
పాలిసెట్ కౌన్సెలింగ్కు రెడీ!
● 21 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ● 25 నుంచి కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాలుగు హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు
గుంటూరుఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికిగానూ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 21న ప్రారంభం కానుంది. పాలిసెట్–2025లో అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 28 వరకు జరగనున్న కౌన్సెలింగ్లో ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది. ఇందు కోసం సాంకేతిక విద్యాశాఖ ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాలుగు హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.
ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి
సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాగోరు విద్యార్థులు ఈనెల 20 నుంచి 27 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో రుసుం చెల్లించాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాగోరు విద్యార్థులు వెంట ఫీజు రసీదు, హాల్ టికెట్, ర్యాంకు కార్డు, టెన్త్ పాస్ సర్టిఫికెట్, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఓసీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంది. స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థులు విజయవా డ బెంజి సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్లో హాజరు కావాల్సి ఉంది.
● 21న ఒకటో ర్యాంకు నుంచి 15వేలు, 22న 15,001 నుంచి 32వేలు, 23న 32,001 నుంచి 50వేలు, 24న 50,001 నుంచి68వేలు, 25న 68,001 నుంచి 86వేలు, 26న 86,001 నుంచి 1,04,000, 27న 1,04,001 నుంచి 1,20,000, 28న 1,20,001 నుంచి చివరి ర్యాంకు వరకు హాజరుకావాలి.
● సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 25నుంచి 30వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
హెల్ప్లైన్ కేంద్రాలు
గుంటూరు నగర శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్, నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సమీపంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ పాత క్యాంపస్, రేపల్లె లోని ప్రభుత్వ పాలిటెక్నిక్, బాపట్లలోని బాపట్ల పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ కేంద్రాల్లో ఆయా తేదీల్లో ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి.