తన సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం అక్కడికి చేరుకున్నారు.
నేరుగా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ఆయన్ని చూసేందుకు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
పలువురు పార్టీ నేతలతో భేటీ అయిన అనంతరం.. ప్రజా దర్బార్లో భాగంగా ప్రజలు, కార్యకర్తల సమస్యలను అడిగి తెలసుకున్నారు.


