● జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ● పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 191 అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఏస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లాకలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద 191 అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అన్నారు. ప్రతి అర్జీకి అర్ధవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, అధికారులు పాల్గొన్నారు.
భూమి హద్దులు చూపించకుండా వేధిస్తున్నారు..
ప్రభుత్వం ఇచ్చిన డీకే పట్టాలో సాగుచేసుకుంటున్న రైతులను ఫారెస్టు అధికారులు, రెవెన్యూ అధికారులు కమ్మకై ్క డబ్బుల కోసం వేధిస్తున్నారు. పొలంలోకి రైతులను రానీయట్లేదు. డీటీగా పనిచేస్తున్న జానీబాషకు, అటవీశాఖ అధికారులకు కొంత డబ్బు కూడా ఇచ్చాం. మరికొంత డబ్బుల కోసం భూమి హద్దులు మాకు చూపించకుండా తొమ్మిది నెలల నుంచి వేధిస్తున్నారు. ఇప్పటికే నాలుగు నెలల క్రితం కలెక్టర్కు విన్నవించాం. ఫలితంలేదు. మళ్లీ ఇప్పుడు అర్జీ పెట్టుకుంటే ఆర్డీఓను కలవాలని సూచించారు. –టి.హనుమంతరావు, కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు, తాళ్లచెరువు, అచ్చంపేట మండలం
విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి
మండలంలోని ఇనిమెళ్ల గ్రామంలో విద్యుత్ సరఫరా కోసం తిరుగుతున్న రైతులను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఏఈ, లైన్మెన్ల్పై చర్యలు తీసుకోవాలి.
–చింతిరాల మీరయ్యమాదిగ, ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు
అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోండి
వినుకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమి ఆక్రమణలో అవినీతికి పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించండి. కళాశాల భూమిపై పూర్తిగా విచారించి నిగ్గుతేల్చి నివేదిక బయటపెట్టండి. రెవెన్యూ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్, సిబ్బంది అక్రమాలతో కళాశాల భూమికి రెక్కలు వచ్చాయి. వారిపై చర్యలు తీసుకోండి.
– ప్రభుత్వ కళాశాల పరిరక్షణ కమిటీ, వినుకొండ
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి