
చిత్తూరు నగరం గంగాసాగరంలోని ఓ గుజ్జు పరిశ్రమ సోమవారం టోకెన్లు ఇస్తున్నట్లు వారం రోజుల ముందే బోర్డు పెట్టింది. టోకెన్లు ఇస్తారని మామిడి రైతులు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అక్కడే కునుకు తీస్తూ.. ఆధార్, పట్టా పాసు పుస్తకం జిరాక్స్ నకలను క్యూలో పెట్టారు.

ఉదయం 7గంటలకు రైతులు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నప్పటికీ ఫ్యాక్టరీ నిర్వాహకులు స్పందించలేదు. దీంతో రైతులంతా కలిసికట్టుగా చిత్తూరు–వేలూరు జాతీయ రహదారిపై బైఠాయించారు.

ట్రాఫిక్ స్తంభించిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసు లు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడారు.

టోకెన్లు ఇస్తామని చెప్పడంతో ఆ తర్వాత ఫ్యాక్టరీ గేటును రైతులు చుట్టుముట్టేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది.

అక్కడ రైతుల అరుపులు, కేకలతోఫ్యాక్టరీ ఆవరణ దద్ధరిల్లింది.












