాదాపు 1.35 లక్షల ఎకరాలు కలిగి ఉంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాబోయే సంవత్సరాల్లో ఈ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచాలని రాష్ట్రం ఒక పెద్ద, కానీ సాధించగల లక్ష్యాన్ని పెట్టుకుంది.ఆయిల్ పామ్ తోట దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుంది. ఒకే పంటకోతపై, ఒకే మార్కెట్ ధరపై ఆధారపడే కాలానుగుణ పంటల్లా కాకుండా, ఏడాది పొడవునా తాజా పండ్ల గెలలు ఇస్తుంది. అంటే ఏడాదికోసారి వచ్చే పెద్ద మొత్తం కాదు, ప్రతి నెలా చేతికి డబ్బు అందుతుంది. తోటలు పూర్తి దిగుబడికి వచ్చాక, దిగుబడి, నిర్వహణను బట్టి, ఇప్పటి ధరల ప్రకారమే రైతులు ఎకరాకు ఏటా రూ.2 లక్షల వరకు సంపాదించ గలుగుతున్నారు. తాజా పండ్ల గెలల ధర టన్నుకు రూ. 22,000 నుంచి రూ.24,500 వరకు ఉంటూ, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ ఎంఈఓ–ఓపీ) లాంటి పథ కాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి తోడ్పాటునందిస్తుండటంతో, చాలా గ్రామీణ కుటుంబాలకు ఆయిల్ పామ్ నెలనెలా జీతం లాంటిదిగా మారింది. దీనికి తోడు, మొక్కలు, ఇన్ పుట్లు, మొదట్లో అయ్యే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు సుమారు రూ.50,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. దీనితో పూర్తి దిగుబడి రాకముందు మొదటి మూడు, నాలుగేళ్లలో రైతులపై పడే భారం తగ్గుతుంది.విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా...ఆయిల్ పామ్లో ఏదీ వృథా పోదు. పండు నుంచి ముడి పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. పీచు, పెంకులను కరెంటు తయారీకి వాడొచ్చు. మిగిలిన వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా, పశుగ్రాసంగా మార్చొచ్చు. కోకో, జాజికాయ, మిరియాలు, పూలు లాంటి నీడలో పెరిగే పంటలను కలిపి వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు ఒకే పంట తోటలుగా కాక, రకరకాల ఆదాయాలు ఇచ్చే తోటలుగా మారతాయి.పొలం గట్టు దాటి కూడా, ఆయిల్ పామ్ వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు పుడతాయి. నర్సరీలు, ఇన్ పుట్లు అమ్మేవారు, కోత సేవలు, రవాణా చేసేవారు, ఫ్రూట్ కలెక్షన్ కేంద్రాలు, క్రషింగ్ యూనిట్లు, రిఫైనరీలు, ప్యాకింగ్ యూనిట్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులు, వీళ్లందరూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగమై ఉపాధిని పెంచుతారు.అశ్వారావుపేట, దమ్మపేట లాంటి ప్రాంతాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికే వ్యాపార కేంద్రాలుగా మారడం చూశాం. సిద్దిపేటలో కొత్త ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్లలో గోద్రెజ్ సంస్థ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ‘విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా‘ ఒకే గొలుసుగా చేయడమే తెలంగాణ వ్యూహం.ఆయిల్ పామ్ పర్యావరణానికి హానికరం అని కొందరు అంటున్నారు. ఈ అభిప్రాయం ఎక్కువగా వేరే దేశాల్లో సున్నితమైన అడవులు, తడి నేలల్లో పెద్ద ఎత్తున అడవులను కొట్టేసిన అనుభవాల నుంచి వచ్చింది. తెలంగాణ పరిస్థితి పూర్తి భిన్నం. మనం అడవు లను కొట్టేయడం గురించి మాట్లాడటం లేదు; తక్కువ దిగుబడి ఉన్న, వర్షాధార లేదా ఒకే పంట పండే భూములను సరైన నీటి వాడకంతో మంచి విలువ ఇచ్చే చెట్ల తోటలుగా మార్చడం గురించి మాట్లాడుతున్నాం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు పచ్చదనాన్ని పెంచుతాయి, గాలిలో కార్బన్ను ఎక్కువగా పీల్చుకుంటాయి, కొండ ప్రాంతాల్లో నేల కొట్టుకుపోకుండా చూస్తాయి, తేమను నిలుపుతాయి. సహజ అడవులను కొట్టేయకుండా కఠినంగా ఉంటూ, అంతర పంటలు, జీవవైవిధ్యానికి మేలు చేసే పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉంటే, ఆయిల్ పామ్ తెలంగాణలో పర్యావరణానికి శత్రువు కాదు, స్నేహితుడు కాగలదు.- తుమ్మల నాగేశ్వర రావు, వ్యాసకర్త, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి -
రైతు కాళ్ల కిందే కర్మాగారం
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది.దేశ యూరియా అవసరాల్లో నాలుగోవంతును దిగుమతి చేసుకునే భారత్కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్దపశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనినిఅందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ. మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది. ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలోసేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండోకాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు« దాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది. జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. -వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
ప్రభుత్వంపై రైతులు ఉగ్రరూపం
-
మేమేమైనా రౌడీలమా? అమరావతి, యోగాపై పెట్టే శ్రద్ధ రైతులపై కూడా ఉంచండి..!
-
ఊట బావులు.. ఉబికొచ్చే జలాలు
రేగోడ్(మెదక్): ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి..భూగర్భ జలాలు అడుగంటాయి. అనేక ప్రాంతాల్లో బావులు, బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఒక ఊరిలో మాత్రం ఊటబావులు ఇప్పటికీ నిరంతరాయంగా నీటిని అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాయి. ఈ సహజ జలవనరుల ద్వారానే పంటలను కాపాడుకుంటూ గ్రామ రైతులు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని టి.లింగంపల్లి గ్రామం సహజ సిద్ధమైన ఊట బావులకు ప్రసిద్ధి. గ్రామంలోని పలు ప్రాంతాల్లో భూమి అడుగు నుంచి నిరంతరం ఉబికి వచ్చే ఈ బావులు తరతరాలుగా ప్రజలకు తాగునీరు అందిస్తూ , సాగునీటి అవసరాలు కూడా తీరుస్తున్నాయి. గ్రామంలో 5 ఊట బావులు ఉండగా, వ్యవసాయ క్ష్రేత్రాల్లో 200లకు పైగా ఊట బావులు ఉన్నట్టు గ్రామస్తులు చెప్పారు. పంటలు సాగు గ్రామంలో వరి, కూరగాయలు, ఇతర పంటలకు అవసరమైన నీటిని ఈ ఊట బావుల నుంచే అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయినా, ఇక్కడ సహజంగా ఉబికి వచ్చే నీటి కారణంగా పంటలు ఎండిపోకుండా సాగు కొనసాగుతోంది. దీంతో ఈ బావులు రైతులకు నిజమైన జీవనాధారంగా మారాయి. ఎన్నో దశాబ్దాలుగా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పూర్తిగా ఎండిపోలేదని రైతులు అంటున్నారు. అందుకే గ్రామ ప్రజలు ఇప్పటికీ ఈ బావులపైనే అత్యధికంగా ఆధారపడుతున్నారు. 30 ఏళ్లుగా బావినీటితో సాగు ముప్పై ఏళ్లుగా మూడు బావుల నీటితో పదెకరాల్లో పంటలు సాగు చేస్తున్నాను. నా పొలంలో మిర్చి, వరి, వేరుశనగ వేశాను. ఈ ఏడాది వర్షాలు పెద్దగా లేకపోయినా ఊట బావుల్లో నీరు పుష్కలంగా ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. – మారుతీరావు, రైతు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి వర్షాలు లేకపోయినా ఊటబావుల్లో ఎప్పటికీ నీరు ఉండటం మా గ్రామానికి గొప్ప వరం.బావుల వల్ల ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రావడం లేదు. ప్రభుత్వం కూడా ఇలాంటి సహజ నీటి వనరులను సంరక్షించి అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుంది. –చంద్రయ్య, గ్రామస్తుడు -
YS జగన్ దేవరపల్లి పర్యటన.. రైతులతో ముఖాముఖి!
-
అప్పుల ఊబిలో ఆంధ్రా రైతులు
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అత్యధిక వ్యవసాయ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి మన రాష్ట్ర రైతుల అప్పులు రూ.2,69,415.73 కోట్లకు చేరాయి. ఈ విషయాన్ని సోమవారం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. దేశంలో రూ.లక్ష కోట్లకు పైగా వ్యవసాయ రుణాలు గల రైతులు ఆరు రాష్ట్రాల్లో ఉన్నారని తెలిపారు. దేశంలో అత్యధిక వ్యవసాయ అప్పులు గల రైతులు తమిళనాడులో ఉండగా, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతులు ఉన్నారని వివరించారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల రైతులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఉపశమనం కల్పించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న రైతుల అప్పులను ఆర్థిక పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. అయితే, సన్న, చిన్నకారు రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని పంకజ్ చౌదరి స్పష్టంచేశారు. -
దుర్భిక్ష పర్వం
ఈ ఏడాది వానలు ముఖం చాటేస్తున్నాయి. రైతుల కళ్లల్లో దిగులు మబ్బులు కనిపిస్తున్నాయే గాని, ఎక్కడా చినుకుల సవ్వడి వినిపించడం లేదు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకుంటే, చాలినన్ని తిండి గింజలు పండక కరవు కాటకాలు తప్పవు. అనావృష్టి తెచ్చిపెట్టే కరవు కాటకాలు సామాన్యుల బతుకులను దుర్భరం చేస్తాయి. ప్రధానంగా మనది వ్యవసాయాధారిత దేశం. వ్యవసాయాన్నే నమ్ముకుని, దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న కర్షక జనాభా వర్షాభావం వల్ల కష్టాల్లో పడితే, యావత్ దేశానికే కష్టాలు తప్పవు. వర్షాల కోసం క్రమం తప్పక యజ్ఞయాగాదులు చేసే సంస్కృతి మనది. వర్ష ప్రాధాన్యం పట్ల ఎరుక కలిగిన జాతి మనది. ‘అనావృష్టి మతీత్యైవ మహతీ వర్షసంతతిః/ భూతానాం సంక్షయం చక్రే దుర్భిక్ష పరిపీడితమ్’ అని విష్ణుపురాణం చెబుతోంది. అనావృష్టి వల్ల పంటలు పండక దుర్భిక్షంతో మనుషులే కాదు, సమస్త ప్రాణులూ సంక్షోభానికి, నాశనానికి లోనవుతాయి. కరవు కాటకాలు మన దేశానికి కొత్త కాదు. వానలు లేక, నేల నెర్రెలు పడిన దుర్భర దుర్భిక్ష వర్ణనలు మన పురాణ సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు చాలానే ఉన్నాయి. ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు!’ అంటూ ‘పెన్నేటి పాట’ రాసిన విద్వాన్ విశ్వం ఒకనాటి రాయలసీమ కరవు దృశ్యాన్ని హృదయ విదారకంగా చిత్రించారు. కరవు కాటకాలను ముందుగా తెలుసుకునే సాంకేతికత ఇదివరకు ఉండేది కాదు. అందువల్ల దుర్భిక్షాన్ని దైవఘటనగానే పరిగణించేవారు. ఇటీవలి కాలంలో సాంకేతిక పెరిగింది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితు లను; అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానుల వంటి ప్రకృతి విపత్తులను ముందు గానే గ్రహించి, వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేయగలుగుతున్నారు.పాలకులు బాధ్యతనెరిగిన వారైతే, వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలను పట్టించుకుని కార్యాచరణను ప్రారంభిస్తారు. పాలకులు బాధ్యతను మరచి, హాలికులను వారి కర్మానికి వారిని విడిచిపెడితే, దుర్భిక్ష పర్యవసానాలు మరింత దుర్భరంగా ఉంటాయి. ఈసారి ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు వేసవిలోనే హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలు ఒకవైపు రైతులలో గుబులు పెంచుతుంటే, మరోవైపు చీకటి వ్యాపారులలో, రాజకీయ దళారులలో, అవినీతిలో మునిగితేలే అధికార గణాల్లో సంబరాన్ని పెంచుతున్నాయి. కరవును కూడా సొమ్ముచేసుకోగల సమర్థులు మనకు కొత్త కాదు. ఇలాంటి దౌర్భాగ్యాన్ని గురించే పాత్రికేయుడు సాయినాథ్ ‘ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రౌట్’ పుస్తకాన్ని ముప్పయ్యేళ్ల కిందటే రాశారు.‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని నేలను నమ్ముకున్న రైతు కలలోనైనా కరవు కాటకాలను కోరుకోడు. రోజువారీ పనులు చేసుకుంటూ అన్నం తిని బతికే సామాన్య ప్రజలు కూడా కరవు కాటకాలను కోరుకోరు. ప్రతి సంక్షోభాన్నీ స్వీయ సంక్షేమ అవకాశంగా మార్చుకొనే దౌర్భాగ్యులే దుర్భిక్షాన్ని కోరుకుంటారు. ‘వార్ధుషికః వణిగ్బంధుః యే చ ప్రభూతమన్న సంగ్రహం/ కృత్వా దుర్భిక్షం వాంఛంతి తే పి వార్ధుషికా’ అని ప్రాచీన సుభాషిత శ్లోకం చెబుతుంది. వర్తకులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి, జనాలను పీడించే వడ్డీ వ్యాపారులు దేశంలో కరవు కాటకాలు రావాలని కోరుకుంటారని ఈ శ్లోక సారాంశం. ఇప్పటి కాలంలో వడ్డీ వ్యాపారులకు జతగా కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు, రాజకీయ దళారులు, లంచగొండి అధికారులు కూడా జనాలకు దాపురించారు.వీళ్లందరూ కరవులో అధికమాసం లాంటివారు.ఈ ఏడాది ‘సూపర్ ఎల్ నినో’ కారణంగా భారత్ సహా ఎనభై ఎనిమిది దేశాలు తీవ్ర వర్షాభావంతో అల్లాడనున్నాయి. ఇది కేవలం ప్రకృతి పరిణామం మాత్రమే కాదు, ఇంగితం లేని పాలకుల చర్యలకు పర్యవసానం కూడా! భూతాపం పెరుగుదలపై పర్యావరణవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నా, కొందరు దేశా«ధినేతలు యుద్ధ విధ్వంసాల్లో మునిగితేలుతున్నారు. ఇంకొందరు అభివృద్ధి పేరుతో అడవుల నరికివేతకు ఊత మిస్తున్నారు. ఈకాలం దుర్భిక్షం బాధ్యతెరుగని పాలకుల స్వార్థఫలం. -
స్మార్ట్గా.. సాగు!
రాష్ట్రంలో వ్యవసాయం ‘స్మార్ట్’గా మారుతోంది. సాగు ఆధునికతను సంతరించుకుంటోంది. యంత్ర పరికరాలకు తోడుగా ఫోన్ ఆధారిత వ్యవసాయం పెరుగుతోంది. రైతన్నలు వివిధ రకాల యాప్లను వినియోగిస్తున్నారు. పంటల సాగులో మెళకువలు తెలుసుకుంటున్నారు. వాతావరణ హెచ్చరికలు గమనిస్తున్నారు. చీడ పీడల గురించి ముందే తెలుసుకుని జాగ్రత్త పడుతున్నారు. పెట్టుబడిని తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడి పొందుతున్నారు.ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో రైతు చేతిలోని ఫోన్నే పంటల సాగుకు ఉపకరిస్తోంది. ‘ఈ పొలంలో 3 రోజుల్లో చీడ దాడి చేసే అవకాశం 80 శాతం ఉంది..’అంటూ తెలుగులో వాయిస్ అలర్ట్ నేరుగా రైతుకు వస్తోంది. కృత్రిమ మేధస్సు అంటే ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటూ రైతులు దిగుబడి పెంచుకుంటున్నారు. ప్రభుత్వం, స్టార్టప్లు కలిసి రాష్ట్ర వ్యవసాయాన్ని స్మార్ట్గా మారుస్తున్నాయి. ఎప్పటికప్పుడు అలర్ట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని 22 గ్రామాల్లో ఇప్పటికే ఏఐ విప్లవం మొదలైంది. ఇక్కడ 56 వేల ఎకరాలు, 15 వేల మంది రైతులతో ‘కృషివాస్’యాప్ ప్రయోగాత్మకంగా నడుస్తోంది. ఉపగ్రహం ద్వారా వచ్చే డేటాను బట్టి పొలంలో నీటి కొరత, పోషకాల లోపం, చీడపీడల దాడిని 3 ్ఠ 3 మీటర్ల కచ్చితత్వంతో ముందే గుర్తిస్తోంది. ఈ ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.మరోవైపు వికారాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ‘ఫార్మ్ప్రై’సెజ్ యాప్ను రైతులు విరివిగా వాడుతున్నారు. వాటర్షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ డేటా ప్రకారం ఈ యాప్లోని ఏఐ చీడపీడల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ద్వారా పత్తి, సోయాబీన్ రైతులు తెగులు వచ్చే 7–10 రోజుల ముందే హెచ్చరిక అలర్ట్ అందుకుంటున్నారు. దీనివల్ల అనవసరంగా పురుగుమందులు కొట్టడం తగ్గి, ఎకరానికి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఆదా అవుతోంది. యాప్ తెలుగులో ఉండటంతో చదువు తక్కువ ఉన్న రైతులు కూడా సులభంగా వాడుతున్నారు.⇒ ఫీల్డ్వైజ్ యాప్లో ఆకు ఫొటో పెడితే వెంటనే సమాధానం వస్తుంది. ఏ తెగులో గుర్తించి ఏ మందు వాడాలో సూచిస్తుంది. ఉపగ్రహం, డ్రోన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జీఐఎస్ డేటాను కలిపి పంట ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. తెలుగులో వాయిస్ ద్వారా సలహాలు ఇచ్చే జీఏఐ చాట్బాట్ కూడా ఉంది. గత ఏడాది చీడ వల్ల నష్టపోయా. ఈసారి ముందుగానే జాగ్రత్త పడ్డా. ఏఐ లేకపోతే ఇంత లాభం వచ్చేది కాదు. – నాయుడు, రైతు, చెన్నిపాడు గ్రామం, మనోపాడ్ మండలం, జోగుళాంబ గద్వాల జిల్లావాతావరణం తెలుసుకుంటున్నా.. కృషివాస్ యాప్ ద్వారా వాతావరణం, మార్కెట్ రేట్లు రోజూ తెలుసుకుంటున్నా. వర్షం ఎప్పుడు వస్తుందో ముందే తెలిస్తే ఎరువులు వేసుకునే విషయంలో జాగ్రత్త పడొచ్చు. పిల్లాడు ఫోన్లో నేరి్పంచాడు. ఇప్పుడు నేనే అందరికీ చెబుతున్నా. – మారెప్ప, రైతు, సల్కాపురం, గట్టు మండలం, జోగుళాంబ గద్వాల జిల్లాసాగు ఖర్చు 20% తగ్గింది గతంలో పురుగు ఆశించిన తర్వాతే తెలిసేది. ఇప్పుడు ఫార్మ్ప్రై సెజ్ యాప్లో ఏఐ అలర్ట్ వచ్చిన వెంటనే స్ప్రే చేస్తున్నా. 5 రోజుల వాతావరణ సూచన, మార్కెట్ ధరలు. పత్తి, సోయాబీ¯న్లో చీడపీడలను ముందే అంచనా వేసే హెచ్చరిక వ్యవస్థ ఇందులో ఉంది. ఫొటో తీసి అప్లోడ్ చేస్తే ఏ తెగులు, ఏ మందు కొట్టాలో చెబుతుంది. నా 5 ఎకరాల పత్తి సాగులో ఈసారి ఖర్చు 20% తగ్గింది. యాప్లో తెలుగు భాషా సౌలభ్యం ఉండటం వల్ల మా నాన్న కూడా యాప్ను సులభంగా వాడుతున్నారు.– చాకలి నరేష్, యువ రైతు, ఐనెల్లి గ్రామం, తాండూరు మండలం, వికారాబాద్ జిల్లాశుభ పరిణామం జిల్లాలో రైతులు వివిధ యాప్లు వినియోగిస్తున్నారు. టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్నారు. కొంత మంది రైతులు తమ పిల్లల ద్వారా నేర్చుకుంటున్నారు. ఈ యాప్ల వల్ల రైతులకు ఎంతో లబ్ది చేకూరుతోంది. ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో జరగకున్నా ఇదొక మంచి పరిణామం. - ఎం.సుజాత, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారివిదేశాల్లో ఇలా.. అమెరికాలో ప్లాంట్విలేజ్ నురు యాప్ ఆకు ఫోటో తీస్తే 96% కచ్చితత్వంతో తెగులును గుర్తిస్తుంది. నెదర్లాండ్స్లో ఫామ్21 + ఏఐ వ్యవస్థ సెన్సార్ల ద్వారా డేటాను విశ్లేషించి వాట్సాప్లో హెచ్చరిక పంపుతుంది. టమోటా, మిర్చి పంటల్లో 30% దిగుబడి పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
లక్షల ఎకరాలు బీళ్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి లక్షలాది ఎకరాలు బీడు భూములుగానే మారిపోనున్నాయి. ఎల్నినో ప్రభావంతో జలాశయాలు, ప్రాజెక్టులు, కాలువల కింద పొలాలన్నీ ఇప్పటికీ బీళ్లుగానే కనిపిస్తున్నాయి. నిరుటి ఖరీఫ్తో పోలిస్తే వరి సాగు ఏకంగా 32 లక్షల ఎకరాలకు పైగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, అందులో ముప్పావు వంతు భూములు బీళ్లుగానే మిగిలే పరిస్థితి. ప్రత్యామ్నాయ పంటల పేరుతో వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రయత్నాలను రైతులు పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. వచ్చే ఆగస్టు 15 వరకు వరి సాగు చేసుకునే అవకాశం ఉందనే కారణంగా రైతులు వేచి చూసే ధోరణితోనే ఎక్కువగా ఉన్నారు. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఇతర అధికారులు రోజూ సమీక్షలు నిర్వహిస్తూ, ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తగ్గుతుందంటున్న వ్యవసాయశాఖ రాష్ట్రంలో సాధారణంగా సాగయ్యే విస్తీర్ణంతో పోలిస్తే ఈసారి ప్రధాన పంటల సాగు 23.12 శాతం తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి సాగయ్యే 30 లక్షల ఎకరాలు బీళ్లు కానున్నాయి. అయితే ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసినా, ఇతర ప్రాంతాల్లో ఉండి వరి సాగు చేసుకునే రైతులు, కౌలు రైతులు ముందుకు రావడం లేదు. శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలు కాగా, గత ఏడాది ఇది 1,39,28,853 ఎకరాలకు చేరింది. అయితే ఈసారి ప్రధాన పంటలు కేవలం 1,07,08,617 ఎకరాల్లోనే సాగవుతాయని అంచనా వేశారు. మిగిలిన 32,20,233 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటల సాగుకు అవసరమైన నీరు దొరికే పరిస్థితి లేదు. దీంతో సుమారు 32 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండదని భావిస్తున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటికే పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ వంటి పంటలు వేసే సమయం దాటిపోయింది. ప్రత్యామ్నాయ పంటల కింద పెసర, బొబ్బర్లు, కంది వంటి వాటిని పండించేలా ప్రయత్నిస్తోంది. అయితే ఆగస్టు 15 వరకు వరి నాట్లు వేసుకోవచ్చని భావిస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టడం లేదు. భారీగా తగ్గనున్న వరి ఎల్ నినో ప్రభావం అత్యధికంగా వరిపైనే పడుతోంది. గత ఏడాది వానాకాలంలో 69.89 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, ఈసారి 38.51 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. ఆగస్టు 15 వరకు మరో 15 లక్షలకు పైగా ఎకరాల్లో నాట్లు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలాగే గత ఏడాది 50.70 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి ఈసారి 45.93 లక్షల ఎకరాలకు పరిమితం కానుంది. మొక్కజొన్న కూడా 6.90 లక్షల ఎకరాల నుంచి 6.49 లక్షల ఎకరాలకు తగ్గనుంది. అయితే, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చేయిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కంది, పెసర, మినుము, జొన్న, సన్ఫ్లవర్, ఆముదం, కూరగాయలు వంటి పంటలను మరింత పెంచుతామని అధికారులు నివేదికలు తయారు చేయడం విమర్శలకు తావిస్తోంది. రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో కురిసే వర్షాలే రాష్ట్ర ఖరీఫ్ వ్యవసాయాన్ని నిర్ణయించనున్నాయి. -
ఈ పాపం ఎ‘వరి’ది బాబూ..!
సాక్షి, అమరావతి : ఖరీఫ్–2026 సీజన్లో ప్రతీ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం తీరా ఇప్పుడు ఇవ్వలేమంటూ చావుకబురు చల్లగా చెప్పింది. మరీముఖ్యంగా కృష్ణ, గోదావరిడెల్టా కింద ఆయకట్టుకు ఇక నుంచి సాగునీరివ్వలేమని తెగేసిచెప్పింది. ప్రస్తుతం ఉన్ననీటి నిల్వలు తాగునీటి అవసరాలకు తప్ప సాగుకు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. దీంతో ఇదేనా చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ అంటే అంటూ రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని నమ్ముకుని సాగుచేసిన రైతుల పరిస్థితి ఏమిటని, పెట్టిన పెట్టుబడుల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. సాగు నీరిస్తామన్న మీ భరోసాతో సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయో లేదో చూసుకోకుండాభవిష్యత్లో ఏం జరుగుతుందో తాను అంతా ముందు ఊహిస్తానని..అందుకు తగినట్టుగానే ప్రణాళికలు రచిస్తానంటూ గొప్పలు చెప్పే విజనరీ చంద్రబాబు మాయ మాటలు నమ్మి రైతులు నిలువునా మోసపోయారు. మే 18న జరిగిన వ్యవసాయ, ఇరిగేషన్ సంయుక్త సమావేశంలో సాగునీటి విడుదల షెడ్యూల్ను ప్రకటించారు. ఏ ఆయకట్టుకు ఎప్పుడు నీరు విడుదల చేయబోతున్నామో ప్రాజెక్టుల వారీగా షెడ్యూల్ను కూడా ప్రకటించారు.పైగా ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీళ్లున్నాయని, వాటర్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబును మించిన వారు లేరని గొప్పలు చెప్పారు.బాబు మాటలు నమ్మి అటు గోదావరి, ఇటు కృష్ణా డెల్టా కింద 5.70 లక్షల ఎకరాల్లో రైతులు వరినాట్లు వేశారు. ఇతర పంటలన్నీ కలువుకుంటే ఈ రెండు డెల్టాల కింద మరో 3 లక్షల ఎకరాలకు పైగా పంటలు వేశారు. తీరా పంట ఎదకొచ్చే సమయంలో సాగునీరివ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. సాగునీటి ప్రాజెక్టుల్లో చాలినంత నీళ్లు లేవని, మరొక వైపు కరువు తీవ్రత తాము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని రెండ్రోజుల క్రితం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. అందుకే కృష్ణా డెల్టా పరిధిలో వరితో సహా ఏ ఒక్క పంటకు సాగు నీరివ్వలేమని తెగేసి చెప్పారు. వర్షాలు పడి, నీటి నిల్వలు పెరిగితే ఆరుతడి పంటలకు నీరు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. తాజాగా ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ కే.నరసింహమూర్తి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలో వరి సాగు చేయొద్దని సూచించారు. ఇప్పుడున్న నీటి నిల్వలు తాగునీటి అవసరాలకు తప్ప సాగునీటి అవసరాలకు మళ్లించలేమని కరాఖండిగా చెప్పేశారు. దీంతో ఇప్పటివరకు పెట్టుబడి పెట్టిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.ఇప్పటికే ఎకరాకు రూ.15వేలకుపైగా పెట్టుబడి పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నమ్మించి తమను నట్టేట ముంచేసిందని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ వలనే తాము సాగు చేశామని, పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తక్షణమే పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయో లేదో చూసుకోకుండా ఏ విధంగా సాగునీటి షెడ్యూల్ ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. వంశధార నుంచి పెన్నా వరకు నీటి విడుదల పేరిట చేసిన హంగామా ఎందుకని నిలదీస్తున్నారు. ఇదేనా రియల్ టైం గవర్నెన్స్ అంటూ మండిపడుతున్నారు. రెండేళ్లుగా సాగు వేళ సకాలంలో సాగు నీటితో పాటు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందక నానా అగచాట్లు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. -
కృష్ణా, గోదావరి డెల్టాలో ఇక వరి వేయొద్దు.. వరి.. వార్నింగ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరవు పరిస్థితులు నేపథ్యంలో వరి పంట వేయవద్దని, నీళ్లు ఇవ్వలేమని రైతులకు రాష్ట్ర కేబినెట్ సూచించింది. గోదావరి, కృష్ణా డెల్టాల కింద కూడా ఇక నుంచి వరి వేయవద్దని రైతులను ప్రభుత్వం కోరుతున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కరవు పరిస్థితుల ప్రభావంపై చర్చించినట్లు తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా డెల్టా కింద వరి నాట్లు వేశారని, ఇక నుంచైనా రైతులు వరి నాట్లు వేయవద్దని కోరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు వరి నాట్లు వేస్తే తరువాత నీరు లేక నష్టపోయేది రైతులనేనని, ఈ నేపథ్యంలో ముందుగానే రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందన్నారు. సాగునీటి కాలువల కింద ఆయకట్టుతో పాటు వర్షాధార విస్తీర్ణంలో కూడా వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నట్లు చెప్పారు. వరి వేసి తరువాత నీరు లేక నష్టపోవడం కంటే ఆలోచన చేసి ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా రైతులకు సూచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొత్తగా బోర్లు కూడా వేయవద్దని రైతులను కోరుతున్నామన్నారు. బోర్లు వేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటికే కొరత ఏర్పడుతుందన్నారు. తాగునీటికీ తీవ్ర ఎద్దడి వస్తుందని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికే 51 శాతం లోటు వర్షపాతం నమోదైందని, వచ్చే రెండు నెలలు వర్షాలు లేక కరవు తీవ్ర రూపం దాల్చుతుందన్నారు. గోదావరిలో సాధారణంగా లక్ష క్యూసెక్కుల వరద రావాల్సి ఉండగా కేవలం 38 వేల క్యూసెక్కులే వస్తోందని, దీంతో కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు కూడా రాని పరిస్థితి నెలకొంటుందన్నారు. ఆరుతడి పంటలు వేసుకునేందుకు 15 రకాల విత్తనాలతో కిట్స్ రైతులకు ఇస్తామని మంత్రి తెలిపారు. తాగునీటికి, పశు గ్రాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. కేబినెట్లో తీసుకున్న ఇతర నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు.» అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 0.50 ఎకరాల ప్రభుత్వ భూమి టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఏడాదికి రూ.1,000 చొప్పున 66 ఏళ్ల లీజు ప్రాతిపదికన 99 సంవత్సరాల వరకు పొడిగించేందుకు ఆమోదం. » ప్రకాశం జిల్లా కొండపి మండలం కె.జి.కంద్రిక గ్రామంలో 0.50 ఎకరాల ప్రభుత్వ భూమి టీడీపీ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఏడాదికి రూ.1,000 చొప్పున 66 సంవత్సరాల లీజు ప్రాతిపదికన 99 ఏళ్ల వరకు పొడిగించేందుకు ఆమోదం. » సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏపీ మార్క్ఫెడ్ టర్మ్ రుణంగా రూ.300 కోట్లు పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం. -
వరి రైతుకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబును మించిన వారుండరని మరోసారి రుజుౖవైంది! గతేడాది ఖరీఫ్లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగు నీరందించాం.. ఈ ఏడాది అంతకు మించి ఇస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయించింది. ముందస్తుగా సాగునీరు విడుదల చేస్తున్నాం... ఖరీఫ్లో వరి సాగుకు ఢోకా ఉండదన్న సర్కారు ఇప్పుడు తూచ్ వరి పంటకు సాగు నీరివ్వలేమనడంతో రైతన్నలు హతాశులయ్యారు. దుక్కి దున్ని.. నారుపోసి.. నాట్లు వేశాక.. ఎరువులు కూడా కొన్నాక ఇçప్పుడు నీళ్లు ఇవ్వనంటే ఎలా అని రైతులు మండిపడుతున్నారు. దీంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమైన వారంతా ఆదిలోనే నిలువునా మోసపోయి దిక్కులు చూస్తున్నారు. తీవ్ర కరువు తప్పదంటూ వాతావరణ శాఖ ఆర్నెల్లుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా సాగునీటి షెడ్యూల్ ప్రకటించింది. పెన్నా నుంచి పట్టిసీమ వరకు సాగునీటి విడుదల పేరిట ఫోటోలకు ఫోజులిస్తూ రైతుల్లో ఆశలు రేపింది. సాగునీరు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో భూమిని దున్ని, ఎరువులు వేసి, వరినాట్లు వేసి సాగు చేస్తున్న తరుణంలో సాగునీరు ఇవ్వలేమని చెప్పడం దారుణమని రైతులు ఆక్రోశిస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి.. అప్పులు చేసి నాట్లు వేస్తే సాగునీరివ్వలేమని సర్కారు తాపీగా చెప్పడంతో నెర్రలు చాస్తున్న పంట పొలాలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి అప్పులు చేసి నాట్లు వేసిన రైతన్నలు పంటను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియక అల్లాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక వైఫల్యం కారణంగా తాము మూల్యం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చంద్రబాబు విజనరీ ఇదేనా? అంటూ మండిపడుతున్నారు. నమ్మించి ముంచేశారు.. ఖరీఫ్ సన్నద్ధత పేరిట మే 18న వ్యవసాయ–ఇరిగేషన్ శాఖల సమన్వయ సమావేశంలో సాగునీటి విడుదల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 1 నుంచే కాలువలకు నీరు ఇస్తామని, ఖరీఫ్కు ఇబ్బంది ఉండదని వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు నమ్మకంగా చెప్పారు. పెన్నా, కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు ఇటీవలే పట్టిసీమకు నీళ్లు వదిలారు. కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగుకు సుమారు 150 టీఎంసీల నీరు అవసరం. ఈసారి 461 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ప్రకటించి జూలై 1న ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేసింది. ప్రభుత్వం చేసిన ఈ ప్రచారార్భాటాలను నమ్మి రైతులు నాట్లు పూర్తి చేశారు. తీరా పంట వెదకొచ్చే సమయంలో సాగునీరు అందక పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో వరి పంటకు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీరు ఇవ్వలేమని ప్రకటించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎకరాకు రూ.15 వేలకు పైగా పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశారు. దీనికి రైతుల శ్రమ అదనం. ఈ తరుణంలో తాగునీటి అవసరాలకు మినహా డెల్టాలో పంటలకు సాగునీరు ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో రైతులు నివ్వెరపోతున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న పంటలు గడువులోగా కాలువల పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు పూర్తి కాకపోవడంతో గోదావరి, కృష్ణా డెల్టాలో సాగునీరు సరిగా చేరలేదు. కాలువలపై ఆధారపడి సాగు చేసిన వేలాది ఎకరాల్లో వరి నాట్లు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయం లేక రైతులు నిస్సహాయంగా ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆకు మడులు, వెద సాగు ఎండిపోతుండగా పొలాలు బీడు వారుతున్నాయి. అటు గోదావరి డెల్టా కింద కోనసీమలోనూ ఇటు కృష్ణా డెల్టా కింద దివిసీమలోనూ పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ హామీలను నమ్మి అప్పులు చేసి సాగు ప్రారంభిస్తే ఇప్పుడు కళ్లెదుటే పంటలు ఎండిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ముందుగానే కరువు పరిస్థితులు తెలిసినా వాస్తవాలను కప్పిపుచ్చుతూ డెల్టాకు ఢోకా లేదంటూ ఖరీఫ్ సాగుకు ప్రోత్సహించడం ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు మండిపడుతున్నారు. ‘సాగు చేయండి..’ అన్న ప్రభుత్వం ఇప్పుడు ‘నీళ్లు లేవు..‘ అంటుండటంతో డెల్టా రైతులకు దిక్కు తోచడం లేదు. నీరందక.. పంటను వదిలేస్తున్న రైతన్న సర్కారు తీరుతో అన్నదాతల అగచాట్లు వర్ణనాతీతం. సాగు సమయం దాటిన తరువాత పంట చేతికి సక్రమంగా వస్తుందా రాదా? అనే సందేహాలు నడుమ పంట వేయడం కంటే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చును వదిలేసుకోవడం మేలనే దిశగా అన్నదాతలు అడుగులు ముందుకు వేస్తున్నారు. మరికొందరు వేసిన పంటను ఎలాగైనా కాపాడుకుందామని ఆరాటపడుతున్నా రానున్న రోజుల్లో నీరందకపోతే పెట్టిన ఖర్చు వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని దుస్థితి ఈ ఖరీఫ్లో చూస్తున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటకు సకాలంలో నీరందక ఎండిపోతుండటం, సమయం మించిపోవడంతో రైతులు వేసిన పంటలను వదిలేసి కూలీ పనులకు గ్రామాలను వదిలి వెళ్లిపోతున్నారు. తక్కువ సమయంలో పండే రకాలను వేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తుండటంతో మరికొందరు ఇప్పటికే వేసిన పంటలను మళ్లీ దుక్కిదున్ని నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగునీరు అందే పరిస్థితి కానరావడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు వెదజల్లిన పంటలకు నీరందక ఎండిపోవడంతో వలస కూలీలుగా మారి పనులకు వెళ్తున్నారు. నీరందక శ్రీకాకుళం జిల్లా వంశధార ఆయకట్టు చివరి పొలాలు ఎండిపోతున్నాయి. వరి నారుమడులు బీడు వారిపోతున్నాయి.నీరు లేక పంట ఎండిపోతోంది.. నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. ఈదుమూడిలో సొంతంగా ఎకరంన్నర పొలం ఉంది. చుక్క నీరు అందడం లేదు. లజ్జబండ డ్రయిన్ పక్కనే ఉంది. ఉప్పునీరు ఎదురు తన్నుతోంది. పెడనలో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుంటే ఇక్కడ కూడా నీరందని పరిస్థితి. చాలా దారుణంగా ఉంది. పంట వదులుకుందామా అంటే ప్రాణం ఒప్పుకోవడం లేదు. నష్టపోయినా చేయాల్సిందేనన్నట్లుగా వ్యవసాయం చేస్తున్నా. పట్టిసీమ నుంచి నీరొచ్చేస్తోందంటున్నారు. ఇక్కడేమో నీరందని దుస్థితి. – పామర్తి వీరాంజనేయులు, ఈదుమూడి, పెడన మండలం, కృష్ణా జిల్లా రైతులకు పరిహారం ఇవ్వాలి ముంజులూరులో ఎకరంన్నర ఉంది. అక్కడ నీరందని పరిస్థితి. పెడనలో ఎకరంన్నర కౌలుకు తీసుకుని చేస్తున్నా. మళ్లీ దుక్కి దున్ని పంట వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సాగునీరు విషయంలో పాలకులు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. దోబూచులాటలు ఆడకుండా క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. – కూనపురెడ్డి సుబ్రమణ్యం, ముంజులూరు, కృష్ణా జిల్లా రెండు ఎకరాల పంట వదిలేశా ముంజులూరులో వెదసాగులో రెండు ఎకరాల పొలం చేస్తున్నా. మొలకలు వచ్చిన తరువాత నీరందని పరిస్థితి. నీటిని ఇంజన్లతో తోడుదామంటే ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీనికంటే పంటను వదిలేసుకోవడం మేలని భావించి కూలి పనులకు పోతున్నా. – గురజ సారథి, బంటుమిల్లి, కృష్ణా జిల్లా కూలీ పనులకు పోతున్నాం నాకు రెండు ఎకరాల పొలం ఉంది. పంట పండించుకుందామని ఎంతో ఆశ పడ్డా. తీరా మొలకలు వచ్చిన తరువాత నీరందని దుస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలేదు. నీళ్లు తోడి నారు బతికించుకుందామంటే భరించలేని ఖర్చు. గుడ్లవల్లేరు మండలంలో కూలీ పనులకు వెళుతున్నాం. నాతో పాటు చాలా మంది వస్తున్నారు. – బత్తుల వెంకన్న, ముంజులూరు, కృష్ణా జిల్లా సాగు నీరిస్తామని చేతులెత్తేశారు... నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశా. నారుమడి, దుక్కులు, వరినాట్లకు ఎకరాకు రూ.13 వేలు ఖర్చు అయింది. వరి నాట్లను బతికించుకోవడానికి ఆయిల్ ఇంజన్ ద్వారా ఎకరాకు రూ.2 వేలు ఖర్చు పెట్టా. కాలువలకు పూర్తిస్థాయిలో నీరు రాక పొలాలు నెర్రలిస్తున్నాయి. సాగు నీరిస్తామని ముందుగా చెప్పి ఇప్పుడు చేతులెత్తేయడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. – కొండవీటి వెంకట సుబ్బారావు, మంతెన, కృష్ణా జిల్లా -
ఎల్నినో ఎఫెక్ట్: రైతులకు తెలంగాణ సర్కార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందని.. ఈ సీజన్ వరి పంట వేయొద్దని సర్కార్ హెచ్చరించింది. బోరు బావుల కింద సైతం వరి సాగు చేయొద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎల్నినోపై ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.కాగా, నైరుతి సీజన్ రెండో మాసం కూడా వర్షాభావ పరిస్థితులే నమోదవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలకు ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. సాధారణంగా జూన్లో పెద్దగా వర్షాలు కురవకున్నా జూలై రెండో వారం నుంచి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో వానలు ఊపందుకుంటాయి. కానీ ఈసారి నైరుతి సీజన్లో వానల నమోదు లోటులో ఉంది.ఎల్నినో పరిస్థితులున్నప్పటికీ జూన్, జూలై నెలల్లో వానలు సాధారణ స్థితిలో నమోదవుతాయని ఐంఎండీ ముందస్తు అంచనాల్లో ప్రకటించినప్పటికీ... వరుసగా రెండు నెలలు లోటు వర్షపాతమే నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్లో 12శాతం లోటు వర్షపాతం నమోదు కాగా... ఈనెల 20 నాటికి 49 శాతం లోటు నమోదు కావడం... ఈ వారాంతం వరకు కూడా వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్న ప్రకటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. -
సర్కారును నిద్ర లేపుతాం: వైఎస్ జగన్
రైతులకు లాభం జరగాలంటే మార్క్ఫెడ్ను రంగంలోకి దించాలి. అలా ప్రభుత్వం రైతుల తరఫున నిలబడిందని సీరియస్గా మెసేజ్ ఇవ్వాలి. పొగాకు లైసెన్స్దారులు ఫలానా రేటుకు పంట కొంటాం.. ఇంత పరిమాణంలో మీరు పంట వేయండి.. అని చెప్పారు కాబట్టే ఆ మేరకు రైతులు పంట వేశారు. అప్పుడు వాళ్లు చెప్పిన మేరకు ఆ పరిమాణం మేర (అషూరెన్స్ ఇచ్చిన క్వాంటిటీ) పంటను కొనుగోలు చేసి తీరాల్సిందే.చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క పొగాకు పంటే కాదు. ఏ పంట పరిస్థితి చూసినా ఇంతే. దళారీలే వ్యవస్థను నడుపుతున్నారు. అందుకే దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితి. రైతులు విసిగిపోయి, ఏదో ఒక రేటుకు కొనండి.. మమ్మల్ని బతికించండి సామీ.. అనే పరిస్థితి. అలా రైతులు తెగనమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం దిగజారిపోతున్న దారుణ పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.-వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, వారి సమస్యలపై పోరాటం సాగించి అండగా.. తోడుగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు పాలనలో అంతా దళారులదే రాజ్యం అని, వ్యాపారులంతా సిండికేట్గా మారి యథేచ్ఛగా దోచుకుంటున్నారని, ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదని.. చివరకు ఆక్వా రైతులదీ అదే పరిస్థితి అని గుర్తు చేశారు. సీజన్ ముగుస్తున్నా ఇప్పటికీ పొగాకు కొనుగోళ్లు లేవని, ఇప్పటి వరకు 20 శాతం కొనుగోళ్లు కూడా జరగలేదని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పొగాకు సాగు చేస్తున్న రైతులు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. వారి సమస్యలన్నీ సావధానంగా విన్న జగన్.. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. రైతులెవ్వరూ ధైర్యం కోల్పోవద్దని, పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని.. పొగాకు రైతులను స్వయగా కలుస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం నిద్ర నటిస్తోందని.. నిద్ర పోయే వాళ్లను లేపొచ్చు కానీ, నిద్ర నటించే వాళ్లను లేపడం కష్టమని.. అయినా గట్టిగా ప్రయత్నిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు మాటకు విలువ లేదుపొగాకు కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికి దాదాపు 94 రోజులు అయినప్పటికీ, 20 శాతం కూడా కొనుగోలు చేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మామూలుగా 100 రోజుల్లోనే పొగాకు కొనుగోళ్లు పూర్తి కావాలి. అలాంటిది 94 రోజులు దాటినా కూడా ఇంత వరకు కేవలం 38 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారు. పండిందేమో 232 మిలియన్ కేజీలు. అంటే పండిన పంటలో కేవలం 16.5% మాత్రమే కొనుగోలు చేశారు. ఇలాగైతే రైతు ఏ రకంగా బతకగలుగుతాడు? ఎన్ని రోజులు ఇలా? కర్ణాటకలో సెప్టెంబర్లో పొగాకు కొనుగోళ్లు మొదలవుతాయి. అప్పుడు సగం మంది ట్రేడర్లు సహజంగా అటువైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. అలాగైతే తమ పంటను ఎవరు కొంటారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సమీక్ష చేసి పొగాకు ధర కేజీ రూ.200కు తగ్గకూడదని చెప్పిన మరుసటి రోజే పొదిలిలో రూ.179, టంగుటూరు, కనిగిరిలో రూ.184, కందుకూరులో రూ.186, జంగారెడ్డిగూడెం, గోపాలపురంలో రూ.170తో కొనుగోలు చేశారంటే సిండికేట్ ఏ రకంగా వేళ్లూనుకుందో స్పష్టమవుతోంది. అసలు చంద్రబాబు మాటకు విలువ లేదని తేలిపోయింది.పొగాకు బోర్డు లక్ష్యం ఏమిటి?రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి, పోటీ వాతావరణం ఏర్పడేలా చేస్తే రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టుబాకో (పొగాకు) బోర్డు ఏర్పాటైంది. చంద్రబాబు ప్రభుత్వ పుణ్యాన పరిస్థితి ఎలా మారిందంటే.. ఆయన అధికారంలోకి వస్తూనే సిండికేట్లో అందరికీ కొమ్ములు వస్తాయి. అంతా ఏకమై ధర తగ్గించేస్తారు. చంద్రబాబు చెప్పేది చెబుతూ ఉంటాడు.. మనం చేసేది మనం చేస్తుంటాం అన్న ధైర్యంతో వారుంటారు. ఈ ఒక్క పంటే కాదు. ఏ పంట పరిస్థితి చూసినా ఇంతే. దళారీలే వ్యవస్థను నడుపుతున్నారు. అందుకే వెంటనే ధరలు పతనమై చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితి. రైతులు విసిగిపోయి, ఏదో ఒక రేటుకు కొనండి.. మమ్మల్ని బతికించండి సామీ.. అనే పరిస్థితి. అలా రైతులు తెగ నమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం దిగజారిపోతున్న దారుణ పరిస్థితి కనిపిస్తోంది.మా ప్రభుత్వంలో ‘మార్క్ఫెడ్’ను దించాం ఇటువంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో మన ప్రభుత్వ హయాంలో మార్క్ఫెడ్ను పోటీగా దించాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా మార్క్ఫెడ్ను ప్లాట్ఫామ్ మీదకు తీసుకొచ్చి కొనుగోళ్లలో భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేశాం. రైతుల తరఫున మార్క్ఫెడ్ రంగ ప్రవేశం చేయడంతో మార్కెట్లో పోటీ మొదలైంది. ఫలితంగా సిండికేట్ను బ్రేక్ చేశాం. ఇలా ప్రభుత్వం ఎప్పుడైతే సీరియస్గా తీసుకోవడం మొదలు పెట్టిందో, అప్పుడు భయం మొదలై రేట్లు పెరిగాయి. ఆ మేరకు 2023–24లో మా ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు సగటు ధర రూ.289 కాగా, ఆ ఏడాది అత్యధికంగా కిలోకు రూ.411 వరకు ధర లభించింది. అది అత్యుత్తమ ధర అని అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రిపోర్టు ఇచ్చింది.మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? ఈ రోజు చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా పడిపోతున్న పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నా. 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే. అంత తక్కువ పంట కొనుగోలు చేసిన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరోవైపు నో బిడ్స్.. భారీగా పొగాకు బ్యారెళ్లు తిరస్కరణకు గురవడం కనిపిస్తోంది. ఇలా చేస్తున్న కంపెనీలపై చంద్రబాబు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఇంతవరకు ఎన్ని కేసులు పెట్టారు? ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేశారు? ఎంత మందిని బ్లాక్ లిస్టులో పెట్టారు? అంటే ఇంత వరకు ఏ ఒక్కరి లైసెన్స్ను సస్పెండ్ చేయలేదు. ఎవరినీ బ్లాక్ లిస్టులో పెట్టలేదు. చంద్రబాబు ఏ రకమైన భయాన్ని కలిగించకుండా, మార్క్ఫెడ్ను రంగంలోకి రానివ్వకుండా మొత్తం అడ్డుకుంటే రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది?రైతులకు లాభం జరగాలంటే.. రైతులకు లాభం జరగాలంటే ఒకటి మార్క్ఫెడ్ను రంగంలోకి దించాలి. అలా ప్రభుత్వం రైతుల తరఫున నిలబడడానికి సీరియస్గా ఉందని మెసేజ్ ఇవ్వాలి. రెండోది.. లైసెన్స్దారులకు లైసెన్సులు ఎందుకు ఇచ్చారు? వాళ్లు ఫలానా రేటుకు పంట కొంటాం.. ఇంత పంట మీరు వేయండి.. అని చెప్పారు కాబట్టే ఆ మేరకు రైతులు పంట వేశారు. అప్పుడు వాళ్లు చెప్పిన మేరకు ఆ పరిమాణం మేర (అషూరెన్స్ ఇచ్చిన క్వాంటిటీ) పంటను గొనుగోలు చేసి తీరాల్సిందే. రైతులు నష్టపోకుండా లాభం వచ్చే రేటుకు కొనుగోలు చేయాలి కదా? అది వారి నైతిక బాధ్యత కూడా. మరి ఆ బాధ్యతను వాళ్లు విస్మరించినప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు. ఈ రకంగా సిండికేట్గా ఏర్పడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతం ఇవ్వగలగాలి. అప్పుడే సిండికేట్ వ్యవస్థ బ్రేక్ అవుతుంది. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుంటున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రభుత్వంలో అవేవీ జరగవు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇవేమీ జరగవు. ఆయిల్పామ్కు సంబంధించి పక్కన తెలంగాణలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్) 18.9% ఉంటే, ఆంధ్రాలో దాన్ని 14 శాతానికి అటు ఇటు పెట్టారు. ఏపీ బోర్డర్లో 100 మీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీలో ఆ మేరకు ఓఈఆర్ బెటర్గా ఉండి, రైతులకు బెటర్ రేట్ అక్కడ వస్తుంటే.. ఇక్కడ ఆంధ్రలో ఐదేళ్ల పాటు చంద్రబాబు హయాంలో ఓఈఆర్ పర్సెంటేజ్ తగ్గించి, రైతులు నష్టపోయేలా చేసినా పట్టించుకునే నాథుడు లేడు. రైతులు నష్టపోనీలే అన్నట్లుగా వ్యవహరించిన తీరు కళ్లారా చూశాం.పది రోజుల్లో ‘పశ్చిమ’లో పర్యటిస్తా రైతులకు తోడుగా నిలిచి ప్రభుత్వాన్ని మేలుకొలిపే కార్యక్రమం చేయగలిగినంత చేస్తాం. రైతులకు నిజంగా, శాశ్వతంగా మంచి జరగాలంటే ఇంకో మూడేళ్లు ఓపిక పట్టాల్సిందే. అయినా ఆలోపు కచ్చితంగా రైతుల తరఫున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తాం. అలా అన్ని రకాలుగా రైతులకు తోడుగా నిలుస్తాం. ఏయే జిల్లాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారో.. అక్కడ రైతులకు అండగా వైఎస్సార్సీపీ నిలబడుతుంది. వారం, పది రోజుల్లో నా పర్యటన కూడా ఉంటుంది. గత ఏడాది ప్రకాశం జిల్లాకు వెళ్లాను. ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురంలో కానీ, జంగారెడ్డిగూడెంలో కానీ పర్యటిస్తా. పొగాకు రైతుల సమస్యను రాష్ట్రమంతా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. నిద్ర పోయే వాళ్లను లేపొచ్చు కానీ, నిద్ర నటించే వాళ్లను లేపడం కష్టం. అయినా గట్టిగా ప్రయత్నించి, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ప్రయత్నిస్తాం’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రానికి మేలు⇒ రైతులు ఎప్పుడూ నష్టపోకూడదు. రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుండాలి అంటే రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలి అని చెప్పి.. రైతు పక్షపాత ప్రభుత్వంగా మన ప్రభుత్వం రాగానే మార్పులు జరిగాయి. మన హయాంలోనే ఆయిల్పామ్లో ఆ వ్యత్యాసం తొలగించాం. ఆయిల్పామ్ సాగులో నష్టపోయిన రైతులకు దాదాపు రూ.90 కోట్లు ఇచ్చి అండగా నిలబడి, ఒక మెసేజ్ పంపించాం. ఆ తర్వాత రేట్లన్నీ ఆటోమేటిక్గా 10 ఏళ్లు పెరుగుతాయి.⇒ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఐదేళ్లలో రైతుల తరఫున రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి ఆర్బీకేను ఒక కొనుగోలు కేంద్రంగా ప్రకటించి, ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ను మార్క్ఫెడ్ జాయింట్ ఎండీగా ప్రకటించాం. ప్రతి ఆర్బీకేలో పంటల కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)ను ప్రకటించి, ఆ వివరాలతో బోర్డును ప్రదర్శించాం. ఆ రేట్ల కన్నా తక్కువ రేట్లకు ఏ పంట అయినా పడిపోతే, వెంటనే ఆర్బీకే పరిధిలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ) వెంటనే అప్రమత్తమయ్యేవాడు. సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ని యాక్టివేట్ అయ్యేది. దాంతో ఏ ఆర్బికే పరిధిలో పంట ధర పడిపోయిందో, అక్కడ జాయింట్ కలెక్టర్ ఎంటరై వెంటనే పంట కొనుగోలు ప్రారంభించేవాళ్లు.⇒ అలా మార్కెట్లో పోటీ ఏర్పడేది. దానివల్ల ఏ రైతూ నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు. ఆ ప్రక్రియలో ఏకంగా రూ.7,800 కోట్లు మనం ఖర్చు చేశాం కాబట్టే, ఆ రోజుల్లో ఏ రైతూ ఏ పంటా నష్టపోలేదు. అందుకే అప్పుడు గిట్టుబాటు ధర రాని పరిస్థితి అనేది ఏ రోజు ఒక ఇష్యూ కింద రాలేదు. రైతులకు ప్రభుత్వం ఉందన్న భరోసా ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్లిపోయిందో, ఆటోమేటిక్గా ప్రతి పంటకు మంచి రేట్లు వచ్చాయి. ⇒ కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతులకు ఈ ప్రభుత్వం తోడుగా లేదన్న మెసేజ్ ఉంది కాబట్టి, దళారీల వ్యవస్థ ఈరోజు సిండికేట్గా మారి ధర లేకుండా చేస్తూ రైతులను అడ్డగోలుగా దోచుకుంటోంది.ఇలాగైతే బతకలేం‘రెండేళ్లుగా పొగాకు రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. గతేడాది నల్లబర్లి పొగాకు కొనేవారు లేక నష్టపోతే, ఈ ఏడాది ధరల పతనంతో ఆర్థికంగా కుదేలవుతున్నాం. ఈ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలి.. అండగా నిలవాలన్న ఆలోచన ఏ కోశాన కన్పించడం లేదు’ అని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. రెండేళ్లుగా తీవ్ర కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఏమన్నారంటే..కోవిడ్ పరిస్థితులున్నా మీరు అండగా నిలిచారుమీ హయాంలో పొగాకు సాగులో సంక్షోభం ఉంటే, మీరు చాలా చొరవ చూపారు. అప్పుడు కోవిడ్ ఉన్నా, మీరు స్వయంగా పొగాకు కొంటామని చెప్పారు. అది చేసి చూపారు. మీరు మార్కెట్లో జోక్యం చేసుకోవడం వల్ల మంచి ధర లభించింది. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొనే వారులేక ప్లాట్ఫామ్స్ నుంచి పొగాకు వెనక్కు తీసుకువెళ్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఫిబ్రవరి వరకు వేలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్లో కర్ణాటకలో వేలం మొదలవుతుంది. ఆలోగా ఇక్కడ కొనుగోళ్లు పూర్తికాకపోతే, మాకు చాలా సమస్య వస్తుంది. సిగరెట్ ప్యాకెట్ల రేటు రూ.170 నుంచి రూ.240 వరకు పెరిగింది. పొగాకు పండించే రైతుకు మాత్రం రేటు పడిపోయింది. పొగాకు పంట సాగుకు ఎకరానికి రూ.2.30 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ, ఇప్పుడు పలుకుతున్న ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు.– మారెడ్డి సుబ్బారెడ్డి, టుబాకో బోర్డు మెంబర్, ప్రకాశం జిల్లావ్యాపారులకు కొమ్ముకాస్తున్న టుబాకో బోర్డుటుబాకో (పొగాకు) బోర్డు రాక ముందు 1983లో ఉద్యమం జరిగింది. అందులో ముగ్గురు చనిపోయారు. ఆ తర్వాత బోర్డు వచ్చింది. రైతులు, వ్యాపారులకు అనుసంధానంగా ఉండాల్సిన బోర్డు, ఈ రోజు పూర్తిగా వ్యాపారులకు కొమ్ము కాస్తోంది. చంద్రబాబు అధికారంలో ఎప్పుడున్నా ఇదే పరిస్థితి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా పొగాకు సాగు చేస్తుండగా, అందులో 30 శాతం కొండెపి నియోజకవర్గంలోనే ఉంటుంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు రైతాంగానికి మీరే అండగా నిలవాలి. ఈ ఏడాది కొనుగోళ్లు పూర్తి చేయకుండానే, వచ్చే ఏడాదికి సంబంధించి కూడా ఇండెంట్ ఇచ్చారు. ఇంత కంటే దారుణం మరొకటి ఉంటుందా?– పి.శ్రీనివాస్, ప్రకాశం జిల్లాఎప్పటికి కొంటారో తెలియడం లేదుప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పొగాకు ఎప్పటికి కొంటారో తెలియడం లేదు. గత ఏడాది కంటే ఈసారి పెట్టుబడి కేజీకి రూ.30 పెరగ్గా, ధర కేజీకి రూ.70 తగ్గింది. కేజీ పొగాకుతో 1,000 సిగరెట్లు తయారవుతున్నాయి. వాటి ద్వారా రూ.24 వేలు సంపాదిస్తున్నారు. అదే కేజీ పొగాకుకు మాకు రూ.265 మాత్రమే ఇస్తున్నారు. ఇదేం న్యాయం? ఎరువుల ధరలు పెరిగాయి. సాగు వ్యయం పెరిగింది. ధర దారుణంగా పడిపోయింది. మీరు దృష్టి పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది.– మధు, పోలవరం, ఏలూరు జిల్లా2023–24లో మంచి ధర పలికిందిమాది నీరు పెట్టి సాగు చేసే పొగాకు. ఈ ఏడాది 88 మిలియన్ కేజీల పంట కొంటారని అంచనా వేయగా, ఈరోజు వరకు 7.62 మిలియన్ కేజీలే కొన్నారు. ఈ ఏడాది కొనుగోలు ధర కేజీకి రూ.265 మాత్రమే. అది కూడా చెల్లించడం లేదు. ఇండెంట్ ఇచ్చినప్పుడు ఒక రేటు చెబుతున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రెండేళ్ల క్రితం 2023–24లో కేజీ పొగాకు ధర రూ.320కి పైగా పలికింది. ఈసారి 80 మిలియన్ కిలోల పొగాకు ఉంది. కానీ ఎంత వరకు కొంటారో తెలియడం లేదు. 40 శాతం పొగాకును వేలం కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. పొగాకును బయటకు తీసుకొచ్చి, మళ్లీ తీసుకుపోతే రంగు మారుతుంది. క్వాలిటీ పడిపోతుంది. పొగాకు కొనుగోళ్లలో ఐటీసీ కూడా చొరవ చూపడం లేదు.– రాజేంద్రబాబు, గోపాలపురం, తూర్పుగోదావరి జిల్లామీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందిమా ప్రాంతంలో 2 వేలం కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 4 రౌండ్ల వేలం జరిగింది. ఒక్కో రైతు నుంచి 8 క్వింటాళ్ల నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు జరిగింది. అమ్మకాలు లేకపోవడం వల్ల పొగాకు క్వాలిటీ తగ్గుతోంది. పొగాకు మగ్గి పోవడంతో ఎగుమతి కాదంటూ వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. కొంటున్న పొగాకుకు కూడా కేజీకి రూ.160 మాత్రమే దక్కుతోంది. రైతులు నష్టపోతున్నారు. మీరు వస్తే తప్ప మాకు న్యాయం జరగదు.– ఎన్.వెంకటేశ్వరరెడ్డి, కందుకూరు, నెల్లూరు జిల్లాజీఎస్టీ సాకు చూపి ధరలో కోత పెడుతున్నారు పొగాకు రైతుల బాధలు అన్నీ ఇన్నీ కావు. వ్యాపారుల మాయాజాలం చూస్తే.. ఎగుమతిదారులు ఆర్డర్ను డాలర్లలోనే ఇస్తారు. అలానే తీసుకుంటారు. డాలర్ ధర చాలా ఎక్కువగా ఉంది. గతేడాది ధర లేదు. పార్టీలకతీతంగా రైతులంతా మిమ్మల్ని కోరుకుంటున్నారు.. మీరు మా ప్రాంతాన్ని సందర్శించాలి. సిగరెట్ ఉత్పత్తిదారులు జీఎస్టీ సాకు చూపి తక్కువ ధర చెల్లిస్తున్నారు. – మారెళ్ల బంగారుబాబు, ఒంగోలు, ప్రకాశం జిల్లాఏటా 20 శాతం సాగు వ్యయం పెరుగుతోంది ఏటా 20 శాతం వంతున వ్యయం పెరుగుతోంది కానీ ఆ స్థాయిలో ధర పెరగడం లేదు. ఈసారి ధర రూ.265 నుంచే మొదలు పెట్టారు. చివరకు దాన్ని రూ.175కు తగ్గించారు. ప్రారంభ ధర రూ.265 కూడా గిట్టుబాటు కాదు. కానీ, ఆ ధరకు కూడా కొనేది చాలా తక్కువ. ఈ ఏడాది 26 వేల బేళ్ల పొగాకు తెస్తే, కేవలం 6 వేల బేళ్ల పొగాకు మాత్రమే కొన్నారు. మార్కెట్లో డిమాండ్ లేదని వ్యాపారులు చెబుతున్నారు. పొగాకు వల్ల ఏటా కేంద్రానికి రూ.50 వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ పొగాకు పండించే రైతులకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. మాకు మీ వల్లనే న్యాయం జరుగుతుంది. మీరు అడుగు పెడితే, మా కష్టాలు తీరుతాయి. – ఎస్.వెంకట్రావు, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లాక్వాలిటీ మా చేతుల్లో లేదు కదా..ఎక్కడా పొగాకు అమ్ముడు పోవడం లేదు. బోర్డుకు తీసుకుపోతే నో బిడ్. పొగాకును ప్లాట్ఫామ్స్కు తీసుకుపోతే కొనకపోవడంతో, వెనక్కి తీసుకురావడం కష్టంగా ఉంది. చెట్టుకు 25 వరకు ఆకులు వస్తాయి. అన్నీ ఒకే నాణ్యతతో ఉండవు. కిందవి వేరుగా ఉంటాయి. చెట్టు మధ్య ఆకులు మాత్రమే బాగుంటాయి. కేవలం నాణ్యమైన ఎఫ్–1, ఎఫ్–2 పొగాకు మాత్రమే తెమ్మంటున్నారు. అది ఎలా సాధ్యం? క్వాలిటీ అనేది మా చేతుల్లో లేదు కదా? క్వాలిటీ లేదని రోజూ దాదాపు 45 శాతం వెనక్కు పంపిస్తున్నారు. టుబాకో బోర్డు మొత్తం సరుకు కొనేలా ఒత్తిడి తేవాలి.– జి.వెంకటేశ్వర్రెడ్డి, పొదిలి, ఉమ్మడి ప్రకాశం జిల్లాజీవనోపాధి లేకుండా పోతుంది..మా దగ్గర 13 వేల కుటుంబాలు పొగాకు సాగు చేస్తున్నాయి. ఇంకా సమీప ప్రాంతాల నుంచి చాలా మంది పొలాల్లో పని చేస్తున్నారు. దాదాపు లక్ష మంది వలస కూలీలు జీవనోపాధి వెతుక్కున్నారు. కానీ, పొగాకుకు ధర రావడం లేదు. గత ఏడాదీ అంటే. ఈ ఏడాది రూ.265 నుంచి మొదలు పెట్టి, కేవలం రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారు. – మధ్యాహ్నపు ఏసు, కొయ్యలగూడెం, ఏలూరు జిల్లాసిండికేట్ అయ్యామని వ్యాపారులే చెబుతున్నారు మా దగ్గర పొగాకు కొనుగోళ్లు అస్సలు జరగడం లేదు. వ్యాపారులను అడిగితే, మేమంతా సిండికేట్ అయ్యాం. చంద్రబాబును కలిశాం. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు.. అంటున్నారు. మరో వైపు సీఎం మాత్రం మంచి ధర ఇవ్వాలని చెబుతున్నాడు. కానీ, వ్యాపారులు మాత్రం బేలుకు రూ.30 వేలు కాదు కదా.. రూ.16 వేలకు కూడా కొనడం లేదు. అంటే సీఎం మాటకు విలువ లేదా? లేక ఆయన డ్రామాలు చేస్తున్నాడా? మిమ్మల్ని ఓడించినందుకు అందరికీ బుద్ధి వచ్చింది. జగన్ ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాం. – వెంకటేశ్వర్రెడ్డి, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లానాడు కరోనా వేళ కూడా మంచి లాభాలుకరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కిలో పొగాకు రూ.180 నుంచి రూ.260 వరకు కొన్నారు. మాకు మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు అస్సలు ధర లేదు. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని, గిట్టుబాటు ధర వస్తుందని ప్రచారం చేశారు. కానీ, వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. జరుగుతోంది మరొకటి.– ఎం.వెంకటనారాయణ, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లాఈ ప్రభుత్వం చేసిందేమీ లేదురాష్ట్రంలో 2.92 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. ఇందులో ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోనే 1.75 లక్షల ఎకరాలు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 60 వేల ఎకరాలు సాగులో ఉంది. పొగాకు ధర గత ఏడాది నుంచి మరింత దారుణంగా పడిపోయింది. ప్రతి రోజూ ధర అమాంతం పడిపోతోంది. చాలా ప్లాట్ఫామ్స్ మీద 27 శాతం తిరస్కరణకు గురయ్యింది. ఇంకా కొన్ని చోట్ల అది దాదాపు 40 శాతం వరకు ఉంది. ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేస్తే సమస్య ఉండదు. ఇప్పుడు మార్క్ఫెడ్ను రంగంలోకి దింపాలి. అప్పుడే మంచి ధర వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం తప్ప ఏమీ చేయడం లేదు. – ఎంవీఎస్ నాగిరెడ్డి,వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు విభాగం) -
ఇలాగైతే బతకలేం
సాక్షి, అమరావతి: ‘రెండేళ్లుగా పొగాకు రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. గతేడాది నల్లబర్లి పొగాకు కొనేవారు లేక నష్టపోతే, ఈ ఏడాది ధరల పతనంతో ఆర్థికంగా కుదేలవుతున్నాం. ఈ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలి.. అండగా నిలవాలన్న ఆలోచన ఏ కోశాన కన్పించడం లేదు’ అని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. రెండేళ్లుగా తీవ్ర కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఏమన్నారంటే..కోవిడ్ పరిస్థితులున్నా మీరు అండగా నిలిచారుమీ హయాంలో పొగాకు సాగులో సంక్షోభం ఉంటే, మీరు చాలా చొరవ చూపారు. అప్పుడు కోవిడ్ ఉన్నా, మీరు స్వయంగా పొగాకు కొంటామని చెప్పారు. అది చేసి చూపారు. మీరు మార్కెట్లో జోక్యం చేసుకోవడం వల్ల మంచి ధర లభించింది. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొనే వారులేక ప్లాట్ఫామ్స్ నుంచి పొగాకు వెనక్కు తీసుకువెళ్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఫిబ్రవరి వరకు వేలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్లో కర్ణాటకలో వేలం మొదలవుతుంది. ఆలోగా ఇక్కడ కొనుగోళ్లు పూర్తికాకపోతే, మాకు చాలా సమస్య వస్తుంది. సిగరెట్ ప్యాకెట్ల రేటు రూ.170 నుంచి రూ.240 వరకు పెరిగింది. పొగాకు పండించే రైతుకు మాత్రం రేటు పడిపోయింది. పొగాకు పంట సాగుకు ఎకరానికి రూ.2.30 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ, ఇప్పుడు పలుకుతున్న ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. – మారెడ్డి సుబ్బారెడ్డి, టుబాకో బోర్డు మెంబర్, ప్రకాశం జిల్లాఎప్పటికి కొంటారో తెలియడం లేదుప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పొగాకు ఎప్పటికి కొంటారో తెలియడం లేదు. గత ఏడాది కంటే ఈసారి పెట్టుబడి కేజీకి రూ.30 పెరగ్గా, ధర కేజీకి రూ.70 తగ్గింది. కేజీ పొగాకుతో 1,000 సిగరెట్లు తయారవుతున్నాయి. వాటి ద్వారా రూ.24 వేలు సంపాదిస్తున్నారు. అదే కేజీ పొగాకుకు మాకు రూ.265 మాత్రమే ఇస్తున్నారు. ఇదేం న్యాయం? ఎరువుల ధరలు పెరిగాయి. సాగు వ్యయం పెరిగింది. ధర దారుణంగా పడిపోయింది. మీరు దృష్టి పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది.– మధు, పోలవరం, ఏలూరు జిల్లా2023–24లో మంచి ధర పలికిందిమాది నీరు పెట్టి సాగు చేసే పొగాకు. ఈ ఏడాది 88 మిలియన్ కేజీల పంట కొంటారని అంచనా వేయగా, ఈరోజు వరకు 7.62 మిలియన్ కేజీలే కొన్నారు. ఈ ఏడాది కొనుగోలు ధర కేజీకి రూ.265 మాత్రమే. అది కూడా చెల్లించడం లేదు. ఇండెంట్ ఇచ్చినప్పుడు ఒక రేటు చెబుతున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రెండేళ్ల క్రితం 2023–24లో కేజీ పొగాకు ధర రూ.320కి పైగా పలికింది. ఈసారి 80 మిలియన్ కిలోల పొగాకు ఉంది. కానీ ఎంత వరకు కొంటారో తెలియడం లేదు. 40 శాతం పొగాకును వేలం కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. పొగాకును బయటకు తీసుకొచ్చి, మళ్లీ తీసుకుపోతే రంగు మారుతుంది. క్వాలిటీ పడిపోతుంది. పొగాకు కొనుగోళ్లలో ఐటీసీ కూడా చొరవ చూపడం లేదు. – రాజేంద్రబాబు, గోపాలపురం, తూర్పుగోదావరి జిల్లామీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందిమా ప్రాంతంలో 2 వేలం కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 4 రౌండ్ల వేలం జరిగింది. ఒక్కో రైతు నుంచి 8 క్వింటాళ్ల నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు జరిగింది. అమ్మకాలు లేకపోవడం వల్ల పొగాకు క్వాలిటీ తగ్గుతోంది. పొగాకు మగ్గి పోవడంతో ఎగుమతి కాదంటూ వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. కొంటున్న పొగాకుకు కూడా కేజీకి రూ.160 మాత్రమే దక్కుతోంది. రైతులు నష్టపోతున్నారు. మీరు వస్తే తప్ప మాకు న్యాయం జరగదు . – ఎన్.వెంకటేశ్వరరెడ్డి, కందుకూరు, నెల్లూరు జిల్లాజీఎస్టీ సాకు చూపి ధరలో కోత పెడుతున్నారు పొగాకు రైతుల బాధలు అన్నీ ఇన్నీ కావు. వ్యాపారుల మాయాజాలం చూస్తే.. ఎగుమతిదారులు ఆర్డర్ను డాలర్లలోనే ఇస్తారు. అలానే తీసుకుంటారు. డాలర్ ధర చాలా ఎక్కువగా ఉంది. గతేడాది ధర లేదు. పార్టీలకతీతంగా రైతులంతా మిమ్మల్ని కోరుకుంటున్నారు.. మీరు మా ప్రాంతాన్ని సందర్శించాలి. సిగరెట్ ఉత్పత్తిదారులు జీఎస్టీ సాకు చూపి తక్కువ ధర చెల్లిస్తున్నారు. – మారెళ్ల బంగారుబాబు, ఒంగోలు, ప్రకాశం జిల్లాఏటా 20 శాతం సాగు వ్యయం పెరుగుతోంది ఏటా 20 శాతం వంతున వ్యయం పెరుగుతోంది కానీ ఆ స్థాయిలో ధర పెరగడం లేదు. ఈసారి ధర రూ.265 నుంచే మొదలు పెట్టారు. చివరకు దాన్ని రూ.175కు తగ్గించారు. ప్రారంభ ధర రూ.265 కూడా గిట్టుబాటు కాదు. కానీ, ఆ ధరకు కూడా కొనేది చాలా తక్కువ. ఈ ఏడాది 26 వేల బేళ్ల పొగాకు తెస్తే, కేవలం 6 వేల బేళ్ల పొగాకు మాత్రమే కొన్నారు. మార్కెట్లో డిమాండ్ లేదని వ్యాపారులు చెబుతున్నారు. పొగాకు వల్ల ఏటా కేంద్రానికి రూ.50 వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ పొగాకు పండించే రైతులకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. మాకు మీ వల్లనే న్యాయం జరుగుతుంది. మీరు అడుగు పెడితే, మా కష్టాలు తీరుతాయి. – ఎస్.వెంకట్రావు, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లాక్వాలిటీ మా చేతుల్లో లేదు కదా..ఎక్కడా పొగాకు అమ్ముడు పోవడం లేదు. బోర్డుకు తీసుకుపోతే నో బిడ్. పొగాకును ప్లాట్ఫామ్స్కు తీసుకుపోతే కొనకపోవడంతో, వెనక్కి తీసుకురావడం కష్టంగా ఉంది. చెట్టుకు 25 వరకు ఆకులు వస్తాయి. అన్నీ ఒకే నాణ్యతతో ఉండవు. కిందవి వేరుగా ఉంటాయి. చెట్టు మధ్య ఆకులు మాత్రమే బాగుంటాయి. కేవలం నాణ్యమైన ఎఫ్–1, ఎఫ్–2 పొగాకు మాత్రమే తెమ్మంటున్నారు. అది ఎలా సాధ్యం? క్వాలిటీ అనేది మా చేతుల్లో లేదు కదా? క్వాలిటీ లేదని రోజూ దాదాపు 45 శాతం వెనక్కు పంపిస్తున్నారు. టుబాకో బోర్డు మొత్తం సరుకు కొనేలా ఒత్తిడి తేవాలి. – జి.వెంకటేశ్వర్రెడ్డి, పొదిలి, ఉమ్మడి ప్రకాశం జిల్లాజీవనోపాధి లేకుండా పోతుంది..మా దగ్గర 13 వేల కుటుంబాలు పొగాకు సాగు చేస్తున్నాయి. ఇంకా సమీప ప్రాంతాల నుంచి చాలా మంది పొలాల్లో పని చేస్తున్నారు. దాదాపు లక్ష మంది వలస కూలీలు జీవనోపాధి వెతుక్కున్నారు. కానీ, పొగాకుకు ధర రావడం లేదు. గత ఏడాదీ అంటే. ఈ ఏడాది రూ.265 నుంచి మొదలు పెట్టి, కేవలం రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారు. – మధ్యాహ్నపు ఏసు, కొయ్యలగూడెం, ఏలూరు జిల్లాసిండికేట్ అయ్యామని వ్యాపారులే చెబుతున్నారు మా దగ్గర పొగాకు కొనుగోళ్లు అస్సలు జరగడం లేదు. వ్యాపారులను అడిగితే, మేమంతా సిండికేట్ అయ్యాం. చంద్రబాబును కలిశాం. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు.. అంటున్నారు. మరో వైపు సీఎం మాత్రం మంచి ధర ఇవ్వాలని చెబుతున్నాడు. కానీ, వ్యాపారులు మాత్రం బేలుకు రూ.30 వేలు కాదు కదా.. రూ.16 వేలకు కూడా కొనడం లేదు. అంటే సీఎం మాటకు విలువ లేదా? లేక ఆయన డ్రామాలు చేస్తున్నాడా? మిమ్మల్ని ఓడించినందుకు అందరికీ బుద్ధి వచ్చింది. జగన్ ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాం. – వెంకటేశ్వర్రెడ్డి, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లానాడు కరోనా వేళ కూడా మంచి లాభాలుకరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కిలో పొగాకు రూ.180 నుంచి రూ.260 వరకు కొన్నారు. మాకు మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు అస్సలు ధర లేదు. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని, గిట్టుబాటు ధర వస్తుందని ప్రచారం చేశారు. కానీ, వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. జరుగుతోంది మరొకటి. – ఎం.వెంకటనారాయణ, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లాఈ ప్రభుత్వం చేసిందేమీ లేదురాష్ట్రంలో 2.92 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. ఇందులో ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోనే 1.75 లక్షల ఎకరాలు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 60 వేల ఎకరాలు సాగులో ఉంది. పొగాకు ధర గత ఏడాది నుంచి మరింత దారుణంగా పడిపోయింది. ప్రతి రోజూ ధర అమాంతం పడిపోతోంది. చాలా ప్లాట్ఫామ్స్ మీద 27 శాతం తిరస్కరణకు గురయ్యింది. ఇంకా కొన్ని చోట్ల అది దాదాపు 40 శాతం వరకు ఉంది. ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేస్తే సమస్య ఉండదు. ఇప్పుడు మార్క్ఫెడ్ను రంగంలోకి దింపాలి. అప్పుడే మంచి ధర వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం తప్ప ఏమీ చేయడం లేదు. – ఎంవీఎస్ నాగిరెడ్డి,వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు విభాగం) -
చినుకు లేకున్నా.. చేలు తడిచాయి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాలం కలిసి రాకపోయినా.. ఆలోచనలు కలిసొచ్చాయి. వర్షాలు ముఖం చాటేస్తేనేం.. సాంకేతికత తోడుగా నిలిచింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోయినా ఈ రైతులు అధైర్య పడటం లేదు. నీటి ఎద్దడిని చూసి నిరాశ చెందడం లేదు. కరువు పరిస్థితుల్లోనూ తక్కువ నీటితో లాభదాయక వ్యవసాయం కొనసాగించవచ్చని నిరూపిస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో పంటల సాగు, ముందస్తు ప్రణాళికతో కూడిన సమర్థవంతమైన నీటి యాజమాన్యం, సాంకేతిక పరిజ్ఞానంతో సాగుబడిలో విజయం సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరిలోనూ స్ఫూర్తి నింపుతున్న రైతన్నలపై ‘సాక్షి’కథనం.. కుంట తవ్వి.. జలనిధిని ఒడిసిపట్టి.. రైతు పేరు: పార్శి రాములు స్వగ్రామం: సోమేశ్వరం, కామారెడ్డి పంటలు: మొక్కజొన్న, వరి విజయ రహస్యం: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరేలా తన ఐదు ఎకరాల పొలంలో 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఆరు అడుగుల లోతుతో వ్యవసాయ కుంట (ఫాంపాండ్) నిర్మించాడు. దీంతో బోరు బావిలో నీరు సమృద్ధిగా ఉంటుండటంతో ఏటా రెండు పంటలు పండిస్తున్నాడు. నీటి కుంట ఏర్పాటు చేసినప్పటి నుంచి వర్షాల కోసం ఎదురుచూడకుండానే పంటలు పండిస్తున్నానని రాములు చెబుతున్నాడు.ఆరు తడి అస్త్రం.. సాఫీగా సేద్యం రైతు పేరు: బోడ మహేష్ స్వస్థలం: శాఖాజిపురం, గుర్రంపోడు, నల్లగొండ పంటలు: టమాట, గుమ్మడి, దోస, పుచ్చ, వేరుశనగ విజయ రహస్యం: బోరులో తక్కువ నీరు ఉండటంతో సంప్రదాయ పంటల వైపు వెళ్లకుండా, తనకున్న ఐదు ఎకరాల్లో అర ఎకరం పోనూ మిగిలిన భూమిలో టమాట, గుమ్మడి, దోస, పుచ్చ, వేరుశనగ వంటి ఆరుతడి పంటలు సాగు చేస్తున్నాడు. ఇందుకోసం మల్చింగ్ కవర్ వినియోగిస్తున్నాడు. ఒక్కసారి కవర్ పరిచి దాని ఆధారంగానే ఏడాదిలో 3 సార్లు కూరగాయలు పండిస్తున్నాడు. గత ఏడాది పుచ్చ సాగులో రూ.2 లక్షల లాభం వచ్చిందని.. ఆరు తడి పంటలతో పాడిలాగా నిత్యం ఆదాయం వస్తుందని అంటున్నాడు. చుక్క చుక్కకూ లెక్క రైతు పేరు: తిరుపతిరెడ్డి స్వస్థలం: మాచాపూర్, చిన్న కోడూరు, సిద్దిపేట పంటలు: బీరకాయ, కాకరకాయ, టమాట, మొక్కజొన్న విజయ రహస్యం: తనకు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. బావిలో ఉన్న కొద్ది పాటి నీటితో 5 ఎకరాల్లో బీరకాయ, కాకరకాయ, టమాట, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాడు. బిందు, తుంపర సేద్యంతో నీటిని వృధా చేయకుండా నేరుగా మొక్కలకందిస్తూ కాలంతో సంబంధం లేకుండా దిగుబడులు సాధిస్తున్నాడు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే మరో 3 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తానని వెల్లడించాడు. కరువులోనూ జలసిరి.. వరిపైనే గురి రైతు పేరు: పారుపల్లి వెంకటేశ్వర్లు స్వస్థలం: ముదిగొండ, ఖమ్మం పంట: వరి విజయ రహస్యం: తనకున్న 3 ఎకరాల్లో ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేస్తుంటాడు. ఇతని పొలానికి సమీపంలో సాగర్ కెనాల్ ఉంది. నీటి వసతి ఉన్నా.. కాలం ఎప్పుడెలా ఉంటుందోనన్న ఆలోచనతో బావి తవ్వించాడు. ఇదే ఇప్పుడు బాగా పనికొస్తోంది. ఈ సీజన్లో సరైన వర్షాలు కురవనప్పటికీ ఈ బావిలో మాత్రం జలకళ ఉట్టిపడుతోంది. మండు వేసవిలోనూ నీరు ఇంకిపోదని.. తనతో పాటు చుట్టుపక్కల మరో 8 ఎకరాల్లో సైతం వరి సాగవుతోందని వెంకటేశ్వర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. పంట మార్పిడి.. పెరిగిన రాబడి రైతు పేరు: జి.దేవేందర్ స్వస్థలం: మద్దెలబీడు, దామరగిద్ద, నారాయణపేట పంటలు: వరి, కంది, పెసర, వేరుశనగ విజయ రహస్యం: తనకున్న 10 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలను కౌలుకు తీసుకుని ఆధునిక పద్ధతుల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నాడు. నేల స్వభావానికి తగ్గట్లు భూసారం పెరిగేలా పంట మార్పిడి, యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు. నీటి కొరత నేపథ్యంలో ఈసారి ఆరు తడి పంటల వైపు మొగ్గు చూపాడు. ఎప్పుడైనా ఆరు తడి పంటలే బెటర్ అని,. ఒక పంటలో నష్టం వస్తే.. మరో పంట కలిసి వస్తుందని చెబుతున్నాడు. గేట్ వాల్వ్లతో భగీరథ యత్నం మహిళా రైతు పేరు: మహేశ్వరం ఉపేంద్ర స్వస్థలం: వడ్లకొండ, జనగామ పంటలు: వరి తన భర్త రాములుతో కలిసి ఇప్పటివరకు 6 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. మరో ఎకరం సిద్ధం చేశారు. గతంలో 3 బోర్లు వేయగా, రెండింటిలోనే నీళ్లు పడ్డాయి. దీంతో ఆలోచనకు పదును పెట్టారు. ప్రస్తుతం ఆ 2 బోర్లను ఒకేచోట అనుసంధానించి పొలానికి నీరు పారిస్తున్నారు. ప్రతి 2 మడులకు ఒక గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి నీరు వృధా కాకుండా చూస్తున్నారు. -
పొగాకు రైతుల ఆవేదన! జగన్ ఎమోషనల్..!
-
పొగాకు రైతుల కోసం రంగంలోకి YS జగన్
-
పొగాకు రైతులకు YS జగన్ భరోసా
-
నిలిచిన పొగాకు వేలం
కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం ముందుకు సాగడంలేదు. కనీస ధరల కోసం రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మంగళవారం ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రంలో ధరలు రావడంలేదంటూ రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాలెం క్లస్టర్కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. వేలం ప్రారంభమైన కొద్దిసేపటికే ధరలను వ్యాపారులు తగ్గించేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు ఇచ్చే వరకు వేలాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తూ వేలాన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులు వేలాన్ని పూర్తిగా నిలిపేశారు. ఎఫ్2, ఎఫ్3 వంటి బ్రైట్ గ్రేడ్ రకాలకు కూడా క్వింటాకు రూ.16 వేల నుంచి రూ.17 వేలు మాత్రమే ఇస్తున్నారని, ఈ రకం క్వింటా రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు కొనుగోలు చేయాలని కోరారు. ఇంత తక్కువ ధరలో కనీసం పెట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరల కోసం రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి, అధికారులకు పట్టడంలేదని మండిపడ్డారు. ఇదిలాగే కొనసాగితే రైతులకు ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదని విచారం వ్యక్తం చేశారు. రైతులు, అధికారుల మధ్య చర్చలు ఫలించకపోవడంతో మంగళవారం పూర్తిగా వేలం నిలిచిపోయింది. -
ఢిల్లీలో ఉద్రిక్తత.. ‘మహా పంచాయత్’తో కదం తొక్కిన అన్నదాతలు!
న్యూఢిల్లీ: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్కు చెందిన వందలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. నేడు కిసాన్ ఘాట్లో ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో జరిగే ‘మహా పంచాయత్’లో వీరంతా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ ఒప్పందం వల్ల భారత రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్సీ) నేత జర్మన్జిత్ సింగ్ బండాల ఆరోపించారు. అమెరికాలో భారీ సబ్సిడీలతో వేలాది ఎకరాల్లో వ్యవసాయం జరుగుతోందని, కానీ మన దేశంలో మెజారిటీ రైతులకు కేవలం 2 నుంచి 2.5 ఎకరాల భూమి మాత్రమే ఉందనని ఆయన గుర్తుచేశారు. ఈ ఒప్పందంతో చౌకైన అమెరికా వ్యవసాయ దిగుమతులు దేశీయ మార్కెట్లోకి వస్తే, చిన్న రైతులు పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు. #WATCH आज दिल्ली की ओर अपने तय मार्च से पहले बड़ी संख्या में किसान शंभू बॉर्डर (पंजाब-हरियाणा बॉर्डर) पहुंचे। वीडियो पटियाला (पंजाब) से है। pic.twitter.com/OWxjTRNj4v— ANI_HindiNews (@AHindinews) July 21, 2026అమెరికా ఒత్తిడికే కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఈ ఒప్పందాన్ని ముందుకు తెస్తోందని ఆయన విమర్శించారు. కేవలం వ్యవసాయమే కాకుండా, చిన్న వ్యాపారాలు, ఇతర రంగాల్లోని ఉద్యోగాలపై కూడా ఈ ప్రభావం పడుతుందన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఇది కూడా చదవండి: అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు పాయే! -
కరువొస్తోంది.. కొత్త సలహాలివ్వండి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 50 రోజులు దాటింది. అంటే సీజన్లో దాదాపు సగం కాలం గడిచిపోయింది. కానీ చినుకు జాడలేదు. ఓ మోస్తరు వర్షం కూడా పడడం లేదు. రాయలసీమలో పొలాలన్నీ బీటలు వారుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో విత్తనాలు నేలలోనే నిద్రపోతున్నాయి. గోదావరి, కృష్ణా డెల్టాలో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. మెట్ట, మాగాణి అని తేడా లేదు. వర్షాధారం..బోర్ల కింద వ్యత్యాసం లేదు. ఎటు చూసినా భీతావాహ వాతావరణమే కన్పిస్తోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులను కరువు నుంచి ఎలా బయట పడేయాలన్న ఆలోచన చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికొదిలేసింది. రైతులను ఆదుకోవడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించడం, కరువు సహాయక చర్యలకు ఉపక్రమించడం వదిలేసింది. ఇలాంటి సమయంలో రైతుకిచ్చే సలహాలు, సూచనలను మార్చి కొత్త సలహాలివ్వాలని యూనివర్సిటీ వీసీలను ఆదేశిస్తూ సోమవారం చంద్రబాబు ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. దీనిపై రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి కష్ట కాలంలో ప్రభుత్వం స్పందించే విధానం ఇదేనా అని వ్యవసాయ నిపుణులు కూడా విస్తుపోతున్నారు. అత్యంత తీవ్రమైన కరువు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కరువు తాము ఊహించినదానికంటే ఎక్కువగానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్లో 25 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో 62 శాతం లోటు ఉంటుందని తొలుత అంచనావేశారు. కానీ 15వ తేదీ నాటికే ఏకంగా 82శాతం లోటు వర్షపాతం నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, అన్నమయ్య జిల్లాల్లో –60 నుంచి –99 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, 24 జిల్లాల్లో –20 నుంచి–50 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షాభావం కాదు. గత రెండు దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంత అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితి రానుందని నిపుణులంటున్నారు. కరువు ఉపశమన చర్యలెక్కడ? ఇలాంటి విపత్తు వేళ ప్రభుత్వాలు సాధారణంగా కరువు ఉపశమన చర్యలు ప్రారంభిస్తాయి. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇస్తాయి. కంటిజెన్సీ ప్లాన్ కింద ఉచితంగా విత్తనాలు, ఇతర సాగు ఉత్పాదకాలను పంపిణీ చేస్తాయి. ఇన్పుట్ సబ్సిడీలు ప్రకటిస్తాయి. సాధ్యమైనంత త్వరగా పంటల బీమా పరిహారాన్ని అందించే ఏర్పాటు చేస్తాయి. రుణాలను రీషెడ్యూల్ చేస్తాయి. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానిస్తాయి. పశువులకు మేత కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి. తాగునీటి చర్యలు చేపడతాయి. కానీ వీటన్నిటినీ వదిలేసి కరువు ప్రభావిత ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు సూచనల్లో మార్పు తీసుకు రావాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేయడం విస్మయానికి గురిచేస్తోందని వ్యవసాయ నిపుణులంటున్నారు. సాయం వదిలేసి ఉచిత సలహాలెందుకు? వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం కరువు తీవ్రతను అంచనా వేస్తుంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలో సలహాలు సూచనలు ఇవ్వడం పరిపాటి. ఇందుకోసం పంటల వారీగా సీజన్కు ముందుగానే ప్రత్యేక బులిటెన్లు జారీ చేస్తారు. అయితే ఇవన్నీ చాలా సాధారణంగా ఉన్నాయని పేర్కొంటూ విధిగా వాటికయ్యే ఖర్చు–లాభాల లెక్కలను జతచేయాలంటూ యూనివర్శిటీ వీసీలను ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు 50 రోజులు గడిచిన తర్వాత ఖరీఫ్ 2026 సీజన్ కోసం మీరు ఇచ్చిన సలహాలు, సూచనలను పునఃసమీక్షించాలంటూ జీవో ఇచ్చింది.జోన్ల వారీగా, నీటి లభ్యత వారీగా, భూ స్వామ్యత/భూమి పరిమాణం వారీగా కొత్త సలహాలు, సూచనలతో పాటు ఖర్చులు, లాభనష్టాలతో కూడినసమగ్ర నివేదిక పదిరోజుల్లో ప్రభుత్వానికి పంపాలని ఈ జీవోలో ఆదేశించారు. లాభసాటి కాకపోతే ప్రత్యామ్నాయ సాగు పద్దతుల జోలికి పోవద్దంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. ఈజీవో చూస్తుంటే కరువు పరిస్థితులను ఎదుర్కొనే సమగ్ర ప్రణాళిక కంటే, కేవలం సలహాలు, సూచనలు ఇస్తూ కాలయాపన చేయాలన్న ఆలోచన కన్పిస్తోందని రైతులు మండిపడుతున్నారు.ఇలాంటి కరువు వేళ ఒకటి రెండుసార్లు విత్తనాలు వేయాల్సి ఉంటుంది. పంటలను కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇదంతా రైతులకు భారమే. ఇలాంటి విపత్తు వేళ ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలే తప్ప లాభసాటి కాకపోతే మానేయండంటూ సలహాలివ్వడమేమిటని రైతులు మండిపడుతున్నారు. -
పంటలకు నీరివ్వలేని దద్దమ్మా.. చంద్రబాబు పై పేర్చి కిట్టు ఫైర్
-
బహదూర్గూడ వివాదంలో రైతులపై కేసు
సాక్షి,శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో బుల్లెట్ రైలు హబ్ భూసేకరణ ఉద్రిక్తతలకు దారితీసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో, పోలీసులపై దాడికి పాల్పడిన పలువురు రైతులపై శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.విధుల్లో ఉన్న అధికారులపై దాడి జరిగిందంటూ శంషాబాద్ రూరల్ ఎస్ఐ వనజ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మంది రైతులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, దాడికి పాల్పడటం వంటి పలు సెక్షన్ల కింద ఈ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బహదూర్గూడలో దాదాపు 650 ఎకరాల భూసేకరణను అడ్డుకునేందుకు రైతులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఈ క్రమంలో బందోబస్తులో ఉన్న పోలీసులతో రైతులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. నిరసనకారులు ఒక్కసారిగా పోలీసులపై కుర్చీలు విసురుతూ, వారిపై కారం చల్లారు. ఈ ఘర్షణలో రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ల కళ్లల్లో కారం పడటంతో వారు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.ఈ ఘటన అనంతరం బహదూర్గూడలో అధికారులు ఫెన్సింగ్ పనులను పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, బందోబస్తును ముమ్మరం చేశారు. -
మంత్రి నిమ్మలకు నిరసన సెగ దారి మధ్యలో అపి ఇచ్చిపడేసిన రైతులు
-
ఆశలన్నీ ఆకాశంపైనే..!
అర కిలోమీటర్ పైప్లైన్తో పత్తికి నీరుజనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లికి చెందిన ఈ రైతు పేరు బానోతు నరసింహ. 3 ఎకరాలు కౌలుకు తీసుకుని నెల క్రితం పత్తి విత్తనాలు నాటాడు. అప్పట్నుంచి సరైన వర్షాలు లేవు. దీంతో ఎండిపోయే దశకు చేరుకుంటున్న పత్తిని కాపాడుకునేందుకు.. నవాబుపేట రిజర్వాయర్ ప్రధాన కాలువ నుంచి సుమారు అర కిలోమీటర్పైగా పైప్లైన్ వేసి నీటిని అందిస్తున్నాడు. ఇప్పటికే పైప్ లైన్కు రూ.50 వేలు, ఇతరత్రా కలిపి రూ.60 వేలకు పైగా ఖర్చు చేశాడు. 3 ఎకరాలకు కౌలు రూ.15 వేలు, దున్నడానికి రూ.12 వేలు, విత్తనాలకు రూ.5 వేలు, కలుపుతీతకు రూ.12 వేలు, పురుగుల మందుకు రూ.1,500 పెట్టుబడి పెట్టి వర్షాల కోసం ఎదురుచూస్తున్నాడు. వర్షాలు కురవక, కాలువకు నీరు రాకపోతే పెట్టిన పెట్టుబడి, పడుతున్న కష్టం మొత్తం వృ«థా అవుతుందని, ఆర్థికంగా నష్టపోతానని వాపోతున్నాడు. సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎల్నినో బూచి భయపెడుతున్న వేళ..ఆకాశం కొద్దిరోజులుగా చుక్క రాల్చకపోవడం, కరువు మేఘాలు కమ్ముకోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో చిక్కుకుంది. తీవ్ర వర్షాభావంతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో నీళ్లు నిండుకుంటున్నాయి. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు సైతం ఖాళీగానే ఉన్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొన్నిచోట్ల అసలు పంటలే వేయలేదు. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాల ఆధారంగా వేసిన వరి, పత్తి తదితర పంటలు ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. సుదూర ప్రాంతాల్లోని వాగులు, కాలువల నుంచి పైప్లైన్లు వేసి నీటిని తరలిస్తున్నారు. వట్టిపోతున్న బోర్ల నుంచి అరకొరగా వచ్చే నీటితో పంటలు తడిపే ప్రయత్నం చేస్తున్నారు. రాని వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. లోటు వర్షం..సాగు దాదాపుగా సగం రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని దాదాపు అన్ని మండలాలు సాధారణ వర్షపాతం కంటే 33 శాతానికి పైగా లోటులోకి వెళ్లిపోయాయి. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 67 శాతం లోటు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 60, జోగుళాంబ గద్వాలలో 52, వనపర్తి, నిజామాబాద్లలో 51 శాతం మైనస్ వర్షపాతం ఉంది. ఈ జిల్లాల్లో సీజన్లో వర్షపు రోజులు కూడా ఐదు నుంచి తొమ్మిది మాత్రమే నమోదు కావడం గమనార్హం. కాగా రాష్ట్రంలో 621 మండలాలకు 548 మండలాల్లో వర్షమే నమోదు కాలేదు. దీంతో పొలాల్లో పగుళ్లు కన్పిస్తున్నాయి. వానాకాలం సాగు అంచనా 1,32,38,446 ఎకరాలు కాగా ఇప్పటివరకు 59,83,971 (45.20 శాతం)ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగవడం కరువు పరిస్థితిని కళ్లకు కడుతోంది. కాగా జూన్ చివరి, జూలై ప్రారంభంలో కురిసిన వర్షాన్ని నమ్ముకుని రైతులు పత్తి, మక్కజొన్న, కంది, పెసర, సోయాబీన్, నువ్వులు తదితర ఆరుతడి పంటలు వేశారు. కానీ ఆ తర్వాత వానలు పూర్తిగా ఆగిపోవడంతో మొలకలు ఎండిపోగా, చాలాచోట్ల విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. వర్షాలు లేక భూగర్భ జలాలు రీచార్జ్ కావడం లేదు. ఇప్పటికే ఉన్న బోర్లలో నీరు తగ్గిపోవడంతో రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి కొత్త బోర్లు వేయిస్తున్నారు. చాలాచోట్ల అవి విఫలం కావడం, ఒకవేళ నీళ్లు పడినా అవి కూడా క్రమంగా తగ్గిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 9.26 మీటర్లు కాగా, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలాలు 13–14.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 14.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. నీరు లేక ఎండిపోతున్న ఈ వరి నారు నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డిది. తనకు బావి ఉన్నా నీరు లేకపోవడంతో నారు ఎండిపోతోంది. సాగర్ ఎడమకాలువ ద్వారా నీరు వస్తే ఈపాటికి వరి నాట్లు వేసే వారమని వాపోతున్నాడు. తనకున్న ఏడెకరాల్లో ఎకరాల్లో ఇప్పుడు ఒకటీ రెండెకరాల్లో కూడా సాగు చేసే పరిస్థితి లేదని చెప్పాడు. 30 శాతం పత్తి విత్తనాలే మొలకెత్తాయి నాకున్న ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి సాగు చేశా. అందులో కేవలం 30 శాతం విత్తనాలు మాత్రమే మొలకెత్తాయి. దున్నడం, విత్తనాలకు రూ.లక్ష పెట్టుబడి పెట్టా. మొత్తం డబ్బంతా నష్టపోయినట్లే. వర్షాలు కురిస్తే మళ్లీ దుక్కి దున్ని విత్తనాలు పెట్టాలి. మళ్లీ రూ. లక్ష పెట్టుబడి కావాలి. – బండారి శ్రీశైలం, కట్కూర్, బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గాందీనగర్ తండాకు చెందిన ఈ రైతు పేరు మూడ్ లక్ష్మణ్. ఆయనకున్న ఎకరం భూమితోపాటు మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని నారు పోశాడు. ఎకరానికి రూ.4 వేల చొప్పున 10 ఎకరాలకు రూ.40 వేల వరకు ఖర్చయింది. తర్వాత వర్షం పడలేదు. నాగార్జునసాగర్ కాలువ పరిధిలోని సిరిపురం మేజర్కు మరమ్మతుల కారణంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు విడుదల కాలేదు. దీంతో పోసిన వడ్లు అక్కడక్కడ మొలకొచ్చినా నీటితడి లేక వడబడి చనిపోతున్నాయి. చివరి ఆశగా నారును బతికించుకునేందుకు బావికి ఆయిల్ ఇంజన్ పెట్టి నీళ్లు పెడుతున్నాడు. ‘బోరు’మంటున్న వరి రైతులు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనగపురం గ్రామ శివారు కుమ్మరికుంట్ల తండాకు చెందిన రైతు బానోతు హరికుమార్ గత ఏడాది తమకు ఉన్న వ్యవసాయ బావి ద్వారా వరి సాగు చేశాడు. ఈ ఏడాది కూడా అదే బావిని ఆధారంగా చేసుకుని పంట వేశాడు. కానీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో సాగు ఆందోళనకరంగా మారింది. దీంతో రూ.1.30 లక్షలు ఖర్చు చేసి 300 ఫీట్ల మేరకు బోరు వేయించాడు. దానికి 5 హెచ్పీ విద్యుత్ మోటారును ఏర్పాటు చేశాడు. ఈ నెల 5వ తేదీన కొత్తగా బోరు వేయించగా ఇప్పుడు అందులో కూడా నీరు తక్కువగా వస్తుండటంతో లబోదిబోమంటున్నాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన రైతు కాసర్ల రాములుదీ ఇదే పరిస్థితి. 3ఎకరాల్లో వరినాట్లు వేస్తే నీటి కొరత కారణంగా 2 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. మరో ఎకరాన్ని దున్ని సాగుకు సిద్ధం చేసినా నీళ్లు లేక వదిలేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న రెండు బోర్ల నుంచి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు మాత్రమే వస్తున్నాయని రాములు వాపోతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మలో రైతు బత్తుల దినేష్ తన 5 ఎకరాల మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. చేను పక్కన ఉన్న వాగులో మోటార్ను దించి కొద్ది దూరంలో ఉన్న ట్రాన్స్పార్మర్నుంచి వైరు లాగి చేనులోకి స్ప్రింక్టర్ల ద్వారా నీటిని అందిస్తున్నాడు. భార్య రుక్మిణి, కుమారుడు చరణ్ ఇలా ఇంటిల్లిపాది పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లూనావాత్ తండా రైతు లూనావత్ స్వామి తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు ఎకరాల్లో 20 రోజుల క్రితం పత్తి సాగు చేశాడు. విత్తనాలు మొలకెత్తినా చినుకు జాడ లేకపోవడంతో మాడిపోయే దుస్థితి నెలకొంది. దీంతో పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రైతు బావినీటిని పత్తి చేనుకు పారిస్తున్నాడు. రోజుకు అర ఎకరం చొప్పున నీరు కడుతూ మొలకలకు ప్రాణం పోస్తున్నాడు. -
సాగు ఎలా చేద్దా'మనీ'
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కరెన్సీ నోట్లకు కరువొచ్చింది. బ్యాంకుల్లో సరిపడా నగదు లేక ఖాతాదారులు తిప్పలు పడాల్సి వస్తోంది. మరోవైపు జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల్లో చాలాచోట్ల ఏటీఎంల్లో ‘అవుట్ ఆఫ్ సర్వీస్’బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలు ‘నో క్యాష్’అని చూపిస్తున్నాయి. రైతుభరోసా, ధాన్యం చెల్లింపులు, పంట రుణాలు, తదితరాల సంబంధిత డబ్బులన్నీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. కానీ ఆ నగదును తీసుకునేందుకు రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. డిజిటల్ చెల్లింపు చేయలేని వారందరికీ క్యాష్ తప్పనిసరి అయ్యింది. వ్యవసాయ సీజన్లో కూలీలకు చెల్లింపులు, యంత్రాలు, పనిముట్ల కొనుగోళ్లు, మరమ్మతులు, ఎరువులు, విత్తనాలు తదితర అవసరాలకు డబ్బు అవసరమవుతోంది. కాగా శుభ, ఇతర కార్యక్రమాలకు సైతం చేతిలో నగదు ఉండటం లేదని రైతులు అంటున్నారు. ఇక గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ నగదుతోనే ఎక్కువ లావాదేవీలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,285 ఏటీఎంలు ఉండగా, వీటిలో 350పైగా పని చేయడం లేదు. మెదక్, సిద్దిపేట, ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలో నగదు కొరతతో రూ.10 వేల చొప్పున డ్రా చేసుకోవాలని ఆంక్షలు ఉండటం గమనార్హం.క్యాష్ ఎందుకు తగ్గుతోంది? గతంలో కంటే ప్రస్తుతం బ్యాంకులకు ఆర్బీఐ నుంచి నగదు సరఫరా తగ్గినట్లు అధికారులే చెబుతున్నారు. ఏటీఎంల్లో చోరీలు పెరగడంతో భద్రత దృష్ట్యా చాలా బ్రాంచీల్లో నిల్వలు తగ్గించేశారు. ఉదాహరణకు మంచిర్యాల జిల్లాకు చెస్ట్ బ్యాంకులు (నగదు సరఫరా చేసేవి) రెండు ఉండగా ప్రస్తుతం ఒక్కటి మాత్రమే ఉంది. ఇక్కడి నుంచే ఆసిఫాబాద్ జిల్లాకు కూడా నగ దు సరఫరా జరుగుతోంది. రాష్ట్రంలో చాలాచోట్ల బ్యాంకుల్లో రోజువారీగా కనీసం రూ.5 లక్షల లోపే నగదు అందుబాటులో ఉంటోంది. దీంతో ఎవరైనా రూ.లక్ష పైన నగదు కావాలంటే ముందస్తుగా సమాచారం ఇస్తేనే నగదు ఉపసంహరణకు వీలవుతోంది. ఇక డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో ఏటీఎంలకు ఖాతాదారులు తగ్గడంతో క్రమంగా నగదు నిల్వలు తగ్గించేస్తున్నారు. ఎప్పుడైనా అవస రమై వెళ్తే నగదు దొరకడం లేదు. రూ.100 నోటు నుంచి రూ.200, రూ.500 నోట్ల కొరత తీవ్రంగా ఉంటోంది. ఈ క్యాష్ కొరతను ఆసరా చేసుకుని ప్రైవేటు వ్యక్తులు చార్జీలు వసూలు చేసి నగదు ఇస్తున్నారు. అయితే వ్యవసాయ సీజన్లో అందరూ నగదు కోసం రావడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే ఆర్బీఐ నుంచి క్యాష్ సరఫరా కూడా తగ్గిందని అంటున్నారు.ఈ రైతు పేరు ఎడవెల్లి కనకయ్య. యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన ఈయనకు అత్యవసరంగా రూ.2 లక్షల నగదు అవసరం కావడంతో స్థానిక ఎస్బీఐ వెళ్లాడు. బ్యాంకులో నగదు లేదని, రూ.50 వేల చొప్పున విడతల వారీగా తీసుకోవాలని అధికారులు సూచించారు. సాగు పనులకు నగదు అవసరం తప్పనిసరి కావడంతో గత 4 రోజులుగా బ్యాంకు చుట్టే తిరగాల్సి వస్తోందని వాపోయాడు.పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న తరుణంలోనూ రియల్ ఎస్టేట్లో భూములు, ఇళ్ల క్రయవిక్రయాలకు సంబంధించిన నగదు మార్పిడి రూ.లక్షల నుంచి కోట్ల వరకు క్యాష్ రూపంలోనే జరుగుతోంది. ఇక బంగారం, ఇతరత్రా భారీ స్థాయి కొనుగోళ్లలో వ్యాపారులకు, పెద్ద షాపుల్లో జీఎస్టీ పడకుండా, చాలామంది నగదుతోనే లావాదేవీలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్లైన్లో కాకుండా క్యాష్ కావాలంటున్నాయి. ఇప్పటికీ కొన్ని వ్యాపార వర్గాలు పెద్దమొత్తంలో నగదుతోనే కార్యకలాపాలు చేస్తున్నాయి.ఏటీఎం, బ్యాంకులోనూ నగదు లేదు ఏటీఎంలో డబ్బులేక పోతే బ్యాంకుకు వెళ్లా. అక్కడ కూడా అధికారులు క్యాష్ లేదని చెప్పడంతో వెనక్కి వెళ్లిపోతున్నా. – బోయిని సోమేశ్వర్, గుండాల మండలం, మరిపడిగ, యాద్రాద్రి జిల్లారోజుకు రూ.20 వేలు ఇస్తున్నారు వారం నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. వ్యవసాయ పనుల కోసం రూ.లక్ష అవసరం ఉండగా నాగర్కర్నూల్లోని యూనియన్ బ్యాంకుకు వస్తే రూ.20 వేలే ఇస్తున్నారు. రోజూ పనులు వదిలిపెట్టి తిరగాలంటే ఇబ్బందే. బ్యాంకులతో పాటు ఏటీఎంల్లోనూ డబ్బులు లేవు. – కనుకు వెంకటయ్య, యాదిరెడ్డిపల్లి, తాడూరు మండలం, నాగర్కర్నూల్ జిల్లా -
కూటమి వల్ల రైతు గుండె ఆగింది
-
Magazine Story : రాజధానికి భూములిచ్చిన రైతులను నిలువునా ముంచేశారు
-
పవన్ తో పైసా పని లేదు.. బాబు మాఫియా
-
‘దుమ్ము’ లేపారు!
బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకలకుంట పంచాయతీ పరిధిలోని మైదుకూరు–బద్వేల్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న ‘రిత్విక్ కంపెనీ’ క్యాంప్ కార్యాలయాన్ని సోమవారం స్థానిక ప్రజలు, రైతులు ముట్టడించారు. ఎంపీ సీఎం రమేష్కు చెందిన ఈ కంపెనీ.. రోడ్డు, పైపులైన్ల నిర్మాణం కోసం డి.అగ్రహారం వద్ద భారీ క్యాంప్ను ఏర్పాటు చేసింది. ఏడాదిగా ఈ క్యాంప్ నుంచి రేకలకుంట, బాలాజీనగర్, బాగాదిపల్లె, గొల్ల పల్లె గ్రామాల మీదుగా టిప్పర్లు, భారీ లారీలు నిరంతరాయంగా రాకపోకలు సాగిస్తుండటంతో దుమ్ము విపరీతంగా వస్తోందని రైతులు ధ్వజమెత్తారు.ఈ దు మ్ము వల్ల తమ పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారం రోజులుగా రుతి్వక్ కంపెనీ క్యాంప్ కార్యాలయం వద్ద నిరసనలు, ధర్నా చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ముట్టడించామని చెప్పారు. రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో సోమవారం డి.అగ్రహారానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కానాల మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు, కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. బ్రహ్మంసాగర్ సమీపంలో 2 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిరి్మంచడంతోపాటు తాగునీటి అవసరాల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా మని కంపెనీ ప్రతినిధులు రాతపూర్వక హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన తాత్కాలికంగా విరమించారు. -
ఉండవల్లి రైతులతో అంబటి బాబుకు మాస్ వార్నింగ్
-
అన్నదాతల మీదికి బుల్డోజర్లా? ఇదేం సంస్కృతి.. అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం రైతుల మీద రౌడీయిజం చేస్తోందని వైఎస్సార్సీపీ నేత,మాజీ మంత్రి అంబటిరాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల మీదకు పోలీసులు బుల్డోజర్లను పంపే సంస్కృతి తొలిసారిగా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సోమవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవటం అత్యంత దుర్మార్గమని రైతుల భూములు లాక్కుని కాంట్రాక్టర్లకు కట్టబెడతారా అని ప్రశ్నించారు.అంబటి మాట్లాడుతూ.. చిన్నచిన్న రైతుల మీద బలవంతపు చర్యలేంటి చంద్రబాబూ? పూలింగులో భూములు ఇవ్వకపోతే కక్ష కడతారాహైకోర్టులో కేసు ఉండగానే భూములు లాక్కుంటారా? ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారణే 2.75 ఎకరాల్లో పంటలను బుల్డోజర్లతో తొక్కించారు.పూలింగులో భూమి ఇవ్వకపోతే ఇలా తొక్కించేస్తారా రైతుల మీద చంద్రబాబుకు ఎంతకంత కక్ష? అని అంబటి ప్రశ్నించారు.రూ.8 కోట్ల విలువైన భూమికి కేవలం రూ.2.47 కోట్లు ఇస్తామనటం అన్యాయమని సీఎం రమేష్ ఒక్కో ఎకరం డాక్యుమెంట్ల ప్రకారమే రు.5 కోట్లకు కొన్నారని విడిగా ఇంకా ఎక్కువ ధరే చెల్లించారు.మరి రైతులకు రూ.2.47 కోట్లు ఎలా ఇస్తారని వారి నోట్లో మట్టి కొట్టి కాంట్రాక్టర్లకు అప్పనంగా దోచిపెడతారా అని అడిగారు. సీఆర్డీఏ అధికారులు సైతం బ్రోకర్ల అవతారమెత్తారని బలవంతంగా భూములు అమ్మించి కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. రైతులను బలవంతంగా భూముల్లో నుండి లాగేస్తే సహించేది లేదని మా పోరాటం చివరి వరకూ సాగుతుందన్నారు. అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్న చంద్రబాబు రైతులను అన్యాయం చేయటం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు. -
ఇదిగో సీఎం గారి ఇల్లు ఏంటి మాకు ఈ కష్టాలు..
-
రైతులపై బాబు మరో బాంబు
-
మీ తాత సొమ్ము అనుకున్నావా.. చంద్రబాబు, లోకేష్ పై రైతుల ఆగ్రహం
-
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
-
రాజధాని రైతులపై వేధింపుల పర్వం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చేశారని చెప్పారు.. మరి ఇవ్వని రైతులను ఏం చేస్తున్నారు? రకరకాలుగా వేధిస్తున్నారు? భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి పొలాలకు దారి లేకుండా చేయడం, వారి భూముల్లో కరెంటు స్తంభాలు పడేయడం, మోటార్లు, పైపులు మాయం చేయడం... ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా? రైతులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తే నెలల తరబడి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేయడం లేదు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో భూములు ఇవ్వని వందలాది మంది రైతుల బాధలు వర్ణనాతీతం.. అసలక్కడ ఏం జరుగుతోంది..? ప్రభుత్వం రైతులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తోంది.. రైతు పరిరక్షణ కమిటీ నాయకులు అక్కడకు వెళుతుంటే ఎందుకు నానా రభస చేశారు? కార్లు ధ్వంసం చేసి చివరకు హత్యాయత్నం వరకూ ఎందుకు వెళ్లారు..? ఉండవల్లి, పెనుమాకలలో భూములివ్వని రైతుల పరిస్థితి ఏమిటి? సాక్షి ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.. ఆ ప్రాంతంలో జరుగుతున్నదేమిటో రైతులు స్వయంగా చూపించారు. వారి గోడు వెళ్లబోసుకున్నారు.. ఆ వివరాలతో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్... తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో ఉండవల్లి నుంచి అమరావతి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా జనావాసాల మధ్య ఉన్న వందలాది మంది రైతులు భూ సమీకరణకు తమ భూములను ఇవ్వలేదు. దాంతో వారి భూములను భూ సేకరణ కింద తీసుకుంటామంటూ ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉండటంతో ప్రభుత్వం తమపై రకరకాలుగా కక్ష సాధిస్తోందని రైతులు చెబుతున్నారు. అంతకు ముందు బ్యాంకు రుణాలు వచ్చేవని, ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఆపివేశాయని రైతులు పేర్కొన్నారు. తమ పొలాలకు రిజిస్ట్రేషన్లు కూడా ఆపేశారని వారు వాపోతున్నారు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉందని, చనిపోయిన రైతుల పేర్లు కూడా నోటిఫికేషన్లో వచ్చాయని, కుటుంబంలో ఆస్తి పంపకాలు చేసుకున్నా అవేవీ ఆన్లైన్లో కనిపించడం లేదని చెబుతున్నారు. రైతుల పొలాల్లో ఇసుక డంపింగ్ చేస్తున్న అరాచకమిది వేధింపులు రకరకాలు... సమీకరణ, భూసేకరణకు భూములు ఇవ్వని రైతులను చాలా రకాలుగా వేధిస్తున్నారు. కొండవీటి వాగుపై పెనుమాక వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పక్క పొలాలకు వెళ్లే విద్యుత్ స్తంభాలను లారీలతో గుద్ది పడిపోయేలా చేశారు. రైతుల పొలాల్లో ఉండే విద్యుత్ మీటర్లు, మోటార్లు మాయం చేసేశారు. దొంగలు మోటార్ల వరకే ఎత్తుకెళ్తారని, బోర్లు పైపులతో సహా తీసుకువెళ్లిపోవడంతో ఇది ప్రభుత్వ పెద్దల దన్నుతో కాంట్రాక్టర్లు చేసిన పనే అని రైతులు అభిప్రాయపడుతున్నారు. రోజూ ఇన్ని లారీలు, ఇన్ని జేసీబీలు, వందలాది మంది మనుషులు తిరుగుతున్న ప్రాంతంలో మోటార్లు, పైపులు ఎవరు ఎత్తుకువెళతారు? కావాలనే ప్రభుత్వం ఈ చోరీలు చేయించిందనే అనుమానాలను స్థానిక రైతులు వ్యక్తం చేస్తున్నారు. బోర్లు, బోరు పైపులు దొంగిలించారని తాడేపల్లి పోలీస్స్టేషన్లో మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడ వేసిన మొక్కజొన్న, మునగ తోటలు ఎండిపోయాయి. ఉండవల్లి పొలాల్లో మోటార్ షెడ్ను కూల్చేసి.. పొలాల్ని కంకరతో పూడ్చివేయిస్తున్న దాష్టీకానికి నిదర్శనమిదిగో.. భూములు ఇవ్వని రైతులు పంట పండించుకోనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా కొండవీటి వాగుకు ఎటువంటి వరద రాకపోయినా కొండవీటి వాగు గట్లకు గండికొట్టి ఆ నీటిని రిజర్వాయర్లోకి వదిలేశారు. దీంతో ఈ నీరు రిజర్వాయర్లోకి చేరి ఈ రైతుల పొలాల చుట్టూ నీరు చేరింది. 15 అడుగుల లోతు ఉన్న రిజర్వాయర్ నిండిపోవడంతో పంట పొలాల నేల కోతకు గురై రిజర్వాయర్లో కలిసిపోతోంది. పది అడుగుల లోతు తీయగానే భారీగా నీటి ఊట వస్తోంది. ఇందులో డ్రెడ్జింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి ఇసుకను భారీగా బయటకు తీస్తున్నారు. నీటిని, ఇసుకను బయటకు తీసి వచ్చిన బుసకను లారీ మూడు నుంచి ఆరు వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పెనుమాకకు చెందిన రైతు మేక సాంబిరెడ్డి పొలం పక్కనే కొండవీటి వాగు వెళుతుంది. అరటి తోటను జేసీబీతో ధ్వంసం చేస్తున్న రాక్షసత్వానికి రుజువిదిగో.. అతని పొలానికి మూడువైపులా రిజర్వాయర్ కోసం మట్టి తీశారు. ప్రస్తుతం ఆ పొలంలో మట్టి పెళ్లలు విరిగి కిందపడడంతో ఆ పొలం కూడా రిజర్వాయర్లోకి కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా బెదిరిస్తే భూములు ఇస్తారని ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మరో రైతు పంటపొలంలో కరెంటు స్తంభాలను లారీలతో గుద్దించి వైర్లు తెంచేశారు. పిల్లల పెళ్లికి పొలాలను రాసి ఇచ్చినా వాటిని అమ్ముకునే పరిస్థితి లేదు. వారికి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. తాము పడుతున్న కష్టాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని వేసి రైతుల బాధలు వినేందుకు పెనుమాక పంపితే తెలుగుదేశం గూండాలు వారిని మధ్యలోనే అడ్డుకుని దాడికి దిగారని రైతులు వివరించారు. పైపులతో సహా ఎత్తుకెళ్లారు పెనుమాక గ్రామంలో మా కుటుంబ సభ్యులకు చెందిన ఐదు ఎకరాల పొలాన్ని సాగు చేస్తున్నాను. మూడు నాలుగు నెలల నుంచి కరెంటు స్తంభాలను పడిపోయేలా చేసి కరెంట్ లేకుండా చేశారు. తర్వాత కరెంట్ మోటార్లు, పైపులతో సహా ఎత్తుకు పోయారు. దీనిపై తాడేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందనా లేదు. కరెంట్లేక నీరందక ఈ పొలంలో వేసిన మునగ, అరటి, మొక్కజొన్న పంటలు ఎండిపోయాయి. భయపెట్టి భూములు ఇచ్చేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. – పొలిశెట్టి వెంకట శ్రీనివాసరావు, రైతుపూలింగ్కు ఇవ్వని భూమిలో రిటర్నబుల్ ప్లాట్లు నాకు పెనుమాకతో పాటు లింగాయపాలెంలో పొలం ఉంది. లింగాయపాలెంలో 43, 44 సర్వేనెంబర్లలో ఆరు ఎకరాల పొలాన్ని ఇద్దరు కూతుళ్లకు ఇచ్చాను. మేం పూలింగ్కు ఇవ్వకపోయినా అందులో 4,300 గజాలు రిటర్నబుల్ ప్లాట్లుగా వేశారు. వీటిని 12 మందికి కేటాయించారు. ఇందులో ఇద్దరు వేరే వారికి అమ్ముకున్నారు. అసలు మేం ఇవ్వని భూములను కేటాయించడానికి, అమ్ముకోవడానికి వారికేం హక్కు ఉంది. దీన్ని ప్రశి్నస్తే ఇప్పుడు భూసేకరణ నోటీసులు ఇచ్చారు. పెనుమాకలో కూడా పది ఎకరాల పొలం ఉంది. ఇందులోతోట వేశాం. దీనికి కూడా నోటీసు ఇచ్చారు. వీటిపై కోర్టుకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నాను. – మేకా వెంకటరెడ్డి, రైతురెండో విడత ఇవ్వాలంటే భయంగా ఉంది తొలి విడతలో పూలింగ్ కింద 1.30 భూమిని ఇచ్చాను. తుళ్ళూరు రెవెన్యూ పరిధిలో నాకు రిటర్నబుల్ ప్లాటు ఇచ్చారు కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. 12 ఏళ్ళు అవుతున్నా అభివృద్ది చేసి ఇవ్వలేదు. అమ్ముకుందామంటే కాగితాలపై తప్ప నేలపై కనబడటం లేదు. ఇప్పుడు రెండో విడతలో ఇవ్వాల్సింది 20 ఎకరాల భూమి ఉంది. ఇస్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. – చుండు వెంకటరెడ్డి, రైతు వడ్డమాను గ్రామంరెండో విడతలో భూములిచ్చి ఇబ్బందులు పడుతున్నాంఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను ఉందా లేదా... ఉంటే ఏఏ గ్రామాల కింద ఏఏ సర్వే నెంబర్లలో పోతుంది? ఎప్పుడు శంఖుస్థాపన చేస్తారు? త్వరితగతిన పూర్తయ్యేందుకు వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టర్లకు ఇస్తే మీకు ఇబ్బంది ఏమిటి? వైకుంఠపురం వంతెన ఎప్పుడు నిర్మిస్తారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఉంటే కదా రెండో విడత చురుగ్గా రైతులు భూములిచ్చేది. రెండో విడత పూలింగ్కు భూములిచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం. – చుండు నర్సిరెడ్డి, రైతుపొలం చుట్టూ చెరువు తవ్వేశారు భూసేకరణ చట్టం ప్రయోగించి మా నుంచి బలవంతంగా భూములు సేకరించాలని ప్రభుత్వం రెండు నెలల క్రితం నోటీసు ఇచ్చింది. మేం దానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాలని చెప్పి, పోరాడుతున్నాం. మేం ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి భూములు ఇవ్వలేదని రిజర్వాయర్ పేరుతో మా పొలాల పక్కన 30 అడుగుల లోతులో చెరువు తవ్వేశారు. దీనివల్ల మా పొలం మట్టిగెడ్డలు చెరువులో విరిగి పడుతున్నాయి. పొలానికి రెండుపక్కల తవ్వేశారు. కొంతమంది రైతులకైతే పొలంలోకి వెళ్లేందుకు దారి కూడా లేదు. మా పక్క రైతుకు నాలుగు వైపులా తవ్వేశారు. మేమైతే భూసమీకరణకి భూములు ఇవ్వదలుచుకోలేదు. 12 సంవత్సరాల క్రితం పూలింగ్లో భూమి ఇచ్చిన రైతే ఇంతవరకు అతని రిటర్న్ ఫ్లాట్లోకి అడుగు పెట్టలేకపోయాడు. ఇవన్నీ కళ్లారా చూస్తూ కూడా భూములు ఎలా ఇవ్వాలి. – కళ్ళం శ్రీకాంత్రెడ్డి, రైతుపొలంలో మోటారు వైర్లు కట్ చేసి పైపులైన్లు తీసేశారుసీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి నాకున్న 29 సెంట్లు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. నా భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు సిద్ధపడి 9.3 ఫారాన్ని అందజేశాను. నాకు వచ్చే కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఉండవల్లిలోని పెద్దడొంక, చిన్న డొంక వెంట ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులను కోరాను. నాకు ప్లాట్లు కేటాయించిన తరువాత నా భూమిపై పూర్తి హక్కు కల్పిస్తానని ఉండవల్లి సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలో గ్రామసభ జరుగుతున్న రోజు సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మించే కాంట్రాక్టర్లు నీటి వాటా వచ్చే పూలింగ్ పొలంలో ఉన్న నా మోటారు వైర్లు కట్ చేసి పైపులైన్లు తీసేశారు. అదేరోజు గ్రామ సభలో నేను ప్రశ్నించగా మోటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి నేటికీ ఇప్పించలేదు. నా పొలానికి రెండు వైపులా సీడ్ యాక్సెస్రోడ్ నిర్మాణం చేపట్టారు. నా అరటితోట చుట్టూ మెరకచేసి రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. సీఆర్డీఏ అధికారుల మాటలు నీటిపై రాతల్లాంటివి. అందుకే ఉద్యమబాటతో పాటు న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నాం. – అనంత శివరావు, రైతుమా పొలానికి దారి లేకుండా చేశారు పెనుమాకలో మాకు తాతల హయాం నుంచి పొలం ఉంది. మాకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఆపేశాయి. భూముల రిజిస్ట్రేషన్లు కూడా ఆపేశారు. ఆస్తుల పంపకాల కోసం మంగళగిరి సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే మీ పొలంలో నుంచి రోడ్డు వెళ్తుందని చెప్పారు. సర్వే కోసం పెడితే వారు ఎటువంటి రోడ్డు వెళ్లడం లేదని చెప్పారు. దీనిపై రాతపూర్వకంగా ఇమ్మంటే ఇవ్వడం లేదు. నువ్వు కోర్టుకు వెళ్తే మా ఉద్యోగాలు పోతాయంటున్నారు. ఈ అంశంపై సీఆర్డీఏ కమీషనర్ను కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు మాకు పంట నష్ట పరిహారం గాని, క్రాప్లోన్లు గాని ఇవ్వడం లేదు. రైతులకిచ్చే సబ్సిడీలు, ఫర్టిలైజర్స్ మీద ఇచ్చే సబ్సిడీలు ఏమీ ఇవ్వడంలేదు. కరెంట్ ఉండదు, కరెంట్ స్తంభాలు పడిపోయాయి అంటారు. రోడ్లన్నీ తవ్వేశారు. ఈ చుట్టుపక్కల చెరువులన్నీ తవ్వేశారు. వెళ్లడానికి దారి లేకుండా చేసేశారు. మేము రైతులు కాదని కొంతమంది అంటున్నారు. పర్లేదు, మేము రైతులు కాకపోతే మాకు భూసేకరణ నోటీసు ఎందుకు ఇచ్చారు. మేము ఇంకా పొలాలు ఇవ్వనే లేదు. అప్పుడే మాపై దాడులు జరుగుతున్నాయి. అదే పొలాలు ఇచ్చి ఉంటే అసలు మమ్మల్ని ఊర్లో కూడా ఉండనిచ్చేవాళ్లు కాదేమో. ఇవన్నీ కూడా తలుచుకుంటేనే భయమేస్తుంది. – నవీన్, రైతు, పెనుమాక -
రాత్రికి రాత్రే పంటలను నాశనం చేయడం దారుణం
తాడేపల్లి రూరల్: తగిన నష్టపరిహారం ఇస్తే రాజధాని నిర్మాణానికి భూములిస్తామని చెప్పిన ఉండవల్లి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకరరావు, రైతు బుర్రముక్కు పద్మారెడ్డి, రాజధాని రైతు సంఘం కార్యదర్శి కె.ఈశ్వర్రెడ్డి, డి.వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఉండవల్లిలోని రైస్మిల్లు వద్ద బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకిచ్చి న రిటర్నబుల్ ప్లాట్లో ఎఫ్ఎస్ఐ కన్స్ట్రక్షన్ 4 శాతం (సుమారు ఎనిమిది ఫ్లోర్లు) పరి్మషన్ ఇస్తామని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు. భూములిచ్చి న 6 నెలల్లోపు ప్లాట్లలో కరెంటు, వాటర్, మోడల్ ప్లాటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు ఇచ్చి న హామీలు నెరవేర్చకుండా రాత్రికి రాత్రే పంటలను నాశనం చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఉండవల్లి స్టీరింగ్ కమిటీ సభ్యులు నాగరాజు, కోటేశ్వరరావు, శ్రీధర్రెడ్డి, అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దున్నేసిన భూములను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు ఉండవల్లి పరిసర ప్రాంతాల్లోని భూములను రైతుల నుంచి ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ నేత మున్నంగి వెంకటశ్రీధర్రెడ్డి మండిపడ్డారు. ఉండవల్లిలో సీఆర్డీఏ అధికారులు దున్నేసిన భూములను వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. -
మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్
-
రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...
-
భూమి ఇవ్వకపోతే ఉరి తీస్తారా... నీ చేతులతోనే ఇవ్వు ఆ 30 రూపాయలు...
-
రైతులను తాళ్లతో కట్టేస్తారా? చంద్రబాబుకు చెప్పేది ఒక్కటే.. జగన్ ఆగ్రహం
-
సాగు చేసుకునే భూమిని.. వాళ్ళు ఎలా లాక్కుంటారు?
-
ఉండవల్లిలో ఉద్రిక్తత..మమ్మల్ని తాళ్లతో కట్టేసి రోడ్లు వేస్తున్నారు
-
చంద్రబాబు ఇంటి ముందే.. రైతులను తాళ్లతో బంధించి అక్రమంగా రోడ్లు..
-
పంటల బీమా నమోదు బాధ్యత రైతుదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2026–27 వ్యవసాయ సీజన్లో అమలుచేస్తున్న స్వచ్ఛంద నమోదు పంటల బీమా పథకం అమలు తీరుపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఫార్మర్ ఐడీ తప్పనిసరి చేసిన ప్రభుత్వం తాజాగా పంటల సాగుకు సంబంధించి స్వీయధ్రువీకరణకు అవకాశం కల్పించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటల బీమా చేయించుకోవడంలో సమర్పించాల్సిన పత్రాల్లో ఏరియా సోన్ సర్టిఫికెట్ కీలకం. సర్వే నంబరు వారీగా ఎంత విస్తీర్ణంలో ఏ రైతు ఏ పంట సాగుచేస్తున్నారో నిర్ధారించే పత్రాన్నే ఏరియా సోన్ సర్టిఫికెట్ అంటారు. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్ను సంబంధిత గ్రామ వ్యవసాయ సిబ్బంది జారీ చేసేవారు. కానీ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఈ సర్టిఫికెట్ విషయంలో రైతులు స్వీయధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) చేస్తే సరిపోతుందని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంట వివరాలను పూర్తిగా రైతులే ప్రకటించాల్సి రావడంతో, తర్వాత ఈ–పంట (డిజిటల్ క్రాప్ సర్వే) వివరాలతో వ్యత్యాసాలుంటే బీమా క్లెయిమ్లపై అభ్యంతరాలు తలెత్తే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం గడువు ముగిసిన తర్వాత అన్ని వివరాలతో ధ్రువీకరణ జరుగుతుందని పేర్కొంటున్నారు. వివాదాలు తలెత్తితే.. రైతు సౌలభ్యం పేరుతో ఏరియా సోన్ సర్టిఫికెట్ జారీచేసే బాధ్యతను రైతులపైకి నెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు దాదాపు ప్రతి సీజన్లోను 99 శాతం మేర ఈ–పంట నమోదు చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఈ–పంట నమోదు విషయంలో స్వీయనమోదు పేరిట ప్రభుత్వం తమ బాధ్యతను తప్పించుకుంది. పంటల బీమా నమోదు విషయంలో ఏరియా సోన్ సర్టిఫికెట్ జారీ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొందన్న వాదన వినిపిస్తోంది. అధికారులు జారీ చేసే ధ్రువీకరణకు బదులుగా రైతు స్వీయప్రకటనను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వివాదాలు తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ–పంటలో నమోదు చేసి లాభమేమిటి? జియో రిఫరెన్స్ కో ఆర్డినేట్స్తో ఏ సర్వే నంబరులో ఎంత విస్తీర్ణంలో ఏ రైతు ఏ పంట సాగుచేస్తున్నారో ఈ–పంటలో నమోదు చేస్తారు. వెబ్ల్యాండ్ సీసీఆర్సీ, ఆర్వోఎఫ్ఆర్ డేటా బేస్ ఆధారంగా ఈ–పంట, డిజిటల్ క్రాప్ సర్వే వంటి వ్యవస్థల ద్వారా పంటల నమోదు చేస్తున్నప్పుడు పంటల సాగు విషయంలో స్వీయధ్రువీకరణ అవకాశం కల్పిస్తే ఇక ఈ–పంట నమోదుకు అర్థమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య డాక్యుమెంటేషన్ కాదు.. డేటా కచ్చితత్వం. గ్రామస్థాయిలో పంట, భూమి విస్తీర్ణం వివరాలు సమయానికి అప్డేట్ కాకపోతే బీమా నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. స్వీయధ్రువీకరణ తర్వాత అధికారులు సైతం ఈ–పంటలో నమోదు డేటాతో పాటు ఇతర డేటా బేస్లతో వెరిఫికేషన్ చేస్తారు. ఇన్ని దశల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా చివరకు ఆ ప్రభావం రైతులపై పడుతుంది. మరోవైపు తప్పుడు ధ్రువీకరణ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వీటన్నింటిని పరిశీలిస్తే రైతులకు నిజంగా బీమా ప్రయోజనం కల్పించే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం లేదని స్పష్టమవుతోంది. వారికి ఏమాత్రం అవకాశం లేదు వక్ఫ్బోర్డు, సొసైటీ, దేవదాయ, లంక, అటవీభూములు సాగుచేస్తున్న కౌలురైతులకు ఫసల్ బీమా పథకం వర్తించదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. పైగా ఫసల్ బీమాలో చేరాలంటే రైతులకు కచ్చితంగా విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) ఉండి తీరాలని స్పష్టం చేసింది. సొంత భూమి కలిగిన రైతులు విధిగా పొలం పాస్ పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్పుస్తకం జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నంబరును ప్రీమియం చెల్లింపుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వాతావరణ ఆధారిత పంటల బీమాకు ప్రీమియం చెల్లించేందుకు నాలుగు రోజుల్లో (ఈ నెల 15తో) గడువు ముగియనుండగా, వరియేతర పంటలకు జూలై 31వ తేదీతో గడువు ముగియనుంది. వరిపంటకు మాత్రం ఆగష్టు 15వ తేదీ వరకు గడువు ఉంది. -
బాబు మమ్మల్ని చంపేస్తున్నారు!
సీతానగరం: దౌర్జన్యంగా భూములు లాక్కున్న చంద్రబాబు సర్కారు నిర్వాసితులకు కనీసం పరిహారం కూడా చెల్లించకపోవటాన్ని నిరసిస్తూ రైతులు, మహిళా రైతులు తమ కుటుంబాలతో కలసి ఆందోళనకు దిగి కూటమి ప్రజాప్రతినిధులను అడ్డుకోవడంతో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల నవీన్లను బాధిత రైతులు అడ్డుకున్నారు. తామందరం టీడీపీకి చెందినవారమని... పాము తమ పిల్లలను ఎలా చంపుతుందో చంద్రబాబు తమను అలా చంపుతున్నారని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం వడ్డీతో సహా చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఇదే పథకం వద్ద చంద్రబాబు హామీ ఇచ్చారని, దానిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీయే తమను రోడ్డున పడేసిందన్నారు. పిల్లలకు వివాహాలు చేసినా వారి కాపురాల్లో కలహాలు వస్తున్నాయని మహిళా రైతులు కంటతడి పెట్టారు.భూముల పట్టా పుస్తకాలపై జగన్ ఫొటో వేస్తున్నాడని విమర్శించారని.. మరి తమ భూములు తీసుకుని చంద్రబాబు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పురుషోత్తపట్నం, రామచంద్రపురం ప్రాంతానికి చెందిన బాధిత రైతులను బుజ్జగించేందుకు పోలీసులు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. భూములిచ్చి ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని బాధిత రైతులు కలగర బాలకృష్ణ, పెండ్యాల పుల్లారావు, కోడేబత్తుల ప్రసాదరావు, దుద్దిపూడి శ్రీను, కొండిపాటి కోటేశ్వరరావు, కూచిపూడి సుబ్రహ్మణ్యం, కలగర సుబ్బారావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నమ్మబలికి అన్యాయం చేశారు..ఎత్తిపోతల పథకం కోసం 2017లో దౌర్జన్యంగా భూములు తీసుకున్నారని, రూ.24 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు పరిహారం అందిస్తామని అప్పట్లో నమ్మబలికారని బాధిత రైతులు పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని కోరగా రూ.17 లక్షలు రివార్డు ప్రకటించి తమకు అన్యాయం చేశారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 72 ఎకరాలకు సంబంధించి సుమారు వందమంది రైతులు హైకోర్టును ఆశ్రయించగా ఆరు శాతం వడ్డీతో పరిహారం చెల్లించాలని కొద్ది నెలల క్రితం తీర్పు ఇచ్చినా తమకు అందించాల్సిన రూ.30 కోట్లు ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.45 రోజుల్లో అందిస్తామని హామీనిర్వాసిత రైతుల నిరసనతో కంగుతిన్న టీడీపీ ప్రజాప్రతినిధులు ఫోన్లో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. 45 రోజుల్లో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. లేదంటే తాము కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పారు. దీంతో బాధిత రైతులు నిరసన విరమించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటనలు గుప్పించారు. ఎన్జీటి నుంచి ఎటువంటి అనుమతులు లేని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని విడుదల చేయడం గమనార్హం. -
అమరావతి పై ఉన్న శ్రద్ద మాపై లేదు, సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
-
వరి ‘సాగు’తలేదు!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్కు అత్యంత కీలకంగా భావించే ఆరుద్ర కార్తె ఆదివారంతో ముగుస్తున్నా.. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. వర్షాలు ఓ మోస్తరులో కూడా కురవకపోవడంతో రైతులు వరి నారుమళ్లను సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినా... అవి సాగుకు సరిపోక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బావులు, బోర్ల కింద నీటి సౌకర్యం ఉన్న రైతులు మాత్రమే నార్లు పోస్తుండగా, వర్షాధార రైతులు ఇంకా ఎదురుచూపులకే పరిమితమయ్యారు. సాధారణంగా ఆరుద్ర కార్తెలోనే వరి నార్లు వేయడం, నాట్లు ప్రారంభించడం జరుగుతుంది. ఆరుద్ర దాటితే ‘కాలం ఎత్తిపోయింది’అనే మాట ఉత్తర తెలంగాణలో ఎక్కువగా వినబడుతుంది. గత సంవత్సరం కూడా వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూలై మొదటి వారం తరువాతే వరి నార్లు పోసే ప్రక్రియ వేగం అందుకోగా, ఈసారి మాత్రం ఆ జాడ కనిపించడం లేదు. నార్లు పోయకపోయినా, దుక్కులు దున్ని పొలాల కోసం సిద్ధం చేసుకునే రైతులు ఈసారి ఎల్నినో ప్రభావంతో వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముందుగానే నార్లు పోసి వర్షాలు లేకపోతే మొత్తం పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉండటంతో చాలామంది రైతులు రిస్క్ తీసుకోవడం లేదు. కాలం ఎత్తిపోతే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టే యోచనతో ఉన్నారు. వరి 1.94 లక్షల ఎకరాల్లోనే.. రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో 132 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో వరి 62.47 లక్షల ఎకరాల్లో సాగు కావలసి ఉండగా, ఇప్పటివరకు 1.93 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు కాగా.. గత ఏడాది ఇదే సమయానికి 5 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువగా సాగైనట్లు తెలుస్తోంది. ఈ ఖరీఫ్లో పత్తి 49 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 30 లక్షల ఎకరాల్లో సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి 36,30,988 ఎకరాల్లో సాగైంది. వర్షాధారమైన పత్తికి ఎల్నినో దెబ్బ తగిలితే పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి పోగా మిగిలిన అక్కడక్కడా మొక్కజొన్న, సోయాబీన్, కంది తదితర పంటల సాగు కొనసాగుతోంది. గోదావరి, ప్రాణహితపై ఆశలు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే ప్రాణహిత నదిలోకి వరద వచ్చి చేరుతోంది. గోదావరికి కూడా ఇన్ఫ్లో పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద ఉన్న రైతుల్లో కొంత మేర ఆశలు మొలకెత్తుతున్నాయి. ప్రాణహితకు వరద పెరిగితే ఆ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంత రైతులు ఈసారి వరిపై ఆశలు వదిలేసుకునే పరిస్థితిలో ఉన్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగం దృష్టి ఇప్పుడు రాబోయే రెండు వారాలపైనే నిలిచింది. ఈ సమయంలో విస్తృతంగా వర్షాలు కురిస్తేనే వరి నాట్లు ఊపందుకునే అవకాశం ఉంది. లేకపోతే ఖరీఫ్ సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. -
కేసీఆర్పై కక్షతోనే రైతులకు గోస
సాక్షి ప్రతినిధి, వరంగల్: కేసీఆర్పై రాజకీయ కక్షతో తెలంగాణ రైతులను ఈ ప్రభుత్వం గోస పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. తెలంగాణకు వరప్రదాయిని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం రేవంత్రెడ్డి శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. ఓ వైపు ఎల్నినోతో 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొంటే.. మరోవైపు 98 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తుంటే ముఖ్యమంత్రి సిగ్గులేకుండా.. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటిౖకైనా పంప్హౌస్లు ప్రారంభించకపోతే 60 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్హౌస్ ముట్టడించి గేట్లు తెరుస్తామని హెచ్చరించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్హౌస్ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం రైతుల ఆత్మహత్యలు ఆపింది.. ‘రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కన్నెపల్లి పంప్హౌస్లను నిలిపివేశారు. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి మేలు జరిగింది. రైతు ఆత్మహత్యలను ఆపింది. భూముల విలువ, తెలంగాణ రైతు విలువ పెంచింది. కానీ ముఖ్యమంత్రి దు్రష్పచారం చేస్తున్నారు. ప్రాజెక్టు రూ.94 వేల కోట్లు అయితే, రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందంటూ స్వయానా ముఖ్యమంత్రి మామే అన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ఉత్తమ్కుమార్రెడ్డి డైలాగులు చెప్పారు. 2014 కంటే ముందు మీరే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. 2014 కంటే ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదు? ఉత్తమ్కుమార్.. మీ శ్రీమతి ప్రాతినిథ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో కాకతీయ కెనాల్లో ఎప్పుడైనా నీళ్లు ఉన్నాయా?..’ అని కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందనే.. ‘కాళేశ్వరం ద్వారా ఇప్పుడు నీళ్లిస్తే యూరియా ఇవ్వాలన్న భయంతోనే రేవంత్ ఇలా చేస్తున్నారు. అంతేకాదు నీళ్లిస్తే పంటలు పండుతాయి. పంట పండితే బోనస్ అడుగుతారు. ఆ పంట మళ్ళీ కొనాలి. కాబట్టే నీళ్లు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు. కాళేశ్వరం రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన ఒక అద్భుత వరం. రాష్ట్రానికి పట్టిన శని రేవంత్రెడ్డి అని జగిత్యాల సభలో మాజీ మంత్రి జీవన్రెడ్డి చెప్పారు. ఒక వారం పాటు కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పజెప్పండి. మొత్తం తెలంగాణ నిండా నీటిని పారించే బాధ్యత మాది. కన్నెపల్లి నుంచి రోజుకు దాదాపు రెండు టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ట్యాంక్బండ్ కెపాసిటీ ఒక టీఎంసీ, హుస్సేన్సాగర్ కెపాసిటీ ఒక టీఎంసీ. రెండు హుస్సేన్సాగర్లను లిఫ్ట్ చేసే కెపాసిటీ కాళేశ్వరం మోటార్లకు ఉంది..’ అని కేటీఆర్ చెప్పారు. పోలీసుల తీరుపై ఆగ్రహం ‘హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి నాలుగు గంటల్లో చేరాల్సిన మా బృందం, పోలీసులు విధించిన ఆంక్షల కారణంగా ఏడు గంటలు ప్రయాణించాల్సి వచ్చింది. పెంబర్తి, జనగామ, స్టేషన్ఘన్పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ తదితర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు..’ అని కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీలు మలోత్ కవిత, వినోద్రావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, దాస్యం వినయ్భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, విద్యాసాగర్రావు, జీవన్రెడ్డి, రాజయ్య, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్రెడ్డి, సుంకె రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఏనుగుల రాకేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోర్టల్లో లేకుంటే బోనస్ పాయే!
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇచ్చే విషయంలో సర్కార్ ఆంక్షల పరంపర కొనసాగుతోంది. 2024–25 ఖరీఫ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన తరువాత రెండు ఖరీఫ్ సీజన్లలో బోనస్ ఇచ్చిన ప్రభుత్వం రెండు రబీలలో ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్నాలు పండించిన రైతులకు మాత్రమే బోనస్గా క్వింటాలుకు రూ. 500 చొప్పున చెల్లిస్తామని వ్యవసాయ, పౌరసరఫరా శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. తాజాగా మరో నిబంధన ఏంటంటే వరి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడే ఏ రకం విత్తనాలను రైతు కొనుగోలు చేశాడో ఆ రైతు వివరాలతో పాటు విత్తనాల వివరాలను కూడా ‘సీడ్స్ సేల్స్ పోర్టల్’లో విత్తనాలు అమ్మిన డీలర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో రైతు సన్నాలు పండించినప్పటికీ, కొనుగోలు చేసేటప్పుడు బోనస్ పొందేందుకు అనర్హుడు అయ్యే ప్రమాదం ఉంది. దీంతో సన్నాలు సాగు చేసిన ప్రతి రైతుకు బోనస్ లభిస్తుందనే కచ్చితమైన పరిస్థితి లేకుండా పోయింది. డీలర్ నమోదు చేయకపోతే..? రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం కారణంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి బావులు, బోర్ల కింద ఉన్న పొలాలనే రైతులు సాగుచేశారు. చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల కింద పొలాలలో దుక్కులు కూడా దున్నలేదు. పత్తి వేసిన రైతులే వరణుడి రాక కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. మరో రెండు రోజుల్లో ‘ఆరుద్ర కార్తె’వెళ్లిపోతుంది. ఆరుద్ర కార్తె దాటితే నార్లు పోయడం దాదాపుగా నిలిచిపోతుంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో మెజారిటీ రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఏడు రకాల సన్నాల గురించి చెప్పడంతో రైతులు తమ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా జైశ్రీరాం, కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048 రకాలనే ఎక్కువగా కొనుగోలు చేశారు. అయితే తాజాగా డీలర్లు రైతులు కొనుగోలు చేసిన విత్తనాల వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెపుతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డీలర్లు, కొనుగోలు చేసిన రైతులు ఉన్నారు. సీడ్ సేల్స్ పోర్టల్ https:// seedsgrowerp.com/ seedsales/ login.phpలో రైతుల వివరాలను నమోదు చేయాలని అధికారులు డీలర్లకు చెపుతున్నారు. రైతు పేరు, ఆధార్, మొబైల్ నంబర్, సాగు చేయనున్న పంట, విత్తన కంపెనీ, లాట్ నంబర్, జిల్లా వివరాలతో పాటు ఏ సన్న వరి రకాన్ని కొనుగోలు చేశారో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను డీలర్ తనకు ఇచ్చిన లాగిన్తో పోర్టల్లో నమోదు చేసి సేవ్ చేయాలి. తదనుగుణంగా రైతులు ధాన్యం విక్రయించే సమయంలో ఈ వివరాలను సరిచూసుకొని , సంబంధిత రైతులకే బోనస్ కింద రూ. 500 చొప్పున చెల్లించే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల విత్తనాలకే డిమాండ్ ప్రస్తుతం ప్రభుత్వం ఆర్ఎన్ఆర్–15048, బీపీటీ–5204, కేఎన్ఎం–1638, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715 రకాల సన్న విత్తనాలనే సాగు చేయాలని, ఈ విత్తనాలకే బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని కంపెనీలు ఆయా వంగడాలను 10, 20 కిలోల బ్యాగుల్లో విక్రయిస్తున్నాయి. కేఎంఎం 1638 రకం విత్తనాల 20 కిలోల బస్తాకు రూ.1050 ఉంటే, జై శ్రీరాం విత్తనాల 10 కిలోల బ్యాగు ధర రూ. 1100 పైగా పలుకుతోంది. మిగతా విత్తనాల రకాలను రైతులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని కరీంనగర్కి చెందిన ఓ డీలర్ తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా), బీపీటీ 5204 కొనుగోలు చేస్తున్నట్లు డీలర్లు తెలిపారు. అయితే విత్తనాల కొనుగోళ్లు చాలా వరకు తగ్గాయని విక్రయదారులు చెపుతున్నారు. ఇప్పటికే విత్తనాలు విక్రయించాం – డీలర్, పెద్దపల్లి రైతులు విత్తనాల కోసం వచ్చినప్పుడు ఫోన్ కూడా తీసుకురారు. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను మేమెలా సీడ్స్ సేల్ పోర్టల్లో నమోదు చేస్తాం. మా దగ్గర కంప్యూటర్లు లేవు. చాలా మందికి చదువులు కూడా రావు. మమ్ములను రైతులకు అమ్మిన విత్తనాల వివరాలు ఫీడ్ చేయమంటే ఎలా? వ్యవసాయ శాఖ అధికారులు చేయాల్సిన పనులను మాకు చెపితే మేం ఎట్లా చేస్తాం. అయినా విత్తనాలన్నీ ఇప్పటికే అమ్మేసినం. అమ్మినప్పుడు రైతుకు బిల్లు ఇస్తం. అది తప్ప మేం ఏమీ ఆన్లైన్లో ఎంటర్ చేయలేం. -
ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 లక్షల ఎకరాలు. రాష్ట్రంలోని పేదలకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూమి ఇది. ఈ భూములపై అసైనీలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అసైన్డ్ భూములకే కాదు దాదాపు 7 లక్షల ఎకరాల పోడు భూములపై కూడా హక్కులిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ అధి కారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతుండగా..అప్పటినుంచి ఇప్పటివరకు అసైన్డ్ భూముల విషయంలో ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతూనే ఉంది. అయితే తాజాగా.. మంత్రివర్గ భేటీలో దీనిపై చర్చ జరిగిన నేపథ్యంలో.. దీనికి సంబంధించి పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. హక్కుల కల్పనతో పాటు ల్యాండ్ పూలింగ్, రెగ్యులరైజేషన్, పరిమిత అధికారాల కల్పన లాంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నప్పటికీ అసైన్డ్ భూములు కలిగిన పేదలకు ఉచితంగా హక్కులు కల్పించాలనే నిర్ణయానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అన్నివిధాలా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ భూముల విషయంలో ఏం చేయాలన్నా తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టానికి (1977) సవరణలు చేయాల్సి ఉన్నందున చట్ట సవరణ ముసాయిదాను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్లో ఏం జరిగింది? విశ్వసనీయ సమాచారం ప్రకారం..పేదలకు హక్కులు కల్పించడం, తదుపరి పరిణామాలు, ప్రత్యామ్నాయాలపై మంత్రివర్గ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తేనే బాగుంటుందని కొందరు అభిప్రాయపడగా, అలా చేస్తే పేదల చేతుల్లో ఉండే కొద్దిపాటి భూములు అన్యాక్రాంతమవుతాయని, కాబట్టి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కొందరు చెప్పారు. మరికొందరు.. పూర్తి హక్కుల కల్పన కాకుండా నాలా తరహాలో భూమి వినియోగ మార్పిడి అధికారాలు కల్పిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ద్వారా అన్ని లక్షల ఎకరాల భూమి ఒకేదఫాలో మార్కెట్లోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశముందని, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇంకొందరు చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై మంత్రివర్గం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనానికి మంత్రుల కమిటీ లేదా భూచట్టాల నిపుణులు, అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. హక్కుల కల్పనకు సిఫారసులు అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి పలు సిఫారసులు వచ్చాయి. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీతో పాటు వ్యవసాయ కమిషన్ తమ సిఫారసులు పంపాయి. ప్రపంచ బ్యాంకు, ఇతర అరి్థక సంస్థలు, భూ విధానాలపై పనిచేసే అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని తమ నివేదికల్లో పేర్కొన్నాయి. భూమి అమ్మకాలు, కొనుగోళ్లపై ఆంక్షలు ఉండకూడదని, అలా ఉండడం పేదల ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, దేశ ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదిస్తుందని వెల్లడించాయి. మార్కెట్లోని ఇతర వస్తువులు మాదిరిగా ల్యాండ్ మార్కెట్ కూడా సరళంగా ఉండాలని, అలా ఉన్నప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం కూడా ఈ నివేదికల్లో వ్యక్తమైంది. తర్వాతి పరిణామాలపై మల్లగుల్లాలు ఇంతవరకు బాగానే ఉన్నా.. హక్కుల కల్పన తర్వాత ఏం జరుగుతుందన్న దానిపైనే ప్రభుత్వ పెద్దలు ప్రధానంగా మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా గత 20 ఏళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్న భూకమతాల సంఖ్య తగ్గిపోతోందని పలు నివేదికలు చెపుతున్నాయని, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, పేదలకు భూములు లేకుండా పోతాయనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టుగా.. ఇంత పెద్ద మొత్తంలో భూములు ఒకేసారి మార్కెట్లోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులకు లోనవుతుందనే మీమాంస కూడా ప్రభుత్వ పెద్దలను అయోమయంలో పడేస్తోందనే చర్చ జరుగుతోంది. రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలు..! ఒకవేళ పేదలకు అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించని పక్షంలో ప్రభుత్వం ముందు రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలు ఉన్నట్టు సమాచారం. కాగా ఇవి రెండూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశీలించినవే కావడం గమనార్హం. అందులో ల్యాండ్ పూలింగ్ (పేదల వద్ద ఉన్న అసైన్డ్ భూములను ప్రభుత్వమే సమీకరించి వారికి ఆ భూమిలో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ కొంత భాగం ఇవ్వడం) ఒకటి కాగా ఈ విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ల్యాండ్ పూలింగ్ అంశాన్ని అధ్యయనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలావుండగా అసైనీల చేతుల నుంచి దాదాపు 10 లక్షల ఎకరాల వరకు అన్యాక్రాంతమైనట్టుగా గణాంకాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేదల వద్ద ఉన్న అసైన్డ్ భూములను వారికి ఉచితంగానే ఇచ్చేసి, ఇతరుల చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వ విలువకు క్రమబద్ధీకరించే వీలుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.30 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చిక్కులున్నా హక్కులు కల్పిస్తే మేలు అసైన్డ్ భూముల విషయంలో చాలా చిక్కులున్నాయి. భూరికార్డులు సరిగా లేవు. పట్టా మార్పిడి జరగడం లేదు. కొత్త పుస్తకాలు రావడం లేదు. విస్తీర్ణంలో వ్యత్యాసాలున్నాయి. ఈ రికార్డులను సరిచేసి పేదలకు భద్రమైన భూమి హక్కులు కల్పించగలగాలి. భూముల జియో ట్యాగింగ్ చేయాలి. తాత్కాలిక భూదార్ ఇవ్వాలి. ఆ తర్వాత అన్నీ సరి చేసి శాశ్వత భూదార్ ఇవ్వాలి. ఏది ఏమైనా పేదలకు అసైన్ చేసిన భూమిపై వారికి పూర్తి హక్కులు ఇస్తే మేలు జరుగుతుంది. 25 లక్షల ఎకరాల భూమిలో అందరూ అమ్ముకోవాలనుకునే వారుండరు. – ఎం.సునీల్కుమార్, భూచట్టాల నిపుణుడు -
మా కష్టాన్ని దోచుకుంటున్నారు
పలమనేరు: ఆరుగాలం శ్రమించి పండించిన టమాటాకు ధరలు తగ్గించి తమను దగా చేస్తున్నారంటూ శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు టమాటా మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. టమాటా బాక్సులను 15 కిలోల నుంచి 18 కిలోలు, 20 కిలోలకు పెంచారని చెప్పారు. మండీ నిర్వాహకులు, వ్యాపారులు కుమ్మక్కై తమ రక్తం పీలుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్ గేట్లకు తాళాలు వేసి జాతీయ రహదారిపై బైఠాయించారు. పొరుగు మార్కెట్లకు, ఇక్కడికి ధరల్లో వ్యత్యాసం ఎందుకుందని నిలదీశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న డౌన్డౌన్... అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండీ నిర్వాహకులే వ్యాపారులుగా మారారని, సరుకు కొనేది, కమీషన్ తీసుకునేది వారేనని ఆరోపించారు. ఎవరైనా వ్యాపారులు వచ్చినా మండీవాళ్లతో కుమ్మక్కై ధరలు తగ్గించి తమ కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు. 15 కిలోల టమాటా బాక్సు ధర పక్కనే ఉన్న కర్ణాటక వడ్డిపల్లిలో రూ.300 పలుకుతుంటే ఇక్కడ మాత్రం రూ.100 కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా మండీల నిర్వాహకులు పదిశాతం కమీషన్ వసూలు చేస్తున్నా మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. దీంతోపాటు బాక్సుల దింపుడు కూలీ అని అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఎకరాకు రెండున్నర లక్షలు ఖర్చుపెట్టి పండిస్తే.. ఇక్కడ తమ రక్తాన్ని పీల్చేస్తున్నారని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు ఆందోళన చేస్తున్నా ఏఎంసీ చైర్మన్ ఎందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. టమాటా రైతుల గురించి ఆయనకు ఏమాత్రం అవగాహన లేదన్నారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ సంజీవకుమార్, ఎస్ఐ లోకేశ్రెడ్డి రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈ సమస్యపై రైతులు, మండీ నిర్వాహకులతో సోమవారం చైర్మన్ మాట్లాడతారని సెక్రటరీ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం పోలీసులు మార్కెట్ గేట్లను తీశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై దాదాపు రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం, బైరెడ్డిపల్లి, పలమనేరు మండలాల రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. -
మాటలు కోటలు... మారని చర్యలు
నేల అంటే కేవలం మట్టి కాదు. అది జీవం. అది చరిత్ర. అది రైతు జీవనా ధారం. ఈ సత్యాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన భారత్ సాయిల్ హెల్త్ పాలసీ– ‘స్వచ్ఛ మిట్టి, సమృద్ధ కిసాన్, సశక్త భారత్’ చదివినప్పుడు మనసులో ద్వైదీభావాలు ఏక కాలంలో కలుగుతాయి. ఒకవైపు ఆశ, మరోవైపు ఆందోళన. మాటలు బాగున్నాయి. కానీ చర్యలకు దారేది?నేల ఏం చెప్తోందంటే...2015లో ప్రారంభమైన సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్డులు పంపిణీ చేశారు. ఈ గణాంకాలు చిన్న విషయం కాదు. కానీ ఆ కార్డుల్లో వచ్చిన డేటా మనల్నీ, మన వ్యవసాయ పద్ధతులనీ, ప్రభుత్వ విధానాల్నీ కదిలించాల్సింది. కానీ అది జరగలేదు. 89% నేలల్లో నత్రజని లోపం ఉంది. 80% నేలల్లో భాస్వరం తగ్గింది. 49% నేలల్లో జింక్ కరవైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు సగటున 2.5% ఉన్న సేంద్రియ కార్బన్ నేడు 0.3%కి పడిపోయింది. ఇది నేల చనిపోతున్న పరిస్థితులకు సంకేతం. అయినా పంటల సరళి, వ్యవసాయ పద్ధతులు మారలేదు. యూరియా వాడకం పెరుగుతూనే ఉంది. ఎరువుల సబ్సిడీ కొనసాగుతూనే ఉంది. నేల చెప్పింది వినే తత్వం లేకుండా పోయింది.ఇది డేటా వైఫల్యం కాదు, డేటా నుండి నేర్చుకోవటానికి నిరా కరించిన వ్యవస్థ వైఫల్యం. డేటా మాత్రమే మంచి నిర్ణయాలకు దారితీయదు. ఆ డేటాను అర్థం చేసుకునే జ్ఞానం, దానిపై చర్యలు తీసుకోవాలనే సంకల్పం కూడా అవసరం. కార్డు చేతికిచ్చారు, కానీ దాన్ని అమలుచేసే వ్యవస్థ మారలేదు. డీలర్లు అదే యూరియా అమ్ముతూనే ఉన్నారు. రుణం తీసుకోవాలంటే ఎరువులు కొనాల్సిందే. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా స్థానాలు, సలహా ఇచ్చే విస్తరణ సేవలు అదే పాత పాట పాడుతున్నాయి. ఎక్కువేస్తే ఎక్కువ దిగుబడి భ్రమతెలంగాణాలో హెక్టారుకు 297 కిలోల ఎరువులు వేస్తున్నారు. జాతీయ సగటుకు రెట్టింపు కంటే ఎక్కువ. అయినా ఆ నేలల్లో సేంద్రియ కార్బన్ 0.3 నుంచి 0.8% మాత్రమే ఉంది. 90% నేలలు పోషకాల లోపంతో అల్లాడుతున్నాయి. పంటల దిగుబడి తగ్గి పోతోంది. ఎరువులు పెంచినా, ఎక్కువ మోతాదులో వేసినా దిగు బడి పెరగకుండా తగ్గుతోందని కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్లో హెక్టారుకు 277 కిలోల ఎరువులు వాడతారు. పంజాబ్ కంటే కూడా ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో వరి సాగు ప్రాంతాల్లో మూడు–నాలుగు పోషకాల ఏకకాలిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వైరుధ్యం ఇదే. నీటి పారుదల పెరిగింది, ఎరువుల వాడకం పెరిగింది, అయినా దిగుబడులు పెరగలేదు, రైతు రుణభారం తగ్గలేదు, భూములు పాడయ్యాయి.అసలు సమస్య ఎరువుల పరిమాణం కాదు – ఏకపంట వ్యవ సాయం. వరి–వరి లేకపోతే పత్తి. ఏకపంట వ్యవసాయం ఒకే నేల పొరలోని పోషకాలను పంట కాలం తర్వాత పంట కాలం పీల్చేస్తుంది. పంట వైవిధ్యం లేదు. సేంద్రియ పదార్థం తిరిగి నేలకు చేరడం లేదు. దానిపైన ఎక్కువ రసాయనిక ఎరువులు వాడబట్టి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నాశనమవుతాయి. అవి లేకుండా, ఎంత ఎరువు వేసినా పంటకు అందడం లేదు. అది వృథాగా నీళ్లల్లో కరిగి బయటకు పోతుంది. భూగర్భ జలాలు కలుషితమవుతాయి.‘వెనుకబడ్డ’ రాష్ట్రాలు ఎందుకు ముందున్నాయి?నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు 5 కిలోల కంటే తక్కువ ఎరువులు వాడతారు. అయినా వాటి నేల ఆరోగ్యం పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల కంటే మెరుగ్గా ఉంది. ఈ నేలలు ‘వెనుకబడ్డవి’ కావు. అవి ఇంకా బతికి ఉన్నాయి. కానీ సాయిల్ హెల్త్ పాలసీ ప్రకటిస్తున్న పీఎం–ప్రణామ్, కార్బన్ క్రెడిట్స్ వంటి పథకాలన్నీ ఎరువులు తగ్గించిన రైతుకు సహకారం అందించే విధానాలు. కానీ ఎప్పుడూ ఎరువులు వాడని, భూమిని కాపాడుకొంటున్న నాగాలాండ్ రైతుకు ఏమి దక్కుతుంది? తగ్గించడానికి అతడి దగ్గర పాత బేస్లైన్(ఆధార రేఖ) లేదు కాబట్టి ఏ పథకమూ వర్తించదు. ఈ సాధనాలు చెడ్డ స్థాయి నుండి బయట పడేవారికి బహుమానం ఇస్తాయి; ఆ చెడ్డ స్థాయికి అసలు ఎప్పుడూ వెళ్లని వారికి ఏమీ అందదు. ఇది తీవ్రమైన వైరుధ్యం. పరివర్తన ఆర్థిక వ్యవస్థ వేరు,సంరక్షణ ఆర్థిక వ్యవస్థ వేరు. మంచి నేలలు ఉన్న చోట వాటిని కాపాడే విధానం కావాలి. మారమని ప్రోత్సాహం కాదు. లేకుంటే మార్కెట్ శక్తులు ఆ నేలలను కూడా రసాయన సాగులోకి లాగుతాయి. భారత్ సాయిల్ హెల్త్ పాలసీ పరివర్తన, సంరక్షణ – ఈ రెండు రకాల ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలి. మాటలు మారితే చర్యలూ మారాలి!కొత్త పాలసీలో మంచి భావనలున్నాయి. నేలను జాతీయ సంపదగా గుర్తించడం, జీవ సూచికలను పర్యవేక్షించడం, రైతులను నేల సంరక్షకులుగా గౌరవించడం. కానీ ఈ పాలసీ నిజంగా అమలు కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు.ఎరువుల సబ్సిడీ విధానంలో సంస్కరణలు జరగాలి. రసాయనిక ఎరువులకుగాక నేల సంరక్షణకూ, నేల ఆరోగ్యం కాపాడటానికీ సబ్సిడీలు ఇవ్వాలి. వరి–గోధుమ ఆధిపత్యాన్ని తగ్గించాలి. పప్పు ధాన్యాలు, నూనెగింజలకు మద్దతు ధరలు, కొనుగోలు హామీలు ఇవ్వాలి. రైతు సంస్థలు, ఎఫ్పీఓ(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనై జేషన్)లు కేవలం అమలు యంత్రాంగంగా కాకుండా, జవాబుదారీ తనంలో భాగం కావాలి. పీజీఎస్ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్) ధ్రువీకరణ వ్యవస్థలు పాలసీలో భాగం కావాలి. డేటా తయారు చేయడం సులభం. డాష్బోర్డులు పెట్టడం ఇంకా సులభం. కానీ డేటా చెప్పింది వినాలంటే, వ్యవస్థ మారాలనే సంకల్పం కావాలి. ఆ సంకల్పమే ఇప్పుడు లేనిది. నేల పరీక్ష చేయించాం. నేల ఏం చెప్తుందో తెలుసు. ఇక మనం ఏం చేస్తామో చూడాలి.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
అసలు నువ్వు ముఖ్య మంత్రివేనా..??
-
పెనుమాకలో YSRCP నేతలపై టీడీపీ గూండాలు దాడి..
-
రైతు కంటే నీకే ఎక్కువ తెలుసా చంద్రబాబు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో రైతు ఏ పంట వేసినా గిట్టుబాటు ధరపై నమ్మకం లేకుండా పోయిందని, రైతు రోడ్డెక్కడం ఇప్పుడు సాధారణ ఘటనగా మారిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని, అవినీతి, దోపిడీ, రెడ్బుక్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని బుధవారం మీడియా సమావేశంలో జగన్ అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.పొగాకు రైతులు, మామిడి రైతులు, అక్వా రైతులు వరుసగా ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని జగన్ అన్నారు. రైతు రోడ్డెక్కడం అంటే అది రైతు తప్పు కాదని, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.పొగాకు రైతుల్ని మోసం చేశారుతమ ప్రభుత్వం హయాంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నామని జగన్ చెప్పారు. అయితే ప్రస్తుతం రైతులను ఆదుకున్నామని ఎల్లో మీడియాతో ప్రచారం చేయిస్తున్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. మొత్తం 240 మిలియన్ కిలోల పొగాకులో కేవలం 29 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారని, మిగిలిన రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆరోపించారు. ఈ పరిస్థితిలో పొగాకు రైతులు రోడ్డెక్క ఏం చేస్తారని జగన్ అన్నారు.మామిడి రైతుల పరిస్థితి మరింత దారుణంగతేడాది మామిడి కేజీకి రూ.12 ఇస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేశారని, ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైందని జగన్ అన్నారు. కర్ణాటకలో కేంద్ర మంత్రి కుమారస్వామి చొరవతో కేంద్ర సహకారం తీసుకుని మామిడి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కూడా అదే విధంగా కేంద్రంతో మాట్లాడి రైతులను ఆదుకోవచ్చని, కానీ ఆయనకు అలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దీంతో రాష్ట్రంలోని మామిడి రైతులు వరుసగా రెండో ఏడాది కూడా సంక్షోభంలో చిక్కుకుని రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు.అక్వా రంగం కుదేలైందితమ ప్రభుత్వం హయాంలో అక్వా రైతులకు అండగా నిలిచామని, కానీ ప్రస్తుతం రైతుల ఆమోదం లేకుండానే ఫీడ్ ధరలను పెంచి వారిపై అదనపు భారం మోపారని జగన్ ఆరోపించారు. గత ఏడాది మొదలైన సంక్షోభం ఈ ఏడాది మరింత తీవ్రమైందని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో అక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఎరువులు, విత్తనాల కోసం.. చంద్రబాబు పాలనలో యూరియా, సబ్సిడీ విత్తనాల కొరత తీవ్రంగా ఉందని జగన్ అంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు రైతులను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేవలం రెండేళ్ల పాలనలోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఖరీఫ్ సీజన్లో కూడా విత్తనాల పంపిణీ సక్రమంగా జరగలేదని ఆరోపించారు.తమ హయాంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు అన్ని సేవలు అందించామని, మార్కెట్ కంటే రూ.50 తక్కువకే యూరియా సరఫరా చేశామని గుర్తు చేశారు. ఐదేళ్లలో యూరియా, విత్తనాలు, ఎరువుల కొరతతో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలేదని అన్నారు. అలాగే.. బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.బాబు విచిత్ర వ్యాఖ్యలు..యూరియా కొరతపై ప్రభుత్వం చెబుతున్న కారణాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయని జగన్ అన్నారు. "యూరియా ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుంది.. అందుకే ఈ పరిస్థితి వచ్చింది" అని చంద్రబాబు చెప్పడం రైతులను అవమానించడమేనని మండిపడ్డారు. "రైతు కంటే వ్యవసాయం గురించి మీకే ఎక్కువ తెలుసా చంద్రబాబు?" అంటూ ప్రశ్నించారు.రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి లేదుతనకు దగ్గర వాళ్ల ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని, రైతులకు మేలు చేయాలన్న ఆలోచన ఆయనకు ఏనాడూ లేదని జగన్ అంటున్నారు. పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర వస్తుందనే హామీ లేకుండా పోయిందని, కొనుగోలు జరుగుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు భవిష్యత్తును ప్రభుత్వం పూర్తిగా అనిశ్చితిలోకి నెట్టేసిందని మండిపడ్డారు. -
రగిలిన రైతన్నలు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు దగాపై దద్ధరిల్లిన విజయవాడ ధర్నాచౌక్
-
భూమి కోసం న్యాయపోరాటం
తాడేపల్లి రూరల్: భూమిని కాపాడుకోవడం కోసం కలసికట్టుగా న్యాయపోరాటం చేస్తామని ఉండవల్లి, పెనమాక రైతులు స్పష్టంచేశారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. న్యాయపోరాటంతోపాటు కలసివచ్చే రాజకీయ పార్టీలతో కలసి పోరాటం చేస్తామని రైతులు తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లోని ఓ రైస్మిల్లులో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులు, భూసేకరణకు నోటీసులు వచ్చిన రైతులు సమావేశం నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. దేశ రక్షణకు సైనికులు ఎంత అవసరమో దేశంలో ప్రజల ఆకలి తీర్చడానికి రైతులు కూడా అంతే అవసరమని వారు పేర్కొన్నారు.బాధల్లో ఉన్నప్పుడు తమను ఓదార్చే వారిని తప్పనిసరిగా కులాలు, మతాలతో సంబంధం లేకుండా కలుస్తామని, దానిలో భాగంగానే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశామని రైతులు వివరించారు. సీఆర్డీఏ పరిధిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని తమ కష్టాలను వివరించామని, దానికి స్పందించిన ఆయన న్యాయ సలహా కమిటీ, సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ క్షేత్రస్థాయిలో రైతుల బాధలను తెలుసుకోవడానికి వస్తున్న సమయంలో ఉండవల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో దాడులు జరగడం చాలా దురదృష్టకరమని ఉండవల్లి రైతులు పేర్కొన్నారు. సీఆర్డీఏ అధికారులు, టీడీపీ పెద్దలు రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వాలని కోరినప్పుడు 95 శాతం మంది భూములు ఇచ్చారని తెలిపారు. మిగిలిన భూమిని వదిలివేస్తామని వారు హామీ ఇచ్చారని రైతులు వివరించారు. అయితే ఆ తర్వాత ఆ మాట తప్పి భూ సేకరణకు మూడు దఫాలుగా నోటీసులు అందజేశారని తెలిపారు. రోడ్లకు, కొండవీటి వాగుకు భూములు తీసుకుని మిగిలినవి వదిలివేస్తారా అని అధికారులను అడుగుతున్నా తమకు తెలియదంటున్నారని రైతులు పేర్కొన్నారు. ‘9.3 ఒప్పందం పత్రం ఇచ్చేదాకా ఒకలాగా మాట్లాడారు. ఇచ్చిన తరువాత మరోలా మాట్లాడుతున్నారు’ అని రైతులు వివరించారు. గతంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలు సేకరణలో లేవని, భూములు ఇవ్వడం ఇష్టంలేనివారు 9.2 పత్రాలు ఇవ్వాలని అధికారులు చెప్పారని, 9.2 ఇచ్చిన తరువాత భూ సేకరణ నోటీసులు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు రైతులు ఏమన్నారంటే...ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదుకిసాన్ రైతు సంఘం గతంలో రాజధాని నిర్మాణానికి 5 వేల ఎకరాలు సరిపోతుందని స్పష్టం చేసింది. అలాంటిది ప్రభుత్వం 50 వేల ఎకరాలు సేకరించింది. నేను కూడా ఒక రైతునే. ఉండవల్లిలో అనేక రకాల పంటలు పండిస్తాం. 365 రోజులు పూలు, కూరగాయలు పండించి ఎవరిమీద ఆధారపడకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇలాంటి భూములను కాంక్రీట్ జంగిల్గా ఎలా చేస్తారు? రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం పూలింగ్, నాన్ పూలింగ్ అని ఇచ్చారు. ఇవ్వని వాళ్లు 9.2 ఫారం ఇవ్వాలని అధికారులు కోరారు. రైతులందరం ఇచ్చాం. ఇప్పుడేమో భూములు ఇవ్వని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఉండవల్లి గ్రామాల్లో దాడిచేసే కల్చర్ ఎప్పుడూ లేదు. రైతులతో గొడవకు దిగిన ఏ ప్రభుత్వం నిలవబడదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన 9.3ని కూడా వెనక్కి తీసుకోవాలా, ఇవ్వాలా అని ఆలోచిస్తాం. – కొర్రప్రోలు ఈశ్వరరెడ్డి, కిసాన్ రైతు సంఘం అధ్యక్షులుమేం ఆహ్వానిస్తేనే రైతు పరిరక్షణ కమిటీ వచ్చిందిరైతుల సమస్యలపై మాత్రమే జగన్ను కలిశాం. ఆయన్ను కలవకముందే అనేక రైతు సమస్యలపై సమావేశం నిర్వహించాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసినపుడు రహదారులకు భూములు ఇవ్వాలని చెప్పారు. మిగిలిన భూమిని వదిలేసే వరకు పార్టీ తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మా కోరిక మేరకే రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటి పరిశీలనకు వస్తున్న సమయంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం. ఒక రైతుగా ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. –దంటు బాలాజీరెడ్డిఆ ప్లాట్లు ఎక్కడో రైతులకు తెలియదు..తొలి విడత పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు నేటికీ ప్లాట్లు కేటాయించలేదు. పేపర్ల మీద ఇచ్చినట్లు చూపిస్తున్నారు కానీ ఆ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో రైతులకు తెలియదు. మేము నష్టపోయినా, భూములు ఇచ్చిన రైతులు నష్టపోయినా ఒకటే. సీఆర్డీఏ అధికారులు భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి తీసుకువచ్చే ముందు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు మా ఊర్లోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. 2012కి ముందే మా గ్రామంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడే జరగడం లేదు. రిజిస్ట్రేషన్లు కూడా కావడం లేదు. –మేకా శ్రీధర్రెడ్డిమా భూములు కాపాడుకునేందుకు ఎవరినైనా కలుస్తాంగ్రామాల్లో ఎన్ని పార్టీలు ఉన్నా, రైతులకు ఆ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు. కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా ఉంటున్నాం. దయచేసి గొడవలు పెట్టవద్దు. మా భూములు కాపాడుకునేందుకు ఎవరినైనా కలుస్తాం. అధికారులు ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేనే. నాకు సీఆర్డీఏ అధికారులు ప్లాట్లు కేటాయించే దాకా నా పొలంలో అడుగు పెట్టడానికి వీలులేదంటూ, నా పొలం చదును చేయడానికి వీలులేదంటూ ఒప్పందం కుదుర్చుకున్నాను. 9.3 ఒప్పంద పత్రం ఇవ్వగానే ఉండవల్లిలో గ్రామసభ జరుగుతుండగా రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి మోటారు పీకేందుకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఇప్పటి వరకు ఏమీ ప్రయోజనం లేదు. పొలానికి రెండు వైపులా 5 అడుగుల మెరక తోలారు. వర్షం వస్తే పంట మునిగిపోతుంది. నా పరిస్థితి ఏమిటి? –అనంత శివరావుప్రభుత్వమే మోసం చేస్తే ఎలా..?నాకు ఉండవల్లిలో లే అవుట్లో 7.5 సెంట్లు భూమి ఉంది. ల్యాండ్ ఫూలింగ్లో నా పేరు లేదు. భూమి అమ్మిన వారి పేరే ఉంది. ఇదేంటంటూ కమిషనర్ను కలిశాను. ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ భూ సేకరణ కింద పెట్టారు. నోటీసు రాకుండా అభ్యంతరాలను ఎలా చెప్పాలి? కలెక్టర్ ఆఫీసుకు వెళితే మా పేరు ఉందని నా అబ్జెక్షన్ను తీసుకున్నారు. ప్రభుత్వమే ఇలా మోసం చేస్తే రాజకీయ నాయకులను ఆశ్రయించడంలో తప్పేముంది? ఇలాంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరం. –వీరారెడ్డి, ప్రభుత్వ ఉద్యోగిపూలింగ్కు ఇచ్చాను, నాకు ప్లాట్ ఇవ్వలేదునేను మొదటి విడతలోనే పూలింగ్కు నా భూమి ఇచ్చాను. నేను 30 సెంట్ల భూమి ఇవ్వగా టీడీఆర్ బాండ్ ఇచ్చారు. మిగిలిన భూమి ఎక్కడ ఇచ్చారనేది చూపించడం లేదు. నేను ప్లాట్లు అడిగితే గుంటూరు వెళ్లమంటున్నారు. అక్కడకు వెళితే సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లమంటున్నారు. 821 మంది రైతులకు 5 విడతలుగా నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేదు. కొత్తగా భూములు తీసుకుని ఏం చేస్తారు? సీఎం నివాసం పక్కనే ఉన్నా మాకు మౌలిక సదుపాయాల విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. కొంతమందికి పెన్షన్లు నిలిపివేశారు. మా ప్రాంతంలో రోడ్లు, లైట్లు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. –కనకం కోటేశ్వరరావు -
రగిలిన రైతన్న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. సీజన్లో యూరియా, విత్తనాలు అందించకుండా యాప్ పేరుతో ఇక్కట్లకు గురి చేయడం.. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం.. ఉచిత పంటల బీమాను ఎగరగొట్టడం.. సున్నా వడ్డీ రాయితీ పథకం డబ్బులివ్వకుండా రెండేళ్లుగా తొక్కిపెట్టటాన్ని నిరసిస్తూ రైతన్నలు చంద్రబాబు సర్కారుపై కదం తొక్కారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని, రైతుల పొట్టగొట్టిన ఈ రాక్షస పాలనను తుదముట్టించేంతవరకు విశ్రమించబోమని గర్జించారు. ‘సీఎం డౌన్ డౌన్’... ‘రైతు వ్యతిరేక పాలన నశించాలి’.. ‘కష్టం రైతులది.. లాభం దళారులదా..!’ అంటూ పిడికిళ్లు బిగించారు. బాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలతో విజయవాడ ధర్నాచౌక్ ప్రాంతం దద్దరిల్లింది. ధర్నాచౌక్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్లారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డు వైపు కదం తొక్కారు. బూటుకాళ్లతో తొక్కుతూ.. పిడిగుద్దులుఎక్కడికక్కడ బారికేడ్లతో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా రైతన్నలు ఉద్యమ కెరటాల్లా ఎగసిపడ్డారు. అలంకార్ సెంటర్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి మూడు అంచెల బారికేడ్లతో దిగ్బంధించారు. పిడిగుద్దులు, బూటుకాళ్లతో తొక్కుతూ వారిని నిరోధించేందుకు యత్నించారు. పలువురు రైతులను పోలీసులు ఈడ్చేశారు. ధర్నాచౌక్ నుంచి లెనిన్ సెంటర్ వైపు ర్యాలీగా తరలి వెళ్లిన అన్నదాతలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసుల దాష్టీకంబారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగేందుకు యత్నించిన రైతులపై పోలీసులు బల ప్రయోగానికి దిగారు. దాదాపు గంటకుపైగా పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల దాష్టీకానికి పలువురు రైతులకు కాలి వేళ్లు చితికిపోయి రక్తపు గాయాలయ్యాయి. రక్తమోడుతున్నా లెక్క చేయకుండా కొదమ సింహాల మాదిరిగా బారికేడ్లను తోసుకుంటూ ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లా వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. దారిపొడవునా రైతులను అడ్డగిస్తూ బలవంతంగా ఈడ్చి పారేయగా, మరి కొంత మంది రైతులను పోలీసులు బూటుకాళ్లతో అడ్డగించే యత్నం చేశారు. అలంకార్ సెంటర్లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య బ్యారికేడ్ల పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. రైతుల న్యాయమైన డిమాండ్లను వినకుండా ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు బుజ్జగించడంతో రైతులు కొద్దిగా శాంతించారు. అంతకుముందు ధర్నాచౌక్ వద్ద 2 గంటల పాటు ధర్నా చేశారు. రైతులు ప్లకార్డులు, డిమాండ్లతో కూడిన బ్యానర్లు చేతబట్టి తలపై ఆకుపచ్చ కండువాలు కట్టుకుని ముందుకు సాగారు. ధర్నా చౌక్ వద్ద బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకుంటున్న పోలీసులు ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు..చంద్రబాబు పాలనలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఒక్కరైనా సంతృప్తికరంగా ఉన్నారని నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా సంక్షోభంలో కూరుకుపోయేలా చంద్రబాబు చేశారని ఆరోపించారు. ధర్నాచౌక్లో జరిగిన సభలో ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య, ఏపీ, కౌలు రైతుల సంఘ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఏ.కాటమయ్య, ఉపాధ్యక్షుడు ఏ.రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.రైతుల పరిస్థితి దారుణం400 ఎకరాల్లో మొక్కజొన్న వేశాం. కొనేవారు లేరు.. ఐదుసార్లు కలెక్టర్ చుట్టూ తిరిగాం. పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల వెంటపడ్డాం. పట్టించుకోలేదు. చేసేది లేక క్వింటాల్ రూ.1,600కు తెగనమ్ముకున్నాం. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. – డి.మల్లిఖార్జునరెడ్డి, వీరపునాయనపల్లి, వైఎస్సార్ కడప జిల్లాఏ పంటకూ మద్దతు ధరలేదుఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, మినుము సాగు చేశా. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. మొక్కజొన్న క్వింటాల్ రూ.1,600కు అమ్ముకుంటే.. ధాన్యం 75 కేజీల బస్తా రూ.1,350కు అమ్ముకున్నాం. జొన్న క్వింటాల్కు రూ.1,800 మాత్రమే దక్కితే మినుము పూర్తిగా దెబ్బతింది. ఐదెకరాలకు రూ.3 లక్షల మేర నష్టపోయా. – కూరపాటి శింగయ్య, చిర్రావూరు, గుంటూరు జిల్లా -
రైతుల ఖాతాల్లో రూ.9,000 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం అమలు చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులతో కలిసి పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా జమ చేస్తున్నామని ప్రకటించారు."రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని... రైతు నవ్వితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని" అన్న నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి రైతు హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇదేనని అన్నారు.ఖరీఫ్ సీజన్ నుంచే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏడు రకాల సన్న వడ్లకు బోనస్ అందిస్తామని ప్రకటించిన మంత్రి, రైతు పండించిన ప్రతి గింజకు విలువ పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ధాన్యం ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.రైతు అనుకూల విధానాలు, సకాలంలో ధాన్యం కొనుగోలు, వేగంగా రైతుల ఖాతాల్లో చెల్లింపులు, నాణ్యమైన విత్తనాలు, సాగునీటి లభ్యత వంటి చర్యలతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో రైతు సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, వేగవంతమైన చెల్లింపులతో రైతుల జీవితాల్లో నమ్మకాన్ని నింపామని చెప్పారు.రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి రైతు సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని, ఇది దేశంలోనే రైతు సంక్షేమంపై అత్యధిక పెట్టుబడి పెట్టిన ప్రభుత్వాల్లో తెలంగాణను నిలబెట్టిందని తెలిపారు."మాటలు కాదు... చేతలు. హామీలు కాదు... అమలు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత" అని మంత్రి పేర్కొన్నారు. రైతు కష్టానికి గౌరవం, పంటకు గిట్టుబాటు ధర, సాగుకు భరోసా, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.తెలంగాణ రైతాంగం కోసం ప్రతి నిర్ణయం తీసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతు సంక్షేమం, రైతు గౌరవం, రైతు ఆర్థికాభివృద్ధే తమ ప్రభుత్వ పరమావధి అని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. -
High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు
-
విజయవాడ: రైతులపై పోలీసుల దాష్టీకం
సాక్షి, విజయవాడ: ధర్నాచౌక్లో తీవ్ర ఉధ్రిక్తత చోటుచేసుకుంది. రైతులపై పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ధర్నా చౌక్లో రైతులపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. సీఎం ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు యత్నించగా.. బారికేడ్లు పెట్టి రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ధర్నాచౌక్, స్వర్ణపాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామని రైతులు అంటున్నారు.అన్నదాతల కష్టాలపై ఏపీ రైతు సంఘం నిరసనలు చేపట్టింది. పొగాకు, మామిడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, కౌలు రైతుల బకాయిలు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
వరంగల్: పంట పొలంలో ‘బంగారం’ కలకలం
సాక్షి, వరంగల్: పంట పొలంలో బంగారం కలకలం రేపింది. పంపకాల పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. చెన్నరావుపేట మండలం కోపాకులపాడులో ఈ ఘటన జరిగింది. ప్రతాప్ రెడ్డి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల పంట భూమిని బాలు అనే రైతు కౌలుకు సాగు చేసుకుంటున్నారు. పొలం దున్నుతున్న క్రమంలో బంగారం లభ్యమైంది. దీంతో కూలీలు - కౌలు రైతు మధ్య వాటాల పంచాయితీ మొదలైంది. గతంలో కూడా ఈ పొలంలో బంగారం దొరికిందని ప్రచారం జరుగుతోంది.బయటకు పొక్కడంతో పోలీసుల దృష్టికి బంగారం పంచాయతీ వచ్చింది. తనకు వాటా ఇవ్వాలని ఆరేళ్ల క్రితం భూమి అమ్మిన జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పొలంలో మరిన్ని బంగారు నిధులు ఉన్నాయంటూ కౌలు కోసం రైతులు పోటీ పడుతున్నారు. -
మేము దాడులు చేయలేదు.. ఉండవల్లి రైతుల కీలక వ్యాఖ్యలు
-
వాన నీరు ఇంకిస్తే చాలు!
ఎల్ నినోతో రుతుపవనాలు అస్తవ్యస్థంగా మారుతున్న పరిస్థితుల్లో బోర్వెల్స్ కింద వ్యవసాయం చేసే రైతులు వాన నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకునే పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే దానికంటే ఎక్కువ నీటిని తోడటం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు అడుగంటాయి. అనేక ప్రాంతాల్లో 200 నుంచి 400 మీటర్ల (650–1300 అడుగుల) లోతు వరకు కూడా బోర్వెల్లు, ట్యూబ్వెల్లు తవ్వడం సర్వసాధారణమైంది. భూగర్భ జలాల లభ్యత రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. భూమిలోకి తగినంత వాన నీటిని ఇంకింపజేసే (రీఛార్జ్) ప్రయత్నాలు చెయ్యకుండా భూగర్భ జలాలను నిరంతరం ఎక్కువగా తోడుతుండటమే సమస్య. బోరుబావులు నిత్యం జలకళతో కళకళలాడాలంటే వాటి దగ్గర రీఛార్జ్ గుంతలు లేదా నీటి కుంటలు నిర్మించుకోవటం మేలు అంటున్నారు నిపుణులు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని భూగర్భంలో గట్టి రాతి జల పొరలు విస్తరించి ఉన్నాయి. మట్టి కింద 5 నుంచి 15 మీటర్ల లోతు వరకు రాతి పొరలు ఉంటాయి. నీటిని ఎక్కువగా నిల్వ చేయగల సామర్థ్యం ఈ పొరలకే ఉంటుంది. రాతి సమూహాల మధ్య ఉండే పగుళ్లు భూగర్భ జలాల నిల్వకు, కదలికలకు దోహదపడతాయి. ఒక బోర్వెల్ ద్వారా రీఛార్జ్ అయ్యే వర్షపు నీటి పరిమాణం, అక్కడి భూగర్భంలోని జల పొరల లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. రాళ్లలో పగుళ్లు, చీలికలు బాగా ఉంటే బోర్వెల్స్ ద్వారా ఎక్కువ వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకుతాయి. కొన్నిసార్లు, ఈ పగుళ్ల అనుసంధానం చాలా పరిమితంగా ఉంటే వాన నీరు ఇంకే సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు. సాధారణ వాన నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా సుమారు 15% మాత్రమే భూగర్భంలోని పైపైన ఉండే నీటి పొరల్లోకి ఇంకుతోంది. సుమారు 20–40% ఆవిరైపోవచ్చు. లోతైన భూగర్భ జల పొరలు తిరిగి నిండటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. తక్కువ కాలం పాటు కురిసే భారీ వర్షాలను ఈ నిర్మాణాలు సమర్థవంతంగా సంగ్రహించలేకపోవచ్చు. ఇటీవలి కాలంలో లోతైన బోర్వెల్లను రీఛార్జ్ చేయడానికి, వాటి దిగుబడిని పెంచడానికి, సహేతుకంగా తక్కువ ఖర్చుతో ‘బోర్వెల్ రీఛార్జ్’ అనే పద్ధతి ఒక సమర్థవంతమైన విధానంగా ఆవిర్భవించింది.ఎండిన బోర్లకు తిరిగి జలకళఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దమగట్ల గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి తనకున్న రెండు ఎండిపోయిన బోరుబావులకు చుట్టూ వాన నీరు ఇంకేలా రీఛార్జ్ గుంతను నిర్మించారు. దీంతో ఆ బోరుబావులు వర్షపు నీటిని 70% వరకు భూమి లోపలికి ఇంకింపజేశాయి. ఆ బోర్లు తిరిగి జలకళను సంతరించుకున్నాయి. రోజంతా అపరిమితంగా నీటిని అందించడం ప్రారంభించాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి ఇప్పటికే ప్రచారం చేస్తున్న ఈ ప్రగతిశీల రైతు, బోర్ రీచార్జ్ గుంత ద్వారా నీటి భద్రత పొందటంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నందికొట్కూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా ఈ పద్ధతి ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి అనువైన ప్రాంతమని తమ పరిశీలనలో తేలిందని వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్ (డబ్ల్యూఎల్ఎఫ్) వ్యవస్థాపకులు డా. రామ్మోహన్ అన్నారు. నీటి కుంటలతో బోర్ల రీఛార్జ్నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, దాని పరిసర ప్రాంతాల్లో వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటల సాగు పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. బోరుబావులు విఫలమైనప్పుడు, వారు అధిక ఖర్చుతో రైతులు కొత్త బోరుబావులను వేయిస్తుంటారు. ప్రత్యక్ష రీఛార్జ్ ప్రయోజనం కోసం బోరుబావులకు దగ్గరగా వర్షపు నీటి నిల్వ కుంటలను నిర్మించుకుంటే భూమిలోకి నీరు బాగా ఇంకుతుందని డబ్ల్యూఎల్ఎఫ్ చెబుతూ రైతుల ఆలోచనా విధానంలో మార్పు తెస్తోంది. ఉన్న బోరుబావులను కాపాడుకోవడానికి బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించుకోవటానికి గత 2–3 సంవత్సరాలుగా చిన్న రైతులకు తోడ్పాటునందిస్తోంది. రైతులు తమ వంతుగా కొంత మొత్తం చెల్లిస్తే పొలంలో బోరుకు దగ్గరగా నీటి కుంటను ఏర్పాటు చేయిస్తోంది. తమ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, ఇప్పటివరకు 74 మంది రైతులు వర్షపు నీటి కుంటల నిర్మాణంతో లబ్ది పొందారని డా. రామ్మోహన్ తెలిపారు. బోరుకు 5 అడుగుల దూరంలో నీటి కుంట తవ్వుకుంటే బోరు నిండుగా నీరు పోస్తోందని నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అ΄్పాయిపల్లి గ్రామానికి చెందిన రైతు మార్కం రాములు యాదవ్ తెలిపారు. ఈ కుంటలో భవిష్యత్తులో చేపలు కూడా పెంచుతానన్నారు. 70% వాననీటి సంరక్షణబోర్వెల్ చుట్టూ వాన నీటి రీఛార్జ్ గుంతల నిర్మాణం, బోర్లకు దగ్గర్లో వ్యవసాయ చెరువుల నిర్మాణం వంటి పద్ధతులు కొద్దిపాటి వర్షం కురిసినా భూగర్భ జలాల పెంపుదలకు ఉపయోగపడతాయి. ఎల్నినో గడ్డు కాలాన్ని తట్టుకోవటానికి ఇవి ప్రభావశీలంగా పనిచేస్తాయి. పొలంలో కురిసిన వర్షపు నీటిలో 30 నుంచి 70% వరకు రీఛార్జ్ చేయడానికి వీలుంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, బోరుబావిలో నీటి మట్టం తక్షణమే పెరుగుతుంది. స్థానికంగా లభించే వస్తువులతో బోర్ రీఛార్జ్ గుంతలను, బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించవచ్చు. ఇవి సాపేక్షంగా చౌకైనవి. రైతులు సులభంగానే వీటిని నిర్వహించుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో రైతుల అనుభవాలు ఈ విషయాన్ని నిర్థారిస్తున్నాయి.– డా. ఆర్. రామ్మోహన్ (94401 94866), భూగర్భ జల నిపుణులు, వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్, సికింద్రాబాద్నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
తడవని మడి.. కంటతడి
తొలకరి పలకరించడంతో పత్తి విత్తనాలు నాటుకున్న ఈ రైతు పేరు సుధాకర్. మెదక్ జిల్లా బద్యతండాకు చెందిన ఈయన పది వేల రూపాయలు ఖర్చు చేసి ఎకరంలో పత్తి విత్తనాలు విత్తాడు. వర్షాలు లేకపోవడంతో మొలకలు రావడం లేదు. దీంతో సుధాకర్, అతని కుటుంబ సభ్యులు బకెట్లతో ఇలా నీళ్లు పోసుకుంటున్నారు. కనీసం ఈ నీళ్లతోనైనా మొలకలు వస్తాయనే ఆశతో ఉన్నారు. జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన రైతు మందరాజు మూడున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో సబ్సిడీ కింద వచ్చిన డ్రిప్ పైపులను గట్టు వెంట నేల కింద నుంచి 25 పైపులను ఏర్పాటు చేసి, 500 మీటర్ల దూరంలోని బోరునుంచి ఏర్పాటు చేసి పత్తి విత్తులకు సాగునీరు అందిస్తున్నారు. ఈయన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన మేకల నరేశ్. తనకున్న పది ఎకరాల భూమిలో ఏటా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తాడు. ఈ సీజన్లో వర్షాలు లేక పోవడంతో 8 ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. భూమిలో నీరు అడుగంటి పోగా గత ఏడాది వరకు రూ.5 లక్షల ఖర్చుతో 18 బోర్లు వేశాడు. అందులో ఒక్కటీ సక్సెస్ కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆయకట్టు రైతులు ముమ్మరంగా బోర్ల తవ్వకాలు చేపట్టారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నేటి వరకు నీటి వరద రాకపోవడంతో సాగునీటిపై రైతులకు ఆశలు సన్నగిల్లాయి. 20 ఏళ్ల నాటి కరువు ఛాయలు మళ్లీ అలుముకుంటుండటంతో రైతాంగం బోర్లు వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. చిలుకూరు, నారాయణపురం, రామాపురం, ఆర్లెగూడెం, పోలేనిగూడెం, బేతవోలు చుట్టుపక్కల గ్రామాలు రైతులు బావులవైపు మొగ్గుచూపుతున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఖరీఫ్ సీజన్కు అత్యంత కీలకమైన జూన్ మాసం నేటితో ముగుస్తుండటంతో రైతుల కళ్లన్నీ ఆకాశంపైనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు దాదాపు 15 రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించడం, వచ్చిన తర్వాత కూడా వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. మొత్తం 621 మండలాలకుగాను 485 మండలాల్లో సాధారణం నుంచి లోటు, భారీ లోటు ఉండగా, 86 మండలాల్లో భారీ, 216 మండలాల్లో లోటు, 183 మండలాల్లో సాధారణంగా నమోదైంది. ఉమ్మడి వరంగల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. హనుమకొండ జిల్లాలో 72 శాతంతో భారీ లోటు కాగా, వరంగల్ జిల్లాలో 57 శాతం, సిద్దిపేటలో 50శాతం లోటు ఉంది. ఇప్పటికే తొల కరి వానలను నమ్ముకుని పత్తి, మొక్క జొన్న, కంది తదితర పంటలు వేసిన రైతులు ఇప్పు డు మొలకలను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీరు పోయించడం, బిందెలతో మొక్క మొక్కకు నీళ్లు అందించడం వంటి అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భూగర్భజలాలపై చివరి ఆశ.. వానలు లేకపోవడంతో రైతులు భూగర్భజలాలపై ఆధారపడుతున్నారు. పాత బోర్లు ఎండిపోవడంతో కొత్త బోర్లు వేయిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మే నెలలో సగటు భూగర్భజలమట్టం 6.27 మీటర్లు, హనుమకొండలో 6.17 మీటర్లు, జనగాంలో 7.78 మీటర్ల లోతులో నమోదైంది. మరింత వర్షం లేకపోతే భూగర్భజలాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలపై నమ్మకం తగ్గడంతో కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నుంచైనా సాగునీరు అందుతుందేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో సీజన్ సాధారణంతో పోలిస్తే 25 శాతం లోపే సాగు జరిగింది. గోదావరి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఆశలు... ఇరిగేషన్ అధికారుల నివేదిక ప్రకారం వానాకాలం ప్రారంభమైనప్పటికీ ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు మిశ్రమంగా ఉన్నాయి. కృష్ణా బేసిన్లోని కీలక ప్రాజెక్టుల్లో చాలావరకు నిల్వలు తక్కువగా ఉండగా, గోదావరి బేసిన్లో కూడా పూర్తిస్థాయి నిల్వలు లేవు. అయితే గత ఏడాదితో పోలిస్తే మొత్తం ప్రధాన జలాశయాల్లో నిల్వలు మెరుగ్గా నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో 402.40 టీఎంసీలు ఉన్నాయి. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రధాన ప్రాజెక్టులు అల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల తదితర ప్రాజెక్టుల కింద 90–95 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు ఉంది. గోదావరి బేసిన్ సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మిడ్మానేరు, కడెం, శ్రీపాద ఎల్లంపల్లిల పరి«ధిలో 15.–18 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. అయితే కృష్ణా బేసిన్లో శ్రీశైలం, జూరాల, తుంగభద్రలో నిల్వలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. నాగార్జునసాగర్లో మాత్రం గత ఏడాదికంటే నిల్వలు మెరుగ్గా నమోదయ్యాయి. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మానేరు ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నిల్వలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు చేసే రైతులు వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. జూలై 15 డెడ్లైన్.. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం జూన్ 20 నుంచి జూలై 15 వరకు ప్రధాన ఖరీఫ్ విత్తనాల కాలం. ఆ తర్వాత విత్తితే... చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం. పంట ఎదుగుదల దెబ్బతినడం, దిగుబడులు తగ్గిపోవడం, కోత ఆలస్యమై మార్కెట్పై ప్రభావం పడే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. దీంతో రైతులు కూడా తక్కువ కాలంలో పండే, తక్కువ నీటితో వచ్చే పంటలు, కరువును తట్టుకునే వంగడాలపై దృష్టి పెడుతున్నారు.ఇప్పటికే కలుపు తీయాల్సింది.. నా ఐదు ఎకరాలతోపాటు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా.. ఇప్పటికే భారీ వర్షాలు కురిసి విత్తనాలు వేసుకుంటే కలుపునకు దౌరలు కొట్టి, ఎరువులు వేయాల్సింది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో విత్తనం వేసుకుంటున్నా. ఈ ఏడాది వానలు ఉండవని అంటున్నారు. కౌలు ముందే చెల్లించినా వానలు పడకుంటే నష్టపోవుడే. – పుప్పాల నాగేశ్, రైతు, నెన్నెల, మంచిర్యాల జిల్లానారు పోసి చూస్తున్న.. వానలు లేవు వానాకాలం ప్రారంభమై నెల రోజులైనా సరైన వర్షాలు లేక పంటలు వేయలేని పరిస్థితి. వరి నాట్లు వేద్దామని నారుపోసి నెలరోజులు గడుస్తున్నా వర్షం జాడలేదు. ఇప్పటివరకు ఖరీఫ్ సీజన్కు తగినంత వర్షాలు లేకపోవడంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్నాం. పత్తి విత్తనాలు పెట్టే సమయం కూడా దగ్గర పడుతుంది. బావులు, బోర్లు ఉన్న రైతులు పత్తి పంట వేసిన వాటికి సరిపడా నీటి తడి అందక మొలకెత్తే పరిస్థితి లేకుండాపోయింది.– ఈడబోయిన సారయ్య, రైతు, పీచర, హనుమకొండ జిల్లా -
ఆ రోజు దాడిలో కోడిగుడ్లు, రాళ్లు విసిరింది టీడీపీ గూండాలే
-
పవన్ కళ్యాణ్.. నిద్ర పోయావా? రైతులకు అన్యాయం జరిగితే మాట్లాడవా?
-
మధిర సభ రద్దు.. ‘రైతు భరోసా’పై రేవంత్ సర్కార్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రైతు భరోసా నిధుల విడుదల ఉండదా? అనే ఆందోళనలు రైతుల్లో వ్యక్తమైంది. అయితే.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సభా వేదికను హైదరాబాద్కు మార్చినట్లు ప్రభుత్వ వర్గాలు ఓ క్లారిటీ ఇచ్చాయి. మొదట మధిరలో భారీ బహిరంగ సభ నిర్వహించి, రైతుల సమక్షంలో రైతు భరోసా పథకం నిధులు విడుదల చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, మధిర పరిసరాల్లో కూడా ప్రతికూల వాతావరణం నెలకొనడం.. సభా ప్రాంగణంలో మోకాల లోతు నీరు చేరడంతో.. చివరి నిమిషంలో సభను రద్దు చేసింది.దీంతో రేపు (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.సభా వేదిక మారినప్పటికీ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిధులు జమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే మధిర సభను రద్దు చేసి హైదరాబాద్లో ఇండోర్ వేదికను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
విత్తనం నుంచి బీమా వరకు అన్నింటా సమస్యలే... ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
-
బాధితులే నిందితులా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన అచ్చోసిన పచ్చమూకలు ప్రజాస్వామ్యానికి పాడెకట్టి రోజుకో ఊరులో ఊరేగిస్తున్నాయి. ఎర్రబుక్కు సాక్షిగా రెండేళ్లుగా సాగుతున్న నారా మార్కు నరమేధం మధ్యయుగాల నాటి ఆటవిక పాలనకు అద్దం పడుతోంది. ప్రజలపైనా, ప్రజాస్వామికవాదులపైనా, ప్రతిపక్షాలపైనా యథేచ్చగా దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. వ్యవస్థలను తోలుబొమ్మలు చేసి ఆడిస్తూ రాష్ట్రాన్ని నారా‘కాష్టం’గా మార్చేస్తున్నారు. అధికారమదంతో చెలరేగిపోతూ ప్రత్యర్థులను నానా రకాలుగా హింసిస్తారు.. తిడతారు.. కొడతారు.. దారికాచి దాడులు చేస్తారు.. ఆస్తులు ధ్వంసం చేస్తారు.. బాధితులు లబోదిబో మంటూ పోలీసు స్టేషన్లకెళితే.. అప్పటికే అక్కడ పచ్చమూకలే తిష్టవేసుకునుంటాయి.. ఎదురు కేసులు సిద్ధంగా ఉంటాయి.. వ్యవస్థలన్నిటినీ దారుణంగా దిగజార్చేయడంతో అరాచకం రాజ్యమేలుతోంది.. స్థూలంగా ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. రాజధానిలో శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై దుర్మార్గంగా దాడి చేశారు.. కార్లు ధ్వంసం చేశారు. రాళ్లతో, కర్రలతో హత్యాయత్నం చేశారు. ఇందుకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులు కూడా.. కానీ విచిత్రంగా దాడికి గురైన వారిపైనే పోలీసులు ఆదివారం కేసులు పెట్టారు. దాడికి గురైన వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఏ చెత్తబుట్టలో పదేశారో ఎవరికీ తెలియదు..పోలీసుల సాక్షిగా బరితెగించిన టీడీపీ గూండాలు..మట్టి, ఇసుక మెక్కి మదమెక్కిన రౌడీ మూకలు మద్యం సేవించి మరీ పట్టపగలు పోలీసుల సాక్షిగా వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి తెగబడడం టీవీ చానళ్లు చూశాయి.. సోషల్ మీడియాలో వీడియోలు తిరిగాయి.. రాళ్లు రువ్విన రౌడీలను, కర్రసాము చేసిన కసాయిలను, గుడ్లు విసిరిన గూండాలను ప్రజలు చూశారు. పోలీసులు చూశారు. అయినా దాడికి గురైనవాళ్లపై కేసులు నమోదయ్యాయి. పెనుమాక రైతుల విజ్ఞప్తి మేరకు ఆ మార్గంలో వెళుతున్న రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై పట్టపగలు రాళ్లు, కర్రలతో హత్యాయత్నానికి దిగడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది. కానీ దాడిచేసినవారిది తప్పు కాదంట.. రైతు పరిరక్షణ కమిటీ నాయకులు అమరావతికి వెళ్లడమే తప్పట. వారికి ఏం పని? ఎందుకు వెళ్లారని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉందా లేక పాలస్తీనా– ఇజ్రాయిల్ సరిహద్దులోని గాజా ప్రాంతంలో ఉందా అని సగటు పౌరుడికి సందేహం రాకమానదు.. అమరావతికి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? లేక రాష్ట్రప్రభుత్వం నుంచి పచ్చమూకల నుంచి పర్మిషన్ తీసుకోవాలా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యే ‘నేను తెలంగాణ ఎందుకు రాకూడదు.. రావడమే కాదు రాజకీయం కూడా చేస్తా’నంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్లో చిందులు వేయడం అందరూ చూశారు. మరి పవన్ కల్యాణ్ ‘హైదరాబాద్ హమారా’ అనవచ్చు గానీ.. వైఎస్సార్సీపీ నాయకులు అమరావతిలో తిరగడం తప్పెలా అవుతుంది. దారిని పోతున్న మమ్మల్ని అడ్డుకుని, దాడి చేసి, కార్లు ధ్వంసం చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టడం ఏం న్యాయమని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయ్యా మేం పిలిస్తేనే వాళ్లు వస్తున్నారు అని పెనుమాక రైతులు కూడా చెబుతున్నారు. ఇవేవీ చంద్రబాబు బధిర సర్కారు చెవికెక్కడం లేదు.దాడికి గురైన వారిపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు..సిఆర్డిఎ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై శనివారం ఉండవల్లి సెంటర్లో జరిగిన దాడిలో నిందితులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నా వారిని అరెస్టు చేయకపోగా, బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. శనివారం పెనుమాక రైతుల కోరిక మేరకు వారి ఇబ్బందులను తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్తున్న సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. కార్యకర్తలు ముందస్తు వ్యూహంతో అడ్డుకోవడం, వారిపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ నేత నూనె ఉమామహేశ్వరరావు కార్లను ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షునితో పాటు లోకేష్ కోటరీలోని వ్యక్తులే స్వయంగా ఈ దాడులకు నేతృత్వం వహించారు. మహిళలతో కోడి గుడ్లు వేయించారు. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఇతర నేతలపై దాడికి దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారు. టీఎన్టీయూసీ నేత రాయపూడి కిరణ్బాబు విసిరిన రాయి పోలీసు కానిస్టేబుల్కు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంత జరిగినా తాడేపల్లి పోలీసులకు చీమ కుట్టినట్లు లేదు. పైగా తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేషన్కు పిలిపించుకుని రెండు మూడు సార్లు ఫిర్యాదును మార్చి చివరకు పెనుమాక గ్రామానికి చెందిన తెనాలి మాణిక్యం అనే మహిళా నాయకురాలితో ఫిర్యాదు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.ఇదీ తప్పుడు కేసు...పోలీసులు నమోదు చేసిన క్రైం నెంబర్ 412/2026 ప్రకారం శనివారం ఉదయం సుమారు 11.30 గంటలకు ఉండవల్లి గ్రామంలోని అమ్మ హోటల్ సెంటర్ వద్ద మాణిక్యంతో పాటు జంగాల భవాని తదితర మహిళలు ఉండగా, పానుగంటి చైతన్య, డైమండ్ బాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, లెళ్ల అప్పిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల నారాయణ (మూర్తి), మేక శివారెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డి తదితరులు కార్లలో అక్కడికి చేరుకుని అమరావతి రాజధాని, రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, వారిని ప్రశ్నించిన ప్రజలపై బెదిరించడంతో పాటు తనను, రాయపూడి కిరణ్బాబును కులం పేరుతో అవమానించారని, కొందరు నిందితులు చేతులు, కాళ్లు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై బీఎన్ఎస్ సెక్షన్లు 189(2), 115(2), 118(1), 131, 351(2), 79 , 190తో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 2015లోని 3(1)(ఆర్), 3(1)(ఎస్), 3(2)(వి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాస్తవానికి దాడులు చేసింది, కోడిగుడ్లు విసిరింది తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళా నాయకులే. కానిస్టేబుల్పై రాయితో దాడిచేసి గాయపరిచిన రాయపూడి కిరణ్బాబును కేసు నుంచి తప్పించేందుకే ఈ నాటకం ఆడుతున్నారు. తమపైనే దాడి జరిగిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య (ఫైల్) వైఎస్సార్సీపీ నాయకులపై సీఐ ఫిర్యాదు.. కేసు..తెలుగుదేశం పార్టీ పెద్దల డైరెక్షన్కు అనుగుణంగా... వారు తానా అంటే.. పోలీసులు తందానా అంటున్నారు.. తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు రెండాకులు ఎక్కువే చదివారు..... ఆయన స్వయంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసి 413/2026 కింద కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, పానుగంటి చైతన్య తదితరులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కార్లలో పెనుమాక గ్రామం వైపు వెళ్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఉండవల్లి సాయిబాబా ఆలయం సమీపంలో వారిని అడ్డుకున్నారని, అదే సమయంలో టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని అమరావతి రాజధానికి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో పోలీస్ చట్టం సెక్షన్లు 30, 30–ఏ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, అనుమతి లేకుండా ముందుకు వెళ్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు హెచ్చరించినప్పటికీ, మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా ఇతరులు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అంబటి రాంబాబుకు వర్తించే పోలీసు సెక్షన్ 30, 30–ఎ తెలుగుదేశం నాయకులకు ఎందుకు వర్తించడం లేదో పోలీసులే చెప్పాలి. ఉదయం నుంచి వంద మందికి పైగా మోహరించి రోడ్డుపై బైఠాయించినా వారిని అదుపులోకి తీసుకోలేదు. వారికి కాపలాగా నిలబడ్డారు. వారు వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లతో దాడులు చేస్తున్నా వారిని అదుపులోకి తీసుకోకుండా వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసేందుకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ప్రయత్నించారు. దీన్ని వారించడానికి వచ్చిన అంబటి రాంబాబును కూడా పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేయడంతో ఇరువురి మద్య తోపులాట జరిగింది. దీన్ని అడ్డం పెట్టుకుని సీఐ బీఎన్ఎస్ 223, 132, 3(5),పోలీస్ చట్టం, 1861లోని సెక్షన్లు 30, 30–ఏ కింద కేసు నమోదు చేశారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు తమపై హత్యయత్నం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు కట్టామని చెబుతున్న పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ను బయటపెట్టడం లేదు. ఆదివారం ఎమ్మెల్సీ మేకతోటి ఆరుణ్కుమార్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై జరిగిన దాడి వీడియోలు, సీసీ ఫుటేజ్, విడియోలు, ఫోటోలు అందచేశారు.మాజీ మంత్రులపై గతంలోనూ ఎదురుకేసులుతిరుమలలో లడ్డూ అంశంపై టీడీపీ చేస్తున్న విషప్రచారాన్ని నిరసిస్తూ చేసిన ఆందోళనలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం శ్రేణులు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిలపై దాడులకు పాల్పడటమే కాకుండా వారిపైనే తిరిగి కేసులు పెట్టారు.. గుంటూరు నగరం గోరంట్ల వద్ద తెలుగుదేశం ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పై దాడికి ప్రయత్నించడమే కాకుండా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అతని ఇంటిపై, కార్యాలయం పై దాడి చేశారు. ఏడు గంటలసేపు విధ్వంసం సృష్టించారు. తిరిగి అంబటి రాంబాబును ఆరెస్ట్ చేసి 18 రోజుల పాటు జైలులో ఉంచారు. దాడి చేసిన వారికి 41 నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి విధ్వంసం సృష్టించారు. పైగా అతనిపైనే తిరిగి కేసు పెట్టారు. తిరుపతి లడ్డు వ్యవహారం పై చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం బోయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి విడదల రజిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు జరుగుతుండగానే ఆలయం ముందుకు వచ్చి బరితెగించిన టీడీపీ గూండాలు హల్చల్ చేశారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న విడదల రజిని పై దాడి కి యత్నించారు. కారును అడ్డుకుని, ముందుకు కదలనివ్వకుండా చేసిన టీడీపీ గూండాలు. కారుపై చేతులతో గుద్దుతూ, దాడి చేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అనంతరం ఆమె పైనే తిరిగి కేసు పెట్టారు. -
ఏరువాక.. సాగేదెలా?
సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి. ఇది రైతుల పండుగ. తొలకరి చినుకులు నేలను తాకే వేళ.. వర్ష రుతువు ప్రారంభంలో జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ వేడుక ప్రకృతికి, మానవాళికి మధ్య విడదీయలేని అనుబంధానికి ప్రతీక. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి సూచికగా రైతులు కాడెద్దులను సిద్ధం చేసి.. వ్యవసాయ పరికరాలను అలంకరించి పూజలు చేసి.. సాగుకు శ్రీకారం చుడతారు. అలాంటి ఈ సంప్రదాయ పండుగ వాతావరణం రాష్ట్రంలో రెండేళ్లుగా రైతుల లోగిళ్లలో మచ్చుకైనా కన్పించడం లేదు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో అదనుకు సబ్సిడీ విత్తనం, ఎరువులు అందక ఓ వైపు నానా అగచాట్లు పడుతుంటే.. మరొక వైపు ముంచుకొస్తున్న ఎల్నినోను తట్టుకునేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించక పోవడంతో రైతులు తొలకరి సాగుపై ఆందోళనకు గురవుతున్నారు. సీజన్ ఆరంభంలోనే నకిలీ విత్తనాల బెడదఖరీఫ్ సాగు కోసం ఈసారి ముందస్తుగా సాగు నీటి విడుదలకు షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం, అందుకు తగినట్టుగా విత్తనాలను సరఫరా చేయలేక పోతోంది. ఖరీఫ్లో 6.73 లక్షల క్వింటాళ్ల విత్తనాలకు జిల్లాల నుంచి ఇండెంట్ రాగా, సబ్సిడీకి కోత పెట్టడంతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తన సరఫరాకు టెండర్లు పిలిచారు. పచ్చిరొట్ట విత్తనాలతో వేరుశనగ, కంది విత్తనాలు అరకొరగానే అందుబాటులో ఉంచగా.. వరి విత్తనాల పంపిణీ ఇంకా ప్రారంభించలేదు. మరో వైపు ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలే నాసిరకం కావడంతో అవి మొల కెత్తక రైతులు విత్తులోనే ఆర్థికంగా నష్టపోయారు. రెండేళ్లుగా అదునుకు యూరియా అందించలేని ప్రభుత్వం ఈ ఏడాది యాప్ ద్వారా సరఫరా అంటూ రైతులను నరకయాతనకు గురిచేస్తోంది. కట్ట (బస్తా) యూరియా కోసం సీజన్ ఆరంభంలోనే రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన అగత్యం ఏర్పడింది.కౌలు రైతులకు మళ్లీ మొండిచెయ్యేఅధికారంలోకి వస్తే ఏటా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన సూపర్ సిక్స్ హామీకి చంద్రబాబు సర్కారు తూట్లు పొడిచింది. తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.10,717 కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం.. రెండో ఏడాది ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టి అరకొర సాయం విదిల్చింది. ఈ ఏడాది తొలి విడతలో రూ.5 వేలు మాత్రమే జమ చేసింది. గతేడాదితో పోలిస్తే ఒక్కరంటే ఒక్క రైతు కూడా పెరగలేదు. మళ్లీ ఏడు లక్షల మందికి ఎగ్గొట్టారు. భూ యజమానులతో సమానంగా కౌలు రైతులు, దేవదాయ, అటవీ భూ సాగుదారులకు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయానికి మూడో ఏడాది కూడా ఎగనామం పెట్టింది. దీంతో కౌలు రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక పెట్టుబడి కోసం అప్పులు ఇచ్చే వారి చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నారు.అందని మోంథా నష్టపరిహారం.. అటకెక్కిన పంటల బీమాచంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించింది. ఏడాది తిరక్కుండానే స్వచ్ఛంద నమోదు బీమాకు సైతం మంగళం పాడేసింది. ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో ఇప్పటికే దాదాపు రూ.3,500 కోట్లకు పైగా బీమా పరిహారం అందకుండా పోయింది. బీమా కంపెనీలు ఏపీని బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో మూడో ఏడాది కూడా పంటల బీమాకు రైతులు దూరమైపోయారు. గతేడాది అక్టోబర్లో విరుచుకుపడిన మోంథా తుపానుతో నష్టపోయిన 3.42 లక్షల మంది రైతులకు రూ.411 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ 10 నెలలు గడుస్తున్నా చెల్లించలేని దుస్థితి నెలకొంది.కరువుతో పాటు ఇతర వైపరీత్యాల సాయం కూడా కలుపుకుంటే కనీసం రూ.1,100 కోట్లకు పైగా పరిహారం అందని పరిస్థితి. మరో వైపు గడిచిన ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యంతో సహా పత్తి, మొక్క జొన్న, పొగాకు, ఉల్లి, టమాటా, బత్తాయి, మామిడి ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క 2025–26లోనే 393 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రభుత్వమే ప్రకటించింది. కలవరపెడుతున్న ఎల్నినో ప్రభావంప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులకు తోడు ఎల్నినో ప్రభావం రైతులను కలవర పెడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, విశాఖ, కాకినాడ, ఉభయ గోదావరి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మైనస్ 20 శాతం నుంచి మైనస్ 59 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైందని తెలుస్తోంది. జూలై, ఆగస్టుల్లో తీవ్రమైన లోటు వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాదాపు 22.53 లక్షల ఎకరాల్లో సాగయ్యే వర్షాధార పంటలపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎల్నినోను తట్టుకునేలా కంటిజెన్స్ ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేని దుస్థితి నెలకొంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్లో ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థం కాక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మాత్రం తామేదో రైతులను ఉద్దరించినట్టుగా ఏరువాక పౌర్ణమిని పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం పట్ల అన్నదాతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.సంచి విప్పి చూస్తే అన్నీ పుచ్చులే నేను 5 ఎకరాల్లో ఖరీఫ్ సాగు కోసం సిద్ధమయ్యాను. ముందుగా భూ సారం కోసం శివపురం ఆర్బీకే ద్వారా 10 కేజీల జీలగు విత్తనాలు కొనుగోలు చేశాను. పొలంలో చల్లేందుకు విప్పి చూస్తే పూర్తిగా పుచ్చిపోయి ఉన్నాయి. వాటిని ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారుల దగ్గర మళ్లీ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలే ఇలా ఉంటే ఎలా?– సయ్యద్ అబ్దుల్, ముత్తరాయపల్లె, వైఎస్సార్ జిల్లాప్రభుత్వమే నాసిరకం విత్తనాలిస్తే ఎలా?నాకున్న 4 ఎకరాలలో పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుందామని దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామంలో మా బంధువులు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన జీలుగు విత్తనాల్లో కొన్ని తెచ్చుకున్నా. పొలంలో చల్లేందుకు ప్యాకెట్ విప్పి చూస్తే అన్నీ పుచ్చులే. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వమే ఇలా నాసిరకమైన విత్తనాలు సరఫరా చేస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.– నేలటూరు సుబ్బారెడ్డి, అరవిందనగర్, వైఎస్సార్ జిల్లానిజంగానే ‘రోజులు మారాయి’చంద్రబాబు పాలన అనగానే రైతన్నలు భయపడినంతా అయ్యింది.. రెండేళ్లుగా అన్నీ కష్టాలే.. ప్రభుత్వ పరంగా వ్యవసాయానికి ఏ విధంగానూ సహకారం లభించడం లేదు.. వ్యవసాయమే దండగ అన్న పెద్దమనిషి పాలనలో ఇంతకంటే ఏం ఆశించగలం అంటూ అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘నవ ధాన్యాలను గంపకెత్తుకొని.. చద్ది అన్నము మూట గట్టుకొని.. ముల్లు గర్రను చేతబట్టుకుని.. ఇల్లాలునీ వెంటబెట్టుకొని.. ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా.. నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా..’ అనే పాటను సరదాకైనా పాడుకోలేమని చింతిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడి అప్రజాస్వామికం
తాడేపల్లి రూరల్: పొలాలకు దారులు మూసేయడం, రిజర్వాయర్ల పేరిట 30 నుంచి 40 అడుగుల లోతున గోతులు తవ్వి పంటలను ముంచేయడం వంటి ప్రభుత్వ అరాచకాలను చూపించడానికి తామే వైఎస్సార్సీపీ ప్రతినిధులను పెనుమాక గ్రామానికి ఆహ్వానించామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. తమ సమస్యలు దేశానికే కాదు, ప్రపంచానికి తెలియాలంటే ఇలాంటి వారి సహకారం అవసరమని చెప్పారు.అమరావతిలో ప్రభుత్వ అరాచకానికి గురవుతున్న రైతుల పొలాలను పరిశీలించడానికి బాధిత రైతుల ఆహ్వానం మేరకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులను శనివారం ఉండవల్లి సెంటర్లో టీడీపీ గూండాలు అడ్డుకుని దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబు ప్రభుత్వం తమను ఏ విధంగా వేధిస్తోందో వివరించారు. రైతులకు రాజకీయాలతో సంబంధం లేదని, తమకు న్యాయం చేసే ఏ పార్టీ వారినైనా కలుస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కమిటీని అధికార పార్టీ అడ్డుకుని దాడులకు తెగబడటం అమానుషం, అప్రజాస్వామికమని మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న దారుణాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందన్నారు. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ల్యాండ్ పూలింగ్ చట్టం గడువు 2015 ఫిబ్రవరి 28 నాటికే ముగిసిందని, ఆ తర్వాత భూ సేకరణ మాత్రమే చేయాలని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా ఇప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ కిందే భూములు లాక్కుంటామని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిహారం రూ.5 లక్షలు, రూ.10 లక్షలే వస్తుందని భయపెడుతున్నారని, భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తెలిపారు.రిజిస్ట్రేషన్లు ఆపేశారని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు ఏవీ అందకుండా చేసి రైతులను ఆర్థికంగా, సామాజికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం లేకపోయినా 60 ఏళ్లుగా మూడు పంటలు పండించే అద్భుతమైన భూమిని ధ్వంసం చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా, అలైన్మెంట్లు మార్చినా తగ్గేదే లేదని, ప్రభుత్వ చట్టవిరుద్ధ విధానాలపై పోరాడతామని గట్టిగా చెప్పారు. వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీని మళ్లీ ఇక్కడికి రప్పించి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అమరావతి రైతులు హెచ్చరించారు. రైతులు ఇంకా ఏం మాట్లాడారంటే.. రోడ్ల అలైన్మెంట్లు మారుస్తూ కుట్రలు రోడ్ల అలైన్మెంట్లు మా పొలాల మీదుగా మార్చేస్తూ కుట్రలు చేస్తున్నారు. ఒక వ్యక్తి పొలం ఇవ్వగానే దాన్లో రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డును పక్క భూమిలోకి జరిపేస్తున్నారు. ఆ రైతును బెదిరించి పొలం తీసుకోగానే, దాని పక్కన ఎవరైతే భూమి ఇవ్వలేదో వారి పొలంలోకి వెళ్తున్నారు. ఇలా రైతుల భూమి ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. వందల ఏళ్ల నాటి పాత రోడ్లను మూసేశారు. కరెంట్ స్తంభాలు పడగొట్టారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగేది రెండే రెండు... ఒకటి కంప చెట్లు కొట్టడం, రెండోది నీళ్లు ఎత్తి పోయడం. వేరే ఏమీ లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటూ ఇటూ తప్ప లోపల ఎక్కడా ఎటువంటి అభివృద్ధీ లేదు.అంతా మోసపూరితం ప్రభుత్వం తీరు అంతా మోసపూరితమే. పొలాలు ఇవ్వమని అడుగుతున్నారు కానీ ప్లాట్లు ఎక్కడిస్తారో క్షేత్రస్థాయిలో చూపించరు. అంతా కాగితాల మీదే. పైగా ల్యాండ్ పూలింగ్ నిబంధనల్లో ‘అవసరమైతే ఈ ఇచ్చిన భూమిని కూడా మళ్లీ గవర్నమెంటే తీసుకుంటుంది‘ అని ఉంది. అంటే 70 శాతం ఉచితంగా తీసుకుని, మిగిలిన 30 శాతం కూడా ఇవ్వకుండా లాగేసుకుంటారా? ఈ విషయాన్ని నిబంధనల్లో ఎందుకు స్పష్టంగా పెట్టలేదు? గ్రామసభలు పెడితే అవి భూములు ఇవ్వని రైతుల కోసమా, ఇచ్చిన వారి కోసమా అనే క్లారిటీ అధికారులకే లేదు.సాయంత్రం 6 గంటలకు నోటీసు ఇచ్చి, మరుసటి రోజే మీటింగ్ అంటే అభ్యంతరాలు ఎలా చెప్పగలుగుతారు? ఏదైనా సమస్య వస్తే డిప్యూటీ కలెక్టర్ను అడిగితే ఆయనకేం తెలియదని, పొలం ఇస్తే తీసుకుంటామని అంటారు. కమిషనర్ను అడిగితే ఆయనకేమీ తెలియదని అంటారు. ఏమీ తెలియని కమిషనర్ ఇక్కడికి వచ్చి రైతులకు ఏం చెబుతారు? పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇష్టం వచ్చినట్లు భూములు లాక్కోవడానికి వీల్లేదు. ఆ చట్టాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించి, మమ్మల్ని వేధింపులకు గురిచేస్తోంది. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన భూములే తీసుకుంటానని, ఇవ్వని వారి జోలికి పోనని చంద్రబాబు ప్రమాణం చేశారు. మరి ఇప్పుడు అధికారులు ఆయనకు తెలియకుండానే నోటీసులు ఇస్తున్నారా? వీటిపై పాలకులు, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. – కొండమడుగుల రాఘవరెడ్డి, పెనుమాకక్షేత్రస్థాయిలో మా సమస్యలు చూపించాలని రమ్మన్నాం ఉండవల్లి, పెనుమాక, ఎర్రపాలెం, నిడమర్రు గ్రామాల రైతులమంతా కలిసి 25 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మా సమస్యలన్నీ వివరించాం. అండగా నిలవాలని అభ్యర్థించాం. మాకు అండగా ఉండటానికి లీడర్లు, లాయర్లతో ఒక టీమ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ 2024లోనే రోడ్లకి క్లియర్ చేసి మా పొలం మాకు విడిచిపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్లనీయడంలేదు. పొలాల చుట్టూ చెరువు తీస్తోంది. ఈ దారుణాలన్నీ చూపించాలనే మేము వైఎస్సార్సీపీ బృందాన్ని రమ్మన్నాం. కానీ వైఎస్సార్సీపీ నాయకులను అమరావతి రాకుండా అధికార పార్టీ అడ్డుకున్నదంటే ఇక్కడ జరుగుతున్న తప్పులు బయటపడకుండా, వాటిని కప్పిపుచ్చుకోవడానికే రానివ్వట్లేదని అర్థం. – మేకా వెంకటరెడ్డి, పెనుమాక కోర్టు ఆదేశానుసారం పరిహారం ఇవ్వకపోగా, నోటీసులిచ్చారు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2015 ఫిబ్రవరి 28తో ముగిసిపోయినా, ఇప్పటికీ పూలింగ్లోనే తీసుకుంటాం అంటున్నారు. భూములు ఇవ్వని వాళ్లను వేధిస్తున్నారు. ప్రభుత్వం కోర్టులో కేసు ఉపసంహరించుకొనే సమయంలో 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లుగా రిజి్రస్టేషన్లు ఆపేసి, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా నష్ట పరిచినందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్కి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఆ పరిహారం ఇవ్వకపోగా మళ్లీ భూ సేకరణ నోటీసులు ఇచ్చారు. అసలు మొదటి డీపీఆర్ ప్రకారం ఉండవల్లి, పెనుమాక అమరావతి పరిధిలోనే లేవు. చివర్లో యాడ్ చేసి మా భూములను లాక్కుంటున్నారు. సీఆర్డీఏ అధికారులు అక్విజిషన్ గురించి చెప్పకుండా, మళ్లీ పూలింగ్ గురించే మాట్లాడుతున్నారు. –నవీన్, పెనుమాక మా గొంతు నొక్కాలని చూస్తే భయపడంమా పొలాల పక్కన రిజర్వాయర్ల పేరుతో 40 అడుగుల లోతున గుంతలు తవ్వేస్తున్నారు, రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు అందకపోయినా, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వ్యవసాయం చేస్తున్నాం. కేవలం 10 అడుగుల్లోనే భూగర్భ జలాలు ఉన్న అత్యంత సారవంతమైన భూమి ఇది. 60 ఏళ్లుగా ఇక్కడ మూడు పంటలు పండిస్తూ అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పటికే రాజధాని కోసం 50 వేల ఎకరాలు తీసుకున్నారు. అక్కడ రాజధాని కట్టుకోండి. అంతేకానీ, సారవంతమైన భూములను ధ్వంసం చేయొద్దు. మా గొంతు నొక్కాలని చూసినా భయపడం. పోరాడుతూనే ఉంటాం. –శ్రీకాంత్, పెనుమాక -
వర్షం వచ్చినా సభ ఆగదు
చింతకాని: అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఈ వివరాలను 30వ తేదీన చింతకాని మండలం మత్కేపల్లిలో జరిగే రైతు ఆశీర్వాద సభలో వివరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా మత్కేపల్లిలో జరిగే రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రి పరిశీలించారు. వర్షం వచ్చినా సభ రెట్టింపు ఉత్సాహంతో జరుగుతుందని.. తమ పథకాలు కూడా అదే స్థాయిలో అమలవుతాయని పొంగులేటి తెలిపారు. దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని రాష్ట్ర రైతులు పండించినా మద్దతు ధరతో కొనుగోలు చేసి వారంలో డబ్బు జమ చేశామన్నారు. బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తున్నామని, రహదారుల నిర్మాణానికి పెద్దమొత్తంలో నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలిపారు. పదేళ్ల కాలంలో ప్రజా, రైతు సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ నేతలను ప్రజలు తిరస్కరించగా.. 30న జరిగే సభకు వచ్చే లక్షలాది మంది రైతులు, జనాన్ని చూస్తే బీఆర్ఎస్ నేతల గుండె పగలడం ఖాయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర చేసినా, పొర్లుదండాలు పెట్టినా కారు కూతలు కూస్తున్న వారిని ప్రజలు క్షమించబోరని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లోనూ వారి ఓటమిని స్వీకరించినట్టు తెలుస్తోందని చెప్పారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో ఇచ్చిన ఇళ్లలో 25 శాతం కూడా లేవన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి, కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్దత్, ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, కనకయ్య, రాగమయి పాల్గొన్నారు. ‘రైతు ఆశీర్వాద సభ’పై నేడు నిర్ణయం ఆదివారం సాయంత్రం గంట పాటు కురిసిన భారీ వర్షానికి సీఎం సభాప్రాంగణం నీటితో నిండి బురదమయంగా మారింది. సోమవారం రైతుమేళా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన 150 స్టాళ్లలో కొన్ని గాలులకు పడిపోయా యి. తొలుత రెండు రోజులు రైతు మేళా నిర్వహించాల నుకున్నా, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చిత్తడిగా మారడంతో ఆదివారం కార్యక్రమాన్ని రద్దు చేశారు. సోమవారం నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో రైతుమేళా నిర్వహించడం లేదని అధికారికంగా ప్రకటించారు. సభా ప్రాంగణ పరిస్థితులను సోమవారం పరిశీలించాక రైతు ఆశీర్వాద సభపై తుది నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ దివాకర ఒక ప్రకటనలో వెల్లడించారు. -
మా భూములు లాక్కోవడానికి నువ్వు ఎవడివి..? చంద్రబాబుపై పెనుమాక రైతుల ఆగ్రహం
-
ఎవడి సొమ్ము అని మా భూములు అడుగుతున్నావ్.. అసలు ఈ గొడవకు కారణం ?
-
వైఎస్సార్సీపీ నేతలపై అట్రాసిటీ కేసు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పీఎస్లో మరో కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి నవరత్నాల మూర్తితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.టీడీపీ నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు.ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. -
ఏపీ రాజధానిలో గూండారాజ్... రైతుల ఆహ్వానం మేరకు భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో తెలుగుదేశం మూకల దాడి
-
ఇది ప్రజాస్వామ్యమా.. నిరంకుశత్వమా!?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్: భూసేకరణ పేరుతో సీఎం చంద్రబాబు ఆడుతున్న నాటకాలు సహించేది లేదని గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. పది మందికి అన్నం పెట్టే రైతుల భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకుని ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి దోచిపెడుతుందని మండిపడ్డారు. నలుగురు ఉండే చంద్రబాబు కుటుంబానికి పచ్చని ఐదెకరాల భూమి అవసరమా? అని సూటిగా ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశ పాలనా అంటూ దుమ్మెత్తి పోశారు. ఇప్పటివరకు అవసరమైన రోడ్లకు, వాగులకు భూములను స్వచ్ఛందంగా ఇచ్చామని.. ఇంకా మా భూముల్లో వ్యాపారం చేస్తామంటే ఇచ్చేదిలేదని వారు తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులకు సీఆర్డీఏ నుంచి అందిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు శనివారం గుంటూరు కలెక్టరేట్లో సీఆర్డీఏ డెప్యూటీ కలెక్టర్ మధుసూదనరావును కలిశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. భూములను పిల్లలకిచ్చేశామయ్యా.. నాకు 1.60 ఎకరాల భూమి ఉంది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లళ్ల సమయంలో పిల్లలకిచ్చేశాం. ఇప్పుడేమో ప్రభుత్వం బలవంతపు భూసేకరణంటూ ఇబ్బందులు పెడుతోంది. పిల్లలకిచ్చి న భూమిని వారి అనుమతిలేకుండా ప్రభుత్వానికి ఎలా ఇవ్వగలం. ఈ ప్రభుత్వం మా కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. మా అనుమతులు లేకుండా భూములు తీసుకునే హక్కు ఎవరిచ్చారు? భగవంతుడ్నే నమ్ముకున్నాం. – ఎం.రమాదేవి, ఉండవల్లి రైతు చంద్రబాబు నివాసానికి ఐదు ఎకరాలా!?.. ఎంతో విలువైన రైతుల భూముల్ని తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదెకరాల్లో ఇల్లు నిర్మించుకోవడం అవసరమా? భూసేకరణలో కనీస నిబంధనలే కాదు, విధి విధానాలు కూడా పాటించడంలేదు. రైల్వేలో టీసీ ఉద్యోగం వదిలేసి 1995 నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఇది నాకు ప్రాణ సమానం. భూమికి మరణం ఉండదు. మా చివరి శ్వాస వరకు నా భూమిని ఎవ్వరీకీ ఇచ్చేదిలేదు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధం. – రఘునాథరెడ్డి, రైతు రైతుల అభిప్రాయాలకు విలువేది?.. నేను చిన్న రైతును. నాకు 95 సెంట్ల భూమి ఉంది. ఇందులో 25 సెంట్లు కుమార్తె వివాహ సమయంలో ఇచ్చేశాను. మిగతా భూమిలో గేదెలు, ఆవులు పెట్టుకుని, కూరగాయలు పండించుకుని జీవిస్తున్నా. కొండవీటి వాగు పక్కనే నా భూమి ఉంది. ప్రభుత్వ అవసరాలైన రోడ్డు, కాలువలకు భూమి ఇవ్వడానికి సిద్ధమే. మా భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఒప్పుకునేది లేదు. – తక్కెళ్లపాటి బక్కిరెడ్డి, రైతు అధికారులు వివరాలు ఇవ్వడంలేదు.. మా భూములు కావాలంటున్న సీఆర్డీఏ అధికారులు కనీసం అడిగిన వివరాలు కూడా చెప్పడంలేదు. వారు మా అభిప్రాయాన్ని తెలుసుకోవడం కంటే ప్రభుత్వ నిర్ణయం అమలుచేయడమే ముఖ్యంగా వ్యవహరిస్తున్నారు. నాకున్న 1.18 ఎకరాల భూమే నాకు ఆధారం. మొత్తం పూలింగ్కు ఇమ్మంటే ఏమైపోవాలి? – ఝాన్సీరెడ్డి, రైతు క్యాన్సర్ రోగితో ప్రభుత్వం ఆడుకుంటోంది.. కొన్నినెలలుగా నిద్రపోతే ఒట్టు. ఒకపక్క బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నా. మరోపక్క ప్రభుత్వ వేధింపులతో తల్లడిల్లుతున్నా. మా భూములపై మాకు హక్కులుండవా.. ఇదేం న్యాయం? కూటమి ప్రభుత్వంలో ఇంతటి అన్యాయం చేస్తారని అనుకోలేదు. ప్రభుత్వం మా ఉసురుపోసుకుంటుంది. – జి. శివకుమారి, రైతు కుటుంబంలో గొడవులవుతున్నాయి.. నాకున్న ఎకరం భూమి ఇద్దరు అమ్మాయిలకు వివాహ సమయంలోనే ఇచ్చేశాను. ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వం తీసుకుంటుందంటే అల్లుళ్లు ఊరుకుంటారా? ఈ వయస్సులో ఈ టెన్షన్ ఏంటో తెలీడంలేదు. – ఆర్. విజయలక్ష్మి, రైతు చంద్రబాబుకు భూదాహం.. చంద్రబాబుకు భూదాహం. అందుకే రైతులకు చెందిన వేల ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు అరాచకంపై కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ కనీసం ప్రశ్నించకపోవడం ధారుణం. రైతుల తరఫున రాజీలేని పోరాటంతో పాటు న్యాయపోరాటానికి సిద్ధమే. – మున్నంగి వీర శ్రీధర్రెడ్డి, రైతుఇంకెన్ని వేల ఎకరాలు తీసుకుంటారు?రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక విధానాలతో, బలవంతంగా రాజధాని ప్రాంతంలోని భూములను రైతుల నుంచి తీసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. దీనిని ఉపేక్షించేది లేదు. బెదిరించి భూములు లాక్కోవాలని చూస్తే భయపడేది లేదు. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే 50 వేల ఎకరాలకు పైగా భూమి ప్రభుత్వం చేతిలో ఉంది., ఇంకెన్ని వేల ఎకరాలు తీసుకుంటారు? – డాక్టర్ కన్నారావు నాయుడు, ఉండవల్లి రైతు -
రాజధానిలో గూండారాజ్
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అని అనుమానమొచ్చే రీతిలో నడిరోడ్డుపై అధికార పార్టీ గూండాలు చెలరేగిపోయారు. పోలీసుల సాక్షిగా రాళ్లు, కర్రలతో రెచ్చిపోయారు. కార్లు ధ్వంసం చేశారు. నాయకులను హత్యచేయాలన్నంత కసితో బరితెగించి వీరంగం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో మట్టి, ఇసుక తెగమెక్కి మదమెక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పై నుంచి అందుకున్న ఆదేశాలతో ఈ దుర్మార్గాన్ని ఒక పథకం ప్రకారం సాగించారు. తమకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాలని, తమ కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని రాజధాని గ్రామమైన పెనుమాక రైతులు చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై ఉండవల్లి సెంటర్లో జరిగిన ఈ హత్యాయత్నాన్ని చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకపాలనకు ఇదొక మచ్చుతునక మాత్రమే... సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: తెలుగుదేశం నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ముందు నుంచే దాడికి సిద్ధమైనా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, తన పీఏ సత్యనారాయణ ద్వారా లోకేశ్ ఈ మొత్తం దాడిని పర్యవేక్షించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజధానిలో పంట పొలాలు పూలింగ్కు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు, న్యాయ సహాయం అందించేందుకు రాజధాని (సీఆర్డీఏ) రైతుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు శనివారం ఉదయం పెనుమాకలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని అడ్డుకోవాలని టీడీపీ గూండాలు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో రాజధాని రైతుల ముసుగులో మంత్రి నారా లోకేశ్ టీమ్లోని ఓ వ్యక్తి.. రాజధానిలో అక్రమ మైనింగ్ నిర్వహించే మట్టి మాఫియాతో పాటు, కొంత మంది టీడీపీ కార్యకర్తలతో తాడేపల్లి మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ గో బ్యాక్ అంటూ ఆ పార్టీ నాయకులను కులం పేరుతో దూషిస్తూ ధర్నాకు దిగారు. ఈలోగా పెనుమాకలో పూలింగ్కు ఇవ్వని పంట పొలాలను నీట ముంచుతున్న రిజర్వాయర్ పనులను పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు మూడు కార్లలో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించిన సుమారు వంద మంది టీడీపీ మూక వారిని అడ్డుకుంది. ముందస్తు ప్రణాళికతో వారు కోడిగుడ్లు, రాళ్లు, కర్రలు తీసుకువచ్చినా అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్ రైతుల ఆహ్వానం మేరకు.. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు. ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెఎస్సార్సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య రాళ్లు, కోడిగుడ్లు విసురుతూ దాడి పోలీసులు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను వెనక్కు నెట్టుకుంటూ వెళ్లారు. అయినా సరే టీడీపీ రౌడీలు ఆగకుండా మరోసారి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో అంబటి, దేవినేని అవినాష్ మాట్లాడే యత్నం చేయగా టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టీడీపీ గూండాలు వెనక్కు తగ్గారు. ఆ తర్వాత పోలీసులను ముందు పెట్టుకుని టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నేతలను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఈ తతంగం సాగింది. చివరకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ నాయకులు అక్కడి నుంచి బయలు దేరారు. ఈ క్రమంలో వెనుక ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తలను టీడీపీ గూండాలు ముట్టడించి దాడిచేసే యత్నం చేశారు. ఒకానొక సమయంలో వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు పోలీసులు యత్నిస్తుండగా.. టీడీపీ గూండాలు దాడికి ముందుకు దూసుకొచ్చారు.టీడీపీ గూండా కిరణ్ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ ఇది మంత్రి లోకేశ్ డైరెక్షన్లో ప్రభుత్వ దాడి⇒ పేర్ని నాని ప్రయాణిస్తున్న కారుపై మంగళగిరి నియోజకవర్గ టీఎన్టీయూసీ నాయకుడు, మట్టి మాఫియా సూత్రధారి రాయపూడి కిరణ్, దొప్పలపూడి జ్యోతిబసు రాళ్లు విసిరి హత్యాప్రయత్నం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు కోడిగుడ్లు తీసుకొచ్చి అమాయక మహిళల చేతికి ఇచ్చి వారిచేత వీరికార్లపై విసిరేయించారు. మహానాడుకు చెందిన పల్లెపు హరి అనే రౌడీషీటర్ కారుపైకి ఎక్కి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అతని పక్కనే ఎస్ఐ ఉన్నా, కనీసం అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. ⇒ ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మట్టి మాఫియా, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడి చేసిన ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. రాజధాని ముసుగులో కార్యకర్తలకు దోచిపెట్టేందుకు మట్టి మాఫియాను ప్రోత్సహిస్తూ.. ఆ విషయం బయట పడకూడదనే రౌడీషీటర్లను ప్రోత్సహించి రాళ్ల దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు ⇒ వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తారని ఒక రోజు ముందే తాడేపల్లి సీఐ వీరేంద్రబాబుకు సమాచారం ఉన్నా, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా, తూతూ మంత్రంగా పది మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, తమపై దాడికి ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేయించిన దాడే అని, ఈ దాడిని ముఖ్యమంత్రి సభాముఖంగా సమర్థించడమే కాకుండా రైతులు దాడి చేస్తే తప్పేంటనే ధోరణిలో మాట్లాడటం దారుణం అన్నారు. ⇒ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దాడేనని స్పష్టం అవుతోందని చెప్పారు. నిరసన పేరుతో అడ్డుకోవడానికి వచ్చిన వారి వద్ద రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు ఉన్నా పోలీసులు అడ్డుకోకపోవడం చూస్తుంటే ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడిగానే కనపడుతోందని చెప్పారు. లోకేశ్ డైరెక్షన్లో భాగంగా ఆయన ముఖ్య అనుచరుడు సత్యనారాయణ స్వయంగా అక్కడే ఉండి ఈ దాడిని పర్యవేక్షించారని ఆరోపించారు.దాడికి టీడీపీ గూండాలను పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ ⇒ కాగా, టీడీపీ నేతల రాళ్ల దాడిలో చిత్తూరు జిల్లా స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ టి.చిన్న తంబి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడి చేసిన వారిపై కేసు పెట్టాల్సిందిపోయి.. తాడేపల్లి సీఐ వీరేంద్ర వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల ఇచ్చిన ఫిర్యాదులను పూర్తిగా మార్చి రాయించి మరీ తాడేపల్లి సీఐ స్వామిభక్తి ప్రదర్శించారు. ⇒ టీడీపీ మూకలు విరిసిన కోడిగుడ్లు అక్కడున్న అమాయక ప్రయాణికులపైనా పడటంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఇది పద్దతి కాదని సర్దిచెప్పబోయిన వారిని టీడీపీ రౌడీలు బెదిరింపులకు గురిచేశారు. ⇒ టీడీపీ గూండాల దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి శనివారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
‘భూములు ఇవ్వలేదనే కక్షతో వాగు గట్టు తెంచేసి నీళ్లు వదిలారు’
పెనుమాక: అధికారాన్ని అడ్డంపెట్టుకుని అరాచకం చేయడం మంచిది కాదని గుంటురు జిల్లా పెనుమాక రైతులు.. ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకు అండగా నిలవడానికి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేయడం అమానుషమన్నారు. రైతు పరిరక్షణ కమిటీకి తమ ఊరికి రావాలని ఆహ్వానించామని. వారిని టీడీపీ గూండాలు ఉండవల్లిలో అడ్డుకుని దాడులు చేశారరన్నారు. ఎప్పుడూ ఇలాంటి దాడుల సంస్కృతి చూడలేదన్నారు. మా బాధలు వినడానికి వైఎస్సార్సీపీ నేతలు వస్తే తప్పేంటి?, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం చేయడం మంచిది కాదు. రైతులకు అండగా ఉండటానికి వస్తే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయడం అమానుషం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. రాజధాని పేరుతో మా భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. మా పొలాల్లో రోడ్లు వేసి అక్రమంగా తవ్వుతున్నారు. భూములు ఇవ్వలేదన్న కక్షతో వాగు గట్టు తెంపేసి మా పొలాల్లోకి నీళ్లు వదులుతున్నారు. ఈ తరహా అరాచకం ఎప్పుడూ చూడలేదు’ అని పెనుమాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గుంటూరు కలెక్టర్ను కలిసిన రాజధాని రైతులు
సాక్షి, గుంటూరు: గుంటూరు కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవను కలిసిన రాజధాని రైతులు.. బలవంతపు భూ సేకరణపై వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ.. సీడ్ యాక్సిస్ రోడ్లకు భూములిచ్చి సహకరించామని.. భూ సేకరణకు మాత్రం తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలు మెరుగుపరచడం.. అంతేగానీ పెద్దపెద్ద భవనాలు నిర్మించడం కాదన్నారు.‘‘మా భూములు బలవంతంగా లాక్కోవడానికి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. మా ఊర్లో 3 వేల ఎకరాలకు పైగా భూమి ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ల్యాండ్ అక్విజేషన్పై మా అభ్యంతరం చెప్పాం. మేము భూములు ఇవ్వం. ఉండవల్లి రైతులను పరామర్శించడానికి వచ్చే వారిపై దాడులు చేయడం దారుణం’’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు, ఇసుక మాఫియా.. రైతు పరిరక్షణ కమిటీ నేతల కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పచ్చ గూండాల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. రైతులను పరామర్శించకుండా పరిరక్షణ కమిటీ సభ్యులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. -
ఖరీఫ్.. బహుపరాక్!
వాన కోసం..వర్షాలు కురవాలని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రం, ఎల్కతుర్తి మండలం సూరారం, కోతులనడుమ, ఆరెపల్లి, కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లిలో శుక్రవారం మహిళలు, గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ మహిళలు బోనాలు, నీటిబిందెలతో ఊరేగింపుగా తరలివెళ్లారు. గ్రామదేవతలు పోచమ్మ తల్లి, రేణుకాఎల్లమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.– ఎల్కతుర్తి/భీమదేవరపల్లి/కమలాపూర్సాక్షి, హైదరాబాద్: ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో వరి సాగు అధికంగా ఉండే జిల్లాల్లో ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సూచించింది. గతంలో ఎల్నినో తీవ్ర ప్రభావం చూపిన సంవత్సరాల్లో నమోదైన దిగుబడి నష్టాలను విశ్లేషించిన భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అన్ని రాష్ట్రాలకు జిల్లాల వారీ కంటింజెన్సీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు హైదరాబాద్లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (క్రిడా) కూడా ఇప్పటికే తెలంగాణ సహా వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలతో సమీక్షలు నిర్వహిస్తూ రైతులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై మార్గదర్శకాలు జారీ చేస్తోంది. గత కరువుల ఆధారంగా విశ్లేషణ ఎల్నినో ప్రభావంతో గతంలో ఎక్కువ నష్టం చవిచూసిన జిల్లాలను గుర్తించేందుకు ఐసీఏఆర్ 2002, 2004, 2009 సంవత్సరాల వ్యవసాయ ఉత్పత్తి గణాంకాలను పరిశీలించింది. ఈ మూడేళ్లలో దేశంలో తీవ్రమైన వర్షాభావం నమోదైంది. తెలంగాణలోనూ కరువు ప్రభావం అధికంగా కనిపించింది. సాధారణంతో పోలిస్తే 2002లో 19%, 2004లో 13%, 2009లో 23% లోటు వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావంతో 2002లో ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 22 శాతానికి పైగా తగ్గగా, 2004, 2009లో సుమారు 12 శాతం చొప్పున తగ్గింది. ఈ అధ్యయనం ఆధారంగానే కేంద్రం ముందస్తు కార్యాచరణ సూచనలు జారీ చేసింది. వరి అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాల్లో.. దేశంలో ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ముఖ్యంగా కాళేశ్వరం, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ వంటి సాగునీటి వనరులు పెరిగినా, వర్షాభావ పరిస్థితులు ఎదురైతే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటిపోతాయి. వర్షాలు ఆలస్యమవడం లేదా మధ్యలో దీర్ఘకాల విరామం ఏర్పడితే, అవసరమైన సమయంలో నీరందక వరి పొలాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల కింద ఉండే చివరి ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం రోజుల్లో సైతం నీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ప్రస్తుత ఎల్నినో పరిస్థితులు ఉత్తర తెలంగాణలో వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఐసీఏఆర్ హెచ్చరించింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగుతో పాటు పశ్చిమ తెలంగాణ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట వంటి ప్రధాన వరి జిల్లాలపై అధిక ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు తేల్చింది. క్రిడా.. కీలక సూచనలు హైదరాబాద్లోని క్రిడా రూపొందించిన కంటింజెన్సీ ప్రణాళికల్లో రైతులు అనుసరించాల్సిన పలు కీలక సూచనలు ఉన్నాయి. వర్షాలు ఆలస్యమైతే స్వల్పకాలిక వరి రకాలను ఎంపిక చేయడం, అవసరమైతే మొక్కజొన్న స్థానంలో జొన్న, సజ్జలు, పెసర, మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం, పుషి్పంచే దశలో రక్షణ నీటి తడులు ఇవ్వడం, ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయడం ఇందులో ఉన్నాయి. గ్రామస్థాయిలో విత్తన నిల్వలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 24 వరకు సాధారణంతో పోలిస్తే సుమారు 42 శాతం వర్షలోటు నమోదైంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 21 శాతం ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితి కొనసాగితే ఖరీఫ్ సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు. యాప్లో ఓటీపీలు రాక.. వేలిముద్రలు మ్యాచ్ కాక తిప్పలు
-
‘యాప్’.. యాతన
ఓటీపీ.. ‘దైవాధీనం’! మా గ్రామంలో దాదాపు 120 ఎకరాలకు పైగా దేవదాయ భూమిని 40 ఏళ్లుగా 150 మంది రైతులు సాగు చేస్తున్నారు. చాలా మందికి కౌలు కార్డులు లేవు. యూరియా కోసం వెళితే ఓటీపీ ఎవరి పేరిట వస్తుందో చెప్పలేకపోతున్నారు. ఆర్ఎస్కేకు వెళ్తే రెండ్రోజులు ఆగండి.. మాట్లాడి చెబుతాం అంటున్నారు. –కలారి రామారావు, పెదకల్లేపల్లి, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా సాక్షి, అమరావతి: వర్షాలు వచ్చేశాయ్.. సీజన్ మొదలైంది.. ఏరువాక వచ్చేస్తోంది.. కానీ దుక్కి దున్నాల్సిన రైతన్న దిక్కు తోచక దిక్కులు చూస్తున్నాడు. అదునులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి ఏరువాక సాగేలా రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు కాడి వదిలేసింది. ఎరువుల సరఫరా, వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు తెచ్చిన ‘యాప్’తో వ్యవసాయదారులు నానా అగచాట్లు పడుతున్నారు. యాప్ ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేయాలని అన్నదాతలు ఆందోళనలకు దిగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా గ్రామంలోనే ఎరువులు, నాణ్యమైన విత్తనాలతోపాటు సాగు ఉత్పాదకాలను అందించి ఆదుకున్నారని రైతన్నలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు దూరమై.. ఇన్పుట్ సబ్సిడీ అందక.. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతుంటే.. చంద్రబాబు సర్కారు ఎరువుల పంపిణీ బాధ్యతను సైతం గాలికొదిలేసి యాప్ల పేరుతో తమను యాతనకు గురి చేస్తోందని మండిపడుతున్నారు. సర్వర్ డౌన్.. యాప్ హ్యాంగ్ ఎరువుల పంపిణీని డిజిటలైజ్ చేసేందుకు జాతీయ సమీకృత ఎరువుల నిర్వహణ మాడ్యూల్ (ఐఎఫ్ఎఫ్ఎం) యాప్ ద్వారా కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎరువుల పంపిణీని చేపట్టగా.. మిగిలిన 26 జిల్లాల్లో ఏపీ వ్యవసాయ ఇన్పుట్స్ నిర్వహణ వ్యవస్థ (ఏఐఎంఎస్) యాప్ ద్వారా ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. యాప్ల వినియోగంపై నూటికి 90 శాతం మంది రైతన్నలకు అవగాహన లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రారంభించి 3 వారాలు గడుస్తున్నా యాప్లో సాంకేతిక, పరిపాలనా సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. రైతుల మొబైల్ నెట్వర్క్ అంతంత మాత్రంగా ఉండగా ఆర్ఎస్కేల్లో (రైతు సేవా కేంద్రాలు) సర్వర్ డౌన్/యాప్ హ్యాంగ్ సమస్యలతో రేపు రండి.. మాపు రండి అంటూ పంపేస్తున్నారు. యాప్లో రైతు వివరాలు, ఈ–క్రాప్, వెబ్ల్యాండ్, ఆధార్, మొబైల్ నంబర్ అనుసంధానం కాకపోవడం, సకాలంలో ఓటీపీలు రాక, వేలిముద్రలు మ్యాచ్కాక తరచూ ఓటీపీలు, వేలిముద్రలు విఫలమవడం, బిల్లింగ్ ఆలస్యమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మొబైల్ ఓటీపీ, ఎంపిన్, ఫొటో, జియో ట్యాగింగ్, ఫీల్డ్ వెరిఫికేషన్ లాంటి దశలు రైతులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. సొంత భూమి ఉన్న రైతులకు రికార్డుల్లో చిన్న పొరపాటు ఉన్నా ఎరువుల కొనుగోలు ఆగిపోతోంది. ఫలితంగా కట్ట యూరియా కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. కౌలు రైతుల పాట్లు వర్ణనాతీతం యాప్ ద్వారా ఎరువులు పొందేందుకు కౌలు రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సీసీఆర్సీ కార్డు, ఈక్రాప్ లింక్ కాకపోవడం, సరైన సాగు వివరాలు నమోదు కాకపోవడం, భూ యజమాని అనుమతి లేకపోవడం, రికార్డుల్లో భూ యజమాని పేరు సరిగ్గా లేకపోవడం, మ్యుటేషన్ కాకపోవడం, భూ రికార్డులలో మ్యాపింగ్ కాకపోవడం లాంటి సమస్యలు కౌలు రైతులను వేధిస్తున్నాయి. ఓటీపీలు భూ యజమానుల ఫోన్కు వస్తుండటం, వారు అందుబాటులో లేకపోవడం, ఓటీపీ అప్లోడ్కు కేవలం 30 సెకన్లు మాత్రమే సమయం ఉండడం పెద్ద సమస్యగా మారింది. దీంతో 2–3 సార్లు ఓటీపీ జనరేట్ అవుతున్నా సకాలంలో అప్లోడ్ చేయలేకపోవడంతో చివరికి బుకింగ్ రద్దై మళ్లీ మొదటి నుంచి రైతు వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. మరోవైపు రైతులు ఎంచుకున్న డీలర్ పాయింట్ల వద్ద భౌతికంగా ఎరువులు ఉన్నా యాప్లో స్టాక్ అప్డేట్ కాకపోవడంతో ‘నో స్టాక్’ అని బుకింగ్ సమయంలో వస్తోంది. మొబైల్ నెట్వర్క్ పెద్దగా లేని ఏజెన్సీ, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ కత్తిమీద సాములా తయారైంది. సర్వర్ డౌన్ అయింది.. తరువాత రండి అంటూ తిప్పి పంపేస్తున్నారు. దేవదాయ, అటవీ, వక్ఫ్, అసైన్డ్, సొసైటీ లంక భూములు సాగుచేసే రైతులైతే బుకింగ్ కోసం అల్లాడుతున్నారు. ఎవరి పేరిట ఓటీపీ జనరేట్ అవుతోందో అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎమ్మార్పీకి మించి అమ్మకాలు కొంతమంది డీలర్లు అధికారులతో కుమ్మక్కై దొడ్డిదారిన యూరియా బస్తా రూ.350 నుంచి రూ.500, డీఏపీ రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు, జీ.సిగడం మండలాల్లో పలువురు డీలర్లు గురువారం రోజు ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరపడమే కాదు.. రసీదులు అడిగితే రైతులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లా కొడమూరు మండలం రాజుపాలెంలో సుమారు 50 మంది రైతులు స్థానిక ఆర్ఎస్కేకు వెళ్తే సర్వర్ డౌన్ అనే సాకుతో తిప్పి పంపేశారు. తంటాలు పడి ఎరువులు బుక్ చేసుకున్నా మాగాణి, మెట్ట ప్రాంతాలు, పంట రకాలతో సంబంధం లేకుండా ఎకరాకు యూరియా, డీఏపీ రెండు బస్తాలకు మించి ఇవ్వడం లేదు. ఏ పంటకు, ఏ దశలో, ఏ ఎరువు ఎంత మోతాదులో అవసరమవుతుందో పంటల వారీగా అంచనా వివరాలను యాప్లో పొందుపరిచారు. అంతకు మించి ఒక్క బస్తా కూడా అదనంగా సరఫరా చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. నాట్లు వేసిన 15–20 రోజుల్లో యూరియా అవసరం. కానీ అదునుకు యూరియా దొరకని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఈ దురవస్థ ఏమిటని వాపోతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల మోత.. రైతన్నలకు వాత కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులకు పెనుభారంగా మారుతున్నాయి. 2023–24 సీజన్తో పోలిస్తే బస్తాపై రూ.750కి పైగా పెరిగాయి. సూక్ష్మసేద్యంలో వినియోగించే డ్రిప్ ఎరువుల ధరలు గతేడాది 25–50 శాతం మేర పెరిగాయి. ముడిసరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో ఈ ఏడాది మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. దీనివల్ల సీజన్లో కనీసం రూ.700 కోట్లకు పైగా రైతులపై అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.నాడు.. ఇంటికే ఎరువులువైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య రైతన్నలకు వ్యయప్రయాసలు లేకుండా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఎరువులు సరఫరా చేసింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆర్బీకేల ద్వారా ఎరువుల అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో 10,611 ఆర్బీకేలకు లైసెన్సులు జారీ చేసింది. పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు కంపెనీల నుంచే నేరుగా ఆర్బీకేలకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా 34.11 లక్షల మంది రైతులకు 13.75 లక్షల టన్నుల ఎరువులను గ్రామం పొలిమేర దాటాల్సిన అవసరం లేకుండా ఇంటి ముంగిటికే సరఫరా చేసింది. ఫలితంగా లోడింగ్, అన్లోడింగ్, రవాణా చార్జీల రూపంలో ప్రతి రైతుకు బస్తాకు రూ.20–30 చొప్పున ఆదా అయ్యింది. ఇలా ఐదేళ్లలో అన్నదాతలకు మొత్తం రూ.వంద కోట్లకుపైగా ఆదా జరిగింది. అన్నిటికి మించి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అగత్యం తప్పింది. బ్లాక్ మార్కెట్ బెడద లేకుండా పోయింది. అలాంటిది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పొలం పనులు వదిలేసి మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు యాప్ల పేరుతో వారిని ముప్పుతిప్పలు పెడుతోంది. తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది కంపెనీలు, డీలర్ల స్థాయిలో జరిగే ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టకుండా రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోంది. ఎరువులు దొరకడం లేదని కౌలు రైతులు సాగు చేయడం మానేస్తే లక్షలాది ఎకరాలు బీడు వారతాయి. యాప్ విధానం వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃసమీక్షించి భూమి సాగు చేసే వారికి డిమాండ్ మేరకు ఎరువులు సరఫరా చేయాలి. – ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవంకేంద్ర జలశక్తి మంత్రి పాటిల్సహా ముఖ్యమంత్రుల హాజరుసాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యామ్కు నూతనంగా అమర్చిన 33 గేట్ల ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్సహా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సమీపంలోని మునీరాబాద్లో జరిగిన సభలో కేంద్ర మంత్రి పాటిల్ మాట్లాడుతూ పేరుకుపోయిన పూడికను తొలగిస్తే డ్యామ్లో 30 శాతం నీటి నిలువ పెరుగుతుందని తెలిపారు. పూడిక తొలగింపునకు సాంకేతిక సహకారాన్ని కేంద్రం అందిస్తుందని పేర్కొన్న ఆయన, ఇక తదుపరి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అంగీకరించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. నదుల అనుసంధానం జరగాలన్న కేంద్రం సంకల్పానికి ఇది మరింత బలం చేకూరుస్తుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో నదుల అనుసంధానం విజయవంతం అవుతుందన్న విశ్వాసం ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం గేట్లను పునరుద్ధరించడం లక్షలాది మంది రైతుల కన్నీరు తుడిచే గొప్ప పరిష్కారంగా అభివర్ణించారు. ఇది మూడు తరాల సమస్యకు పరిష్కారమని అన్నారు. మూడు రాష్ట్రాల రాష్ట్ర రైతుల హితం కోసం తుంగభద్ర డ్యామ్లో నీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పరస్పరం పొగడ్తల వర్షం!! చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకోవడం వారిద్దరి మధ్య గురుశిష్యుల బంధాన్ని మరోసారి బయటపెట్టింది. ‘రేవంత్ రెడ్డి నా శిష్యుడు. డ్యాషింగ్, డైనమిక్ సీఎం. అన్ని విషయాలపై తరచూ చర్చించుకుంటాం. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయం. రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజీ పడరు. చురుకైన నాయకుడు’ అని చంద్రబాబు పొగిడితే, ‘చంద్రబాబు నాయుడు రాజకీయంగా నాకు గురువు. పాలనలో ఆయన అనుభవం, దేశానికి ఆదర్శం. సాంకేతిక పరిపాలనలో చంద్రబాబు మార్పులు తెచ్చారు. ఆయన దూరదృష్టి దేశానికి ఆదర్శం. రాజకీయ జీవితంలో చంద్రబాబు నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, డీకేలు కూడా ఒకరికొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. -
‘కాయ’కష్టం వృథా!
కాణిపాకం/గంగాధరనెల్లూరు: రైతుల కాయ కష్టం వృథా అయిపోయింది. నిండా వ్యథ మిగిల్చింది. చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలోని ఓ గుజ్జు (పల్ప్) ఫ్యాక్టరీలో మామిడికాయల కొనుగోళ్లు స్తంభించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి కొనుగోళ్లు నిలిచిపోగా, గురువారం కూడా పునఃప్రారంభం కాలేదు. శుక్రవారమూ కొనుగోళ్లు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా వందలాది ట్రాక్టర్లు నిలిచిపోయాయి.కొందరు రైతులు ఐదు నుంచి ఏడు రోజులుగా అన్న్లోడింగ్ కోసం ఎదురుచూస్తున్నామని, రేయింబవళ్లూ నిద్రాహారాలు లేకుండా ట్రాక్టర్ల వద్దే ఉంటున్నట్టు ‘సాక్షి’కి చెప్పారు. అన్లోడింగ్ చేయకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో వేడికి కాయలు కుళ్లిపోవడం, నాణ్యత దెబ్బతింటుందని గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఫ్యాక్టరీలో కన్వేయర్ బెల్ట్ దెబ్బతినడంతో కొనుగోళ్లు నిలిపివేశామని, మరమ్మతులు పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఇప్పటికే భారీగా కాయలు ఫ్యాక్టరీకి చేరుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇలా అయితే నిండా మునిగిపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.టమాటా రైతు కంట కన్నీరు15 కిలోల టమాటా బాక్సు రూ.100పలమనేరు: మొన్నటి దాకా బాక్సు ధర రూ.500 దాకా పలికి రైతుల్లో ఆశలు రేకెత్తించిన టమాటా ఉన్నట్టుండి నిరాశ మిగిల్చింది. ధర రూ.100కు పడిపోయింది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటకు ధర రాకపోవడంతో రైతులు కుమిలిపోతున్నారు. చివరకు కూలి కూడా దక్కడం లేదని, అప్పులే మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. పలమనేరు మార్కెట్కు గత నాలుగైదు రోజుల నుంచి టమాటాలు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో 30 లోడ్లు వస్తుండగా ఇప్పుడు 50 లోడ్లకు చేరింది. దీంతోపాటు అనంతపురం, అన్నమయ్య జిల్లాల సరుకుతోపాటు స్థానికంగా టమాటా సాగు పెరిగి ఇక్కడి సరుకు ఎక్కువగా మార్కెట్కు చేరుతోంది. దీంతో వ్యాపారులు టమాటా కొనేందుకు ఆసక్తిని చూపడం లేదు. డిమాండ్కు మించి సరఫరా ఉండడమే ధరాఘాతానికి కారణమని మండీ వ్యాపారులు చెబుతున్నారు. కాగా, పలమనేరు మార్కెట్లో గురువారం టాప్ ధర (15కిలోల) బాక్సు రూ.170 కాగా సగటు ధర బాక్సు రూ.100గా పలికింది. -
వ్యవసాయ రుణాలు రైతులకు కాదా?
‘భారత రైతులు అప్పుల్లోనే పుడతారు, అప్పుతోనే జీవిస్తారు, అప్పుతోనే చని పోతారు, అప్పునే వారసత్వంగా వదిలి పెడతారు’ అని బ్రిటిష్ అధికారి సర్ మాల్కం డార్లింగ్ 1925లో రాశారు. అది వలస పాలన మీద నిందగా ఉద్దేశించింది. వంద సంవత్సరాల తర్వాత, జాతీయీకృత బ్యాంకులు, ప్రాధాన్య రంగ రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వయం సహాయక బృందాలు, రూ.2.5 లక్షల కోట్లకు పైగా రుణమాఫీలు జరిగిన తర్వాత కూడా– 2013 పార్లమెంట్ రికార్డులు చూస్తే, 52 శాతం వ్యవసాయ కుటుంబాలు ఇంకా అప్పుల్లో ఉన్నాయి. మాల్కం డార్లింగ్ మాటలు ఇప్పుడు స్వతంత్ర భారతదేశం మీద నిందగా మారాయి.ఎన్ఎస్ఎస్ఓ 2018 ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో 92.9 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. తెలంగాణలో 89.1 శాతం. ఇవి బ్యాంక్ శాఖలు, స్వయం సహాయక సంఘాలు అత్యధి కంగా ఉన్న రాష్ట్రాలు. ఈ నివేదిక ప్రకారం ఏపీ రైతు సగటు అప్పు రూ.1,23,400 కాగా, సంవత్సర ఆదాయం రూ. 1,25,760. ఇదే తెలంగాణలో ఆదాయం రూ. 1,12,836, అప్పు రూ. 1,52,000. ఈ అప్పు–ఆదాయ నిష్పత్తులు చూస్తే ఎక్కువ రుణాలు ఎప్పటికీ పరిష్కారం కావని అర్థమవుతుంది.వ్యవస్థలో ఆరు లోపాలు1. ఏపీ, తెలంగాణలో సాగు భూమిలో 30–40 శాతం కౌలు రైతులు సాగు చేస్తున్నారు. వారికి భూమి పట్టా లేదు కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డు రాదు. ప్రభుత్వం రూ.20,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న వడ్డీ రాయితీ పథకం పట్టా ఉన్నవారికే వర్తిస్తుంది. దున్నే రైతుకు రుణం రాదు; దున్నని భూయజమానికి వస్తుంది.2. 1975లో చిన్న రైతుల కోసం ప్రత్యేకంగా స్థాపించిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 1991 తర్వాత వ్యాపార బ్యాంకుల్లా మారిపోయాయి. 3. వ్యవసాయ రుణాలు 2000ల దశకంలో గణాంకాల్లో పెరిగాయి– కానీ రైతుకు అనుభవంలోకి రాలేదు. కారణం ఏమిటంటే, ‘వ్యవసాయ రుణం’ అనే నిర్వచనాన్ని విస్తరించారు. అగ్రి–ప్రాసెసింగ్ కంపెనీలకు, గ్రామీణ మౌలిక సదుపాయాలసంస్థలకు ఇచ్చిన రుణాలు కూడా వ్యవసాయ రుణాల లెక్కలోకి వచ్చాయి. 4. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణానికి ఎలాంటి హామీ అడగకూడదని ఆర్బీఐ నిబంధన చెప్తోంది. కానీ బ్యాంకులు సర్వే నంబర్ లేకుండా వడ్డీ రాయితీ క్లెయిమ్ చేయలేవు కాబట్టి ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. 5. హిందూ రుణచట్టంలో ‘దమ్దుపత్’ అనే పురాతన సూత్రం ఉంది– ఒకే సమయంలో వసూలు చేయగలిగే వడ్డీ అసలు మొత్తాన్ని మించకూడదు. ఇది కర్ణాటక మనీలెండర్స్ యాక్ట్ సహా అనేక రాష్ట్రాల రుణ చట్టాల్లో పొందుపరచబడింది. ఆర్బీఐ కూడా ఈ విషయమై స్పష్టమైన ఆదేశం జారీచేసింది. అయినా ఉల్లంఘించబడుతోంది. పంట రుణం బాకీ పడినప్పుడు – కరవు తర్వాత, ధర పతనమైన తర్వాత, వర్షాలు విఫలమైన తర్వాత ఇది సాధా రణంగా జరుగుతుంది. ఖాతాపై సాధారణ వడ్డీతో పాటు పెనాల్టీ వడ్డీ కూడా పడుతుంది. ప్రతి మూడు నెలలకు కాంపౌండ్ అవుతుంది. ఖాతా నాన్–పర్ఫార్మింగ్ అసెట్గా వర్గీకరించబడిన తర్వాత కూడా వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. రెండు మూడు సంవత్సరాల బాకీ తర్వాత, రూ.50,000 స్వల్పకాలిక పంట రుణంపై పేరుకు పోయిన వడ్డీ అసలును దాటిపోతుంది. ఆ సమయంలో బ్యాంకు ఆర్బీఐ ఆదేశాన్ని నేరుగా ఉల్లంఘిస్తోంది. రైతుకు ఈ నిబంధన తెలియదు. బ్యాంకు అసలు, పేరుకుపోయిన మొత్తం వడ్డీ రెండూ చెల్లించమని సెటిల్మెంట్ చర్చలు జరుపుతుంది. అనధికారికరంగంలో ఉల్లంఘన మరింత ప్రత్యక్షంగా ఉంటుంది. 36–60 శాతం వడ్డీకి అప్పిచ్చే మనీలెండర్ రెండు మూడేళ్లలో అప్పునురెట్టింపు చేస్తాడు– ఎలాంటి నియంత్రణ లేకుండా.6. బ్యాంకుల రుణంలో 18 శాతం వ్యవసాయానికి ఇవ్వాలని చట్టం. కానీ – (అ) ‘వ్యవసాయ రుణం’ నిర్వచనంలో కార్పొరేట్ ఫుడ్ కంపెనీలను చేర్చారు; (ఆ) పీఎస్ఎల్సీ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడం ద్వారా బ్యాంకులు ఒక్క రైతుకూ రుణం ఇవ్వకుండా లక్ష్యాలు చేరుకుంటున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ సర్టిఫికెట్ల మార్కెట్ రూ.9 లక్షల కోట్లు (మొత్తం వ్యవసాయ రుణ వితరణ కంటే ఎక్కువ); (ఇ) లక్ష్యం తప్పిన బ్యాంకులు నాబార్డ్ ఆర్ఐడీఎఫ్ ఫండ్లో డబ్బు వేస్తాయి. ఆ డబ్బు రాష్ట్ర మౌలిక సదుపా యాలకు వెళ్తుంది, రైతులకు కాదు.మూడు సంస్కరణలు1. వడ్డీ రాయితీ సాగు చేసేవారికి చేరాలి, పట్టా ఉన్నవారికి కాదు: సాగు చేయనివాళ్లకు సాగుకోసం ఇచ్చే వడ్డీ రాయితీ చట్ట పర మైన నేరంగా పరిగణించాలి. పంట బీమా (పీఎంఎఫ్బీవై) నమోదు, పీఎం–కిసాన్ రిజిస్ట్రేషన్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు (జేఎల్జీ) లేదా రైతు ఉత్పత్తిదారు సంఘాలు (ఎఫ్పీఓ) సభ్యత్వం – ఇవన్నీ సాగు ఆధారాలు. జేఎల్జీలు, ఎఫ్పీఓలు ధ్రువీకరణ, రుణ వితరణ వేదికలుగా పని చేయాలి.2. రుణమాఫీ బదులు రుణ మార్పిడి: రుణమాఫీలు సంస్థాగత రుణాలనే రద్దు చేయగలవు– అదే అత్యంత నష్టపడిన రైతులు తీసుకున్న మనీలెండర్లు, ఇన్ పుట్ డీలర్ రుణాలను తాకలేవు. రుణ మార్పిడి నిర్మాణం ఇందుకు మెరుగైన పరిష్కారం. గ్రామసభ ద్వారా రూ.25,000 కంటే ఎక్కువ అన్ని అనధికారిక రుణాలను సర్వే చేయాలి. ప్రభుత్వ హామీతో ఒక డెట్ కన్వర్షన్ ఫండ్... మనీలెండర్ నుండి రుణాన్ని అదే మొత్తానికి కొనుగోలు చేయాలి. రైతు అప్పు 7 శాతం వడ్డీతో అధికారిక రుణంగా మారుతుంది,పంట కాలానికి అనుగుణంగా వాయిదాలు ఉంటాయి. పంట నష్టం జరిగితే వాయిదా పడుతుంది, డిఫాల్ట్ అవ్వదు. కేరళ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం ఇప్పటికే చేసింది.3. చిన్న–సన్నకారు రైతుల 10 శాతం ఉప–లక్ష్యాన్ని పీఎస్ఎల్సీ సర్టిఫికెట్ కొనుగోలు ద్వారా చేరుకోకుండా నిరోధించాలి. ప్రత్యక్ష రుణ వితరణే ఆమోదయోగ్యం కావాలి. ‘వ్యవసాయ రుణం’ నిర్వచనం నుండి అగ్రి–బిజినెస్ కంపెనీలను తొలగించాలి. మాల్కం డార్లింగ్ వ్యాఖ్యకు ప్రాసంగికత పోయిదా? ప్రాధాన్య రంగ రుణం కార్పొరేట్కు వెళ్ళింది. రూ.2.5 లక్షల కోట్ల రుణ మాఫీలు కౌలు రైతును తాకలేదు. హామీ లేని రుణం హక్కు కాగితంపైనే ఉంది. వడ్డీ పరిమితి చట్టం ఉంది, అమలు లేదు. ఈ ప్రతి లోపాన్నీ సరిచేయవచ్చు. కొత్త విధానం అవసరం లేదు, ఉన్న నిబంధనలను అమలు చేయగలిగే సంకల్పం చాలు.-వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
యూరియా ఉన్నా.. రైతుకు సున్నా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా, నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా నిల్వలున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు యూరియా దొరకడం లేదు. దాదాపు 60 శాతానికి పైగా నిల్వలు మార్క్ఫెడ్ గోదాముల్లోనే మూలుగుతున్నా..రైతులకు వీటిని సరఫరా చేసే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ప్యాక్స్లు), సహకార సంఘాలకు యూరి యా రావడం లేదు. దీంతో రైతులు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఒకవైపు కేంద్రం నుంచి రావాల్సిన ఎరువులు పూర్తిస్థాయిలో రాలేదు. మరోవైపు వచి్చన నిల్వలు రైతులకు అందడం లేదు. ముఖ్యంగా ప్యాక్స్ల పాలకమండళ్ల తీరుతో యూరియా రైతులకు చేరడం లేదు. పుష్కలంగా ఉన్నా..‘అందని ద్రాక్ష’ రాష్ట్రంలో ఈనెల 22 నాటికి 3.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో 2.56 లక్షల టన్నుల యూరియా మార్క్ఫెడ్ గోదాముల్లోనే ఉంది. రైతులకు నేరుగా అందుబాటులో ఉండే డీలర్ల వద్ద 94 వేల టన్నులు, సహకార సంఘాల వద్ద 25 వేల టన్నులు ఉండగా, ఆయా ఎరువుల కంపెనీల గోడౌన్లలో మరో 16 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. ఈ విధంగా ప్రభుత్వ లెక్కల్లో మాత్రమే యూరియా పుష్కలంగా ఉంది. కానీ అది రైతులకు మాత్రం అందని ద్రాక్షగా మారింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించే యూరియా రైల్వే ర్యాక్ల ద్వారా రాష్ట్రానికి చేరిన వెంటనే అందులోని 60 శాతం యూరియాను మార్క్ఫెడ్ గోదాములకు తరలిస్తారు. మిగతా 40 శాతం వ్యవసాయ శాఖ ద్వారా ప్రైవేటు వ్యాపారులకు పంపించడం జరుగుతుంది. ప్రైవేటు దుకాణాలను చూపిస్తున్న యాప్ ప్రతి ఖరీఫ్ సీజన్లో ప్యాక్స్లు, సహకార సంఘాలు ఇండెంట్ పెడితే మార్క్ఫెడ్ యూరియా సరఫరా చేస్తుంది. ఇందుకోసం ఆయా సహకార సంఘాలు ఇండెంట్ ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ప్యాక్స్కు కొత్త పాలక మండళ్ల విషయంలో అయోమయం నెలకొంది, కొత్తగా సంఘాలు ఏర్పాటయ్యేంత వరకు పాత పాలక మండళ్లనే కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పినా యూరియా ఇండెంట్లపై పాలకమండళ్లు దృష్టి పెట్టడం లేదు.ప్యాక్స్ సీఈవోలు కూడా యూరియా బాధలు తమకెందుకులే అనే ధోరణిలో ఉన్నారు. ఈ కారణంగానే ప్యాక్స్కు యూరియా తగినంత వెళ్లడం లేదు. కేవలం 25 వేల మెట్రిక్ టన్నులు (5.64 లక్షల బస్తాలు) మాత్రమే సహకార సంఘాల వద్ద ఉండగా.. మార్క్ఫెడ్ గోదాముల్లో 56.74 లక్షల బస్తాల (2.56లక్షల మెట్రిక్ టన్నులు) నిల్వలు ఉన్నాయి. మార్క్ఫెడ్ గోదాముల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి ప్యాక్స్ కేంద్రాలకు సరఫరా జరగకపోవడంతో రైతులు యాప్లో యూరియాను బుక్ చేయగానే దగ్గర్లోని ప్రైవేట్ దుకాణాలను చూపెడుతోంది. జూలైలో డిమాండ్ భారీగా పెరిగే చాన్స్ డీలర్లకు కూడా పరిమిత సరఫరా కారణంగా యూరియా కోసం పోటీ నెలకొంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు స్టాక్ ఉన్నట్లు చూపించి, కొద్ది నిమిషాల్లోనే నోస్టాక్ అని చూపిస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఎరువుల వ్యాపారులు సైతం తమకు అవసరమైన మేర స్టాక్ అందడం లేదని చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే నాలుగో వంతు కూడా ఈసారి సాగు కాలేదు.పత్తి పంట కేవలం ఐదున్నర లక్షల ఎకరాల్లోనే సాగు జరగగా, వరి కేవలం 11వేల ఎకరాల్లోనే సాగైంది. కానీ యూరియా కోసం మాత్రం గత సంవత్సరంతో పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెపుతున్నాయి. పంటల సాగు లేకపోయినా, భవిష్యత్తులో యూరియా దొరుకుతుందో లేదో అనే భయంతో రైతులు ముందుస్తుగానే కొనుగోలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ చెబుతోంది.అయితే వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి సాగు గరిష్ట స్థాయికి చేరే జూలైలో యూరియా అవసరం భారీగా పెరగనుంది. మార్క్ఫెడ్ గోదాముల్లో ఉన్న నిల్వలను వెంటనే జిల్లాలకు తరలించి, ప్యాక్స్లు, సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. -
మామిడి గుజ్జు ఫ్యాక్టరీ వద్ద యువరైతు ఆత్మహత్యాయత్నం
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దుస్థితి దారుణంగా తయారైంది. సీరియల్ నంబర్ కోసం నాలుగు రోజులుగా గుజ్జు ఫ్యాక్టరీ వద్ద వేచి చూసిన ఓ యువరైతు చివరికి ఫ్యాక్టరీ గేటు వద్దే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. గంగాధర నెల్లూరు మండలం బొమ్మవారిపల్లికి చెందిన యువరైతు లోకేశ్ నాయుడు నాలుగు రోజుల క్రితం మామిడి లోడుతో జైన్ మామిడి గుజ్జు పరిశ్రమకు చేరుకున్నాడు. వరుసలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సీరియల్ నంబర్ ఇవ్వలేదు. కానీ అర్ధరాత్రి వేళ సిఫారసులతో వచ్చిన వాహనాలను వరుసగా ఫ్యాక్టరీలోకి వెళ్తుండటంతో ప్రశ్నించగా, అక్కడి సిబ్బంది, దళారులు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ దురుసుగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అవమానంతో కుంగిపోయిన లోకేశ్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న రైతులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడున్న రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఫ్యాక్టరీ లోపల బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
రాజధాని రైతు హక్కుల కోసం పోరాటం
సాక్షి,అమరావతి: రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం దామాషా ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాల్సి ఉందని వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. రైతులకు న్యాయం జరిగేలా ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు, ఒప్పందాల ప్రకారమే ప్లాట్ల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులను దెబ్బతీసేలా ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవద్దని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. రాజధాని ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రైతుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల హక్కులు, ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రైతులు ఎంతో నమ్మకంతో తమ భూములను అప్పగించారని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు. రాజధాని కోసం ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల నుంచి మరోసారి భూ సమీకరణ పేరుతో బలవంతంగా భూములు తీసుకోవడం అన్యాయమని సమావేశం స్పష్టం చేసింది. ఒకసారి భూములు సమీకరించిన తర్వాత మళ్లీ రైతులపై అదనపు భారం మోపడం సరికాదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగే ఎటువంటి చర్యలనైనా వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో అదనపు భూ సమీకరణకు సంబంధించిన అంశంపై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని కమిటీ సభ్యులు గుర్తు చేశారు. కోర్టులో విచారణలో ఉన్న అంశాల విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని సూచించారు. న్యాయ ప్రక్రియను గౌరవిస్తూ రైతుల హక్కులను కాపాడాలని కోరారు. నిడమర్రు, పెనుమాక గ్రామాల్లో లీగల్ టీం పర్యటన.. రాజధాని ప్రాంత రైతులపై ఒత్తిళ్లు, బెదిరింపులు, భయాందోళనలు సృష్టించే విధానాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సమావేశంలో కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. రైతులతో చర్చలు జరపకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.రైతుల ఆందోళనలను అర్థం చేసుకుని వారి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. రైతుల అభ్యర్థన మేరకు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీకి చెందిన లీగల్ టీం నిడమర్రు, పెనుమాక గ్రామాల్లో పర్యటించిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఆ గ్రామాల రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలు, ఆందోళనలను తెలుసుకున్నట్లు తెలిపారు. రైతులు వ్యక్తం చేసిన అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి తదుపరి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. న్యాయ, రాజకీయ, ప్రజా పోరాటాలు చేపట్టాలని నిర్ణయం రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై మరింత విస్తృత చర్చ జరిపేందుకు ఈ నెలలోనే మరోసారి సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల అభిప్రాయాలను సేకరించి, వారి హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన న్యాయ, రాజకీయ, ప్రజా పోరాట కార్యక్రమాలను చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. రాజధాని ప్రాంత రైతుల హక్కులను కాపాడడం కోసం వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, రైతులకు అన్యాయం జరిగే ప్రతి అంశంపై పోరాటం కొనసాగిస్తామని సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, దేవినేని అవినాష్, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు, మలసాని మనోహర్ రెడ్డి, కొమ్మసాని శ్రీనివాస రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
పొలం.. కదలని హలం!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో పల్లెల్లో తెల్లవారుజామునే వినిపించే ట్రాక్టర్ల శబ్దాలు ఇప్పుడు అంతగా లేవు. నాగళ్లు భుజాన వేసుకుని వెళ్లే రైతులూ లేరు. నాగలి సాళ్లు పడాల్సిన పొలాల్లో అనేకచోట్ల ఇంకా పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయి. జూన్ మూడో వారం ముగుస్తున్నా చాలాచోట్ల భూములింకా బీడుపడే కనిపిస్తున్నాయి. రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వాన రాకకోసం నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా తొలకరి జల్లులతో పత్తి విత్తనాలు వేసిన వారు మొలకలు రాక దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడం, అక్కడక్కడా అడపాదడపా కురిసిన చిరు జల్లులు కూడా నిలకడగా లేకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు దాదాపు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 132 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 7.5 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 26 లక్షల ఎకరాల్లో పంటలు వేశారంటే..ప్రస్తుతం సాగులో ఎంత జాగు చోటు చేసుకుందో అర్థమవుతుంది. రాష్ట్రంలో ఖరీఫ్ ప్రధాన పంటగా మారిన వరి సాగు ఈసారి దాదాపు నిలిచిపోయినట్లే కనిపిస్తోంది. జూన్ మూడో వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 10 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు లేదా విత్తనాలు వేయగలిగారు. గత ఏడాది ఇదే సమయానికి సుమారు 59 వేల ఎకరాల్లో వరి సాగు ప్రారంభం కావడం గమనార్హం. వరి నాట్లు వాయిదా సాధారణంగా జూన్ రెండో వారం నుంచే నారుమళ్లు సిద్ధమై, అనేక ప్రాంతాల్లో నాట్లు కూడా మొదలవుతాయి. కానీ ఈసారి వర్షాలు లేకపోవడం, చెరువులు, కుంటలు, బోర్లు కూడా ఆశించిన స్థాయిలో నిండకపోవడంతో రైతులు నాట్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నారు. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసినా పొలాల్లోకి దిగలేకపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా తగినంత వర్షపాతం నమోదయ్యే వరకు రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని సూచిస్తున్నారు. మొలకెత్తని పత్తి.. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తి పంట పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇప్పటివరకు 5.43 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. అయితే వీటిలో సగానికి పైగా విస్తీర్ణంలో విత్తనాలు మొలకెత్తలేదని క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జూన్ ప్రారంభంలో తొలకరి జల్లులు కురవడంతో రైతులు ఆశగా విత్తనాలు వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో నేలలో తేమ తగ్గిపోయి గింజలు ఎండిపోయాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మహబూబ్నగర్ తదితర కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 50 శాతం వరకు మాత్రమే మొలకలు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు పురోగతిలో ఉండగా, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కుప్పకూలిన సోయా సాగు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే సోయాబీన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 6,735 ఎకరాల్లో మాత్రమే సోయాబీన్ విత్తనాలు వేశారు. గత ఏడాది ఇదే సమయానికి 1,15,069 ఎకరాల్లో సోయాబీన్ సాగు జరిగింది. అంటే సుమారు 94 శాతం మేర విస్తీర్ణం తగ్గిపోయింది. సోయాబీన్కు విత్తే సమయంలో నేలలో సరిపడా తేమ అవసరం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు విత్తనాలను నిల్వలోనే ఉంచుతున్నారు. మొక్కజొన్న, కంది పంటలకూ బ్రేక్ వర్షాధార పంటలైన మొక్కజొన్న, కంది పంటల సాగు కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 11 వేల ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి 80,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు నమోదు కావడం గమనార్హం. అలాగే కంది పంట నిరుడు ఇదే సమయానికి లక్షా 2 వేల ఎకరాల్లో సాగవగా..ఈసారి కేవలం 17 వేల ఎకరాల్లో మాత్రమే సాగవడం గమనార్హం. వర్షాభావ పరిస్థితుల్లో ప్రస్తుతం రైతులంతా వానల రాక కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. -
బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం!
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణంగా వంచిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు హామీలిస్తూ చంద్రబాబు చెప్పిన మాటల వీడియో క్లిప్ను జత చేస్తూ.. చంద్రబాబు చేసిన మోసాలను తూర్పారబడుతూ ‘రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం – మోసం నిజం..’ అంటూ ఆదివారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు.పీఎం కిసాన్తో కాకుండా మూడేళ్లలో టీడీపీ కూటమి సర్కార్ ఒక్కో రైతు కుటుంబానికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.19 వేలేనని స్పష్టం చేశారు. టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం.. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కకున్నా చీమ కుట్టినట్టైనా లేదా? అంటూ నిలదీశారు. మీరు రైతులకు ఇచ్చింది.. వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమేనంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ఏమని పోస్టు చేశారంటే..రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే. •మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు… pic.twitter.com/0y5C93csiF— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026⇒ చంద్రబాబు గారు.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్ధలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా.. మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలైనా అన్నీ మోసాలే. మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా ఒక్క సంవత్సరం కూడా మాట తప్పలేదు. పైగా మేం మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమహేంద్రవరం వేదికగా పీఎం–కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 చొప్పున ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ పోస్టుకు మీరు మాట్లాడిన మాటలు జత చేస్తున్నా.⇒ 2024–25లో పీఎం–కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది, ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది – సున్నా. 2025–26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026–27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది – కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం–కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.19,000. పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85 లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు.⇒ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో మేం ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.⇒ ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్టనష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియం కూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం. అది కూడా రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని మీరు ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ–క్రాప్ను, టెస్టింగ్ ల్యాబ్లను నాశనం చేశారు.⇒ ఆక్వా రైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న ‘అప్సడా’ అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వా ఫీడ్కు రూ.4 పెంచారు. జూన్లో మరో రూ.10– రూ.12 పెంచారు. కిలోకు ఏకంగా రూ.14– రూ.16 చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యల మేత ధర రూ.72 వేల నుంచి రూ.1.08 లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి. ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టీమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరా చూస్తే తగ్గించింది కేవలం రూ.2 మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప! ఆక్వా రైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీని పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12 చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి ఇవ్వాళ్టికీ రూ.380 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4 ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది? పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం.. సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా? ౖఇక మీరు రైతుల కోసం ఏం చేసినట్టు చంద్రబాబు గారూ? మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే!ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్న వీడియో కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి... -
అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణలు: వైఎస్ జగన్
-
‘రైతులపై బాబు ప్రేమ బూటకం- మోసం.. నిజం’
సాక్షి, తాడేపల్లి: రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం-మోసం నిజం అంటూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే’’ అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా, ఒక్క సంవత్సరం కూడా తప్పలేదు. పైగా మేము మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా నిలబడి, పీఎం-కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి, మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ ట్వీట్కు మీరు మాట్లాడిన మాటలు జతచేస్తున్నాను...2024-25లో పీఎం-కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది.. సున్నా. 2025-26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026-27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది.. కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం-కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.19,000...పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా మేం నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే. •మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు… pic.twitter.com/0y5C93csiF— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026..ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్ట, నష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా, మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియంకూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. కాని, మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం, రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే. ..ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ-క్రాప్ను, టెస్టింగ్ ల్యాబులను నాశనం చేశారు...ఆక్వారైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న అప్సడా అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వాఫీడ్కు రూ.4లు పెంచారు, జూన్లో మరో రూ.10- రూ.12లు పెంచారు. కిలోకు ఏకంగా రూ.14- రూ.16లు చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యలమేత ధర రూ.72వేల నుంచి రూ.1.08లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి...ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టిమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరాచూస్తే తగ్గించింది కేవలం రూ.2లు మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప? పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఆక్వారైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు...మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12లు చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి, ఇవ్వాళ్టికీ రూ.380కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4లు ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?. పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు ఆ ధర రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా?. ఇక మీరు రైతులకోసం ఏంచేసినట్టు చంద్రబాబూ మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'!
సాక్షి, హైదరాబాద్: ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే కోటా మేరకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. ఏటా కేంద్రం ఖరారు చేసే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో నిర్దేశిత కోటా మేరకే కొనుగోళ్లు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన అనధికార మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి.. సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్కతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా.. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయం విలేకరులు ప్రస్తావించగా.. పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బదులిచ్చారు. మిర్చి, పత్తి, ఇతర పంటల ఎగుమతి కేంద్రం వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. ఇందుకోసమే గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్సీఐ, సీసీఐ, నాఫెడ్ సంస్థలను నెలకొల్పిందని గుర్తు చేశారు. పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుండడంతో ఒత్తిడి పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పండించే అన్ని రకాల పంటలను ఎంఎస్పీతో పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.. ఎల్నినో ప్రభావం తీవ్రమవుతోందని, ప్రధానంగా తెలంగాణ, ఏపీపైనే అధిక ప్రభావం ఉండబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తుమ్మల చెప్పారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, కాబట్టి మొదటి వర్షం పడగానే తొందరపాటుతో విత్తనాలు నాటవద్దని రైతులకు సూచించారు. కనీసం 7 సెం.మీ.ల వర్షం కురిస్తేనే విత్తనాలు మొలకెత్తేందుకు సరిపడ తేమ లభిస్తుందని చెప్పారు. మండల వ్యవసాయ అధికారులు చేసే సూచనలను రైతులు పాటించాలని కోరారు. 83% రైతులు ఈ 7 రకాలే పండిస్తున్నారు.. సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న బోనస్ను ఈ ఏడాది ఏడు రకాల సన్నాలకు మాత్రమే ఇవ్వాలని మంత్రుల సమావేశం నిర్ణయించింది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048,హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం–1638, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715.. ఈ ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుంది. రాష్ట్రంలో సన్నాలు పండించే 83 శాతం రైతులు ఈ రకాలనే పండిస్తున్నారని తుమ్మల చెప్పారు. మార్కెట్ డిమాండ్, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వీటిని పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా రైతులు మార్కెట్లో విక్రయించుకోవచ్చని అన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం మన రాష్ట్రం నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 30న భారీ స్థాయిలో రైతు సమ్మేళనం సభ ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచి వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. యూరియా కోసం త్వరలో మరోసారి ఢిల్లీకి.. వానాకాలం సీజన్కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి మళ్లీ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఇందుకోసం త్వరలో ఇతర మంత్రులతో కలిసి ఢిల్లీ వెళతామని తుమ్మల చెప్పారు. గత ఏప్రిల్, మే నెలల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించి, లక్ష మెట్రిక్ టన్నులు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న ఎరువులను మధ్యప్రదేశ్, బిహార్కు తరలిస్తున్నారని, ఇకపై అధ్యధిక కోటాను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మెట్రో–2కు సహకరించాలి.. ‘మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తోంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాం. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ మెట్రో విస్తరణకు సహకరించాలి..’ అని ఉత్తమ్ కోరారు. ఈ నెల 21న రాష్ట్రంలోని 2,008 పరీక్ష కేంద్రాల్లో జరగనున్న నీట్ పరీక్షకు 2.95 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఈ విద్యార్థులందరికీ (హాల్ టికెట్లు చూపాలి) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. వీబీజీ రామ్ జీ వద్దు..పాత నరేగా కావాలి పాత ఉపాధి హామీ చట్టం యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రంలో జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ఒత్తిడి చేస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా (60:40 నిష్పత్తి) నిధులతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఒత్తిడిపై అధ్యయనం కోసం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో తనతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఇక డిజిటల్ కేబినెట్ భేటీలు.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్గా నిర్వహించే పద్ధతికి గురువారం నాటి సమావేశంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో డిజిటల్ కేబినెట్ భేటీలే నిర్వహిస్తారు. ఇందుకోసం గురువారం ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్బాబు.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లు అందజేశారు. ఇకపై ఈ– బుక్ ద్వారానే కేబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. -
మక్క రైతుకు మార్క్ఫెడ్ టెన్షన్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మార్క్ఫెడ్ ద్వారా మక్కలు విక్రయించిన రైతులు పంట సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్లో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా మార్కెట్లో మద్దతు ధర దక్కక ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు నానా అగచాట్లు పడ్డారు. ఆ తర్వాత మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేసినా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా 30,382 మంది రైతులకు రూ.482 కోట్లు బకాయి ఉండడం... ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి కోసం ప్రతీరోజు బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు. 8.64 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిఈ ఏడాది యాసంగిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా మొక్కజొన్న విస్తారంగా సాగు చేశారు. ఫలితంగా 3.17 లక్షల ఎకరాల్లో సాగవగా 8.64 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిందన్న ఆనందంలో ఉన్న రైతులకు ధర చూస్తే నిరాశ ఎదురైంది. ప్రభుత్వం క్వింటాల్కు మద్దతు ధర రూ.2,400గా ప్రకటించినా, వ్యాపారులు రూ.1,600కు మించి చెల్లించలేదు. ఈనేపథ్యంలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టింది. అయితే కేంద్రాలు అరకొరగా ఏర్పాటు చేయడం, నిబంధనలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్దనే పడిగాపులు కాయగా.. కాంటాలు వేశాక కూడా మిల్లులకు తరలింపులో జాప్యంతో కేంద్రాల వద్దే వేచి ఉండాల్సి వచ్చింది. 3.32 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ..కొనుగోళ్లలో ఇక్కట్లు ఎదురుకావడంతో పలుమార్లు రైతులు ఆందోళనలకు దిగారు. చివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50,382 మంది రైతుల నుంచి 3,32,700 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను ప్రభుత్వం సేకరించింది. వీటి విలువ రూ.797 కోట్లు. ఇందులో 20వేల మంది రైతులకు చెందిన 1.32 లక్షల మెట్రిక్ టన్నుల పంటకు సంబంధించి రూ.315 కోట్లను ఖాతాల్లో జమ చేశారు. రైతుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము కన్నా.. ఇంకా అందాల్సిన సొమ్ము ఎక్కువగా ఉంది. 30,382 మంది రైతులకు సంబంధించి రూ.482 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.డబ్బు కోసం ఎదురుచూస్తున్నాం నేను 18 ఎకరాల్లో మొక్క జొన్న పంటను సాగు చేశా. 497 క్వింటాళ్లను మార్క్ఫెడ్కు విక్ర యించి 50 రోజులు గడిచినా డబ్బు రాలేదు. ప్రభుత్వం గోనె సంచులు కూడా ఇవ్వక బయట కొనడంతోపాటు కాంటా, రవాణా ఖర్చులకు రూ.50 వేలు వడ్డీకి తెచ్చి పెట్టా. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నాం. – బంధం రంగయ్య, ముష్టికుంట్ల, బోనకల్అమ్మి 45 రోజులైంది..నాకున్న ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. 225 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తనికెళ్లలోని కొనుగోలు కేంద్రంలో మక్కలను విక్రయించి 45 రోజులు గడిచింది. ఇప్పటి వరకు నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. ఈ సమయంలో డబ్బులు జమ చేస్తే విత్తనాలు, ఎరువులు ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. – ఆకుతోట పుల్లారావు, తనికెళ్ల, కొణిజర్ల -
రైతులకు ఎప్పుడూ కష్టాలే..అధికారంలో ఉన్న బాబు వేస్ట్
-
‘చంద్రబాబూ.. బీచ్ల్లో బార్లపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, కానీ ప్రభుత్వం మాత్రం బీచ్ల్లో బార్లు ఏర్పాటు చేయడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగిలితే గాలికి కొట్టుకుపోతారని మండిపడ్డారు.తాడేపల్లిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నపూర్ణగా పిలుచుకునే ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో అనేక మంది రైతులు తనువు చాలించారు. ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే తీరిక లేదు. కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. ప్రతిపక్ష నేతలను తిట్టడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. మంచి పనులు చేయటం మీద దృష్టి పెట్టకుండా నిత్యం వైఎస్ జగన్ మీద విషం చిమ్మే పనిలో ఉన్నారు.గతేదాడి వేలాది మంది రైతులు ఎరువులు, విత్తనాలు దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు ఎరువుల మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోలేదు. ప్రతీ విషయంలో మోసం చేయటం చంద్రబాబు నైజం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తా అన్నారు.. ఇప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్ హయంలో తెచ్చిన ప్రాజెక్టుల వల్ల రైతులు నిలబడ్డారు. జగన్ వచ్చిన తర్వాత 1700 కోట్లు ఖర్చు చేసి 9 గంటలు విద్యుత్ ఇచ్చారు. తోతాపురి మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఏడాది జగన్ వెళ్ళి ఆందోళన చేస్తే కేసులు పెట్టారు. ప్రతిపక్షంగా మేము గట్టిగా మాట్లాడితే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. రైతులకు కావాల్సిన మినిమం సపోర్ట్ కూడా ప్రభుత్వం నుంచి లభించటం లేదు. ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు చంపేశారు.. కనీసం డెడ్ బాడీ ఇవ్వాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేం ఇదే విషయం ప్రశ్నిస్తే కులాల ప్రస్తావన తీసుకువస్తారు. బీచ్లో బార్స్ పట్టడానికి ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ బ్లాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగిలితే గాలికి కొట్టుకుపోతారు. తక్షణమే రైతుల గురించి ఆలోచన చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
ఆ సన్నాలే కావాలి!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ..రాష్ట్రంలో సన్న రకాల వరి విత్తనాలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, మిల్లర్లు, ఎగుమతిదారుల సూచనల మేరకు ఎంపిక చేసిన ఏడు ప్రధాన సన్న రకాల వంగడాల సాగునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ సోనా, జై శ్రీరామ్, సాంబమసూరి, హెచ్ఎంటీ సోనా, కూనారం సన్నాలు, సిద్ధి, కేఎన్ఎం–7715 రకాల సన్నరకం విత్తనాలను ఈ ఖరీఫ్లో సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు ఇస్తున్న క్వింటాల్కు రూ.500 బోనస్ను కూడా ఈ ఏడు రకాల వరి వంగడాలకే పరిమితం చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇప్పటి వరకు 36 రకాల సన్నాల్లో ఏ వంగడాన్ని పండించినా, ఈ బోనస్ అందేది. అయితే సర్కార్ తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ఈ ఏడు వంగడాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ వంగడాల కోసం ప్రభుత్వ విక్రయ కేంద్రాలు, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎస్డీసీ) డిపోలు, ప్రైవేట్ విత్తన దుకాణాల వద్ద రైతుల తాకిడి పెరిగింది. నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఆ ఏడింటికే ప్రాధాన్యం ఎందుకంటే.. వరి సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానాల్లో ఉన్నా, రాష్ట్రంలో పండే బియ్యానికి మార్కెట్లో స్థిరమైన గుర్తింపు లేకపోవడం చాలా కాలంగా సమస్యగా ఉంది. రైతులు వివిధ రకాల వంగడాలను సాగు చేయడం వల్ల కొనుగోలు, నిల్వ, మిల్లింగ్, ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, మిల్లర్లు, ఎగుమతిదారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశాల్లో మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న సన్న రకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ జాబితాలో తెలంగాణ సోనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజేంద్రనగర్లోని భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) అభివృద్ధి చేసిన ఈ రకం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో మధుమేహ బాధితులు, ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారుల్లో తెలంగాణ సోనాకు మంచి డిమాండ్ ఉంది. సాంబా మసూరి ఇప్పటికీ దేశీయ మార్కెట్లో అత్యధిక ఆదరణ పొందుతున్న సన్నబియ్యం రకాల్లో ఒకటిగా కొనసాగుతోంది. రైతుల పరుగులు.. వ్యాపారుల లాభాపేక్ష ప్రభుత్వం ఖరీఫ్కు అవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలను సిద్ధం చేసింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్కు సుమారు 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, 38 లక్షల క్వింటాళ్లకుపైగా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులు తెలంగాణ సోనా, సాంబా మసూరి, హెచ్ఎంటీ సోనాతో పాటు ఏడు రకాల విత్తనాలనే ఎక్కువగా కోరుతుండటంతో కొన్ని కేంద్రాల్లో నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. దీంతో రైతులు ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లి విత్తనాల కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొందరు వ్యాపారులు లాభాపేక్షతో నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల తెలంగాణ సోనా, సాంబా మసూరి, హెచ్ఎంటీ సోనా , జై శ్రీరాం విత్తనాలకు కొరత ఏర్పడింది. కొందరు వ్యాపారులు డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ, ఎక్కువ ధరకు విక్రయించే పనిలో ఉన్నారు. -
కుదేలవుతున్న కర్షకుడు
సాక్షి, అమరావతి: పెరిగిన ఖర్చులు, గిట్టుబాటు ధర అందని అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాత.. ఇప్పుడు బయో ప్రొడక్ట్స్ వివాదంలో మరోసారి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు, హోల్సేలర్లు, డీలర్లు, అధికారుల మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో రైతే బలిపశువుగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది.ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు రైతును బలవంతం చేయొద్దని డీలర్లకు స్పష్టంచేస్తూ వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే వ్యవసాయ శాఖ జారీ చేసిన ఆదేశాలపై డీలర్లు మండిపడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండే యూరియా, డీఏపీ కావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బయో ప్రొడక్ట్స్ తీసుకోవాలని కంపెనీలు, హోల్సేలర్స్ తమపై ఒత్తిడి తీసుకొస్తారని, విధిలేని పరిస్థితుల్లోనే వాటిని రైతులకు అవసరం లేకున్నా అంటగట్టాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. తమపై ఇలాంటి ఒత్తిడి వద్దని కంపెనీలు, హోల్సేలర్స్కు తొలుత స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే యూరియా, డీఏపీ అమ్మకాలు నిలిపివేస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ వివాదం ఎటు తిరిగినా చివరికి ఆర్థికంగా నష్టపోయేది రైతేనన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. రైతుల నుంచి రూ.1,000 కోట్లకుపైగా దోపిడీ» రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 18 లక్షలు, రబీలో 23 లక్షల టన్నుల ఎరువుల వినియోగం ఉంటుంది. కాంప్లెక్స్ ఎరువులతో పోలిస్తే కాస్త చౌకగా లభించే యూరియాతో పాటు డీఏపీ ఎరువుల వినియోగం కాస్త ఎక్కువగా ఉంటుంది. » ఇందులో ప్రధానంగా ఖరీఫ్లో 7 లక్షల టన్నులు యూరియా, 2.50 లక్షల టన్నులు డీఏపీ, రబీలో 9.38 లక్షల టన్నుల యూరియా, 2.20 లక్షల టన్నుల డీఏపీ ఎరువులు వినియోగిస్తారు. వీటి కోసం సీజన్లో ఎనలేని డిమాండ్ ఉంటుంది. » ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకొని సాగులో పెద్దగా అవసరం లేని బయో ఫెర్టిలైజర్లు, బయో స్టిమ్యులెంట్లు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు, ఇతర వ్యవసాయ ఇన్పుట్స్ను రైతులకు బలవంతంగా అంట గట్టడం పరిపాటిగా మారింది. » యూరియా, డీఏపీ బస్తాలు కొనుగోలు చేసే పరిమాణంలో కనీసం 40–50 శాతం ఈ బయో ప్రొడెక్ట్స్ను కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తారు. చేసేది లేక చేతిచమురు వదులుతున్నా విధిలేని పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేసి, అవసరం లేకున్నా మోతాదుకు మించి అన్నదాతలు వినియోగిస్తుంటారు. » ప్రతీ ఏటా ఈ చట్ట వ్యతిరేక లింక్ ప్రొడెక్ట్స్ వ్యాపారం అక్షరాల రూ.1000 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. » ఈ తరహా అమ్మకాలను నిలిపివేయాలన్న రైతుల డిమాండ్ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రెండేళ్లుగా ఓ వైపు యూరియా, డీఏపీ అదునుకు దొరక్క రైతులు పడరాని పాట్లు పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి ఏపీ వ్యవసాయ సమాచార, నిర్వహణా వ్యవస్థ (ఏపీఏ ఐఎంఎస్) యాప్ ద్వారా విక్రయాలకు శ్రీకారం చుట్టగా, లింక్ ప్రొడెక్ట్స్ ట్యాగింగ్, అమ్మకాలపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. » 100 బస్తాల యూరియా కావాలంటే వాటితో పాటు కనీసం 10 బస్తాల సల్ఫర్, 5 బాక్సుల బయో ప్రొడెక్ట్స్ తీసుకోక తప్పని పరిస్థితి కల్పించడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. » కొన్ని కంపెనీలు తమ డీలర్లకు సబ్సిడీ ఎరువుల కేటాయింపును ఇతర ఉత్పత్తుల కొనుగోలుతో అనుసంధానం చేస్తున్నారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. » దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసుల నమోదు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. » దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖ డీలర్లకు స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. » చట్ట వ్యతిరేక బలవంతపు విక్రయాలకు పాల్పడే వారిపై సంబంధిత వ్యవసాయ అధికారి, ఎరువుల ఇన్స్పెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ ఆదేశాలు ఇచ్చారు. కంపెనీలు, హోల్సేలర్లకు కూడా ఆదేశాలు ఇవ్వండి యూరియా, డీఏపీతో పాటు లింక్ ప్రొడెక్ట్స్ బలవంతపు విక్రయాలపై వ్యవసాయ శాఖ జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాం. బలవంతపు ట్యాగింగ్ను ఆపాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. అయితే కంపెనీల ఒత్తిడి మేరకే విధిలేని పరిస్థితుల్లో రైతులకు అమ్మాల్సి వస్తోంది. తమపై ఒత్తిడి తెచ్చే ముందు తయారీ దారులు, హోల్సేల్ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – వజ్రాల వెంకటనాగిరెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర ఎరువులు, పురుగు మందులు, విత్తన డీలర్ల సంక్షేమ సంఘం -
ధరల పతనంపై రోడ్డెక్కిన పొగాకు రైతులు
కందుకూరు /కొండపి: రోజురోజుకూ పొగాకు ధరలు పతనమవుతుండడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం కేంద్రాల్లో దిగజారుతున్న ధరలతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. బుధవారం ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు కేంద్రాల్లో ధరలు దారుణంగా పతనమవడంతో వేలాన్ని అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. ప్రధానంగా కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రానికి పొన్నలూరు మండలం విప్పగుంట క్లస్టర్ రైతులు బేళ్లు తీసుకొచ్చారు.అయితే ఎఫ్2 రకం బేళ్లకు క్వింటాకు రూ.16 వేలు మాత్రమే ధర రావడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేలాన్ని అడ్డుకుని కేంద్రం అధికారులతో వాదనకు దిగారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో కనిగిరి రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకుని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పులు చేసి పొగాకు పండించామని, ఈ విధంగా ధరలు ఉంటే అప్పులు ఎలా తీరుతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు రెండో వేలం కేంద్రానికి మాలకొండరాయునిపాలెం, కొండసముద్రం క్లస్టర్ల రైతులు బేళ్లను తీసుకొచ్చారు. ఇక్కడ కూడా క్వింటా రూ.17 వేలు పలకడంతో రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. ఈ ధరలకు పొగాకు అమ్మే ప్రసక్తే లేదంటూ వేలాన్ని పూర్తిగా నిలిపేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కొండపిలోనూ నిలిచిన పొగాకు వేలంప్రకాశం జిల్లా కొండపి వేలం కేంద్రంలో బుధవారం అధిక సంఖ్యలో పొగాకు బేళ్లు తిరస్కరణకు గురవడంతో రైతులు వేలాన్ని మధ్యలోనే అడ్డుకొని నిలిపేశారు. క్లస్టర్ పరిధిలోని గుర్రప్పడియ మూగచింతల, కె.అగ్రహారం నెన్నూరుపాడు, చతుకుపాడు గ్రామాల రైతులు వేలం కేంద్రానికి బేళ్లు తీసుకొచ్చారు. మొదటి రెండు లైన్లు కొనుగోలు అయ్యే సరికి అధిక మొత్తంలో బేళ్లు తిరస్కరణకు గురవడాన్ని గమనించిన రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. కేజీ రూ.160కి కూడా వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో వేలం కేంద్ర నిర్వహణ అధికారితో రైతులు వాగ్వాదానికి దిగారు. అసలే మద్దతు ధర లేక అల్లాడిపోతుంటే కనిష్ట ధర కిలో రూ.160కు అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఇప్పుడే విత్తొద్దు..
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా ఇంకా విస్తరించలేనందున రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత విత్తే నియమాన్ని పాటించి.. అంటే ఒక వారం వ్యవధిలో తేలికపాటి నేలలో 50–60 మి.మీ., బరువు నేలలో 60–75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా 15–20 సెం.మీ. లోతు నేల తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం పంటలను విత్తుకోవాలని తెలిపింది. నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నెలలో ఉత్తర, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో సాధారణంకంటే తక్కువ వర్షపాతం, మిగిలిన జిల్లాలలో సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నందున అధిక తేమ, నీటి ఎద్దడి నుంచి ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి పంటలను వాలుకు అడ్డంగా, బోదెలు–కాలువల పద్ధతిలో, ఎత్తు మడులు–కాలువల పద్ధతిలో విత్తుకోవాలని యూనివర్సిటీ ఆగ్రో క్లైమేట్ రీసెర్చ్ యూనిట్ హెడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి.లీలా రాణి తెలిపారు. చెరువులు, కుంటలకు దూరంగా ఉండి తక్కువ నీటి వసతి ఉన్న రైతులు తమకు అనువైన తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పారు. -
చంద్రబాబు సర్కార్కు వైఎస్ జగన్ అల్టిమేటం
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సర్కార్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేకుంటే జులై 1, లేదా 2న ఆక్వా రైతుల తరుఫున పోరాటం చేస్తామన్నారు. తాను కూడా ఆక్వా రైతులకు మద్దతుగా వెళ్తానని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్తో ఆక్వా రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ పాలనతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వైఎస్ జగన్కు వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారని.. రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ హయాంలో మంచి ఆలోచనలు చేశామన్నారు. ‘‘రైతులు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలను అందుబాటులోకి తీసుకొని వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేలకుపైగా ఆర్బీకేలను తీసుకొచ్చాం. రాష్ట్రంలో వ్యాప్తంగా 10వేలకుపైగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను పెట్టాం. అప్సడా చట్టాన్ని సైతం తెచ్చాం. ముఖ్యమంత్రేనే అప్సడా ఛైర్మన్గా చేశాం. రైతులకు నష్టం రాకుండా సిండికేట్కు స్థానం లేకుండా చేశాం. రూపాయిన్నరకే యూనిట్ కరెంటును సబ్సిడీపై ఇచ్చాం. మన ప్రభుత్వమే ఇవ్వగలిగిందని గర్వంగా చెప్తున్నా. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. అలా 57 నెలల్లో రూ.3,306 కోట్లు విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించాం. 2014-19 మధ్య చంద్రబాబు యూనిట్కు రూ.3.82లు వసూలు చేసేవాడు.మనం పాదయాత్రలో ఉనప్పుడు చివరి ఆరునెలల్లో యూనిట్కు రూ.2లకు ఇస్తానని ఒక జీవో విడుదల చేశాడు. కాని అక్కడ కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చివరకు చంద్రబాబు కట్టాల్సిన బకాయిలు రూ.340 కోట్లు కూడా మనమే కట్టాం. చిత్తశుద్ధితో మనం చేసిన కార్యక్రమాల వల్ల ఆక్వా రంగం నిలదొక్కుతుంది.చంద్రబాబు హయాంలో 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్య, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. 2021-22,2022-23లో రెండుసార్లు బెస్ట్ మెరైన్ అవార్డులు వచ్చాయి. ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే, మూడు సార్లు ఉప సంహరించుకునేలా చేశాం.చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19.847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనం. ఫిషరీస్ యూనివర్శిటీ ద్వారా ఆక్వాసాగుకు నిపుణులను తయారుచేసేలా ఏర్పాటు చేశాం. క్లాసులు కూడా మొదలు పెట్టించాం. చంద్రబాబు మిగిలిన పనులు చేయకుండా విడిచిపెట్టారు. ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాససింగ్ యూనిట్లు అన్నీ చంద్రబాబు సానుభూతిపరులవే. సిండికేటై పంట చేతికి అందేనాటికి రేట్లు తగ్గించేస్తున్నారు.ఫిబ్రవరిలో ఫీడ్ రేట్లు కిలో రూ.4 పెంచారు. జూన్లో మరో రూ.10, రూ.12 పెంచారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధిచెప్పాల్సిందేనని’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
అన్నదాత.. ‘ఆత్మ’ఘోష!
(పంపాన వరప్రసాదరావు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి): రెండేళ్ల ‘కాల కూటమి’ పాలనలో అన్నదాతలు అ«ధోగతి పాలయ్యారు! నష్టాల సాగులో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. సాగు భారమై... బతుకు బరువై సంక్షోభంలో కూరుకుపోయారు. ఏ పంటకూ మద్దతు ధర దక్కపోవడం.. చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలకు బలైపోతున్నారు. కొనేవారు లేక.. అమ్ముకునే దారిలేక.. పెట్టుబడి ఖర్చులు దక్కక.. అప్పులు తీర్చలేక రైతన్నల బతుకు దుర్భరంగా తయారైంది. దేశానికి అన్నంపెట్టే రైతులు భార్య పిల్లలకు పట్టెడన్నం పెట్టలేక పురుగు మందులను ఆశ్రయిస్తున్నారు. ఇంతటి విపత్తులో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే కాడిపారేయడంతో ఆసరా లేక, భరోసా కరువై అన్నదాతలు విగత జీవులుగా మారుతున్నారు. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంతో రైతు ఆత్మహత్యల వార్త లేని రోజు లేదనే చెప్పాలి. ఉత్తరాంధ్ర మొదలు రాయలసీమ వరకూ ఏ పల్లెకు వెళ్లినా ఇదే దుస్థితి. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. విత్తు నుంచి విక్రయం వరకు గతంలో ఐదేళ్ల పాటు గ్రామ స్థాయిలో చేయిపట్టి నడిపించిన తోడు కరువైందంటూ విలపిస్తున్నారు. మేమున్నామంటూ తమకు భరోసా ఇచ్చే నాధుడు లేకుండా పోయారంటూ వాపోతున్నారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు పాలనలో రైతుల వెతలపై అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దాదాపు ఏడు నియోజకవర్గాల్లో సుమారు 30కిపైగా పల్లెల్లో ‘సాక్షి ప్రతినిధి’ బృందం రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కళావిహీనంగా సీమ పల్లెలు.. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు చోటు చేసుకున్న రాయలసీమ జిల్లాల్లో రైతన్నల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. ఉద్యాన హబ్లో ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. సీమలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ఉల్లి మొదలు టమాటా, బత్తాయి (చీని), మామిడి, బొప్పాయి, అరటి, పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ.. ఇలా ఏ పంట పండించే రైతు పరిస్థితి చూసినా దయనీయంగా ఉంది.సాగుభారమై బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోతుండడంతో సీమ పల్లెలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. సీజన్కు ముందే పెట్టుబడి సాయం లేదు.. అదునుకు విత్తనం లేదు.. కట్ట యూరియాకు దిక్కులేదు.. కరువు కాటకాలు, వైపరీత్యాల బారిన పడి పంటలు దెబ్బ తింటే పైసా పరిహారం లేదు... ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు.. ఏ పంటకూ మద్దతు ధర లేక, కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతన్నలు మండిపడుతున్నారు. ఏ పంట చూసినా కన్నీళ్లే..మామిడి, బత్తాయి, అరటి, ఉల్లి, వేరుశనగ, కూరగాయలు లాంటివి రాయలసీమలో ప్రధాన పంటలు. వేరుశనగలో 90 శాతం.. పత్తి, సజ్జ లాంటి పంటలు సగానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగవుతుండగా.. జొన్న, మొక్కజొన్న సైతం 40 శాతానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎగుమతి రకమైన జీ–9 అరటితో పాటు తోతాపురి మామిడి, బత్తాయి, ఉల్లి, పత్తి, పుచ్చకాయ, కర్భూజ, బొప్పాయి లాంటి పండ్లను సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక రోడ్డు ఎక్కి ఆందోళనకు దిగడం సర్కారు నిర్వాకాలకు నిదర్శనం.పత్తి మద్దతు ధర రూ.8110 కాగా మార్కెట్లో రూ.5 వేలకు మించి కొనలేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,400–1,600 మించి ఇవ్వడం లేదు. అరటి రైతులైతే ఖరీఫ్లో రూపాయికి తెగనమ్ముకోగా రబీలో రూ.5కు మించి దక్కలేదు. సజ్జ మద్దతు ధర రూ.2,750 కాగా మార్కెట్లో రూ.1,800–1,900 మధ్య అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది.తోతాపురి మామిడికి కిలో రూ.4–6కు మించి దక్కలేదు. చివరికి బత్తాయికి కూడా ఖరీఫ్లో కిలో రూ.6మించి లభించలేదు. ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి మరీ దారుణం. కిలో రూపాయి.. అర్ధ రూపాయి పలకడంతో చేసేదిలేక వేలాది టన్నులు రోడ్లపైనే పారబోసిన ఘటనలు కోకొల్లలు. రెండేళ్లుగా కర్భూజ, పుచ్చకాయ పంటకు ధర లేదు. చివరికి పూలకు కూడా రేటు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. అన్నదాతకు సున్నం.. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోతపెట్టి 46.85 లక్షల మంది భూ యజమానులకు అరకొరగా రూ.14 వేల చొప్పున రూ.6,560.18 కోట్లతో సరిపెట్టారు. రెండేళ్లలో భూ యజమానులకే రూ.14,873.28 కోట్లు ఎగ్గొట్టారు. ఇక కౌలు రైతులకైతే రెండేళ్లూ పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టారు. దాదాపు 16 లక్షలమంది కౌలు రైతులుండగా ఏడాదికి రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.6,400 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. పెట్టుబడి కోసం రైతులు సీజన్లో పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.బలవన్మరణాలు..సాగు కలిసి రాకపోవడంతో అప్పుల పాలైన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వర్షాభావం, వరదలు, తుపాన్లు.. ఒక్కొక్కటిగా వైపరీత్యాలు విరుచుకుపడటంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న విధానాలు మృత్యుపాశాలుగా మారాయి.టమాటా నుంచి పొగాకు వరకు పంట ఉత్పత్తులను కొనే నాథుడు లేక, అప్పులు తీర్చే దారిలేక 2024–25లో 150 మందికి పైగా అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడగా.. ఇక 2025–26లో 393 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు పోలీస్ శాఖ అధికారికంగా ప్రకటించింది. వీరిలో అత్యధికులు సీమ జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ప్రభుత్వం పైసా పరిహారం ఇచి్చన పాపాన పోలేదు.చేయిపట్టి నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యంవిత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా గ్రామ స్థాయిలో అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు కూటమి పాలనలో నిరీ్వర్యమైపోయాయి. 10,778 ఆర్బీకేలు కాస్తా రేషనలైజేషన్ పేరిట 8451 క్లస్టర్లుగా కుదించారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే సంకల్పంతో గత ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల్లో సగానికి పైగా మూతపడగా మిగిలినవి అలంకారప్రాయంగా తయారయ్యాయి. సిబ్బందిని సర్వేలు, ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో ఆర్బీకేలకు వెళ్తే పలుకరించే నాధుడే కరువయ్యారు.అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన భవనాలను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీని నిలిపి వేశారు. సబ్సిడీ విత్తనాల పంపిణీలో అడ్డగోలుగా కోత పెట్టారు. అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఎరువులను పక్కదారి పట్టిస్తుండడంతో రైతులకు యూరియా, డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా కట్ట యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నామని వాపోతున్నారు.మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండేళ్లలో 50–70 శాతం మేర పెరిగిపోవడంతో సాగు భారం మారింది. మత్స్యకార, పశుసంవర్ధక శాఖలకు చెందిన సాగు ఉత్పాదకాల సరఫరాకు మంగళం పాడేశారు. వరుస వైపరీత్యాలు, కరువు సాయం కలిపి దాదాపు 7 లక్షల మంది రైతులకు చంద్రబాబు సర్కారు దాదాపు రూ.1,100 కోట్లకు పైగా పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇప్పటి వరకు చెల్లించిన పాపాన పోలేదు.అటకెక్కిన ఉచిత పంటల బీమా రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం వచీ్చరాగానే మంగళం పాడేసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన 2023–24 సీజన్కు సంబంధించిన ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా చంద్రబాబు సర్కారు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. ఖరీఫ్ 2024 సీజన్ వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పంటల బీమా పథకం కొనసాగగా.. రబీ–2024–25 సీజన్ నుంచి చంద్రబాబు సర్కారు స్వచ్ఛంద నమోదు పద్ధతి తెచ్చింది.2024–25 వ్యవసాయ సీజన్తో పాటు ఖరీఫ్–2025–26 సీజన్లో ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియం బకాయిలు రూ.1,095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్లిస్ట్లో పెట్టాయి. రబీ –2025–26 సీజన్లో కనీసం బీమా పోర్టల్ కూడా తెరవలేదు. ఫలితంగా ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా బీమా చేయించుకోలేకపోయారు. ఇక రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీని రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మద్దతు ధర కోసం ఆందోళనలు.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. ధరల స్థిరీకరణ నిధి కింద పైసా ఇచి్చన పాపాన పోలేదు. ఉల్లి, టమాటా, కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొగాకు, కోకో, మామిడి.. ఇలా ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 2024–25 సీజన్లో 75 కేజీల ధాన్యం బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా ఏ ఒక్క రైతుకు రూ.1,150–1,450కి మించి దక్కలేదు.2025–26లో 75 కేజీల బస్తాకు రూ.1,777 దక్కాల్సి ఉండగా రూ.1,250 నుంచి రూ.1,500 మధ్య దక్కింది. మద్దతు ధర కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం, మామిడి, జొన్న, మొక్కజొన్న, పొగాకు రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలకు దిగారు. 2023–24లో క్వింటా రూ.27 వేలకు పైగా పలికిన మిర్చి రైతుకు గతేడాది రూ.6–8 వేలకు మించి దక్కలేదు. మొక్కజొన్న ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2,400 అయితే రైతులకు దక్కింది కేవలం రూ.1,400 నుంచి రూ.1,600 మధ్యే. టమాటా, ఉల్లి రైతుల పరిస్థితి రెండేళ్లుగా దారుణంగా ఉంది. పైసా సాయం అందలేదు.. గత ఖరీఫ్లో 10 ఎకరాల్లో శనగ, మినుము, నాటుపొగాకు సాగు చేశా. దాదాపు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పత్తి తెగుళ్ల బారిన పడింది. నాటు పొగాకు కొనేవారు లేకుండా పోయారు. శనగ, మినుము పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అధికారులు రాసుకుని వెళ్లారే గానీ పైసా సాయం అందలేదు. – సుద్దాల సుబ్బరాయుడు, కొనకుంట్ల, నంద్యాల జిల్లారూ.60 లక్షలు నష్టపోయా.. 4 ఎకరాల్లో దానిమ్మ, మరో 4.5 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా. ముంపునీటి బారిన పడి గతేడాది అరటి పంట దెబ్బతింటే.. ఈ ఏడాది బాక్టీరియల్ బ్లైట్ తెగులు బారిన పడి దానిమ్మ పూర్తిగా నాశనమైంది. మరో 15–20 రోజుల్లో పంట కోతకొచ్చే దశలో అకాల వర్షాలు, వడగండ్లతో తెగులు సోకింది.చెట్టుకు 28 కేజీలకు తక్కువ కాకుండా ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ఆశించా. బెంగళూరు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. ఆ లెక్కన రూ.60 లక్షల వరకు నష్టపోయా. ఇది వాణిజ్య పంట కాబట్టి మీకు పరిహారం రాదని అధికారులు చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఉద్యాన పంటలన్నింటికి ఉచితంగా బీమా పరిహారం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో పైసా సాయం లేదు. – ధర్మవరపు రవిశేఖర్రెడ్డి, కందుకూరు, అనంతపురం జిల్లాపరిస్థితి దారుణంగా ఉంది.. ఐదెకరాల్లో మొక్క జొన్న, వేరుశనగ వేశా. మొక్కజొన్నకు ఎకరాకు రూ.లక్ష, వేరుశనగకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొక్కజొన్న 125 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,500కి మించి ధర రాలేదు. క్వింటాకు రూ.900 చొప్పున దాదాపు రూ.1.13 లక్షల మేర నష్టపోయా. వేరుశనగ అకాల వర్షాల బారిన పడి ఎందుకు పనికి రాకుండా పోయింది. రూ.8 లక్షలు అప్పు మిగిలింది. వైఎస్ జగన్ హయాంలో పైసా కట్టించుకోకుండా రూ.లక్షన్నరకు పైగా పంటల బీమా పరిహారం ఇచ్చారు. సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం ఇచ్చేవారు. నేడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. – మన్నెపూల శివశంకర్, మద్దాలపురం, అనంతపురం జిల్లాపాడి రైతులకు దగా.. మాకు మూడు ఆవులున్నాయి. రోజుకు నాలుగైదు లీటర్ల పాలు ఇస్తాయి. మా గ్రామంలో లీటర్ గేదె పాలకు రూ.40, ఆవుపాలకు రూ.20 మించి ఇవ్వడం లేదు. అదేమిటని అడిగితే వెన్న శాతం లేదంటారు. గత ప్రభుత్వ హయాంలో మంచి రేటు వచ్చేది. అమూల్ కేంద్రాల్లో పాలు పోసేవాళ్లం. లీటర్ గేదె పాలకు రూ.80, ఆవుపాలకు రూ.50కిపైగా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలా అయితే పాడి రైతులు బతికేదెలాగో అర్ధం కావడం లేదు. – ఎం.జానకమ్మ, మద్దాలపురం, అనంతపురం జిల్లాపరిహారం లేదు.. వితంతు పింఛనూ ఇవ్వరు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్ఠూరు గ్రామానికి చెందిన రాగులపాడు సురేష్ (35) తనకున్న 1.5 ఎకరాల సొంత భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని గత ఖరీఫ్లో మొక్కజొన్న, శనగ సాగుచేశాడు. పెట్టుబడి కోసం నాలుగు తులాలు బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదవ పెట్టాడు. తీరా పంట చేతికొచ్చే సరికి మద్దతు ధరలేక పెట్టుబడి కూడా రాలేదు.అప్పులు రూ.5 లక్షలకు చేరుకోవడంతో ఒత్తిళ్లు భరించలేక మార్చిలో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు బిడ్డలను పోషించుకునేందుకు కూలి పనులకు వెళ్తున్నట్లు సురేష్ భార్య సునీత కన్నీటిపర్యంతమైంది. తన భర్తకు పరిహారం ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోందని, కనీసం వితంతు పింఛన్ అయినా ఇప్పించండి బాబూ అంటూ కాళ్లా వేళ్లా పడినా పట్టించుకోవడంలేదంటూ వాపోయింది. పిల్లలతో కలిసి కూలి పనులకు పోతున్నా.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం చెరుకులపాడు మజర కోసనా పల్లె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కురువ రామచంద్రుడు (45)కి సొంతంగా 2.5 ఎకరాలు, మరో 2 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. రెండు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి, పొగాకు సాగు చేసినా పంటలు కొనేవారు లేక తీవ్రంగా నష్టపోయాడు.ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. అప్పులు కాస్తా వడ్డీలతో రూ.12 లక్షలకు చేరుకున్నాయి. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఉల్లి, తెగులు నివారణకు తెచ్చిన పురుగుల మందు తాగి గతేడాది సెప్టెంబర్ 14న ఆత్మహత్యకు ఒడిగట్టడంతో రామచంద్రుడి కుటుంబం దిక్కుతోచక అల్లాడుతోంది. ఇద్దరు కుమార్తెలను పోషించుకునేందుకు కూలి పనులకు పోతున్నానంటూ రామచంద్రుడు భార్య లక్ష్మీ వాపోయింది. తనకు భర్తకు కౌలు కార్డు లేదనే సాకుతో పరిహారం రాదు పొమ్మంటున్నారని.. అప్పులోళ్లు భూమిని లాగేసుకున్నారని.. ఎలా బతకాలో తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమైంది.భూములు అమ్ముకుంటున్న అన్నదాతలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారంతా అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసులుడికి గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో 2,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఉల్లి, శనగ, వేరుశనగ, బంతి, చామంతి సాగు చేస్తారు. రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రాకపోవడంతో గ్రామంలో 90 శాతం మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తీర్చేదారిలేక కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న భూములను తెగనమ్ముకుంటున్నారు. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఇప్పటికే 500 ఎకరాలకు పైగా అమ్ముకున్నామంటూ వాపోతున్నారు.వేరుశనగకు దూరమైన పల్లెలు.. ఈ ఫొటోలో ఉన్నవారంతా అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలం కోటంక గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో దాదాపు 3 వేల ఎకరాల సాగు భూమి ఉండగా 95 శాతం మంది రైతులు వేరుశనగ సాగు చేస్తుంటారు. రెండేళ్లుగా చీడపీడలతో దిగుబడులు తగ్గిపోవడం.. పెట్టుబడులు పెరిగిపోవడంతో పాటు ఏ ఒక్క సీజన్లోనూ మద్దతు ధర దక్కక పోవడంతో ప్రతీ ఒక్కరూ రూ.లక్షల్లో అప్పుల పాలయ్యారు. దీంతో వేరుశనగ సాగుకు గ్రామం పూర్తిగా దూరమైంది. ప్రత్యామ్నాయ పంటలు సైతం కలసి రావడం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా కింద ఒక్క అనంతపురం, కర్నూలు జిల్లాలకే రూ.1,000 కోట్లకు పైగా పరిహారం దక్కింది. దాదాపు ప్రతీ రైతు రూ.లక్ష నుంచి రూ.నాలుగైదు లక్షల వరకు పరిహారం అందుకున్నారు. కానీ రెండేళ్లుగా తమ పరిస్థితి దారుణంగా ఉందంటూ గ్రామానికి చెందిన రైతు టి.నారాయణ ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
కల నిజమాయెగా..!
నోయిడా/లక్నో: మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమానాల రాకపోకలు మొదలయ్యాయి. ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి తమ భూములిచ్చిన జెవార్ ప్రాంతానికి చెందిన 170 మంది రైతులతో కూడిన మొట్టమొదటి విమానం లక్నోకు బయలుదేరింది. ఈ బృందంలో 28 మంది మహిళలతోపాటు 170 మంది గ్రామస్తులున్నారు. వీరందరినీ యూపీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ వెంటబెట్టుకెళ్లారు. లక్నోలోని తన నివాసం వద్ద వీరందరికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రైతులతో సమావేశమయ్యారు. వీరంతా గౌతమబుద్ధ నగర్లోని జెవార్ ప్రాంతానికి చెందిన వారు. వీరిలో 99 శాతం మంది రైతులు గతంలో ఎన్నడూ విమానంలో ప్రయాణం చేయని వారే. ఈ సందర్భంగా రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. విమానంలో ప్రయాణించాలన్న తమ చిరకాల కోరిక సాకారమైందన్నారు. ‘ఈ అరుదైన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేం. ఈ సంతోషాన్ని మాటల్లో వరి్ణంచలేం. మా భూముల్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో ఎందరికో ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించడం చూసి సంతోషంగా ఉంది’అని వారు సీఎం యోగికి చెప్పారు. తమ భూములకు తగిన పరిహారం అందించేలా చేయడంతోపాటు, తమకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం యోగికి వారు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు, లక్నోకు మొదటిసారిగా బయలుదేరిన ఇండిగో విమానంలో రైతుల కోసం ప్రత్యేకంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ‘తమ కష్టార్జితంతో ఈ భూమిని సాగు చేసి, అభివృద్ధి కోసం త్యాగం చేసిన రైతులు.. ఈ రోజు అదే స్థలం నుంచి విమాన ప్రయాణం చేస్తున్నారు. ఇది పరస్పర నమ్మకం, భాగస్వామ్యం, ప్రగతికి ఒక నిదర్శనం’అని ఎమ్మెల్యే సింగ్ ప్రకటించారు. ఒక్కటే రన్ వే లక్నోలో రైతులతో ఏర్పాటైన సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు, సీఎం సలహాదారు అవనీశ్ కుమార్ అవస్థి, మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా, అదనపు ప్రధానకార్యదర్శి(పౌర విమానయాన) దీపక్ కుమార్, యమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సీఈవో రాకేశ్ సింగ్, ఇండిగో, నోయిడా విమానాశ్రయం ప్రతినిధులు పాల్గొన్నారు. 2021 నవంబర్ 25వ తేదీన ప్రధాని మోదీ ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది మార్చి 28వ తేదీన ప్రారంభించారు. ప్రస్తుతానికి ఒకటే రన్వే ద్వారా ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని భవిష్యత్తులో ఐదు రన్వేలతో 22.5 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలయ్యేలా విస్తరించనున్నారు. -
నోయిడా ఎయిర్పోర్ట్: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో నిర్మించిన ప్రతిష్టాత్మక ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం’ సోమవారం (జెవార్ ఎయిర్పోర్ట్) చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఈ విమానాశ్రయం కోసం తమ భూములను త్యాగం చేసిన స్థానిక రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు తమ జీవితంలోనే మొదటిసారి విమానమెక్కి గగన విహారం చేశారు. వాణిజ్య కార్యకలాపాల ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ తొలి విమానంలో లక్నోకు ప్రయాణమైన మహిళల ముఖాల్లో ఆనందం కినిపించింది.భావోద్వేగంలో మహిళా రైతులు‘మేము విమానం ఎక్కుతామని ఎప్పుడూ అస్సలు ఊహించలేదు’ అంటూ మిథిలేష్, బబ్లీ, పింకీ అనే మహిళా రైతులు అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. తమ జీవితాల్లోకి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తొలి విమానం స్థానిక రైతులను తీసుకుని లక్నో వెళ్లగా, మొదటి అధికారిక వాణిజ్య విమానం బెంగళూరుకు సర్వీస్ ప్రారంభించింది. ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణ సాధనంగానే కాకుండా, తమ సొంత భూముల్లో నిర్మితమైన గగన తలాన్ని తామే స్వయంగా చూసేలా చేసి,పలువురు అన్నదాతల కళ్లల్లో ఆనంద బాష్పాలు నింపింది.1.2 కోట్ల మంది ప్రయాణ సామర్థ్యంయమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది. ప్రస్తుతం పూర్తయిన మొదటి దశలో ఒక రన్వే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ను నిర్మించారు. ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యంతో సిద్ధమైన ఈ విమానాశ్రయానికి ఈ ఏడాది మార్చిలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఏరోడ్రోమ్ లైసెన్స్ లభించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం చేరువయ్యింది.లక్ష మందికి ఉపాధి అవకాశాలుమొత్తం నాలుగు దశల్లో, సుమారు 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని విస్తరించనున్నారు. భవిష్యత్తులో 5 రన్వేలతో ఏటా 22.5 కోట్ల మంది ప్రయాణించేలా దీని తుది బ్లూప్రింట్ను సిద్ధం చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా లాజిస్టిక్స్, వేర్హౌసింగ్, హాస్పిటాలిటీ, పారిశ్రామిక రంగాలలో సుమారు లక్ష మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భారీగా పెట్టుబడులు తరలివస్తాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.ఇది కూడా చదవండి: ఒక్క రీల్కు రూ. 80 లక్షలు.. షాకిస్తున్న సమయ్ రైనా! -
భూ వ్యవస్థ అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి: భూమి అంటే సామాన్యుడికి కేవలం ఆస్తి మాత్రమే కాదు.. తరాల కష్టం, బతుకునకు భరోసా. ఆ భరోసాను ప్రభుత్వమే కూల్చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? రీ సర్వేకు తూట్లు.. 22ఏ జాబితాలో 20 లక్షల ఎకరాలు.. పేదల ఫ్రీహోల్డ్ హక్కులు రెండేళ్లుగా ఫ్రీజ్.. కలెక్టరేట్ల వద్ద ప్రతి సోమవారం పెరుగుతున్న బాధితుల క్యూలు.. పాస్బుక్ల దందా.. అధికార పార్టీ అండతో సాగుతున్న భూ బాగోతాలు.. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో భూముల వ్యవస్థ సాధించిన ప్రగతి ఇదే. ఈ అస్తవ్యస్త పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్ర భూ పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చారిత్రక భూ సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే నిలిపివేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు, సామాన్య భూ యజమానులు వారి సొంత భూమిపై హక్కులు కోల్పోయారు. ఫలితంగా బ్యాంకు రుణాలు అందక, విక్రయ రిజిస్ట్రేషన్లు ఆగిపోయి అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు తమ భూములు వివాదాల్లో కూరుకుపోవడంతో పరిష్కారం కోసం వేలాది మంది ప్రతి సోమవారం కలెక్టరేట్ల ముందు పడిగాపులు పడుతున్నారు. విజయవాడ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో వినతులు అందజేయటానికి వచ్చిన రైతులు, ప్రజలు(ఫైల్) 22ఏ జాబితాలో ఏకంగా 20 లక్షల ఎకరాలు ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టింది. 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా పలు జిల్లాల్లో గతంలో 22ఏ జాబితా నుంచి విముక్తి పొందిన లక్షల ఎకరాల భూములను టీడీపీ ప్రజాప్రతినిధులు 22ఏ జాబితాలో పెట్టించారు. అసలు వివాదమే లేని ప్రైవేట్ పట్టా భూములు, తరతరాలుగా అనుభవంలో ఉన్న పూర్వీకుల ఆస్తులను సైతం ఈ జాబితాలోకి నెట్టేశారు. దీంతో ఆ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. తనఖా పెట్టుకునే అవకాశం లేదు, బ్యాంకు రుణం రాదు. ఒక సర్వే నంబర్లో కొంత భాగంపై వివాదం ఉంటే మొత్తం సర్వే నంబర్నే నిషేధిత జాబితాలో పెట్టిన ఘటనలు కోకొల్లలు. ఫ్రీహోల్డ్ భూములపై పగబట్టిన చంద్రబాబు 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న పేదలకు 2023లో జగన్ ప్రభుత్వం యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) కల్పించింది. 27 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పరిధిలోకి రాగా, ఎన్నికలు పూర్తయ్యే నాటికి 13.59 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందాయి. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల పేదలు పట్టాదారులయ్యారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే అక్రమాల పేరుతో ఫ్రీ హోల్డ్ భూములను మళ్లీ 22ఏ జాబితాలో పెట్టేసింది. రెండేళ్లయినా ఆరోపణలు నిరూపించలేకపోయింది. కానీ ఆ భూములపై రైతులకు హక్కులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి.. పైకి మాత్రం 22ఏ జాబితా నుంచి భూములను తొలగిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు డబ్బా కొట్టుకుంటుండటం విస్తుగొలుపుతోంది. జగన్ సంస్కరణలతో రూ.500 కోట్లు ప్రోత్సాహకాలు వైఎస్ జగన్ హయాంలో అమలైన భూ సంస్కరణలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రారంభమై విజయవంతంగా జరుగుతున్న రీసర్వేపై విష ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక కొద్ది నెలలు దాన్ని నిలిపివేసి.. తప్పు తెలుసుకుని మళ్లీ తూతూ మంత్రంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు తానే రీ సర్వేను మొదలు పెట్టినట్లు ప్రచారం చేసుకుంటోంది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సమగ్ర భూ రీసర్వేను చేపట్టింది. శాటిలైట్, డ్రోన్, జీపీఎస్ సాంకేతికతతో గ్రామ గ్రామాన సర్వే జరిగింది. రికార్డుల ట్యాంపరింగ్, నకిలీ డాక్యుమెంట్లు, భూ కబ్జాలకు తావులేని వ్యవస్థ దిశగా అడుగులు పడ్డాయి. భూ రికార్డుల డిజిటలీకరణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక ధృవీకరించింది. ఈ పనితీరుకు ప్లాటినం గ్రేడింగ్, కేంద్ర ఆర్థిక శాఖ ప్రోత్సాహకాలు రూ.500 కోట్లు కూడా దక్కాయి. జగన్ అమలు చేసిన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలు అందుకుంది. పీజీఆర్ఎస్కు బాధితుల క్యూ ప్రతి సోమవారం రాష్ట్రంలోని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల వద్ద జరిగే పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం భూ సమస్యలే ఉంటున్నాయి. పట్టా ఉన్నా రిజిస్ట్రేషన్ కాని భూములు, 22ఏ జాబితాలో ఇరుక్కుపోయిన ఆస్తులు, పాస్బుక్లు రాని రైతులు, ఇచ్చిన పాస్బుక్కుల్లో తప్పులు, రికార్డుల్లో పేర్లు మాయమైన బాధితులు దరఖాస్తులు పట్టుకుని క్యూ కడుతున్నారు. అర్జీలు తీసుకుని రశీదులు ఇవ్వడమే తప్ప ఆ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. బాధితులు పది సోమవారాలు తిరిగినా సమస్య మాత్రం అలాగే ఉంటోంది. దీనికితోడు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆర్భాటంగా వినతులు తీసుకుని పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు స్వయంగా తీసుకున్న అర్జీలకే దిక్కులేని పరిస్థితి నెలకొంది. ఆయన కొడుకు, ఇతర మంత్రులు పీజీఆర్ఎస్ను ప్రచారానికి వాడుకోవడమే తప్ప.. సమస్యలను పరిష్కరించడంపై శ్రద్ధ చూపడం లేదు. సమస్యలు పరిష్కారం కాకుండానే పరిష్కారం అయిపోయినట్లు బాధితులకు మెసేజ్లు పంపిస్తున్నారు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో కలెక్టరేట్ల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండటం తెలిసిందే.మా భూమి లోంచి మమ్మల్ని వెళ్లగొడుతున్నారు పది ఎకరాల భూమిని మా తాతలు, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు కొందరు రాజకీయ పలుకుబడితో మా భూములు ఖాళీ చేయాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కలెక్టరేట్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకునే వాళ్లే లేరు. ఆదివాసీలమైన మేం ఎక్కడికి పోవాలి? – చీడిపల్లి దేముడమ్మ, జెడ్ జోగుంపేట, రావికమతం మండలం, అనకాపల్లి జిల్లా దొంగ రికార్డులతో బెదిరిస్తున్నారు సర్వే నంబర్ 49లో ఉన్న నా విలువైన భూమిని కాజేయడానికి ఊళ్లో కేటుగాళ్లు నా పేరుతో ఉన్న పత్రాలను మార్ఫింగ్ చేసి దొంగ రికార్డులు సృష్టించారు. వాటి ద్వారా నా భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కలెక్టరేట్కు వచ్చి మొరపెట్టుకుంటే రెవెన్యూ వాళ్లు నా ఫైలును పక్కనపెట్టి కాలయాపన చేస్తున్నారు. కళ్ల ముందే నా భూమి చేజారిపోతోంది. – టి.గిరిజమ్మ, ఒడ్డుపల్లి, శ్రీరంగరాజపురం మండలం, చిత్తూరు జిల్లా ఆన్లైన్లో నా పేరు మారిపోయింది నా భర్త ఆర్మీలో దేశ సరిహద్దుల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆర్మీ కోటా కింద 2022లో బురుజుపల్లిలో ఆయనకు ఐదు ఎకరాల భూమి కేటాయించారు. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరుపైకి మార్పించుకున్నా. ఎవరో ఏదో చేయడంతో ఇప్పుడు మళ్లీ నా భర్త పేరే ఆన్లైన్లో కనిపిస్తోంది. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ వయసులో తిరగలేక చచ్చిపోతున్నా. – కె.సరస్వతి, జవాన్ చిన్న రామయ్య భార్య, బురుజుపల్లి, గుర్రంకొండ మండలం, అన్నమయ్య జిల్లాకూటమి నేతల బెదిరింపులు..గుండెపోటుతో దళిత రైతు మృతి బుచ్చెయ్యపేట: కూటమి నేతలు భూమిని లాక్కుంటారన్న భయంతో తీవ్రవేదనకు గురైన అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలంలోని రాజాం గ్రామానికి చెందిన దళిత రైతు నందికొళ్ల నూకరాజు(36) గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే... నూకరాజు తండ్రి సాంబయ్య 40 ఏళ్లుగా తైపురంలో ఐదు ఎకరాల డి–పట్టా భూమిని సాగు చేసేవాడు. ఆయన మరణం తరువాత నూకరాజు సాగు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని 22ఎలో పెట్టి హోల్డ్లో ఉంచింది. ఇటీవల తైపురానికి చెందిన కూటమి నేతలు నూకరాజు భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్, టీడీపీ ఎమ్మెల్యే కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల రెవెన్యూ అధికారులు పలుసార్లు ఆ భూమిని సర్వే చేశారు. నూకరాజు అడ్డుకుని తన తండ్రి పేరుపై ఉన్న డి–పట్టా రికార్డులను చూపించాడు. రెండు రోజుల కిందట ఎమ్మెల్యే రాజు చోడవరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కూటమి నేతలు మళ్లీ నూకరాజు భూమిపై ఫిర్యాదు చేశారు. దీంతో నూకరాజు తన భూమిని కూటమి నేతలు లాక్కుంటారని ఆందోళన చెందాడు. తమ గతేంటని భార్య భవానీతో శుక్రవారం రాత్రి చెబుతూ బాధపడ్డాడు. అనంతరం గుండెపోటుకు గురై మృతిచెందాడు. కూటమి నేతల ఫిర్యాదుల వల్లే నూకరాజు మృతిచెందాడని ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరిసా శ్రావణ్ తదితరులు నూకరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నూకరాజు కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నూకరాజు మృతదేహానికి శనివారం రాజాంలో అంత్యక్రియలు నిర్వహించారు. మాటలు కబ్జాలపై.. చేతలు కబ్జాలతోకబ్జాలు అరికట్టడానికి గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు, టీడీపీ శ్రేణులే ఆచరణలో కబ్జాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను 22ఎ జాబితా నుంచి తొలగించి, అధికార పార్టీకి చెందిన ప్రైవేట్ వ్యక్తులకు బదలాయిస్తూ.. ఆ గుట్టు బయట పడడంతో చివరి నిమిషంలో ఆగిపోయారు. విశాఖ, తిరుపతి, అన్నమయ్య సహా పలు జిల్లాల్లో టీడీపీ నేతలు ఖాళీ భూములను కబ్జా చేసినట్లు రోజుకో ఘటన వెలుగు చూస్తోంది.కళ్లెదుటే భూ ఆక్రమణవైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపులకు చెందిన ఈమె పేరు వెంకట లక్ష్మమ్మ. సర్వే నంబర్లు 1,470, 1,471లో ఈమెకు 3.32 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో ఎకరంన్నర భూమిని ఊళ్లో పెత్తందార్లు ఆక్రమించారు. తిరిగి ఈ భూమిని దక్కించుకోవడానికి ఆమె ఎన్నో ఏళ్లు పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు కోర్టు ద్వారా సాధించుకున్నారు. అయితే కోర్టు ఆదేశాలున్నప్పటికీ, రెవెన్యూ వాళ్లు ఈ భూమిని 1బీ రికార్డుల్లో చేర్చి, ఆన్లైన్ చేయడం లేదు. ఫలితంగా తన భూమి దక్కడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు.78 ఏళ్ల నాటి భూమిని నకిలీ పత్రాలతో అమ్మేశారు ఇతని పేరు చంద్రాయుడు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు. ఇతని తాత బాలయ్య.. సర్వే నంబర్ 676/2లో 0.68 సెంట్ల స్థలాన్ని 1948లోనే కొన్నారు. 78 ఏళ్లుగా ఈ భూమి వీరి స్వాధీనంలోనే ఉంది. అందులో మూడు సెంట్లు జాతీయ రహదారి విస్తరణలోకి వెళ్తే ప్రభుత్వం వీరికి రూ.23,287 పరిహారం కూడా ఇచ్చింది. అంత పక్కా రికార్డు ఉన్న ఈ భూమిని కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించి వేరే వాళ్లకు అమ్మేశారు. సబ్ రిజిస్ట్రార్ దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. రికార్డులన్నీ పట్టుకుని పీజీఆర్ఎస్ మెట్లు ఎక్కినా తనకు సమాధానం చెప్పేవారే లేరని చంద్రాయుడు వాపోతున్నారు. -
మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి.. ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, ఢిల్లీ: గుంటూరు మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఎన్హెచ్ఆర్సీ, జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించాయి. ఏపీ డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, పొన్నూరు రూరల్ ఎస్సై శ్రీహరి, చేబ్రోలు ఎస్సై వీరనారాయణ, తెనాలి సీఐ రాములు నాయక్, పొన్నూరు అర్బన్ వీరనాయక్పై చర్యలు తీసుకోవాలని కమిషన్కు నేతలు ఫిర్యాదు చేశారు.వైఎస్సార్సీపీ పొన్నూరు ఇంఛార్జ్ అంబటి మురళీకృష్ణ, ఎంపీ తనూజ రాణి నేతృత్వంలో మామిళ్లపల్లి మహిళ రైతులు.. మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళల పరువుకు భంగం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారని అంశాలు తమ దృష్టికి వచ్చాయని... మహిళల గౌరవం, పరువు భంగం కలిగించడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామని మహిళా కమిషన్ పేర్కొంది. -
సాగు లక్ష్యం సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: వానాకాలం (ఖరీఫ్) సీజన్ పంటలకు వ్యవసాయ శాఖ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 134.66 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తూ...పంటల వారీగా విస్తీర్ణ లక్ష్యాలను ఖరారు చేసింది. ఇందులో వరి 69 లక్షల ఎకరాలు, పత్తి 48 లక్షల ఎకరాల్లో సాగవుతాయని భావిస్తోంది. మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, నూనెగింజల పంటలన్నీ కలిపి కేవలం 17.66 లక్షల ఎకరాల్లో సాగు కావొచ్చని అంచనా వేసింది. దీనికి అనుగుణంగా అవసరమైన విత్తనాలతోపాటు యూరియా, ఇతర ఎరువులను కూడా సిద్ధం చేస్తోంది. అయితే వ్యవసాయశాఖ లెక్కలకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నా యని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్య మేరుకు సాగు సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరి, పత్తి సాగుకే రైతుల మొగ్గు రైతులు ఇప్పటికీ వరి, పత్తి పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి, వరిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆ పంటల వైపే మొగ్గు చూపుతున్నాయి. మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 90 శాతం వరి, పత్తి పంటలకే రైతులు మొగ్గు చూపుతారని వ్యవసాయశాఖ చెబుతోంది. అయితే వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే మొదటి ప్రభావం కూడా వరి, పత్తిపైనే పడుతుంది. గత ఏడాది 132 లక్షల ఎకరాల్లో.. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో మొత్తం 1.32 కోట్ల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అందులో వరి 67.04 లక్షల ఎకరాలు, పత్తి 45.85 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.41 లక్షల ఎకరాలు, కందులు 4.92 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాలు ఉన్నాయి. మొత్తంగా సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100 శాతానికి పైగా సాగు నమోదైంది. గత ఏడాది మంచి వర్షాలు, చెరువులు–ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండటం వల్ల రైతులు ధైర్యంగా సాగు చేపట్టగలిగారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వేసవి ప్రారంభం నుంచే నీటి లభ్యతపై ఆందోళన నెలకొంది. ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి నిల్వలు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం వంటి ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం పరిధిలోనూ నీటి లభ్యతపై రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. వానలు ఆలస్యమైతే దుక్కులు దున్నడం నుంచి నాట్ల వరకు మొత్తం వ్యవసాయ కార్యాచరణ ప్రభావితమయ్యే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగుపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించి, సాధారణ వర్షాలు కురిస్తేనే వ్యవసాయశాఖ నిర్దేశించిన 134 లక్షల ఎకరాల సాగు లక్ష్యం చేరుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. అందుకే ఈసారి ఖరీఫ్ భవితవ్యం పూర్తిగా వరుణుడి కరుణపైనే ఆధారపడి ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రైతాంగం ఇప్పుడు వానల రాక కోసం ఎదురు చూస్తోంది. -
కష్టాల్లో కౌలు రైతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న కౌలు రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సాగు చేస్తున్నది కౌలు రైతులే అయినా, ప్రభుత్వ పథకాలు, మద్దతు వ్యవస్థలు కేవలం పట్టాదారులకే పరిమితం కావడం వల్ల వీరు దారుణమైన ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. తెలంగాణలో వ్యవ సాయాన్ని ప్రధానంగా కౌలు రైతులే నడిపిస్తున్నా, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పంట కొనుగోళ్లు, ప్రకృతి విపత్తు పరిహారం వంటి కీలక మద్దతు వ్యవస్థలకు వారు దూరమవుతున్నారు.కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ కౌలు రైతుల సర్వే–2026’లో 22 జిల్లాల్లోని 57 గ్రామాలకు చెందిన 1,816 మంది కౌలు రైతులను ఇంటర్వ్యూ చేశారు. సర్వే ప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి నేతృత్వంలో సాగింది. మంగళవారం అధ్యయన నివేదికను జస్టిస్ సుదర్శన్రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్ తదితరుల సమక్షంలో హైదరాబాద్లో విడుదల చేశారు. పెరిగిన కౌలు ధరలు.. తగ్గిన నికర ఆదాయం తెలంగాణలో కౌలు ధరలు అనూహ్యంగా పెరిగాయి. గరిష్టంగా ఎకరాకు రూ.53,000 వరకు వసూలు చేస్తున్నారని సర్వేలో తేలింది. 2022లో సగటున 5 ఎకరాలుగా ఉన్న కౌలు భూమి, ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగింది. చిన్న కౌలు రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఎక్కువ భూమిని కౌలుకు తీసుకోవాల్సి వస్తుండగా, ఉన్న తక్కువ నికర ఆదాయం వారిని అప్పుల ఊబిలోకి నెడుతోంది. వ్యవసాయంలో లాభాలు తగ్గుతున్నా కౌలు రేట్లు మాత్రం భారీగా పెరిగాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే ఎక్కువ భూమి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్వే పేర్కొంది. ఓటీపీలతో యూరియా కొనుగోలు, పంట అమ్మకాల అవస్థలు యాసంగి సీజన్లో ప్రవేశపెట్టిన యాప్ ఆధారిత యూరియా పంపిణీ విధానం కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించినట్టు అధ్యయనం తేల్చింది. ⇒ భూ యజమాని ఓటీపీ తప్పనిసరి కావడంతో సర్వేలో పాల్గొన్న 1,816 మందిలో కేవలం 412 మంది (22.8 శాతం) మాత్రమే సబ్సిడీ యూరియాను పొందగలిగారు. వారిలో కూడా కేవలం 40 మంది మాత్రమే తమ పేర్లపై యూరియా తీసుకున్నారు. మిగతావారు భూ యజమానుల వివరాలపై ఆధారపడాల్సి వచి్చంది. సబ్సిడీ అందని రైతులు బహిరంగ మార్కెట్లో ఒక్కో సంచికి రూ.500 వరకు చెల్లించి కొనుగోలు చేసినట్టు సర్వే తెలిపింది. ⇒ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయానికి పట్టాదారు పాస్బుక్, ఆధార్ లింకేజీ, ఓటీపీ వంటి నిబంధనలు ఉండటంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి రైతుల్లో కేవలం 6.7 శాతం మంది మాత్రమే తమ పేర్లతో సీసీఐకి విక్రయించగలిగారు. ⇒ వరి విషయంలో ఖరీఫ్లో 20 శాతం, యాసంగిలో 17.2 శాతం మంది మాత్రమే తమ పేరుతో విక్రయించినట్టు సర్వే వెల్లడించింది. మిగతా వారు ఇతరుల పేర్లతో విక్రయించి కమీషన్లు చెల్లించాల్సి వస్తోందని పేర్కొంది. ప్రకృతి విపత్తు పరిహారం కూడా అందని ద్రాక్షే గత మూడు సంవత్సరాల్లో వరదలు, అకాల వర్షాలు, వడగళ్ల వానలతో 85.2 శాతం మంది కౌలు రైతులు పంట నష్టాన్ని చవిచూశారు. అయితే బాధితుల్లో కేవలం 11 మందికి మాత్రమే, అంటే 0.7 శాతం మందికి మాత్రమే పరిహారం నేరుగా వారి ఖాతాల్లో జమైంది. కొన్ని సందర్భాల్లో భూ యజమానులు పరిహారం తీసుకొని కౌలు రైతులకు ఇవ్వలేదని సర్వే గుర్తించింది. పంట రుణాలు భూయజమానులకు మాత్రమే అందుబాటులో ఉండటంతో కౌలు రైతులు పూర్తిగా ప్రైవేట్ అప్పులపైనే ఆధారపడుతున్నారు. 24 నుంచి 36 శాతం వరకు వడ్డీతో అప్పులు తీసుకుంటున్నట్టు రైతులు తెలిపారు. ఒక్కో రైతుపై రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రైవేట్ అప్పుల భారం ఉన్నట్టు సర్వే వెల్లడించింది. రుణమాఫీ పథకాల ప్రయోజనాలు కూడా వీరికి అందడం లేదని పేర్కొంది. ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు అమ్మకాలు ప్రభుత్వ కొనుగోళ్లలో అవకాశాలు లేకపోవడంతో కౌలు రైతులు బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువకు పంటలు అమ్ముకోవాల్సి వస్తోందని సర్వే తెలిపింది. దీంతో 5 ఎకరాల కౌలు రైతుకు పత్తిలో రూ.64,400, వరిలో రూ.40,350, మొక్కజొన్నలో రూ.87,800, సోయాబీన్లో రూ.53,120 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా వేసింది. ఎరువుల సబ్సిడీ, పంట కొనుగోలు, విపత్తు పరిహారం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా కౌలు రైతుల ఖాతాల్లోకి చేరేలా వ్యవస్థను రూపొందించాలని కోరింది. ‘కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలి’ హిమాయత్నగర్ : కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నివేదిక విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడారు. కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసి అన్ని ప్రభుత్వ పథకాలను నేరుగా అందించాలన్నారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ 2011 లైసెన్స్డ్ కల్టివేటర్స్ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కల్పించాలని చెప్పారు. సీఎం, వ్యవసాయ, రెవెన్యూ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిని కోరారు. దీనికి స్పందించిన కోదండరెడ్డి కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
ఉండవల్లి సీఆర్డీఏ గ్రామసభలో గందరగోళం
గుంటూరు: రాజధానికి భూములు ఇచ్చే లేదంటూ ఉండవల్లి రైతులు తెగేసి చెప్పారు. తమ భూములు లాక్కోవద్దని, తాము భూములు ఇవ్వమంటూ స్పష్టం చేశారు. భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించాలని రైతులు కోరారు. ఈ మేరకు ఉండవల్లిలో నిర్వహించిన సీఆర్డీఏ గ్రామసభలో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని రాజధాని పరిసర ప్రాంతాల్లో వినిపిస్తున్నమాట ఇదే. అంతకుముందు కూడా ఇదే జరిగింది. గత నెలలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించగా అక్కడ కూడా అధికారులకు చుక్కెదురైంది. ఈ గ్రామ సభకు హాజరైన రైతులు.. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ను నిలదీశారు. మాకే ఎందుకిలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్నారు. తమకు డెవలప్ చేయని ప్లాట్లు ఇస్తున్నారని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే అవి పనికిరావని చెబుతున్నారని, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.


