
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి
చిలకలూరిపేట సమీపంలో విషాద ఘటన
చిలకలూరిపేటటౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...వైఎస్సార్ కాలనీకి చెందిన గాలేటి రాంబాబు, కావేరి దంపతులు, వారి మేనకోడళ్లైన పాముసాని బాలసాహితి, వెంకట శృతితో కలిసి బైక్పై కనపర్రు చర్చికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. రూరల్ మండలంలోని లింగంగుంట్ల వంతెన దాటిన తరువాత అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ట్యాంక్పై కూర్చున్న వెంకట శృతి(9) బస్సు చక్రాల కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. రాంబాబు, ఆయన భార్య కావేరికి స్వల్ప గాయాలు కాగా, మరో బాలిక బాల సాహితికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే పాపను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలు కావేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.