
సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండ
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) కుటుంబానికి వైఎస్సార్ సీపీ నేతలు గురువారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని కిరణ్కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి కొలకలూరి కోటేశ్వరరావు తదితరులు సింగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులిర్పించారు. పిల్లల చదువులు, తదితర విషయాలను వాకబు చేశారు. కుటుంబానికి వైఎస్సార్ సీపీ కుటుంబం ప్రతి విషయంలో తోడుంటుందని తెలిపారు. పార్టీ తరఫున ఇప్పటికే రూ. 10 లక్షలను ప్రకటించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.