వైఎస్సార్‌ మెడికల్‌ కాలేజ్‌ పనులు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ మెడికల్‌ కాలేజ్‌ పనులు ప్రారంభించాలి

Jun 17 2025 5:08 AM | Updated on Jun 17 2025 5:08 AM

వైఎస్సార్‌ మెడికల్‌ కాలేజ్‌ పనులు ప్రారంభించాలి

వైఎస్సార్‌ మెడికల్‌ కాలేజ్‌ పనులు ప్రారంభించాలి

పిడుగురాళ్ల: డాక్టర్‌ వైఎస్సార్‌ మెడికల్‌ కాలేజ్‌, వైద్యశాలను తక్షణమే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఆగిపోయిన వైద్య కళాశాల, వైద్యశాలను సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నాలుగేళ్ల కిందట రూ.540 కోట్లతో నిర్మాణం చేపట్టి 90 శాతం ఆస్పత్రి, 70 శాతం కాలేజీ నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించి, ఆరు నెలల్లో ఈ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. గురజాల పల్నాడు ప్రజలందరికీ సెల్ఫీ వీడియో ద్వారా ఫొటోలు, వీడియోలు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు సూచించారు. ఈ సంవత్సర కాలంలో ఆస్పత్రి అందుబాటులోకి తీసుకోచ్చి ఉంటే ప్రజలందరికీ ఇక్కడే వైద్య సాయం ఉండేదన్నారు. ఈ మెడికల్‌, నర్సింగ్‌ కాలేజ్‌ అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఈ ప్రాంత విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లి లక్షలకు లక్షలకు హాస్టల్‌ ఫీజులు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు. పనులు పూర్తి చేసే వరకు పోరాడతామని చెప్పారు. దాచేపల్లి పంచాయతీ ఆఫీస్‌ బిల్డింగ్‌కి యారపతినేని శ్రీనివాసరావు తండ్రి లక్ష్మయ్య పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన

దాచేపల్లి: రాష్ట్రంలో సంక్షేమం.. అభివృద్ధి లేకుండా చంద్రబాబు రెడ్‌బుక్‌ పరిపాలన చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన ఉపసర్పంచ్‌ నాగమల్లేశ్వరరావు కూటమి నేతల ఒత్తిడి తట్టుకొలేకనే ఆత్మహత్య చేసుకున్నాడని, కానీ ఇది ముమ్మటికి ప్రభుత్వ హత్య అని మహేష్‌రెడ్డి ఆరోపించారు. అధికార పోలీసులు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 18న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని చెప్పారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్‌ కొప్పుల సాంబయ్య, మాజీ చైర్మన్‌ మునగా పున్నారావు, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు షేక్‌ సుభానీ, కోట కృష్ణ, ఎంపీపీ కందుల జాను, వైస్‌ ఎంపీపీ తండా అబ్దుల్‌సత్తార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ జాకీర్‌హుస్సేన్‌, మాజీ సర్పంచి మందపాటి రమేష్‌రెడ్డి, వైస్‌ చైర్మన్లు కొమెరబత్తిన విజయ్‌కుమార్‌, షేక్‌ ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

కూటమి హయాంలో నత్తనడకన పనులు

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement